వరంగల్ అర్బన్: తొమ్మిది రోజులు విశేష పూజలందుకున్న గణనాథుల నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. వరంగల్ మహానగర వ్యాప్తంగా సోమవారం
(నేడు) నిర్వహించే నిమజ్జనానికి చిన్నవడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగసముద్రం, గొర్రెకుంట కట్ట మల్లన్న, ఖిలా వరంగల్ అగర్తల, మామునూరు బెస్తం చెరువు, హనుకొండ, కాజీపేటలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, హసన్పర్తి పెద్ద చెరువు, భీమారం, మడికొండ చల్ల చెరువు, కడిపికొండ, మడికొండ, సోమిడి, ఎల్లాపూర్, గుండ్లసింగారం, రాంపేట, రాంపూర్, సింగారం, చల్ల చెరువు వద్ద వివిధ శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బల్దియాతోపాటు వివిధ శాఖల ద్వారా రూ.3 కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. నగర మేయర్, కలెక్టర్లు, పోలీస్, నగర కమిషనర్ దిశానిర్దేశం మేరకు ఆదివారం సాయంత్రం వరకు దాదాపు పనులన్నీ పూర్తి చేశారు. నగరంలో గతేడాది 5,965 విగ్రహాలను నిమజ్జనం చేయగా.. ఈఏడాది 6,500ల పైచిలుకు ఉంటాయని అధికారులు అంచనా వేశారు.
ప్రభుత్వ శాఖల వారీగా పనులిలా..
బల్దియా ఆధ్వర్యాన రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, లైటింగ్, పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఐదు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పోలీసులు శోభాయాత్రలు, నిమజ్జన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించనున్నారు. చెరువుల వద్ద బారికేడ్లు, 30కి పైగా తెప్పలు, 22 క్రేన్లు, టెంట్లు, కుర్చీలు, 1,200 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. 108 అంబులెన్స్లు తదితర ఏర్పాట్లలో ఆయా శాఖలు అధికారులు నిమగ్నమయ్యారు.
ఎక్కడ ఎలా అంటే..
● హనుమకొండ సిద్ధేశ్వరగుండం : ఇక్కడ గత ఏడాది 400 విగ్రహాలను నిమజ్జనం చేయగా.. ఈసారి 450 వరకు రావొచ్చని అంచనా వేసి 3 పెద్ద క్రేన్లు, రెండు తెప్పలు సిద్ధం చేశారు.
● కాజీపేట బంధం చెరువు : 4 క్రేన్లు, మూడు తెప్పలను అందుబాటులో ఉంచారు. గతేడాది 430 విగ్రహాలు నిమజ్జనం చేయగా.. ప్రస్తుతం 450 వస్తాయని అంచనా వేశారు.
● హసన్పర్తి పెద్ద చెరువు : ఇక్కడ 2 క్రేన్లు, 2 తెప్ప లు ఏర్పాటు చేశారు. 200 వరకు విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. అలాగే భీమారం చామల చెరువు, మడికొండ చల్ల చెరువు వద్ద ఒక్కో క్రేన్, తెప్ప సిద్ధం చేశారు.
నేడు ట్రైసిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
– వివరాలు 8లోu
నేడు గణేశ్ నిమజ్జనం
10 కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు
22 క్రేన్లు, 1,200 మంది గజ ఈతగాళ్లు
ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలు
విద్యుత్ దీపాలు, బారికేడ్ల ఏర్పాట్లు
పర్యవేక్షించిన కలెక్టర్, అధికారులు
Comments
Please login to add a commentAdd a comment