మెకానికల్‌ ఇంజినీర్‌కు 627వ ర్యాంక్‌ | Sakshi
Sakshi News home page

మెకానికల్‌ ఇంజినీర్‌కు 627వ ర్యాంక్‌

Published Wed, Apr 17 2024 1:30 AM

-

వెల్దండ: సివిల్స్‌ ఫలితాల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలోని చెదురుపల్లి ఉమ్మడి పంచాయతీ పోషమ్మగడ్డతండాకు వడ్తావత్‌ యశ్వంత్‌నాయక్‌ జాతీయ స్థాయిలో 627వ ర్యాంకుతో సత్తాచాటారు. తండాకు చెందిన ఉమాపతి, పద్మ దంపతుల మొదటి కుమారుడు యశ్వంత్‌. ఇతను ఇంటర్మీడియట్‌ నారాయణ కళాశాలలో, ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్‌ ఇంజినీయక్‌ పూర్తిచేశారు. తర్వాత సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా చదివి.. రెండోసారి ప్రయత్నంలో మెరుగైన ర్యాంకు సాధించాడు. తమ కుమారుడు సివిల్స్‌ సాధించడంతో తల్లిదండ్రులు పద్మ, ఉమాపతి హర్షం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థి సివిల్స్‌లో ర్యాంక్‌ సాధించడంతో తండావాసులు, బంధువులు అభినందించారు.

Advertisement
Advertisement