పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం వహించొద్దు | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం వహించొద్దు

Published Sat, Sep 21 2024 1:26 AM | Last Updated on Sat, Sep 21 2024 1:26 AM

పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం వహించొద్దు

అమరచింత: పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని డీపీఓ సురేష్‌కుమార్‌ అన్నారు. మండలంలోని నాగల్‌కడ్మూర్‌లో శుక్రవారం ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉంటాయని, వీటిని నివారించే పనుల్లో పంచాయతీ కార్యదర్శులు ముందుండాలన్నారు. మురుగు కాల్వల పరిశుభ్రత వ్యవహారం ప్రతిరోజు చేపట్టాలన్నారు. రహదారులపై తడి, పొడి చెత్తలు పారవేయకుండా వాటిని డంపింగ్‌ యార్డుకు తరలించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, కాలనీలకు వచ్చే ట్రాక్టర్‌లో వీటిని వేసేలా చైతన్యం తీసుకురావాలన్నారు. తాగునీటి పైప్‌లైన్‌ లీకేజీలను గుర్తించి వాటి మరమ్మతు కోసం మిషన్‌ భగీరథ అధికారులకు నివేదించాలన్నారు. గ్రామాల్లో ఫాగింగ్‌ చేపట్టాలని, దోమలు, ఈగల నివారణ కోసం మందులను పిచికారీ చేయాలన్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌ను మురుగు కాల్వల వెంట చల్లాలని, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని సంపూర్ణ పారిశుద్ధ్యం గల గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement