ముస్లింలకు అండగా జగన్‌ | Sakshi
Sakshi News home page

ముస్లింలకు అండగా జగన్‌

Published Wed, May 8 2024 4:40 AM

ముస్లింలకు అండగా జగన్‌

తాడేపల్లిగూడెం (టీఓసీ): దివంగత నేత వైఎస్సార్‌ బాటలోనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ముస్లింలకు అండగా ఉన్నారని వైఎస్సార్‌ సీపీ మైనార్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కె నౌషాద్‌ మోహిద్దీన్‌ పేర్కొన్నారు. పట్టణంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలపై రూ.26 వేల కోట్లు ఖర్చు చేశారని కొనియాడారు. ముస్లింలపై కపట ప్రేమ చూపించిన చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు కేవలం రూ.2,650 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. నేటి ప్రభుత్వం నవరత్న పథకాలే కాకుండా అనేక సంక్షేమాలు ముస్లింలకు అందిచినట్లు చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లును రద్దు చేస్తామనడం చాలా అన్యాయమని విమర్శించారు. నెల్లూరు సభలో ముస్లింలకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లుకు గాని, సీఐఏ, ఎన్‌ఆర్సీ, ఇతర ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకొని ముస్లింల విశ్వాసాన్ని కోల్పోయారని, వారికి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ముస్లింలు అంతా జగన్‌ వెంటే ఉంటారని, వైఎస్సార్‌ సీపీకి ఓట్లు వేసి గెలిపించుకుంటామని వెల్లడించారు.

Advertisement
Advertisement