వరకట్నం వేధింపులకు వివాహిత బలి | - | Sakshi
Sakshi News home page

వరకట్నం వేధింపులకు వివాహిత బలి

Published Thu, Apr 18 2024 10:35 AM | Last Updated on Thu, Apr 18 2024 10:35 AM

మృతి చెందిన షహీన్‌బేగం  - Sakshi

పరిగి: అదనపు వరకట్నం కోసం భర్త, అత్తమామ పెట్టిన వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మండలంలోని నస్కల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జైనబేగం, గౌస్‌ దంపతుల పెద్ద కుమార్తె షహీన్‌బేగం(24)ను పూడూర్‌ మండలం గొంగుపల్లి గ్రామానికి చెందిన రఫీకి ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేశారు. ఆ సమయంలో పెద్దల సమక్షంలో రూ.16 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేయించారు. కానీ పెళ్లయిన మరుసటి నెల నుంచి భర్త, అత్తమామ, ఆడపడుచు నిత్యం అదనపు కట్నం కోసం మానసికంగా, శరీరకంగా వేధింపులకు గురిచేశారు. వీటిని భరించలేక షహీన్‌బేగం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి మాట్లాడాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఈనెల 12న షహీన్‌బేగంను భర్త తల్లిగారి ఇంట్లో వదిలి వెళ్లాడు. దీంతో మానసికంగా బాధపడుతూ ఆమె మంగళవారం రాత్రి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి జైనబేగం బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

నస్కల్‌లో ఉరేసుకొని

ఆత్మహత్య చేసుకున్న వైనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement