అతిథిగృహ నిర్మాణానికి భూమి పూజ నేడు | - | Sakshi
Sakshi News home page

అతిథిగృహ నిర్మాణానికి భూమి పూజ నేడు

Published Mon, Oct 28 2024 8:41 AM | Last Updated on Mon, Oct 28 2024 8:41 AM

అతిథి

అతిథిగృహ నిర్మాణానికి భూమి పూజ నేడు

కొడంగల్‌: పట్టణంలోని సిటిజన్‌ క్లబ్‌లో రూ.6 కోట్ల వ్యయంతో ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నిర్మించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి హాజరవుతారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. అనంతరం ఆయన ఉదయం 11గంటలకు బొంరాస్‌పేటలో గ్రంథాలయ భవన నిర్మాణానికి భూమి చేస్తారని చెప్పారు. అనంతరం తుంపర్ల సేద్యం పరికరాలు, మధ్యాహ్నం 12 గంటలకు కోస్గిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేస్తారని వివరించారు.

పేద విద్యార్థుల్లో వెలుగులు నింపాలి

స్వేరోస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

పరిగి: పేద విద్యార్థుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా స్వేరోస్‌ నెట్‌వర్క్‌ పనిచేయాలని స్వేరోస్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థాపకుడు, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఆయన కర్ణాటకు వెళ్తున్న క్రమంలో పరిగిలో స్వేరోస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్నాపూర్‌ శ్రీనివాస్‌ నివాసంలో స్వేరోస్‌ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమమయ్యే వారికి మన నెట్‌వర్క్‌ నుంచి సాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మంచన్‌పల్లి శ్రీనివాస్‌, నాయకులు వెంకటయ్య, బుచ్చన్న, రాజేందర్‌, వెంకటేశ్‌, బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుకు భరోసా ఇవ్వని ప్రభుత్వం

హెచ్‌ఎం ఉస్మాన్‌అలీకి అబ్దుల్‌ కలాం నేషనల్‌ అవార్డు

పరిగి: మండల పరిధిలోని మిట్టకోడూరు ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న ఎండీ.ఉస్మాన్‌అలీని అబ్దుల్‌ కలాం నేషనల్‌ అవార్డుతో సత్కరించారు. ఆదివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయనకు ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఉస్మాన్‌ అలీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ తన సాహిత్య ప్రయాణం సాగుతుందన్నారు.

ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వం

టీయూఎఫ్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బల్‌దేవ్‌ రెడ్డి

తుర్కయంజాల్‌: తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని టీయూఎఫ్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కందాల బల్‌దేవ్‌ రెడ్డి విమర్శించారు. ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఫోరం జిల్లా అధ్యక్షుడు యాదిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారుల పాత్ర కీలకమైందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పింఛన్లు, ఉచిత బస్సు సౌకర్యం వంటి హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటను నెలాఖరులోగా నిలబెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నరేందర్‌, దక్షిణ తెలంగాణ అధ్యక్షురాలు శ్యామల, బీజేపీ ఎస్సీమోర్చా రాష్ట్ర కార్యదర్శి రమేష్‌, మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగయ్య గౌడ్‌, నాయకులు వీరస్వామి గౌడ్‌, దాసుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అతిథిగృహ నిర్మాణానికి భూమి పూజ నేడు 
1
1/1

అతిథిగృహ నిర్మాణానికి భూమి పూజ నేడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement