Movie Shooting
-
నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' మూవీ స్టిల్స్
-
గోపిచంద్ కొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ హీరో గోపిచంద్ మరో కొత్త సినిమాకు రెడీ అయిపోయారు. ఇటీవలే ఓ సినిమా ప్రకటించిన కొత్త డైరెక్టర్తో జతకట్టారు. కుమార్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ లాంఛనంగా ఇవాళ ప్రారంభమైంది. ఈ చిత్రంలో మలయాళ భామ మీనాక్షి దినేశ్ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాను థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీమ్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గోపీచంద్ హీరోగా మార్చిలో ప్రారంభమైన సినిమాకి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. The man of grit is back @YoursGopichand 😎This time in a new dimension of Chills 🤟🏻@SVCCOfficial's Production No.39 kickstarts with a Grand Pooja Ceremony Today 🪔Directed by @MysticBoom 🎬Visuals by @ShamdatDOP 🎥Rolling on floors soon 🔥 pic.twitter.com/RgcprG5LjT— SVCC (@SVCCofficial) April 24, 2025 The relentless team that’s all set to give you a BLOCKBUSTER ride 💥💥@SVCCOfficial’s ProductionNo.39 has officially begun with an auspicious pooja ceremony ❤️🪔Here’s a glimpse of the blissful moments that marked the beginning ✨ @YoursGopichand #MeenakshiDineshDirected… pic.twitter.com/NAoLUdwA8P— SVCC (@SVCCofficial) April 24, 2025 -
స్టార్ హీరో సినిమా సెట్లో అగ్నిప్రమాదం
ధనుష్ సినిమా షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. ధనుష్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడ్లీ కడై’(Idli Kadai) (ఇడ్లీ కొట్టు) సినిమా కోసం వేసిన సెట్ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటన అర్దరాత్రి జరిగినట్లు తెలుస్తోంది. తేని జిల్లా అండిపట్టిలో కొద్దిరోజులుగా సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే అక్కడ ధనుష్, నిత్యా మీనన్ మధ్య కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే, సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన కొన్ని పరికరాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.సుమారు 15 రోజులుగా ఆ ప్రాంతంలోనే చిత్రీకరణ జరుగుతుంది. ధనుష్ ఇడ్లీ షాప్ సన్నివేశాలకు సంబంధించిన సెట్ను అక్కడ వేశారు. మొదట అందులో నుంచే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయని తెలుస్తోంది. ఇడ్లీ కొట్టు చిత్రాన్ని ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ‘తిరు’ (2022) సినిమా తర్వాత ధనుష్–నిత్యా మీనన్ మరోసారి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో అరుణ్ విజయ్, ప్రకాశ్రాజ్, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 1న ఈ మూవీ విడుదల కానున్నట్లు కొద్దిరోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. -
రోజుకి రూ.లక్ష..అయినా ఊటీలో సినిమా షూటింగ్స్ బంద్...ఎందుకంటే?
దక్షిణాది ఉత్తరాది తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషా చిత్రాల షూటింగ్ లకు స్వర్గధామం లాంటిది తమిళనాడులోని ఉదకమండలం...అదే ఊటీ(Ooty) . మన రోజా, గీతాంజలి తదితర దక్షిణాది చిత్రాలతో పాటు నాటి ‘ఖయామత్ సే ఖయామత్ తక్ నుంచి నిన్నా మొన్నటి బర్ఫీ దాకా ఊటీ అంటే సినిమా షూటింగ్లకు అచ్చొచ్చిన బ్యూటీగా నిలిచింది. ‘అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ,‘ ‘అందాజ్ అప్నా అప్నా,‘ ‘బర్ఫీ,‘ ‘దిల్ సే,‘ ‘జో జీతా వోహీ సికందర్,‘ ‘రాజా హిందుస్తానీ,‘ వంటి బాలీవుడ్ సినిమాలు ఊటీ అందాలకు అద్దం పట్టాయి.ఏళ్లు గడుస్తున్నా, అనేక రకాల షూటింగ్ స్పాట్స్ అందుబాటులోకి వస్తున్నా ఊటీకి మాత్రం షూటింగ్స్ తాకిడి తగ్గడం లేదు. ఇటీవల ‘రివర్డేల్‘ అనే కాల్పనిక పట్టణానికి నేపథ్యంగా నెట్ఫ్లిక్స్ చిత్రం ‘ది ఆర్చీస్‘ కూడా ఊటీలో చిత్రీకరించారు. అలాగే ది లారెన్స్ స్కూల్, లవ్డేల్తో సహా ‘రాజ్‘ చిత్రం కూడా ఊటీలో తీసినవే. ఏటా వందలాదిగా షూటింగ్స్ కు ఊటీ కేంద్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఊటీలోని బొటానికల్ గార్డెన్స్, రోజ్ గార్డెన్, టాయ్ ట్రైన్ తదితర ప్రాంతాలతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న తేయాకు తోటలు కూడా సినిమా కెమెరాలకు పని చెబుతూనే ఉంటాయి.ఈ నేపధ్యంలో ప్రస్తుతం పర్యాటకుల తాకిడితో ఊటి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ముఖ్యంగా గత ఏడాది కనీ విని ఎరుగని స్థాయిలో భారీ సంఖ్యలో పర్యాటకులు ఊటీకి వెల్లువెత్తారు. ఊటీకి వెళ్లేదారిలో భారీగా ట్రాఫిక్ జామ్స్ సైతం ఏర్పడ్డాయి. ఇక గత వేసవిలో ఊటీలో కాలుష్యం ఎన్నడూ లేనంత స్థాయిలో నమోదైంది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. ఇ పాస్ వంటి నిబంధనలతో పర్యాటకుల రాకను నియంత్రించింది. రాకపోకలను కట్టుదిట్టం చేసింది. అయితే గత ఏడాది అనుభవాలతో ఈ సారి ప్రభుత్వం మరింత ముందుగా మేల్కొంది. ముందస్తుగానే అంటే ఏప్రిల్ నెల రాకుండానే ఇ పాస్ నిబంధన విధించడంతో పాటు ఊటీలోకి 6వేల వాహనాలకు మాత్రమే ఎంట్రీ వంటి పలు ఆదేశాలు జారీ చేసింది. అదే క్రమంలో సినిమా షూటింగ్స్ పైనా నిషేధం విధించింది. ఈ ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు ప్రభుత్వ బొటానికల్ గార్డెన్, గవర్నమెంట్ రోజ్ గార్డెన్ సహా ఎనిమిది పార్కులలో సినిమా షూటింగ్లను అక్కడి ఉద్యానవన శాఖ తాత్కాలికంగా నిషేధించింది. వందల, వేల సంఖ్యలో పర్యాటకులు తమ సెలవులను ఆస్వాదించేందుకు ఈ పార్కులను సందర్శిస్తుండటంతో వారికి ఇబ్బందులు ఎదురవకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యానవన శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ‘‘మేము చెన్నైలోని మా ఉద్యానవన శాఖ డైరెక్టర్ నుంచి సరైన అనుమతి పొందిన తర్వాత మాత్రమే చిత్ర యూనిట్లను అనుమతిస్తున్నాం. సినిమా నిర్మాతలు ఒక రోజు షూటింగ్ కోసం కనీసం 25,000 నుంచి గరిష్టంగా 1 లక్ష వరకు చెల్లించాలి. అయితే, వేసవి సెలవుల కారణంగా ఈ ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊటీలోని పలు పార్కులలో అన్ని సినిమా షూటింగ్లను తాత్కాలికంగా నిషేధించాం’’ అని చెప్పారు. -
Mega 157: ఉగాదికి స్టార్ట్.. సంక్రాంతికి రిలీజ్!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో ఇది 157వ సినిమా. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాది సందర్భంగా నేడు (మార్చి 30) రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా జరిగాయి. హీరో వెంకటేశ్, నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్బాబు, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు.సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనుందని, చిరంజీవి కొత్త గెటప్లో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. ఒక పాత్ర కోసం ఇప్పటికే అదితిరావు హైదరిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్ని ఇంకా ఫైనల్ చేయలేదు. చిరంజీవి సినిమాల విషయాలకొస్తే..ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు ‘దసరా’ఫేం శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. -
దర్శకుడితో నయనతార గొడవ.. ఆగిపోయిన సినిమా!
స్టార్ హీరోయిన్ నయనతార ( Nayanthara) ఈ మధ్య ఎక్కువ విమర్శలకు గురవుతుంది. రీసెంట్ గానే ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. మూకుత్తి అమ్మన్ 2 సినిమా పూజా కార్యక్రమాల్లో తోటి నటి మీనాను అవమానపరిచారు అంటూ ఆమెను ట్రోల్ చేశారు. తాజాగా నయనతారపై మరో పుకారు నెట్టింట హల్చల్ చేస్తోంది. మూకుత్తి అమ్మన్ 2 సినిమా సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్తో నయనతార గొడవపడిందట. ఇదే విషయంపై దర్శకుడు సుందర్.సీ, నయనతారల మధ్య విభేధాలు రావడంతో షూటింగ్ నిలిపివేసిట్లు తెలుస్తోంది.నయనతార హీరోయిన్గా సుందర్ సి దర్శకత్వంలో ‘మూకుతి అమ్మన్ 2’ (Mookuthi Amman 2) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా కాస్ట్యూమ్ విషయంలో నయనతార , ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మధ్య చిన్నపాటి వివాదం జరిగినట్లు సమాచారం. ఈ సంఘటన నయనతారకు నచ్చకపోవడంతో ఆమె ఆ అసిస్టెంట్ డైరెక్టర్ను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. ఈ చిన్న విషయం కాస్త పెద్ద వివాదంగా మారడంతో దర్శకుడు సుందర్ సి షూటింగ్కు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు వినికిడి. నయనతార ప్రవర్తన సుందర్ సికి సంతృప్తి కలిగించకపోవడంతో, ఆమెను సినిమా నుంచి తొలగించి, మరో సీనియర్ నటిని తీసుకొని చిత్రాన్ని కొనసాగించాలనే ఆలోచన చేశాడట. అయితే నిర్మాత ఇషారి కె. గణేష్ జోక్యం చేసుకుని నయనతారతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారట. ప్రస్తుతం చెన్నైలోని ఓ దేవాలయంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.'మూకుత్తి అమ్మన్ 2' విషయానికొస్తే.. 2020లో సూపర్ హిట్గా నిలిచిన ‘మూకుత్తి అమ్మన్' సినిమాకు సీక్వెల్ ఇది. ‘మూకుత్తి అమ్మన్' చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా.. సీక్వెల్ని సుందర్.సి తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో నయనతారతో పాటు ఇనియా, రెజీనా కసెండ్రా, మైనా నందిని, దునియా విజయ్, సింగం పులి, యోగిబాబు లాంటి పెద్ద స్టార్స్ ఉన్నారు. ఈ సినిమాలో అమ్మన్ క్యారెక్టర్లో నటించడానికి నయనతార నెల రోజులకు పైగా ఉపవాసం ఉండి నటిస్తున్నారు. ఈ సినిమాకి హిప్ హాప్ ఆది మ్యూజిక్ డైరెక్టర్. -
#SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి?
ఒక ప్రొడక్టును సృష్టించడం కంటే.. దాని మార్కెటింగ్ ఎంత బాగా చేశామనేది వ్యాపారంలో పాటించాల్సిన ముఖ్య సూత్రం. మన దేశంలో.. సినిమా అనే వ్యాపారంలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిని ఈ విషయంలో కొట్టగలిగేవారే లేరని ఇంతకాలం చెప్పుకున్నాం. అయితే తాజా #SSMB29 లీక్లతో ఈ విషయంలో కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.సినిమా మేకింగ్లో రాజమౌళి(Rajamouli)ది ఢిపరెంట్ స్కూల్. హీరోలతో సహా ప్రతీ టెక్నీషియన్కు కార్పొరేట్ కల్చర్ తరహాలో ఐడీ కార్డు జారీ చేస్తుంటారు. సెట్స్కి మొబైల్స్ తేవడం బ్యాన్.. అంతేకాదు ఈ విషయంలో ప్రత్యేక నిఘా కూడా పెడుతుంటారు. ఇలా.. ఒక సినిమా షూటింగ్ విషయంలో ఇంత జాగ్రత్తలు పాటిస్తుంటాడు దర్శకుధీరుడు. అంతెందుకు ఓ సినిమా మేకింగ్నే(RRR) ఏకంగా ఒక డాక్యుమెంటరీగా తీయించి వదిలిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. అలాంటిది మహేష్ బాబుతో తీస్తున్న చిత్రం విషయంలో ఎక్కడ పారపాటు.. కాదు పొరపాట్లు జరుగుతున్నాయి?.సూపర్ స్టార్ మహేష్బాబు హీరో. మళయాళ స్టార్ హీరో ఫృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఓ కీలక పాత్ర. ఏకంగా.. ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్. ఇంకా ఊహించని సర్ప్రైజ్లు ఎన్నెన్నో ఉండొచ్చు. అలాంటిది పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇలాంటి లీక్లతో అవన్నీ బయటకు వచ్చేయవా?..ఎక్కడో ఒడిషాలో మారుమూల చోట ప్రత్యేక సెట్టింగులలో షూటింగ్ జరుపుకుంటోంది SSMB20 చిత్రం. తొలుత అక్కడి పోలీస్ అధికారులతో దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ వెంటనే అక్కడి ఛానెల్స్లో సెట్స్ను లాంగ్షాట్స్లో లైవ్ చూపించేశాయి. ఆ మరుసటి రోజే.. మహేష్ బాబు పాల్గొన్న షూటింగ్ సీన్.. అదీ చాలా క్లోజప్ షాట్లో బయటకు రావడం ఎంబీఫ్యాన్స్నే కాదు.. యావత్ చలనచిత్ర పరిశ్రమేనే షాక్కు గురి చేసింది . దీంతో ఆ వీడియోను తొలగించే చర్యలు చేపట్టినట్లు చిత్ర యూనిట్ తరఫు నుంచి ఒక ప్రకటన బయటకు వచ్చింది.ఆర్ఆర్ఆర్ తరహాలోనే.. మహేష్ బాబు సినిమాకు సైతం సెట్స్కు ఫోన్లు తేవడం నిషేధించారు. అయినప్పటికీ ఆ సీన్ను ఎవరు.. ఎలా షూట్ చేశారు?. అదీ అది అంత దగ్గరగా ఉండి మరీ?. ప్రస్తుతం ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమా షూటింగ్లకు బయటి వాళ్లను అనుమతించరు. షూటింగ్ కోసం తెచ్చే జూనియర్ ఆర్టిస్టులకు సైతం స్ట్రిక్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తుంటాయి. అలాంటప్పుడు లీకులకు అవకాశం ఎక్కడిది?. పనిరాక్షసుడిగా పేరున్న ఆయన పెట్టిన రూల్స్ బ్రేక్ చేసిందెవరు?. కొంపదీసి.. ఇది కావాలని చేసిన లీక్ కాదు కదా! అనే చర్చ సైతం ఇప్పుడు జోరుగా నడుస్తోంది. అయితే..సినిమా ప్రమోషన్ విషయంలో రాజమౌళి స్ట్రాటజీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అంతేగానీ ఇంత చెత్తగా మాత్రం ఉండదు!. సినిమా ప్రమోషన్ల కోసం నిర్మాతతో మంచి నీళ్లలా డబ్బులు ఖర్చు చేయిస్తాడనే విమర్శ కూడా జక్కన్న మీద ఉంది కదా. అలాంటప్పుడు భారీ బడ్జెట్తో.. అదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా విషయంలో ఇలా ఎందుకు జరగనిస్తాడు?. ఏది ఏమైనా రాజమౌళి-మహేష్ బాబు సినిమా నుంచి.. అదీ షూటింగ్ మొదలైన తొలినాళ్లలోనే ఇలాంటి లీకులు కావడంతో.. వాట్ ద F*** అని ఒక్కసారిగా అనుకుంది టీఎఫ్ఐ అంతా. ఇంత చర్చ నడుస్తుండడంతో.. ఇకనైనా లీకుల విషయంలో జాగ్రత్త పడతారేమో చూడాలి మరి!.ఇదీ చదవండి: రాజమౌళికి బిగ్ షాక్.. మహేష్ బాబు వీడియో బయటకు! -
‘మజాకా’ చిత్రం లైవ్ సాంగ్ షూటింగ్ ఎక్స్ పీరియన్స్ (ఫొటోలు)
-
కండరాల ఎలర్జీతో బాధపడుతున్న కుష్బూ
సీనియర్ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు కుష్బూ ప్రస్తుతం షూటింగులతో బిజీగా ఉన్నారు. అయితే ఆమె ఎడమ చేతి కండరాలు ఎలర్జీకి గురైంది. సాధారణంగా ఇలాంటి ఎనర్జీ తీవ్ర నొప్పికి గురి చేస్తుంది. నటి కుష్బూ ఇప్పుడు నొప్పితో బాధపడుతున్నారు. క్రీడాకారులు తీవ్ర ఎక్సర్సైజులు చేయడం కారణంగా ఇలాంటి కండరాల ఎలర్జీకి గురవుతుంటారు. ఇంతకుముందు చాలా బొద్దుగా ఉండే నటి కుష్బూ కూడా కసరత్తులు చేసి స్లిమ్గా తయారైన విషయం తెలిసిందే. లేకపోతే ఈమె అంత నొప్పితోనూ మంగళవారం కూడా షూటింగ్లో పాల్గొన్నారు. అదేవిధంగా మరో పక్క వైద్యులు ఆమె చేతికి ఫిజియోథెరపీ వైద్యం అందిస్తున్నారు. కాగా తన చేతికి కట్టుతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆమె ఫోటోలు చూసిన అభిమానులు కంగారు పడుతున్నారు. కుష్బూ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారు. -
కాంతారగడ
యశవంతపుర: హిట్ మూవీ, జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన కాంతారకు, అలాగే నటుడు రిషభ్ శెట్టి, దర్శక నిర్మాతలకు చిక్కొచ్చిపడింది. నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార–2 (చాప్టర్ 1) సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా గవిగుడ్డలో కాంతార–2 యూనిట్ సినిమా షూటింగ్ చేస్తోంది. అటవీ ప్రాంతంలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని స్థానిక నాయకులు కొందరు యసలూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పేలుళ్లు కూడా జరుపుతున్నారని, దీని వల్ల ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని ఆరోపించారు. ప్రశి్నస్తే షూటింగ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు చెప్పారు. కావాలంటే మరోచోటుకు వెళ్లి చిత్రీకరణ చేసుకోవాలని, ఇక్కడ మాత్రం వద్దని గ్రామస్తులు కూడా గళమెత్తారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే తాను కోర్టులకైనా వెళతామని చెప్పడం గమనార్హం. షూటింగ్ అనుమతులు ఇలా జిల్లా యసళూరు విభాగం శనివార సంత అనే చోట హేరూరు గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో జనవరి 3 నుంచి 15 వరకు తాత్కాలిక సెట్టింగ్ల నిర్మాణానికి, 15 నుంచి 25 వరకు షూటింగ్ చిత్రీకరణకు నియమాలతో అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాసన్ ఎసీఎఫ్ మధు, ఆర్ఎఫ్ఒ కృష్ణలు పరిశీలించా. గత 10 రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. అటవీ ప్రాంతంలోకి వందలాది మంది వస్తూ పోతూ ఉన్నారు. అనుమతులు తీసుకున్న ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతోందని కూడా ఆరోపణలు రావడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నిజమైతే రద్దు చేయాలి: మంత్రి ఖండ్రేఈ నేపథ్యంలో అక్కడ కాంతార సినిమా షూటింగ్ను రద్దు చేయాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె అధికారులను ఆదేశించారు. వన్యజీవులు, ప్రకృతికి హాని జరుగుతుంటే తక్షణం షూటింగ్ను బంద్ చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రకృతి పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి ఈశ్వరఖండ్రె లేఖ రాశారు. చిత్ర నిర్వాహకులు అడవిలో ఉవ్వెత్తున మంటలను వేసి షూటింగ్ చేయడం, పేలుళ్లు జరిపినట్లు తెలిసిందని మంత్రి ఖండ్రే లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల అక్కడ వన్యజీవులు, చెట్లుచేమలకు ముప్పు వస్తుందని పత్రికలలో వార్తలు వచ్చాయని, ఇదే నిజమైతే తక్షణం షూటింగ్ను రద్దు చేయాలని సూచించారు. ఈ పరిణామాలతో షూటింగ్ కొనసాగడం అనుమానంగా ఉంది. -
కార్తీ 'సత్యం సుందరం' HD మూవీ స్టిల్స్
-
‘రస్ట్’ కేసు కొట్టివేత
శాంటా ఫే: ‘రస్ట్’ సినిమా షూటింగ్ రిహార్సల్స్ సమయంలో 2021లో అలెక్ బాల్డ్విన్(61) చేతిలోని తుపాకీ పేలి సినిమాటోగ్రాఫర్ హలియానా హట్చిన్ ప్రాణాలు కోల్పోయిన ఘటన కేసు మూడేళ్లకు అనూహ్యంగా సుఖాంతమయింది. నటుడు అలెక్ బాల్డ్విన్పై ఉన్న ‘అసంకల్పిత హత్య’ ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగానే న్యూ మెక్సికో కోర్టు జడ్జి అకస్మాత్తుగా కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. కేసులో సాక్షులను అడ్డుకుంటూ పోలీసులు, లాయర్లు వ్యవహరించిన తీరు ఆధారంగానే తీర్పు ఇచ్చినట్లు జడ్జి మేరీ మార్లో సోమర్ తెలిపారు. కోర్టు హాల్లోనే ఉన్న బాల్డ్విన్ తీర్పు విని పట్టరాని ఆనందంతో ఏడ్చేశారు. మూడు దశాబ్దాలకు పైగా మంచి నటుడిగా పేరున్న బాల్డ్విన్ కెరీర్ 2021 నాటి ఘటనతో ప్రశ్నార్థకంలో పడింది. -
సైన్స్ ఫిక్షన్ తరహాలో ‘MERGE’
రాజు గుడిగుంట్ల నిర్మాణం లో ‘MERGE’ అనే ఓ కొత్త సినిమా ప్రారంభం అయింది. లేడీ లయన్ క్రియేషన్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 03గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విక్రమ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో జబర్దస్త్ రాము, అంబటి శ్రీను, శక్తి చైతన్య ,పెరికల మాధురి, హరి తేజ, చంటి, దిలీప్, బాలరాజు, తదితరులు తారాగణం నటించనున్నారు. నేడు(జులై 10) హైదరాబాద్ లోని శ్రీ భద్రకాళి పీఠం లో డాక్టర్ సింధు మాతాజీ గారి ఆశీస్సులతో షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాత రాజు గుడిగుంట్ల గారు మీడియా తో మాట్లాడుతూ ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ నెల 15 వ తేదీన విజయవాడలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నూతన దర్శకుడు విక్రమ్ ప్రసాద్ ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ తరహా లో రొటీన్ కథకు భిన్నంగా ఉండబోతుంది అని తెలిపారు. -
తన సినిమా షూటింగ్స్ పై డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
షూటింగ్లో గాయపడ్డ స్టార్ హీరోయిన్
సినిమా షూటింగ్లో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గాయపడ్డారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ షూటింగ్ సమయంలో ఆమెకు స్వల్ప గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంకనే సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన గొంతు మీద చిన్న స్క్రాచ్ అయిన ఫోటోని ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ..‘వృత్తి జీవితంలో ప్రమాదాలు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ‘స్టంట్’ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. (చదవండి: అనుష్కకు అరుదైన వ్యాధి.. పగలబడి నవ్వేస్తారట!)‘ది బ్లఫ్’లో ప్రియాంక చోప్రా యాక్షన్ రోల్ ప్లే చేస్తోంది. ఆమెకు సంబంధించిన కొన్ని యాక్షన్స్ సీన్స్ తెరకెక్కించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. షూటింగ్లో ప్రమాదాలు జరగడం ప్రియాంకకు కొత్తేమి కాదు. గతంలోనూ పలు సినిమాల షూటింగ్ సమయంలో ఆమె ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు పెదవి చివర చిన్న గాయంతో పాటు మెడపై గాటు పడింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ‘జాగ్రత్త’ మేడం అంటూ అమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.(చదవండి: అనారోగ్యంతో మంచానపడ్డ అభిమాని.. పిల్లల బాధ్యత భుజానెత్తుకున్న మహేశ్)సినిమాల విషయాలకొస్తే.. ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ప్రియాంకా చోప్రా.. 2018లో అమెరికా సింగర్ నిక్ జోనాస్ను పెళ్లి చేసుకొని తన మకాంను హాలీవుడ్కి మార్చేసింది. ప్రస్తుతం హాలీవుడ్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. చివరగా సిటాడెల్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. -
వెహికల్స్ బంద్.. సినిమా షూటింగ్స్కి అంతరాయం
టాలీవుడ్లో మరో సమ్మె సైరన్ మోగింది. తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినిమా అండ్ టీవీ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ బంద్కి పిలుపునిచ్చాయి. దీంతో పలు సినిమాల షూటింగ్స్కి అంతరాయం ఏర్పడింది. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఈ బంద్ని కొనసాగిస్తామని అసోసియేషన్ ప్రెసిడెంట్ హనీఫ్ చెప్పారు. ‘దాదాపు 900 వెహికల్స్ మా అసోసియేషన్లో ఉన్నాయి. 1200 మంది ఓనర్లు సభ్యులుగా ఉన్నారు. గతంలో నిర్మాతల మండలికి మా సమస్యలను విన్నవించినా.. పట్టించుకోలేదు. ఈ రోజు లేదా రేపు మరోసారి నిర్మాతల మండలితో చర్చలు జరుపుతాం. వెహికల్ రెంట్ పెంచడంతో పాటు మా సమస్యలను తీర్చేవరకు ఈ బంద్ కొనసాగిస్తాం’అని హనీఫ్ అన్నారు. తమ సమస్యలు వెంటనే పర్కిరించాలని అని చైర్మన్ విజయ్ కుమార్ డిమాండ్ అన్నారు. -
కొత్త కబురు చెప్పిన సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ కొత్త కబురు చెపారు. తన కెరీర్లోని 40వ సినిమాను ప్రకటించారు. ‘8 తోట్టాకళ్’ ఫేమ్ శ్రీ గణేశ్ దర్శకత్వం వహించనున్న ఈ ద్విభాషా (తెలుగు– తమిళం) చిత్రాన్ని ‘మావీరన్’ ఫేమ్ అరుణ్ విశ్వ నిర్మించనున్నారు. శనివారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘చాలా స్క్రిప్ట్స్ విన్న తర్వాత శ్రీగణేశ్ చెప్పిన ఈ సినిమా కథ నచ్చడంతో ఓకే చెపాను. అరుణ్ విశ్వలాంటి మంచి నిర్మాతతో కలిసి సినిమా చేయడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాను అందిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ మొదలుపెట్టినప్పుడు యూత్తో పాటు పరిణితి గల నటుడు కావాలనుకున్నాను. అందుకే సిద్ధార్థ్ కరెక్ట్ అనుకున్నాను. ఆయన కొన్ని సూచనలు పంచుకున్నారు’’ అన్నారు శ్రీ గణేశ్. ‘‘దర్శకుడు కథ చెప్పినప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా, భాషలకు అతీతంగా ఆకట్టుకునే చిత్రం అవుతుందని నేను బలంగా నమ్మాను. జూన్లో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు అరుణ్ విశ్వ. -
బేబీ బంప్తోనే సినిమా షూటింగ్లో పాల్గొన్న టాప్ హీరోయిన్
బాలీవుడ్లో బెస్ట్ కపుల్గా పేరున్న దీపికా పదుకొణె- రణ్వీర్ తమ అభిమానులకు కొద్దిరోజు క్రితమే గుడ్న్యూస్ చెప్పారు. తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్లో డెలివరీ డేట్ కూడా ఇచ్చినట్లు దీపిక ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఆమె చేతిలో ఇప్పటికే పలు సినిమాలు ఉన్నాయి. నెలలు గడుస్తున్న కొద్ది షూటింగ్స్కు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. దీంతో నిర్మాతలకు ఎలాంటి నష్టం వాటిల్ల కూడదని దీపికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. తాజాగా సోషల్ మీడియాలో దీపికా పదుకొణె షూటింగ్ స్సాట్లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న 'సింగం ఎగైన్' సినిమా సెట్స్లో దీపికా కనిపించింది. ఆ ఫోటోలలో బేబీ బంప్తో దీపికా కనిపిస్తుంది. ఈ చిత్రంలో శక్తి శెట్టిగా దీపికా కనిపించనుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. పోలీస్ యూనిఫాం ధరించి 'కూల్' గ్లాస్తో అదిరిపోయే లుక్లో దీపికా కనిపిస్తుంది. ఫిబ్రవరిలో ఆమె గర్భం దాల్చినట్లు ప్రకటించిన తర్వాతా తిరిగి షూటింగ్లో పాల్గొనడం ఇదే తొలిసారి. గర్భంతో ఉన్నా కూడా దీపికా షూటింగ్లో పాల్గొనడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కానీ కొందరు మాత్రం ఫోటోలో బేబీ బంప్ పూర్తిగా కనిపించకపోవడం లేదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి చాలా బిగుతుగా ఉన్న డ్రెస్ను ఆమె ధరించడంతో బేబీ బంప్ పెద్దగా కనిపించలేదు. సినిమా కోసం దీపికా జాగ్రత్త పడుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. -
బ్యాక్ టు షూట్
దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి నటిగా మేకప్ వేసుకున్నారు ప్రియాంకా చోప్రా. ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా, ప్రియాంకా చోప్రా, జాక్ క్వాయిడ్, స్టీఫెన్ రూట్ ప్రధాన పాత్రధారులుగా హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో మొదలైంది. ‘‘..అండ్ వుయ్ ఆర్ బ్యాక్..’’ అంటూ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమా స్క్రిప్ట్ను తన ఇన్స్టా స్టేటస్లో షేర్ చేశారు ప్రియాంకా చోప్రా. దీంతో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ షూట్లో ఆమె పాల్గొంటున్నారని స్పష్టమైంది. ఇక రెండు నెలల క్రితం తన వ్యక్తిగత పనుల కోసం ప్రియాంకా చోప్రా ఇండియా వచ్చారు. సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం వేడుకలో చురుగ్గా పాల్గొన్నారు ప్రియాంక. ఈ వేడుకతో పాటు మరికొన్ని పనులను చక్కబెట్టుకుని ప్రియాంకా చోప్రా మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు. -
తనకు అంత పిచ్చి ఉంటుందనుకోలేదు
‘‘డైరెక్టర్ సుకుమార్గారి టీమ్లో బుచ్చిబాబు బెస్ట్. తనకు సినిమా అంటే పిచ్చి. ‘రంగస్థలం’ కథని సుకుమార్గారు నాకు నలభై నిమిషాలు చె΄్పారు. ఆ తర్వాత ప్రతి రోజూ నాకు రెండేసి గంటలు నెరేష¯Œ ఇచ్చింది మాత్రం బుచ్చిబాబునే. తనకు సినిమా అంటే అంత పిచ్చి ఉంటుందనుకోలేదు’’ అని హీరో రామ్చరణ్ అన్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బుధవారం ్రపారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బోనీ కపూర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో చిరంజీవి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ను యూనిట్కి అందించారు. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ ‘‘నేను, జాన్వీ కలిసి ‘జగదేకవీరుడు–అతిలోక సుందరి’ లాంటి మూవీ చేయాలని చాలామంది అనుకున్నారు. మా కాంబినేషన్ ‘ఆర్సీ 16’తో నిజం కావడం హ్యాపీ’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో రామ్చరణ్గారు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటాను’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘బుచ్చిబాబు ఏదైనా పెద్దగా ఆలోచిస్తాడు. తన కథపై తనకు ఉన్న నమ్మకం అలా ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘‘ఈ సినిమాకి ఇప్పటికే మూడు ట్యూ¯Œ ్స పూర్తి చేశాం’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ‘‘నేను ఎంతగానో అభిమానించే ప్రముఖులందరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం’’ అన్నారు జాన్వీ కపూర్. ‘‘బుచ్చిబాబు ఈ సినిమాతో తప్పకుండా మరో హిట్ కొడతాడు’’ అన్నారు నిర్మాత నవీన్ ఎర్నేని. ఈ ్రపారంభోత్సవంలో నిర్మాతలు వై. రవిశంకర్, ‘దిల్’ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, నాగవంశీ, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పకుడు: సుకుమార్, కెమెరా: రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: వి.వై. ప్రవీణ్ కుమార్. -
AP Cinema : మినీ స్టూడియోతో హార్సిలీహిల్స్కు మహర్దశ
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. హార్సిలీహిల్స్పై మినీ స్టూడియోను నిర్మిస్తే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. దీని ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలతో హార్సిలీహిల్స్ భవిష్యత్లో సినిమా చిత్రీకరణలకు ప్రముఖ కేంద్రంగా మారనుంది. తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధితోపాటు ఆర్థికంగానూ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ఎత్తయిన కొండల సొగసులు, ప్రకృతి అందాలు, దట్టమైన అటవీప్రాంతం, చుట్టూ కొండలతో హార్సిలీíహిల్స్ ఇప్పటికే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వందకుపైగా చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. 1966లో సూపర్స్టార్ కృష్ణ నటించిన కన్నెమనసులు సినిమాతో మొదలై ఎన్నో కన్నడ, తెలుగు, తమిళ సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగింది. అయితే ఏ ప్రభుత్వం ఇక్కడ షూటింగ్ కోసం చర్యలు చేపట్టలేదు. దీంతో 1996లో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా తర్వాత పెద్ద నటులెవరూ హార్సిలీహిల్స్ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ దర్శకనిర్మాత మహీ వీ రాఘవ కొండపై మినీ స్టూడియో, అమ్యూజ్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో హార్సిలీహిల్స్కు మంచి రోజులు రానున్నాయని అంటున్నారు. మళ్లీ ఈ మధ్యే సందడి.. ఈ మధ్యకాలంలో హార్సిలీహిల్స్ పరిసర ప్రాంతాల్లో సినిమాలు, వెబ్ సిరీస్ చిత్రీకరణల సందడి నెలకొంది. మహీ వీ రాఘవ ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ చేస్తే నిర్మాణ వ్యయం భారీగా తగ్గించుకునే అవకాశం ఉందని గుర్తించి ఇటువైపు అడుగులు వేశారు. ఆయన దర్శకత్వం వహించిన పాఠశాల, యాత్ర–2 చిత్రీకరణలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. సైతాన్ వెబ్ సిరీస్ను సైతం ఇక్కడే చేశారు. ఇంకా విడుదలకాని ‘సిద్ధా లోకం ఎలా ఉంది’ కూడా ఇక్కడే నిర్మాణం జరుపుకుంది. మహీ వీ రాఘవే కాకుండా ఇంకా పలువురు సినిమాలు, వెబ్ సిరీస్లను చిత్రీకరిస్తున్నారు. మినీ స్టూడియోతో ఎన్నో సౌకర్యాలు కొండపై మినీ స్టుడియో నిర్మాణం కోసం రెండెకరాల భూమిని కేటాయించాలని మహీ వీ రాఘన ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మినీ స్టూడియోతో ఎన్నో రకాలుగా స్థానికులు లబ్ధి పొందడమే కాకుండా, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా ఆర్థికంగానూ ప్రయోజనాలు ఉంటాయి. స్టూడియో ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్కోసం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. లైట్స్, చిన్న కెమెరాలు, జనరేటర్లు, వాహనాలు, వెబ్ సిరీస్ కోసం అవసరమైనవి షూటింగ్ కోసం వెంట తీసుకురావాల్సిన పరిస్థితి ఉండదు. షూటింగ్కు వచ్చేవారికి విడిది సౌకర్యాలు, భోజనం, షూటింగ్లో పనులు.. ఇలా ప్రతి విషయంలోనూ స్థానికులకు ఆర్థికంగా ప్రయోజనం లభిస్తుంది. పెద్ద సినిమాలు లేకున్నా ఏడాదికి రెండు వెబ్ సిరీస్ల చిత్రీకరణ జరిగినా రూ.5 నుంచి రూ.10 కోట్లు ఖర్చవుతుంది. కాబట్టి స్థానికులకు వివిధ రకాలుగా ఆదాయం లభిస్తుంది. స్థానికులకు ఆదాయం, తక్కువ ఖర్చుతో చిత్రీకరణే లక్ష్యం.. హార్సిలీహిల్స్పై మినీ స్టూడియో ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని షూటింగ్లకు కేంద్రంగా చేయాలన్నదే లక్ష్యం. ఇక్కడి ప్రదేశాలను వెబ్సైట్లో పెట్టి సినిమా చిత్రీకరణలకు అనువనే విషయాన్ని తెలియజేస్తాం. మదనపల్లె, ఆరోగ్యవరం, పరిసర ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ప్రచారం చేస్తాం. పురాతన కట్టడాలు, భవనాలు, పల్లెలు హార్సిలీహిల్స్ పరిసరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సినిమాలు, వెబ్ సిరీస్లు తక్కువ ఖర్చుతో చిత్రీకరణ చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తాం. అనుభవజ్ఞులైన వారిని నియమించి సహకారం అందిస్తాం. స్థానికులకు ఆదాయ మార్గాలు పెంచేలా చూస్తాం. –మహీ వీ రాఘవ, ప్రముఖ దర్శకనిర్మాత -
నాపరాయి గనుల్లో రజనీకాంత్ షూటింగ్
యర్రగుంట్ల : మండలంలోని నిడుజివ్వి గ్రామ పరిధిలోని నాపరాయి గనులలో సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెట్టయన్ (వేటగాడు) సినిమా షూటింగ్ మంగళవారం జరిగింది. లైకా ప్రొడక్షన్ సారథ్యంలో రజనీకాంత్ 170వ సినిమాను దర్శకుడు టీజే జ్ఙానవేల్ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ విలన్తో మాట్లాడి ఫైట్ చేయడం చిత్రీకరించారు. అభిమానుల తాకిడి అధికంగా ఉండటంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, రజనీకాంత్కు సమీప సిమెంట్ పరిశ్రమ గెస్ట్హౌస్లో బస ఏర్పాటు చేశారు. -
‘పురుషోత్తముడు’ మారిన రాజ్ తరుణ్..డబ్బింగ్ పనుల్లో బిజీ
రాజ్ తరుణ్ హీరో గా రామ్ భీమన దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పురుషోత్తముడు'. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. రాజమండ్రి లో వేసిన భారి సెట్ లో టాకీ పూర్తి చేసుకున్న సంధర్భంగా 22న టైటిల్ రివీల్ పోస్టర్ ని విడుదల చేశారు. అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ట రోజు ఆదే సమయానికి టైటిల్ రివీల్ చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు రామ్ భీమన తెలిపారు. నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో భారీ తారాగణం తో పాటు సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరచిన పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని, చిత్రం గొప్ప విజయం సాధించబోతుందని తెలిపారు. తన కెరీర్ లో పురుషోత్తముడు గొప్ప చిత్రం అవుతుందని కెమెరామెన్ పి.జి.విందా పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. -
కల్లర్ మ్యాజిక్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న మన హీరోలు
కథ బొగ్గు గనుల్లో జరుగుతోంది.. అక్కడ పనిచేసేవాళ్లు ఎలా కనిపిస్తారు? ఫుల్ డార్క్గా.. కథ బంగారు గనుల్లో జరుగుతోంది.. కానీ తవ్వేవాళ్లు బంగారంలా మెరిసిపోరు.. కమలిపోయిన చర్మంతో ఉంటారు. ఇక మత్స్యకారులో... వాళ్లూ అంతే.. స్కిన్ ట్యాన్ అయిపోతుంది. ఇప్పుడు కొందరు హీరోలు ఇలా ఫుల్ బ్లాక్గా, ట్యాన్ అయిన స్కిన్తో కనిపిస్తున్నారు. పాత్రలకు తగ్గట్టు బ్లాక్ మేకప్ వేసుకుని, సిల్వర్ స్క్రీన్పై మేజిక్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 31లో కొత్తగా... హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్ 31’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ఎలా ఉంటుందో? అనే ఆసక్తి ఇటు చిత్ర వర్గాల్లో అటు సినిమా లవర్స్లో నెలకొంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్లో ఎన్టీఆర్ పూర్తి నలుపు రంగు మేకప్లో కనిపించారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్’ల తరహాలో ఎన్టీఆర్ 31 బ్లాక్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని టాక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్ 31’ షూటింగ్ ఈ ఏడాది లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందనుంది. ‘‘ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేయని పాత్ర, కథతో ‘ఎన్టీఆర్ 31’ సినిమా చేయబోతున్నాను. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్ కనిపిస్తారు’’ అంటూ ప్రశాంత్ నీల్ ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. గోల్డ్ ఫీల్డ్స్లో తంగలాన్ పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు విక్రమ్. దర్శకుడి విజన్ 100 శాతం అయితే విక్రమ్ 200 శాతం న్యాయం చేస్తారనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన విక్రమ్ ‘తంగలాన్’ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ డ్రామాగా రూపొందింది. బ్రిటిష్ పరిపాలన కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ ఆదివాసి తెగ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట. ఇందులో విక్రమ్ ఆ తెగ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్ ఫస్ట్ లుక్ పూర్తి స్థాయి నలుపులో ఎంతో వైవిధ్యంగా ఉంది. మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాని తొలుత సంక్రాంతికి, ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్లో రిలీజ్ చేయ నున్నట్లు ఇటీవల పేర్కొన్నారు. భ్రమయుగంలో... దాదాపు 50 ఏళ్ల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు మమ్ముట్టి. అయితే ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్త పాత్రని ‘భ్రమయుగం’ సినిమాలో పోషిస్తున్నారాయన. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘భ్రమయుగం’. హారర్ థ్రిల్లర్ జోనర్లో కేరళలోని కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందుతోంది. అక్కడి చీకటి యుగాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర పూర్తి నలుపు రంగులో ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘భ్రమయుగం’ మలయాళ టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన టీజర్లో సరికొత్త లుక్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు మమ్ముట్టి. రామచంద్ర చక్రవర్తి నిర్మిస్తున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. గొర్రెల కాపరి పృథ్వీరాజ్ సుకుమారన్ హ్యాండ్సమ్గా ఉంటారు. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తొలిసారి ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమా కోసం పూర్తి స్థాయిలో నల్లటి మనిషిగా మారిపోయారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బ్లెస్సీ. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి సౌదీ అరేబియాకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. గొర్రెల కాపరి నజీబ్ పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్. గుబురు గడ్డం,పొడవైన జుట్టుతో నలుపు రంగులో ఉన్న పృథ్వీరాజ్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ పాత్ర కోసం ఆయన బరువు తగ్గారు. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా మాదేనంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది. ∙హ్యాండ్సమ్గా, పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగచైతన్య ‘తండేల్’ సినిమా కోసం పక్కా మాస్ అవతారంలోకి మారిపోయారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం మత్య్సకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. 2018లో జరిగిన వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్’ అంటూ ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెబుతారు. నిజమే.. ఆయన కటౌట్ చూస్తే అలానే అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారాయన. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదలై హిట్గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బ్యాక్డ్రాప్ అంతా బ్లాక్గా ఉంటుంది. బొగ్గు గనుల్లో మెకానిక్ దేవ పాత్రలో ప్రభాస్ లుక్ కూడా బ్లాక్ షేడ్లో ఉంటుంది. రెండో భాగంలోనూ ప్రభాస్ ట్యాన్ లుక్లో కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ప్రయోగాలు చేసే హీరోల్లో సూర్య ఒకరు. కమల్హాసన్ గత బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ (2022)లో రోలెక్స్ పాత్రలో ట్యాన్ లుక్లో కనిపించారు సూర్య. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్లో ఈ పాత్ర వస్తుంది. రెండో భాగంలోనూ ఉంటుంది. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. అలాగే విడుదలకు సిద్ధమవుతున్న ‘కంగువా’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హీరో సూర్య ట్యాన్ లుక్లో కనిపిస్తారు. -
బీచ్రోడ్డులో రాజ్ తరుణ్ సందడి
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు మంగమారిపేట, తొట్లకొండ బీచ్ వద్ద శనివారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. నటుడు రాజ్ తరుణ్, నటి మనీషా కందూర్ నటిస్తున్న భలే ఉన్నాడే సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. రవికిరణ్ ఆర్ట్స్ పతాకంపై ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కుతోందని, హీరో రాజ్ తరుణ్ న్యూలుక్లో కనిపించబోతున్నారని దర్శకుడు జె. శివసాయి వర్ధన్ తెలిపారు. ఈ సినిమాలో సింగీతం శ్రీనివాస్ ప్రముఖ పాత్రలో నటించగా, అమ్ము అభి (నారప్ప ఫేమ్), కృష్ణ భగవాన్, హైపర్ ఆది ఇతర పాత్రలో నటిస్తున్నారన్నారు. సంగీతం శేఖర్ చంద్ర అందిస్తున్నారు. మరో 8 రోజుల పాటు బీచ్రోడ్డు ప్రాంతాల్లో చిత్రీకరణ ఉంటుందన్నారు. -
షూటింగ్లో గొడవ.. తెలుగు యంగ్ హీరో కారుని అడ్డుకున్న కూలీలు
తెలుగు యంగ్ హీరో శ్రీవిష్ణుకు కొందరు కూలీలు షాకిచ్చారు. కొత్త సినిమా షూటింగ్లో భాగంగా అనుకోని సంఘటన ఎదురైంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని బనగానెపల్లె మండలం యాగంటి క్షేత్రంలో సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనేందుకు కోసం కొందరు కూలీలని చిత్రబృందం తీసుకొచ్చింది. అయితే పూర్తయిన తర్వాత వాళ్లకు వేతనం ఇచ్చే విషయం కాస్త ఆలస్యమైంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) ఈ క్రమంలోనే తమకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని దాదాపు 400 మంది కూలీలు.. షూటింగ్ లొకేషన్లో ఆందోళన చేశారు. అటుగా వెళ్తున్న హీరో కారుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీన్లోకి ఎంటరైన పోలీసులు.. కూలీలకు సర్దిచెప్పారు. హీరోకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అతడు కారుని పోనిచ్చారు. ఆ తర్వాత వివాదం కూడా సద్దుమణిగింది. గతేడాది 'సామజవరగమన' సినిమాతో హిట్ కొట్టిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగమ్మాయి రీతూవర్మ కూడా గతేడాది 'మార్క్ ఆంటోని', 'ధృవ నక్షత్రం' లాంటి మూవీస్తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న మూవీకే తాజాగా సమస్య ఎదురైంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) -
2024 లో దూసుకొస్తున్న పాన్ ఇండియా హీరోలు
-
తెలుగు సినిమాలు చేయడం అలవాటుగా మారింది: సుహాసిని
నా తొలి సినిమా విడుదలై నేటికి సరిగ్గా 43 ఏళ్ళు. ఇప్పటి వరకు కెరీర్లో ఎన్నో చిత్రాలు చేశాను. ఎన్నో జయపజయాలు చూశాను. అవన్నీ గతంలోనే వదిలేసి ఇప్పుడే తొలి చేస్తున్నా అనే అనుభూతితో ‘మహతి’ చేశాను. మహతి కథ, నా పాత్ర చాలా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. టైటిల్ కి తగట్టు మహిళా ప్రాధాన్యత గల చక్కని అంశాలు ఉన్నాయి’ అని సీనియర్ నటి సుహాసిని మణిరత్నం అన్నారు. సందీప్ మాధవ్ కథానాయకుడిగా శివ ప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో శ్రీ పద్మిని సినిమాస్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న చిత్రం 'మాహతి'. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ..తెలుగులో వరుసగా సినిమాలు చేయడం ఒక అలవాటుగా మారింది. ‘మహతి’లాంటి మంచి చిత్రంతో కెరీర్ పరంగా 44వ ఏడాదిని ప్రారంభిస్తున్నాను. ఒక క్రైమ్ చేయడం కంటే ఆ క్రైమ్ ని చూస్తూ ఏం చేయకుండా ఊరుకోవడం ఇంకా పెద్ద క్రైమ్. అదే ఈ సినిమా ప్రధానాంశం. ఇందులో ఉండే పాత్రలని అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు. చాలా మంచి టీం కలసి పని చేస్తున్నాం’ అని అన్నారు. డైరెక్టర్ శివ ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ కథని తీర్చిదిద్దారు.సుహాసిని గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అనందంగా ఉంది’అని హీరో సందీప్ మాధవ్ అన్నారు. ‘మహతి కథ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’అని నటి దీప్సిక అన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
ప్రమాదం వల్ల అప్పుడు ఆపేశారు.. ఇప్పుడు మళ్లీ షురూ!
తమిళ స్టార్ హీరో అజిత్ కొత్త సినిమా 'విడాముయర్చి'. మగిళ్ తిరమేని దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చాలాకాలం తరువాత త్రిష, అజిత్ మూవీలో నటిస్తుండటం విశేషం. ప్రియా భవానీ శంకర్, సంజయ్ దత్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) తొలి షెడ్యూల్ అజర్ బైజాన్ దేశంలో చేశారు. అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్ ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో మధ్యలో నిలిపేశారు. చిన్న గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ ఆ దేశానికి చెక్కేశారు. తాజాగా హీరో అజిత్.. చైన్నె విమానాశ్రయంలో అభిమానితో దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అజర్ బైజాన్లో మిగతా షెడ్యూల్కి సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తి చేసుకుని.. కొన్ని రోజుల తర్వాత మూవీ యూనిట్ చెన్నైకి తిరిగొస్తారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) -
ఎక్స్ట్రార్డినరీ సాంగ్
ఎక్స్ట్రార్డినరీ లెవల్లో డ్యాన్స్ చేశారు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా: ఆర్డినరీ మ్యాన్’. రాజశేఖర్ ఓ కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. ఓ భారీ సెట్లో 300 మందికి పైగా ఫారిన్ డ్యాన్సర్స్తో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో నితిన్, శ్రీలీలపై ఓ మాస్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవు తుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని యూనిట్ పేర్కొంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యా మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జైరాజ్. -
హీరోతో కలిసి ఎంగిలి ఐస్క్రీమ్ తినమన్నారు.. ఇబ్బంది పడ్డా: సుహాసిని
ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోయిన్గా కొనసాగారు సుహాసిని. చిరంజీవి, బాలకృష్ణ, వెంటకేశ్ లాంటి బడా హీరోలందరితోనూ నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో తల్లి పాత్రతో పాటు సహాయక నటిగా చేస్తోంది. అయితే హీరోయిన్గా చేసినప్పుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల గురించి తాజాగా ఓ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడారు. ‘గతంలో హీరోయిన్గా చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే..సున్నితంగా తిరస్కరించేదాన్ని. ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉంది. అది చేయాలని డైరెక్టర్ చెబితే.. నేను నో చెప్పాను. పరాయి వ్యక్తి ఒడిలో కూర్చోవడం తప్పు..కాబట్టి నేను ఆ సీన్ చేయనని గట్టిగా వాధించాను. (చదవండి: స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్!) అదే సినిమాలో హీరో కలిసి ఐస్క్రీమ్ తినే సీన్ ఉంది. హీరో తిన్న ఐస్క్రీమ్నే తినాలని నాకు చెప్పారు. అది నాకు నచ్చలేదు. ‘వేరే వాళ్లు ఎంగిలి చేసింది నేను తినడం ఏంటి? ఐస్క్రీమ్ మార్చండి’అని ఫైర్ అయ్యాను. దీంతో కొరియోగ్రాఫర్ షాకయ్యారు. నేను చెప్పిన విధంగా చేయలని నాపైకి సీరియస్ అయ్యాడు. అయినా కూడా నేను అంగీకరించలేదు. ఐస్క్రీమ్ తినడం కాదు కదా కనీసం ముట్టుకోబోనని తెగేసి చెప్పారు. ఆ తర్వాత ఐస్క్రీమ్ మార్చారు’అని సుహాసిన చెప్పికొచిఉ్చంది. -
వాస్తవ సంఘటనలతో ‘భ్రమర’
30 ఇయర్స్ పృద్వి , పృద్వి రాజ్(పెళ్లి) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భ్రమర. టి.వి రవి నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగమహేష్, జయవాణి,మీసాల లక్ష్మణ్, జబర్దస్త్ అప్పారావు, ఆకెళ్ళ, దువ్వాసి మోహన్, పసునూరి శ్రీనివాస్, మాణిక్యం, టార్జాన్ ఇతర కీలక పాత్రలో పోషిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..తెలంగాణ ఎఫ్.డి.సి.చైర్మన్ అనిల్ కుర్మచలం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో గెస్ట్ గా వచ్చిన హైకోర్ట్ అడ్వకేట్ సుంకర నరేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. అయితే ప్రజలను అవగాహన పరస్తూ ప్రజలలో చైతన్యం తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో దర్శక, నిర్మాతలు డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్స్ లో "భ్రమర" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ టైటిల్ లో ఎటువంటి సౌండ్ ఉందో సినిమాలో కూడా అటువంటి సౌండ్ ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు మీడియా తో పాటు ప్రేక్షకులు కూడా సపోర్ట్ చేస్తూ మూవీ యూనిట్ ను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ‘డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్ మీద ఈ సినిమా నడుస్తుంది. .ఢిల్లీ, కొల్ కత్తా, చిక్మంగళూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నాము. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రాహుల్ శ్రీ వాత్సవ్, మ్యూజిక్ డైరెక్టర్ గా కార్తీక్ బి. కొడగండ్ల చేస్తున్నారు. ఇంపార్టెంట్ రోల్ లో సీనియర్ నటులు 30 ఇయర్స్ పృద్వి ,పెళ్లి సినిమా పృద్వి రాజ్ తో పాటు నికితశ్రీ లీడ్ రోల్ లో నటిస్తుంది’అని దర్శకుడు టీవీ రవి నారాయణన్ అన్నారు. ‘మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఇలాంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని నటి నిత్య శ్రీ అన్నారు -
నల్గొండ 'నాగిరెడ్డిపల్లి' లో ‘గేమ్ ఛేంజర్’ గా కనిపించిన హీరో రాంచరణ్..
నల్గొండ: భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల శ్రీ భీమరావ్ రైస్ గోదాములో హీరో రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా గోదాములోని కల్తీ బియ్యం పట్టుకునే సన్నివేశాలు చిత్రీకరించారు. శంకర్ దర్శకత్వంలో దిల్రాజ్ నిర్మాతగా ఎస్వీసీ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రంలోని గోదాముకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ శనివారం కూడా ఇక్కడే కొనసాగనుంది. -
చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. వివరాలు ఇవే
భారీ అంచనాల మధ్య విడుదలైన భోళా శంకర్ చిరంజీవి కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని తన తన తదుపరి సినిమాల విషయంలో నిర్ణయం తీసుకుంటాడని సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. వరుస పరాజయల తర్వాత కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే.. కొత్త సినిమా ప్రకటన ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే, మెగాస్టార్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ లేదని, ఇలాంటి ఒడిదుడుకులు సహజమేనని ఈ ప్రకటనతో చిరంజీవి తెలిపారని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: ఆ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్తో పాటు ఆరుగురు వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్స్) ముందుగా అనుకొన్నట్టుగానే తన పుట్టిన రోజున నేడు (ఆగష్టు 22) కొత్త సినిమా ప్రకటన వచ్చేస్తోంది. దానిలో భాగంగానే కొన్నిగంటల క్రితం యూవీ క్రియేషన్స్ ట్విటర్ ద్వారా ఒక పోస్టర్ను విడుదల చేసింది. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి చెయబోయే సినిమా ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా యూవీ క్రియేషన్స్ అధికారికంగా సోషల్మీడియాలో ఒక పోస్టర్తో గుడ్న్యూస్ తెలిపింది. నేడు 10:53 నిమిషాలకు మెగాస్టార్ మూవీకి చెందిన పలు వివరాలను ప్రకటిస్తామని వారు వెల్లడించారు. యూవీ క్రియేషన్స్-చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్తో బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మెగాఫోన్ పట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. (ఇదీ చదవండి: ఫైనల్గా వశిష్ఠకే దక్కిన మెగా 157 ప్రాజెక్ట్) The universe conspires for beautiful things to happen ✨ One man inspires us to achieve the universe itself 💫 Stay tuned to @UV_Creations ❤️ Today at 10.53 AM 🔮#HBDMegastarChiranjeevi pic.twitter.com/v7W9LCB8Ij — UV Creations (@UV_Creations) August 21, 2023 -
కాజోల్ కొత్త 'మిస్టరీ' మొదలైంది
బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్, కృతీసనన్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘దో పత్తీ’. మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాకి శశాంకా చతుర్వేది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. కృతీసనన్ , కాజోల్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు శశాంక. ఈ సినిమాను రచయిత కనికా థిల్లాన్ , కృతీసనన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా డైరెక్ట్గా స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు 2015లో షారుక్ ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘దిల్వాలే’ చిత్రంలో కాజోల్, కృతీసనన్ కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు ‘దో పత్తీ’ కోసం ఈ ఇద్దరూ సెట్స్లో జాయిన్ అవుతున్నారు. -
The Gentlemen 2 launch : జెంటిల్మేన్-2 ప్రారంభం.. కీరవాణికి సన్మానం (ఫొటోలు)
-
డిఫరెంట్ కాన్సెప్ట్తో ‘కలియుగం పట్టణంలో’
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా తాజా చిత్రం‘కలియుగ పట్టణంలో’. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం టైటిల్ లోగోని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదగా రిలీజ్ చేయగా.. మంచి స్పందల లభించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కడప జిల్లాలోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ఒకే షెడ్యూల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేస్తామని నిర్మాతలు చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమాను మేకర్లు రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ మాధవనేని కెమెరామెన్గా పని చేస్తున్నారు. గ్యారీ బీ.హెచ్. ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు. -
పట్టణంలో వినోదం
సుహాస్, షాలిని కొండేపూడి జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘కేబుల్ రెడ్డి’. శ్రీధర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీధర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి, స్క్రిప్ట్ని మేకర్స్కు అందించారు. అనంతరం సుహాస్ మాట్లాడుతూ– ‘‘రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఒక టౌన్లో జరిగే క్లీన్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. ‘‘బౌండెడ్ స్క్రిప్ట్తో షూట్కి వెళ్తున్నాం. మొదటి షెడ్యూల్ను 20 రోజుల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు బాలు వల్లు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగల. -
ప్రేమ.. వినోదం
‘చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్ జంటగా కొత్త సినిమా షురూ అయింది. సాయి తేజ దర్శకత్వంలో గౌతమ్స్ ఈగల్ ఎంటర్టైన్మెంట్పై ఎం.గౌతమ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది.ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాతలు సి.కల్యాణ్ క్లాప్ కొట్టగా, బెక్కం వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కామెడీ, లవ్, ఎమోషన్స్ .. వంటి ఆకట్టుకునే అంశాలు ఈ మూవీలో ఉంటాయి’’ అన్నారు ఎం.గౌతమ్. నిర్మాత రాచాల యుగంధర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మోహన్ పున్న,లైన్ ప్రొడ్యూసర్: వంశీ కృష్ణ, కెమెరా: పీసీ మౌళి, సంగీతం: గ్యాని. -
సంజోష్ హీరోగా కొత్త చిత్రం
బేవర్స్ చిత్రంతో హీరోగా తెరకు పరిచయం అయ్యాడు సంజోష్. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఆ చిత్రంలో సంజోష్ తన నటనతో అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం ఆయన కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా చంద్ర నిర్మిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో సంజోష్ బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ ప్రత్యేకంగా విషెస్ చెబుతూ, పోస్టర్ను రిలీజ్ చేసింది. (చదవండి: జులై 13 నాకు చాలా స్పెషల్ : సమంత) ఈ పోస్టర్లో సంజోష్ కూల్గా కనిపిస్తున్నాడు. పక్కింటి అబ్బాయిలా సహజంగా కనిపిస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు. -
శివ కార్తికేయన్ ‘మహావీరుడు’మూవీ స్టిల్స్
-
సమంత కీలక నిర్ణయం.. షాక్లో అభిమానులు!
అభిమానులకు, నిర్మాతలకు స్టార్ హీరోయిన్ సమంత భారీ షాకిచ్చింది. కొంతకాలం వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సమంత ‘సీటాడెల్’వెబ్ సిరీస్లో నటిస్తుంది. దీంతో పాటు విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ చిత్రం చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ నడుస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తయిన తర్వాత సమంత లాంగ్ బ్రేక్ తీసుకోనున్నారట. ఇకపై ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారట. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టనున్నారట. వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే ఆమె కొత్త సినిమాలకు సైన్ చేస్తారట. ఆ లోపు ఖుషి సినిమా ప్రమోషన్స్కి మాత్రం ఆమె హాజరవుతారవుతున్నట్లు సమాచారం. (చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) కొత్త సినిమాలకు కోసం తీసుకున్న అడ్వాన్స్లను తిరిగి నిర్మాతలకు ఇచ్చేస్తుండటంతో ఇకపై సామ్ సినిమాలు చేస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏడాది గ్యాప్ తర్వాత తిరిగి కచ్చితంగా సినిమాల్లో నటిస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి సమంత నిర్ణయంతో అటు ఫ్యాన్స్, ఇటు నిర్మాతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. -
స్టార్ హీరో షారుక్ ఖాన్కి యాక్సిడెంట్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్కి ప్రమాదం జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ సీన్ సందర్భంగా గాయమైంది. దీంతో హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పెద్దగా ప్రమాదం లేదని చెప్పినప్పటికీ.. మైనర్ సర్జరీ అవసరమని సూచించారట. ప్రస్తుతం షారుక్.. స్వదేశానికి వచ్చేశారని, రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) షారుక్కి యాక్సిడెంట్ నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. తన కొత్త సినిమా షూటింగ్ కోసం కొన్నాళ్ల ముందు షారుక్ లాస్ ఏంజెల్స్ వెళ్లారు. ఓ సన్నివేశం తీస్తున్న క్రమంలోనే ఆయన ముక్కుకి తీవ్ర గాయమైంది. డాక్టర్స్ అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడంతో త్వరగానే డిశ్చార్జ్ అయిపోయారు. కానీ మైనర్ సర్జరీ చేయాలని సూచించారు. ఈ ప్రమాదం కొన్నిరోజుల క్రితమే జరిగనప్పటికీ.. ఇప్పుడు ఈ విషయం లీక్ అయింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ షారుక్ క్షేమంగానే ఉన్నారని తెలిసి రిలాక్స్ అయ్యారు. 'జవాన్' కోసం వెయిటింగ్ దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన షారుక్ ఖాన్.. 'పఠాన్'తో బ్లాక్బ్లస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' మూవీ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో చేసిన 'జవాన్' విడుదలకు రెడీగా ఉంది. ఇది సెప్టెంబరు 7న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశాయి. ఇలా షారుక్ సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. గాయమైందనే వార్త కాస్త కలవరపరిచింది. (ఇదీ చదవండి: పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్తో!) -
ప్రెగ్నెంట్ అని తెలిసినా..ఆ అవకాశం వదులుకోలేదు: అలియా
వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. తాజాగా ఈ బ్యూటీ హాలీవుడ్లోనూ తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధమైంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’మూవీతో ఈ భామ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా.. ఈ మూవీ షూటింగ్ అనుభవాలు పంచుకుంది. ‘గతేడాది ఏప్రీల్లో రణ్బీర్తో నా పెళ్లి అయిన వెంటనే ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ షూటింగ్ ప్రారంభమైంది. అదే ఏడాది జూన్లో నేను గర్భం దాల్చాను. అయినప్పటికీ షూటింగ్లో పాల్గొన్నాను. షూటింగ్ మొత్తం అయ్యాక..కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాకపోవడంతో వాటిని మళ్ళీ రీషూట్ చెయ్యాలి అన్నారు. అప్పటికే నేను ప్రెగ్నెంట్. కానీ ఈ విషయం చెప్పకుండా షూటింగ్లో పాల్గొన్నాను. (చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!) అయితే కొంతమంది మాత్రం నా బేబీ బంప్ని గుర్తించారు. ఆ తర్వాత సులభంగా చీత్రీకరణలో పాల్గొన్నాను. షూటింగ్ సమయంలో చిత్రబృందం నాకు చాలా సౌకర్యాలు కల్పించింది. అందుకే ప్రెగ్నెంట్ అయినా సులభతరంగా షూటింగ్ పూర్తి చేశా. ఇది నా మొదటి హాలీవుడ్ మూవీ.అందుకే వదులుకోకూడదని ప్రెగ్నెంట్ అని తెలిసినా సినిమా చేశాను’అని అలియా చెప్పుకొచ్చింది. కాగా గతేడాది ఏప్రిల్లో స్టార్ హీరో రణబీర్ కపూర్తో అలియా పెళ్లి అయింది. ఆ తర్వాత రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. అదే ఏడాది నవంబర్లో ఓ పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. -
Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ మూవీ స్టిల్స్
-
మహిళల నేపథ్యంలో...
విశ్వ కార్తికేయ, ఆయుషీ పటేల్ జంటగా దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. కె. చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మిస్తున్నారు. తొలి సీన్కి దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత కేఎస్ రామారావు క్లాప్ కొట్టారు. డైరెక్టర్ నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సుమన్ స్క్రిప్ట్ని అందించారు. ‘‘స్త్రీలకు తల్లవ్వడం అనేది అదృష్టం. ఆ లక్ని సరిగ్గా వినియోగించుకోక΄ోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కథ’’ అన్నారు. ‘‘జూలైలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు చంద్ర ఓబుల్ రెడ్డి, రమేష్. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: అజయ్ అరసాడ. -
శ్రీకాకుళం యాసతో...
రవి మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా చల్లా రాజా రామ్మోహన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. బేబీ లాస్య రెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్పై వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా రాజా రామ్మోహన్ మాట్లాడుతూ– ‘‘కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలతో ఈ చిత్ర కథ ఆసక్తిగా ఉంటుంది. శ్రీకాకుళం యాస ఇతివృత్తంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, శియా గౌతమ్, ‘బాహుబలి’ ప్రభాకర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజేష్ రంబాల. -
లవ్... క్రైమ్
ప్రదీప్ విరాజ్, దివ్య ఖుష్వా జంటగా మనోజ్ ఎల్లుమహంతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా క్లాప్ ఇచ్చారు. బిజినెస్మ్యాన్ రామ్ ఎర్రమ్ స్క్రిప్ట్ని చిత్రయూనిట్కు అందించారు. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బీఎన్కే (బంగారు నవీన్ కుమార్) నిర్మించనున్నారు. దర్శకుడు మనోజ్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు బీఎన్కే. ఈ సినిమాకు కెమెరా: పంకజ్ తట్టోడ. -
షూటింగ్లో ప్రమాదం.. సల్మాన్ఖాన్కు గాయాలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గాయపడ్డాడు. సినిమా షూటింగ్లో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా సల్మాన్ భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ తెలిపారు. ఎడమ భుజానికి గాయమైనట్లుత తెలుపుతూ ఓ ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశారు.దీంతో గెట్ వెల్ సూన్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సల్మాన్ ‘టైగర్-3’షూటింగ్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైకి సీక్వెల్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతుంది. ఈ మూవీలో సల్మాన్పై భారీ యాక్షన్ సీన్స్ను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా సల్మాన్ భుజానికి గాయమైంది. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. చదవండి: ఒకే ఫ్రేమ్లో రజనీకాంత్, కపిల్ దేవ్.. నెట్టింట ఫోటో వైరల్ అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఓ యాక్షన్ సీన్ కూడా ఉండనుందట. ఇటీవలె కిసీకా భాయ్ కిసీకి జాన్తో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్కు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో టైగర్-3 కోసం బాగానే కసరత్తులు చేస్తున్నాడు ఈ కండల వీరుడు. Wen u think u r carrying the weight of the world on your shoulders , he says duniya ko chodo paanch kilo ka dumbbell utha ke dikhao .Tiger Zakhmi Hai . #Tiger3 pic.twitter.com/nyNahitd24 — Salman Khan (@BeingSalmanKhan) May 18, 2023 -
మహేశ్- రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్
హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆరంభించే ఆలోచనలో ఉన్నట్లుగా ఈ చిత్ర కథారచయిత విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. (చదవండి: పుష్ప 2పై అదిరిపోయే అప్డేట్.. ఆయన ప్రతీకారం మామూలుగా ఉండదట! ) ఇందుకు తగ్గట్లుగా ప్రీప్రొడక్షన్ వర్క్స్ను సెట్ చేస్తున్నారట రాజమౌళి అండ్ కో. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకోన్, ఆలియా భట్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే వెకేషన్కు వెళ్లిన మహేశ్ స్పెయిన్ నుంచి హైదరాబాద్కు తిరిగొచ్చారు. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నారు మహేశ్బాబు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది. -
సుడిగాలి సుధీర్ నాలుగో సినిమా షురూ
సుడిగాలి సుధీర్ హీరోగా నాలుగో సినిమా ‘ఎస్ఎస్4’ (వర్కింగ్ టైటిల్) షురూ అయింది. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్. లక్కీ మీడియా–మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్పై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి నిర్మాతలు డి. సురేశ్ బాబు, కేఎస్ రామారావు, సూర్యదేవర రాధాకృష్ణ, కేఎల్ దామోదర ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. తొలి సీన్కి నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ కొట్టారు. ‘‘మంచి కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇది’’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్. ‘‘ఒక గంట కథ వినగానే ఒప్పుకున్న సుధీర్కి థ్యాంక్స్’’ అన్నారు నరేష్ కుప్పిలి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం. -
శివ కార్తికేయన్, సాయి పల్లవి కొత్త సినిమా వేడుక (ఫొటోలు)
-
వరస సినిమాలు తో దూసుకుపోతున్న విశ్వక్
-
విశ్వక్సేన్ కొత్త మూవీకి ముహుర్తం.. క్లాప్ కొట్టిన దిల్ రాజు (ఫొటోలు)
-
చిలుకూరు బాలాజీ టెంపుల్ పాడుబడిందని అక్కడ మహేష్ బాబు సినిమా చేయలేదు
-
నితిన్, రష్మిక మందన చిత్రం మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో ప్రారంభం (ఫొటోలు)
-
రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
-
Allari Naresh: అల్లరి నరేశ్ 61వ సినిమా ఘనంగా ప్రారంభోత్సవం ( ఫొటోలు)
-
ఏ హైదరాబాద్కే పోకుండా.. గీ గోదావరిఖనిల తీసుడు ఎందుకే బావా?
‘సిన్మా తీయాలంటే ఏ హైదరాబాద్కే పోకుండా.. గీ గోదావరిఖనిల తీసుడు ఎందుకే బావా?..’.. ‘ఏతులు గొట్టకుండా సింగిల్ లైన్లో ఒక్కటి చెప్పన్నారా? గోదావరి ఖనిల సిన్మా తియ్యాల్నంటే 100 దళపతులు, 100 రక్తచరిత్రలు తీయొచ్చు..’ .. ఇటీవల గోదావరిఖని నేపథ్యంలో వచ్చింన ‘కొత్త సినిమా’ చిత్రం ట్రైలర్లోని సంభాషణలివి.. ఇవి కేవలం సినిమాలో డైలాగులు మాత్రమే కాదు. జరుగుతున్న వాస్తవం కూడా. ఒకప్పుడు కేవలం బొగ్గు వెలికితీతకు కేంద్రంగా మాత్రమే సింగరేణి పారిశ్రామిక ప్రాంతానికి గుర్తింపు ఉండేది. అడపాదడపా సినిమాల షూటింగులు జరిగినా.. కార్మిక హక్కుల కోసం తీసిన సినిమాల్లో ఒకట్రెండు సన్నివేశాలనే చిత్రీకరించారు. కాలక్రమంలో పరిస్థితి మారింది. నాలుగేళ్ల కింద గనుల నేపథ్యంలో విడుదలైన ‘కేజీఎఫ్’ సినిమా మంచి జనాదరణ దక్కించుకుంది. ఓపెన్ మైన్లలో పోరాట సన్నివేశాలు ఆ చిత్రానికి హైలైట్గా నిలిచాయి. అలాంటి సన్నివేశాలు, పోరాట దృశ్యాలు ఉండాలని కొందరు సినీహీరోలు, దర్శకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గనులకు నిలయమైన గోదావరిఖనికి ఆదరణ పెరిగింది. ఎన్నో ప్రత్యేకతలతో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) గోదావరి లోయను ఆనుకుని సింగరేణి పారిశ్రామిక ప్రాంతం ఉంది. విశాలమైన గోదావరి నది, దాని లోయను ఆనుకుని ఏర్పడిన సింగరేణి గనులు, ఎన్టీపీసీ, బొగ్గురవాణా కోసం ఏర్పాటైన ప్రత్యేక రైల్వే లైన్లు, రైల్వే బ్రిడ్జీలు, కన్వేయర్ బెల్టులు, 40 నుంచి 50 అడుగుల ఎత్తయిన భారీ డంపర్లు, క్రేన్లు ఇలా భారీ యంత్రాలు, హంగామా వంటివి ఇక్కడ కనిపిస్తాయి. రెండు రకాల గనులతో.. ఇక్కడి గనుల్లో రెండు రకాలు ఉంటాయి. బొగ్గు నిక్షేపాలను గుర్తించిన కొత్తలో ఏటవాలుగా క్రమపద్ధతిలో లోపలికి తవ్వి బొగ్గు తీస్తే అది భూగర్భ మైనింగ్. నిల్వలు చివరిదశకు వచ్చాక పేలుళ్లతో మిగతా బొగ్గును వెలికితీసి, భారీ యంత్రాలతో తరలిస్తే ఓపెన్కాస్ట్ (ఉపరితల మైనింగ్). ఇవి వందల మీటర్ల లోతు వరకు ఉంటాయి. బొగ్గు కోసం నిత్యం జరిపే పేలుళ్లతో బొగ్గు పెళ్లలు వందల అడుగులు పైకెగిరి పడుతూ ఉంటాయి. ఆ బొగ్గును తరలించేందుకు భారీ క్రేన్లు, డంపర్లు ఉంటాయి. బయటి ప్రాంతాల వారికి ఇదంతా కొత్త ప్రపంచం. కేజీఎఫ్ సినిమా కూడా ఇలాంటి ఓపెన్ కాస్ట్ ఇనుప ఖనిజం గనుల్లో తీసిందే కావడం గమనార్హం. మెల్లగా పెరుగుతున్నషూటింగ్లు.. భారీ యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో సింగరేణి ఓపెన్ కాస్టుల్లో షూటింగులు పెరుగుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ చిత్రంలోని పలు యాక్షన్ సన్నివేశాలను ఇటీవలే సెంటినరీ కాలనీ సమీపంలోని ఓపెన్కాస్టుల్లో షూట్ చేశారు. నాని నటించిన ‘దసరా’ సినిమా పూర్తిగా గోదావరిఖని పట్టణానికి ఆనుకుని ఉన్న ‘వీర్లపల్లె’ నేపథ్యంగా వచ్చింనదే. ఆ చిత్రాన్ని కూడా ఓపెన్కాస్టు గనుల్లోనే చిత్రీకరించారు. ఇక జాతిరత్నాలు సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు అనుదీప్ తొలిచిత్రం ‘పిట్టగోడ’ కూడా గోదావరిఖని నేపథ్యంలో తీసినదే. ఇక ఇటీవల విడుదలైన క్రైం థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు కూడా మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ‘సిరోంచ’ పేరుతో తీసిన సినిమాను నేరుగా యూట్యూబ్లో విడుదల చేశారు. ఆ సినిమా నచ్చింనవారు దర్శకుడికి ఇప్పటికీ డబ్బులు పంపుతున్నారు. ఇవే కాకుండా ‘కొత్త సినిమా’ పేరుతో ఒక చిత్రం, మరికొన్ని సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకొంటున్నాయి. గతంలో ఆర్.నారాయణమూర్తి చీకటిసూర్యులు, రానా నటించిన లీడర్ వంటి సినిమాల్లోని పలు సీన్లను ఈ ప్రాంతంలోనే చిత్రీకరించారు. సినిమా షూటింగ్లకు అనుకూలం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం సినిమా షూటింగ్లకు ఎంతగానో అనుకూలం. సలార్ సినిమా షూటింగ్ ఓసీపీ–2లో రెండువారాల పాటు సాగింది. భూగర్భగనులు, ఓసీపీలు, ఓబీ ప్రాంతాల్లో షూటింగ్లు చేయవచ్చు. సినిమాలతోపాటు టెలిఫిల్్మలు, చిన్న సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది. – కె.నారాయణ, ఆర్జీ–1 గని జనరల్ మేనేజర్ -
సస్పెన్స్ థ్రిల్లర్గా ‘హలో ఎవరు?’
టాలీవుడ్లో సస్పెన్స్ థ్రిల్లర్స్కు మంచి ఆదరణ ఉంది. అందుకే దర్శకనిర్మాతలు ఆ తరహా కథలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే తెలుగు ప్రేక్షకులను భయపెట్టడానికి మరో సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతుంది. వెంకట్రెడ్డి నంది దర్శకనిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హలో ఎవరు?’ అనే టైటిల్ని ఖరారు చేశారు. . శ్రీశివసాయి ఫిల్మ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రంతో జయ్ పాపిరెడ్డి కటకం, సౌమ్యశ్రీ ఉంతకల్ హీరోహీరోయిన్లుగా, వినాయక్ విలన్గా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎడిటింగ్, డబ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డీఐ పనులు జరుపుకుంటోంది. ఈ క్రైం ఆండ్ హరర్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు దర్శకనిర్మాత వెంకట్రెడ్డి నంది తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని, ఇండస్ట్రీలో ఈ చిత్రానికి స్పెషల్ క్రేజ్ రావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మే నెలలో 'హలో ఎవరు?' చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. -
బిగ్ బీ అమితాబ్ కు ప్రమాదం
-
కొద్దిలో చావు నుంచి తప్పించుకున్న విశాల్
-
కొద్దిలో చావు నుంచి తప్పించుకున్న విశాల్, వీడియో వైరల్
కోలీవుడ్ హీరో విశాల్ యాక్షన్ సీన్లలో డూప్ లేకుండా నటిస్తూ ఎన్నోసార్లు గాయపడ్డాడు. తాజాగా ఆయన 'మార్క్ ఆంటోని' సినిమా షూటింగ్లో ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అదుపుతప్పి వేగంగా వస్తున్న ట్రక్కు.. కింద పడి ఉన్న విశాల్ పక్క నుంచే వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ ప్రమాదం సంభవించిందని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది. అటు విశాల్ కూడా ఈ వీడియో షేర్ చేస్తూ.. 'కొద్ది క్షణాలు.. కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది. థ్యాంక్ గాడ్.. ఈ ప్రమాదం తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొన్నాం' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నటుడు దీపక్ పరమేశ్ దీనిపై స్పందిస్తూ.. 'చూడటానికే భయంకరంగా ఉంది. నీకేం కాలేదు, అంతే చాలు. మిగతా అందరూ కూడా క్షేమంగానే ఉన్నారని భావిస్తున్నాను' అని రాసుకొచ్చాడు. అభిమానులు సైతం 'షాట్ కోసం నిర్లక్ష్యంగా ఉండకండి, నిన్ను నమ్ముకుని చాలామందిమి ఉన్నాం, నువ్వు మాకెంతో అవసరం' అని కామెంట్లు చేస్తున్నారు. Jus missed my life in a matter of few seconds and few inches, Thanks to the Almighty Numb to this incident back on my feet and back to shoot, GB pic.twitter.com/bL7sbc9dOu — Vishal (@VishalKOfficial) February 22, 2023 చదవండి: గతేడాదే నా పెళ్లైపోయింది: రకుల్ -
వికాస్ హీరోగా దుశ్శాసన్ చిత్రం
తమిళ సినిమా: నటుడు వికాస్ కథానాయకుడిగా నటిస్తున్న దుశ్శాసన్ చిత్రం ఆదివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాయ్ తిరైయరంగం పతాకంపై ఎస్.అరుణ్ విఘ్నేశ్, ఆర్వేల్ మురుగన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. దళపతి దర్శకత్వం వహిస్తున్నారు. నటి రోహిణి నాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మనోహర్, మిల్టన్ మెడిసన్, ప్రభు శాస్త్రి, వేలాంగణి, సాయి రోహిణి, విఘ్నేష్ వీఎస్, శరవణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి బాల మురుగన్ చాయాగ్రహణం, విజయ్ ప్రభు సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ.. ద్రౌపతికి వ్రస్తాపహరణం చేసిన వాడే దుశ్శాసనుడు కాదు. ఇతరుల అవమానాలను, బాధలను పట్టించుకోకుండా తన స్వార్థం కోసం ఇతరులను మానసికంగా హింసించేవాడు.. వారి హక్కులను, ప్రాణాలను బలికొనేవాడూ దుశ్శాసనుడే అని చెప్పే కథా చిత్రంగా ఉంటుందన్నారు. దుకాణాల్లో దొంగతనం సంఘటనతో చిత్ర కథ మొదలయ్యి పోలీసుల దర్యాప్తు వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న చిత్రం దుశ్శాసన్ అని చెప్పారు. ఇందులో మూడు పాటలు, రెండు ఫైట్స్ ఉంటాయని తెలిపారు. -
కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర రామ్చరణ్ రాజకీయ సభ (ఫోటోలు)
-
జీవితంలో వెలుతురిని వెతుక్కోవాలి: సామ్ పోస్ట్ వైరల్
నిజ జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైన వాటిని బలంగా చేసుకుంటూ ముందుకు సాగుతుంది సమంత. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడాకులు.. ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడడం..ఇలా మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైన మనోధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. ధైర్యంగా నిలబడి మయోసైటిస్ని ఎదుర్కొంది. ఇప్పుడు రెట్టింపు ఉత్సహాంతో సినిమాల్లోకి వచ్చింది. (చదవండి: వాణి జయరామ్ పోస్ట్ మార్టం పూర్తి..తలకు ఒకటిన్నర ఇంచు గాయం!) చాలా కాలం తర్వాత ఇప్పుడు మేకప్ వేసుకొని కెమెరా ముందుకు రాబోతుంది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ను సెట్స్ మీదకు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్దేవరకొండ ‘ఖుషీ’ చిత్రంలోనూ సామ్ నటించనుంది. ఇన్నాళ్లు అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన సామ్.. ఇప్పుడు షూటింగ్లో పాల్గొనడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, సీటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్కి బయల్దేరిన సామ్.. కారులో ప్రయాణిస్తూ కళ్లు మూసుకొని ఓ ఫోటోకి పోజులిచ్చింది. ఆ ఫోటోని ఇన్స్టాలో షేర్ చేస్తూ.. వెలుతురిని మనమే వెతుక్కోవాలి అని క్యాప్షన్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
Saindhav Movie: ఘనంగా ప్రారంభమైన వెంకటేష్ 75వ చిత్రం (ఫొటోలు)
-
మహేష్, భూమిక హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం
యువ నటులు మహేష్, భూమిక హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. సి.హెచ్ సుజాత నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంతో సజ్జా కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గోల్డెన్ సినీ క్రియషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ లో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుజాత మాట్లాడుతూ.. ‘మా బ్యానర్ గోల్డెన్ సినీ క్రియషన్స్ లో ప్రొడక్షన్ నెం.1 చిత్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. డైరక్టర్ కుమార్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’అని అన్నారు. ‘మంచి సినిమా చేస్తాడని నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటాను’ అని దర్శకుడు కుమార్ అన్నారు. ‘ఈ సినిమాతో సుజాత, కుమార్లకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’అని సీనియర్ ప్రొడ్యూసర్ రామరాజు అన్నారు. షూటింగ్ ప్రారంభోత్సవంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు, విలయిల్ ఫిలిప్స్ థామస్ పాల్గొన్నారు. -
సత్యం రాజేష్ హీరోగా కొత్త చిత్రం.. షూటింగ్ షురూ
సత్యం రాజేష్, రిహ, సునీత హీరో హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి తెంగాణ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించబడుతుంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, మధు నందన్, చమ్మక్ చంద్ర, తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. -
హాసిని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్లో ‘యాక్షన్ డ్రామా- థ్రిల్లర్’
అభయ్, అస్మిత నర్వాల్, గిరిష్మ నేత్రిక హీరోహీరోయిన్లుగా హాసిని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్పై పాత్ లోథ్ శంకర్ గౌడ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్ సుమధుర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్లో జరిగాయి. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ పాత్ లోథ్ శంకర్ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు ఆర్ సుమధుర్ కృష్ణ మాట్లాడుతూ... యాక్షన్ డ్రామా, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇలాంటి కాన్సెప్ట్తో తెలుగులో ఇంతవరకు ఏ చిత్రం రాలేదు. జనవరి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది’ అని తెలిపారు. ‘డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను’అని హీరో అభయ్ అన్నారు. ఈ సినిమాలో నేను నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర చేయబోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు’అని అస్మిత నర్వాల్ అన్నారు. ‘ఒక మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’అని హీరోయిన్ గిరిష్మ అన్నారు. -
లండన్కు వెళ్లనున్న అనుష్క..10 రోజుల అక్కడే..కారణం ఇదే
టాలీవుడ్లో అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దేవసేనకు.. హీరోలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2005లో సూపర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు. బాహుబలి లాంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ అయింది. అనుష్క చివరిగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. . యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క నటిస్తుంది. ఇదిలా ఉంటే అనుష్క ఇప్పుడు లండన్ వెళ్లేందుకు సిద్దమతుందని సమాచారం. అయితే ఇది హాలీడే ట్రిప్ కాదట.. నవీన్ పొలిశెటి సినిమా షూటింగ్ కోసం ఆమె లండన్ వెళ్తున్నారు. దాదాపు పదిరోజుల పాటు అక్కడ షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్లో అనుష్క, నవీన్ పొలిశెట్టిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. లండన్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్లో కొన్ని కీలకమైన సీన్స్ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ ఎండ్లోగా షూటింగ్ను పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తోన్నారు. (చదవండి: స్వీటీకి అనుష్క పేరు ఎలా వచ్చిందో తెలుసా?) -
అరవింద్ స్వామితో ఫైట్కు సిద్ధమైన నాగచైతన్య
నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కృతీశెట్టి హీరోయిన్. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో ఆరంభం అయింది. ఓ భారీ సెట్లో నాగచైతన్య, అరవింద్ స్వామిలపై యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ మహేశ్ మాథ్యూ డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్లో కృతీశెట్టి, శరత్కుమార్, సంపత్ రాజ్ కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాకు తండ్రీకొడుకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా స్వరకర్తలు. -
Kajal Agarwal: కొడుకు విషయంలో కాజల్ షాకింగ్ నిర్ణయం!
సినిమాల కోసం కాజల్ అగర్వాల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ టాలీవుడ్ ‘చందమామ’ కి జూన్ 19న పండంటి మగ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన సమయమంతా కొడుకుకే కేటాయిస్తుంది ఈ బ్యూటీ. తల్లిగా తను పొందే ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటుంది. దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. మళ్లీ ఇటీవల షూటింగ్లకు హాజరవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుందట. దీంతో కొడుకు బాగోగులు చూసుకోవడం కాజల్కు ఇబ్బంది అవుతుందట. అందుకే కుమారుడి బాధ్యతను తన చెల్లి నిషా అగర్వాల్కి అప్పజెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిషాతో పాటు ఆమె తల్లి కూడా నీల్ కిచ్లూ బాగోగులు చూసుకుంటున్నారట. ఇండియన్-2తో పాటు కాజల్ తమిళ్లో మరో సినిమా చేస్తుంది. -
షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్
-
‘చెరసాల’ రిలీజ్కు ముందే రెండో సినిమా షురూ
సినీ ప్రేక్షకుల ఆలోచన మారింది. హీరో కాకుండా కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే యంగ్ డైరెక్టర్స్ డిఫరెంట్ కంటెంట్తో సినిమాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. దర్శకుడు రామ్ ప్రకాష్ గుణ్ణం కూడా ఓ కొత్త పాయింట్తో ‘చెరసాల’సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రెండో సినిమాకు శ్రీకారం చుట్టాడు ఈ యంగ్ డైరెక్టర్. ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా పరిశ్రమలోని ప్రముఖులతో పాటు సన్నిహితులు విచ్చేశారు. ముఖ్య అతిధులుగా నమీరుద్దీన్ అహ్మద్, కతేరి అంజమ్మ , కట్ల భాగ్య లక్ష్మి, రైటర్ నరేందర్ రెడ్డి, కిషోర్, తెలుగు మహేంద్ర విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్ ప్రకాష్ మాట్లాడుతూ..‘నన్ను నమ్మి ఎంతో ప్రోత్సహిస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. మంచి కంటెంట్ ను అందించే విధంగా సినిమా కోసం పనిచేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా లను వెండితెరపైకి తీసుకు వస్తాను’ అని అన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.6 కోట్ల మోసం జరిగింది. 30 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వారి బంధువులే టార్గెట్గా వారి నుంచి 6 కోట్లు వసూళ్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్లతో కూకట్పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి,నాగం ఉమాశంకర్లు మోసాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ బాధితులు సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. చదవండి: కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా? ఫిల్మ్ ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బొర్ వెల్స్ పలు రంగాలలో పెట్టుబడుల పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డారు. ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టొరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది పలు సినిమాలలో పెట్టుబడులు పెడతామని, వాటిలో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు ఇస్తామని వారు నమ్మించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్లను సీసీఎస్ పోలీసులు అదువులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు బాధితులు తెలిపారు. -
డంపింగ్ యార్డులో మూవీ సెట్ వేశాం : డైరెక్టర్
ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘నవాబ్’. రవిచరణ్ దర్శకత్వంలో నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎం నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో రవిచరణ్ మాట్లాడుతూ – ‘‘నా మొదటి సినిమా ‘నల్లమల’కు మంచి ఆదరణ లభించింది. ఆ ఉత్సాహంతో ‘నవాబ్’ తెరకెక్కిస్తున్నాం. పూర్తిగా డంపింగ్ యార్డ్లో సాగే కథతో ఈ సినిమా ఉంటుంది. దీని కోసం పదెకరాల్లో డంపింగ్ యార్డ్ సెట్ వేశాం. మా హీరో ముఖేష్ గుప్తా తెలుగు కాదు. ఆర్నెళ్లు తెలుగు నేర్చుకుని అద్భుతంగా నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఓ మంచి కథతో రూపొందుతున్న ‘నవాబ్’లో హీరోగా నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు ముఖేష్ గుప్తా. -
విశాఖ ఫిషింగ్ హార్బర్లో మెగాస్టార్.. ఫ్యాన్స్కు పండగ
కొమ్మాది(భీమిలి): విశాఖపట్నం నగరంలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న మెగాస్టార్ 154వ సినిమా (ప్రచారంలో వాల్తేరు వీరయ్య) షూటింగ్లో పాల్గొనేందుకు ఆయన నగరానికి చేరుకున్నారు. ఫిషింగ్ హార్బర్ వద్ద మంగళవారం ఆయనతో పాటు హీరో రవితేజపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. బుధవారం కూడా ఈ ప్రాంతంలో సినిమా చిత్రీకరణ ఉంటుందని సినీ వర్గాల సమాచారం. హీరోలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఫిషింగ్ హార్బర్కు చేరుకున్నారు. కాగా, చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. (క్లిక్: అలా అయితే నాకు మరో 20 ఏళ్లు పట్టేది.. అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్) -
SSMB28: మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్! అసలు కారణమిదేనా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రీప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్పైకి వచ్చింది. అంతేకాదు ఈ సినిమా కోసం మేకోవర్ కూడా అయ్యాడు మహేశ్. ఆయన న్యూలుక్కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ స్టార్ట్స్ అంటూ సెప్టెంబర్ 13న సెట్స్లోని ఓ సన్నివేశాన్ని షేర్ చేసింది చిత్ర బృందం. చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే! అయితే యాక్షన్ సీన్స్తో ఈ మూవీ షూటింగ్ను ప్రారంభించాడట త్రివిక్రమ్. ఈ క్రమంలో తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుందని, సెకండ్ షెడ్యూల్ దసరా తర్వాతే అంటూ తాజాగా మూవీ యూనిట్ ప్రకటన ఇచ్చింది. ఇదిలా ఉంతే రెండు, మూడు రోజుల్లోనే తొలి షెడ్యూల్ పూర్తి కావడంపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. దీని వెనక ఓ కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ తాజా బజ్ ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ను కావాలనే ఆపేసారంటున్నారు. ఇప్పటి వరకు చేసిన యాక్షన్ సీక్వెన్స్ విషయంలో మహేష్బాబు, త్రివిక్రమ్ సంతృప్తిగా లేరట. అనుకున్న విధంగా ఈ ఫైట్ సీన్లు రావడం లేదని, అందుకే షూటింగ్కు కావాలనే బ్రేక్ ఇచ్చినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: విషాదం.. స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి నిజానికి ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం తొలి షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు జరగాల్సి ఉందట. కానీ, యాక్షన్ సీన్స్ అనుకున్నట్టుగా రాకపోవడంతో ఆర్థాంతరంగా షూటింగ్ను నిలిపివేయాల్సి వచ్చిందని సినీవర్గాల నుంచి సమాచారం. కాస్తా సమయం తీసుకుని ప్రస్తుత ఫైట్ మాస్టర్ని కొనసాగించాలా? కొత్త మాస్టర్ని తీసుకోవాలా? అనే కీలక నిర్ణయం తీసుకొనున్నాడట దర్శకుడు. ఆ తర్వాతే తిరిగి షూటింగ్ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అందుకే దసరా వరకు త్రివిక్రమ్ టైం తీసుకుంటున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించేవరకు వేచి చూడాల్సిందే. First schedule of #SSMB28 has been completed with some kick-ass high octane epic action scenes 🔥 Thank you @anbariv masters for amazing stunt choreography 🤗 The second schedule will start post Dussehra with our Superstar @urstrulyMahesh garu & butta bomma @hegdepooja. — Naga Vamsi (@vamsi84) September 21, 2022 -
లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్గా ‘కంచర్ల’
ఉపేంద్ర హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘కంచర్ల’. ఎస్.ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ బేనర్పై కె. అచ్యుతరావు సమర్పణ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రెడ్డెం యాద కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వైజాగ్లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్గా జరిగింది. ఈ చిత్రంలో బాహుబలి ప్రభాకర్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర, హీరోయిన్లు మీనాక్షి జైస్వాల్, ప్రణీతలపై తొలి షాట్ని దర్శకుడు రెడ్డెం యాద కుమార్ చిత్రీకరించగా , సమర్పకులు కె. అచ్యుతరావు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. అనంతరం చిత్ర సమర్పకులు కె. అచ్యుతరావు మీడియాతో మాట్లాడుతూ...‘సినీ ప్రేక్షకులకు వినూత్న కథాంశంతో కూడిన చిత్రాన్ని అందించేందుకు ‘కంచర్ల’ చిత్రం రూపొందిస్తున్నామన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల, అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాం. ఉపేంద్ర హీరోగా నటిస్తున్న ‘కంచర్ల’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకులు రెడ్డెం యాద కుమార్ మాట్లాడుతూ .. ‘యువకులు రాజకీయాల్లోకి రావాలి. సేవా దృక్పథంతో ఉండాలి అనే కాన్సెప్ట్ తో లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తొలి షెడ్యూల్ ప్రారంభించాం. విశాఖ ప్రాంతంలోనే మొదటి షెడ్యూల్కు సంబంధించిన షూటింగ్ జరుపుతాం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ` అన్నారు. హీరో ఉపేంద్ర, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ మాట్లాడుతూ...‘కంచర్ల చిత్రం తమ నటనా జీవితానికి మలుపు రాయిగా నిలుస్తుంది’ అన్నారు. కార్యక్రమంలో సినీ నటుడు బాహుబలి ప్రభాకర్, డీఓపీ గుణశేఖర్, క్యాలు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
ఒంగోలులో శ్రీకారం చుట్టుకున్న‘సత్యం వధ - ధర్మం చెర’
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతూ తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యం వధ - ధర్మం చెర’. బాబు నిమ్మగడ్డ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై రమాదేవి నిమ్మగడ్డ నిర్మిస్తున్నారు. ఒంగోలు, గోపాలస్వామి కన్వెన్షన్ హాల్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రమణారెడ్డి-పూజలపై చిత్రీకరించిన ముహర్తపు సన్నివేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా హనుమంతరావు క్లాప్ కొట్టగా... రవి శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కంది రమేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మార్వెల్ గ్రైనేట్స్ అధినేత సూదనగుంట కోటేశ్వరరావు గౌరవ దర్సకత్వం వహించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతూ తెరకెక్కుతున్న ‘సత్యం వధ - ధర్మం చెర’ప్రేక్షకులతో ఆలోచింపజేస్తూనే అమితంగా అలరిస్తుందని దర్శకుడు బాబు నిమ్మగడ్డ అన్నారు. స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి, కీర్తి, రాజా, బద్రీనాథ్, సాగర్, సీత, బిందు భార్గవి, మమతారెడ్డి, బిందుకృష్ణ, మధుబాల, బాబు బంగారు, బి.కె.పి.చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్, అనంతలక్ష్మి, రమేష్ రాజా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్కు గాయాలు !
Popular Actor Nassar Wounded In Cinema Shooting: టాలీవుడ్ స్టార్ యాక్టర్స్లో నటుడు నాజర్ ఒకరు. దక్షిణాదిన అయన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలందరి సినిమాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ను అలరిస్తూ వస్తున్నారు. నాజర్ లేకుండ ఎలాంటి పెద్ద సినిమా లేదు అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. తండ్రిగా, పోలీసు ఆఫీసర్గా, విలన్గా, కమెడియన్గా ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయే ఆయన ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించారు. అయితే తాజాగా ఆయనకు గాయాలయ్యాయని తెలుస్తోంది. హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో బుధవారం (ఆగస్టు 17) ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న నాజర్ గాయాలపాలయ్యారని సమాచారం. నాజర్కు గాయాలు కాగా వెంటనే చికిత్స కోసం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా యాక్టింగ్కు రిటైర్మెంట్ ప్రకటించాలని నాజర్ స్వయంగా నిర్ణయించుకున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగిన విషయం తెలిసిందే. ఆనారోగ్య కారణాల దృష్ట్యా నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చదవండి: నేనేం స్టార్ కిడ్ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్పుత్ సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! 50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్ -
ఇద్దరు యువకుల కల ‘కర్ణపిశాచి’.. నటీనటులంతా వైజాగ్ వాసులే
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): ఇద్దరు యువకులు కన్న కల...‘కళ’ర్ఫుల్గా తెరపైకి తెచ్చారు. వెండితెరపై సత్తా చాటుకోవాలని తహతహలాడుతున్నారు. టైటిల్తోనే ఆసక్తి రేపుతూ సినిమాపై మంచి అంచనాలు పెంచేశారు. త్వరలో ఓటీటీ ప్లాట్ఫారంపై విడుదల కానున్న కర్ణపిశాచి కేరాఫ్ ఐటీ ఆఫీస్ సినిమా గురించి...ఆ యువకుల గురించి తెలుసుకుందాం. ప్రణవి విశాఖ అమ్మాయి. ఇంజినీరింగ్ పూర్తి చేసింది. సినిమాలంటే పిచ్చి. ఇప్పటికే ఎన్నో షార్ట్ఫిల్్మలు చేసి మెప్పించింది. సీన్ చెప్పగానే లీనమైపోవడం ఈమె ప్రత్యేకత. మంచి హావభావాలు, నాట్యం ఈమెకు ప్లస్ పాయింట్... కర్ణపిశాచిలో మెయిన్ లీడ్ పోషిస్తోంది. తెరపై ప్రణవి భయపెట్టడం ఖాయం. నిఖిల్ శ్రీకాకుళం కుర్రోడు... ఏయూలో లా చదువుతున్నాడు. మంచి టైమింగ్ ఉన్న మిమిక్రీ ఆరి్టస్ట్. సినిమాలో విలన్గా నటిస్తున్నాడు. ఒక అద్భుతమైన శక్తిని ఒక మంచివాడు ఎలా ఉపయోగిస్తాడు..చెడ్డవాడు ఎలా దుర్వినియోగం చేస్తాడో చెప్పే ఈ చిత్రంలో హీరోకి దీటుగా అదరగొట్టాడు. భరత్ కుమార్ సిగిరెడ్డి ఈ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. సౌతాఫ్రికాలో ఉద్యోగం...కోవిడ్ కారణంగా సొంతూరు అనకాపల్లి వచ్చేశాడు. వర్క్ ఫ్రం హోం. సొంతూరు..చిన్ననాటి కలలు నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం దొరికింది. భరత్కుమార్ చిన్నప్పటి నుంచి కథలు రాయడం ఇష్టం..ఆ రాసే కథలో తనను తాను ఊహించుకునేవాడు..అలా పలు షార్ట్ఫిల్మ్లకు కథలు రాయడం..అవకాశం ఉన్నప్పుడల్లా నటించడం చేసేవాడు. ఉద్యోగరీత్యా సౌతాఫ్రికా వెళ్లిపోవడంతో తాత్కాలికంగా తన కళకు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా హీరోగా...నిర్మాతగా మారి కర్ణపిశాచి అనే చిత్రానికి నాంది పలికాడు. ప్రస్తుతం సినిమా సెన్సార్కు వెళ్లింది. త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానుంది. చదవండి: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న షారుక్ ఖాన్ కుమారుడు నమావతి పేరే వెరైటీ. ఆమె నటన మరింత మెప్పిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అందం..అభినయం కలగలిపిన వర్ధమాన నటి నమావతి. కర్ణపిశాచిలో మూడో హీరోయిన్గా నటిస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నానని, తెరపై తన నటన చూసి విజల్స్ గ్యారంటీ అని చెబుతోంది. విజయ్ మల్లాది షార్ట్ ఫిల్మ్లతో కెరీర్ మొదలు పెట్టాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రికి బంధువు. విశాఖ వేదికగా చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసి గుర్తింపు పొందాడు. మంచి ప్రతిభ ఉన్న కుర్రోడు. విజయ్ టాలెంట్ను గుర్తించి భరత్ కుమార్ రాసుకున్న కర్ణపిశాచిని అతని చేతిలో పెట్టాడు. సినిమాలో నటించిన వారంతా విశాఖ కళాకారులే. సినిమా మొత్తం మన ఉత్తరాంధ్రలోనే షూటింగ్ జరుపుకుంది. స్క్రీన్ ప్లే, దర్శకత్వ ప్రతిభతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. -
సీనియర్ హీరోయిన్ టబుకు తీవ్రగాయాలు.. షూటింగ్కి బ్రేక్
సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్లో తీవ్రంగా గాయపడింది.బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును బైక్స్తో ఛేజ్ చేసే సీన్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగిలి టబు కన్ను, నుదుటికి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం జరగడంతో హీరో అజయ్ దేవగన్ షూటింగ్కు చిన్న విరామం ప్రకటించారు. రెప్ప పాటులో ఆమె కంటికి పెను ప్రమాదం తప్పిందని సమాచారం. దీంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా మరో సినిమా షూటింగ్ సెట్లో హీరోయిన్ శిల్పాశెట్టి గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఒకే రోజు ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ గాయపడటం గమనార్హం. -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నటి మాలాశ్రీ కూతురు
ప్రముఖ నిర్మాత దివంగత రాము, సీనియర్ నటి మాలా శ్రీ కుమార్తె రాథనా రామ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది.'చాలెంజింగ్ స్టార్' దర్శన్తో కలిసి D56 వర్కింగ్ టైటిల్తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్లైన్ వెంకటేష్ తన రాక్లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తెలుగు,కన్నడ , మలయాళం, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రాబర్ట్' ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు. బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ సినిమాను ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మాలాశ్రీ తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. లేడీ ఓరియెంటెండ్ చిత్రాలతోనూ మెప్పించారు. ఇప్పుడు మాలాశ్రీ కుమార్తె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా మాలాశ్రీ మాట్లాడుతూ.. 'రాధనాకు శుభాకాంక్షలు. ఆమెకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి. రాక్లైన్ నా సినిమాతో ప్రొడక్షన్లోని అడుగుపెట్టారు. ఇప్పుడు రాక్లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న సినిమాతో నా కూతురు నటిగా అరంగేట్రం చేస్తోంది. మంచి టీమ్తో ఆమె అరంగేట్రం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నటి కావాలనుకుంది. ముంబైలో నటన, డ్యాన్స్ నేర్చుకుంది. ఆమె గత కొన్నేళ్లుగా చాలా కష్టపడి పని చేసింది . నా కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకోవాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. -
సినిమా VS సినిమా
-
సోమవారం నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ బంద్
తెలుగు ఫిలిం చాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం(ఆగస్ట్ 1) నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న సినిమాల చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఆగస్ట్ 1న షూటింగ్స్ బంద్ చేయాలని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చించేందుకే ఆదివారం ఫిలిం చాంబర్ జనరల్ బాడీ సమావేశమైంది. ఈ సమావేశంలో గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం చాంబర్ మద్దతు ఇచ్చింది. 24 క్రాఫ్ట్స్ లో అందరికీ ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్కరించేవరకు షూటింగ్స్ నిలివేస్తున్నామని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి వెల్లడించారు. రన్నింగ్లో ఉన్న సినిమాల షూటింగ్స్ కూడా నిలివివేస్తున్నామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. సమస్యల పరిష్కారం దొరికేంత వరకు ఈ నిర్ణయం ఉంటుందని చెప్పారు. -
రాంచరణ్ సినిమా షూటింగ్ను అడ్డుకున్న బీజేపీ
సాక్షి, వికారాబాద్: సరూర్నగర్లో రాంచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ను బీజేపీ అడ్డుకుంది. సరూర్నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ (వీఎం) హోంలో మంగళవారం సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీవాణి తన అనుచరులతో వచ్చి షూటింగ్ను అడ్డుకున్నారు. తరగతులు జరుగుతున్న సమయంలో షూటింగ్లకు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అనాథ పిల్లల పేరు మీద జేబులు నింపుకునేందుకే షూటింగ్లకు అనుమతి ఇస్తున్నారని ఆరోపించారు. చదువుకునే పిల్లలందరినీ రెండు గదుల్లో పెట్టి పాఠశాలను సినిమా షూటింగ్కి ఇవ్వడం ఏమిటని, తరగతి గది పక్కనే సినిమా షూటింగ్ నిర్వహిస్తే చదువుకునేది ఎలా అని నిలదీశారు. ఒకరోజు షూటింగ్కు రూ.3 లక్షల వరకు అద్దె రూపంలో తీసుకుంటున్నారని.. ఈ డబ్బంతా వీఎంహోం అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. -
ముగిసిన ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ సమావేశం
-
పారితోషికాలు తగ్గించుకునే యోచనలో అగ్రహీరోలు
-
ఇండస్ట్రీకి శాపంగా మారిన ఓటీటీ
-
ముంచంగిపుట్టులో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ టీం సందడి
సాక్షి, ముంచంగిపుట్టు: మండలంలో సుజనకోట పంచాయతీ లకేయిపుట్టు గ్రామ సమీపంలో మత్స్యగెడ్డ ఒడ్డున ఆదివారం సినిమా షూటింగ్ సందడి వాతావరణం నెలకొంది. జీ స్టూడియో సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్పై ఏఆర్ మోహన్ దర్శకత్వంలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇందులో హీరో హీరోయిన్లుగా అల్లరి నరేశ్, జాంబిరెడ్డి ఫేమ్ హీరోయిన్ ఆనంది, కమెడియన్లుగా వెన్నెల కిశోర్, ప్రవీణ్, సంపత్రాజ్ నటిస్తున్నారు. ఇక్కడ మత్స్యగెడ్డ ఒడ్డున వీరి మధ్య ముఖ్యమైన సన్నివేశాలు, పాటలు చిత్రీకరించారు. ఈ షూటింగ్ విషయం తెలుసుకున్న ముంచంగిపుట్టు మండలంలో పలు గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో లకేయిపుట్టు మత్స్యగెడ్డ ప్రాంతం జన సందడి నెలకొంది. షూటింగ్ దగ్గరకు వీరిని రానివ్వకుండా అక్కడ సిబ్బంది నిలువరించారు. రెండు రోజులపాటు మత్స్యగెడ్డ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తామని డెరెక్టర్ తెలిపారు. చదవండి: NBK107: కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి! రజినీకాంత్కు ఆదాయ పన్నుశాఖ అవార్డు -
NBK107: కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి!
అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన బాలయ్య తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి టైటిల్ ఖరారు చేయని ఈ మూవీ ఎన్బీకే107(NBK107) అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే టర్కీలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘‘నేటి నుంచి అక్కడి కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సోమవారం కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకుసంగీతం అందిస్తున్నారు. -
ప్రతి ఒక్కరిని గ్రామాలకు తీసుకెళ్లే చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’
ఓ మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. పద్మ, ప్రసన్న, మానుకోట ప్రసాద్, గడ్డం నవీన్, మల్లికార్జున్, మహి, వల్లి సత్య ప్రకాష్, సుధాకర్ రెడ్డి,కీర్తి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు గంటలపాటు ప్రేక్షకుడిని నవ్వించడమే ధ్యేయంగా తెరకెక్కుతున్న సహజ చిత్రమిది అని దర్శకుడు రమేష్ చెప్పాల అన్నారు. కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా థియేటర్ , ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని, చాలా రియాలిటీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పారు. రెండు గంటల పాటు పల్లె వాతావరణం కల్లముందు కదలాడేలా చేస్తూ.. ప్రతి ఒక్కరిని గ్రామానికి తీసుకెళ్లే చిత్రమిది అన్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఏబీ సినిమాస్ అండ్ నిహాల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. -
బాలయ్య స్టెప్పులు.. అభిమానుల కేకలు
బనగానపల్లె రూరల్(కర్నూలు జిల్లా): యాగంటి ఆలయ ఆవరణలో గురువారం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా షూటింగ్ జరిగింది. మైత్రీ మూవీస్ బ్యానర్పై మలినేని గోపిచంద్ దర్శకత్వంలో తీస్తున్న చిత్రానికి సంబంధించి ఓ పాటను చిత్రీకరించారు. చదవండి: మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్ షాకింగ్ రియాక్షన్ ఆలయంలోని పెద్దకోనేరు, ధ్వజ స్తంభం, శ్రీ వెంకటేశ్వరస్వామి గుహల వద్ద సుమారు 150 మంది డ్యాన్సర్ల్లతో ఈ పాటను ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు చిత్రీకరించారు. షూటింగ్ సమాచారం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. షూటింగ్లో బాలకృష్ణ స్టెప్పులు వేస్తుండగా అభిమానులు కేకలు, ఈలలతో హోరెత్తించారు. ఎస్ఐలు శంకర్నాయక్, రామాంజనేయరెడ్డి బందోబస్తు చేపట్టారు. -
షూటింగ్స్ బంద్పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..
టాలీవుడ్లో సినిమా షూటింగ్స్ బంద్పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్షన్ వ్యయం తగ్గించే విషయమై నిర్మాతలు అందరూ కూర్చొని చర్చించామని ఆయన తెలిపారు. 'మంచి కంటెంట్తో సినిమాలు తీయడంపై మీటింగ్లో మాట్లాడుకున్నాం. ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే టికెట్ ధరల అంశంపై చర్చించాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించే విషయమై నిర్మాతలందరం మాట్లాడాం. ఓటీటీలో సినిమా విడుదల అనేది 8 వారాల లేక 10 వారాల అనే అంశంపై కూడా చర్చించాం. చర్చల్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. షూటింగ్స్ బంద్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లాక్డౌన్ వల్ల కథలు రాశారు, వాటిని హీరోలు ఒప్పుకున్నారు. నిర్మాతలు తెరకెక్కించారు. కానీ ప్రేక్షకుల గురించి ఆలోచించలేదు. కరోనా సమయంలో ఆడియెన్స్ చాలా ఎడ్యుకేట్ అయ్యారు. అందుకు తగిన స్థాయిలో సినిమాలు తీస్తేనే మెప్పించగలం' అని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. కాగా ఆగస్టు 1 నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగ్లు బంద్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చదవండి:👇 అప్పటి నుంచి సినిమా షూటింగ్లు బంద్..! పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ -
అప్పటి నుంచి సినిమా షూటింగ్లు బంద్..!
Tollywood Movies Shooting Close From August 1: ఆగస్టు 1నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ నిలిపివేయాలని సినీ అగ్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అవసరమైతే రెండు, మూడు నెలలు చిత్రీకరణ బంద్ చేద్దామని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయాలతో గతకొద్దిరోజులుగా నిర్మాతలందరూ ఈ వ్యవహారంపై చర్చిస్తున్నారు. మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంపైనా నిర్మాతలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ సినిమా చిత్రీకరణ నిలిపివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా కొవిడ్ తర్వాత థియేటర్కు వచ్చే ఆడియెన్స్ సంఖ్య భారీగా తగ్గింది. దీంతో టాలీవుడ్ భారీ నష్టాలను చవిచూసింది. వేసవిలో పెద్ద సినిమాలు సందడి చేయడంతో కాస్త కోలుకున్నట్లు అనిపించినా, తాజాగా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు నుంచి కొద్ది రోజులపాటు షూటింగ్లు ఆపేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. చివరి దశ షూటింగ్ ఉన్న చిత్రాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, ఆగస్టు 1 నుంచి అన్ని సినిమాల చిత్రీకరణను నిలిపివేయాలని చూస్తున్నారు. నిర్మాణ వ్యయం, ఓటీటీలు తదితర సమస్యలపై చర్చించిన తర్వాతే షూటింగ్లకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చదవండి: బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. వీడియో వైరల్ స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ ఈ విషయంపై త్వరలోనే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓటీటీలో రిలీజయ్యే సినిమాల విషయంలో సైతం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. జులై 1 నుంచి 50 రోజుల తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు 10 వారాలకు పొడిగించాలని భావిస్తున్నారట. ఈ విషయాలన్నింటిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. ఆయన మాకు గురువులాంటివారు: పూజా హెగ్డే -
గెట్ సెట్ గో అంటున్న స్టార్ హీరోలు.. ఆగస్ట్ తర్వాత ఫుల్ బీజీ
ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా షూటింగ్తో బిజీ అయిపోతారు హీరోలు. అయితే ప్రస్తుతం కొందరు టాప్ స్టార్స్ తమ సినిమా విడుదలై కొన్ని నెలలవుతున్నా తదుపరి చిత్రం సెట్స్లోకి అడుగుపెట్టలేదు. మరి.. ఈ హీరోలు ‘గెట్ సెట్ గో’ అంటూ కొత్త సినిమా షూటింగ్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారు అంటే.. ‘వచ్చే నెల’ అని తెలుస్తోంది. ఆగస్ట్ తర్వాత నుంచి ఫుల్ బిజీగా కొత్త చిత్రాల షూటింగ్స్లో పాల్గొననున్న హీరోల గురించి తెలుసుకుందాం. ‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) చిత్రం తర్వాత మేకప్ వేసుకుని హీరోగా రజనీకాంత్ సెట్స్లోకి అడగుపెట్టనున్న చిత్ర‘జైలర్’. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో ఐశ్వర్యారాయ్ హీరోయిన్గా, రమ్యకృష్ణ, ప్రియాంకా అరుల్ మోహనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఆగస్టు రెండో వారంలో హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఆరంభించడానికి చిత్రం యూనిట్ ఏర్పాట్లు చేస్తోందని తెలిసింది. ప్రస్తుతం ఆ స్టూడియోలో సెట్ నిర్మాణం జరుగుతోందని తెలిసింది. మరోవైపు కొత్త సినిమా సెట్స్లో బాలకృష్ణ అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సెంటిమెంట్, యాక్షన్ను సమపాళ్లల్లో మిక్స్ చేసారట అనిల్ రావిపూడి. ఇంకోవైపు దాదాపు పన్నెండేళ్ల తర్వాత హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టులో ఆరంభించనున్నట్లుగా ఇటీవల చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడోసారి రాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ఇక ‘ఆర్ఆర్ఆర్’ (ఈ చిత్రంలో రామ్చరణ్ మరో హీరో) వంటి సక్సెస్ఫుల్ హిట్ తర్వాత హీరో ఎన్టీఆర్ చేయనున్న తర్వాతి సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ‘జనతా గ్యారేజ్’ (2016) చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం ఇది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కావాల్సింది. అయితే సెప్టెంబరులో చిత్రీకరణను ఆరంభించేలా కొరటాల అండ్ కో సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మరోవైపు ‘పుష్ప’ సక్సెస్తో మాంచి జోరు మీద ఉన్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం హాలిడేలో భాగంగా లండన్లో ఉన్నారు అల్లు అర్జున్. వచ్చిన తర్వాత ‘పుష్ప’ చిత్రంలోని రెండో భాగమైన ‘పుష్ప: ది రూల్’ షూటింగ్లో పాల్గొంటారు. ‘పుష్ప’ చిత్రంలో తొలి భాగం అయిన ‘పుష్ప: ది రైజ్’ సూపర్ హిట్తో మంచి జోష్లో ఉన్న సుకుమార్ అంతకు మించిన కథను ‘పుష్ప: ది రూల్’ కోసం రెడీ చేస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ను ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది. వీరితో పాటు శర్వానంద్, వరుణ్ తేజ్ల కొత్త సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ కూడా ఆగస్టు నెలలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో లండన్ బ్యాక్డ్రాప్లో ఓ యాక్షన్ ఫిల్మ్ రూపొందనుంది. మరోవైపు శర్వానంద్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా రానుంది. -
బీచ్రోడ్డులో బాహుబలి ప్రభాకర్
కొమ్మాది (భీమిలి): తిమ్మాపురంలో రామానాయుడు ఫిల్మ్ స్టూడియోలో, సాగర్నగర్ బీచ్ వద్ద బాహుబలి ప్రభాకర్ సందడి చేశారు. పీఎస్కే ఎంటర్టైన్ పతాకంపై నిర్మిస్తున్న ఊర మాస్ సినిమా షూటింగ్కు సంబంధించి కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. రియల్ ఎస్టేట్ మాఫియా, కిడ్నాప్, ఫైటింగ్ సన్నివేశాలను ప్రభాకర్పై చిత్రీకరించారు. పోతిన రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు యువన్, హీరోయిన్లు షాలిని, వాసంతిలు నటిస్తున్నారు. మరో నాలుగు రోజులు పాటు రామానాయుడు ఫిల్మ్ స్టూడియోలో షూటింగ్ జరుపుతామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకు నిర్మాతలుగా సోము, రాజేందర్, ప్రొడక్షన్ మేనేజర్గా రాము వ్యవహరిస్తున్నారు. -
బేబీ బంప్తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు..
Alia Bhatt Baby Bump Photos Leaked: ఆరేళ్లు ప్రేమలో మునిగి తేలిన బాలీవుడ్ లవ్బర్డ్స్ ఆలియా భట్-రణ్బీర్ కపూర్లు ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎప్రీల్ 14న ఇరు కటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఈ జంట వివాహం ఘనంగా జరిగింది. ఇక పెళ్లయిన 2 నెలలకే ఆలియా ప్రెగ్నెన్సీని ప్రకటించి ఫ్యాన్స్కు శుభవార్త అందించింది. అయితే ఈ ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్లకు బ్రేక్ ఇవ్వకుండా కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు చేస్తొంది అలియా భట్. ఇక హాలీవుడ్ మూవీ 'హార్ట్ ఆఫ్ స్టోన్'లో అలియా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అలియాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. అయితే ఇంతకుముందు పోర్చ్గల్లోని ఎడారిలో షూటింగ్ చేసినప్పుడు కొంతమంది ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ లీకైన ఫొటోలలో అలియా భట్ బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. తాజాగా పోర్చ్గల్కు సంబంధించిన షూటింగ్ ఫొటోలను అలియా భట్ షేర్ చేసింది. ఇందులో కూడా అలియా భట్ ప్రెగ్నెన్సీ కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఈ ఫొటోల్లో తన బేబీ బంప్ కవర్ అయ్యేలా అలియా బ్లాక్ జాకెట్ ధరించిందని కామెంట్లు పెడుతున్నారు. షూటింగ్ పూర్తియిన సందర్భంగా హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రబృందానికి అలియా భట్ థ్యాంక్స్ చెప్పింది. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ గాల్ గాడోట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. shooting an action movie while she's pregnant.. MOTHER 🫡 pic.twitter.com/sIKJ32GFSF — hourly ranlia (@goldencranlia) July 8, 2022 View this post on Instagram A post shared by CELEBRITYSHALA (@celebrityshala) Heart of Stone - you have my wholeeeeeee heart ❤️❤️❤️ Thank you to the beautiful @GalGadot.. my director Tom Harper ... #JamieDornan missed you today.. and WHOLE team for the unforgettable experience. pic.twitter.com/wYyDI8sO53 — Alia Bhatt (@aliaa08) July 8, 2022 -
తంతడి బీచ్లో నాగచైతన్య సందడి
అచ్యుతాపురం(అనకాపల్లి): అక్కినేని నాగచైతన్య హీరోగా నిర్మితమవుతున్న నూతన చిత్రం షూటింగ్ తంతడి బీచ్లో ప్రారంభమైంది. తీరంలోని రెండు కొండల మధ్య ఏర్పాటు చేసిన సెట్టింగ్ చూపరులను ఆకట్టుకుంటోంది. పది రోజులపాటు కష్టపడి సెట్టింగ్ నిర్మించారు. గురువారం ఉదయం నుంచి షూటింగ్ జరుగుతుందని తెలియడంతో సమీప ప్రాంతాల ప్రజలు నాగ చైతన్యను చూసేందుకు తరలివచ్చారు. మరో మూడు రోజులపాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. చదవండి: మహారాజా సుహేల్ దేవ్గా రామ్చరణ్! -
అఖిల్,అనన్యల లవ్స్టోరీ షురూ
అఖిల్ రాజ్, అనన్య నాగళ్ల జంటగా సూర్య అల్లంకొండ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై జి. ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు విజయ్ కనకమేడల పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. తొలి సన్నివేశానికి నటుడు దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాధ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘పూర్తి ప్రేమకథా చిత్రమిది. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, రెండు షెడ్యూల్స్లో పూర్తి చేస్తాం’’ అన్నారు సూర్య అల్లంకొండ. ‘‘మంచి లవ్ సబ్జెక్ట్తో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు జి. ప్రతాప్ రెడ్డి. ‘‘యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు అఖిల్ రాజ్, అనన్య నాగళ్ల. సినిమాటోగ్రాఫర్ వీఆర్కే నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ మాట్లాడారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నవీన్ బి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్. -
అలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు: హీరో
Dharma Chakram 2022 Movie: సంకేత్ తిరుమనీడి, మోనిక చౌహాన్ హీరో హీరోయిన్లుగా నాగ్ ముంత దర్శకత్వంలో.. జీపీ రెడ్డి నిర్మాతగా పద్మ నారాయణ ప్రొడక్షన్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ‘ధర్మచక్రం’. ఇటీవలె పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వినూత్న కథ కథనాలతో రాబోతున్న ఈ మూవీ ప్రారంభోత్సవంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మొదటి సన్నివేశానికి వరుణ్ క్లాప్ కొట్టగా.. రాజశేఖర్ కెమెరా స్విచ్ఆన్ చేశారు. ఎం శ్రీధర్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. ‘సమాజంలో ఆడపిల్లల మీద జరిగే అన్యాయాల మీద ఈ కథను దర్శకుడు రాసుకున్నారు. ఆయన చెప్పిన కథాకథనాలు నచ్చి.. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాను’ అని నిర్మాత జీపీ రెడ్డి తెలిపారు. దర్శకుడు నాగ్ ముంత మాట్లాడుతూ.. ‘ఆడవాళ్ల మీద జరిగే అఘాయిత్యాలు రోజూ చూస్తుంటాం. ఆడవాళ్లకు స్వీయ సంరక్షణ నేర్పించేలా ఈ చిత్రం ఉంటుంది. హీరోయిన్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. నిర్మాత జీపీ రెడ్డికి కథ చెప్పిన వెంటనే నచ్చడంతో.. ఈ సందేశాత్మక చిత్రాన్ని చేద్దామన్నారు. సినిమా షూటింగ్ను ప్రారంభించాం. సెప్టెంబర్లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. చదవండి: చిరంజీవి పేరు మారింది చూశారా ! కారణం ఇదేనా ? ‘నిర్భయ, దిశ ఘటనలాంటివి మనం చూశాం. అలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. నేను ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. మీ ఆశీర్వాదం లభిస్తే ఇంకా మంచి మంచి పాత్రలను పోషించగలను’ అని తెలిపారు హీరోయిన్ మోనిక చౌహాన్. హీరో సంకేత్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు మంచి కథను చెప్పారు. ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతోంది. మంచి సందేశంతో మీ ముందుకు రాబోతున్నాం. ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి’ హీరో సంకేత్ పేర్కొన్నారు. -
కామెడీ, లవ్, సెంటిమెంట్గా... అంతేనా.. ఇంకేం కావాలి’
పవన్ కల్యాణ్ బయ్యా, జాన్వీ శర్మ జంటగా వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో ‘అంతేనా.. ఇంకేం కావాలి’ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వెంకటలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్పై రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ నటుడు మురళీమోహన్ క్లాప్ ఇచ్చారు. నటుడు ‘ఘర్షణ’ శ్రీనివాస్ స్క్రిప్ట్ని చిత్రయూనిట్కి అందించారు. వెంకట నరసింహ రాజ్ మాట్లాడుతూ– ‘‘ఇదే బ్యానర్లో ప్రస్తుతం నా దర్శకత్వంలో ‘అల్లుడు బంగారం’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ‘అంతేనా.. ఇంకేం కావాలి’ నా రెండవ సినిమా. అమ్మకిచ్చిన మాటను, అమ్మాయికిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు? అనేదే ఈ చిత్రకథ’’ అన్నారు. ‘‘కామెడీ, లవ్, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది’’ అని రవీంద్ర బాబు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.ఆర్. చందర్ రావ్. -
హీరో విశాల్కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత..
Hero Vishal Got Accident In Lathi Movie Shoot: సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ కోసం రిస్క్ చేసే హీరోల్లో విశాల్ ఒకరు. పోరాట సన్నివేశాలకోసం డూప్ లేకుండా చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. ఎంత సహజంగా చిత్రీకరిస్తే సినిమాకు అంత ప్లస్ అవుతుందని నమ్మే హీరో విశాల్. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటాయి. ఈ ప్రమాదాల కారణంగా ఇప్పటికే చాలా సార్లు గాయలపాలయ్యాడు విశాల్. అయిన కూడా సినిమా కోసం కాంప్రమైజ్ కాడు విశాల్. అయితే తాజాగా మరోసారి సినిమా షూటింగ్లో విశాల్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. విశాల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'లాఠీ'. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్స్ తెరకెక్కుస్తుండంగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో విశాల్ కాలికి గాయామైనట్లు తెలుస్తోంది. దీంతో సినిమా షూటింగ్ను నిలిపివేశారు. ఇదివరకు హైదరాబాద్లో ఇదే సినిమా చిత్రీకరణ సమయంలో విశాల్ చేతికి, చేతి వేళ్లకు గాయాలు అయ్యాయి. వెంటనే షూటింగ్ ఆపేసి కేరళ వెళ్లి చికిత్స తీసుకున్నారు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించిన విశాల్ మరోసారి ప్రమాదానికి గురయ్యాడు. అయితే గతంతో పోలిస్తే ఈసారి గాయాలు తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు విశాల్ త్వరగా కోలుకోవాలని, ఇలాంటి రిస్క్ షాట్లు ఇకపై చేయొద్దని కోరుకుంటున్నారు. చదవండి: కమల్ హాసన్కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ? కేన్సర్తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి Actor @VishalKOfficial once again got injured on the sets of #Laththi . The Night Shoot was cancelled as #Vishal got a leg injury during shoot of climax fight sequence happening at chennai. The shoot will resume once the actor recovers. pic.twitter.com/xnPAx8THHW — Sreedhar Pillai (@sri50) July 3, 2022 -
అద్భుతమైన షూటింగ్ స్పాట్లు.. అవి ఎక్కడ ఉన్నాయంటే?
తెనాలి(గుంటూరు జిల్లా): హొయలొలికే కృష్ణానదీ పరవళ్లు.. అబ్బురపరిచే ‘సంద్రమా’శ్చర్యాలు.. ఒంపుసొంపులతో కట్టిపడేసే సాగర్ కాలువలు.. మడమ తిప్పనియ్యని మడ అడవులు.. అద్భుత శిల్పకళతో అలరారే చారిత్రక ఆలయాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఎన్నెన్నో సుమనోహర ప్రాంతాలు ఉమ్మడి గుంటూరు జిల్లా సొంతం. ప్రకృతి రమణీయతకు ఈ జిల్లా పెట్టింది పేరు. సినిమా షూటింగ్లకు అనువైన వేదిక. అందుకే గతంలో ఎందరో సినీప్రముఖులు తమ చిత్రాలను ఈ ప్రాంతంలో చిత్రీకరించి తరించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతోపాటు పర్యాటక సొగసులద్దుకున్న లొకేషన్లు సినీ పరిశ్రమకు సుహాసినీ సుమాలతో ఆహ్వానం పలుకుతున్నాయి. ఫలితంగా షూటింగ్లు మరింత విస్తృతమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో కేంద్రీకృతమైన తెలుగు సినిమా రాష్ట్ర విభజన అనంతరం అక్కడే కార్యకలాపాలు సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనూ సినిమాల చిత్రీకరణను ప్రోత్సహిస్తోంది. లోకేషన్లలో ఉచితంగా షూటింగ్లకు అనుమతి ఇవ్వడమే కాక రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మన రాష్ట్రంలోనూ సినిమా షూటింగులు విస్తృతమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకు గుంటూరు జిల్లాలోని సుందర ప్రాంతాలు మొదటి చాయిస్ అవుతాయనడంలో సందేహం లేదు. ఎవర్గ్రీన్ లొకేషన్లు పరవళ్లు తొక్కే కృష్ణ, చంద్రవంక, నాగులేరు నదుల ఒడ్డున, నాగార్జునసాగర్ కాలువల మధ్య అందంగా ఒదిగిపోయిన గుంటూరు జిల్లాలోని సహజ అందాలు, పుణ్యక్షేత్రాలు, కొండ శిఖరాలు సినిమా షూటింగులకు ఎవర్గ్రీన్ లోకేషన్లు. కృష్ణానది ఒడ్డున విజయవాడ నుంచి అమరావతి వరకు, ఇటుపక్క రేపల్లె తీరం వరకు పంటపొలాలు, పూలతోటలు, వాణిజ్యపంటలతో ఏడాదంతా పచ్చదనం పరుచుకుని ఉంటుంది. ఆయా మార్గాల్లోని పడవల రేవులు, సమీప లంకల్లో సహజమైన గ్రామీణ వాతావరణం అందరినీ ఆకట్టుకుంటుంది. సూర్యలంక బీచ్, అక్కడి రిసార్టులు, నిజాంపట్నం హార్బర్, పెనుమూడి రేవు, పరిసరాల్లోని బ్యాక్ వాటర్స్... షూటింగులకు అనువైన ప్రదేశాలు. మూడేళ్లుగా మళ్లీ.. గత మూడేళ్లుగా మళ్లీ జిల్లాలో షూటింగులు కొనసాగుతున్నాయి. జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ‘రా...కిట్టూ’ సినిమాని చిత్రీకరించారు. దూరదర్శన్ సప్తగిరి చానల్ ‘జై బోలో’ సీరియల్ కూడా ఇక్కడ తీసిందే. తెనాలికే చెందిన సినీ దర్శకుడు దిలీప్రాజా ఎంతోకాలంగా ఇక్కడి పరిసరాల్లోనే టీవీ చిత్రాలు తీస్తున్నారు. గతేడాది ఆలీ హీరోగా ‘పండుగాడి ఫొటో స్టూడియో’ సినిమానూ జిల్లాలోనే చిత్రీకరించారు. దూరదర్శన్లో ప్రసారమైన 100 ఎపిసోడ్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ టెలీఫిలింను దర్శకుడు దిలీప్రాజా ఇక్కడే తీర్చిదిద్దారు. మంచి విజయం సాధించిన ‘మిడిల్క్లాస్ మెలోడీస్’ సినిమా కొలకలూరు, గుంటూరులోనే చిత్రీకరించారు. శేఖర్వర్మ, వైభవీరావ్ హీరోహీరోయిన్లుగా నటించిన, ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ చేసుకుంటున్న ‘కల్యాణమస్తు’లోని రెండు పాటలకు ఇక్కడి లోకేషన్లను వినియోగించారు. ‘నేను అను’, నాగశార్య ‘ఛలో’, రమేష్ చౌహాన్–మౌనికల రామ్నాయక్ వంటి సినిమాల్లో కొన్ని సన్నివేశాలను జిల్లాలోనే తీశారు. అందాల అమరావతి.. అద్భుత కొండవీడు.. పంచారామాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కి జిల్లాకు మణిహారంగా ఉన్న అమరావతి పుణ్యక్షేత్రం పరిసరాలు ఇప్పటికే పలు సినిమాల్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఘాట్రోడ్డు నిర్మాణంతో సహా అభివృద్ధి చేసిన కొండవీడు దుర్గంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆనాటి యుద్ధతంత్ర నైపుణ్యానికి నిదర్శనంగా 30 మైళ్ల చుట్టుకొలత గల ఈ దుర్గం పర్యాటకంగా మరింత సొబగులద్దుకుంది. ఈ నేపథ్యంలో ఈ లోకేషన్లు అందరినీ సంభ్రమాశ్చర్యాలల్లో ముంచెత్తుతున్నాయి. ఇక ఉండవల్లి గుహలు, అక్కడి అనంత పద్మనాభ ఆలయం, అజంతా అందాలను తలపించే శిల్పకళ చూపరులను కళ్లు తిప్పుకోనివ్వవంటే అతిశయోక్తి కాదు. మంగళగిరి కొండపై పానకాలస్వామి ఆలయం ప్రకృతి రమణీయతకు ఆలవాలం. ఇక ఎత్తిపోతల సోయగాలు, కృష్ణానదిలో బోటింగ్ గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఇవన్నీ సినీ షూటింగులకు అనువైనవే. ఏఎన్నార్ కాలం నుంచీ చిత్రీకరణలు సినిమా షూటింగులు జిల్లాకు కొత్త కాదు. ఎప్పుడో అక్కినేని నాగేశ్వరరావు నటించిన సిపాయి చిన్నయ్య సినిమాలో ‘నా జన్మభూమి’ అనే పాటను తెనాలి సమీపంలోని దుగ్గిరాలలో చిత్రీకరించారు. తెనాలి పక్కనున్న బుర్రిపాలెం సూపర్స్టార్ కృష్ణ జన్మస్థలమని తెలిసిందే. ఈ ప్రాంతంలోని సుందర దృశ్యాలను ఆయన తన సినిమాల్లో వినియోగించుకున్నారు. ప్రజారాజ్యం, బుర్రిపాలెం బుల్లోడు, సావాసగాళ్లు, పచ్చని సంసారం సినిమాలను ఇక్కడి పరిసరాల్లోనే చిత్రీకరించారాయన. శోభన్బాబు, విజయశాంతి నటించిన దేవాలయం సినిమా తోపాటు సప్తపది చిత్రంలోని పాటలను అమరావతిలోని అమరేశ్వర ఆలయంలో చిత్రీకరించారు. గోపీకృష్ణా మూవీస్ కృష్ణవేణి సినిమాలో కీలక సన్నివేశాలనూ కృష్ణానదీ పాయలో తీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో జిల్లాలోని లోకేషన్లు, పుణ్యక్షేత్రాలు కనువిందు చేశాయి. -
Breaking News: టాలీవుడ్లో షూటింగ్లు బంద్..!
-
సమ్మె సైరన్: టాలీవుడ్లో షూటింగ్స్ బంద్!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో సమ్మె సైరన్ మోగింది. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నాడు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రేపటినుంచి సినిమా షూటింగ్లకు సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం నాడు వెంకటగిరిలోని ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో సినీ కార్మిక సంఘాలతో ఫిలిం ఫెడరేషన్ చర్చలు జరిపింది. అనంతరం ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ.. 'వేతనాల పెంపుపై నిర్మాతల మండలి స్పందించడం లేదు. 24 విభాగాల్లోని ఒక్కో కార్మిక సంఘం నాయకులతో చర్చిస్తున్నాం. ప్రతీ మూడేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు పెరగాలి. కానీ నాలుగేళ్లైనా సినీ కార్మికుల వేతనాలు పెంచలేదు. కార్మిక సంఘాలు ఫిల్మ్ ఫెడరేషన్పై ఒత్తిడి తెస్తున్నాయి' అని పేర్కొన్నారు. చదవండి: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి విలన్గా మారుతున్న స్టార్ హీరోలు.. కొత్త కండీషన్ అప్లై -
‘జబర్దస్త్’ కమెడియన్ అదిరే అభికి ప్రమాదం.. చేతికి 15 కుట్లు!
టాలీవుడ్ నటుడు, కమెడియన్ అదిరే అభి(అభినవ్ కృష్ణ) ప్రమాదానికి గురయ్యారు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన గాయపడ్డారు. అభి ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. తాజాగా యాక్షన్ సీన్స్ని తెరకెక్కిస్తుండగా.. ఫైటర్ని ఎదుర్కొనే సమయంలో అభి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాలికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చేతికి పెద్ద గాయమే అయిందని, దాదాపు 15 కుట్లు పడినట్లు చిత్రయూనిట్లోని ఒకరు తెలిపారు. ప్రస్తుతం అభి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల వరకు అభి విశ్రాంతి తీసుకోనున్నారు. (చదవండి: చాలా మందికి అప్పు ఇచ్చా.. తిరిగి ఇవ్వలేదు : గోపీచంద్) ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’తో టాలీవుడ్కి పరిచయం అయ్యాడు అభి. ఆ తర్వాత కొన్నాళ్లు పలు రియాల్టీ షోలకు యాంకర్గా వ్యవహరించారు. ఓ ప్రముఖ చానల్లో ప్రసారమయ్యే కామెడీ షోలో టీమ్ లీడర్గా చేసి, ఇటీవల బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన పలు సినిమాలతో పాటు ఓ కామెడీ షో చేస్తున్నాడు. -
విశాఖ బీచ్లో ‘ప్రేమ కడలి’ సందడి
కొమ్మాది (భీమిలి)/విశాఖపట్నం: భీమిలి బీచ్, ఉప్పాడ బీచ్ వద్ద గురువారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. సీహెచ్ రూప నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సుర్ల శివబాబు (వసీకరన్) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రేమ కడలి అనే సినిమాకు సంబంధించి హీరో మనీష్, హీరోయిన్ అల్వియా ముఖర్జీ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత రూప మాట్లాడుతూ విశాఖ ప్రాంతంలో 39 రోజులపాటు 90 శాతం సినిమా చిత్రీకరణ పూర్తయిందని, మరో రెండు ఫైట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు. ఇదే సినిమాలో మరో హీరో మధు నందన్, మరో ఇద్దరు హీరోయిన్లు లావణ్య, అక్సా ఖాన్ నటిస్తున్నట్లు తెలిపారు. చదవండి: నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు: హీరో పవన్ -
విజయ్, సమంతలకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ లేటెస్ట్ అప్డేట్!
Khushi Movie Update: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటంగా కలిసి నటిస్తున్న లవ్ స్టోరీ 'ఖుషి'. ప్రేమ కథా చిత్రాలకు మారుపేరైన శివ నిర్వాణ ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కశ్మీర్ తొలి షూటింగ్ షెడ్యూల్ను జరుపుకుంటున్ను విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓ అప్డేట్ ఇస్తూ హీరో విజయ్, సమంతలకు డైరెక్టర్ శివ థ్యాక్స్ చెప్పాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘కశ్మీర్లో జరుగుతున్న మా మూవీ(ఖుషీ) తొలి షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే హైదరాబాద్లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. చదవండి: సినిమా టికెట్లు అమ్మాలంటూ వేధింపులు? నిజమేంటంటే? కశ్మీర్ షెడ్యూల్ను శరవేగంగా పూర్తి చేసేందుకు సహాకరించిన హీరో విజయ్, హీరోయిన్ సమంత, వెన్నెల కిశోర్తో మా మూవీ యూనిట్కు ధన్యవాదాలు’ అంటూ శివ రాసుకొచ్చాడు. కాగా ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 23, 2022న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. కాగా ఈ మూవీతో పాటు విజయ్, పూరీ జగన్నాథ్తో జనగనమణ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల సామ్ నటించిన కాతువాక్కుల రెండు కాదల్ మూవీ విడుదల కాగా శాకుంతం, యశోద చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటితోపాటు ఓ ఇంటర్నేషనల్ మూవీతో పలు ప్రాజెక్ట్లకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. Amazing first schedule in kashmir Thankyou @TheDeverakonda @Samanthaprabhu2 @vennelakishore #saranyapradeep and Whole #khushiteam 👏 congratulations #khushiondec23 #khushi pic.twitter.com/jax2pkYRvS — Shiva Nirvana (@ShivaNirvana) May 23, 2022 -
సినిమా షూటింగ్లకు కేరాఫ్ అడ్రస్.. రికార్డు స్ధాయిలో ఆదాయం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రముఖ చారిత్రాత్మక కట్టడమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ) రైల్వే స్టేషన్, భవనం ఆవరణలో నిర్వహించిన సినిమా, ప్రకటనల షూటింగులు సెంట్రల్ రైల్వేకు భారీ ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. వాణిజ్య, వ్యాపార సంస్ధలు, సినీ నిర్మాతలు తమ సినిమాలు, ప్రకటనల షూటింగులకు సీఎస్ఎంటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమా లేదా ప్రకటనలో ఎక్కడో ఒక చోట సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్, రైల్వే ప్లాట్ఫారం, వారసత్వ కట్టడమైన ఈ స్టేషన్ భవనం కనిపించాలని నిర్మాతలు తహతహలాడుతుంటారు. దీంతో సీఎస్ఎంటీవద్ద షూటింగ్ చేయడానికి ఎక్కువ ప్రాధా న్యత ఇస్తారు. కాని లాక్డౌన్ కారణంగా 2020 మార్చి తరువాత సినిమా, ప్రకటనల షూటింగులు జరగలేదు. దీంతో సెంట్రల్ రైల్వే ఆదాయాన్ని కోల్పోయింది. కాని గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ తరువాత కరోనా నియంత్రణలోకి రావడంతో సినిమా, ప్రకటనల షూటింగులకు అనుమతివ్వడం మొదలైంది. గడచిన ఐదారు నెలల్లో సీఎస్ఎంటీ వద్ద చేపట్టిన ఆరు సినిమాలు, రెండు వెబ్ సిరీజ్లు, ఒక డాక్యుమెంటరీ, ఒక ప్రకటన షూటింగుల వల్ల సెంట్రల్ రైల్వే రికార్డు స్ధాయిలో ఏకంగా రూ.2.48 కోట్ల ఆదాయం వచ్చింది. చదవండి: ఆసుపత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న నవనీత్, ఓదార్చిన భర్త.. వైరల్ వీడియో అదేవిధంగా యేవలలోని కాన్హే గ్రామం రైల్వే స్టేషన్లో ఒక ప్రత్యేక రైలులో 18 రోజులు సినిమా షూటింగ్ జరిగింది. దీనివల్ల సెంట్రల్ రైల్వేకు రూ.1.27 కోట్ల ఆదాయం రాగా ఆదార్కి రైల్వే స్టేషన్లో 9 రోజుల పాటు జరిగిన షూటింగ్ వల్ల రూ.65.95 లక్షల ఆదాయం వచ్చింది. ఇదిలా ఉండగా 2013–14 ఆర్ధిక సంవత్సరంలో సీఎస్ఎంటీలో జరిగిన వివిధ షూటింగుల ద్వారా రైల్వేకు రూ.1.73 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పట్లో ఈ ఆదాయాన్ని రికార్డుగా భావించారు. ఆ తరువాత ఇప్పుడు రూ.2.48 కోట్ల ఆదాయం రావడం 2013–14 ఆర్ధిక సంవత్సరం రికార్డును బద్దలు కొట్టింది. అత్యధికంగా షూటింగులు జరిగే స్టేషన్లు... మొదటి స్ధానంలో సీఎస్ఎంటీ ఉండగా, ఆ తరువాత స్ధానంలో ముంబైలోని ఓల్డ్ వాడిబందర్ యార్డ్, దాదర్, ములుండ్లోని ఆర్పీఎఫ్ గ్రౌండ్, ముంబైకి సమీపంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మాథేరాన్ రైల్వే స్టేషన్, సాతారా జిల్లాలోని అదార్కి రైల్వే స్టేషన్, మన్మాడ్–అహ్మద్నగర్ మధ్యలో ఉన్న యేవలలోని కాన్హేగావ్ స్టేషన్లో జరుగుతాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సుతార్ తెలిపారు. -
తిమ్మాపూర్ రైల్వే స్టేషన్: సీన్ ఉంటే.. సినిమా హిట్టే
సాక్షి, రంగారెడ్డి: తిమ్మాపూర్లో ఎనభై ఏళ్ల క్రితం ప్రారంభమైన రైల్వేస్టేషన్ సినిమా షూటింగ్లకు ప్రఖ్యాతి గాంచింది. అగ్ర హీరోలు మొదలుకుని జూనియర్ల వరకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో సినిమా షూటింగ్లు చిత్రీకరించడానికి చాలా ఆసక్తి కనబర్చుతారు. వీరి సెంటిమెంటే ఇందుకు కారణం. పెద్ద హీరోలు నటించే సినిమాల్లో రైల్వే స్టేషన్ సీన్ ఉందంటే ముందుగా తిమ్మాపూర్నే ఎంచుకుంటారు. ఇక్కడ ఒక చిన్న సీన్ చిత్రీకరించినా సినిమా హిట్ అవుతుందని హీరోలతో పాటు డైరక్టర్లలో గట్టి నమ్మకం ఉంది. చిరంజీవి నటించిన అల్లుడా మజాకా, వెంకటేశ్ నటించిన సూర్యవంశం, పవన్ కల్యాణ్ సినిమా జానీ, బాలకృష్ణ మూవీ సమరసింహారెడ్డితో పాటు పలు చిత్రాల్లోని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఆదర్శంగా.. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మిగితా స్టేషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. పరిశుభ్రత, మొక్కల పెంపకం, ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు, తాగునీరు, టాయిలెట్లు ఇలా ప్రయాణికులకు అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్ మీదుగా నిత్యం 20 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుండగా 4 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. పండగలు ఇతర రద్దీ దినాల్లో ఈ స్టేషన్ నుంచి నిత్యం వంద మందికిపైగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. రెండుసార్లు ఉత్తమ అవార్డులు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో పనిచేసే స్టేషన్ మాస్టర్లు, మేనేజర్తో పాటు ఇతర సిబ్బంది కృషి ఫలితంగా హైదరాబాద్ డివిజన్ పరిధిలో రెండుసార్లు ఉత్తమ స్టేషన్గా అవార్డులు వరించాయి. ప్రస్తుతం పాత భవనాలు, ఫ్లాట్ఫాంలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. -
మరో కొత్త సినిమాను ప్రకటించిన ఆది సాయికుమార్
యంగ్ హీరో ఆది సాయికుమార్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన నాలుగైదు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. తాజాగా ఈ యువ హీరో మరో చిత్రాన్ని లైన్లో పెట్టేశాడు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కబోతోంది. తెలుగులో ఇప్పటివరకు టచ్ చేయని ఓ వైవిద్యభరితమైన కథతో ఈ సినిమాను రూపొందించనున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
అమితాబ్కు ప్రభాస్ విందు భోజనం.. అవి మాత్రం జీర్ణించుకోలేను
Prabhas Treats Amitabh Bachchan With Home Delicious Food: టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు డార్లింగ్. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ అభిమానులకు సినిమాలతో విందు భోజనం వడ్డించనున్నాడు. సినిమాలతోనే కాకుండా తనతో షూటింగ్లో పాల్గొనే కోస్టార్స్కు సైతం విందు భోజనం ప్రేమగా వడ్డిస్తాడు ఈ బుజ్జిగాడు. ప్రభాస్ ఎక్కడా సినిమా చేసినా తన వంటమనిషితో వండించుకుని తినడం అలవాటు. తనే కాకుండా కోస్టార్స్కు కూడా ఇంటిరుచులను రుచిచూపిస్తాడు. ఇప్పటికే పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్కు విందు భోజనం వడ్డించాడు. ఇప్పుడు మరో బిగ్ స్టార్కు ప్రభాస్ ఆతిథ్యం అందించాడు. ప్రస్తుతం ప్రభాస్ 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ట్ కె' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రీకరణలో ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. తనతో కలిసి పనిచేస్తున్న బిగ్బీకి ప్రభాస్ తన ఇంటి విందు భోజనాన్ని రుచి చూపించాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ వేదికగా అమితాబ్ బచ్చన్ తెలిపారు. 'టీ4198-బాహుబలి ప్రభాస్. మీ దాతృత్యం అమితమైనది. మీరు నాకు ఇంట్లో వండిన అత్యంత రుచికరమైన ఆహారాన్ని తీసుకొచ్చారు. మీరు పంపిన ఆహారం ఒక సైన్యానికి తినిపించవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన కుకీలు అత్యంత రుచికరంగా ఉన్నాయి. మీ కాంప్లిమెంట్స్ మాత్రం జీర్ణించుకోలేను.' అని ట్వీట్ చేశారు అమితాబ్. T 4198 - 'Bahubali' Prabhas .. your generosity is beyond measure .. you bring me home cooked food, beyond delicious .. you send me quantity beyond measure .. could have fed an Army .. the special cookies .. beyond scrumptious .. And your compliments beyond digestible 🤣 — Amitabh Bachchan (@SrBachchan) February 20, 2022 -
నాని- కీర్తి సురేష్ 'దసరా' షూటింగ్ షురూ
Nani-keerthy Suresh Dasara Movie Goes On Floors: న్యాచురల్ స్టార్ నాని ఇటీవలె శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్టు కొట్టాడు. ‘అంటే.. సుందరానికీ!’షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నాని తాజాగా మరో సినిమాను పట్టాలెక్కించాడు. గతేడాది దసరా సినిమాని అనౌన్స్ చేసిన నాని తాజాగా దీనికి సంబంధించిన షూటింగ్ను మొదలుపెట్టేశాడు. చిత్ర ప్రారంభోత్సవానికి డైరెక్టర్స్ సుకుమార్, కిశోర్ తిరుమలు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వీసీ) బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరినా ముఖ్య పాత్రలు పోషించనున్నారు. -
రావణాసుర నుంచి కొత్త అప్డేట్.. రంగంలోకి
Ravi Teja Step Into Ravanasura Movie Sets: మాస్ మహారాజా రవితేజ కేరీర్ పరంగా ఫుల్ జోష్ మీదున్నాడు. 'క్రాక్'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ ఏకంగా 5 సినిమాలు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అందులో రెండు చిత్రాల షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇక రమేశ్ వర్మ దర్శకత్వంలో వస్తున్న 'ఖిలాడి' సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రవితేజ 70వ చిత్రంగా వస్తోంది 'రావణాసుర'. ఈ మూవీకి సుధీర్ వర్మ డైరెక్టర్. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా కోసం రంగంలోకి దిగాడు రవితేజ. 'రావణాసుర' రెండో షెడ్యూల్ బుధవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా రవితేజతోపాటు మిగిలిన ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజా సెట్లోకి అడుగు పెట్టిన వీడియో, ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది చిత్రబృందం. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ న్యాయవాదిగా అలరించనున్నాడు. అలాగే ముఖ్య పాత్రలో యంగ్ హీరో సుశాంత్ ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 🥰🥰🥰🥰 #Ravanasura https://t.co/FAYHT5I5Wm — sudheer varma (@sudheerkvarma) February 2, 2022 #Ravana joins #Ravanasura🔥🔥🔥 https://t.co/QhM8cdxmF0 — sudheer varma (@sudheerkvarma) February 2, 2022 -
రామసేతు చిత్రీకరణ పూర్తి.. ఆసక్తికర విషయాలు చెప్పిన అక్షయ్
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడూ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. ఇటీవలే 'సూర్యవంశీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అక్కీ. అలాగే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆత్రంగి రే' సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రం 'రామసేతు'. ఈ సినిమా చిత్రీకరణ జనవరి 31తో పూర్తియింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 'రామసేతు' సినిమా షూటింగ్లో పాల్గొనడమంటే తనకు మరోసారి స్కూల్కు వెళ్లిట్లు అనిపించిందని అక్కీ ట్వీట్ చేశాడు. ఈ చిత్రీకరణలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాని, ఎంతో కష్టపడి షూటింగ్ పూర్తి చేశామన్నాడు. అప్పటి రామసేతును వానరుల సహయంతో కట్టారని, ఈ 'రామసేతు' సినిమాను తమ బృందంతో కలిసి నిర్మించామని పేర్కొన్నాడు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ భరూచ, సత్యదేవ్ నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. Here’s to the wrap of yet another amazing project #RamSetu. I learned so much during the making of this film, it was like going to school all over again 🙈. बड़ी मेहनत की है हम सबने, अब बस आप का प्यार चाहिए 🙏🏻 pic.twitter.com/v5ywciUu8F — Akshay Kumar (@akshaykumar) January 31, 2022 -
అన్నదమ్ములకు సోకిన కరోనా.. సినిమా షూటింగ్కు బ్రేక్
Hero Dhanush Tests Positive For Covid 19: తమిళ స్టార్ హీరో ధనుష్కు కోలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా అభిమానులు ఉన్నారు. ఈ క్రేజ్తోనే తెలుగులో నేరుగా ధనుష్ ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరే 'సార్'. వెంకీ అట్లూరీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే చిత్రీకరణ మొదలైన ఈ చిత్రాన్ని తమిళంలో 'వాత్తి' పేరుతో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ధనుష్ సోదరుడు డైరెక్టర్ సెల్వ రాఘవన్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ కూడా కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధనుష్ కొవిడ్ పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో 'సార్' సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది. ధనుష్కు కరోనా అని తేలగానే 'సార్' చిత్రీకరణ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్ హోం ఐసోలేషన్లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. వారం, పదిరోజుల వరకూ ధనుష్ 'సార్' చిత్రీకరణలో పాల్గొనే అవకాశం లేదు. అయితే ఇటీవలే హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభించిన చిత్రబృందం ఈ షెడ్యూల్ను భారీగా ప్లాన్ చేశారని టాక్. ఎక్కువ సీన్లు ధనుష్పైనే ఉండటంతో ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఈ సినిమా షూటింగ్ ముందుకు వెళ్లనట్లే అని సమాచారం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫొర్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ టీచర్గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
‘క్యూ’ మొదలైంది.. తినే తిండిలో కల్తీ జరిగితే..?
కల్తీ అనేది మన జీవితాల్లో కలిసిపోయింది. తాగే నీరు కల్తీ, తినే తిండి కల్తీ, పీల్చే గాలి కల్తీ.. అన్నీ కల్తీనే. మనం తినే తిండిలో జరిగే కల్తీ నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తల గురించి హెచ్చరిస్తూ... రవ్వంత సందేశానికి కొండంత వినోదాన్ని జోడించి రూపొందుతున్న చిత్రం ‘క్యూ’. శ్రీకాంత్ గాదిరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిత్యా క్రియేషన్స్ పతాకంపై ఎ. బ్రహ్మయ్య-జి.విశాల్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తోషి అనే నవ యువకుడు హీరోగా పరిచయమవుతున్న ఈ విభిన్న కథాచిత్రంలో సీనియర్ నటుడు దిల్ రమేష్ ఓ కీలకపాత్ర పోషిస్తుండగా... గంగారామ్, శ్రీనివాస్, అజయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అందాల భామ అశ్విని హీరోయిన్. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మొదలైంది. . ముహూర్తపు సన్నివేశానికి... ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న దిల్ రమేష్ క్లాప్ కొట్టగా... నిర్మాతల్లో ఒకరైన బ్రహ్మయ్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ చిత్రం స్టంట్ మాస్టర్ దేవరాజ్ ఫస్ట్ షాట్ కు డైరెక్షన్ చేశారు. రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ గంగారామ్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుండడం గమనార్హం. తెలుగు తెరపై ఇప్పటివరకు స్పృశించని అత్యంత వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న "క్యూ" చిత్రానికి పని చేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు తెస్తుందని దర్శకుడు శ్రీకాంత్ గాదిరాజు తెలిపారు. తమ దర్శకుడు శ్రీకాంత్ గాదిరాజు చెప్పిన కథ తమకు విపరీతంగా నచ్చి, తనపై నమ్మకంతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టామని నిర్మాతలు బ్రహ్మయ్య-విశాల్ రావు పేర్కొన్నారు. ఈ చిత్ర రూపకల్పనలో అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తున్న విక్కీ మాస్టర్ కి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ‘క్యూ’ చిత్రం చూసేందుకు ప్రేక్షకులు కచ్చితంగా క్యూ కడతారనే నమ్మకం ఉందని, ఇంత మంచి చిత్రంతో హీరోగా పరిచయమవుతుండడం గర్వంగా ఉందని అన్నారు చిత్ర కథానాయకుడు తోషి. -
Vizag: సినిమా సిటీ.. తీరంలో తారల సందడి
కొమ్మాది (భీమిలి): విశాఖలో సినిమా షూటింగ్ సందడి తిరిగి మొదలైంది. కోవిడ్ నిబంధనలు సడలించడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆర్టిస్టులు కూడా విశాఖ చేరుకుంటున్నారు. విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన తరువాత జోష్ ఎక్కువగా కనిపిస్తోంది. విశాఖ నగరం అంటే ప్రకృతి అందాలకు నెలవు. సముద్రానికి పచ్చని కొండలు తోడవడంతో పర్యాటకులతో పాటు సినిమా షూటింగులో కూడా అనువైన ప్రాంతంగా మారింది. 1971 ప్రాంతంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ సినీ ఫ్రేమ్లో విశాఖను ఆవిష్కరించడంతో నగర అందాలు బయట ప్రపంచానికి తెలిశాయి. యారాడ, అప్పికొండ, ఆర్కే బీచ్, రుషికొండ, తొట్లకొండ, భీమిలి ఇలా భిన్నమైన ప్రకృతి అందాలతో కూడిన ఈ ప్రదేశాలు షూటింగ్ సీన్స్ సినిమాల్లో ప్రత్యేకతను చాటుతున్నాయి. ఇక సింహాచలం కొండ సెంటిమెంట్గా మారడంతో చాలా మంది నటులు కొన్ని సీన్లు అక్కడ తీయాలని పట్టుబడుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవికి కొత్త కేరీర్ విశాఖ ఇచ్చింది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తిమ్మాపురంలో రామానాయుడు స్టూడియో చాలెంజ్, అభిలాష, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సినిమాలతో విశాఖనగరం చిరంజీవి సినీ చరిత్రనే మార్చేసింది. సర్పయాగం, చామంతి లాంటి సినిమాలు రోజాకు కొత్త సినిమా జీవితాన్ని అందించాయి. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లెజెండ్, లేటెస్ట్ హిట్ అఖండ వరకూ సింహాచలం కేంద్రంగానే షూటింగ్లు జరుపుకున్నాయి. ఓటీటీలో అలరిస్తున్న పరంపర చిత్రం మొత్తం విశాఖలోనే చిత్రీకరించారు. ఇక అరకు అందాల గురించి చెప్పనవసరం లేదు. ఆలాపన, స్టేషన్ మాస్టర్, కృష్ణ, ఒక్కడు, కృష్ణగాడి వీర ప్రేమ కథ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి సినిమాలు ఎన్నో ఇక్కడే ఊపిరి పోసుకున్నాయి. బీచ్ను ఆనుకునే ఉన్న రామానాయుడు స్టూడియోలో జరిగే ఒడిశా, బెంగాలీ లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. కోవిడ్ అనంతరం ఇప్పుడు విశాఖలో సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతున్నాయి. సాగర్నగర్లో రాజేంద్రప్రసాద్ తీరంలో తారల సందడి ప్రస్తుతం తీర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్లలో తారలు సందడి చేస్తున్నారు. ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్, బెల్లంకొండ శ్రీనివాస్, కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర వంటి తారలతో పాటు నూతన నటీనటులు జ్ఞానేశ్వరి, విజయ్ వంటి నటులు ఎంతమందో ప్రస్తుతం ఇక్కడ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దీంతో పాటు ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, సినిమా ప్రమోషన్లో భాగంగా ఎందరో నటీనటులు నగరంలో సందడి చేస్తున్నారు. షూటింగ్లకు అనువైన ప్రాంతం భీమిలి సినిమా షూటింగ్లకు అనువైన ప్రాంతం భీమిలి. అప్పట్లోనే తెలుగు సినిమా షూటింగులకు బీజం పడింది. 1962లో అక్కినేని, కృష్ణ కుమారి నటించిన కులగోత్రాలు సినిమా షూటింగ్ ఇక్కడే ప్రారంభమైంది. ఇక్కడ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి కొండపై ఈ సినిమాలో పెళ్ళి దృశ్యాన్ని తెరకెక్కించారు. 1972లో విశాఖ నుంచి భీమిలి మధ్య బీచ్ రోడ్డు నిర్మించటంతో భీమిలి అందాలు అప్పటి నుంచి ఇప్పటివరకు వెండి తెరపై కనువిందు చేస్తున్నాయి. అంతే కాదు విశాఖ అందాలకు ముగ్ధుడైన జం«ధ్యాల పదికి పైగా సినిమాలను ఇక్కడే నిర్మించారు. 1978లో ప్రఖ్యాతి దర్శకుడు కె.బాలచందర్ భీమిలిలో పలు చిత్రాలను చిత్రీకరించారు. అప్పటి నుంచి మద్రాసు, హైదరాబాద్ తరువాత షూటింగులకు అనుకూలమైన ప్రాంతంగా విశాఖ–భీమిలి గుర్తింపు పొందింది. అంతులేనికథ, మరోచరిత్ర, గుప్పెడు మనసు, నాలుగు స్తంభాలాట, ఆరాధన, అభిలాష, కోకిలమ్మ, నిప్పురవ్వ వంటి సినిమాలు హిట్ కావడంతో విశాఖలో షూటింగ్ చేస్తే సినిమా బాక్సాఫీస్ కళకళలాడుతుందన్న సెంట్మెంట్ ఇప్పటికీ కొనసాగుతోంది. విశాఖ తీరంలో షూటింగ్ జరిపితే కచ్చితంగా హిట్ అన్న సెంట్మెంట్ బలంగా ఉండడంతో దర్శక నిర్మాతలు భీమిలికి క్యూ కడుతున్నారు. భీమిలి బీచ్ నుంచి యారాడ బీచ్ వరకు నిత్యం ఎన్నో షూటింగ్లు ప్రస్తుతం జరుపుకుంటున్నాయి. ఇందులో ఎక్కువ శాతం ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, మంగమారిపేట, ఎర్రమట్టి దిబ్బలు, రామానాయుడు స్టూడియో, భీమిలి బీచ్లలో చిత్రీకరణలు ఎక్కువ కొనసాగుతున్నాయి. బుల్లితెర నుంచి వెండితెర వరకూ.. ప్రస్తుతం ఈ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సినిమా షూటింగ్ సందడి కనపడుతోంది. షార్ట్ ఫిల్మ్ల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలవరకు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఫొటో షూట్లు, వెడ్డింగ్ షూట్స్, షార్ట్ ఫిల్మ్స్,వెబ్ సిరీస్ , టివి సీరియల్స్, డాక్యుమెంటరీల చిత్రీకరణతో నిత్యం ఈ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. -
సినిమా షూటింగ్లో టైగర్ ష్రాఫ్కు గాయం.. ఫొటో షేర్ చేసిన నటుడు
Tiger Shroff Got Eye Injury During Ganapath Movie Shoot: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గణపత్: పార్ట్ 1' (Ganapath Movie). ఇందులో టైగర్కు సరసన బీటౌన్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్గా నటిస్తుంది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జాకీ భగ్నాని, వశు భగ్నాని, దీప్షికా దేశ్ముఖ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యూకేలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం మొదటి భాగం 2022 డిసెంబర్లో విడుదల కానుంది. యాక్షన్ స్టంట్స్తో అలరించే టైగర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటాడు. సినిమాలో తను చేసే యాక్షన్ సీన్స్ను చిన్నపాటి వీడియో రూపంలో పంచుకుంటూ అభిమానులకు టచ్లో ఉంటాడు టైగర్. తాజాగా టైగర్ ష్రాఫ్ తనకు సంబంధించిన ఓ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన కంటికి స్వల్ప గాయమైనట్టు ఇన్స్టా స్టోరీలో తెలిపాడు. దీనికి 'షిట్ హ్యాపెన్స్.. గణపత్ ఫైనల్ కౌంట్డౌన్' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు టైగర్. ఈ గాయం గణపత్ షూటింగ్లో జరిగినట్లుగా తెలుస్తోంది. యూకేలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన మోషన్ పోస్టర్ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. దానికి అనూహ్య స్పందన వచ్చింది. అంతకుముందు ఈ సినిమా కోసం తాను ఎలా సిద్ధం అవుతున్నాడో తెలిసేలా పలు గ్లింప్స్ను కూడా షేర్ చేశాడు టైగర్. గణపత్ సినిమాలో టైగర్.. బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో టైగర్కు తండ్రిగా నటించేందుకు బిగ్బీ అమితాబ్ను సంప్రందించిందటా మూవీ యూనిట్. అయితే దీనికి సంబంధించిన ఏ విషయం అధికారికంగా వెలువడలేదు. టైగర్ నటిస్తున్న మరో సినిమా 'హీరోపంటి 2' కూడా 2022 డిసెంబర్లోనే విడుదల కానుంది. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) ఇదీ చదవండి: టైగర్ ష్రాఫ్ చెల్లెలి హాట్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్ -
సక్సెస్ కోసం ‘రెక్కీ’చేస్తున్నారు
‘స్నోబాల్ పిక్చర్స్’ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘రెక్కీ’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనే ట్యాగ్ లైన్ తో ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా... ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ సైతం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ‘రెక్కీ’ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో ఇప్పటివరకు రాని కథాoశంతో, ఊహించని ట్విస్టులతో రూపొందుతున్న "రెక్కీ" టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని నిర్మాత కమలకృష్ణ పేర్కొన్నారు. -
సినీ దర్శకులను ఆకర్షిస్తున్న ఉప్పాడ బీచ్రోడ్డు
పిఠాపురం(తూర్పుగోదావరి): పైన నీలాల నింగి.. కింద నీలి సముద్రం.. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు.. వాటి అంచుల్లో పాలల్లా పరచుకున్న తెల్లని నురుగు.. మెత్తని ఇసుక తిన్నెలు.. వీనులకు ఆనందాన్నిచ్చే సాగర ఘోష.. ఇటు నేలకు.. అటు సాగరానికి సరికొత్త అందాలను అద్దే మడ అడవులు.. హోప్ ఐలాండ్.. మనసుకు ఆహ్లాదాన్ని అందించే ఇటువంటి విభిన్నమైన ప్రకృతి అందాలకు కేరాఫ్గా నిలుస్తున్న ఉప్పాడ సాగర తీర సౌందర్యం.. వెండితెర ప్రముఖుల్ని మరోసారి ఎంతో ఆకర్షిస్తోంది. ‘నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం..’ అంటూ ‘ఉప్పెన’ సినిమాలో హీరో వైష్ణవ్తేజ్ పాడిన పాట.. ఉల్లాసంగా ఆడిన ఆట కుర్రకారు గుండెల్ని ఊపేసింది. ఉప్పాడ సాగర తీర సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రం బంపర్ హిట్ కొట్టడంతో.. దర్శకుల దృష్టి మళ్లీ ఈ ప్రాంతం వైపు మళ్లింది. ఉప్పాడ అందాలు వారిని ఈ ‘తీరానికి లాగేటి దారం’గా మారిపోయాయి. కొత్త సినిమాలతో పాటు టీవీ సీరియళ్ల చిత్రీకరణకు కూడా ఉప్పాడ తీరం కేంద్రంగా మారుతోంది. గతంలో.. చాలాకాలం కిందట ఉప్పాడ తీరంలో సినిమా షూటింగ్లు జరిగాయి. రెబల్స్టార్ కృష్ణంరాజు హీరోగా, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య తదితర అగ్రశ్రేణి నటులు నటించిన ‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది’ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఉప్పాడ తీరంలో జరిగింది. తరువాత రణరంగం, పోరు, కనకం, డియర్ కామ్రేడ్, దుర్మార్గుడు, ఆగ్రహం, ఒక్కడు, జయమ్ము నిశ్చయమ్మురా.. తదితర సినిమాల చిత్రీకరణ ఇక్కడే జరిగింది. తరువాత కొన్నాళ్లు అంతగా షూటింగ్లు లేవు. కానీ ఉప్పెన సినిమాతో సాగరతీరం మరోసారి సినిమా షూటింగ్లకు నెలవుగా మారింది. ఇప్పుడు తీరంలో తరచుగా ‘క్లాప్.. స్టార్ట్.. రోల్.. కెమెరా.. యాక్షన్.. అంటూ సినిమా షూటింగ్ల సందడి కనిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్ఖాన్ నటిస్తున్న ‘లాల్సింగ్ చద్దా’ సినిమా షూటింగ్ ఈ ప్రాంతంలోని పండూరుతో పాటు అల్లవరం మండలంలోని పలు గ్రామాల్లో జరిగింది. వీటితో పాటు పలు ప్రముఖ బుల్లితెర సీరియల్స్ షూటింగ్లు ఇక్కడ జరిగాయి. ఉప్పెన సినిమా షూటింగ్ జరిగిన కాకినాడ ఫిషింగ్ హార్బర్ కాకినాడ నుంచి తుని సమీపంలోని అద్దరిపేట వరకూ ఉన్న సాగరతీరం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్, మడ అడవులు.. చూడచక్కటి లొకేషన్లతో సందర్శకులనే కాదు.. వెండితెర, బుల్లితెర దర్శకుల కళ్లను కూడా కట్టి పడేస్తున్నాయి. కడలి కెరటాలు.. పచ్చని చెట్లు.. ఇసుక తిన్నెలు.. మధ్యలో ఉన్న కాలువలు ఎక్కడో ఉన్న దీవులను తలపిస్తుంటాయి. రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేయడంతో ఇక్కడ షూటింగ్లు జరుపుకునేందుకు ఎక్కువ మంది సినిమా వాళ్లు ఆసక్తి చూపుతున్నారు. ఉప్పాడ.. నా కెరీర్ను మలుపు తిప్పింది నా తొలి సినిమా షూటింగ్ నా సొంత ఊరిలో జరుపుకోవడం నా కెరీర్ను మలుపు తిప్పింది. ఏ దర్శకుడికీ దక్కని అవకాశాన్ని నా సొంత ఊరిలో ప్రకృతి నాకు ఇచ్చింది. కాకినాడ – ఉప్పాడ సాగరతీరంలో ఎన్నో అందమైన లోకేషన్లున్నాయి. ఉప్పెన సినిమాలో లొకేషన్లు చూసి, హిందీ నటుడు ఆమిర్ఖాన్ సైతం ఇక్కడ షూటింగ్కు ఉత్సాహం చూపించారు. ఇప్పటికీ ఎంతో మంది ఫోన్ ద్వారా ‘ఉప్పాడలో అంత మంచి లొకేషన్లున్నాయా? మేమూ సినిమా తీస్తాం’ అని చెబుతున్నారు. షూటింగ్కు ఇక్కడి ప్రజల సహకారం ఎంతో బాగుంటుంది. రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాల షూటింగ్లు ఉప్పాడ తీరంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. – సానా బుచ్చిబాబు, ఉప్పెన సినిమా దర్శకుడు ‘లాల్సింగ్ చద్దా’ షూటింగ్కు వచ్చిన బాలీవుడ్ హీరో ఆమిర్ఖాన్ ఇక్కడ సెట్టింగ్లతో పని లేదు కాకినాడ – ఉప్పాడ తీర ప్రాంతాల్లో సినిమా షూటింగ్లు చేస్తే సెట్టింగ్లతో పని ఉండదు. అంతా ప్రకృతి అందాలతో ఎక్కడ చూసినా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతిని చిత్రీకరించాలంటే ఇక్కడి కంటే మంచి లొకేషన్లుండవు. సినిమా షూటింగ్లకు అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. తక్కువ ఖర్చుతో మంచి లొకేషన్లలో సినిమాలు తీసుకోవడానికి ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుంది. అందుకే ఇక్కడ ‘కనకం 916 కెడిఎం’ సినిమా తీశాం. షూటింగ్కు స్థానిక ప్రజలు చాలా సహకరించారు. – రాకేష్ కనకం, సినిమా డైరెక్టర్ కనకం 916 కేడీఎం సినిమా షూటింగ్లో హీరోకు దర్శకుడు రాకేష్ సూచనలు -
బిగ్బాస్ : మానస్ క్రేజీ మాములుగా లేదుగా.. అప్పుడే కొత్త సినిమా స్టార్ట్!
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన మానస్ నాగులపల్లి అనంతరం హీరోగా,విలక్షణ నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.వరుసగా మంచి కథా బలం ఉన్న చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ తన నైపుణ్యాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 'బిగ్ బాస్5' లో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన గేమ్ తో అలాగే మెచ్యూర్డ్ థింకింగ్ తో అటు కుటుంబ ప్రేక్షకుల్ని ఇటు యువతని అమితంగా ఆకట్టుకున్నాడు. కాగా మానస్ 'బిగ్ బాస్' క్రేజ్ వల్ల అతను నటించిన సినిమాలకు కూడా ప్లస్ అవుతుంది. ఈ ఏడాది అతను హీరోగా నటించిన 'క్షీర సాగర మథనం' చిత్రం ప్రేక్షకాధరణ పొందింది. మానస్ 'బిగ్ బాస్' లోకి ఎంట్రీ ఇచ్చిన టైములో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదలవ్వగా ఇక్కడ కూడా అనూహ్య స్పందన దక్కించుకుంది. ఇక హౌస్ నుండీ బయటకి వచ్చిన వెంటనే మానస్ మరిన్ని ప్రాజెక్టులతో బిజీ కానున్నాడు. ముందుగా '5జి లవ్' అనే చిత్రంలో మానస్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. 'స్క్వేర్ ఇండియా స్టూడియోస్ బ్యానర్ పై ప్రతాప్ కోలగట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ ముదునూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. పలు హిట్ చిత్రాలకి సంగీతం అందించిన శేఖర్ చంద్ర '5జి లవ్' కి సంగీత అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఈ చిత్రం రూపొందనుందని చిత్రబృందం తెలిపింది. -
భీమిలిలో కలర్స్ స్వాతి సందడి
కొమ్మాది(భీమిలి): భీమిలి బీచ్రోడ్డు మంగమారిపేట తీరం వద్ద బుధవారం హీరోయిన్ కలర్స్ స్వాతి సందడి చేసింది. అందాల రాక్షసి ఫేమ్ నవీన్చంద్ర నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. పల్లెటూరు నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ కళాశాలకు వెళ్లే సన్నివేశాలను ఇక్కడ షూట్ చేశారు. ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్వంత్ నిర్మాత. హీరో నవీన్చంద్రపై చిత్రీకరిస్తున్న దృశ్యం -
షారుక్ ఖాన్.. ఇక చకచకా!
షారుక్ ఖాన్ ఇక స్పీడ్ పెంచనున్నారు. 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రం తర్వాత ఆయన వెండితెరపై కనిపించలేదు. ‘జీరో’ ఆశించినంత సక్సెస్ను ఇవ్వలేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న షారుక్ ఆ తర్వాత ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్, అట్లీ దర్శకత్వాల్లో సినిమాలు చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చి షూటింగ్స్ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాల షూటింగ్స్ స్పీడ్గా జరుగుతున్న టైమ్లో తనయుడు అర్యన్ఖాన్ ఓ కేసులో అరెస్ట్ కావడంతో షారుక్ ఖాన్ ఆ పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో ఆయన చేస్తున్న సినిమాలకు స్పీడ్ బ్రేకర్స్ పడ్డాయి. ఇటీవల ఆర్యన్ఖాన్ విడుదల కావడంతో తన సినిమాలపై షారుక్ మళ్లీ ఫోకస్ పెట్టారని బాలీవుడ్ సమాచారం. తన సినిమాల్లోని గెటప్స్కు తగ్గట్లుగా ఫిజిక్ను చేంజ్ చేసేందుకు జిమ్లో తీవ్ర కసరత్తులు చేస్తున్నారట ఆయన. ముందుగా ‘పఠాన్’ చిత్రాన్ని, ఆ తర్వాత అట్లీ సినిమాను పూర్తి చేసేసి, ఆ నెక్ట్స్ రాజ్కుమార్ హిరాణి దర్శకత్వం వహించే సినిమాకు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారట. ‘పఠాన్’ షూటింగ్ తిరిగి ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ టాక్. (చదవండి: సోనూసూద్కు బీఎంసీ మరో షాక్, మాట నిలబెట్టుకోలేదంటూ హెచ్చరిక) -
గోదారి గట్టున సినిమా తీస్తే హిట్టే: ఆ చెట్టు కింద 300 సినిమాల షూటింగ్..
సాక్షి, పోలవరం రూరల్/ బుట్టాయగూడెం: గోదారి గట్టున సినిమా తీస్తే హిట్ అనేది తెలుగు సినిమా సెంటిమెంట్.. అందుకే ఎన్నెన్నో సుందర దృశ్యాలతో కనువిందు చేసే జిల్లాలోని గోదావరి తీరం సినీ షూటింగ్లకు ప్రసిద్ధి పొందింది. ప్రకృతి అందాల నడుము శోభాయమానంగా వెలిగిపోయే గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం ఏదోక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉండేది. ఈ ప్రాంత అందాలు కూడా సినీ వీక్షకులకు కొత్త అనుభూతి పంచేవి. గత కొన్నేళ్లుగా అవుట్డోర్ షూటింగ్లు తగ్గడం, విదేశాల్లోని లొకేషన్లకు క్రేజ్ పెరగడంతో గోదావరి తీర ప్రాంతంలో సినీ సందడి తగ్గింది. అయితే ఇటీవల మళ్లీ గోదావరి తీరంలో షూటింగ్ల సందడి మొదలైంది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాలు పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోవడంతో ఈ ప్రాంతానికి కొత్త కళ వచ్చింది. జిల్లాలోని ఫలానా లొకేషన్లో సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని గతంలో పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు నమ్మేవారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, లెజెండరీ డైరెక్టర్ బాపు, కె.విశ్వనాథ్, కృష్ణవంశీ, సుకుమార్ వంటి అగ్ర దర్శకులు అనేక సినిమాలు జిల్లాలోని పలు లోకేషన్లలో తీసి సూపర్హిట్ కొట్టారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, సూపర్స్టార్ కృష్ట, రజనీకాంత్, మహేష్ బాబు, బాలకృష్ట, రవితేజ తదితర అగ్ర హీరోలు ఈ ప్రాంతంలో షూటింగ్లంటే ఇష్టపడేవారు. గోదావరి తీరంలో కొవ్వూరు నుంచి కుమారదేవం, పట్టిసీమ, పోలవరం, పాపికొండలు ఇలా అనేక ప్రదేశాలు సినిమా షూటింగ్లకు ప్రసిద్ధి చెందాయి. గోదావరి తీరంలో రూపొందిన రంగస్థలం షూటింగ్ తనివితీరని పట్టిసీమ అందాలు ఒకపక్క ఆధ్యాత్మిక సొబగులు, మరోవైపు ప్రకృతి సోయగాలు పట్టిసీమ ప్రత్యేకం. కనుచూపు మేర కనువిందు చేసే ఎత్తైన కొండలు కట్టిపడేస్తాయి. ఈ ప్రాంత సౌందర్యానికి ముగ్ధులైన పలువురు సినీ ప్రముఖులు ప్రకృతి రమణీయ దృశ్యాల్ని తమ కెమెరాల్లో బంధించేందుకు ఇష్టపడేవారు. వందల సంఖ్యలో ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్లు జరిగాయి. ‘గోదారి గట్టుంది... గట్టు మీద చెట్టుంది.. చెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది’ అంటూ మూగమనసుల్లోని పాట ఇక్కడ చిత్రీకరించిందే. 1964లో వచ్చిన ఈ సినిమా దాదాపు గోదావరి చుట్టు పక్కల ప్రాంతంలో చిత్రీకరించారు. 1975లో బాపు దర్శకత్వంలో భక్తకన్నప్ప షూటింగ్ కూడా ఇక్కడే తీశారు. ‘శివ శివ శంకర.. భక్తవ శంకర.. శంభో హరహర నమో నమో’ పాటను పట్టిసం వీరభద్రస్వామి ఆలయంలో తీశారు. 1985లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో అనేక సన్నివేశాలు కూడా ఇక్కడ చిత్రీకరించారు. అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో 1982లో రూపొందిన మేఘసందేశం చిత్ర షూటింగ్ ఇక్కడ జరిగింది. నిద్రగన్నేరు చెట్టు కింద ఎన్నో షూటింగ్లు కొవ్వూరు మండలం కుమారదేవం సమీపంలో గోదావరి ఒడ్డున నిద్రగన్నేరు చెట్టుంది. ఈ చెట్టు కింద షూటింగ్ జరుపుకున్న సినిమాలెన్నో.. అందుకే దీనిని సినిమా చెట్టుగా పిలుస్తుంటారు. కృష్ణ నటించిన పాడిపంటలు, చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, తదితర సుమారు 300 చిత్రాలు ఈ చెట్టు దగ్గర షూటింగ్ జరుపుకున్నాయని స్థానికులు చెబుతారు. జిల్లాలోని ఏలూరు, కొల్లేరు, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, పెద్దేము, భీమవరం పరిసర ప్రాంతాలు, పాలకొల్లు, నిడదవోలు, చాగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ కూడా పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. గోదావరి తీరాన.. ఇసుక తిన్నెలపై చిరంజీవి ఆపద్భాందవుడు, కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందించిన మురారీ చిత్రంలో కొన్ని సన్నివేశాలు గోదారి తీరంలో రూపొందినవే. మురారిలోని ‘డుమ్ డుమ్ డుమ్ నటరాజు ఆడాలి... దుమ్మురేపాలిరా’ పాట గోదావరి ఇసుక తిన్నెలపై తీసిందే.. హిందీ, తమిళ సినిమాలు కూడా.. సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్ నటించిన రంగస్థలంలోని పలు సన్నివేశాలు గోదావరి తీర ప్రాంతంలో తీసినవే. రాజేశ్వరి కళ్యాణం, సీతారామయ్య గారి మనవరాలు, సూత్రధారులు, త్రిశూలం, పాడిపంటలు, మొరటోడు నా మొగుడు, ప్రెసిడెంట్గారి పెళ్లాం, జానకిరాముడు, భద్రాచలం, అధిపతి, గోదావరి, నువ్వులేక నేను లేను, చట్టంతో పోరాటం ఇలా వందల సినిమా షూటింగ్లు పట్టిసీమ, పోలవరం, కోండ్రుకోట, సింగన్నపల్లి, పాపికొండలు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్నవే. హిందీ సినిమా హిమ్మత్వాలా, తమిళ సినిమా సూర్య చిత్రాల్ని గోదావరి తీరంలో చిత్రీకరించారు. పూర్తి స్థాయి గోదావరి నేపథ్యంలో సినిమాలు రూపొందడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు, సుమంత్ గోదావరి చిత్రం రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు పూర్తిగా గోదావరిపైనే చిత్రీకరించారు. -
వీథి నుంచి వెండి తెరకు
మతి స్థిమితం తప్పి వీధుల్లో తిరిగే వారికి ఎవరైనా ఆహారం ఇస్తారు. కొందరు బట్టలు ఇస్తారు. మరికొందరు షెల్టర్ ఏర్పాటు చేస్తారు. కాని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక దీనురాలిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెను తన కూతురిగా చూసుకున్నాడు. వైద్యం చేయించాడు. మనిషిగా మార్చాడు. ఆ మనిషి కథతో ‘మనసున్నోడు’ అనే సినిమా తయారవుతోందిప్పుడు. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. సీన్ –1 సరిగా చూస్తే తప్ప ఆ చెత్త కుప్ప దగ్గర ఆమె ఉన్నట్టు తెలియదు. ఆ చెత్త మధ్య ఆమె కూడా ఒక చెత్త కుప్పలా ఉంది. చెత్తలోనే ఏరుకు తింటోంది. అక్కడే నిదురిస్తుంది. ఏ ఊరో తెలియదు. ఏ భాషో తెలియదు. ఏమీ మాట్లాడదు. ఒక పాతికేళ్లు ఉంటాయి. కాని విధి కొట్టిన దెబ్బలకు దిమ్మరిగా మారింది. కట్ చేస్తే... సీన్ –2 కోదాడ వ్యవసాయ మార్కెట్. ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె తెలుగు మాట్లాడుతోంది. స్వస్థతతో ఉంది. తన కాళ్ల మీద తాను నిలబడి ఉద్యోగం చేస్తూ నెలకు 15 వేలు సంపాదిస్తోంది. నాడు చెత్తకుప్పల్లో తిరిగిన యువతి నేడు ప్రయోజకురాలు. అంతేనా? ఆమె కథతో సినిమా కూడా తయారవుతోంది. ఎంత ఆసక్తికరం ఈ కథ..! ఎవరీ యువతి... ?! 2001. తెలంగాణలోని కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు. చెప్పులు కుట్టుకునే పల్లే వెంకటేశ్వర్లు మధ్యాహ్నం పని పూర్తయ్యాక సామాను అంతా సర్దుకుని కూచున్నాడు. అంతలో అతని పక్కన విసురుగా వచ్చి ఓ రాయి పడింది. ఎటునుంచి పడిందా అని చూసిన అతనికి చింపిరి జుత్తు, చిరిగిన దుస్తులు, దయనీయమైన పరిస్థితిలో మతి స్థిమితం లేని ఓ యువతి కనిపించింది. మున్సిపాలిటీ చెత్తకుప్పలో పడవేసిన ఆహారం కోసం పందులు, కుక్కలతో పోటీ పడి ఏరుకొని తింటున్న ఆమెను చూసి దగ్గరికి వెళ్లి పరిస్ధితి ఆరా తీయబోయాడు. కాని అర్థంకాని పిచ్చి మాటలు.. చేష్టలతో అతనిపైనే రాళ్లురువ్వసాగింది. ఓపికతో ఆమెకు నచ్చజెప్పి తాను తెచ్చుకున్న అన్నం పెడితే ఆబగా తినేసింది. ఎండకు ఎండుతూ.. వానకి తడుస్తూ ఉన్న ఆ యువతిని ఇలా రోడ్డు మీద వదిలి వేయడం కంటే ఇంటికి తీసుకెళ్లడం మంచిదని భావించాడు. కుటుంబంలో ఒకరిగా.. మానసిక ఆరోగ్యం కోల్పోయిన ఆ అభాగ్యురాలిని ఇంటికి తెచ్చిన వెంకటేశ్వర్లును చూసి భార్య నిరోధించలేదు. కాకుంటే ‘ఇప్పటికే ఇద్దరు పిల్లలతో పేదరికంలో ఉన్న మనం భరించగలమా!’ అని భయపడింది. కానీ మానవత్వంతో ఆ అమ్మాయి బాధ్యత తీసుకుంది. చింపిరి జుత్తు కత్తిరించి, స్నానం చేయించి.. తమ పిల్లల బట్టలు వేసింది. పిల్లలకు ఇక నుంచి ఈ అక్క మీతోనే ఉంటుందని ఆ భార్యాభర్తలు చెప్పారు. మానసికచికిత్స చేయించమని కొంతమంది సాయమందించడంతో హైద్రాబాద్లోని ‘ఆశ’ మానసిక చికిత్సాలయం వద్దకు తీసుకెళ్లాడు వెంకటేశ్వర్లు. ఏడాది పాటు అక్కడే ఆ యువతికి ఉచిత చికిత్సను అందించారు. దీంతో ఆమెకు పునర్జన్మ లభించింది. ముంబయ్కి వెళ్లిన కథ చికిత్స తరువాత తన వివరాలను ఒక్కొక్కటి చెప్పసాగిందామె. తన పేరు అముద అని, తండ్రి నారాయణ నాడర్ అని, తమది తమిళనాడులోని తిరునల్వేలి’ అని చెప్పింది. బతుకుదెరువు కోసం నలుగురు అక్కాచెల్లెళ్లం కలిసి ముంబాయిలోని ధారవికి వెళ్లామని, అక్కడ దయాసదన్ లో 10 తరగతి వరకు చదువుకొని మాంటిస్సోరీలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది. తరువాత తమిళనాడుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని, భర్త వేధింపులు భరించలేక పురుగులమందు తాగానని, ఆ తరువాత ఏమైందో.. తాను కోదాడకు ఎలా వచ్చానో తెలియదని చెప్పడంతో కథ అంతటితో ఆగిపోయింది. అయినవారికి కలపాలని వెంకటేశ్వర్లు ముంబాయిలోని దయాసదన్ కు ఉత్తరం రాసి, అముద బంధువుల కోసం ఆరా తీసాడు. కాని వారు అక్కడ లేరని, ఒక చర్చిలో అముద చెల్లెలు ఉంటుందని చెప్పడంతో ఆమెను తీసుకొని ముంబయి వెళ్లాడు. అక్కను గుర్తుపట్టిన చెల్లెలు తామే ఇతరుల వద్ద బతుకుతున్నామని, ఆమెను ఆదరించలేమని చెప్పడంతో అక్కడి నుండి తిరిగి వచ్చారు. భర్త ఆచూకి కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇక అముద తన కూతురే అనుకొని తన దగ్గరే ఉంచుకొని ఉన్న దాంట్లో పోషించసాగాడు. శాశ్వత ఆసరా! తనకు వయస్సు పైబడడం, చికిత్స కోసం నెలకు దాదాపు 1500 రూపాయలు అముదకు అవసరం కావడంతో ఆమెకు శాశ్వత ఆసరా కల్పించడానికి వెంకటేశ్వర్లు విశ్వప్రయత్నాలు చేశాడు. 10 సంవత్సరాల క్రితం ‘సాక్షి’ అముద గాథకు అక్షర రూపం ఇవ్వడంతో అప్పటి కలెక్టర్ అముదకు విద్యావలంటీర్గా అవకాశం కల్పించాడు. కాని సెలవులు వచ్చిన సమయంలో వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతూనే దాదాపు 6 సంవత్సరాలు పని చేసింది. 2016వ సంవత్సరంలో మంత్రి హరీష్రావు చొరవతో కోదాడలోని వ్యవసాయమార్కెట్ కార్యాలయంలో అటెండర్గా ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నెలకు 15 వేల రూపాయల వేతనం వస్తుండడంతో అముద బతుకుబండి సాఫీగా సాగుతోంది. వెండి తెరపైన అముద కథ ఎన్నో మలుపులు తిరిగిన అముద జీవితాన్ని 2008వ సంవత్సరంలో ‘సాక్షి’లో వచ్చిన కథనం చూసిన పశ్చిమగోదావరి జిల్లా వాసి వేల్పుల నాగేశ్వరరావు అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమె కథను ‘మళ్లీ మరో జన్మంటూ ఉంటే’ పేరుతో నాటకంగా మార్చారు. 2012 నుండి పలుచోట్ల దీన్ని ప్రదర్శించారు. తాజాగా తానే సినిమాగా వెండితెరకెక్కించాలని భావించి నాలుగు నెలల క్రితం కోదాడకు వచ్చి అముదను, ఆమెకు కొత్త జీవితాన్ని అందించిన పల్లే్ల వెంకటేశ్వర్లును కలిశారు. సినిమాలో వారి పాత్రలలో వారే నటించమని కోరారు. కాని వారు ఒప్పుకోకపోవడంతో కొత్త వారితో సినిమా షూటింగ్ ప్రారంభించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అశ్వారావుపేట సమీపంలో పలుగ్రామాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు నాగేశ్వరరావు తెలిపారు. మతి స్వాధీనం తప్పి తిరిగే దీనులకు వెంకటేశ్వర్లు వంటి బాంధవులు దొరికితే వారి జీవితం ఇలా తప్పక బాగుపడుతుంది. చిత్రం షూటింగ్ సన్నివేశం సంరక్షకుడు పల్లే వెంకటేశ్వర్లుతో అముద – అప్పిరెడ్డి, సాక్షి, కోదాడ -
టాలీవుడ్లోకి మరో కొత్త నిర్మాణసంస్థ ఎంట్రీ
టాలీవుడ్లోకి మరో కొత్త నిర్మాణసంస్థ ఎంట్రీ ఇచ్చింది. ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై కిరణ్ కల్లాకురి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `గ్రే`. ద స్పై హూ లవ్డ్ మి అనేది ఉపశీర్షిక. స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం ఈ సినిమా హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో ఘనంగా ప్రారంభమైంది. మూహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వీఎన్. ఆదిత్య క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్ స్క్రిప్ట్ను అందజేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిబొట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ `గ్రే అనేది ఒక నెగటివ్ షేడ్ అనే కాదు. ఓ రిలేషన్ షిప్. ఓ రెవల్యూషన్. గ్రే మనలైఫ్లో ఉంది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన నీడే ఒక గ్రే. ఇదొక స్పై మూవీ. థ్రిల్లర్. నమ్మలేని అంశాలు ఉంటాయి.ఈ నెల 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబరు కల్లా అన్నీ కార్యక్రమాలను పూర్తి సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం`అన్నారు. `రాజ్ ముదిరాజ్ మంచి ప్రతిభావంతుడు. గ్రే సినిమాకు మంచి క్యాస్టింగ్ కుదిరింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను`అన్నారు ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్. నిర్మాత కిరణ్ కల్లాకురి మాట్లాడుతూ..`ఈ సినిమా కోసం రాజు, రమేష్చదలవాడ చాలా కష్టపడ్డారు. సినిమాకు డబ్బులు పెట్టడం సులువే. కానీ మంచి అవుట్పుట్ ఇవ్వడం కష్టం. గ్రే మంచి సినిమా అవుతుందని నమ్ము తున్నాను. థ్రిల్లర్ సినిమాలు పెద్దగా తెలుగులో రాలేదు. గ్రే మంచి థ్రిల్లర్ మూవీ`అన్నారు. -
అంతరిక్షంలో సినిమా షూటింగ్ విజయవంతం
మాస్కో: రష్యన్ సిని బృందం తొలిసారిగా భూకక్ష్యలో విజయవంతంగా సినిమా షూటింగ్ని పూర్తి చేసుకుంది. రష్యా నటి యులియా పెరెసిల్డ్, దర్శకుడు క్లిమ్ షిపెంకో, వ్యోమగామి అంటోన్ ష్కాప్లెరోవ్ కజికిస్తాన్లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి సోయుజ్ ఎంఎస్-18 అంతరిక్ష నౌక ద్వారా ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో 12 రోజులు పాటు విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుని భూమికి చేరుకున్నారు. అయితే వీరు కజకిస్తాన్ స్టెప్పీ సమీపంలో సురక్షింతంగా ల్యాండ్ అయ్యినట్లు రష్యన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ మేరకు ఈ సినిమా బడ్జెట్ వ్యయం విషయం కూడా అత్యంత గోప్యంగా ఉంచారు. పైగా వారు ఈ ప్రయాణం కోసం నాలుగు నెలలు శిక్షణను కూడా తీసుకున్నారు. అంతేకాకుండా అమెరికాలో అత్యాధునిక రాకెట్ ప్రయోగాలతో స్పేస్ ఎక్స్ దూసుకెళ్తున్న నేపథ్యంలో దాన్ని బ్రేక్ చేసేలా సరి కొత్త చరిత్రను తిరగారాయలన్న ఉద్దేశంతోనే రష్యా స్పేస్ ఏజెన్సీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ మేరకు 'చాలెంజ్' అను పేరుతో నిర్మిస్తున్న ఈ సినిమా అంతరిక్షంలోని వ్యోమోగామీకి గుండె నొప్పి రావడంతో అతనికి చికిత్స చేసేందుకు వెళ్తున్న సర్జన్ ఏ విధంగా అంతరిక్షం చేరుకుంటుంది అనేది ఇతివృత్తంగా చేసుకుని తీస్తున్నారు. ఇందులో ఇద్దరూ రష్యన్ వ్యోమోగాములు అతిధి పాత్రలో నటించడం విశేషం. ఈ సోయుజ్ ఎంఎస్-18 అంతరిక్షం నుంచి తిరిగి భూమికి పయనమయ్యే సమయంలో కొంత సమయం ఇబ్బంది తలెత్తినప్పటికీ సురక్షితం అనుకున్న సమయానికి భూమికి చేరుకన్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ పేర్కొంది. Touchdown after 191 days in space for @Novitskiy_ISS and 12 days in space for two Russian filmmakers! More... https://t.co/CrQl3O1BUl pic.twitter.com/kzXlCTr0og — International Space Station (@Space_Station) October 17, 2021 -
సినిమా పరివార్!
‘ఇండస్ట్రీ’ అంతా మా కుటుంబమే అని చెబుతుంటారు సినిమా వాళ్లు. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ఉద్ఘాటన చేస్తూనే ఉంటారు. అదొక సంఘీభావం. మంచిదే. ఈ సినిమా కుటుం బంలో సభ్యులెవరు? దర్శకులు, నిర్మాతలు, రచయితలు, నటులు, గాయకులు, సాంకేతిక నిపుణులు వగైరా వగైరా. వీళ్లు గాక సినీ నిర్మాణం కోసం ‘లైట్లెత్తే’ బాయ్స్ సహా చాలామంది శ్రమజీవులుంటారు. వీళ్లందర్నీ 24 క్రాఫ్టుల ‘బంగారం’గా గుర్తించి కుటుంబ సభ్యత్వం కల్పించిన వ్యక్తి దాసరి నారాయణరావు. సినిమా పరివారం ఎల్లలు ఇంతవరకేనా? ఎగ్జిబిటర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు మొదలైన మైలురాళ్లను దాటి విస్తరించిన కుటుంబం ఇది. తెలుగు రాష్ట్రాలకు సంబంధిం చినంతవరకైతే తెలుగు ప్రేక్షకులందరూ సినిమా కుటుంబ సభ్యులే. ఎదుగుతున్న నాటక రంగాన్ని బలిపెట్టి మరీ సినిమా రంగాన్ని పోషించింది తెలుగు సమాజం. ఈ రాష్ట్రాల్లో ఉన్న సినిమా థియేటర్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఉత్తర భారత దేశమంతటా కలిపి ఎన్ని థియేటర్లున్నాయో ఈ రెండు రాష్ట్రా ల్లోనే అన్ని ఉన్నాయట. సినిమా అభిమానం బాగా ఎక్కువ నుకునే తమిళనాడుతో పోల్చినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు వెయ్యి సినిమా హాళ్లు ఎక్కువుండేవి. ఇతర రాష్ట్రాల్లో నాటక రంగం ఇంకా తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడో ఒకసారి చిన్న మూలుగు వినిపి స్తుంది, అంతే. తెలుగు ప్రజలకున్న అపార సినిమా అభిమానం అందుకు కారణం. కుటుంబ సభ్యులంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే కాదు గదా! పెంచి పోషించిన తల్లి దండ్రులు కూడా కుటుంబ సభ్యులే. అలాగే ప్రత్యేక శ్రద్ధతో తెలుగు సినిమాను పెంచి పోషించిన ప్రేక్షకులంతా సినిమా పరివారమే. మన సినిమా ఒక విస్తారమైన కుటుంబమని గుర్తిస్తే, సభ్యులైన ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు గణించుకోవాలి. కొన్ని వేలమందికి అన్నం పెట్టే ‘పరిశ్రమ’ కనుక, సినిమాను ఒక వ్యాపారం అనుకుందామా? అయితే ఈ వ్యాపారంలో మేజర్ స్టేక్హోల్డర్లు ప్రేక్షకులు. వారిపై ఏకపక్షంగా రుద్దజూసే నిర్ణయాలు చెల్లవు. సినిమాను ఒక కళగా మాత్రమే భావిద్దామా? కళ కళ కోసమే తప్ప కాసుకోసం కాదని చాలామంది కళాస్రష్టలు భావిస్తారు. జగత్ ప్రసిద్ధ ఫిలిమ్ మేకర్ వాల్డ్డిస్నీ ఒక మాటన్నారు. ‘నేను డబ్బులు సంపాదించడం కోసం సినిమా తీయను. సినిమా తీయడం కోసం డబ్బులు సంపాదిస్తా’. సినిమాను కళగా భావించే వారికి ఇదొక సందేశం. సినిమాపై డిస్నీ సంతకం ఇంకెన్నాళ్లకయినా చెరిగి పోతుందా? కాసుల పొడ సోకనీయని శుద్ధ సృజనాత్మక ఆలోచనలు మన వాళ్లలోనూ ఉండేవి. కటిక దరిద్రాన్ని అనుభవిస్తూనే బమ్మెర పోతన కవి ‘ఆంధ్ర మహాభాగవత’ కావ్యాన్ని పూర్తి చేశారు. రాజులకు అంకితం ఇస్తే దరిద్రం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు అనుభవించవచ్చని సన్నిహితులు సలహా ఇస్తారు. కానీ, పోతన ససేమిరా అంటాడు. ‘బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజిం చుట కంటె సత్కవుల్ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల కౌ / ద్దాలికులైననేమి? నిజ దార సుతోదర పోషణా ర్థమై’ అని ఈసడించుకుంటాడు. కోమలమైన మహాభాగవత కావ్యాన్ని దుర్మార్గులైన రాజులకు అంకితం చేయడం కంటే వ్యవసాయం చేసుకుని భార్యాబిడ్డల్ని పోషించడం మేలంటాడు పోతన. ఇదీ విశుద్ధ కళా ప్రకటన, భక్తి భావన. ఆనాటికి తెలుగు ప్రాంతాల్లో ఉన్న నాటక సమాజాలన్నీ వరసకట్టి మరీ నటీనటులనూ, రచయితలనూ, దర్శకులనూ, గాయకులను సినీరంగ ప్రవేశం చేయించాయి. వాటిలో ప్రముఖ మైనది ‘ప్రజానాట్యమండలి’. ‘కళ కళ కోసం కాదు ప్రజల కోసం’ అనేది ఈ సంస్థ సిద్ధాంతం. ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు డాక్టర్ గరికపాటి రాజారావు స్వీయ దర్శకత్వంలో ‘పుట్టిల్లు’ సినిమా నిర్మించి జమునను వెండితెరకు పరిచయం చేశారు. ఎన్టీరామారావు కూడా సినిమాల్లోకి రాకముందు ‘నేషనల్ ఆర్ట్ థియేటర్’ అనే పేరుతో నాటకాలు వేసేవారు. సంస్థ పేరులోనే జాతీయ భావం ఇమిడి వున్నది. సినిమా నిర్మాణాన్ని కూడా ఆయన ఇదే పేరుతో ప్రారంభించారు. అభ్యుదయ భావాలతో నాటకాలు వేసి, సినీరంగంలో ప్రవేశించిన వారి ప్రభావం ఫలితంగా తొలి రోజుల్లో అనేక సందేశాత్మక, కళాత్మక విలువలున్న తెలుగు సినిమాలు తయారయ్యాయి. ఇవి వాణిజ్యపరంగా కూడా ఘన విజయాలను నమోదు చేశాయి. 1950వ, 60వ దశకాలను తెలుగు సినిమాకు స్వర్ణయుగంగా చాలామంది భావిస్తుంటారు. ఆర్థికంగా నష్టపోయే సినిమాల శాతం ఇప్పటికంటే చాలా తక్కువ. నిర్మాణ వ్యయం అదుపులో ఉండేది. సినిమా తారాగణం, కథాబలం, దర్శకుడు, బ్యానర్ను దృష్టిలో ఉంచుకుని ఏ మేరకు వసూలు చేయగలదో అంచనా వేసుకునేవారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ వ్యయం ఉండేది. అప్పట్లో సూపర్స్టార్స్గా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ల పారితోషికాలు కూడా నిర్మాణ వ్యయంలో ఐదు నుంచి పది శాతంలోపే ఉండేవని చెబుతారు. ఈ తరహా పొదుపు బడ్జె ట్లతోనే నాటి సినిమాలు అఖండ విజయాలు సాధించాయి. ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద కమర్షియల్ హిట్ తెలుగు సినిమా ఏది? అప్పటికీ, ఇప్పటికీ మార్కెట్నూ, డబ్బు విలు వనూ బేరీజు వేసుకొని చూస్తే ‘లవకుశ’ను మించిన పెద్ద హిట్ లేదట. ఆ సినిమా విడుదలైనప్పుడు తెలుగు రాష్ట్రాల జనాభా ఇప్పటి జనాభాలో సుమారు 40 శాతం లోపే. రవాణా సౌకర్యాలు లేవు. రహదారులు చాలా తక్కువ. దూరంగా ఉండే టౌన్లకే సినిమా హాళ్లు పరిమితం. అయినా కూడా అప్పటి జనాభాలో అత్యధిక శాతం ప్రజలు ఈ సినిమాను చూశారని అంచనాలున్నాయి. పావలా నేల టికెట్ దగ్గర్నుంచి రూపాయి సోఫా టికెట్ దాకా అన్ని తరగతుల చిల్లర శ్రీమహాలక్ష్మి కనకవర్షం కురిపించింది. ఎక్కువ శాతం సినిమాలు ఘనవిజయం సాధించడం ఈ స్వర్ణయుగం ప్రత్యేకత. 1963లో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 13 సినిమాలు విడుదలైతే అందులో 7 శతదినోత్సవాలు జరుపుకొన్నాయి. శతదినోత్సవం జరుపుకోవడం అంటే సినిమా సూపర్ హిట్ అయినట్టు! ఇదే ట్రెండ్ కొన్నేళ్ళు కొనసాగింది. ఎంత పెద్ద హీరోలైనా, ఎంత దిగ్గజ దర్శకులైనా, వారు ఎంత గొప్ప విజయాలను సాధించినా కూడా అడ్డగోలు పారి తోషికాలను డిమాండ్ చేయలేదు. ఫలితంగా నిర్మాణ వ్యయం అదుపులో ఉండి లాభాలు గడించిన కారణంగా తెలుగు సినిమా వేలాదిమందికి ఆశ్రయం కల్పించి ‘ఇండస్ట్రీగా’ గుర్తింపు పొందింది. ఇక్కడొక ఉదాహరణ చెప్పుకోవాలి. టాప్ ఫైవ్ తెలుగు సినిమాల పేర్లు చెప్పమని ఏ తెలుగువాణ్ణి అడిగినా అందులో కచ్చితంగా చెప్పే పేరు – ‘మాయాబజార్’. ఆ జనరంజక చిత్ర దర్శకుడు కేవీ రెడ్డి తెలుగు సినిమా స్వర్ణయుగ వైతాళికుల్లో ఒకరు. ఈ సినిమా కంటే ముందే అతిపెద్ద కమర్షియల్ హిట్గా ‘పాతాళభైరవి’ని ఆయన మలిచారు. దాదాపు ఒక డజన్ అపురూప దృశ్యకావ్యాలు ఆయన అందిం చారు. సినిమాలు తీయడం ఆపేసిన తర్వాత తన కొడుకును ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించవలసిన సందర్భం వచ్చింది. అందుకయ్యే ఖర్చు కోసం ఆయన ఇబ్బంది పడ్డారట. విషయం తెలుసుకున్న ఎన్టీ రామారావు తాను సర్దుబాటు చేయడానికి ముందుకొచ్చారు. ‘నీకు తెలుసు కదా రామారావ్, నేను ఎవరి దగ్గరా ఊరికే తీసుకోను’ అని కేవీ రెడ్డి తిరస్క రించారు. ‘ఊరికే వద్దు నాకో సినిమా తీసిపెట్టండ’ని ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చారు. అలా వచ్చింది ‘శ్రీకృష్ణ సత్య’. దర్శకుడిగా కేవీ రెడ్డి కమిట్మెంట్నూ, ఫోకస్ను చెప్ప డానికి, సినిమా బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండే ఆనాటి పారితోషికాలను గురించి చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణ. నటులైనా, దర్శకులైనా డబ్బులు సంపాదించకుండా ఇబ్బం దులు పడాలని కాదు. అయితే నిర్మాణ వ్యయం అదుపు తప్పని విధంగా ఏదో రకమైన బ్యాలెన్స్ను పాటించడం తప్పనిసరి.ఆ బ్యాలెన్స్ లేనప్పుడే ప్రేక్షకుల మీద అదనపు భారం మోప డమనే అవాంఛనీయ ఆలోచనలు ముందుకొస్తాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, కృష్ణ, శోభన్బాబు, చిరంజీవి వంటి నటులకూ, కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి, కేఎస్ ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, ‘విక్టరీ’ మధుసూదనరావు, కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి దర్శకులకు జనంలో ఎంతో ఇమేజ్ వుండేది. ఆ ఇమేజ్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు అప్పట్లో చేయలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా టికెట్ల వసూళ్ళపై వినోదపు పన్ను వసూలుకు శ్లాబ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. కలెక్షన్లపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తప్పుడు లెక్కలు చూపెడుతున్నారనే అనుమానంతో ఈ పద్ధతిని తీసు కొచ్చారు. ఈ పద్ధతి సినిమా వ్యాపారాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఓపెనింగ్స్ బాగా వుంటేనే సినిమా బతికి బట్టకట్టే పరిస్థితి వచ్చింది. ఓపెనింగ్స్ లేకపోయినా కథాబలంతో నోటి మాట ద్వారా పుంజుకునే అవకాశం ఉండే సినిమాలు దెబ్బతిన్నాయి. ఒకవేళ ‘శంకరాభరణం’ సినిమాయే శ్లాబ్ పద్ధతి తర్వాత విడుదలై ఉంటే ఏమయ్యేదో! శ్లాబ్ పద్ధతి చిరంజీవికి బాగా కలిసొచ్చింది. అప్పుడప్పుడే యువ ప్రేక్షకుల అభిమా నాన్ని చూరగొంటున్న చిరంజీవి బంపర్ ఓపెనింగ్స్తో దూసుకొని పోయాడు. ‘మెగాస్టార్’ అని పిలిచేంత వరకూ వెనక్కు చూడలేదు. ఇప్పటికీ అడపాదడపా చిరంజీవి నటిస్తూనే ఉన్నప్పటికీ గడిచిన పదిహేనేళ్ల కాలాన్ని పోస్ట్ చిరంజీవి దశగానే పరిగ ణించాలి. ఈ దశలోనే నిర్మాణ వ్యయం అదుపు తప్పింది. ఐదారు మంది దర్శకులు ఫిలిమ్ మేకింగ్లో కొత్త పుంతలు తొక్కారు. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, వినాయక్, కొరటాల శివ తదితరులకు నాగ్ అశ్విన్ లాంటి ప్రతిభావంతులు తోడవుతున్నారు. మార్కెట్ విస్తరణకు తెలుగు సినిమా నడుం కట్టింది. ఇంత వరకూ స్వాగతిద్దాం. కానీ నిర్మాణవ్యయం పట్టాలు తప్పింది. ఆర్థికంగా విజయాలు సాధిస్తున్న సినిమాలు ఏటా పది శాతం కూడా ఉండడం లేదు. ఇది కూడా ప్రీ–కోవిడ్ లెక్క. సినిమా రంగం సంక్షోభంలో కూరుకుపోవడాన్ని ఇప్పుడు చూస్తున్నాము. ఒక అరడజను మంది స్టార్ హీరోలున్నారు మనకు. మరో అరడజను మంది పెద్ద డైరెక్టర్లున్నారు. వీళ్ల సినిమాలన్నీ తెలుగు మార్కెట్ తట్టుకోలేనంత భారీ బడ్జెట్ సినిమాలే. ఈ బడ్జెట్లో యాభై శాతానికిపైగా హీరో, డైరెక్టర్ల రెమ్యునరేషనే! మిగతా బడ్జెట్లో ఒక పావలా ఇతరుల రెమ్యునరేషన్.ఒక పావలా నిర్మాణవ్యయం. షూటింగ్ జరిగే ప్రదేశంలో ఆరేడు క్యారవాన్ బస్సులుండటం పరిపాటి. హీరో హీరోయిన్లతో పాటు ఇతర ముఖ్యులం దరికీ ఈ సౌకర్యం ఉండాలి. ఇదొక స్టేటస్ సింబల్. షూటింగ్ విరామంలో స్టార్లు ఈ ఏసీ బస్సుల్లో విశ్రాంతి తీసుకుంటారు. షూటింగ్ జరిగే భవంతుల్లో ఏసీ గదులున్నాసరే ఈ క్యారవాన్లు ఉండి తీరాల్సిందే. పెద్ద నటీనటుల వెంట వారి బంధుమిత్ర పరివారం కూడా ఉంటుంది. వారందరికీ అతి«థి సేవలు తప్పనిసరి. ఈ పరివారానికి స్టార్ హోటళ్ల నుంచి క్యారియర్లు తెప్పించాలి. షూటింగ్ జరిగినన్నాళ్లూ ఈ తంతు జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా హీరో ఇమేజ్ను పెంచడం కోసం, దర్శకుని ప్రతిభను చాటడం కోసం తీసే కొన్ని సీన్లుంటాయి. ఇవి లేకున్నా కథనంలో ఏ లోపం ఉండదు. కానీ ఉంటాయి. ఈ దుబారా ఖర్చునంతా వసూలు చేసుకోవడానికి నిర్మాతలు రెండు పద్ధతులు అనుసరిస్తారు. అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలోనూ ఈ సినిమాయే విడుదలవడం మొద టిది. చిన్న సినిమాలు విడుదలవడానికి అవకాశం ఉండదు. ఇక రెండవది– జనం మీద అడ్డగోలు బాదుడు! మొదటి వారం రోజులపాటు అదనపు షోలు నడిపించి ప్రేక్షకుల దగ్గర ఐదింతల నుంచి పదింతల వరకు వసూలు చేయడం! ఒకప్పుడు థియేటర్ల బైట బ్లాక్టికెట్లమ్మే వ్యవస్థ, పోలీసు అరెస్టులుండేవి. కానీ, ఇప్పుడు అనధికారిక అడ్డగోలు టికెట్ రేట్ల పెంపు అంటే, ఏకంగా థియేటర్లలో బుకింగ్లోనే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నట్టు లెక్క! చూడదలుచుకున్న ప్రేక్షకులంతా వారం లోపే చూసెయ్యాలి. లేదంటే సదరు సినిమా ఎన్నాళ్లు ఆడు తుందో గ్యారంటీ లేదు. థియేటర్లన్నీ కొద్దిమంది గుత్తాధి పత్యంలో ఉన్నందువల్ల స్టార్ హీరోల సినిమాలకే వాటిని అంకితం చేస్తున్నారు. చిన్న సినిమాలు తీసినవారు ఆ సినిమాల విడుదల కోసం పడుతున్న బాధలు దేవుడెరుగు. స్టార్ పరివారాల క్యారవాన్ల కోసం, భోజనం క్యారియర్ల కోసం, సినిమా ప్రొడక్షన్ దుబారా కోసం, హీరోల భారీ పారి తోషికం కోసం సామాన్య ప్రజలు చందాలివ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మీద ఇప్పుడిప్పుడే చర్చ మొదలైంది. ఒక లాజికల్ ముగింపునకు చేరుకునేంత వరకు ఈ చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సినిమా వసూళ్లలో పారదర్శకత కోసం ప్రభుత్వ నియంత్రణలో ‘ఆన్లైన్ టికెటింగ్’ అనే అంశం ముందుకొచ్చింది. అట్లాగే ప్రేక్షకులపై అదనపు భారం పడకుండా టికెట్ ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదుపులోకి తెచ్చింది. పాత విధానాల ద్వారా లబ్ధి పొందుతున్నవారికి ఈ సంస్కరణలు సహజంగానే ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. పవన్ కల్యాణ్కు కూడా అందుకే కోపం వచ్చింది. ఒక సినిమా ఫంక్షన్లో ఏపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఆయనకు ఆ ప్రభుత్వంలోని మంత్రులు కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. అది వేరే కథ. స్టార్ అంటే నక్షత్రం. అది వెలుగునివ్వాలి. నక్షత్రకుడంటే వెంటపడేవారు, వేధించేవాడు. స్టార్స్ వెలుగులు వెదజల్లు తుంటే నవీన్ పొలిశెట్టి లాంటి నటులు పదుల సంఖ్యలో వస్తారు. ‘జాతిరత్నాలు, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, కేరాఫ్ కంచరపాలెం, పలాస, పెళ్లిచూపులు’ వంటి సినిమాలు ప్రవాహంలో వచ్చి పడి తెలుగు సినిమాను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాయి. ఒకవేళ స్టార్లు నక్షత్రకులుగా మారితే... ‘స్టార్స్’ను వెలిగించిన ప్రేక్షకులే నక్షత్రకులను వదిలించుకుంటారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అంతరిక్షంలో సినిమా షూటింగ్
మాస్కో: తొలిసారిగా భూకక్ష్యలో సినిమా షూటింగ్ జరగనుంది. ఇందుకోసం రష్యా నటి, సినిమా డైరెక్టర్ మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకున్నారు. కజఖ్స్తాన్లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ఎగిసిన సోయుజ్ అంతరిక్ష నౌక ద్వారా ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ఈ బృందంలో నటి యులియా పెరెసిల్డ్(37), దర్శకుడు క్లిమ్ షిపెంకో(38)తోపాటు వ్యోమగామి అంటోన్ ష్కాప్లెరోవ్ ఉన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన అంటోన్ ఈ ప్రయాణానికి నాయకత్వం వహించారు. ఛాలెంజ్ అనే పేరున్న సినిమాలో నటి యులియా సర్జన్గా నటిస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలోని ఒక సభ్యుడికి గుండెపోటు రావడంతో ఆమె అక్కడికి వెళ్లి చికిత్స అందించే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇప్పటికే ఐఎస్ఎస్లో ఉన్న నోవిట్స్కీ, పీటర్ డుబ్రోవ్ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నటించనున్నారు. నోవిట్స్కీ గుండెపోటుకు గురైన వ్యోమగామి పాత్ర పోషించనున్నారు. ఈనెల 17వ తేదీన భూమికి చేరుకుని, సినిమాలోని మిగతా సన్నివేశాలను షూట్ చేస్తారు. ఈ ప్రయాణం కోసం నాలుగు నెలల నుంచి కఠిన శిక్షణ పొందారు. ‘ఛాలెంజ్’ను రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ సాయంతో ప్రభుత్వ టీవీ ‘చానెల్ వన్’నిర్మిస్తోంది. సభ్యుల శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే చానెల్ వన్ విస్తృతంగా కవరేజీ అందించింది. ఈ మిషన్ రష్యా శక్తి, సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటి చెబుతుందని ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. -
చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలికిన హాలీవుడ్..!
అప్పుడప్పుడు మనం సినిమాల్లో అంతరిక్షం, వ్యోమగాములకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూస్తూ ఉంటాం. అయితే, అలాంటి చిత్రాల కోసం ప్రత్యేకంగా సెట్స్ డిజైన్ చేయడమో లేదా గ్రాఫిక్స్ రూపంలోనో వాటిని డైరెక్టర్లు చూపిస్తారు. ఆ చిత్రాలు కూడా నిజంగానే అంతరిక్షానికి వెళ్లి తీశారో ఏమో అన్న అనుభూతిని కలిగిస్తాయి. తాజాగా, అంతరిక్షం, వ్యోమగాములకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ కోసం రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లారు. షూటింగ్ కోసం ఆ సినిమా డైరెక్టర్, హీరోయిన్ ప్రత్యేక వ్యోమనౌకలో నేడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఐస్)కు బయల్దేరి వెళ్లారు. ‘ది ఛాలెంజ్’ అనే సినిమా షూటింగ్ కోసం ఆ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ నేడు అంతరిక్షానికి బయల్దేరారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్కు చెందిన సోయుజ్ ఎంఎస్19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్ ష్కాప్లెరోవ్తో కలిసి ఐఎస్ఎస్ వెళ్లారు. మన దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో కజకిస్థాన్లోని బైకోనుర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ స్పేస్క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. 12 రోజుల పాటు వీళ్లు స్పేస్ స్టేషన్లోనే ఉండనున్నారు. ఆ తర్వాత వీళ్లను మరో రష్యన్ కాస్మోనాట్ భూమి మీదికి తీసుకు వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం నాలుగు నెలల ప్రత్యేక శిక్షణ తీసుకుంది. అంతరిక్షంలో మూవీ షూటింగ్ను రష్యన్ మీడియాలో కొందరు తీవ్రంగా విమర్శించినా లెక్క చేయకుండా రష్యన్ స్పేస్ కార్పొరేషన్ రాస్కాస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ ఈ మిషన్లో కీలక పాత్ర పోషించారు. అక్కడి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయితే, అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశం రష్యానే కానుంది. గతేడాది ప్రముఖ హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కూడా స్పేస్లో షూటింగ్ చేయడం కోసం సిద్దమైన సంగతి తెలిసిందే. దానికోసం నాసా, స్పేస్-ఎక్స్ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే ఆ తర్వాత దానిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ మధ్య కాలంలో అంతరిక్ష పర్యటన అనేది చాలా ఒక బస్ జర్నీ లాగా మారింది. The #SoyuzMS19 spacecraft successfully reaches orbit 🚀 Cosmonaut @Anton_Astrey and spaceflight participants Yulia Peresild and Klim Shipenko are on their way to the International Space Station! The docking will take place in 3 hours - at 12:12 UTC. pic.twitter.com/viEeHHVovH — РОСКОСМОС (@roscosmos) October 5, 2021 -
కమర్షియల్ హంగులతో ‘డాక్టర్సాబ్’
ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్ పై శోభన్ హీరోగా డి.ఎస్.బి దర్శకత్వంలో ఎస్.పి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డాక్టర్ సాబ్’. డాక్టర్స్ ఎదురుకునే పరిస్థితుల నేపథ్యంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమ్మ పండు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకుంది. ఈ సందర్బంగా నిర్మాత ఎస్.పి వివరాలు తెలియచేస్తూ .. నా ఫ్రెండ్, చిత్ర దర్శకుడు డి.ఎస్.పి ఓ అద్భుతమైన కథను రెడీ చేశాడు. స్క్రిప్ట్ చాలా బాగా కుదిరింది. ఈ చిత్ర షూటింగ్ మొదటి షెడ్యూల్ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాం. మరో షెడ్యూల్ను ఈ నెల 25నుంచి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అతి త్వరలోనే మిగతా కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము . హీరో శోభన్ ఫైట్స్, డాన్స్ల విషయంలో స్పెషల్గా ట్రైనింగ్ తీసుకుని చాల కష్టపడి చేస్తున్నాడు. డాక్టర్ అనేవాడు దేవుడు అని చెప్పే సినిమానే ఇది. ఇప్పటికే మా సినిమా లోగోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా వినాయకుడిపై గణపతి లిరికల్ సాంగ్ను విడుదల చేశాం. ఆ సాంగ్ కూడా బాగా పాపులార్ అయింది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న డాక్టర్ సాబ్ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుంది అన్నారు. -
Pushpa: శ్రీవల్లిగా రష్మిక.. ఫస్ట్లుక్ అదుర్స్
-
‘రామ్ వర్సెస్ రావణ్’ షూటింగ్ షురూ
సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "రామ్ వర్సెస్ రావణ్". ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె శుక్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. షాన ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ ఏఎస్ జడ్సన్ "రామ్ వర్సెస్ రావణ్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రామ్ వర్సెస్ రావణ్" సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.శుక్రన్ మాట్లాడుతూ.. రామ్ వర్సెస్ రావణ్.. ఒక పల్లెటూరిలో జరిగే కథ. ఆ ఊరి మంచి కోసం ఇద్దరు యువకులు ఎలా పోరాటం చేశారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కథలో కలిసి ఉంటుంది. కథ మీద పూర్తి నమ్మకంతో సినిమా ప్రారంభించాం. కపటధారి లాంటి పెద్ద చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన నా మిత్రుడు రాజామతి ఈ కథ విని బాగా నచ్చి ముందు ఈ సినిమా కంప్లీట్ చేద్దామన్నారు. ఏంజెల్ సినిమాను మించిన విజయం రామ్ వర్సెస్ రావణ్ సాధిస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నాం. అన్నారు. ఈ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది అన్నారు హీరో సొలమన్ జడ్సన్. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రాజామతి, సంగీతం : వికాస్ బాడిశ, స్టంట్స్ : రామ్ లక్ష్మణ్, బి జె శ్రీధర్. -
గాడ్ ఫాదర్: రంగంలోకి దిగిన చిరంజీవి
Chiranjeevi Resumes Godfather Shoot In Ooty: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'గాడ్ ఫాదర్'. మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ ఇది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఊటీలో ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ పేర్కొంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో కుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. గాడ్ ఫాదర్: ఊటీలో షూటింగ్ చదవండి : 'మా' ఎన్నికలు : ప్యానెల్ సభ్యులను ప్రకటించనున్న మంచు విష్ణు 'లైగర్' టీంకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య -
స్పెయిన్ వెళ్లనున్న మహేశ్ బాబు
ఈ నెలాఖరున మహేశ్బాబు స్పెయిన్ వెళ్లనున్నారు. ‘సర్కారువారి పాట’ సినిమా చిత్రీకరణ కోసమే అక్కడికి వెళుతున్నారు. మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కీర్తీ సురేష్ కథానాయిక. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేశ్బాబు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా జరుగుతోంది. ఈ నెలాఖరున స్పెయిన్లో ఆరంభించే షెడ్యూల్లో టాకీతో పాటు రెండు పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. స్పెయిన్ షెడ్యూల్ నెల రోజుల పాటు జరుగుతుందని తెలిసింది. ఆ తర్వాత డిసెంబర్లో జరిపే షెడ్యూల్తో సినిమా మొత్తం పూర్తయిపోతుంది. జనవరి 13న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: ఆర్. మది, లైన్ ప్రొడ్యూసర్: రాజ్కుమార్. చదవండి : రమ్మకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్లో త్రిష, ఖుష్భూ.. -
కాకినాడలో అల్లు అర్జున్ సందడి..
సాక్షి,కాకినాడ: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శనివారం కాకినాడలో సందడి చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు వెళ్తూ కాకినాడ వచ్చిన ఆయనకు అభిమానులు భారీగా స్వాగతం పలికారు. ఆయన బస చేసిన హోటల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన రెండు రోజుల పాటు ఇక్కడ ఉంటారని సమాచారం. ఈ చిత్రం క్లైమాక్స్ సీన్లను కాకినాడ సీ పోర్టులో చిత్రీకరించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. చదవండి: హ్యాట్సాఫ్ టు సీయం జగన్ -
కొత్త సినిమా షురూ చేసిన మెగా అల్లుడు కల్యాణ్ దేవ్
‘విజేత’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కళ్యాణ్ దేవ్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఎం. కుమారస్వామి నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కథ కంచికి మనం ఇంటికి’ చిత్రనిర్మాత మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ‘‘ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్: దత్తి సురేష్ బాబు, నిర్మాణ నిర్వహణ: గౌతి హరినాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుభాష్ దేవబత్తిని, కెమెరా: వైఎస్ కృష్ణ. -
భూదాన్ పోచంపల్లిలో సాయి కుమార్ మూవీ షూటింగ్
విలక్షణ నటుడు సాయికుమార్ ప్రధాన పాత్రలో విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా షూటింగ్ మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పోచంపల్లి, రేవనపల్లి, ముక్తాపూర్ గ్రామాల్లో జరిగింది. అక్కడ సాయికుమార్పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సాయికుమార్ మగ్గం నేసే, రచ్చబండ వద్ద గ్రామస్తులతో మాట్లాడే సీన్స్తోపాటు ఆయన బైక్పై వెళ్తున్న పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు అనుప్రసాద్ మాట్లాడుతూ.. మగ్గం నేసే తండ్రి కుమారుడిని అమెరికాకు పంపించడానికి చేసిన అప్పులు, ఆ కుటుంబం పడే బాధలు కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. -
పాండిచ్చేరిలో సమంత సందడి
ప్రేమ కోసం పాండిచ్చేరి పయనమయ్యారు హీరోయిన్ సమంత. విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో తమిళంలో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమ నేపథ్యంలో సాగే ఈ సినిమా చివరి షెడ్యూల్ పాండిచ్చేరిలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో సమంత పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాదాపు 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలిసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ఇటీవలే మైథాలజీ ఫిల్మ్ ‘శాకుంతలం’ షూటింగ్ను సమంత పూర్తి చేసిన సంగతి తెలిసిందే. -
వెంకటాపురంలో ఆమిర్ ఖాన్ సందడి
కొత్తపల్లి/తూర్పు గోదావరి: బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ మండలంలోని కొమరగిరి శివారు వెంకటరాయపురంలో శనివారం సందడి చేశారు. అమీర్ఖాన్ నటిస్తున్న లాల్సింగ్ చద్దా చిత్ర షూటింగ్ వెంకటరాయపురంలో జరుగుతోంది. రాధికాచౌదరితో కలిసి అమీర్ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అద్వైక్చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్ఖాన్తో పాటు కరీనాకపూర్, తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. హీరో అమీర్ఖాన్ను చూసేందుకు ఆయన అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో కలిసి సెల్ఫీలు దిగారు. -
దర్శకుడి జర్నీ నేపథ్యంలో ‘ఘరానా మొగుడు’ షూటింగ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: యస్.యమ్. కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్. ఫిలిమ్స్ పతాకాలపై మోహన్ కృష్ణ, వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్, హీరో హీరోయిన్లుగా రాజుబాబు దర్శకత్వంలో యస్.యమ్.కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్.ఫిలిమ్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం ఘరానామొగుడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ మణికొండలోని శివాలయంలో పూజకార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినప్రముఖ దర్శకుడు సాగర్ గారు హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశం పైగౌరవ దర్శకత్వం వహించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు, జెమిని సురేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏ.ఎస్ రవికుమార్ గారు స్క్రిప్ట్ అందించారు. పూజా కార్యక్రమాల అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ..మోహన్ గారు చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా టైటిల్తో తనుసినిమా తీస్తున్నాడు. చిరంజీవి గారి ఘరానా మొగుడు ఎంత ఘనవిజయంసాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తను తీస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని అన్నారు. దర్శకుడు సాగర్ మాట్లాడుతూ... మోహన్ కృష్ణ నాకు మంచి మిత్రుడు తను డిఫరెంట్ సబ్జెక్ట్ను సెలక్ట్ తీసుకొని మూవీ తీస్తాడు. వాణి విశ్వనాథ్ నా చిత్రంలో నటించింది. ఇప్పుడు ఈ ఘరానా మొగుడు చిత్రంలో వాణి విశ్వనాథ్ కూతురు వర్శ విశ్వనాథ్ నటిస్తుంది. ఇది నాకు సొంత బ్యానర్ లాంటిదే. ఈ చిత్రం మోహన్కు, వర్శవిశ్వనాథ్ కు మంచి విజయం సాధించి వారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నారు. చిత్ర నిర్మాత, హీరో, మోహన్ కృష్ణ మాట్లాడుతూ .. ఇప్పటివరకు నేను బావ మరదలు, మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ సినిమాలు తీయడం జరిగింది .ఇది ప్రొడక్షన్ నెంబర్ 3లో చిరంజీవిగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ తో చిత్రం తీసుకున్నందుకుచాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో వాణి విశ్వనాథ్ గారి కూతురు విశ్వనాథ్ గారునటిస్తున్నారు. దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో నేను సినిమా తీయడానికిముందుకు వచ్చాను. మంచి సబ్జెక్టు తీసుకొని మంచి కంటెంట్ తో వస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు. చిత్ర దర్శకుడు రాజుబాబు మాట్లాడుతూ.. నాకు చిరంజీవి గారు అంటే ఎనలేని అభిమానం చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఈ ఘరానా మొగుడుసినిమా వచ్చినప్పుడు నేను సెవెంత్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ వ్రాస్తున్నాను. సినిమా చూసిన తర్వాత నాకు సినిమాపై మక్కువ ఏర్పడింది. ఆ తరువాత 1999 లో సినిమా ఇండస్ట్రీ కి వచ్చాను 2019 వరకు నేను పలు దర్శకుల దగ్గర పనిచేశాను. మొదటిసారి నేను మోహన్ కృష్ణ గారికి కథ చెప్పడంతో తను ఈ సినిమాను చేద్దామని చెప్పారు. ఇది నా మొదటి సినిమా. నేను చూసిన మొదటి సినిమా ఘరానా మొగుడు టైటిల్ కు నేను దర్శకత్వం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. -
షూటింగ్లో ప్రమాదం.. బెడ్పై ప్రకాశ్ రాజ్.. ఆసక్తికర ట్వీట్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ గాయపడిన సంగతి తెలిసిందే. ధనుష్ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన లొకేషన్లో ఫ్లోర్పై జారిపడ్డారు. దీంతో ప్రకాశ్రాజ్ చేతికి ఫ్రాక్చర్ అయింది. ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ ట్విటర్ ద్వారా తెలియజేస్తూ.. సర్జరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురువా రెడ్డి దగ్గరకు హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపారు. తాజాగా తన ఆరోగ్యంపై ప్రకాశ్ రాజ్ ట్వీటర్ ద్వారా స్పందించారు. సర్జరీ విజయవంతమయిందని చెబుతూ.. ‘డెవిల్ ఈజ్ బ్యాక్. సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది. నాపై ప్రేమ చూపించి ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. త్వరలో యాక్షన్లో దిగుతా’అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశాడు. అలాగే ఆసుపత్రి బెడ్ మీద నవ్వులు చిందిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. కాగా, త్వరలో జరగబోయే ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. The 👿 devil is back… successful surgery.. thank you dear friend Dr #guruvareddy and 🤗🤗🤗 thank you all for your love n prayers.. back in action soon 💪😊 pic.twitter.com/j2eBfemQPn — Prakash Raj (@prakashraaj) August 11, 2021 -
Amitabh Bachchan: అక్టోబరులో ఆ రహా హై!
అక్టోబరులో అమితాబ్ బచ్చన్ ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్)పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో హీరోయిన్గా దీపికా పదుకోన్, ఓ ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా షూటింగ్లో ఓ వారం రోజులు అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. మళ్లీ అక్టోబరులో ఆయన హైదరాబాద్ ఆ రహా హై (వస్తున్నారు). అక్టోబరులో ప్రారంభమయ్యే భారీ షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్ నెలరోజులకుపైనే పాల్గొంటారు. ప్రభాస్, అమితాబ్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్లోనే దీపికా కూడా జాయిన్ అవుతారు. అంతేకాదు.. ఈ ప్యాన్ ఇండియన్ మూవీలో సౌత్, నార్త్ అనే తేడా లేకుండా కొందరు ప్రముఖ హీరోలు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారట. ఆ హీరోలు ఎవరు? అనేది వేచి చూడాలి. -
‘డేజావు’కి గుమ్మడికాయ కొట్టారు
డేజావు చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. నటుడు అరుళ్నిధి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం డేజావు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు వెర్షన్లలో తీస్తున్నారు. ఈ చిత్రానికి పీజీ ముత్తయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అరవింద్ శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్లో నవీన్చంద్ర కథానాయకుడిగా నటిస్తున్నారు. దీనికి జపాన్ సంగీతాన్ని, పీజీ ముత్తయ్య ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ గురువారం పూర్తి చేసుకుందని చిత్ర వర్గాలు తెలిపాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
జంగిల్లో చాట్ షూట్.. ఆ మజానే వేరు!
అడవిలో షూటింగ్ చేయడం అంటే ఆషామాషీ కాదు. అది కూడా రాత్రిపూట షూటింగ్ అంటే చిన్న విషయం కాదు. అయినా పని మీద ప్రేమ ఉంటే ఏదైనా ఈజీయే. ఆ ప్రేమ ఉంది కాబట్టే అడవిలో షూటింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు రకుల్ ప్రీత్సింగ్. ఆమె నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘డాక్టర్ జి’ షూటింగ్ భోపాల్లో జరుగు తోంది. అక్కడి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు షాట్ గ్యాప్లో రకుల్ ‘చాట్’ ఆరగించారు. ‘‘జంగిల్లో షూటింగ్ చేస్తూ చాట్ తింటే ఆ మజానే వేరు’’ అని కూడా అంటున్నారు. లేడీ డైరెక్టర్ అనుభూతీ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ వైద్య విద్యార్థిని ఫాతిమా పాత్రలోనూ, డా. ఉదయ్ గుప్తా పాత్రలో ఆయుష్మాన్ కనిపిస్తారు. ఇది కాకుండా హిందీలో ‘ఎటాక్’, ‘థ్యాంక్ గాడ్’, ‘మేడే’ చిత్రాల్లో నటిస్తున్నారు రకుల్. తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, ఇంకా కమల్హాసన్ ‘ఇండియన్ 2’ కూడా చేస్తున్నారు.