-
'గ్లాస్ గుచ్చుకుంది'..!
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్రాజుకు గ్లాసు గుర్తు గట్టిగానే గుచ్చుకుంటోందట. ఇప్పటికే జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తన ఓట్లనే చీల్చుతారని తెగ ఇదైపోతున్నారట. దీనికి గ్లాసు గుర్తు తోడు కావడంతో భయపడ్డ ఆయన, గ్లాస్ గుర్తు దక్కిన స్వతంత్ర అభ్యర్థి ఇంటికెళ్లి మరీ బతిమాలుకున్నారట.తను గెలిచాక అధిక మొత్తం ముట్టజెప్తానని హామీ ఇచ్చారట. అయి తే 2014లో ఆయన తీరు గుర్తుకొచ్చి తక్షణ బేరం మాట్లాడుకున్నారట. కాస్త ‘భారీ’స్థాయిలో బతిమాలుకున్నాకే ఆ అభ్యర్థి వెనక్కి తగ్గినట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి పరువు తప్ప, అధికారం మాత్రం దక్కదన్న నమ్మకానికొచ్చేశారట..!ఇవి చదవండి: 'పులుసు కారుతోంది'..! -
భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
సాక్షి, విశాఖపట్నం: బాబూ.. శ్రీభరత్...! సూటిగా సుత్తిలేకుండా మాట్లాడుకుందాం... 👉విద్యా సంస్థల పేరుతో రూ.500 కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని తాత కబ్జా చేసి.. నగర ప్రతిష్టను దిగజార్చినప్పుడు విశాఖపట్నం గుర్తుకు రాలేదు. 👉దేవాలయంలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని దెయ్యాల కొంపగా అభివర్ణిస్తూ.. విద్యల నగరం పరువును బంగాళాఖాతంలో కలిపేసినప్పుడూ విశాఖ గుర్తుకు రాలేదు. 👉రాజధానిగా విశాఖ నగరం బెస్ట్ అని శివరామకృష్ణన్ కమిటీ ప్రకటించినా.. చంద్రబాబు వైజాగ్ ఎదగకూడదని భావించి అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడూ విశాఖ గుర్తుకు రాలేదు... 👉 వీఎంఆర్డీఏకు చెందిన భూముల్ని దఫదఫాలుగా విక్రయించి.. రూ.1,600 కోట్ల వైజాగ్ సంపదని చంద్రబాబు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టినప్పుడూ విశాఖ గుర్తుకు రాలేదు.. 👉 నిన్నటికి మొన్న.. నీ సొంత వర్సిటీలో ఫీజుల్ని అమాంతం 40 శాతం పెంచేందుకు ప్రయత్నించినప్పుడూ విశాఖలో ఉన్న విద్యార్థులు గుర్తుకు రాలేదు.. 👉 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో అదీ.. పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో మాత్రం.. వైజాగ్ ఓ గ్రోత్ సిటీ అనీ.. రాజధానిగా అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని మాత్రం హఠాత్తుగా గుర్తొచ్చేసింది. 👉 దేశ, విదేశాలకు చెందిన ప్రజలు, ప్రముఖులు వాహ్.. విశాఖ అని కొనియాడుతున్నప్పుడు గుర్తుకు రాని.. విశాఖపట్నం.. ఓటమి భయం ముంచుకొచ్చినప్పుడు మాత్రం తెగ గుర్తొచ్చేసింది.. ఏం భరత్.. ఇదేనా నీ విజ్ఞత.? ఇదేనా విశ్వసనీయత.? ఇదేనా విశాఖకు నీవిచ్చే విలువ.? 👉 2019 డిసెంబర్లో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించినప్పుడు.. శభాష్.. మంచి నిర్ణయమని మెచ్చుకోవడానికి కూడా ఇష్టపడని తమరికి.. ఇప్పుడు మాత్రం అమాంతంగా ప్రేమ ఉప్పొంగిపోతోందంటే ఆశ్చర్యమేస్తోందయ్యా.. 👉 చంద్రబాబులా ఏ ఎండకాగొడుగు పడుతూ.. పూటకో అబద్ధం.. మాట మాటకో మాయా మోసం అలవాటైనట్లుగా ఉన్నాయి. నిజమే మరి.. తమరూ ఆ తాను ముక్కే కదా.. ఆ అలవాట్లు రాకుండా ఎలా ఉంటాయి.? 👉 ఏమన్నావ్.. ఏమన్నావ్.?? ‘ఇవాళ అమరావతి అభివృద్ధి చేసేందుకు మన దగ్గర అంత డబ్బుల్లేవు. విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఏపీ అభివృద్ధి చెందుతుంది. అమరావతి డెవలప్ చేయడానికి పెట్టుబడి చాలా అవసరం. అంత పెట్టుబడి పెట్టే స్థాయిలో ఏపీ ప్రభుత్వం లేదు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ హయాంలో మొత్తం అప్పులు మూడున్నర లక్షల కోట్లు. మనకి ఇవాళ వేల కోట్లు అమరావతిలో పెట్టే పరిస్థితిలో లేము. మనం చూసేది ఏంటంటే.. మనకి గ్రోత్ ఇంజిన్ ఏంటి.? విశాఖపట్నం మన గ్రోత్ ఇంజిన్. అమరావతి అనేది 20 ఏళ్ల తర్వాతే సాధ్యమవుతుంది.’’ 👉 నిజంగానే ఈ మాటలు నీ గుండెల్లోంచే వచ్చాయా భరత్.? ఇన్నాళ్లూ అమరావతి అందమైన రాజధాని.. అంటూ బాబుతో కలిసి భజన బృందంలో తానా అంటే తందానా అంటూ పల్లవి కలిపిన తమరు.. ఎన్నికలు రాగానే ప్లేటు ఫిరాయించడం భావ్యమేనా భరత్.? ఈ మాటలు కూడా కేవలం ఓట్లు రాల్చుకునేందుకు పలికిన చిలక పలుకులే తప్ప.. గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు కావన్నది మీ మాటలను బట్టి తెలుస్తోంది. ఎందుకంటే.. తమరి విశ్వసనీయత ఏపాటిదో.. 2019 ఎన్నికల్లోనే పసిగట్టేశాం. అందుకే ఇంటికి పరిమితం చేశాం. 👉 ఒక్క విషయం గుర్తుంచుకో భరత్... వేల కేసులు వేసి.. విశాఖ రాజధానిని ఆపేందుకు కుట్రలు పన్నుతున్నా బెదరలేదు.. అదరలేదు. చెప్పిన మాట చెప్పినట్లుగా అమలు చేస్తాననీ.. 2024లో ఘన విజయం సాధించి.. విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేసి.. ఇక్కడి నుంచే పాలన సాగిస్తానని ఢంకాపథంగా చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు కదా.. అదీ మాటంటే.. మాట మనసు లోతుల్లోంచి రావాలి. లక్షల మంది ఉన్న సమూహంలో మాట్లాడుతున్నా.. ఒక్కొక్కరినీ పలకరించినట్లు మాట్లాడుతున్నట్లుండాలి. అలా మాట్లాడాలంటే.. ప్రతి ఒక్కరి మనసు తెలిసుండాలి. వారి కష్టసుఖాలు ఎరిగి ఉండాలి. ఆ ప్రాంతంపై ఆదరాభిమానాలుండాలి. అది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యం. అందుకే.. ఆయన విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పగానే.. కేవలం ఇక్కడికే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజానీకం మొత్తం చెప్పినట్లుగా.. గుండె లోతుల్లోకి వెళ్లిపోయింది. ఇది ఫిక్స్. ఇప్పుడు నువ్వొచ్చి.. కల్ల»ొల్లి కబుర్లు చెబితే.. నమ్మేవారెవ్వరూ లేరు భరత్.. నీ మాటలు ఒక నాటకం.. నీ విజ్ఞత ఒక బూటకం. నీవు నడుస్తున్న నీ పార్టీ ఒక మాయా ప్రపంచం. ముందు అందులోంచి బయటపడు. అప్పుడే విశాఖ అంటే ఏమిటో అర్థమవుతోంది. ఇట్లు, విశాఖ ప్రజలు -
రేపే అప్పన్న చందనోత్సవం
సింహాచలం: వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని సంవత్సరమంతా చందనం మణుగుల్లో నిత్య రూపంలో దర్శనమిచ్చే సింహాద్రినాథుడి నిజరూప దర్శనం లభించే సమయం ఆసన్నమైంది. వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం శుక్రవారం జరగనుంది. ఏడాదిలో కేవలం ఒక్క రోజులోని కొన్ని గంటలు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. స్వామిని దర్శించుకునేందుకు వచ్చే సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తూ.. వారికి దర్శనాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ ఎ.మల్లికార్జున, సింహాచలం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో ఈసారి ప్రోటోకాల్ దర్శనాలు ఇవ్వడం లేదు. వెండి బొరుగులతో చందనం ఒలుపు చందనోత్సవం పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సుప్రభాతసేవ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, కలశారాధన చేస్తారు. అనంతరం వెండి బొరుగులతో స్వామిపై ఉన్న చందనాన్ని తీసి నిజరూపభరితుడిని చేస్తారు. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త కుటుంబ సభ్యులు, దాతలు, జ్యుడీషియల్కు అంతరాలయ దర్శనాలు కల్పిస్తారు. తదుపరి అంతరాలయ దర్శనాలు నిలిపివేస్తారు. అందరికీ ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద నుంచే లఘు దర్శనం కల్పిస్తారు. ఎలాంటి పూజలు, ఆశీర్వచనాలు ఉండవు. దర్శన స్లాట్లు కేటాయింపు ఉదయం 4 గంటల నుంచి ఉచిత దర్శనం, రూ.300, రూ.1000 క్యూల్లో ఉన్న భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తారు. ఉదయం 5.30 గంటల నుంచి రూ.1,500 క్యూలో ఉన్న భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. రూ.300 టికెట్లకు సంబంధించి ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, రూ.1000 టికెట్లకు సంబంధించి ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రూ. 1,500 టికెట్లకు సంబంధించి ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శన టైమ్ స్లాట్లు కేటాయించారు. లక్ష మంది భక్తులు వస్తారని అంచనా ఈ సారి లక్ష మంది భక్తులు చందనోత్సవానికి వస్తారని అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా రూ.300 టికెట్లు 20 వేలు, రూ.1000 టికెట్లు 15 వేలు, రూ.1500 టికెట్లు 5 వేలు కలిపి మొత్తం 40 వేలు టికెట్లు మాత్రమే విక్రయించారు. 60 వేల మందికి ఉచిత దర్శనం ఏర్పాటుచేసేలా ఏర్పాట్లు చేశారు. రాత్రి 7 గంటల తర్వాత గేట్లు మూసివేత 10వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటల్లోపు మాత్రమే సింహగిరిపై దర్శనాల క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. సాయత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాత ఖాళీ బస్సులను కొండపైకి పంపించి కొండపై ఉన్న భక్తులను కొండ దిగువకి చేరుస్తారు. 9వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటల తర్వాత కూడా భక్తులను కొండపైకి అనుమతించరు. ఏర్పాట్లు ఇలా.. ● సింహగిరికి డ్యూటీలో ఉన్న వారికి మాత్రమే పరిమితంగా పాస్లు అందిస్తారు. ● ఈ సారి అడవివరంలోని గురుకుల పాఠశాలకు సమీపంలోని రెండవ ఘాట్ రోడ్డు నుంచే బస్సులు సింహగిరికి వెళ్లేలా, తొలి – మిగతా 8లో లక్ష మంది భక్తులు వస్తారని అంచనా తెల్లవారుజామున 4 గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం సాయంత్రం 6 గంటల తర్వాత సింహగిరిపైకి భక్తులకు అనుమతి లేదు రూ.300, రూ.1000, రూ.1500 టికెట్ల వారికి దర్శన సమయాల స్లాట్లు -
డ్వాక్రా గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులకు గిన్నెలు
● పశ్చిమలో అడ్డదారులు తొక్కుతున్న టీడీపీ ● యథేచ్ఛగా డబ్బులు, వెండి సామగ్రి పంపకం గోపాలపట్నం: ఓటమి భయంతో విశాఖ పశ్చిమంలో టీడీపీ నాయకులు నీచ రాజకీయాలకు తెరలేపారు. గతంలో ఆర్పీలకు బంగారు ఆభరణాలు ఇవ్వగా.. ఇప్పుడు డ్వాక్రా గ్రూపు అధ్యక్ష కార్యదర్శులకు వెండి గిన్నెలు అందిస్తున్నారు. అక్కడితో ఆగకుండా డ్వాక్రా గ్రూపు మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. వారికి భోజనాలు పెడుతున్నారు. డ్వాక్రా పుస్తకాల మొదటి పేజీ జిరాక్స్ ఇస్తే డబ్బులు ఇస్తామంటూ ప్రలోభ పెడుతున్నారు. ప్రతీ వార్డులో స్థానిక నాయకులతో వీటిని సేకరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు డాక్ స్వచ్ఛంద సంస్థ కూడా సహకరిస్తుందని తెలుస్తోంది. గ్రూపుల్లో మహిళల వివరాలు, వారికి ఎక్కడ ఓటు ఉంది, వారు ఏఏ పార్టీకి చెందిన వారు తదితర వివరాలు ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ నాయకుల తాయిలాలను వ్యతిరేకిస్తున్న వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. కాగా.. పశ్చిమ టీడీపీ నాయకులపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా.. ఎన్నికల అధికారులు కనీసం చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లకు గడియారాల పంపిణీ కంచరపాలెం: జీవీఎంసీ 57వ వార్డు ఊర్వశి కూడలి, ఐటీటీ జంక్షన్, మర్రిపాలెం ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభపెడుతూ టీడీపీ నాయకులు గడియారాలను పంచిపెట్టారు. చంద్రబాబు, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు చిత్రపటాలతో సిద్ధం చేసిన గడియారాలను ఆ పార్టీ వార్డు అధ్యక్షుడు పెంటకోట అజయ్బాబు ఓటర్లకు తాయిలాలుగా అందించారు. తమ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేయాలని గడియారాలను అందిస్తూ దర్జాగా ప్రచారం చేస్తున్నా.. ఎన్నికల పర్యవేక్షణ అధికారులు ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. -
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
తాటిచెట్లపాలెం : వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–ఖుర్దారోడ్–సికింద్రాబాద్ మధ్య పలు స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ● సికింద్రాబాద్–ఖుర్దారోడ్(07129) సమ్మర్ స్పెషల్ ఈ నెల 10న సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 9.02 గంటలకు బయల్దేరి శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఖుర్దారోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఖుర్దారోడ్–సికింద్రాబాద్(07130) సమ్మర్ స్పెషల్ శనివారం రాత్రి 11.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 7.15 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 7.17 గంటలకు బయల్దేరి ఆదివారం రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● సికింద్రాబాద్–ఖుర్దారోడ్(07131) మరో సమ్మర్ స్పెషల్ ఈ నెల 11న సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 9.02 గంటలకు బయల్దేరి ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఖుర్దారోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఖుర్దారోడ్–సికింద్రాబాద్(07132) సమ్మర్ స్పెషల్ ఈ నెల 12వ తేదీ రాత్రి 11.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 7.15 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడి నుంచి 7.17 గంటలకు బయల్దేరి సోమవారం రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
భక్తులకు పోలీసుల సూచనలివే..
విశాఖ సిటీ: సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం ఈ నెల 10న జరుగుతున్న సందర్భంగా నగర పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఒక వైపు భక్తుల భద్రతతోపాటు మరోవైపు ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి సారించింది. స్వామి దర్శనానికి తరలివచ్చే భక్తులకు అధికారులు చేసిన సూచనలివే.. ● శొంఠ్యాం వైపు నుంచి వచ్చే రూ.300, ఉచిత దర్శనం భక్తులు తమ వాహనాలను అడవివరం జంక్షన్ వెంకటాద్రినగర్లో నిర్దేశించిన పార్కింగ్ స్థలంలో నిలపాలి. అడవివరం జంక్షన్ వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సు హోల్డింగ్ పాయింట్ నుంచి ఉచిత బస్సుల్లో కొండపైకి వెళ్లాలి. ● శొంఠ్యాం నుంచి వచ్చే భారీ వాహనాలకు అడివివరం వైపు ప్రవేశం లేదు. ● రూ.1,000, రూ.1,500 టికెట్దారులు నగరం నుంచి హనుమంతవాక మీదుగా ఆరిలోవ, పైనాపిల్ కాలనీ, కృష్ణాపురం న్యూ గోశాల వద్దకు చేరుకోవాలి. అక్కడ దేవస్థానం ఏర్పాటు చేసిన ఏసీ బస్సుల్లో కొండపైకి వెళ్లాలి. అనంతరం అవే బస్సుల్లో పార్కింగ్ ప్రదేశాలకు చేరుకుని తమ వాహనాల్లో హనుమంతవాక మీదుగా వెళ్లాలి. ● కార్లు, ఇతర వాహనాల్లో రూ.300, ఉచిత దర్శనానికి వచ్చేవారు కొత్త టోల్గేట్ వద్ద బీఆర్టీఎస్ రోడ్డులో, టోల్గేట్ ఓపెన్ ఏరియాలో పార్కింగ్ చేసుకోవాలి. ద్విచక్ర వాహనాలను బీసీ వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్లో నిలపాలి. అక్కడి నుంచి న్యూ టోల్గేట్ దగ్గరలోని బస్ హోల్డింగ్ పాయింట్లో దేవస్థానం ఉచిత బస్సుల్లో కొండపైకి వెళ్లాలి. ● హనుమంతవాక నుంచి పెందుర్తి, గోపాలపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలు అడవివరం వైపు నుంచి రాకుండా ఆనందపురం నుంచి లేదా మద్దిలపాలెం, ఎన్ఏడీ వైపు నుంచి వెళ్లాలి. భక్తుల వాహనాలు మాత్రమే హనుమంతవాక నుంచి అనుమతిస్తారు. ● గోపాలపట్నం నుంచి వచ్చే రూ.1,000, రూ.1,500 టికెట్దారుల వాహనాలను శ్రీనివాసనగర్లోని పార్కింగ్ స్థలంలో నిలపాలి. అక్కడి నుంచి ఏసీ బస్సుల్లో కొండపైకి వెళ్లాలి. ● గోపాలపట్నం నుంచి రూ.300, ఉచిత దర్శనానికి వచ్చే వారు సాయినగర్, బీఆర్టీఎస్ సెంటర్ రోడ్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి దేవస్థానం పాత గోశాల వద్ద కేటాయించిన ఉచిత బస్సుల్లో కొండపైకి వెళ్లాలి. దర్శనం అనంతరం బస్సుల్లో పార్కింగ్ ప్రదేశాలకు చేరుకుని తమ వాహనాల్లో వేపగుంట మీదుగావెళ్లాలి. ● సబ్బవరం, పెందుర్తి, వేపగుంట వైపు నుంచి కార్లలో వచ్చే రూ.300, ఉచిత దర్శనం వారు సాయినగర్ 1 నుంచి 5 పార్కింగ్ స్థలాల్లో నిలపాలి. అక్కడి నుంచి పాత గోశాల వద్ద ఉచిత బస్సుల్లో కొండపైకి వెళ్లాలి. వేపగుంట నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు సింహపురికాలనీ బస్టాప్ వెనుక వైపు గల మామిడి తోటలో నిలపాలి. ● గోపాలపట్నం నుంచి వచ్చే ఆటోలు వేపగుంట మీదుగా అప్పన్నపాలెం చేరుకుని, అక్కడ యూ టర్న్ తీసుకొని వేపగుంట వైపు వెళ్లే బీఆర్టీఎస్ సెంటర్ రోడ్లో పార్కింగ్ చేసుకోవాలి. సింహాద్రి ఆస్పత్రి వద్దకు మధ్య నుంచి వచ్చిన ఆటోలను అక్కడ కటాఫ్ పాయింట్లో ఆపి అప్పన్నపాలెం వైపు రోడ్డులో వెళ్లాలి. అక్కడ భక్తులను దింపి ఆటోలకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో నిలపాలి. ● గోపాలపట్నం నుంచి వచ్చే ద్విచక్రవాహనదారులు పాత గోశాల వద్ద ఈవో ఆఫీస్ పక్కన ఏర్పాటు చేసిన టూవీలర్స్ ఎంట్రీ పాయింట్ నుంచి ప్రవేశించి.. కె కన్వెన్షన్ ఫంక్షన్ హాల్–శ్రీదేవి కాంప్లెక్స్ వరకు ఏర్పాటు చేసిన పార్కింగ్లో నిలపాలి. అక్కడి నుంచి ఉచిత బస్సుల్లో కొండపైకి వెళ్లాలి. ● సబ్బవరం, పెందుర్తి, వేపగుంట వైపు నుంచి అలాగే గోపాలపట్నం వైపు నుంచి సింహాచలం మీదుగా హనుమంతవాక వెళ్లాల్సిన వాహనదారులు ఎన్ఏడీ, తాటిచెట్లపాలెం, మద్దిలపాలెం మీదుగా ప్రయాణించాలి. ● అనకాపల్లి, పాడేరు జిల్లా వాసులు సబ్బవరం, అలాగే కొత్తవలస వైపు నుంచి వాహనాల్లో వచ్చే భక్తులు వేపుగుంట మీదుగా సింహపురికాలనీ బస్సు పాయింట్ వద్దకు గానీ ఓల్డ్ గోశాల బస్సు పాయింట్ వద్దకు గానీ చేరుకోవాలి. ● చందనోత్సవం సందర్భంగా విధులకు హాజరయ్యే పోలీస్, అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది ద్విచక్ర వాహనాలు కొండ కింద గల సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ గ్యారేజీ గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఉద్యోగులకు కేటాయించిన బస్సుల్లో కొండ మీదకు చేరుకోవాలి. ● కొండ మీదకు ద్విచక్ర వాహనాలను అనుమతించరు. అన్ని శాఖల వారు సింహాచలం తొలి పావంచా వద్ద గల ట్యాక్సీ స్టాండ్లో కార్లు పార్కింగ్ చేసుకోవాలి. వారు కూడా ఆన్డ్యూటీ ఉద్యోగులకు కేటాయించిన ఆర్టీసీ బస్సుల్లో కొండ మీదకు వెళ్లాలి. ● భక్తుల కోసం దేవస్థానం ఏర్పాటు చేసిన ఆర్టీసీ, మినీ బస్సులు తప్పా.. ఇతర వాహనాలు కొండమీదకు అనుమతించరు. స్పెషల్ వీఐపీ పాస్లు కలిగిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ● సింహాచలం పరిసర ప్రాంతంలో నివసించే ప్రజలు ఈ నెల 10న అత్యవసరమైతే తప్పా.. వాహనాల్లో ఓల్డ్ గోశాల నుంచి అడవివరం వరకు ప్రయాణం చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే ఆధార్ కార్డు పోలీసులకు చూపించి ప్రయాణం చేయాలి. -
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
మహారాణిపేట: ఏయూ హైస్కూల్లో నాలుగు రోజులుగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ బుధవారం ముగిసింది. గ్రేహౌండ్స్, ఇతర జిల్లాల గ్రేహౌండ్స్, 16వ బెటాలియన్ ఉద్యోగులు బుధవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విశాఖ జిల్లా నుంచి 2909 మంది, ఇతర జిల్లాల వారు 813 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పోస్టల్ బ్యాలెట్ ఇన్చార్జి జీవీఎంసీ ఏడీసీ విశ్వనాథన్ తెలిపారు. మొత్తం నాలుగు రోజుల పాటు 15,400 మంది పోస్టల్ ఓటింగ్లో పాల్గొన్నారు. ఇతర జిల్లాల సిబ్బంది మొత్తం నాలుగు రోజుల పాటు 5005 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారి కంటే ఆ తర్వాత వచ్చిన అనేక మంది ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు అవకాశం కల్పించారు. దీంతో అనుకున్న స్థాయి కన్నా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సంఖ్య పెరిగింది. గురువారం అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వో కేంద్రాల వద్ద మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉంటుంది. 1428 మంది హోమ్ ఓటింగ్ హోమ్ ఓటింగ్ కోసం నమోదు చేసుకున్న 1523 మందిలో మొత్తం 1428 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం కూడా హోమ్ ఓటింగ్ కొనసాగుతుందని హోమ్ ఓటింగ్ ఇన్చార్జి విశ్వనాథన్ తెలిపారు. హోమ్ ఓటింగ్ కోసం భీమిలిలో 9, విశాఖ తూర్పులో 6, దక్షిణలో 6, ఉత్తరంలో 12, పశ్చిమంలో 8, గాజువాకలో 5, పెందుర్తిలో 5 టీములు పని చేశాయి. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశారు. -
పాలిసెట్ ఫలితాల్లో నంబర్ 1
● మెరిసిన విశాఖ విద్యార్థులు ● రాష్ట్ర స్థాయిలో ఇద్దరికి ఒకటో ర్యాంకు ● టాప్టెన్ ర్యాంకుల్లో ముగ్గురికి చోటు ● 12,147 మందిలో 10,813 మంది ఉత్తీర్ణత విశాఖ విద్య/తగరపువలస: పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష(పాలిసెట్–2024)లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాకు చెందిన ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించడంతో పాటు ర్యాంకుల సాధనలోనూ టాప్లో నిలిచారు. సాంకేతిక విద్యాశాఖ అధికారులు బుధవారం పాలిసెట్ ఫలితాలు ప్రకటించారు. జిల్లా నుంచి 12,147 మంది ప్రవేశ పరీక్షకు హాజరు కాగా.. వీరిలో 10,813 మంది అర్హత సాధించారు. తద్వారా జిల్లాలో 89.02 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బాలబాలికల వారీగా చూసిన ట్లయితే 7,265 మంది బాలురు పరీక్ష రాయగా, 6,379 మంది (87.80 శాతం) అర్హత సాధించారు. 4,882 మంది బాలికలు పరీక్ష రాయగా, వీరిలో 4434 మంది (90.82 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పాస్ పర్సంటేజీలో రాష్ట్ర సగటు 87.61 శాతం కాగా.. విశాఖ జిల్లాలో అంతకుమించి (89.02 శాతం)ఉత్తీర్ణత నమోదు చేసుకోవడం విశేషం. ఈ ఏడాది రాష్ట్రంలో జిల్లా నుంచే ఎక్కువ మంది పాలిసెట్కు హాజరుకాగా.. అదే స్థాయిలో అర్హత సాధించడం విశేషం. సిరినివాస్ అన్నమరాజు నగర్(కొమ్మాది)కు చెందిన పోతుల జ్ఞాన హర్షిత, సంగివలస శశి స్కూల్ విద్యార్థి శీలం శ్రీరామ్ భవదీప్ రాష్ట్రస్థాయి ఒకటో ర్యాంకును కై వసం చేసుకున్నారు. శీలం ఐశ్వర్య రాష్ట్ర స్థాయిలో ఏడో ర్యాంకు దక్కించుకుంది. జిల్లాలో 6,730 సీట్లు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని 15 పాలిటెక్నిక్ కాలేజీల్లో 6,730 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా మెకానికల్ 1,716 సీట్లు, ఆ తర్వాత సీఎంఈ 1,419, ఈఈఈ 1,321, ఈసీఈ బ్రాంచిలో 990 సీట్లు ఉన్నాయి. జిల్లా విద్యార్థులకు టాప్ కాలేజీల్లోనే సీట్లు లభిస్తాయని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా నోడల్ అధికారి డాక్టర్ కె.నారాయణరావు వెల్లడించారు. ప్రసిద్ధ ఐఐటీలో చదువుతా.. పాలిసెట్లో 120 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్నాను. దేశంలోనే పేరు పొందిన ఐఐటీలో చదవాలనుకుంటున్నాను. మా నాన్న అప్పలనాయుడు బోయిపాలెం జెడ్పీ హైస్కూల్లో సోషల్ అసిస్టెంట్గా, అమ్మ ప్రగతి చోడవరం నీటి పారుదల శాఖలో డివిజనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. సబ్జెక్ట్పై అవగాహన కారణంగా ప్రత్యేకంగా ప్రిపేర్ కాలేదు. – పోతుల జ్ఞానహర్షిత, కొమ్మాది -
సైబర్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్ ప్రారంభం
అల్లిపురం: నగర పోలీసు కమిషనరేట్లో పోర్టు సీఎస్సార్ నిధులతో నూతనంగా నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆన్ సేఫ్టీ (సైబర్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్)ను పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు ప్రారంభించారు. బుధవారం కమిషనరేట్లో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవిశంకర్ సమక్షంలో పోర్టు చైర్మన్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం ఆయనకు నగర శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న తీరును ప్రత్యక్షంగా వివరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన బాడీ వార్క్ కెమెరాల మానటరింగ్ విధానం, కంట్రోల్ రూమ్ పనితీరును ఆయనకు వివరించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశా దివ్యాంగ్ సురక్ష హెల్ప్ లైన్ విధానాన్ని వివరించారు. జేసీపీ ఫకీరప్ప మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన ల్యాబ్ సైబర్ క్రిమినల్స్ను పట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సైబర్ ల్యాబ్ ఏర్పాటుకు నిధులు అందజేసిన పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తుకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. -
గణుడు
అక్రమాలమూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గణబాబు ఏనాడూ పేదల కోసం ఆలోచించలేదు. ఏ ఒక్కరికి ఒక్క ఇళ్లు ఇప్పించలేదు కానీ తన సొంత ఇంటిని అందమైన భవనంగా నిర్మించేందుకు మాత్రం సిద్ధమయ్యారు. 22ఏలో ఉన్న తన సొంత ఇంటి స్థలాన్ని ఆ రికార్డుల నుంచి తొలగించి ఇంద్రభవనాన్ని నిర్మిస్తున్నారు. పైగా రెండేళ్ల క్రితం పాత ఇంటిని కూల్చే సమయంలో డెబ్రిస్ తరలింపునకు నిబంధనలకు విరుద్ధంగా జీవీఎంసీ వాహనాల్ని వినియోగించడం కూడా పెద్ద దుమారమే లేపింది. ఇంటి నిర్మాణ సమయంలోనూ జీవీఎంసీకి చెందిన ప్రొక్లెయిన్లను వినియోగించారు. గోపాలపట్నంలో ఉన్న జీవీఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను సైతం సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారంటూ గతంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తాళాల్ని శాప్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంచరపాలెం సమీపంలో రైల్వే నిధులతో అండర్ పాసేజ్ నిర్మిస్తే.. తానే నిర్మించానంటూ హడావిడి చేయడంపైనా విమర్శలు చెలరేగాయి. ఇక గోపాలపట్నంలో తనకు చెందిన నరసింహ థియేటర్ను రెవెన్యూ స్థలాన్ని కొంత మేర ఆక్రమించి నిర్మించారన్న ఫిర్యాదులూ గణబాబుపై ఉన్నాయి. గణబాబు ఇంటి డెబ్రిస్ జీవీఎంసీకి చెందిన ఎం80 లోడర్తో టిప్పర్లో లోడింగ్ చేస్తున్న దృశ్యంసాక్షి, విశాఖపట్నం : భూకబ్జాలు.. ఆక్రమణలు.. అక్రమాలు.. దౌర్జన్యాలు.. దందాలు.. పర్సంటేజీలు.. ఇవీ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు (గణబాబు) పాలనలో మనకు గుర్తొచ్చేవి. ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు, వాగులు, చెరువులు, గుట్టలన్నీ ఆయన వశమైపోయాయి. తన బంధుగణం, అనుచరగణంతో కబ్జా కాండకు తెరతీశారు. తన పరిధిలో ఏ పని జరిగినా పర్సంటేజీ వసూలు చేసిన ఆయన ఇప్పుడు సంప్రదాయనీ.. శుద్ధ్దపూసనీ.. అన్నట్లుగా ప్రజల ముందుకొస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. గణబాబు టీడీపీ తరఫున 1999లో పెందుర్తి, 2014, 2019లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొన్నిచోట్ల అడ్డగోలుగా లే అవుట్లు వేసి అమ్మేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఇళ్లనే కట్టేశారు. లేఅవుట్లను సెంటు రూ. 5–7 లక్షలకు విక్రయించగా, ఇళ్లు నిర్మించుకున్న వారి నుంచి రూ.5 నుంచి 10 లక్షల వరకు వసూలు చేసేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వాటర్ బాడీస్గా పరిగణించే చెరువులు, వాగులు, వంకలు. గెడ్డలు రూపు కూడా మార్చడానికి వీల్లేదు. కానీ సుప్రీం నిబంధనలను సైతం బేఖాతరు చేస్తూ పశ్చిమ టీడీపీ నేతలు దర్జాగా చెరువుకే ఎసరు పెట్టారు. వెంకటాపురం రెవెన్యూ పరిధిలో 53.98 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో కొంతభాగాన్ని వీరు కబ్జా చేసేశారు.. పాత 66 వార్డు పరిధిలోని సంతోష్నగర్ చెరువు గర్భాన్ని సైతం గణబాబు అనుచరులు వదల్లేదు. జీఎస్టీ.. గణబాబు స్పెషల్ ట్యాక్స్ నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా.. కచ్చితంగా ఎమ్మెల్యే ట్యాక్స్ చెల్లించాల్సిందే. దాన్ని కూడా జీఎస్టీ అని చెప్పేవారు. అంటే గణబాబు స్పెషల్ ట్యాక్స్ అని పేరు కూడా పెట్టేశారు. 2017లో గజం లక్షల్లో పలుకుతున్న విశాఖ నగరంలో చెరువుని చదును చేసి ఆ ప్రాంతంలో షెడ్తో సహా గజం రూ.4 వేలుకే అంటూ ఎరచూపడంతో అమాయకులు ఎగబడ్డారు. చెరువులో ప్లాట్లు ఎలా విక్రయిస్తారని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే మీ సంగతి చూస్తాం.! అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కబ్జాలు, దందాల ద్వారా వసూలు చేస్తున్న అక్రమార్జనలో తెలివిగా అధికారులకు సైతం వాటాలిస్తూ వారిని కట్టడి చేసేశారు. శుద్ధపూసలా కలరింగ్ 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక గణబాబు అక్రమాల పర్వం ముగిసినట్లు కలరింగ్ ఇచ్చారు. తాను శుద్ధపూసగా బిల్డప్ ఇస్తూ.. ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నించారు. తన అనుచరుల ద్వారా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలకు పాల్పడేలా చేయడం.. ఎవరైనా బాధితులు వస్తే వారిని ఓదార్చుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చేవాళ్లు. ఫిర్యాదులిచ్చిన వారు వెళ్లగానే వారి అనుచరులతో బెదిరింపులకు పాల్పడేవారు. ఇలా అనుచరగణంతో దందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గణబాబు ప్రోత్సహిస్తుండడంతో నియోజకవర్గ ప్రజలు రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించిన పని కానీ, ప్రైవేటు పని కానీ ఏం జరిగినా పర్సంటేజ్ రూపంలో గణబాబు ట్యాక్స్ వసూలు చేయడాన్ని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడారి ఆనంద్కుమార్ బ్రేక్ వేశారు. ఏ పని ఉన్నా తనకు చెప్పాలని ప్రజలకు భరోసా ఇవ్వడంతో ప్రజలంతా గణబాబును మరిచిపోతున్నారు. మంచినీటి ప్రాజెక్టుకూ మోకాలడ్డు తనకు ఓటేసి గెలిపించిన నలుగురికి మంచి జరుగుతుందంటే.. తన జేబులో డబ్బులు ఖర్చైనా ఫర్వాలేదనుకుంటారు ఏ ఎమ్మెల్యే అయినా. కానీ గణబాబు రూటు మాత్రం సెపరేటు. మూడేళ్ల క్రితం జీవీఎంసీ ఆధ్వర్యంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రూ.336 కోట్ల నిధులతో నార్త్వెస్ట్ ఏరియాకు నీటి సరఫరా జరిగేలా నార్త్వెస్ట్ ప్రాజెక్టు ద్వారా నిరంతర మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులు జరిగాయి. ఈ పైప్లైన్ పనులు చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గణబాబు ఎంటర్ అయ్యారు. నాయుడుతోట, ఆకుల గౌతమ్నగర్ కాలనీ, సాయి మాధవ్ నగర్ సమీపంలో బీఆర్టీఎస్ రోడ్డు వెంబడి జరుగుతున్న ఈ నీటి సరఫరా పనులు వెంటనే నిలిపేశారు. పైప్లైన్ వేసే ప్రాంతంలో తనకు చెందిన స్థలాలుండటంతో 400 శాతం టీడీఆర్లు ఇచ్చేంతవరకూ పనులు జరిపేది లేదంటూ తన పార్టీ నేతల్ని రెచ్చగొట్టి నిలిపేసిన వ్యవహారాలూ నడిపారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కబ్జాల పర్వం ప్రతిపక్షంలో అనుచరుల ద్వారా దందాలు నియోజకవర్గంలో చెరువులు మింగేసిన టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు మీటరు కావాలన్నా పర్సంటేజీలు ప్రజల వద్ద శుద్ధపూస కబుర్లు సొంత భవన నిర్మాణానికి జీవీఎంసీ వాహనాల తరలింపుప్రభుత్వ రహదారికి తండ్రి పేరు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రామ్మూర్తి పంతులుపేటలో పోర్టు ట్రస్టుకు చెందిన ఏడున్నర ఎకరాల భూమిలో ఏకరానికి పైగా ఎమ్మెల్యే గణబాబు బంధువులు, అనుచరులు కబ్జా చేశారు. ఎమ్మెల్యే తన అధికారంతో ఈ ప్రాంతంలో మెయిన్రోడ్డును తలపించే స్థాయిలో రూ.30 లక్షలతో 40 అడుగుల వెడల్పుతో పక్కా సీసీ రోడ్డు నిర్మించేశారు. విచిత్రంగా ప్రభుత్వ నిధులతో వేసిన ఈ రోడ్డుకు ఎమ్మెల్యే తండ్రి పెతకంశెట్టి అప్పల నరసింహం పేరు పెట్టేశారు. నియోజకవర్గంలోని సీలింగ్ భూములు, పోరంబోకు భూములు మడతెట్టేశారు. ఇలా నియోజకవర్గమంతా తన కంబంధ హస్తాల్లోకి తీసేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం రాగానే వసూలు చేసిన సొమ్మంతా ఓటర్లకు తాయిలాల కోసం సిద్ధం చేస్తున్నారు. ఆ నలుగురితోనే దందాలు పశ్చిమలో ఎవరైనా కొత్తగా భవనాలు నిర్మించారంటే గణబాబుకు కప్పం కట్టాల్సిందే. లేదంటే ఆ నలుగురూ వాలిపోతారు.. వార్నింగ్ ఇస్తారు. అప్పటికీ లొంగకపోతే కూల్చేయడానికీ వెనుకాడరు. తర తమ అనే బేధం కూడా లేకుండా డబ్బులిస్తేనే గణబాబు దగ్గర ఏదైనా పని జరుగుతుందన్నది పశ్చిమ ఎరిగిన వాస్తవం. స్థానిక కార్పొరేటర్లు కూడా ఫైల్ మూవ్మెంట్ చేసి గణబాబుకు సహకరించాల్సిందేనని, లేదంటే ఆ పని పూర్తి కాదని వాపోతుండటం గమనార్హం. ఆయన నివాసం వద్దే ఉన్న స్థలాన్ని ఓ కమర్షియల్ సంస్థకు అద్దెకు ఇవ్వడం, ప్రభుత్వ స్థలంలో సినీ థియేటర్ నిర్మించడం ఇలా.. ఆ నలుగురి సహకారంతో గణబాబు భారీగానే అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు.వ్యాపారులకు బెదిరింపులు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతో గణబాబు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నాడు. ఇందులో భాగంగా వ్యాపారుల నుంచి డబ్బులు వసూళ్లకు తెరతీశారు. డబ్బులు ఇవ్వకపోతే మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రచారం పేరుతో గణబాబు వస్తున్నాడంటే వ్యాపారులు బెదిరిపోతున్నారు. చిన్న చిన్న దుకాణదారులు హడలిపోతున్నారు. బడా బంగారు వ్యాపారులు భయపడుతున్నారు. పచ్చ అనుచరులను నాలుగు బ్యాచ్లుగా విభజించి.. వస్త్ర వ్యాపారులను ఒక బ్యాచ్, బంగారు వ్యాపారులను మరో బ్యాచ్, కిరాణా దుకాణాలవైపు ఇంకో బ్యాచ్, మిగిలిన వాటిని కవర్ చేస్తూ మరో బ్యాచ్ పశ్చిమ నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయి. ఒక్కో వ్యాపారి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఆర్పీలకు ప్రలోభాలకు గురిచేయగా.. వారు ఎదురుతిరగడంతో ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. -
రోడ్లు @ రూ 22.34 కోట్లు
నియోజకవర్గంలో రూ.22.34 కోట్లతో వార్డుల్లో ప్రధాన రహదారులతో పాటు వీధి రోడ్లు నిర్మించారు. రూ 2.35కోట్లతో చినగదిలి కూడలి నుంచి సూర్యతేజానగర్ వరకు అర కిలోమీటర్ పొడవున 20 అడుగుల వెడల్పు రోడ్డును 60 నుంచి 80 అడుగుల రోడ్డుగా విస్తరించారు. ● రూ.1.99కోట్లతో హనుమంతవాక, కై లాసగిరి కూడలి వరకు రోడ్డు విస్తరించారు. సుమారు 1,200 మీటర్ల పొడవున్న ఈ రోడ్డును అవరమైనచోట్ల విస్తరించి.. ఇరుపక్కలా కాలువలు, పాత్వేలు నిర్మాణం చేపట్టారు. ● రూ.4 కోట్ల జీవీఎంసీ నిధులతో సీతకొండ వద్ద బీచ్రోడ్డును విస్తరించారు. సీతకొండ మలుపు వద్ద వైఎస్సార్ సీ వ్యూ పాయింట్ నుంచి సీతకొండ చివర వరకు సుమారు 400 మీటర్ల పొడవున 30 అడుగుల రోడ్డును 80 అడుగులకు విస్తరించారు. ● రూ.6 కోట్ల వీఎంఆర్డీఏ నిధులతో జాతీయరహదారిపై విశాఖవేలీ స్కూల్ కూడలి నుంచి సీతకొండ చివర బీచ్రోడ్డు వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున డబుల్ రోడ్డు నిర్మించారు. ● రూ.7కోట్లతో పెదగదిలి నుంచి అంబేడ్కర్ కూడలి, అంబేడ్కర్ కూడలి నుంచి సూర్యతేజానగర్ వరకు డబుల్ రోడ్లు, ఫుట్పాత్లు, కాలువల పనులు ప్రారంభించారు. ● అన్ని వార్డుల్లోని వీధుల్లో మరో రూ.3 కోట్లతో సీసీ, బీటీ రోడ్లు నిర్మించారు. -
రేపే అప్పన్న చందనోత్సవం
7వ పేజీ తరువాయిఘాట్రోడ్డులో బస్సులు కిందకు దిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ● 10వ తేదీ తెల్లవారుజాము నుంచి పాత గోశాల జంక్షన్, పాత అడవివరం జంక్షన్ల నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే సింహగిరిపైకి భక్తులను అనుమతిస్తారు. దేవస్థానం అద్దె చెల్లించిన 45 ఆర్టీసీ బస్సులు, 40 మినీ బస్సులు, 10 ఇన్నోవాల్లో భక్తులను రెండవ ఘాట్లో నుంచి ఉచితంగా సింహగిరికి చేరుస్తారు. తొలి ఘాట్రోడ్డులో నుంచి కిందకి తీసుకొస్తారు. ఉచిత దర్శనం, 300 టికెట్లు వారికి ఆర్టీసీ బస్సులు, రూ.1000, రూ.1500 టికెట్లు ఉన్న వారికి మినీ బస్సులు సిద్ధం చేశారు. ● రూ. 300, రూ.1000, రూ.1500 టికెట్లపై వాటర్మార్క్, బార్కోడ్తో రూపొందించిన హోలోగ్రామ్ అతికించి ఉంటుంది. టెంపుల్ కాపీ, భక్తుడి కాపీతో రూపొందించబడి ఉంటుంది. రూ.300, రూ.1000 టికెట్లను క్యూలో చెక్ చేసేందుకు నాలుగు స్కానర్లు, రూ.1500 టిక్లెను క్యూలో చెక్ చేసేందుకు రెండు స్కానర్లు ఏర్పాటు చేశారు. ● కొండపై, కొండ దిగువన తాగునీటి సదుపాయం, పారిశుధ్య నిర్వహణ పనులు చేస్తున్నారు. ● పాత గోశాల జంక్షన్, పాత అడవివరం జంక్షన్ల వద్ద ప్రసాదాలు విక్రయిస్తారు. ఈ మేరకు 50 వేల లడ్డూలను సిద్ధం చేశారు. ● దేవస్థానం ఉద్యోగులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు, దివ్యాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5గంటల వరకు ప్రత్యేక దర్శన సమయం కేటాయించారు. ● ఒకేసారి 29,300 మంది భక్తులు వేచి ఉండేలా సింహగిరిపై 46 వేల రన్నింగ్ ఫీట్ మేర దర్శనాల క్యూలను రూపొందించారు. ఉచిత దర్శనం క్యూ 20 వేల రన్నింగ్ ఫీట్, రూ.300 టికెట్టు క్యూ 13 వేల రన్నింగ్ ఫీట్, రూ.1000 దర్శనం క్యూ 9 వేల రన్నింగ్ ఫీట్, రూ.1500 టికెట్టు క్యూ 4 వేల రన్నింగ్ఫీట్ మేర సిద్ధం చేశారు. ● భక్తులకు నీడ కోసం 56 వేల ఎస్ఎఫ్టీ మేర పర్మి నెంట్ షెడ్లు ఉండగా.. చందనోత్సవం సందర్భంగా అదనంగా మాడ వీధి, బస్టాండ్, ఉత్తర రాజగోపురం ఎదురుగా అదనంగా మరో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీఐ షీట్లతో షెడ్డులను వేశారు. ● సింహగిరిపై 145, కొండదిగువ 100 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ● స్వచ్ఛంద సంస్థలు తాగునీరు, మజ్జిగ, శీతల పానియాలు, అల్పాహారాలు, స్నాక్స్ అందించనున్నాయి. ● దర్శనానంతరం సింహగిరిపై అన్నదాన భవనం వద్ద గోపాల్ బాబు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా భక్తులకు పులిహోరా, దద్దోజనం, పొంగలి, కదంబం, చక్కెరపొంగలి అందించనున్నారు. ● కేశఖండనశాలకు వెళ్లే భక్తులు కేవలం సింహగిరిపై లోవతోట ప్రాంతం నుంచి మాత్రమే వెళ్లేలా ఏర్పాటు చేశారు. ● సింహగిరిపైన 6 ప్రదేశాల్లోను, కొండదిగువ ఆరు ప్రదేశాల్లోను, మెట్లమార్గంలో ఒకటి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. కొండపైన యాత్రిక సదన్లో ఆరు పడకల తాత్కాలిక ఆస్పత్రి సిద్ధం చేశారు. కొండపైన 3 అంబులెన్స్లు, కొండ దిగువ 7 అంబులెన్స్లు, 108 వాహనాలు అందుబాటులో ఉంటాయి. ● సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో మొత్తం 2,590 మంది సివిల్ పోలీస్, నాలుగు ప్లాటూన్ ఏఆర్, స్పెషల్ రోప్పార్టీలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ● క్యూల్లో భక్తులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే బయటకు తీసుకొచ్చేందుకు ఎమర్జెన్సీ గేట్లు సిద్ధం చేశారు. ● సహస్ర ఘటాభిషేకం నిర్వహణకు సంబందించి ఉత్తర రాజగోపురం, దక్షిణ రాజగోపురం వద్ద ప్రత్యేకంగా బ్రిడ్జిలు వేశారు. ● నిఘా కోసం 206 సీసీ కెమెరాలను అమర్చారు. -
ఎన్నికల నిర్వహణలో అప్రమత్తం
● ఆర్వోలకు దిశానిర్దేశం చేసిన ఎన్నికల అధికారి మల్లికార్జున మహారాణిపేట: ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఆర్వోలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎన్నికల సన్నద్ధతపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెక్టోరల్, రూట్ అధికారులతో సమన్వయం వహించాలని సూచించారు. ఏ చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదని, అన్నింటికీ వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓటు వేసేందుకు వచ్చిన వారందరికీ సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ, ఈవీఎంల తరలింపు తదితర అంశాలపై సూచనలు చేశారు. పోలింగ్ రోజున ఓటర్లకు సహాయం అందించే విధంగా హెల్ప్ డెస్కును ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వెలుపలా పోటీ చేసే అభ్యర్థులతో కూడిన పోస్టర్, ఓటరు గైడ్ పత్రాలను గోడకు అతికించాలని సూచించారు. ప్రకటనలకు అనుమతి తప్పనిసరి పోలింగ్ ప్రక్రియకు 48 గంటలముందే అభ్యర్థులు ప్రచారాలు నిలిపివేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎటువంటి ప్రచారాలు చేయకూడదన్నారు. పోలింగ్ రోజు, పోలింగ్కు ముందు రోజున పత్రికల్లో ప్రచురించాలనుకునే ప్రకటనలకు తప్పకుండా ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ పలు అంశాలపై ఆర్వోలకు సూచనలు చేశారు. సమావేశంలో ఎంసీసీ నోడల్ అధికారి సీఎం సాయికాంత్ వర్మ, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి కె.ఎస్. విశ్వనాథన్ వివిధ నియోజకవర్గాల ఆర్వోలు, ఏఆర్వోలు తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ భక్తులకే పెద్దపీట
● చందనోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు ● రాజకీయపరమైన ప్రోటోకాల్ దర్శనాల్లేవ్.. ● కలెక్టర్ మల్లికార్జున వెల్లడి మహారాణిపేట: సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది చందనోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున వెల్లడించారు. అంతరాలయ దర్శనాలు రద్దు చేశామని, ఎలాంటి రాజకీయపరమైన ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఉండవని స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్తో కలిసి బుధవారం ఆయన అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లను వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామని, ఇందులో భాగంగా ఆరు కిలోమీటర్ల మేర బారికేడ్లు వేశామన్నారు. క్యూలో భక్తుల రద్దీ ఎక్కువ కాకుండా కొన్ని చోట్ల హోల్డింగ్ పాయింట్లు పెట్టామన్నారు. భక్తులకు తాగునీరు అందించేందుకు 160 ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టామన్నారు. క్యూలో ఎండ వేడిమి లేకుండా సుమారు 29,500 మంది భక్తులకు సరిపడా షామియానాలు ఏర్పాటు చేశామని వివరించారు. టికెట్లను స్కాన్ చేసేందుకు అనువుగా స్కానర్లను సమకూర్చామని, టికెట్లు రీ సైక్లింగ్ జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. లైన్ల మధ్యలో ఎవరూ చొరబడకుండా తగిన జాగ్రత్తలు చేపట్టామన్నారు. 250 బయోటాయిలెట్లు, 60 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సుమారు లక్ష నుంచి లక్షా యాభై వేల వరకు భక్తులు రావొచ్చని అంచనా వేశామని, ఆ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని విభాగాల సమన్వయంతో చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. 10వ తేదీ తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటల వరకు అనువంశిక ధర్మకర్తలు, దేవదాయ శాఖ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించే వారికి మాత్రమే అంతరాలయ దర్శనాలు ఉంటాయన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఇందులో పది శాఖల అధికారులు ఉంటారన్నారు. రాజకీయ ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు చందనోత్సవం సందర్భంగా వచ్చే భక్తులను ప్రభావితం చేసేలా ప్రచారాలు చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మల్లికార్జున హెచ్చరించారు. మతపరమైన ప్రాంతాల్లో ఎలాంటి రాజకీయ ప్రచారాలు చేయకూడదని స్పష్టం చేశారు. దీని పర్యవేక్షించేందుకు అనువుగా ఎంసీసీ బృందాలను నియమిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని పోలీసు కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు. కొండ దిగువన, కొండపైన రెండు పోలీసు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడిక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సీనియర్ పోలీసు అధికారులను నియమించామన్నారు. సమావేశంలో ఈవో శ్రీనివాసమూర్తి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్, ఏడీసీ రామచంద్రమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గెడ్డ పనులు @ రూ.14.78 కోట్లు
జీవీఎంసీ 11, 12 ,13 వార్డుల పరిధిలో రూ.14.78 కోట్లతో గెడ్డ పనులు పూర్తయ్యాయి. విశాఖ కేంద్ర కారాగారం ఎదురుగా రామకృష్ణాపురంలో అన్నీ రేకుల షెడ్లే ఉన్నాయి. ఈ గ్రామాన్ని ఆనుకుని లోతైన క్వారీ చెరువు ఉంది. వర్షం పడినప్పుడు గ్రామానికి సమీపంలోని కంబాల కొండలు వెనుక భాగం నుంచి వచ్చిన వరద నీరు గ్రామంలోకి చేరుతుంది. రూ.9 కోట్లతో సుమారు కిలోమీటర్ పొడవున గెడ్డ అడుగున కాంక్రీట్, ఇరు పక్కలా ఎత్తయిన కాంక్రీట్ గోడలు నిర్మించి సమస్యకు పరిష్కారం చూపారు. రూ.5.50 కోట్లతో శ్రీహరినగర్ నుంచి తోటగరువు కూడలి వరకు సుమారు అర కిలోమీటర్ పొడవున ప్రధాన గెడ్డ ఆధునికీకరించారు. సంతపాలెంలో రూ.28 లక్షలతో గెడ్డ మరమ్మతు పనులు జరిపించారు. -
టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలి
సీతమ్మధార (విశాఖ ఉత్తర): మహిళలపై దాడులకు తెగపడ్డ టీడీపీ గూండాలు, నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ, విప్ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ నాయకుల ఆగడాలను ఖండిస్తూ బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి దళిత నేత,హోం మంత్రి తానేటి వనితపై ఇంటిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. మాచర్లలో ఎమ్మెల్యే పిఎ్నల్లి రామకృష్ణ సతీమణి రమాదేవిపై , విజయవాడలో దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నేత బోండా ఉమా కుమారుడిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎచ్చెర్లలో మహిళ నాయకురాలి హిమబిందుపై టీడీపీ నాయకుల కవ్వింపు చర్యలు వారి ఓటమికి సంకేతాలు అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆర్థికంగా, రాజకీయంగా సముచిత స్థానం కల్పించారని చెప్పారు. దాంతో మహిళా లోకం జగన్మోహన్రెడ్డికి అండగా ఉందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్మాదిగా తయారయ్యాడని దుయ్యబట్టారు. పథకాలు అందకుండా బాబు గ్యాంగ్ కుట్రలు టీడీపీ నాయకులు, వారి తొత్తులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి జగనన్న చేయూత, విద్యదీవెన పథకాలు ఆపేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఫ్రస్టేషన్లో జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకే చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్నాడని ఆమె ధ్వజమెత్తారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మహిళా తహసీల్దార్ పై దాడి చేసిన సంఘటనను మహిళాలోకం మరవక ముందే.. మళ్లీ పచ్చగ్యాంగ్ మహిళలపై దాడులకు తెగబడడం దుర్మార్గమన్నారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తీవ్ర పరిణమాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలకు వెళ్లాలని హితవు పలికారు. మహిళలపై దాడులు చేయడం దుర్మార్గం అధికారం రాదనే టీడీపీ నేతల బరితెగింపు ఎమ్మెల్యే వరదు కల్యాణి ధ్వజం -
రూ.కోట్ల నిధులతో అభివృద్ధి
తూర్పు నియోజకవర్గంలో రూ.కోట్లతో నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి. రోడ్లు, కాలువలు, గెడ్డలు, సామాజిక భవనాలు, కల్యాణ మండపాలు నిర్మించాం. వైద్య సేవలు మెరుగుపరిచేందుకు యూపీహెచ్సీలు ఏర్పాటు చేశాం. వివిధ సంక్షేమ పథకాల ద్వారా నియోజకవర్గంలో అర్హులైన ప్రజలందరికీ మంచి జరిగింది. 20,000 మందికి పైగా ఇళ్ల పట్టాలు అందించాం. గతంలో ఏ ప్రభుత్వం ప్రజలకు ఇంత మేలు చేయలేదు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. – ఎంవీవీ సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి -
భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
సాక్షి, విశాఖపట్నం: బాబూ.. శ్రీభరత్...! సూటిగా సుత్తిలేకుండా మాట్లాడుకుందాం... ● విద్యా సంస్థల పేరుతో రూ.500 కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని తాత కబ్జా చేసి.. నగర ప్రతిష్టను దిగజార్చినప్పుడు విశాఖపట్నం గుర్తుకు రాలేదు. ● దేవాలయంలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని దెయ్యాల కొంపగా అభివర్ణిస్తూ.. విద్యల నగరం పరువును బంగాళాఖాతంలో కలిపేసినప్పుడూ విశాఖ గుర్తుకు రాలేదు. ● రాజధానిగా విశాఖ నగరం బెస్ట్ అని శివరామకృష్ణన్ కమిటీ ప్రకటించినా.. చంద్రబాబు వైజాగ్ ఎదగకూడదని భావించి అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడూ విశాఖ గుర్తుకు రాలేదు... ● వీఎంఆర్డీఏకు చెందిన భూముల్ని దఫదఫాలుగా విక్రయించి.. రూ.1,600 కోట్ల వైజాగ్ సంపదని చంద్రబాబు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టినప్పుడూ విశాఖ గుర్తుకు రాలేదు.. ● నిన్నటికి మొన్న.. నీ సొంత వర్సిటీలో ఫీజుల్ని అమాంతం 40 శాతం పెంచేందుకు ప్రయత్నించినప్పుడూ విశాఖలో ఉన్న విద్యార్థులు గుర్తుకు రాలేదు.. ● 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో అదీ.. పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో మాత్రం.. వైజాగ్ ఓ గ్రోత్ సిటీ అనీ.. రాజధానిగా అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని మాత్రం హఠాత్తుగా గుర్తొచ్చేసింది. ● దేశ, విదేశాలకు చెందిన ప్రజలు, ప్రముఖులు వాహ్.. విశాఖ అని కొనియాడుతున్నప్పుడు గుర్తుకు రాని.. విశాఖపట్నం.. ఓటమి భయం ముంచుకొచ్చినప్పుడు మాత్రం తెగ గుర్తొచ్చేసింది.. ఏం భరత్.. ఇదేనా నీ విజ్ఞత.? ఇదేనా విశ్వసనీయత.? ఇదేనా విశాఖకు నీవిచ్చే విలువ.? ● 2019 డిసెంబర్లో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించినప్పుడు.. శభాష్.. మంచి నిర్ణయమని మెచ్చుకోవడానికి కూడా ఇష్టపడని తమరికి.. ఇప్పుడు మాత్రం అమాంతంగా ప్రేమ ఉప్పొంగిపోతోందంటే ఆశ్చర్యమేస్తోందయ్యా.. ● చంద్రబాబులా ఏ ఎండకాగొడుగు పడుతూ.. పూటకో అబద్ధం.. మాట మాటకో మాయా మోసం అలవాటైనట్లుగా ఉన్నాయి. నిజమే మరి.. తమరూ ఆ తాను ముక్కే కదా.. ఆ అలవాట్లు రాకుండా ఎలా ఉంటాయి.? ● ఏమన్నావ్.. ఏమన్నావ్.?? ‘ఇవాళ అమరావతి అభివృద్ధి చేసేందుకు మన దగ్గర అంత డబ్బుల్లేవు. విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఏపీ అభివృద్ధి చెందుతుంది. అమరావతి డెవలప్ చేయడానికి పెట్టుబడి చాలా అవసరం. అంత పెట్టుబడి పెట్టే స్థాయిలో ఏపీ ప్రభుత్వం లేదు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ హయాంలో మొత్తం అప్పులు మూడున్నర లక్షల కోట్లు. మనకి ఇవాళ వేల కోట్లు అమరావతిలో పెట్టే పరిస్థితిలో లేము. మనం చూసేది ఏంటంటే.. మనకి గ్రోత్ ఇంజిన్ ఏంటి.? విశాఖపట్నం మన గ్రోత్ ఇంజిన్. అమరావతి అనేది 20 ఏళ్ల తర్వాతే సాధ్యమవుతుంది.’’ ● నిజంగానే ఈ మాటలు నీ గుండెల్లోంచే వచ్చాయా భరత్.? ఇన్నాళ్లూ అమరావతి అందమైన రాజధాని.. అంటూ బాబుతో కలిసి భజన బృందంలో తానా అంటే తందానా అంటూ పల్లవి కలిపిన తమరు.. ఎన్నికలు రాగానే ప్లేటు ఫిరాయించడం భావ్యమేనా భరత్.? ఈ మాటలు కూడా కేవలం ఓట్లు రాల్చుకునేందుకు పలికిన చిలక పలుకులే తప్ప.. గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు కావన్నది మీ మాటలను బట్టి తెలుస్తోంది. ఎందుకంటే.. తమరి విశ్వసనీయత ఏపాటిదో.. 2019 ఎన్నికల్లోనే పసిగట్టేశాం. అందుకే ఇంటికి పరిమితం చేశాం. ● ఒక్క విషయం గుర్తుంచుకో భరత్... వేల కేసులు వేసి.. విశాఖ రాజధానిని ఆపేందుకు కుట్రలు పన్నుతున్నా బెదరలేదు.. అదరలేదు. చెప్పిన మాట చెప్పినట్లుగా అమలు చేస్తాననీ.. 2024లో ఘన విజయం సాధించి.. విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేసి.. ఇక్కడి నుంచే పాలన సాగిస్తానని ఢంకాపథంగా చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు కదా.. అదీ మాటంటే.. మాట మనసు లోతుల్లోంచి రావాలి. లక్షల మంది ఉన్న సమూహంలో మాట్లాడుతున్నా.. ఒక్కొక్కరినీ పలకరించినట్లు మాట్లాడుతున్నట్లుండాలి. అలా మాట్లాడాలంటే.. ప్రతి ఒక్కరి మనసు తెలిసుండాలి. వారి కష్టసుఖాలు ఎరిగి ఉండాలి. ఆ ప్రాంతంపై ఆదరాభిమానాలుండాలి. అది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యం. అందుకే.. ఆయన విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పగానే.. కేవలం ఇక్కడికే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజానీకం మొత్తం చెప్పినట్లుగా.. గుండె లోతుల్లోకి వెళ్లిపోయింది. ఇది ఫిక్స్. ఇప్పుడు నువ్వొచ్చి.. కల్లబొల్లి కబుర్లు చెబితే.. నమ్మేవారెవ్వరూ లేరు భరత్.. నీ మాటలు ఒక నాటకం.. నీ విజ్ఞత ఒక బూటకం. నీవు నడుస్తున్న నీ పార్టీ ఒక మాయా ప్రపంచం. ముందు అందులోంచి బయటపడు. అప్పుడే విశాఖ అంటే ఏమిటో అర్థమవుతోంది. ఇట్లు, విశాఖ ప్రజలు -
టీడీపీ బరితెగింపు
ఏయూక్యాంపస్: ఎన్నికల నిబంధనలను టీడీపీ నాయకులు కాల రాస్తున్నారు. విశ్వవిద్యాలయంలో పార్టీ ప్రచార వాహనాలతో బరితెగించి ప్రచారం చేస్తున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో వాహనంతో ప్రచారం చేశారు. ఇక్కడే ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంగణంలో స్పీకర్లతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రచారం చేశారు. ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బంది కలిగేలా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు మండిపడుతున్నారు. కాగా ఏయూ ఆవరణలో ఉన్న ప్రచార వాహనాన్ని ఏయూ సెక్యూరిటీ సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏయూ సీఎస్వో మహ్మద్ ఖాన్ టీడీపీ ఎన్నికల వాహనాన్ని నిలిపివేసి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ ఆదేశించారు. ఏయూ ఆవరణలో వాహనంతో ప్రచారం -
కై లాసగిరిపై సైన్స్ మ్యూజియం @ రూ.4.69 కోట్లు
రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూ.4.69 కోట్లతో కై లాసగిరిపై అధునాతనమైన సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం కై లాసగిరిపై తెలుగు మ్యూజియంకు వెళ్లే రహదారి పక్కన సుమా రు ఎకరం స్థలం కేటాయించారు. ఈ మ్యూజియంలో 3డీ ఆర్ట్ గ్యాలరీ, అగ్మెంటెడ్ రియాలటీ, సోలార్ ఎగ్జిబిట్స్, స్పేస్ ఎగ్జిబిట్స్(ఇస్రో), సిలికా విగ్రహాలు, సైన్స్ వర్కింగ్ మోడల్ తదితర ప్రదర్శనలు, పలు శాసీ్త్రయ థీమ్లు అందుబాటులో ఉంటాయి. కొద్ది నెలల్లో ఇది అందుబాటులోకి తీసుకురానున్నారు. -
No Headline
ఆరిలోవ: విశాఖ తూర్పు.. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నియోజకవర్గం. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇక్కడే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మసకబారిన నియోజకవర్గ ప్రగతి.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సారథ్యంలో అభివృద్ధిలో కొత్తరూపు సంతరించుకుంది. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో వేలాది మంది ప్రజలు లబ్ధి పొందారు. రోడ్లు అద్దాల్లా మెరుస్తున్నాయి. పార్కులు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. బస్బేలు ఆకర్షణీయంగా మారాయి. యూపీహెచ్సీల ద్వారా వైద్య సేవలు మెరుగయ్యాయి. కూడళ్లు జిగేల్ మంటున్నాయి. కల్యాణ మండపాలు, సామాజిక భవనాలు.. ఇలా ఒకటేమిటి.. విశాఖ తూర్పులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. -
సంక్షేమ పథకాల లబ్ధి ఇలా..
పథకం లబ్ధిదారులు లబ్ధి (రూ.కోట్లలో..) జగనన్న అమ్మఒడి 22,535 147.41 జగనన్న విద్యాదీవెన 11,712 41.79 జగనన్న వసతి దీవెన 9,885 11.22 వైఎస్సార్ ఆసరా 30,054 39.69 వైఎస్సార్ సున్నా వడ్డీ 32,640 7.80 టిడ్కో ఇళ్లు 1,200 52 జగనన్న హౌస్ సైట్స్ 20,066 జగనన్న తోడు 4,600 13.80 ఆరోగ్యశ్రీ 2,700 10 వైఎస్సార్ కల్యాణమస్తు 43 0.130 వైఎస్సార్ బీమా 60 0.88 వైఎస్సార్ పెన్షన్ కానుక 15,891 13.40 వైఎస్సార్ కాపు నేస్తం 720 3.24 వైఎస్సార్ వాహన మిత్ర 5,000 15 వైఎస్సార్ చేదోడు 2,320 6.96 వైఎస్సార్ చేయూత 15,224 85.63 వైఎస్సార్ మత్స్యకార భరోసా 120 0.12 వైఎస్సార్ లా నేస్తం 56 0.11 అర్చకులు, పాస్టర్లు, మౌలానాలు 42 0.063 ఈబీసీ నేస్తం 482 0.96 రైస్ కార్డులు 58,000 వైఎస్సార్ రైతు భరోసా 1,952 0.97 -
ఇదీ మార్పు
తూర్పు..విస్తరించిన సీతకొండ రోడ్డు● ‘విశాఖ తూర్పు’లో అభివృద్ధి జాడలు ● వేల కోట్లతో ఇంటింటా సంక్షేమం ● బాగుపడిన రోడ్లు.. దగ్గరైన వైద్యం ● పర్యాటకానికి మరింత మెరుగులు18 ఓపెన్ జిమ్లు @ రూ.90 లక్షలు నియోజకవర్గంలో రూ.90 లక్షలతో 18 చోట్ల ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. జీవీఎంసీ జోన్–2లో పరిధిలోని ఐదు వార్డుల్లో 7, జోన్–3 పరిధిలోని 10 వార్డుల్లో 11 ఓపెన్ జిమ్లు ఉన్నాయి. 8 యూపీహెచ్సీలు @ రూ.8 కోట్లు నియోజకవర్గంలో ఎనిమిది చోట్ల రూ.8కోట్లతో వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(యూపీహెచ్సీ)లు ఏర్పాటు చేసి వైద్యం చేరువచేశారు. జోన్–2 పరిధి 10వ వార్డు వివేకానందనగర్, 11వ వార్డు బాలాజీనగర్, 13వ వార్డు ఆరిలోవ కాలనీ, శ్రీకృష్ణాపురం, జోన్–3 పరిధి 15వ వార్డు మద్దిలపాలెం, 16వ వార్డు ఇసుకతోట, 20వ వార్డు చినవాల్తేరు, 21వ వార్డు పిఠాపురం కాలనీలో యూపీహెచ్సీలు అందుబాటులోకి వచ్చాయి. ఆరిలోవలో యూపీహెచ్సీమద్దిలపాలెంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ -
Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
అనకాపల్లి: మూడు పార్టీలు కలిసినా అనకాపల్లిలో ఎదురీత తప్పలేదు. 15 సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణను చాలామంది గుర్తు పట్టడం లేదు. దీనికితోడు ఆనాటి ఆయన సోదరుల ఆగడాలు గుర్తుకు తెచ్చుకొని.. ఆ తలనొప్పి మాకొద్దు బాబోయ్ అంటున్నారు. 2004లో కొణతాలను గెలిపించి మూడు శాఖల మంత్రిని చేసిన వైఎస్సార్ అభిమానులను పక్కన పెట్టి తన సోదరుల సంపద సృష్టికే పరితపించిన కొణతాల.. 2009 ఎన్నికల్లో పరాజయం పాలై అనకాపల్లిని వదిలి విశాఖకు మకాం మార్చేశారు. తనను నమ్ముకున్న క్యాడర్ను గాల్లో వదిలేశారు. ఆనాటి కొణతాల వర్గమంతా వైఎస్సార్సీపీలో చేరి ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తదితర పదవుల్లో ఉన్నారు. 2019లో గుడివాడ అమర్నాథ్ వెంట నడిచిన వీరంతా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ గెలుపునకు కృషి చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రజల్లోకొచ్చిన కొణతాల జనసేన పార్టీలో చేరి, టీడీపీ, బీజేపీ పొత్తుతో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కానీ క్యాడర్ కరువై విలవిల్లాడుతున్నారు. తమ పాత వర్గమంతా కొణతాల గెలుపు కోసం పనిచేయాలని ఆయన సోదరుడు పెదబాబు కోరినప్పటికి ప్రయోజనం లేకపోయింది. దీంతో కనీసం కొణతాలకు వ్యతిరేకంగా చురుగ్గా పనిచేయకుండా గమ్మున కూర్చోవాలని ఆయన తెరవెనుక బెదిరింపులకు దిగుతున్నారట. కొందరు నాయకులకు ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ.. మీ సంగతి చూస్తానంటూ దురుసుగా మాట్లాడుతున్నారట. మీ బెదిరింపులకు ఎవరు భయపడతారని, మా మీద మీ పెత్తనమేమిటని వారంతా ఎదురుతిరగడంతో చేసేది లేక పెదబాబు మిన్నకుండిపోయారట. కొణతాల రామకృష్ణ మంత్రిగా ఉన్న కాలంలో అనకాపల్లికి చేసిందేమీలేదు. ప్రజలు ఆయన్ను కలిసి సమస్యలు చెప్పుకునే పరిస్ధితి ఏనాడూ లేదు. నియోజకవర్గంలో పాలన, అధికారం మొత్తం ఆయన సోదరులు పెదబాబు, రఘుబాబులదే. వ్యాపారులను బెదిరించి నెలవారీ మామూళ్లతో దోచుకున్నారు. సమస్యలపై వస్తే గంటలపాటు నిల్చోబెట్టేవారు. వారి ఆగడాలతోనే కొణతాల పరాజయం పాలయ్యారని అనకాపల్లిలో అందరూ చెప్పేమాట. తాను గెలిస్తే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తానని, రాజకీయాల్లో వారి పాత్ర లేకుండా చేస్తానని మద్దతిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు కొణతాల ఇచ్చిన హామీ పెదబాబు బెదిరింపులతో మూలకు చేరింది. -
AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
సాక్షి, విశాఖపట్నం/నెట్వర్క్: ద్రోణి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తీవ్రమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనేక చోట్ల పిడుగులు పడగా.. ఏడుగురు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది.రాజమహేంద్రవరంలో కుండపోత వర్షానికి వీధులు జలమయమయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో 12.4 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. మండపేట (కోనసీమ)లో 12, రాజమహేంద్రవరం 9.2, నూజివీడు (ఏలూరు) 7.3, మచిలీపట్నం (కృష్ణా) 7.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 45 చోట్ల 2 నుంచి 6 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. ఏలూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం సుమారు గంటసేపు ఈదురుగాలులు, ఉరుములతోపాటు మోస్తరు వర్షం కురిసింది. నందిగామ పాత బస్టాండ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై దాదాపు అడుగుమేర నీరు నిలిచింది.పిడుగుపాటుకు గురై.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన కవల నాగేశ్వరరావు (55), ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో పర్సా రామారావు (44), ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం ఎర్రకాలువ ప్రాంతంలో కరిపోతుల నాగేశ్వరరావు (72), పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరులో మొక్కజొన్న కోతలకు వెళ్లిన తల్లీకూతుళ్లు బొందెల నాగేంద్రమ్మ (53), నాగరాణి(33), పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కుందురువారిపాలెంకు చెందిన ఆవుల కోటేశ్వరరావు (42), అతని మేనల్లుడు జమ్ముల గోపి(35) మరణించారు. పశ్చిమ గోదావరిజిల్లా శృంగవృక్షంలోని వట్టూరి వారి వీధిలో మంగళవారం వీచిన ఈదురుగాలులకు కొబ్బరి చెట్టు కూలి నిమ్మల శ్రీనివాస్ (49) అనే వ్యవసాయ కూలీ మృత్యువాతపడ్డాడు.తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలుద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే 2–5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. లద్దగిరి (కర్నూలు)లో 43.3, ఎండ్రపల్లి (ప్రకాశం) 43.2, మద్దూరు (వైఎస్సార్), మంగ నెల్లూరు (తిరుపతి)లో 42.9 చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మరో మూడు రోజులు వానలే..అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో అల్లాడుతున్న రాష్ట్రానికి మంగళవారం ఉపశమనం లభించింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బుధవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, పల్నాడు, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని తెలిపింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో జల్లులకు ఆస్కారం ఉందని వివరించింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని పేర్కొంది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
నామినేషన్కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు
ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
‘ డిబేట్కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement