హసన్పర్తి: కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఇండోర్ స్టేడియంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి టెబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈసందర్భంగా ఆయన విజేతలకు మెమొంటోలు అందజేశారు. టెబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆకారపు హరీశ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పింగిలి రమేశ్రెడ్డి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్కుమార్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, పీఆర్ఓ డాక్టర్ ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే :
పురుషులు (సింగిల్స్): అభినవ్, వరంగల్ క్లబ్ (విన్నర్), యష్, నిట్(రన్నర్).
మహిళలు (సింగిల్స్): తనూశ్రీ, వరంగల్ క్లబ్ (విన్నర్), ఎం.వర్షిత, కిట్స్ (రన్నర్).
పురుషులు (డబుల్స్): అజయ్కుమార్, ఎ.సురేశ్ (విన్నర్), డి.దేవేందర్, ఎ.రాజేశ్ (రన్నర్).
మహిళలు (డబుల్స్): పి.శార్వాణి, జి.సరయ (విన్నర్), బి. ప్రణతి, లక్ష్మి (రన్నర్).
మిక్సింగ్ డబుల్స్: తనూశ్రీ, కె.అభినవ్ (విన్నర్), వర్షిత, పి.భరత్కుమార్ (రన్నర్).
Comments
Please login to add a commentAdd a comment