రైతుబజార్‌లో ధరల మంట | - | Sakshi
Sakshi News home page

రైతుబజార్‌లో ధరల మంట

Published Sun, Oct 20 2024 2:38 AM | Last Updated on Sun, Oct 20 2024 2:38 AM

రైతుబజార్‌లో ధరల మంట

భునవగిరిటౌన్‌ : కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టినా భువనగిరి రైతుబజార్‌లో పాత రేట్లకే విక్రయిస్తున్నారు. ప్రతి కూరగాయలపై పది రూపాయల వరకు ఎక్కువ తీసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన మార్కెటింగ్‌ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వ్యాపారులు నిర్ణయించిందే రేటు అవుతుంది.

బోయిన్‌పల్లి మార్కెట్‌

ఆధారంగా ధరలు నిర్ణయం

పది రోజుల క్రితం వరకు అధికంగా ఉన్న కూరగాయల ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌కు పెద్ద ఎత్తున కూరగాయలు వస్తుండడంతో జిల్లా మార్కెట్‌లు, రైతుబజార్లకు అక్కడినుంచి దిగుమతి పెరిగాయి. ఈ క్రమంలో భువనగిరి రైతుబజార్‌లో ధరలు తగ్గాల్సి ఉంది. కానీ, ఎప్పటి రేట్లకే విక్రయిస్తున్నట్లు కొనుగోలుదారులు వాపోతున్నారు. బోయిన్‌పల్లి మార్కెట్‌ రేట్ల ప్రకారంగా భువనగిరి రైతుబజార్‌లో ధరలు నిర్ణయిస్తారు. రోజువారీ రేట్లను నోటీస్‌ బోర్డుపై ప్రదర్శిస్తారు. కానీ, వ్యాపారులు నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

ఎస్టేట్‌ అధికారి లేడు

రైతుబజార్‌లో పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఎస్టేట్‌ అధికారి లేడు. ఇంచార్జితో నెట్టుకొస్తు న్నారు. మరోవైపు మార్కెటింగ్‌ శాఖ అధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతున్నారు. కిలోపై రూ.5నుంచి రూ.10 పెంచి అమ్మకాలు చేపడుతున్నారు. బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డులో టమాట రూ.40 పలుకుతుండగా ఇక్కడ కిలో రూ.48కి విక్రయిస్తున్నారు. మిగతా కూరగాయలదీ అదే పరిస్థితి.

దిగిరాని కూరగాయల రేట్లు

ఫ హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి

మార్కెట్‌ నుంచి పెరిగిన దిగుమతులు

ఫ అయినా అధిక ధరలకే విక్రయం

ఫ పర్యవేక్షణ లేక వ్యాపారుల ఇష్టారాజ్యం

ఫ ఇబ్బందులు పడుతున్న భువనగిరి ప్రజలు

కూరగాయల ధరలు కిలో (రూ.ల్లో)

రకం నిర్ణయించిన అమ్ముతున్న

ధర ధర

టమాట 43 48

వంకాయ 35 40

బిన్నిస్‌ 65 80

పచ్చిమిర్చి 40 46

కాకర 35 46

క్యాబేజీ 26 32

క్యారెట్‌ 53 60

దొండ 35 44

ఆలుగడ్డ 37 44

గోకర 40 46

కీరదోస 23 30

ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు

స్థానిక రైతులు తెచ్చి నిర్ణయించిన ధర ప్రకారమే కూరగాయల అమ్మకాలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే కూరగాయలు వాహనాల కిరాయి, హమాలీల కూలి పోను అమ్మకాలు సాగిస్తున్నా. ఎక్కువ ధరలకు అమ్మడం లేదు. వ్యాపారులు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం.

– సాయి కిశోర్‌, ఇంచార్జి ఎస్టేట్‌ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement