హన్మకొండ కల్చరల్: వరంగల్ మహానగర్ గణపతి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్తమ గణ పతి మండపాలకు బహుమతుల ప్రదానం ఆదివా రం రాత్రి హనుమకొండ టీటీడీలో జరిగింది. హనుమకొండ టీఎన్జీఓస్ కాలనీ ఫేస్ టు 100 ఫీట్లరోడ్ శ్రీశ్రీశ్రీ గజానన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి ప్రథమ, కాజీపేట బాపూజీనగర్ హమారా హిందుస్థాన్ విఘ్నేశ్వరుడికి ద్వితీయ, హనుమకొండ నందిహిల్స్ వరసిద్ధి వినాయక మండలి వినాయకుడికి ప్రత్యేక బహుమతి లభించింది. ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధయోగి స్వామి శ్రీశ్రీ చైతన్య ఆనంద మహారాజ్ బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వి నాయకుడు ఆధ్యాత్మిక, సామాజిక, ఆరోగ్య, విజ్ఞానాత్మక అంశాల సమాహారమని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొ మ్మినేని రవీందర్రెడ్డి, ఉత్సవ సమితి కన్వీనర్ న్యా లకొండ భాస్కరరావు, కోకన్వీనర్ శ్రీరామ్ఉదయ్ కుమార్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కేసిరెడ్డి జయపాల్రెడ్డి, వెలగందుల రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment