విజయనగరం ఫోర్ట్: జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ ఇ.సందీప్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డ్వామా ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల డ్వామా పీడీగా పనిచేసి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ ఇన్చార్జి పీడీగా పనిచేసిన అరుణశ్రీ పశ్చిమగోదావరి జిల్లా డీపీఓగా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ జిల్లాలోని ఉపాధిహామీ వేతనదారులందరికీ పనికల్పించేందుకు కృషిచేస్తానని చెప్పారు.
జానపద కళల ప్రదర్శనకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 13, 14 తేదీల్లో లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు జానపద కళల ప్రదర్శన జరుగుతుందని కమిటీ సభ్యుడు, సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు బోని రామానందం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న కళాకారులు తమపేర్లను ఈ నెల 2వ తేదీలోగా నమోదు చేసుకోవాలని కోరారు. కళాకారులు స్థానికులై ఉండాలని, జానపద కళాప్రదర్శన అరగంట మించి, నృత్య, వాయిద్య ప్రదర్శన 15 నిమిషాలు మించి ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రదర్శనలకు దరఖాస్తు చేసుకున్న కళాకారులకు, స్క్రూటినీ అనంతరం వారి వ్యక్తిగత ఫోన్ నంబర్కు సమాచారం ఇస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులను ఉప సంచాలకులు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. వివరాలకు సెల్: 89192 22064, 93475 22850, 76609 22850, 81795 22850 నంబర్లను సంప్రదించాలని కోరారు.
విజయనగరం ఆర్డీఓగా దాట్ల కీర్తి
విజయనగరం అర్బన్: విశాఖపట్నం వీఎంఆర్డీఏలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న దాట్లకీర్తిను విజయనగరం ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం నియామక ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో వివిధ కేడర్లో పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. విజయనగరం జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిగా, సర్వశిక్ష అభియాన్ పీఓగా ఆమె పనిచేశారు. ఆమె శనివారం బాధ్యతలు చేపడతారని తెలిసింది. ఇక్కడ ఇంతవరకు ఆర్డీఓగా పనిచేసిన ఎం.పి.సూర్యకళను విజయవాడకు బదిలీ చేశారు.
దేవదాయశాఖ సహాయ కమిషనర్గా శిరీష
విజయనగరం టౌన్: దేవదాయశాఖ సహాయ కమిషనర్గా కె.శిరీష శుక్రవారం తోటపాలెంలో ఉన్న కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకూ ఇక్కడ పనిచేసిన కె.ఎల్.సుధారాణి అనకాపల్లి దేవదాయశాఖ సహాయ కమిషనర్గా బదిలీ అయ్యారు. శిరీష విశాఖపట్టణం దేవదాయశాఖలో రెండేళ్లుగా అసిస్టెంట్ కమిషనర్గా, కనకమహాలక్ష్మి ఆలయం ఇన్చార్జిగా పనిచేశారు. ప్రస్తుతం సంపత్ వినాయక ఆలయం ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. జిల్లాలో దేవదాయశాఖ భూముల ఆక్రమణల తొలగింపు, కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టిసారిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment