స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తాం..
చెన్నారావుపేట: గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా మంచి నీటి సహాయకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేందర్, సబ్ డివిజన్ మిషన్ భగీరథ ఇంట్రా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవేందర్రెడ్డి అన్నారు. మండలంలోని గ్రామ మంచినీటి సహాయకులకు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 గ్రామ పంచాయతీల్లో 36 మంది నీటి సహాయకులు హాజర య్యారని తెలిపారు. నల్లాలు, పైపులైన్ లీకేజీల మరమ్మతులు, నిర్వహణపై శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. నీటి నాణ్యత పరిశీలన, పరిరక్షణపై గురువారం శిక్షణ ఇస్తామని, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. అనంతరం నీటి సహాయకులకు మెటీరియల్ అందించారు. కార్యక్రమంలో మండల ఏఈలు రణధీర్, వంశీ, ఎంపీఓ శ్రీధర్రాజు, సూపరింటెండెంట్ ఆయేషాఫర్వీన్, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment