నర్సంపేట రూరల్ : నర్సంపేట పట్టణంలోని జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి ఏర్పా ట్లు చేయాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికా రులను ఆదేశించారు. వైద్య కళాశాలను ఆదివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఈనెల 17న జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో వైద్యుల గదులు, బెడ్లు, పరికరాలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment