No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Wed, May 8 2024 6:55 AM

-

వైఎస్సార్‌సీపీలో చేరిన ముషిడిపల్లి యవకులతో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు

శృంగవరపుకోట: మండలంలోని ముషిడిపల్లి గ్రామానికి చెందిన పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే హైమావతి, పార్టీ మండల అధ్యక్షుడు మోపాడ కుమార్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి మాట్లాడుతూ, పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన స్థానం దక్కుతుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ముషిడిపల్లి గ్రామ పెద్దలు , వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement