![డిప్యూటీ స్పీకర్పై ఫిర్యాదు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10bvrmplk01-290043_mr-1739215405-0.jpg.webp?itok=GWOmqeOg)
డిప్యూటీ స్పీకర్పై ఫిర్యాదు
పాలకోడేరు: రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అండ తో ఆయన అనుచరులు తనపై తప్పుడు కేసులు బ నాయించి వేధిస్తున్నారని సీనియర్ జర్నలిస్టు, స మాచార హక్కు చట్టం ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి కె.రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్న తనకు రక్షణ కల్పించాలని, తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన వారిని శిక్షించాలని కోరుతూ సోమవారం పాలకోడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కుచట్టం ప్రకారం నిజాలు తెలుసుకుని పోరాటం చేస్తున్నానని, దీనిలో భాగంగా పశ్చిమగోదావరి కలెక్టరేట్ను భీమవరం నుంచి తరలించే యత్నాలను అడ్డుకుంటూ అఖిల పక్ష కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నామని రవికుమార్ తెలిపారు. ఉండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పేదల ఇళ్లను అకారణంగా కూల్చివేస్తున్నారని, వాటిని అడ్డుకునే క్రమంలో వార్తలు రాశారన్నారు. కలెక్టరేట్ను గతంలో భీమవరం మార్కెట్ యార్డు స్థలంలో మంజూ రు చేసి అప్పటి ప్రభుత్వం నిధులు కూడా మంజూ రు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం దానిని మార్చి పెదఅమిరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇంటి పక్కకు మార్చుకునేందుకు యత్నిస్తున్నారని, దీనిపై కూడా వార్తలు రాశానన్న కక్షతో తనను అధికారుల సమక్షంలో అసభ్యకర రీతిలో డిప్యూటీ స్పీకర్ దూషించారని వివరించారు. అప్ప టి నుంచి ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని రవికుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment