అమ్మవారు కొలువు దీరారిలా.. | - | Sakshi
Sakshi News home page

అమ్మవారు కొలువు దీరారిలా..

Published Fri, Sep 27 2024 1:52 AM | Last Updated on Fri, Sep 27 2024 1:52 AM

-

పోలేరమ్మతల్లి జాతరలో భాగంగా బుధవారం అర్ధరాత్రి మెట్టినిల్లు అయిన జీనుగులవారి వీధి నుంచి వేకువ జామున 4 గంటలకు అమ్మవారి ని ఊరేగింపుగా తీసుకుని వచ్చి పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో ఏర్పాటు చేసిన చలువ పందిరిలో నిలుపు చేశారు. తెల్లవా రు జామున నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఉదయం మందకొడిగా సాగిన భక్తు లు 9 గంటల నుంచి అధిక సంఖ్యలో బారులు తీరారు. దీంతో ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా భక్తు లు క్యూలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనంతోపాటు రూ.100, రూ.300 టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు పాతబస్టాండ్‌ మీదుగా క్యూలో అనుమతించారు. అయితే ఈ ప్రాంతాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఎండ తీవ్రతను తట్టుకోలేక కొందరు క్యూ లో స్పృహ తప్పి పడిపోయారు. వీరిని స్థానిక వలంటీర్‌ సేవకులు క్యూలో నుంచి బయటకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. ఓ దశలో జరిగిన తొక్కిసలాటతో భక్తులకు అసౌకర్యం నెలకొంది.

అమ్మవారి సేవలో ప్రముఖులు

అమ్మవారి జాతరలో పలువురు ప్రముఖులు, అధికారులు పోలేరమ్మతల్లిని దర్శించున్నారు. వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురే ష్‌, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కోవూ రు, సర్వేపల్లి ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి, సో మిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ రూప్‌కుమార్‌యాదవ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నక్కా భానుప్రియ, గంగాప్రసాద్‌, వెంప టి మాధవనాయుడు, శ్రీనివాసులు, వైఎస్సార్‌ సీ పీ పట్టణ కన్వీనర్‌ జి ఢిల్లీబాబు, నక్కా వెంకటేశ్వ ర్లు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement