-
నేడు వరంగల్కు ప్రధాని రాక
ఖిలా వరంగల్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ తిమ్మాపురం క్రాస్రోడ్డు లక్ష్మీపురం మైదానంలో బుధవారం ఉదయం నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు ప్రధాని మోదీ రానున్నారు. ఈ మేరకు బహిరంగ సభ వేదిక పనులు పూర్తయ్యాయి. మామునూరు విమానాశ్రయంలో హెలికాప్టర్ ల్యాండింగ్, సభా ప్రాంగణం, పార్కింగ్, భద్రత ఏర్పాట్లను ఎస్పీజీ అధికారులు, ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్, మామునూరు ఏసీపీ తిరుపతితో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ఝా మంగళవారం ఉదయం పరిశీలించారు. పీఎం పర్యటన సందర్భంగా సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం జాతీయ రహదారి బెస్తం చెరువు, పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో ఏర్పాట్లు చేశారు. సభకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీజీ కేంద్ర బలగాలతోపాటు సివిల్ పోలీసులు మొత్తంగా వెయ్యి మందికి పైగా పోలీసులు, అధికారులు విధులు నిర్వహించనున్నారు. ప్రధాని షెడ్యూల్ ఇలా.. బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ మామునూరు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి జాతీయ రహదారి గుండా లక్ష్మీపురంలోని సభాస్థలికి 11.50 గంటలకు చేరుకుని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు తిరిగి మామునూరు ఎయిర్పోర్ట్కు చేరుకుని హెలికాప్టర్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగే సభకు తరలివెళ్లనున్నారని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ తెలిపారు. ఏర్పాట్ల పరిశీలన బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, మల్లాడి తిరుపతిరెడ్డి, జలగం రంజిత్రావు, బన్నా ప్రభాకర్, బండి సాంబయ్యయాదవ్, స్థానిక కార్పొరేటర్ జలగం అనితతో కలిసి పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేశ్ మంగళవారం పరిశీలించారు.మోదీ సభకు సర్వం సిద్ధం ఎస్పీజీ నిఘానీడలో ఎయిర్పోర్ట్, సభావేదిక ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నాయకులు -
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వరంగల్ అర్బన్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో సిద్ధంగా ఉంచిన సామగ్రిని ఏఆర్ఓ, గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 230 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటికి సరిపడా స్టేషనరీతో పాటు కొంత అదనపు స్టేషనరీ అందుబాటులో ఉంచాలని ఎన్నికల స్టేషనరీ నోడల్ అధికారి విజయలక్ష్మిని ఆదేశించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ బాకం సంతోష్, సీనియర్ అసిస్టెంట్ సూర్యనారాయణ తదితరులున్నారు. జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ను కలిసిన అదనపు కలెక్టర్దామెర: కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయవిచారణ చేపట్టడానికి వచ్చిన జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ హనుమకొమడ జిల్లా దామెర మండలం దుర్గంపేట్ సమీప ఎన్ఎస్ఆర్ హోటల్లో మంగళవారం కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. విశ్రాంతి తీసుకున్న తరువాత కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరారు. ఆయన వెంట పలువురు. నివేదిక ఇవ్వండి● కలెక్టర్ సిక్తా పట్నాయక్ హసన్పర్తి: హసన్పర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథక పనులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్.. డీఆర్డీఏ అధికారి నాగపద్మజాను ఆదేశించారు. ఉపాధి పనుల వద్ద సౌకర్యాలు లేక కూలీలు ఇబ్బంది పడుతున్న తీరుపై ‘నీరు లేదు..‘నీడ లేదు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. ఇదిలా ఉండగా, హసన్పర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లతో మండల పరిషత్ అధికారి ప్రవీణ్కుమార్ ప్రత్యేక సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఉపాఽధి పథకం పనులపై సమీక్షించారు. పనులు జరిగే ప్రదేశాల్లో నీరు, నీడ కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సౌకర్యాలు కల్పించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. కేయూ బీటెక్ సెమిస్టర్ పరీక్షలు షురూకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పరిధిలో ఇంజనీరింగ్ బీటెక్ నాల్గోవ సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు మంగళశారం ప్రారంభమయ్యాయి. కేయూలోని ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆచార్య నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక పరిశీలించారు. వీరి వెంట కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.మహేందర్ ఉన్నారు. బాలలను తరలిస్తున్న టేకేదార్ల అరెస్టు కాజీపేట రూరల్ : దానాపూర్ – సికింద్రాబాద్ మధ్య నడిచే దానాపూర్ ఎక్స్ప్రెస్లో బాలల ను తరలిస్తున్న ఇద్దరు టేకేదార్లను కాజీపేట ఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు కథనం ప్రకారం.. బల్లార్షా–కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం రాత్రి పాట్నా ఎక్స్ప్రెస్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిచారు. ఇందులో ఏడుగురు బాలలతో పని చేయించేందుకు హైదరాబాద్కు తరలి స్తు న్న ఇద్దరు టేకేదార్లను అరెస్టు చేశారు. బాలలను అదుపులోకి తీసుకుని 1098 చైల్డ్లైన్ సిబ్బందికి అప్పగించారు. అనంతరం టేకేదార్లలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఆర్పీఎఫ్ సీఐ తెలిపారు. -
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
కాళోజీ సెంటర్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్కు 14 బ్యాలెట్ యూనిట్లు, 50 కంట్రోల్ యూనిట్లు, 10 వీవీ ప్యాట్లు, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్కు 12 బ్యాలెట్ యూనిట్లు, 50 కంట్రోల్ యూనిట్లు, 8 వీవీ ప్యాట్లను కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు బండారి స్వాగత్ రణవీర్చంద్ సమక్షంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం కలెక్టరేట్లో ఈవీఎంల రెండో విడత అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, రాధికాగుప్తా, ఎన్నికల పర్యవేక్షకుడు విశ్వనారాయణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాస్, అమరేందర్రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
హన్మకొండ: సవాళ్లను ఎదుర్కొని సమాజంలో నిలదొక్కుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలోని సంస్థ కార్యాలయంలో 10రోజులు నిర్వహించిన బాల సంస్కార్ వేసవి శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. రాధికా గుప్తా ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడారు. యూపీఎస్సీ సాధించడానికి తాను రెండు సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పా రు. అయితే తన తల్లి ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే కష్టపడి చదివానని, రెండేళ్ల పాటు కష్టపడి యూపీఎస్సీ 18వ ర్యాంకు సాధించానని తెలిపారు. శ్రీరామకృష్ణ సవా సమితి హనుమకొండ అధ్యక్షు డు కటంగూరు సత్యనారాయణ రెడ్డి మాట్లాడు తూ.. రాధికా ఐఏఎస్ స్ఫూర్తిని, సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు తల్లిదండ్రులు గర్వపడేలా నైతిక విలువలతో ఎదుగాలని సూచించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, చిందు కళాకారుడు గడ్డం సమ్మయ్య మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి చిందు యక్షగానమే వృత్తిగా ఎంచుకున్నానని వివరించారు. ఈ సందర్భంగా అతిథులు అదనపు కలెక్టర్ రాధిక గుప్త, పద్మశ్రీ ఆవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను సన్మానించారు. రామకృష్ణ మహోదయ్, కేవిరావు, తిరుపతి రెడ్డి, సూర్యాపేట శ్రీనివాస్, బల్లా శ్రీనివాస్, విష్ణు, రాధిక, అని త, పార్వతి, శిల్ప, వీణ, లక్ష్మమ్మ పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా -
వర్ష బీభత్సం
వరంగల్ అర్బన్/హన్మకొండ : హనుమకొండ, వరంగల్ జిల్లాల వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. జనజీవనం అతలాకుతలమైంది. వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. వడ్ల గింజలు నీటిలో కొట్టుకుపోయాయి. కాపాడుకునేందుకు రైతులు చాలా శ్రమించారు. ఉరుములు, మెరుపులు, పిడుగులతో అరగంట పాటు దంచి కొట్టిన వానతో వరంగల్ మహా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ వైర్లు షాట్ సర్క్యూట్కు గురయ్యాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యంత వేగంగా వీచిన గాలులతో హోర్డింగ్లు చిరిగిపోయాయి. కటౌట్లు, చెట్టు కొమ్మలు రహదారుల్లో పడిపోయాయి. అండర్ రైల్వే గేట్ పరిధి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయాయి. చెట్ల కొమ్మలు తెగిపోయాయి. 39వ డివిజన్లో విద్యుత్ స్తంభం ఈదురు గాలులతో నేలకొరిగింది. వరంగల్ ఎస్వీఎన్ రోడ్డు, బట్టలబజారు, రామన్నపేట తదితర ప్రాంతాల్లో మోకాల్లోతున నీరు నిలిచింది. కాలనీల రోడ్లు వరద నీటితో నిండిపోవడంతో ప్రజలు, దిచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు అకాల వర్షంతో ఖాళీ స్థలాల నుంచి చుక్క వర్షం నీరు కూడా బయటకు వెళ్లలేదు. డ్రెయినేజీల్లో వ్యర్థాలుగా ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో వరద నీరుతోడై.. కాల్వల్లోని మురుగునీరు వీధుల్లో పొంగిపొర్లింది. ప్రధాన రహదారులైన మేదరవాడ, బట్టలబజారు, చిన్నబ్రిడ్జి అండర్ బ్రిడ్జి, హెడ్పోస్టాఫీస్, వరంగల్ చౌరస్తా, ములుగు రోడ్డు, హనుమకొండ చౌరస్తా, కాశిబుగ్గ, కొత్తవాడ, సాకారాశికుంట, లోతట్టు ప్రాంతాలు, ప్రధాన జంక్షన్లు జలమయ్యాయి. చల్లబడిన వాతావరణం 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాలులతో అల్లాడిపోయి ప్రజలకు అకా ల వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊరట చెందారు. ఽరాత్రి 9 గంటల వరకు పెద్ద పెండ్యాలలో 34,8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ధర్మసాగర్ 31.5, ఎల్కతుర్తి 27.5, సంగెం మండలం కాపులకనపర్తి 24.5, నడికుడ 21.3, గీసుకొండ మండలం గొర్రెకుంట 21, వరంగల్ పైడిపల్లి ఆర్ఎఆర్ఎస్ 20, మడికొండ 18.5, కాజిపేట 17.8, ఐనవోలు 17.8, చెన్నారావుపేట 17.5, నల్లబెల్లి మండలం మేడిపల్లి 17.3, నెక్కొండ 15.8, హసన్పర్తి 15.8, ఖానాపూర్ మండలం మంగళవారిపేట 15.5, నెక్కొండ మండలం రెడ్లవాడ 15.5, ఆత్మకూర్ 14.3, గీసుకొండ 13.8, వరంగల్ ఉర్సు 13.5, నర్సంపేట మండలం లక్నేపల్లి 13.3, దామెర మండలం పులుకుర్తి 13, పర్వతగిరి మండలం ఏనుగల్ 9.8, కల్లెడ 9.8, నల్లబెల్లి 8, దామెర 6.8, కమలాపూర్ మండలం మరిపల్లిగూడెం 5.3, రాయపర్తి 5, వర్ధన్నపేట 5, దుగ్గండిలో 4.8, కమలాపూర్ 4.3, హసన్పర్తి నాగారంలో 3.8 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. మిగతా చోట్ల తేలికపాటి వర్షం కురిసింది.ఉరుములు, మెరుపులు, పిడుగులు నేలమట్టమైన హోర్డింగ్లు, కటౌట్లు విరిగిన చెట్లు, పొంగిన డ్రెయినేజీలు -
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
● ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి హన్మకొండ: ఈదురు గాలులు, అకాల వర్షాలపై విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి.. ప్రతి సర్కిల్లో నిరంతరాయంగా పని చేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆయన మంగళవారం అధికారులు, ఉద్యోగులకు సూచనలు చేశారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధిగా హెడ్ క్వార్టర్స్లో ఉంటూ సేవలందించాలని ఒక ప్రకటనలో ఆదేశించారు. అత్యవసరమైతే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గోదావరి తీర ప్రాంతాలై న ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ పరిసర ప్రాంతల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించాలని, ప్రతి ఒక్కరు నిబద్ధతతో యుద్ధప్రాతిపదికన పని చేయాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఎస్పీఎం సెంటర్లలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు పెంచుకుని రోలింగ్ స్టాక్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూంకు సంబంధిత సమాచారాన్ని చేరవేయాలని. జిల్లాలో ని ఆయా శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు పోవాలని ఈ సదర్భంగా సూచించారు. విద్యుత్ సంబంధ సమస్యలపై వినియోగదారులు టోల్ ఫ్రీ 1800 425 0028 లేదా 1912 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. -
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
ఐనవోలు: వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 50 వేల భారీ మెజార్టీతో గెలవబోతున్న దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. మంగళవారం ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని పంథిని, కక్కిరాలపల్లి, నందనం, రాంనగర్, ఒంటిమామిడిపల్లి, ఐనవోలు, పున్నేలు గ్రామాల్లో దయాకర్రావు పర్యటించి పార్టీ విస్త్రతస్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయని కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కడియం శ్రీహరి ద్రోహం చేశారని, అలాగే అరూరి రమేశ్ పచ్చి మోసకారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి ఉద్యమకారుడు వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గుజ్జ గోపాల్రావు, తంపుల మోహన్, ఉస్మాన్ అలీ, తక్కళ్లపల్లి చందర్రావు, కడుదూరి రాజు, సోమేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. కడియం శ్రీహరి ద్రోహి.. అరూరి రమేశ్ పచ్చి మోసకారి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
బాధ్యత నాది
– IIలోuసాక్షి, వరంగల్, హనుమకొండ చౌరస్తా: ‘ఈ వరంగల్ ప్రాంతం హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చెందాల్సింది. రాణిరుద్రమ సాక్షిగా మాట ఇస్తు న్నా. ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, టెక్స్టైల్ పార్కుతో పాటు గుడి, మసీదు, చర్చిలకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా’ అని టీపీసీసీ అధ్యక్షు డు, సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో మంగళవారం జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ‘ఈ ప్రాంత కాకతీయ యూ నివర్సిటీ విద్యార్థులు, ఉద్యమకారులు తొలి, మలి దశ ఉద్యమాలు నడిపి రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించారు. చారిత్రక నేపథ్యమున్న వరంగల్ పట్టణానికి ఉజ్వల భవిష్యత్ కల్పించాల్సి ఉండగా.. కేసీఆర్ పాలనలో ఈ ప్రాంతమంతా మసకబారిపోయింది. పదేళ్లలో రూ.21 లక్షల కోట్లు చేతికిస్తే సిగ్గు లేని దద్దమ్మలు వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించలేదు. ఎయిర్ పోర్టు కట్టలేదు. టెక్స్టైల్ పార్కు పూర్తి చేయలేదు. లెదర్ పార్కుకు అణాపైసా ఇవ్వలేదు. పైగా.. బీఆర్ఎస్ వాళ్లు సిగ్గు లేకుండా మా పాలన 100 రోజులు కూడా కాలేదు.. అప్పుడే దిగిపో దిగి పో అంటున్నారు. మీలాగా అడుక్కొనో, మంది పిల్లల్ని చంపో ఈ కుర్చీలోకి రాలేదన్నారు. అండగా కొండా మురళీధర్రావు వంటి వాళ్లు ఉండబట్టి.. వరంగల్ ఈస్ట్లో గెలవబట్టి ఈరోజు ఈ కుర్చీలో ఉన్నాం’అని చెప్పారు. మంత్రి కొండా సురేఖ అడిగినట్టుగా గుడి, చర్చి, మసీదు నిర్మాణాలకు రూ.3 కోట్లు జూన్ 30లోపు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ తరపున చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ‘కడి యం శ్రీహరి నిజాయితీగా, నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్రంలో.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చిత్తశుద్ధి తో ప్రజలకు సేవ చేశారు కాబట్టి ఆయన వారసత్వంగా కడియం కావ్యకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. శ్రీహరి దగ్గర వందల కోట్లు ఉన్నవని చూసి ఇవ్వ లే. ఆయన అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి విని యోగించాలనుకున్నాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖకు మించి డాక్టర్ కడియం కావ్యకు మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్య త కొండా మురళికి ఇస్తున్నామని తెలిపారు. ‘ఇక్కడి బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ భూకబ్జాకోరు. దందా లు చేసినోడు. అవినీతి పరులను అంతమొందిస్తామని మోదీ అంటున్నాడు. అరూరి అంత నీతిమంతుడా’ అని ప్రశ్నించారు. చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ వాళ్లు వారి నాయకుడు అరూరి ని బీజేపీకి పంపించిర్రు. వరంగల్ ప్రజలు వివేకవంతులు. జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ కావ్యను లక్ష మెజారిటీతో గెలిపిస్తారు’ అని సీఎం అన్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, మాజీ ఎంపీ దయాకర్, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, మేయర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. శ్రేణుల్లో జోష్ వర్షం వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లకు ప్రజలు భారీగా హాజరవ్వడంతో శ్రేణుల్లో జోష్ కనిపించింది. హనుమకొండ చౌరస్తాలో గిరిజన గోండు జానపద నత్యాలు, బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే.. ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. వరంగల్ను ఆరు ముక్కలుగా చేసిన బీఆర్ఎస్ పార్టీని ఇక్కడి ప్రజలు బొంద పెట్టా రు. రానున్న రోజుల్లో వరంగల్ను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడు తూ.. చారిత్రక నగరం వరంగల్ను ప్రత్యేక దృష్టితో చూడాలి. రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తానన్నందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపా రు. మంత్రి ధనసరి సీతక్క మాట్లాడుతూ.. గాంధీ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, గాడ్సే సిద్ధాంతంతో ముందుకెళుతు న్న బీజేపీల మధ్య జరుగుతున్న పోరాటంలో పేదల పక్షపాతి కాంగ్రెస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
మార్కెట్ నిండా మక్కల రాశులే..
వరంగల్ : రైతులు విక్రయించేందుకు తీసుకువచ్చిన మొక్కజొన్నలతో సోమవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నిండిపోయింది. అకాల వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు సుమారు 6వేల మొక్కజొన్న బస్తాలు తీసుకువచ్చినట్లు మార్కెట్లోని అపరాల యార్డు సిబ్బంది తెలిపారు. మార్కెట్లో మక్కలకు బిల్టీ రకానికి రూ.2,250, ఈ–నామ్లో రూ.2,158 క్వింటాకు ధర పలికినట్లు సూపర్వైజర్ నర్సింగరావు పేర్కొన్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు మార్కెట్కు 55,473 క్వింటాళ్ల మొక్కజొన్నలు విక్రయానికి వచ్చినట్లు వివరించారు. మక్కలకు ఎంఎస్పీ ధర క్వింటాకు రూ.2,090 ఉందన్నారు. పసుపు పంటకు రికార్డు ధర.. ● క్వింటా రూ.16,368 కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపు పంటకు రికార్డు ధర రూ.16,368 పలికింది. మార్కెట్లో ఇటీవల పసుపు సీజన్ ప్రారంభం కాగా, మొదట్లో గరిష్ట ధర రూ.12వేల నుంచి రూ.13వేల వరకు పలికింది. కాగా, సోమవారం మార్కెట్కు 50 బస్తాల పసుపు అమ్మకానికి రాగా, కాడిరకానికి క్వింటాకు గరిష్ట ధర రూ.16,368, కనిష్ట ధర రూ.9,963 పలికింది. గోళారకం పసుపు క్వింటాకు గరిష్ట ధర రూ.15,009, కనిష్ట ధర రూ.13,000 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. -
ఓటర్ల సౌలభ్యం కోసం ‘చాట్ బాట్’ యాప్
హన్మకొండ అర్బన్ : ఎన్నికలకు సంబంధించిన పలు వివరాలు తెలుసుకునేందుకు ఓటర్ల సౌలభ్యం కోసం వాట్సాప్కు సంబంధించిన ‘చాట్ బాట్’ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. దీనిని ఉపయోగించేందుకు క్యూఆర్ కోడ్ లేదా 97045 60805 నంబర్ను సంప్రదించాలన్నారు. తద్వారా ఓటర్ హెల్ప్లైన్తో పాటు ఎన్నికలకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ యాప్లో మొదట హాయ్ అని సందేశం పంపించాలని, అలా సందేశం పంపిన వెంటనే వాట్సాప్లో ఓటర్ హెల్ప్లైన్, పీడబ్ల్యూడీ హెల్ప్లైన్, పోలింగ్ బూత్ వివరాలు అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయన్నారు. పీడబ్ల్యూడీ హెల్ప్లైన్లో గూగుల్ లింక్ను ఉపయోగించి వీడియో కాల్ చేయడం ద్వారా ఎలక్షన్ కంట్రోల్ రూమ్లోని అధికారులతో నేరుగా రోజు (ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) మాట్లాడే అవకాశం ఉంటుందని, బధిరుల కోసం కంట్రోల్ రూమ్లో సైన్ లాంగ్వేజ్ ద్వారా కూడా సమాచారం తెలిపేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన సందేశాలు, ఆకర్షణీయమైన ఫొటోలు voter-spointh-nk.in అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం వరంగల్ ఎన్ఐటీ విద్యార్థులు, అధ్యాపక బృందం రూపొందించిన ఈ యాప్ను ఓటర్లు సద్వినియోంచుకోవాలని కోరారు. -
ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రగామి
● ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ దామి ● నర్సంపేటలో జనసభ సమావేశం నర్సంపేట: ఆర్థిక వ్యవస్థలో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ దామి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని ఎంఏఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం నర్సంపేట జనసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం ఆడబిడ్డల హక్కులు కాపాడి వారికి మనోధైర్యం కల్పించామన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే ఆధునికీకరణ, వేల కిలో మీటర్ల నేషనల్ హైవే అభివృద్ధి, పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, రేషన్ బియ్యం పంపిణీ చేపట్టామన్నారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పి ఇక్కడి ప్రజలకు బాసటగా నిలిచిన మనసున్న ప్రధానమంత్రి మోదీ అన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకువచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. విజన్–2040తో ముందుకు సాగుతున్న ప్రధానమంత్రి మోదీకి దేశ ప్రజలు బాసటగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి ప్రధానిగా మోదీ ఉంటేనే విభిన్న పథకాల అమలవుతాయన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ను గెలిపించి మోదీకి బహుమతి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు, రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు, స్టేట్ స్పోక్ పర్సన్ గోగుల రాణిరుద్రమరెడ్డి, మానుకోట పార్లమెంట్ ప్రభారి నూకల వెంకట్నారాయణరెడ్డి, కన్వీనర్ ముసుకు శ్రీనివాస్రెడ్డి, పార్లమెంట్ వ్యవస్థ ప్రముఖ్ వల్లబు వెంకటేశ్వర్లు, పార్టీ వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, సిరికొండ బలరాం, యలమంచిలి వెంకటేశ్వర్రావు, కే.వి.రంగా కిరణ్, వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్స్ రత్నం సతీష్షా, కుసుమ సతీష్బాబు, ఎర్రబెల్లి ప్రదీప్రావు, పుల్లారావు యాదవ్, రాచకొండ కొంరయ్య, యాప సీతయ్య, రాజవర్ధన్రెడ్డి, జంపన సీతారామరాజు, కంభంపాటి పుల్లారావు, యువ నాయకుడు డాక్టర్ గోగుల రాణాప్రతాప్రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నర్సింహరాములు, మహబూబాబాద్ పార్లమెంట్ కోకన్వీనర్లు కట్ల రామ్చందర్రెడ్డి, సింగారపు సతీష్, టి.దేవేందర్రావు, మహబూబాబాద్ విస్తారక్ ఎం.రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
అతని మృతికి కడియం శ్రీహరే కారణం : మాజీ ఎమ్మెల్యే రాజయ్య
హనమకొండ: జనగామ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, చిల్పూరు జెడ్పీటీసీ పాగాల సంపత్రెడ్డి మృతికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరే కారణమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లిలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియంపై పలు ఆరోపణలు చేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్రెడ్డి ఎంతో కృషి చేశారని, బీఆర్ఎస్ విజయోత్సవ సభలో కడియం ఒక్కొక్కరికి బూత్ల వారీగా నాయకులను సభలో నిలబెట్టి మీ బూత్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటూ అవమానపర్చారన్నారు. అదే క్రమంలో పాగాల సంపత్రెడ్డి గ్రామం రాజవరం గురించి మాట్లాడుతూ ‘నువ్వు చిల్పూరు జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్గా ఉన్నావు, నీ గ్రామంలోనే ఓట్లు తక్కువ వచ్చాయి’ అని అవమానకరంగా మాట్లాడాడన్నారు.సంపత్రెడ్డి మనోవేదనతో సాయంత్రం మృతిచెందాడని, ఆయన చావుకు ముమ్మాటికీ కడియం కారణమన్నారు. చివరకు జనగామలో నిర్వహించిన సంతాపసభలో సైతం సంపత్రెడ్డి గురించి కాకుండా ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని రాజకీయాలు మాట్లాడిన చరిత్ర కడియం శ్రీహరిది అన్నారు. -
సజావుగా ఈవీఎంల కమిషనింగ్
వరంగల్: ఈవీఎంల కమిషనింగ్ మాక్ పోల్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం వరంగల్ పార్లమెంట్ పరిధి వరంగల్(తూర్పు), వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించి ఏనుమాముల మార్కెట్లో కొనసాగుతున్న ఈవీఎంల కమిషనింగ్, మాక్ పోల్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ.. కమిషనింగ్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమక్షంలో (వివిధ రాజకీయ పార్టీల) అంగీకారంతో 5 శాతం ఈవీఎంలను ర్యాండమైజేషన్ (లాటరీ ద్వారా) ఎన్నుకున్న పోలింగ్ కేంద్రాల వారీగా మాక్ పోల్ నిర్వహించిన ట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఏఆర్ఓలు అశ్విని తానాజీ వాకడే, సిదం దత్తు, వరంగల్, ఖిలా వరంగల్ తహసీల్దార్లు ఇక్బా ల్, నాగేశ్వర్రావు, నాయబ్ తహసీల్దార్లు, సిబ్బంది, రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 5 శాతం ఓట్లు మాక్ పోలింగ్ ఎన్నికల అధికారి పి.ప్రావీణ్య -
అభివృద్ధి కాంక్షతోనే.. పార్టీ మారా! : కడియం శ్రీహరి
హనమకొండ: స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతోనే పార్టీ మారానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ రాంపూర్లో ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి ఆయన కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం భ్రష్టు పట్టించారన్నారు.ఇతర పార్టీల ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా బీఆర్ఎస్లోకి చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి, ఫోన్ ట్యాపింగ్, భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. ముప్పై ఏళ్లుగా తనకు రాజకీయ జన్మనిచ్చి ఆదరించిన తీరుగానే తన బిడ్డ డాక్టర్ కడియం కావ్యను నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.అనంతరం ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు యువతను మోసం చేశాయన్నారు. వర్ధన్నపేటలో భూములను కబ్జా చేసిన అరూరి రమేశ్ను నియోజకవర్గ ప్రజలు చెంప చెల్లుమనిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లోను తగిన బుద్ధి చెప్పాలన్నారు. నాయకులు హన్మంతరావు, రాజు, రవి, రమేష్, రాజేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుంది
హన్మకొండ: కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని, దీంతో ఆ పార్టీ నాయకులు అబద్ధాలు మాట్లాడుతున్నారని, సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ దుయ్యబట్టారు. సోమవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో నియోజకవర్గ మేనిఫెస్టో సంకల్పపత్రం విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆగమాగమవుతున్నారని, అవాక్కులు, చెవాక్కులు పేలుతున్నారన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారంటూ రేవంత్, కడియం శ్రీహరి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. అంబేడ్కర్ జీవించి ఉండి రాజ్యాంగం మార్చాలని చెప్పినా మార్చమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చెబుతున్నా వీరి తీరు మారడం లేదని ధ్వజమెత్తారు. స్టేషన్ ఘన్పూర్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు సిగ్గులేకుండా కడియం శ్రీహరి నీతులు మాట్లాడుతున్నాడని తూర్పారబట్టారు. ఇప్పుడున్న ఆస్తులు ఎక్కడివని ప్రశ్నించారు. తాను చదువుకున్న నాటినుంచి వ్యాపారం చేస్తూ అభివృద్ధి చెంది, రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను గెలిస్తే నియోజకవర్గానికి ఏమీ చేస్తానో సంకల్ప పత్రం ద్వారా ప్రజలకు వివరించారు. ఈ నెల 8న(రేపు) వరంగల్లో జరిగే నరేంద్ర మోదీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు డాక్టర్ టి.రాజేశ్వర్ రావు, నాయకులు వన్నాల శ్రీరాములు, మురళీధర్ గౌడ్, కొండేటి శ్రీధర్, రావు పద్మ, నిషిధగర్ రెడ్డి, కుమారస్వామి, ఎరబ్రెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, గజ్జెల శ్రీరాములు, అమరేందర్ రెడ్డి, లక్ష్మి పాల్గొన్నారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు రేపు ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ -
పట్టభద్రుల స్థానానికి 13మంది నామినేషన్లు దాఖలు
నల్లగొండ: ఖమ్మం–వరంగల్–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి సోమవారం ఐదవ రోజు 13 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి ముండ్ర మల్లికార్జునరావు, ధర్మ సమాజ్ పార్టీ నుంచి బరిగల దుర్గాప్రసాద్, నేషనల్ నవక్రాంతి పార్టీ నుంచి కర్ని రవి, స్వతంత్ర అభ్యర్థులుగా పులిపాక సుజాత, చీదల్ల వెంకట సాంబశివరావు, చీదల్ల ఉమామహేశ్వరి, తాడిశెట్టి క్రాంతి కుమార్, అయితగోని రాఘవేంద్ర, బక్క జడ్సన్, బుగ్గ శ్రీకాంత్, పాలకూరి అశోక్ కుమార్, దేశగాని సాంబశివరావు నామినేషన్లు వేశారు. వీరంతా తమ నామినేషన్ పత్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సీహెచ్. మహేందర్కు అందజేశారు. -
నేడు నగరంలో సీఎం రేవంత్రెడ్డి రోడ్షో
హన్మకొండ చౌరస్తా: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంగళవారం వరంగల్ నగరంలో రోడ్షో, కార్నర్ మీటింగ్లలో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు వరంగల్ తూర్పులోని పోచమ్మమైదాన్ జంక్షన్లో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. 6గంటలకు వేయిస్తంభాల గుడి నుంచి హనుమకొండ చౌరస్తా వరకు రోడ్షో నిర్వహిస్తారని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. అనంతరం హనుమకొండ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారని వివరించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్నర్ మీటింగ్ ఏర్పాట్ల పరిశీలన వరంగల్: పోచమ్మమైదాన్లో సీఎం రేవంత్రెడ్డి పాల్గొనే కార్నర్ మీటింగ్ ఏర్పాట్లను సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, పీసీసీ నాయకులు మహ్మద్ అయూబ్, నవీన్రాజు, మార్కెట్ మాజీ డైరెక్టర్ వేణు పరిశీలించారు. -
గ్రామాల అభివృద్ధి బాధ్యత నాదే..
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకొత్తగూడ: ‘పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఓట్లు వేయించే బాధ్యత మీరు తీసుకోండి.. గ్రామాల అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని’ రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. పాకాల సరస్సు నుంచి ఏజెన్సీ గ్రామాలకు సాగు నీరు అందిస్తామన్నారు. గిరిజనేతరుల పోడు భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న వాగులు, రోడ్ల సమస్యలు ఇక ముందు ఉండవన్నారు. ఈ పనులన్నీ జరగాలంటే కేంద్ర అటవీ శాఖ అనుమతులు తప్పని సరని, అందుకు బలరాంనాయక్ను గెలిపిస్తే తనకు అండగా నిలిచి ఢిల్లీ నుంచి అనుమతులు తీసుకువస్తారని వివరించారు. అనంతరం మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బలరాంనాయక్ మాట్లాడుతూ తనకు ఓటు వేస్తే రాహుల్గాంధీకి వేసినట్లే అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏజెన్సీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రాధ, డాక్టర్ అనిల్కుమార్, పైడాకుల అశోక్, చల్లా నారాయణరెడ్డి, వజ్జ సారయ్య, ఎంపీపీ బానోతు విజయరూప్సింగ్, జెడ్పీటీసీ పుష్పలత, ఎంపీటీసీలు జంపయ్య, సాలూకి, పుష్పలత, నాయకులు మొగిళి, వజ్జ వెంకటలక్ష్మి, రణధీర్, మధుసూదన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలి ● కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి ● ఎమ్మార్పీఎస్–టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్హన్మకొండ: పార్లమెంట్ ఎన్నికల్లో మనువాద బీజేపీ, కపట ప్రేమ చూపే కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్–టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కొట్లాడి సాధించిన తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలోని అణగారిన వర్గాల అభివృద్ధిపై కేసీఆర్కు మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం నిర్మించడంతో పాటు, సాగు నీరు అందించి, సాగు విస్తీర్ణం పెంచి రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన మహానాయకుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూడు నెలలకే ఆగమవుతోందన్నారు. ఒక్క నిమిషం కరెంట్ పోని రాష్ట్రాన్ని ప్రస్తుతం కోతల మయం చేశారన్నారు. కేసీఆర్తోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, బీఆర్ఎస్కు మాదిగల సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. బీజేపీ కేవలం ఓట్ల కోసమే మాదిగలను వాడుకుంటుందని విమర్శించారు. మాదిగలను కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తోందన్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెబుతామన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్–టీఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇల్లందుల రాజేష్ ఖన్నా, నాయకులు ఈదునూరి యాకన్న, పొట్టపెంజర రమేష్, మేడ స్వామి, బొచ్చు మురళి, ధర్మారపు శ్రీకాంత్, ఎలకటి రాజయ్య, ఇరుగు యాకయ్య, బక్కి రావి, మహేష్, జన్ను సంజీవ్, ప్రతాప్, మంద రాజశేఖర్, సురేందర్, గోల్కొండ శ్రీనివాస్, దయాకర్, జయరాజ్, విజయ్కాంత్, రాజశేఖర్, విజయ్కాంత్, కుమార్ పాల్గొన్నారు. -
నగరాభివృద్ధిని అడ్డుకున్నది గత ప్రభుత్వాలే..
నయీంనగర్ : పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ అన్నారు. సోమవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు వరంగల్ నగరాన్ని ధ్వంసం చేశాయని, కొత్త పరిశ్రమలు కేటాయించకపోగా, గతంలో ఉన్న అజంజాహి మిల్లు, తోలుపరిశ్రమ, ఎయిర్ పోర్టు నామరూపాల్లేకుండా చేశాయని విమర్శించారు. 1930లోనే మూడు వేల ఎకరాలతో వరంగల్లో అతిపెద్ద విమానాశ్రయం ఉండేదని.. కుట్రపూరితంగానే రెండు జాతీయ పార్టీలు దానిని పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు వరంగల్లో ఓటు అడిగే హక్కు లేదని, గుజరాత్ మోడల్ అంటే ప్రజలను, బ్యాంకులను దోచుకునే డెకాయిట్లకు రాష్ట్రాన్ని అప్పగించడమా అని సుధీర్కుమార్ ప్రశ్నించారు. మామునూరు విమానాశ్రయం ఏర్పాటును అడ్డుకున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు, సింగరేణిని ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారుల చేతుల్లో తెలంగాణను పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన వారేనని, వారి ఓటు బ్యాంకు తనకు కలిసి వస్తోందన్నారు. తాను 20ఏళ్లుగా బీఆర్ఎస్లో కార్యకర్తగా పనిచేశానని, మూడు సార్లు ప్రజాప్రతినిఽధిగా పనిచేసినా ఎక్కడా చిల్లిగవ్వ అవినీతికి ఆస్కారం ఇవ్వలేదన్నారు. తల్లిలాంటి పార్టీని మోసం చేసిన కడియం శ్రీహరి, అరూరి రమేష్కు వరంగల్ ప్రజలు ఓటుతో గుణపాఠం చెబుతారన్నారు. దేశంలో తప్పకుండా మార్పు రావాల్సిన అవసరం ఉందని, రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని జోస్యం చెప్పారు. వరంగల్ పార్లమెంట్ గడ్డపై విజయకేతనంతో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని తన గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, కోశాధికారి బోళ్ల అమర్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, జర్నలిస్టు సంఘాల నాయకులు బీఆర్ లెనిన్, గాడిపల్లి మధు, ప్రెస్క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదు మీట్ ది ప్రెస్లో బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ -
చిత్రకళలో సధాకర్కు రజతం
నయీంనగర్ : రంగ్–2023 సంవత్సరానికి సంబంధించి 2వ జాతీయ స్థాయి ఆర్ట్–ఫెర్ఫామెన్స్ కాంపిటీషన్లో హనుమకొండ తేజస్వి ఉన్నత పాఠశాల చిత్రకళా బోధకుడు పానుగంటి సధాకర్ రజత పథకం సాధించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ ఆధ్వర్యంలో గత ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ముంబాయిలో ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ చిత్రకళ పోటీలు నిర్వహించారు. ‘75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశం’ అనే అంశంపై చిత్రాన్ని పోస్ట్ ద్వారా కాంపిటీషన్కు పంపగా 40 నుంచి 60 ఏండ్ల కేటగిరీలో సధాకర్ ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. నిర్వాహకులు రజత పతకం, ప్రశంసా పత్రాన్ని పంపించారు. సోమవారం తేజస్వి విద్యా సంస్థల చైర్మన్ రేవూరి జన్నారెడ్డి రజత పతకం, ప్రశంస పత్రం అందజేసి సధాకర్ను అభినందించారు. ప్రిన్సిపాల్ సంధ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా ఆభివృద్ధి
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్ : వీరనారి రాణిరుద్రమదేవి నడియాడిన నేలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖిలా వరంగల్ పడమరకోట జంక్షన్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గెలు పే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, నవీన్రాజు, శ్రీనివాస్, శ్యాం, కార్పొరేటర్ ఉమ, ప్రకాశ్ పాల్గొన్నారు. ఉర్సు దర్గాలో పూజలు వరంగల్ ఉర్సు కరీమాబాద్లోని హజ్రత్ మాషూక్ రబ్బానీ రహమతుల్లా దర్గాను మంత్రి కొండా సురేఖ, పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావులు సోమవారం దర్శించుకున్నారు. పీఠాధిపతి హజ్రత్షా ఉబేద్బాబాతో కలిసి వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నేత ఎండీ.అమ్జద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంఏ.జబ్బార్, షకిల్ హైమద్ (గోరిమి యా), కొత్తపెల్లి శ్రీనివాస్, బాసాని శ్రీనివాస్, చాంద్పాషా, శ్రీరామ్ రాజేష్ పాల్గొన్నారు. -
వాయిస్ కాల్స్తో ఎలక్షన్ క్యాంపెయిన్..!
హనమకొండ: మొబైల్.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి మళ్లీ నిద్రించే వరకు చేతిలో అతుక్కుపోవాల్సిందే. టీ తాగుతున్నా.. భోజనం చేస్తున్నా.. ఇతర ఏ పని చేస్తున్న ఫోన్ చూడకుండా క్షణ కాలం ఉండలేని పరిస్థితి ఉంది. మానవ జీవితంలో ఇంతలా ఇమిడిపోయిన ఫోన్ అవసరాన్ని రాజకీయ నేతలు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు.ఒకవైపు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం పరుగులెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులు గతంలోకంటే ఈసారి ప్రచారానికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించుకుంటున్నారు. వాయిస్ మెయిల్ కాల్స్ ద్వారానే కాకుండా, సోషల్ సైట్స్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ (ఎక్స్)ను ఉపయోగించుకుంటున్నారు.‘తాము ఫలానా పార్టీ తరఫున పోటీచేస్తున్నాం.. మమ్మల్ని గెలిపిస్తే మన ప్రాంతంలో నెలకొన్న స మస్యలు పరిష్కరిస్తాం. అందుకోసం మమ్మల్నే గెలి పించాలంటూ’ కోరుతున్నారు. మరికొందరు ఓ అ డుగు ముందుకేసి తమ అభ్యర్థిని గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాడని తెలుపుతున్నారు.వాయిస్ మెయిల్ కాల్స్తో ప్రచారంరెండు రోజుల నుంచి వాయిస్ మెయిల్ కాల్స్, ఫోన్ కాల్స్ ద్వారా అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం కావడంతో వారిని ఆకట్టుకోవడానికి ఫేస్బు క్, ట్విట్టర్ను వినియోగించుకుంటుండడం గమనార్హం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్ల ద్వారా యువకులు అధికశాతం తమ అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు.దీనికి తోడు అభ్యర్థులు ఫేస్బుక్, ట్వి ట్టర్ ద్వారా చాటింగ్ చేస్తున్నారు. యువత కూడా వీటి ద్వారా తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెలిబుచ్చుతున్నారు. పత్రికలు, టెలివిజన్ తరువాత ఇంటర్నెట్పైనే దృష్టి సారిస్తుండడంతో యువతను ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు తమపార్టీల ద్వారా చేపట్టే కార్యక్రమాలు, ప్రజల కోసం చేసే కార్యక్రమాల సందేశాలను ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు.లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్తేదీ సమీపిస్తుండడంతో ఫేస్ బుక్, ట్విట్టర్లో రాజకీయ పార్టీల చిత్రాలే అధికంగా కనిపిస్తున్నాయి. వరంగల్ లోక్సభ.. రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గమైనప్పటికీ మెజార్టీ ఓటర్లు సంప్రదాయ ఓటర్లే ఉంటారు. అయితే ఎన్నికల సంఘం నూతన ఓటర్ల నమో దుపై విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ మధ్య కాలంలో దాదాపు 24 వేల మంది కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.దీంతో ఈసారి జరుగనున్న ఎన్నికల్లో యువత పాత్ర కీలకంగా కావడంతో లోక్సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల అనుచరులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వాయిస్మెయిల్స్, ఫోన్కాల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ను ఉపయోగించుకుంటున్నారని చెప్పొచ్చు. కాగా, ఈవాయిస్ కాల్స్తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ రెండో, ఆరో సెమిస్టర్ల పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కేయూ రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి సందర్శించారు. ఆయన వెంట ఎస్.నర్సింహాచారి, డాక్టర్ తిరుమలాదేవి ఉన్నారు. ఏడుగురు విద్యార్థుల డీబార్ కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఫార్మసీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో కాపీయింగ్ చేస్తూ ఏడుగురు విద్యార్థులు పట్టుబడగా డీబార్ చేశామని పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి తెలిపారు. ఫార్మసిస్ట్లకు త్వరలోనే మంచి వేతనాలుఎంజీఎం: ఫార్మసిస్టులకు త్వరలోనే మంచి వేతనాలు అందుతాయని తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్గౌడ్ అన్నారు. సోమవారం సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కందకట్ల శరత్బాబు అధ్యక్షతన డీఎంహెచ్ఓ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో జరిగిన హనుమకొండ, వరంగల్ జిల్లా కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 35 ఏళ్లుగా పీఆర్సీలలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్లకు అన్యాయం జరుగుతుందన్నారు. విద్యార్హతలు, విధులను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని పీఆర్సీ కమిటీకి విన్నవించామని, దీనిపై వారు సానుకూలంగా స్పందించారని తెలి పారు. అనంతరం సుదర్శన్గౌడ్ను సన్మానించారు. సమావేశంలో సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు దేవంభట్ల ప్రకాశ్రావు, హనుమకొండ జిల్లా కార్యదర్శి సుధాకర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అవినాష్, నాయకులు నార్ల వేణు, సూరయ్య, విజయలక్ష్మి, జాన్సీలక్ష్మి, శ్రీదేవి, సునీత తదితరులు పాల్గొన్నారు. రుద్రేశ్వరాలయంలో మాస శివరాత్రి పూజలుహన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో చైత్రమాస బహుళ త్రయోదశి సోమవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో.. వేదపండితులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రేశ్వరస్వామివారిని అర్ధనారీశ్వరుడిగా అలంకరించి పూజలు జరిపారు. అనంతరం నాట్య మండపంలో రుద్రేశ్వరిదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివార్లకు కల్యాణం జరిపించారు. నూతనంగా నియమితులైన హనుమకొండ జిల్లా కోర్టు జడ్జి సీహెచ్ రమేశ్బాబు కల్యాణోత్సంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మోహన్రెడ్డి పాల్గొన్నారు. పీఎం సెక్యూరిటీ ట్రయల్రన్ఖిలా వరంగల్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు(బుధవారం) లక్ష్మిపురం మైదానంలో నిర్వహించే సభకు ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి భద్రతాధికారులు(సెక్యూరిటీ) సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి మామునూరు విమానాశ్రయానికి వచ్చారు. హెలిపాడ్నుంచే విమానాశ్ర యం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. రాత్రి కోటను సందర్శించారు. ఎస్పీజీ అధికారులు, ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ తిరుపతి, ఇన్స్పెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. నానీల కమ్మలు పుస్తకావిష్కరణహన్మకొండ: ఉపాధ్యాయుడు, రచయిత మడ త భాస్కర్ రచించిన నానీల కమ్మలు పుస్తకా న్ని సోమవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పల్లా రవీందర్ రెడ్డి భవన్లో ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.రఘు, సినిగేయ రచయిత, ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి ఆవిష్కరించారు. అవుసుల భాను ప్రకాశ్ పుస్తక సమీక్ష చేశారు. పుస్తకాన్ని కక్కెర్ల దయాకర్కు అంకితమిచ్చారు. కార్యక్రమంలో పుస్తక ప్రచురణ కర్త నేతల స్వామి, కవులు, రచయితలు చక్రవర్తుల శ్రీనివాస్, డాక్టర్ చింతం ప్రవీణ్, కక్కెర్ల దయాకర్, పతంగి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఎన్నికల ఖర్చుల వివరాలు అందజేయాలి
కాళోజీ సెంటర్: పార్లమెంట్ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాల్ని కచ్చితంగా అందించాలని కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఏ.దిలీబన్, ధీరజ్సింగా అన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలనలో భాగంగా రెండో విడతగా సోమవారం వరంగల్ కలెక్టరేట్లో అభ్యర్థులు ఇప్పటివరకు నిర్వహించిన వ్యయ సంబంధిత రిజిస్టర్లను వారు తనిఖీ చేశారు. ఎన్నికల బరిలో ఉన్న 42 మంది అభ్యర్థుల్లో 38 మంది సమర్పించిన ఎన్నికల ఖర్చుల సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేసినట్లు తెలిపారు. హాజరు కాని అభ్యర్థులకు నోటీసులు అందించనున్నట్లు తెలిపారు. 10న మూడో దఫా పరిశీలన ఈనెల 10న అభ్యర్థుల మూడో దఫా వ్యయ పరిశీలన ఉంటుందని వ్యయ పరిశీలకులు దిలీబన్, ధీరజ్సింగ్ తెలిపారు. ఈ పరిశీలనకు పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల రిజిస్టర్లతో తప్పకుండా హాజరు కావాలని సూచించారు. హాజరు కాని అభ్యర్థులను ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 10ఏ కింద మూడు సంవత్సరాల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటిస్తారని ఎన్నికల వ్యయ పరిశీలకులు తెలిపారు. ఎన్నికల ప్రచారం దృష్ట్యా అభ్యర్థులే కాకుండా వారి ఏజెంట్లు కూడా ఈ వ్యయ సంబంధిత రిజిస్టర్లను పరిశీలనకు అందజేయవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యయ పరిశీలన నోడల్ అధికారి రామిరెడ్డి, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, అసెంబ్లీ సెగ్మెంట్ల సహాయ వ్యయ అధికారులు, పోటీ చేసే అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. బీసీఎల్ లిక్కర్ డిపో పరిశీలన మడికొండ : కాజీపేట మండలం రాంపూర్ శివారులోని టీఎస్ బీసీఎల్ డిపోను వరంగల్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు దిలీబస్ ఏ.ధీరజ్ సింగా సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మద్యం తయారీ కేంద్రం నుంచి డిపోనకు, డిపోనుంచి దుకాణాలకు ఎలా సరఫరా అవుతోంది.. ఎక్సైజ్ శాఖ నియంత్రణ వివరాలను డిపో మేనేజర్ కనకయ్యను అడిగి తెలుసుకున్నారు. డిపో నుంచి మద్యం పక్కదారి పట్టకుండా నియంత్రణ చర్యలపై పలు సలహాలు, సూచనలు చేశారు. వరంగల్ జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హనుమకొండ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఏ.దిలీబన్, ధీరజ్సింగా అభ్యర్థుల ఎన్నికల వ్యయ రిజిస్టర్ల తనిఖీ -
ఆగమాగం.. అన్యాయం!
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ఔట్ సోర్సింగ్ కార్మికుల పాలిట శాపంగా మారింది. ఉద్యోగుల భవిష్యత్ నిధి(ఈపీఎఫ్), ఈఎస్ఐ పేరిట నెలనెలా మినహాయించిన డబ్బు రెట్టింపై వడ్డీ వస్తుందనుకుంటున్న వారి ఆశలు నీరుగారుతుతున్నాయి. ఖాతాలు ఉన్నా సొమ్ము జమకాక మినహాయిస్తున్న డబ్బులు జమకాక ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. పాలకవర్గం పెద్దలు, ఉన్నతాధికారులు తమ పని తీరు మెరుగుపర్చుకోవాలని పదే పదే ఆదేశిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. బల్దియా ఔట్సోర్సింగ్ పద్ధతిపై పారిశుద్ధ్య విభాగంలో 2,703 మంది, ఎలక్ట్రికల్ సెక్షన్లో 109, కంప్యూటర్, జనరల్ విభాగంలో సుమారు 150 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రతి నెల పీఎఫ్ 12 శాతం వారి సొమ్ముకు, అదనంగా మరో 12 శాతం కలిపి పీఎఫ్ యూఏఎన్ ఖాతాకు జమ చేయాలి. ఈఎస్ఐ సొమ్ము 0.75 శాతం పంపిస్తారు. జమ కాక ఆందోళన.. బల్దియాలో ఔట్సోర్సింగ్ కార్మికుల చిరునామాలు, ఆధార్ కార్డు నంబర్లు తప్పుల తడకగా మారాయి. బల్దియా పరిపాలన విభాగం సిబ్బంది ద్వారా ఖాతాలు తెరిచినప్పటికీ వారి నిర్లక్ష్యం కారణంగా దొర్లిన తప్పిదాలు ఇప్పుడు కార్మికులకు తీవ్ర ఇబ్బందులకు కలిగిస్తున్నాయి. ఇటీవల పీఎఫ్ అధికారుల సమావేశంలో నిలదీస్తే సగానికి మందికిపైగా సమస్యలు క్లియర్ చేశామని, మిగతా వారికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇక బల్దియాలో రెండేళ్ల కిందట 452 మంది ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోగా.. వీరిలో 230 మంది కార్మికుల పీఎఫ్ సొమ్ము ఖాతాలకు చేరడం లేదు. సరైన వివరాలు లేదని బల్దియా సిబ్బంది దాటవేస్తున్నారు. పారిశుద్ధ్య విభాగంలో దశాబ్దకాలంగా పని చేస్తున్న సుమారు 300 మంది కార్మికులు, ఎలక్ట్రికల్ సిబ్బంది పరిస్థితి ఇదే. ఇష్టారాజ్యంగా ఇంటిపేరు, పేరు, ఆధార్ నంబర్లు ఉన్నాయంటూ ఆ విభాగం సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానాలిస్తున్నారు. ఇలా బల్దియాలో వందలాదిమంది ఉద్యోగుల పేరిట ఖాతాలు ఉన్నా.. పీఎఫ్కు సంబంధించిన రూ.లక్షల సొమ్ము జమ కాకుండా బల్దియా జనరల్ ఫండ్లో చేరుతోంది. ఫలితంగా ఆసొమ్ముకు కార్మికులకు వడ్డీ రాకుండా పోతోంది. సొమ్ముకు సమానంగా జమ చేయాల్సిన డబ్బులు చేతికి అందకుండా పోతోంది. దీంతో కార్మికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకే ఒక్కడు.. వివిధ విభాగాల్లో పని చేసే ఔట్సోర్సింగ్ కార్మికులకు పీఎఫ్ డబ్బులు జమ చేయడం లేదని ఆ శాఖ అధికారులు పదే పదే నోటీసులు జారీ చేస్తున్నారు. బల్దియాలో అవగాహన సమావేశం ఏర్పాటు చేసి, సందేహాలు నివృత్తి చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. వాస్తవానికి కార్మికుల వివరాలు మరోమారు తీసుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ.. అధికారుల పట్టింపులేనితనం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఔట్సోర్సింగ్ కార్మికులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ ఖాతాల సొమ్ము జమ చేసేందుకు ఒకే ఒక్కడు ఉండడంతో ఇష్టారాజ్యంగా మారింది. డబ్బులు సమర్పిస్తే పనులు అవుతున్నాయనే కార్మికులు ఆరోపిస్తున్నారు. కాగా.. సదరు ఉద్యోగి తాను ఒకడినే ఉండడం వల్ల ఖాతాలు పర్యవేక్షించడం భారంగా మారిందని పేర్కొనడం గమనార్హం. పరిశీలిస్తాంపీఎఫ్ ఖాతాల్లో దొర్లిన తప్పుల కారణంగా కొంత మంది సొమ్ము జమ కావడం లేదని నా దృష్టికి వచ్చింది. పీఎఫ్ అధికారుల సూచనల మేరకు తప్పులను సరి చేసి, సొమ్ము జమ చేస్తాం. – రషీద్, బల్దియా అడిషనల్ కమిషనర్ ఈపీఎఫ్, ఈఎస్ఐ డబ్బుల జమలో నిర్లక్ష్యం ఖాతాల నిర్వహణకు ఒకే ఒక్కడు మున్సిపల్ చట్టాలకు తూట్లు ప్రదక్షిణలు చేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులు పట్టించుకోని పాలకవర్గం పెద్దలు, ఉన్నతాధికారులు
Pagination
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..
చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
Advertisement