పాన్గల్: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. రేకుల షెడ్లు కూలిపోగా.. మామిడి కాయలు రాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. మంగళవారం ఉదయం నుంచి అధికారులు పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. అధికారులు గ్రా మాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.