వనపర్తిటౌన్: అరకొర వేతనాలతో పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు పని సమయంలో ఎలాంటి ప్రమాదం జరిగినా మున్సిపాలిటీ పూర్తి బాధ్యత వహించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యూలరైజ్ చేయాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ.. కార్మికులకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటుగా ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు సాయం అందించాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చైర్మన్ మహేష్, కమిషనర్ పూర్ణచందర్కు అందజేశారు. కార్యక్రమంలో కార్మికులు, కార్మిక నాయకులు చంద్రయ్య, కురుమయ్య, లాల్, గోపాల్, నరేష్గౌడ్, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment