సాక్షి,కాకినాడ: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శనివారం కాకినాడలో సందడి చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు వెళ్తూ కాకినాడ వచ్చిన ఆయనకు అభిమానులు భారీగా స్వాగతం పలికారు. ఆయన బస చేసిన హోటల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన రెండు రోజుల పాటు ఇక్కడ ఉంటారని సమాచారం. ఈ చిత్రం క్లైమాక్స్ సీన్లను కాకినాడ సీ పోర్టులో చిత్రీకరించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
చదవండి: హ్యాట్సాఫ్ టు సీయం జగన్
Comments
Please login to add a commentAdd a comment