తిరుపతి లీగల్: తిరుపతి, ఆర్సీరోడ్డుకు చెందిన వి.సురేంద్రన్ తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కోటి ఒక లక్ష 89 వేల రూపా యలకు ఐపీ దాఖలు చేసినట్టు ఆయన తరఫు న్యాయవాది ఇరుగు సురేంద్ర తెలిపారు. పిటిషన్లోని వివరాల మేరకు.... పిటిషనర్ నరేంద్రన్ తిరుపతి, అవిలాల, చెన్నప్ప కాలనీలో శ్రీ వినాయక ప్రొవిజనన్స్ స్టోర్స్ పేరుతో రెండేళ్లుగా వ్యా పారం నిర్వహిస్తున్నాడు. ఇతరుల దగ్గర సొమ్ము రుణంగా తీసుకొని అతను వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యాపారంలో పోటీ పెరగడంతో వ్యా పారాభివృద్ధి కోసం మరికొంత మంది వద్ద అత ను నగదు వడ్డీలకు అప్పుగా తీసుకున్నాడు. అ యినా నష్టాలు రావడంతో మరికొంత మంది వద్ద రూ.పది వడ్డీతో సొమ్మును అప్పుగా తీసుకొని ఖాళీ ప్రోనోట్లు, ఖాళీ చెక్కుల్లో సంతకాలు చేసి వారికి ఇచ్చాడు. వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడం రోజు రోజుకు రుణదాతల వేధింపులు ఎక్కువ కావడంతో సొమ్ము చెల్లించలేని స్థితిలో ఐపీ దాఖలు చేస్తున్నట్టు ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు. 18 మంది రుణదాతలను ఆయన పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్నాడు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిలో గురువారం తెల్లవారు జామున చిల్లకూరు గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని అదే మార్గంలో వెళ్లే మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో క్లీనర్ కార్తిక్(17) మృతి చెందగా డ్రైవర్కి గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఐ నాగరాజు కథ నం మేరకు.. శ్రీకాళహస్తి నుంచి విజయవాడకు వెళుతున్న లారీ మార్గం మధ్యలో చిల్లకూరు ప్లైఓవర్ వద్ద ఆదే మార్గంలో ఆగిఉన్న మరో లారీని ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణా జిల్లా, మైలవరం ప్రాంతానికి చెందిన క్లీనర్ కార్తిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన డ్రైవర్ను నాయుడు పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment