Movie Shooting
-
‘మజాకా’ చిత్రం లైవ్ సాంగ్ షూటింగ్ ఎక్స్ పీరియన్స్ (ఫొటోలు)
-
కండరాల ఎలర్జీతో బాధపడుతున్న కుష్బూ
సీనియర్ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు కుష్బూ ప్రస్తుతం షూటింగులతో బిజీగా ఉన్నారు. అయితే ఆమె ఎడమ చేతి కండరాలు ఎలర్జీకి గురైంది. సాధారణంగా ఇలాంటి ఎనర్జీ తీవ్ర నొప్పికి గురి చేస్తుంది. నటి కుష్బూ ఇప్పుడు నొప్పితో బాధపడుతున్నారు. క్రీడాకారులు తీవ్ర ఎక్సర్సైజులు చేయడం కారణంగా ఇలాంటి కండరాల ఎలర్జీకి గురవుతుంటారు. ఇంతకుముందు చాలా బొద్దుగా ఉండే నటి కుష్బూ కూడా కసరత్తులు చేసి స్లిమ్గా తయారైన విషయం తెలిసిందే. లేకపోతే ఈమె అంత నొప్పితోనూ మంగళవారం కూడా షూటింగ్లో పాల్గొన్నారు. అదేవిధంగా మరో పక్క వైద్యులు ఆమె చేతికి ఫిజియోథెరపీ వైద్యం అందిస్తున్నారు. కాగా తన చేతికి కట్టుతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆమె ఫోటోలు చూసిన అభిమానులు కంగారు పడుతున్నారు. కుష్బూ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారు. -
కాంతారగడ
యశవంతపుర: హిట్ మూవీ, జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన కాంతారకు, అలాగే నటుడు రిషభ్ శెట్టి, దర్శక నిర్మాతలకు చిక్కొచ్చిపడింది. నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార–2 (చాప్టర్ 1) సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా గవిగుడ్డలో కాంతార–2 యూనిట్ సినిమా షూటింగ్ చేస్తోంది. అటవీ ప్రాంతంలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని స్థానిక నాయకులు కొందరు యసలూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పేలుళ్లు కూడా జరుపుతున్నారని, దీని వల్ల ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని ఆరోపించారు. ప్రశి్నస్తే షూటింగ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు చెప్పారు. కావాలంటే మరోచోటుకు వెళ్లి చిత్రీకరణ చేసుకోవాలని, ఇక్కడ మాత్రం వద్దని గ్రామస్తులు కూడా గళమెత్తారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే తాను కోర్టులకైనా వెళతామని చెప్పడం గమనార్హం. షూటింగ్ అనుమతులు ఇలా జిల్లా యసళూరు విభాగం శనివార సంత అనే చోట హేరూరు గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో జనవరి 3 నుంచి 15 వరకు తాత్కాలిక సెట్టింగ్ల నిర్మాణానికి, 15 నుంచి 25 వరకు షూటింగ్ చిత్రీకరణకు నియమాలతో అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాసన్ ఎసీఎఫ్ మధు, ఆర్ఎఫ్ఒ కృష్ణలు పరిశీలించా. గత 10 రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. అటవీ ప్రాంతంలోకి వందలాది మంది వస్తూ పోతూ ఉన్నారు. అనుమతులు తీసుకున్న ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతోందని కూడా ఆరోపణలు రావడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నిజమైతే రద్దు చేయాలి: మంత్రి ఖండ్రేఈ నేపథ్యంలో అక్కడ కాంతార సినిమా షూటింగ్ను రద్దు చేయాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె అధికారులను ఆదేశించారు. వన్యజీవులు, ప్రకృతికి హాని జరుగుతుంటే తక్షణం షూటింగ్ను బంద్ చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రకృతి పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి ఈశ్వరఖండ్రె లేఖ రాశారు. చిత్ర నిర్వాహకులు అడవిలో ఉవ్వెత్తున మంటలను వేసి షూటింగ్ చేయడం, పేలుళ్లు జరిపినట్లు తెలిసిందని మంత్రి ఖండ్రే లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల అక్కడ వన్యజీవులు, చెట్లుచేమలకు ముప్పు వస్తుందని పత్రికలలో వార్తలు వచ్చాయని, ఇదే నిజమైతే తక్షణం షూటింగ్ను రద్దు చేయాలని సూచించారు. ఈ పరిణామాలతో షూటింగ్ కొనసాగడం అనుమానంగా ఉంది. -
కార్తీ 'సత్యం సుందరం' HD మూవీ స్టిల్స్
-
‘రస్ట్’ కేసు కొట్టివేత
శాంటా ఫే: ‘రస్ట్’ సినిమా షూటింగ్ రిహార్సల్స్ సమయంలో 2021లో అలెక్ బాల్డ్విన్(61) చేతిలోని తుపాకీ పేలి సినిమాటోగ్రాఫర్ హలియానా హట్చిన్ ప్రాణాలు కోల్పోయిన ఘటన కేసు మూడేళ్లకు అనూహ్యంగా సుఖాంతమయింది. నటుడు అలెక్ బాల్డ్విన్పై ఉన్న ‘అసంకల్పిత హత్య’ ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగానే న్యూ మెక్సికో కోర్టు జడ్జి అకస్మాత్తుగా కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. కేసులో సాక్షులను అడ్డుకుంటూ పోలీసులు, లాయర్లు వ్యవహరించిన తీరు ఆధారంగానే తీర్పు ఇచ్చినట్లు జడ్జి మేరీ మార్లో సోమర్ తెలిపారు. కోర్టు హాల్లోనే ఉన్న బాల్డ్విన్ తీర్పు విని పట్టరాని ఆనందంతో ఏడ్చేశారు. మూడు దశాబ్దాలకు పైగా మంచి నటుడిగా పేరున్న బాల్డ్విన్ కెరీర్ 2021 నాటి ఘటనతో ప్రశ్నార్థకంలో పడింది. -
సైన్స్ ఫిక్షన్ తరహాలో ‘MERGE’
రాజు గుడిగుంట్ల నిర్మాణం లో ‘MERGE’ అనే ఓ కొత్త సినిమా ప్రారంభం అయింది. లేడీ లయన్ క్రియేషన్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 03గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విక్రమ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో జబర్దస్త్ రాము, అంబటి శ్రీను, శక్తి చైతన్య ,పెరికల మాధురి, హరి తేజ, చంటి, దిలీప్, బాలరాజు, తదితరులు తారాగణం నటించనున్నారు. నేడు(జులై 10) హైదరాబాద్ లోని శ్రీ భద్రకాళి పీఠం లో డాక్టర్ సింధు మాతాజీ గారి ఆశీస్సులతో షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాత రాజు గుడిగుంట్ల గారు మీడియా తో మాట్లాడుతూ ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ నెల 15 వ తేదీన విజయవాడలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నూతన దర్శకుడు విక్రమ్ ప్రసాద్ ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ తరహా లో రొటీన్ కథకు భిన్నంగా ఉండబోతుంది అని తెలిపారు. -
తన సినిమా షూటింగ్స్ పై డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
షూటింగ్లో గాయపడ్డ స్టార్ హీరోయిన్
సినిమా షూటింగ్లో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గాయపడ్డారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ షూటింగ్ సమయంలో ఆమెకు స్వల్ప గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంకనే సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన గొంతు మీద చిన్న స్క్రాచ్ అయిన ఫోటోని ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ..‘వృత్తి జీవితంలో ప్రమాదాలు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ‘స్టంట్’ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. (చదవండి: అనుష్కకు అరుదైన వ్యాధి.. పగలబడి నవ్వేస్తారట!)‘ది బ్లఫ్’లో ప్రియాంక చోప్రా యాక్షన్ రోల్ ప్లే చేస్తోంది. ఆమెకు సంబంధించిన కొన్ని యాక్షన్స్ సీన్స్ తెరకెక్కించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. షూటింగ్లో ప్రమాదాలు జరగడం ప్రియాంకకు కొత్తేమి కాదు. గతంలోనూ పలు సినిమాల షూటింగ్ సమయంలో ఆమె ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు పెదవి చివర చిన్న గాయంతో పాటు మెడపై గాటు పడింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ‘జాగ్రత్త’ మేడం అంటూ అమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.(చదవండి: అనారోగ్యంతో మంచానపడ్డ అభిమాని.. పిల్లల బాధ్యత భుజానెత్తుకున్న మహేశ్)సినిమాల విషయాలకొస్తే.. ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ప్రియాంకా చోప్రా.. 2018లో అమెరికా సింగర్ నిక్ జోనాస్ను పెళ్లి చేసుకొని తన మకాంను హాలీవుడ్కి మార్చేసింది. ప్రస్తుతం హాలీవుడ్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. చివరగా సిటాడెల్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. -
వెహికల్స్ బంద్.. సినిమా షూటింగ్స్కి అంతరాయం
టాలీవుడ్లో మరో సమ్మె సైరన్ మోగింది. తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినిమా అండ్ టీవీ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ బంద్కి పిలుపునిచ్చాయి. దీంతో పలు సినిమాల షూటింగ్స్కి అంతరాయం ఏర్పడింది. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఈ బంద్ని కొనసాగిస్తామని అసోసియేషన్ ప్రెసిడెంట్ హనీఫ్ చెప్పారు. ‘దాదాపు 900 వెహికల్స్ మా అసోసియేషన్లో ఉన్నాయి. 1200 మంది ఓనర్లు సభ్యులుగా ఉన్నారు. గతంలో నిర్మాతల మండలికి మా సమస్యలను విన్నవించినా.. పట్టించుకోలేదు. ఈ రోజు లేదా రేపు మరోసారి నిర్మాతల మండలితో చర్చలు జరుపుతాం. వెహికల్ రెంట్ పెంచడంతో పాటు మా సమస్యలను తీర్చేవరకు ఈ బంద్ కొనసాగిస్తాం’అని హనీఫ్ అన్నారు. తమ సమస్యలు వెంటనే పర్కిరించాలని అని చైర్మన్ విజయ్ కుమార్ డిమాండ్ అన్నారు. -
కొత్త కబురు చెప్పిన సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ కొత్త కబురు చెపారు. తన కెరీర్లోని 40వ సినిమాను ప్రకటించారు. ‘8 తోట్టాకళ్’ ఫేమ్ శ్రీ గణేశ్ దర్శకత్వం వహించనున్న ఈ ద్విభాషా (తెలుగు– తమిళం) చిత్రాన్ని ‘మావీరన్’ ఫేమ్ అరుణ్ విశ్వ నిర్మించనున్నారు. శనివారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘చాలా స్క్రిప్ట్స్ విన్న తర్వాత శ్రీగణేశ్ చెప్పిన ఈ సినిమా కథ నచ్చడంతో ఓకే చెపాను. అరుణ్ విశ్వలాంటి మంచి నిర్మాతతో కలిసి సినిమా చేయడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాను అందిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ మొదలుపెట్టినప్పుడు యూత్తో పాటు పరిణితి గల నటుడు కావాలనుకున్నాను. అందుకే సిద్ధార్థ్ కరెక్ట్ అనుకున్నాను. ఆయన కొన్ని సూచనలు పంచుకున్నారు’’ అన్నారు శ్రీ గణేశ్. ‘‘దర్శకుడు కథ చెప్పినప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా, భాషలకు అతీతంగా ఆకట్టుకునే చిత్రం అవుతుందని నేను బలంగా నమ్మాను. జూన్లో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు అరుణ్ విశ్వ. -
బేబీ బంప్తోనే సినిమా షూటింగ్లో పాల్గొన్న టాప్ హీరోయిన్
బాలీవుడ్లో బెస్ట్ కపుల్గా పేరున్న దీపికా పదుకొణె- రణ్వీర్ తమ అభిమానులకు కొద్దిరోజు క్రితమే గుడ్న్యూస్ చెప్పారు. తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్లో డెలివరీ డేట్ కూడా ఇచ్చినట్లు దీపిక ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఆమె చేతిలో ఇప్పటికే పలు సినిమాలు ఉన్నాయి. నెలలు గడుస్తున్న కొద్ది షూటింగ్స్కు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. దీంతో నిర్మాతలకు ఎలాంటి నష్టం వాటిల్ల కూడదని దీపికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. తాజాగా సోషల్ మీడియాలో దీపికా పదుకొణె షూటింగ్ స్సాట్లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న 'సింగం ఎగైన్' సినిమా సెట్స్లో దీపికా కనిపించింది. ఆ ఫోటోలలో బేబీ బంప్తో దీపికా కనిపిస్తుంది. ఈ చిత్రంలో శక్తి శెట్టిగా దీపికా కనిపించనుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. పోలీస్ యూనిఫాం ధరించి 'కూల్' గ్లాస్తో అదిరిపోయే లుక్లో దీపికా కనిపిస్తుంది. ఫిబ్రవరిలో ఆమె గర్భం దాల్చినట్లు ప్రకటించిన తర్వాతా తిరిగి షూటింగ్లో పాల్గొనడం ఇదే తొలిసారి. గర్భంతో ఉన్నా కూడా దీపికా షూటింగ్లో పాల్గొనడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కానీ కొందరు మాత్రం ఫోటోలో బేబీ బంప్ పూర్తిగా కనిపించకపోవడం లేదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి చాలా బిగుతుగా ఉన్న డ్రెస్ను ఆమె ధరించడంతో బేబీ బంప్ పెద్దగా కనిపించలేదు. సినిమా కోసం దీపికా జాగ్రత్త పడుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. -
బ్యాక్ టు షూట్
దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి నటిగా మేకప్ వేసుకున్నారు ప్రియాంకా చోప్రా. ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా, ప్రియాంకా చోప్రా, జాక్ క్వాయిడ్, స్టీఫెన్ రూట్ ప్రధాన పాత్రధారులుగా హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో మొదలైంది. ‘‘..అండ్ వుయ్ ఆర్ బ్యాక్..’’ అంటూ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమా స్క్రిప్ట్ను తన ఇన్స్టా స్టేటస్లో షేర్ చేశారు ప్రియాంకా చోప్రా. దీంతో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ షూట్లో ఆమె పాల్గొంటున్నారని స్పష్టమైంది. ఇక రెండు నెలల క్రితం తన వ్యక్తిగత పనుల కోసం ప్రియాంకా చోప్రా ఇండియా వచ్చారు. సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం వేడుకలో చురుగ్గా పాల్గొన్నారు ప్రియాంక. ఈ వేడుకతో పాటు మరికొన్ని పనులను చక్కబెట్టుకుని ప్రియాంకా చోప్రా మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు. -
తనకు అంత పిచ్చి ఉంటుందనుకోలేదు
‘‘డైరెక్టర్ సుకుమార్గారి టీమ్లో బుచ్చిబాబు బెస్ట్. తనకు సినిమా అంటే పిచ్చి. ‘రంగస్థలం’ కథని సుకుమార్గారు నాకు నలభై నిమిషాలు చె΄్పారు. ఆ తర్వాత ప్రతి రోజూ నాకు రెండేసి గంటలు నెరేష¯Œ ఇచ్చింది మాత్రం బుచ్చిబాబునే. తనకు సినిమా అంటే అంత పిచ్చి ఉంటుందనుకోలేదు’’ అని హీరో రామ్చరణ్ అన్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బుధవారం ్రపారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బోనీ కపూర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో చిరంజీవి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ను యూనిట్కి అందించారు. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ ‘‘నేను, జాన్వీ కలిసి ‘జగదేకవీరుడు–అతిలోక సుందరి’ లాంటి మూవీ చేయాలని చాలామంది అనుకున్నారు. మా కాంబినేషన్ ‘ఆర్సీ 16’తో నిజం కావడం హ్యాపీ’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో రామ్చరణ్గారు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటాను’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘బుచ్చిబాబు ఏదైనా పెద్దగా ఆలోచిస్తాడు. తన కథపై తనకు ఉన్న నమ్మకం అలా ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘‘ఈ సినిమాకి ఇప్పటికే మూడు ట్యూ¯Œ ్స పూర్తి చేశాం’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ‘‘నేను ఎంతగానో అభిమానించే ప్రముఖులందరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం’’ అన్నారు జాన్వీ కపూర్. ‘‘బుచ్చిబాబు ఈ సినిమాతో తప్పకుండా మరో హిట్ కొడతాడు’’ అన్నారు నిర్మాత నవీన్ ఎర్నేని. ఈ ్రపారంభోత్సవంలో నిర్మాతలు వై. రవిశంకర్, ‘దిల్’ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, నాగవంశీ, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పకుడు: సుకుమార్, కెమెరా: రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: వి.వై. ప్రవీణ్ కుమార్. -
AP Cinema : మినీ స్టూడియోతో హార్సిలీహిల్స్కు మహర్దశ
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. హార్సిలీహిల్స్పై మినీ స్టూడియోను నిర్మిస్తే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. దీని ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలతో హార్సిలీహిల్స్ భవిష్యత్లో సినిమా చిత్రీకరణలకు ప్రముఖ కేంద్రంగా మారనుంది. తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధితోపాటు ఆర్థికంగానూ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ఎత్తయిన కొండల సొగసులు, ప్రకృతి అందాలు, దట్టమైన అటవీప్రాంతం, చుట్టూ కొండలతో హార్సిలీíహిల్స్ ఇప్పటికే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వందకుపైగా చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. 1966లో సూపర్స్టార్ కృష్ణ నటించిన కన్నెమనసులు సినిమాతో మొదలై ఎన్నో కన్నడ, తెలుగు, తమిళ సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగింది. అయితే ఏ ప్రభుత్వం ఇక్కడ షూటింగ్ కోసం చర్యలు చేపట్టలేదు. దీంతో 1996లో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా తర్వాత పెద్ద నటులెవరూ హార్సిలీహిల్స్ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ దర్శకనిర్మాత మహీ వీ రాఘవ కొండపై మినీ స్టూడియో, అమ్యూజ్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో హార్సిలీహిల్స్కు మంచి రోజులు రానున్నాయని అంటున్నారు. మళ్లీ ఈ మధ్యే సందడి.. ఈ మధ్యకాలంలో హార్సిలీహిల్స్ పరిసర ప్రాంతాల్లో సినిమాలు, వెబ్ సిరీస్ చిత్రీకరణల సందడి నెలకొంది. మహీ వీ రాఘవ ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ చేస్తే నిర్మాణ వ్యయం భారీగా తగ్గించుకునే అవకాశం ఉందని గుర్తించి ఇటువైపు అడుగులు వేశారు. ఆయన దర్శకత్వం వహించిన పాఠశాల, యాత్ర–2 చిత్రీకరణలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. సైతాన్ వెబ్ సిరీస్ను సైతం ఇక్కడే చేశారు. ఇంకా విడుదలకాని ‘సిద్ధా లోకం ఎలా ఉంది’ కూడా ఇక్కడే నిర్మాణం జరుపుకుంది. మహీ వీ రాఘవే కాకుండా ఇంకా పలువురు సినిమాలు, వెబ్ సిరీస్లను చిత్రీకరిస్తున్నారు. మినీ స్టూడియోతో ఎన్నో సౌకర్యాలు కొండపై మినీ స్టుడియో నిర్మాణం కోసం రెండెకరాల భూమిని కేటాయించాలని మహీ వీ రాఘన ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మినీ స్టూడియోతో ఎన్నో రకాలుగా స్థానికులు లబ్ధి పొందడమే కాకుండా, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా ఆర్థికంగానూ ప్రయోజనాలు ఉంటాయి. స్టూడియో ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్కోసం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. లైట్స్, చిన్న కెమెరాలు, జనరేటర్లు, వాహనాలు, వెబ్ సిరీస్ కోసం అవసరమైనవి షూటింగ్ కోసం వెంట తీసుకురావాల్సిన పరిస్థితి ఉండదు. షూటింగ్కు వచ్చేవారికి విడిది సౌకర్యాలు, భోజనం, షూటింగ్లో పనులు.. ఇలా ప్రతి విషయంలోనూ స్థానికులకు ఆర్థికంగా ప్రయోజనం లభిస్తుంది. పెద్ద సినిమాలు లేకున్నా ఏడాదికి రెండు వెబ్ సిరీస్ల చిత్రీకరణ జరిగినా రూ.5 నుంచి రూ.10 కోట్లు ఖర్చవుతుంది. కాబట్టి స్థానికులకు వివిధ రకాలుగా ఆదాయం లభిస్తుంది. స్థానికులకు ఆదాయం, తక్కువ ఖర్చుతో చిత్రీకరణే లక్ష్యం.. హార్సిలీహిల్స్పై మినీ స్టూడియో ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని షూటింగ్లకు కేంద్రంగా చేయాలన్నదే లక్ష్యం. ఇక్కడి ప్రదేశాలను వెబ్సైట్లో పెట్టి సినిమా చిత్రీకరణలకు అనువనే విషయాన్ని తెలియజేస్తాం. మదనపల్లె, ఆరోగ్యవరం, పరిసర ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ప్రచారం చేస్తాం. పురాతన కట్టడాలు, భవనాలు, పల్లెలు హార్సిలీహిల్స్ పరిసరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సినిమాలు, వెబ్ సిరీస్లు తక్కువ ఖర్చుతో చిత్రీకరణ చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తాం. అనుభవజ్ఞులైన వారిని నియమించి సహకారం అందిస్తాం. స్థానికులకు ఆదాయ మార్గాలు పెంచేలా చూస్తాం. –మహీ వీ రాఘవ, ప్రముఖ దర్శకనిర్మాత -
నాపరాయి గనుల్లో రజనీకాంత్ షూటింగ్
యర్రగుంట్ల : మండలంలోని నిడుజివ్వి గ్రామ పరిధిలోని నాపరాయి గనులలో సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెట్టయన్ (వేటగాడు) సినిమా షూటింగ్ మంగళవారం జరిగింది. లైకా ప్రొడక్షన్ సారథ్యంలో రజనీకాంత్ 170వ సినిమాను దర్శకుడు టీజే జ్ఙానవేల్ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ విలన్తో మాట్లాడి ఫైట్ చేయడం చిత్రీకరించారు. అభిమానుల తాకిడి అధికంగా ఉండటంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, రజనీకాంత్కు సమీప సిమెంట్ పరిశ్రమ గెస్ట్హౌస్లో బస ఏర్పాటు చేశారు. -
‘పురుషోత్తముడు’ మారిన రాజ్ తరుణ్..డబ్బింగ్ పనుల్లో బిజీ
రాజ్ తరుణ్ హీరో గా రామ్ భీమన దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పురుషోత్తముడు'. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. రాజమండ్రి లో వేసిన భారి సెట్ లో టాకీ పూర్తి చేసుకున్న సంధర్భంగా 22న టైటిల్ రివీల్ పోస్టర్ ని విడుదల చేశారు. అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ట రోజు ఆదే సమయానికి టైటిల్ రివీల్ చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు రామ్ భీమన తెలిపారు. నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో భారీ తారాగణం తో పాటు సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరచిన పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని, చిత్రం గొప్ప విజయం సాధించబోతుందని తెలిపారు. తన కెరీర్ లో పురుషోత్తముడు గొప్ప చిత్రం అవుతుందని కెమెరామెన్ పి.జి.విందా పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. -
కల్లర్ మ్యాజిక్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న మన హీరోలు
కథ బొగ్గు గనుల్లో జరుగుతోంది.. అక్కడ పనిచేసేవాళ్లు ఎలా కనిపిస్తారు? ఫుల్ డార్క్గా.. కథ బంగారు గనుల్లో జరుగుతోంది.. కానీ తవ్వేవాళ్లు బంగారంలా మెరిసిపోరు.. కమలిపోయిన చర్మంతో ఉంటారు. ఇక మత్స్యకారులో... వాళ్లూ అంతే.. స్కిన్ ట్యాన్ అయిపోతుంది. ఇప్పుడు కొందరు హీరోలు ఇలా ఫుల్ బ్లాక్గా, ట్యాన్ అయిన స్కిన్తో కనిపిస్తున్నారు. పాత్రలకు తగ్గట్టు బ్లాక్ మేకప్ వేసుకుని, సిల్వర్ స్క్రీన్పై మేజిక్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 31లో కొత్తగా... హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్ 31’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ఎలా ఉంటుందో? అనే ఆసక్తి ఇటు చిత్ర వర్గాల్లో అటు సినిమా లవర్స్లో నెలకొంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్లో ఎన్టీఆర్ పూర్తి నలుపు రంగు మేకప్లో కనిపించారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్’ల తరహాలో ఎన్టీఆర్ 31 బ్లాక్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని టాక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్ 31’ షూటింగ్ ఈ ఏడాది లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందనుంది. ‘‘ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేయని పాత్ర, కథతో ‘ఎన్టీఆర్ 31’ సినిమా చేయబోతున్నాను. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్ కనిపిస్తారు’’ అంటూ ప్రశాంత్ నీల్ ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. గోల్డ్ ఫీల్డ్స్లో తంగలాన్ పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు విక్రమ్. దర్శకుడి విజన్ 100 శాతం అయితే విక్రమ్ 200 శాతం న్యాయం చేస్తారనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన విక్రమ్ ‘తంగలాన్’ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ డ్రామాగా రూపొందింది. బ్రిటిష్ పరిపాలన కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ ఆదివాసి తెగ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట. ఇందులో విక్రమ్ ఆ తెగ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్ ఫస్ట్ లుక్ పూర్తి స్థాయి నలుపులో ఎంతో వైవిధ్యంగా ఉంది. మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాని తొలుత సంక్రాంతికి, ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్లో రిలీజ్ చేయ నున్నట్లు ఇటీవల పేర్కొన్నారు. భ్రమయుగంలో... దాదాపు 50 ఏళ్ల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు మమ్ముట్టి. అయితే ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్త పాత్రని ‘భ్రమయుగం’ సినిమాలో పోషిస్తున్నారాయన. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘భ్రమయుగం’. హారర్ థ్రిల్లర్ జోనర్లో కేరళలోని కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందుతోంది. అక్కడి చీకటి యుగాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర పూర్తి నలుపు రంగులో ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘భ్రమయుగం’ మలయాళ టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన టీజర్లో సరికొత్త లుక్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు మమ్ముట్టి. రామచంద్ర చక్రవర్తి నిర్మిస్తున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. గొర్రెల కాపరి పృథ్వీరాజ్ సుకుమారన్ హ్యాండ్సమ్గా ఉంటారు. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తొలిసారి ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమా కోసం పూర్తి స్థాయిలో నల్లటి మనిషిగా మారిపోయారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బ్లెస్సీ. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి సౌదీ అరేబియాకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. గొర్రెల కాపరి నజీబ్ పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్. గుబురు గడ్డం,పొడవైన జుట్టుతో నలుపు రంగులో ఉన్న పృథ్వీరాజ్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ పాత్ర కోసం ఆయన బరువు తగ్గారు. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా మాదేనంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది. ∙హ్యాండ్సమ్గా, పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగచైతన్య ‘తండేల్’ సినిమా కోసం పక్కా మాస్ అవతారంలోకి మారిపోయారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం మత్య్సకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. 2018లో జరిగిన వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్’ అంటూ ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెబుతారు. నిజమే.. ఆయన కటౌట్ చూస్తే అలానే అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారాయన. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదలై హిట్గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బ్యాక్డ్రాప్ అంతా బ్లాక్గా ఉంటుంది. బొగ్గు గనుల్లో మెకానిక్ దేవ పాత్రలో ప్రభాస్ లుక్ కూడా బ్లాక్ షేడ్లో ఉంటుంది. రెండో భాగంలోనూ ప్రభాస్ ట్యాన్ లుక్లో కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ప్రయోగాలు చేసే హీరోల్లో సూర్య ఒకరు. కమల్హాసన్ గత బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ (2022)లో రోలెక్స్ పాత్రలో ట్యాన్ లుక్లో కనిపించారు సూర్య. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్లో ఈ పాత్ర వస్తుంది. రెండో భాగంలోనూ ఉంటుంది. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. అలాగే విడుదలకు సిద్ధమవుతున్న ‘కంగువా’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హీరో సూర్య ట్యాన్ లుక్లో కనిపిస్తారు. -
బీచ్రోడ్డులో రాజ్ తరుణ్ సందడి
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు మంగమారిపేట, తొట్లకొండ బీచ్ వద్ద శనివారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. నటుడు రాజ్ తరుణ్, నటి మనీషా కందూర్ నటిస్తున్న భలే ఉన్నాడే సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. రవికిరణ్ ఆర్ట్స్ పతాకంపై ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కుతోందని, హీరో రాజ్ తరుణ్ న్యూలుక్లో కనిపించబోతున్నారని దర్శకుడు జె. శివసాయి వర్ధన్ తెలిపారు. ఈ సినిమాలో సింగీతం శ్రీనివాస్ ప్రముఖ పాత్రలో నటించగా, అమ్ము అభి (నారప్ప ఫేమ్), కృష్ణ భగవాన్, హైపర్ ఆది ఇతర పాత్రలో నటిస్తున్నారన్నారు. సంగీతం శేఖర్ చంద్ర అందిస్తున్నారు. మరో 8 రోజుల పాటు బీచ్రోడ్డు ప్రాంతాల్లో చిత్రీకరణ ఉంటుందన్నారు. -
షూటింగ్లో గొడవ.. తెలుగు యంగ్ హీరో కారుని అడ్డుకున్న కూలీలు
తెలుగు యంగ్ హీరో శ్రీవిష్ణుకు కొందరు కూలీలు షాకిచ్చారు. కొత్త సినిమా షూటింగ్లో భాగంగా అనుకోని సంఘటన ఎదురైంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని బనగానెపల్లె మండలం యాగంటి క్షేత్రంలో సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనేందుకు కోసం కొందరు కూలీలని చిత్రబృందం తీసుకొచ్చింది. అయితే పూర్తయిన తర్వాత వాళ్లకు వేతనం ఇచ్చే విషయం కాస్త ఆలస్యమైంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) ఈ క్రమంలోనే తమకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని దాదాపు 400 మంది కూలీలు.. షూటింగ్ లొకేషన్లో ఆందోళన చేశారు. అటుగా వెళ్తున్న హీరో కారుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీన్లోకి ఎంటరైన పోలీసులు.. కూలీలకు సర్దిచెప్పారు. హీరోకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అతడు కారుని పోనిచ్చారు. ఆ తర్వాత వివాదం కూడా సద్దుమణిగింది. గతేడాది 'సామజవరగమన' సినిమాతో హిట్ కొట్టిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగమ్మాయి రీతూవర్మ కూడా గతేడాది 'మార్క్ ఆంటోని', 'ధృవ నక్షత్రం' లాంటి మూవీస్తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న మూవీకే తాజాగా సమస్య ఎదురైంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) -
2024 లో దూసుకొస్తున్న పాన్ ఇండియా హీరోలు
-
తెలుగు సినిమాలు చేయడం అలవాటుగా మారింది: సుహాసిని
నా తొలి సినిమా విడుదలై నేటికి సరిగ్గా 43 ఏళ్ళు. ఇప్పటి వరకు కెరీర్లో ఎన్నో చిత్రాలు చేశాను. ఎన్నో జయపజయాలు చూశాను. అవన్నీ గతంలోనే వదిలేసి ఇప్పుడే తొలి చేస్తున్నా అనే అనుభూతితో ‘మహతి’ చేశాను. మహతి కథ, నా పాత్ర చాలా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. టైటిల్ కి తగట్టు మహిళా ప్రాధాన్యత గల చక్కని అంశాలు ఉన్నాయి’ అని సీనియర్ నటి సుహాసిని మణిరత్నం అన్నారు. సందీప్ మాధవ్ కథానాయకుడిగా శివ ప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో శ్రీ పద్మిని సినిమాస్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న చిత్రం 'మాహతి'. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ..తెలుగులో వరుసగా సినిమాలు చేయడం ఒక అలవాటుగా మారింది. ‘మహతి’లాంటి మంచి చిత్రంతో కెరీర్ పరంగా 44వ ఏడాదిని ప్రారంభిస్తున్నాను. ఒక క్రైమ్ చేయడం కంటే ఆ క్రైమ్ ని చూస్తూ ఏం చేయకుండా ఊరుకోవడం ఇంకా పెద్ద క్రైమ్. అదే ఈ సినిమా ప్రధానాంశం. ఇందులో ఉండే పాత్రలని అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు. చాలా మంచి టీం కలసి పని చేస్తున్నాం’ అని అన్నారు. డైరెక్టర్ శివ ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ కథని తీర్చిదిద్దారు.సుహాసిని గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అనందంగా ఉంది’అని హీరో సందీప్ మాధవ్ అన్నారు. ‘మహతి కథ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’అని నటి దీప్సిక అన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
ప్రమాదం వల్ల అప్పుడు ఆపేశారు.. ఇప్పుడు మళ్లీ షురూ!
తమిళ స్టార్ హీరో అజిత్ కొత్త సినిమా 'విడాముయర్చి'. మగిళ్ తిరమేని దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చాలాకాలం తరువాత త్రిష, అజిత్ మూవీలో నటిస్తుండటం విశేషం. ప్రియా భవానీ శంకర్, సంజయ్ దత్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) తొలి షెడ్యూల్ అజర్ బైజాన్ దేశంలో చేశారు. అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్ ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో మధ్యలో నిలిపేశారు. చిన్న గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ ఆ దేశానికి చెక్కేశారు. తాజాగా హీరో అజిత్.. చైన్నె విమానాశ్రయంలో అభిమానితో దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అజర్ బైజాన్లో మిగతా షెడ్యూల్కి సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తి చేసుకుని.. కొన్ని రోజుల తర్వాత మూవీ యూనిట్ చెన్నైకి తిరిగొస్తారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) -
ఎక్స్ట్రార్డినరీ సాంగ్
ఎక్స్ట్రార్డినరీ లెవల్లో డ్యాన్స్ చేశారు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా: ఆర్డినరీ మ్యాన్’. రాజశేఖర్ ఓ కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. ఓ భారీ సెట్లో 300 మందికి పైగా ఫారిన్ డ్యాన్సర్స్తో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో నితిన్, శ్రీలీలపై ఓ మాస్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవు తుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని యూనిట్ పేర్కొంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యా మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జైరాజ్. -
హీరోతో కలిసి ఎంగిలి ఐస్క్రీమ్ తినమన్నారు.. ఇబ్బంది పడ్డా: సుహాసిని
ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోయిన్గా కొనసాగారు సుహాసిని. చిరంజీవి, బాలకృష్ణ, వెంటకేశ్ లాంటి బడా హీరోలందరితోనూ నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో తల్లి పాత్రతో పాటు సహాయక నటిగా చేస్తోంది. అయితే హీరోయిన్గా చేసినప్పుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల గురించి తాజాగా ఓ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడారు. ‘గతంలో హీరోయిన్గా చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే..సున్నితంగా తిరస్కరించేదాన్ని. ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉంది. అది చేయాలని డైరెక్టర్ చెబితే.. నేను నో చెప్పాను. పరాయి వ్యక్తి ఒడిలో కూర్చోవడం తప్పు..కాబట్టి నేను ఆ సీన్ చేయనని గట్టిగా వాధించాను. (చదవండి: స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్!) అదే సినిమాలో హీరో కలిసి ఐస్క్రీమ్ తినే సీన్ ఉంది. హీరో తిన్న ఐస్క్రీమ్నే తినాలని నాకు చెప్పారు. అది నాకు నచ్చలేదు. ‘వేరే వాళ్లు ఎంగిలి చేసింది నేను తినడం ఏంటి? ఐస్క్రీమ్ మార్చండి’అని ఫైర్ అయ్యాను. దీంతో కొరియోగ్రాఫర్ షాకయ్యారు. నేను చెప్పిన విధంగా చేయలని నాపైకి సీరియస్ అయ్యాడు. అయినా కూడా నేను అంగీకరించలేదు. ఐస్క్రీమ్ తినడం కాదు కదా కనీసం ముట్టుకోబోనని తెగేసి చెప్పారు. ఆ తర్వాత ఐస్క్రీమ్ మార్చారు’అని సుహాసిన చెప్పికొచిఉ్చంది. -
వాస్తవ సంఘటనలతో ‘భ్రమర’
30 ఇయర్స్ పృద్వి , పృద్వి రాజ్(పెళ్లి) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భ్రమర. టి.వి రవి నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగమహేష్, జయవాణి,మీసాల లక్ష్మణ్, జబర్దస్త్ అప్పారావు, ఆకెళ్ళ, దువ్వాసి మోహన్, పసునూరి శ్రీనివాస్, మాణిక్యం, టార్జాన్ ఇతర కీలక పాత్రలో పోషిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..తెలంగాణ ఎఫ్.డి.సి.చైర్మన్ అనిల్ కుర్మచలం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో గెస్ట్ గా వచ్చిన హైకోర్ట్ అడ్వకేట్ సుంకర నరేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. అయితే ప్రజలను అవగాహన పరస్తూ ప్రజలలో చైతన్యం తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో దర్శక, నిర్మాతలు డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్స్ లో "భ్రమర" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ టైటిల్ లో ఎటువంటి సౌండ్ ఉందో సినిమాలో కూడా అటువంటి సౌండ్ ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు మీడియా తో పాటు ప్రేక్షకులు కూడా సపోర్ట్ చేస్తూ మూవీ యూనిట్ ను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ‘డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్ మీద ఈ సినిమా నడుస్తుంది. .ఢిల్లీ, కొల్ కత్తా, చిక్మంగళూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నాము. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రాహుల్ శ్రీ వాత్సవ్, మ్యూజిక్ డైరెక్టర్ గా కార్తీక్ బి. కొడగండ్ల చేస్తున్నారు. ఇంపార్టెంట్ రోల్ లో సీనియర్ నటులు 30 ఇయర్స్ పృద్వి ,పెళ్లి సినిమా పృద్వి రాజ్ తో పాటు నికితశ్రీ లీడ్ రోల్ లో నటిస్తుంది’అని దర్శకుడు టీవీ రవి నారాయణన్ అన్నారు. ‘మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఇలాంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని నటి నిత్య శ్రీ అన్నారు -
నల్గొండ 'నాగిరెడ్డిపల్లి' లో ‘గేమ్ ఛేంజర్’ గా కనిపించిన హీరో రాంచరణ్..
నల్గొండ: భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల శ్రీ భీమరావ్ రైస్ గోదాములో హీరో రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా గోదాములోని కల్తీ బియ్యం పట్టుకునే సన్నివేశాలు చిత్రీకరించారు. శంకర్ దర్శకత్వంలో దిల్రాజ్ నిర్మాతగా ఎస్వీసీ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రంలోని గోదాముకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ శనివారం కూడా ఇక్కడే కొనసాగనుంది. -
చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. వివరాలు ఇవే
భారీ అంచనాల మధ్య విడుదలైన భోళా శంకర్ చిరంజీవి కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని తన తన తదుపరి సినిమాల విషయంలో నిర్ణయం తీసుకుంటాడని సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. వరుస పరాజయల తర్వాత కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే.. కొత్త సినిమా ప్రకటన ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే, మెగాస్టార్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ లేదని, ఇలాంటి ఒడిదుడుకులు సహజమేనని ఈ ప్రకటనతో చిరంజీవి తెలిపారని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: ఆ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్తో పాటు ఆరుగురు వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్స్) ముందుగా అనుకొన్నట్టుగానే తన పుట్టిన రోజున నేడు (ఆగష్టు 22) కొత్త సినిమా ప్రకటన వచ్చేస్తోంది. దానిలో భాగంగానే కొన్నిగంటల క్రితం యూవీ క్రియేషన్స్ ట్విటర్ ద్వారా ఒక పోస్టర్ను విడుదల చేసింది. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి చెయబోయే సినిమా ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా యూవీ క్రియేషన్స్ అధికారికంగా సోషల్మీడియాలో ఒక పోస్టర్తో గుడ్న్యూస్ తెలిపింది. నేడు 10:53 నిమిషాలకు మెగాస్టార్ మూవీకి చెందిన పలు వివరాలను ప్రకటిస్తామని వారు వెల్లడించారు. యూవీ క్రియేషన్స్-చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్తో బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మెగాఫోన్ పట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. (ఇదీ చదవండి: ఫైనల్గా వశిష్ఠకే దక్కిన మెగా 157 ప్రాజెక్ట్) The universe conspires for beautiful things to happen ✨ One man inspires us to achieve the universe itself 💫 Stay tuned to @UV_Creations ❤️ Today at 10.53 AM 🔮#HBDMegastarChiranjeevi pic.twitter.com/v7W9LCB8Ij — UV Creations (@UV_Creations) August 21, 2023 -
కాజోల్ కొత్త 'మిస్టరీ' మొదలైంది
బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్, కృతీసనన్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘దో పత్తీ’. మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాకి శశాంకా చతుర్వేది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. కృతీసనన్ , కాజోల్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు శశాంక. ఈ సినిమాను రచయిత కనికా థిల్లాన్ , కృతీసనన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా డైరెక్ట్గా స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు 2015లో షారుక్ ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘దిల్వాలే’ చిత్రంలో కాజోల్, కృతీసనన్ కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు ‘దో పత్తీ’ కోసం ఈ ఇద్దరూ సెట్స్లో జాయిన్ అవుతున్నారు. -
The Gentlemen 2 launch : జెంటిల్మేన్-2 ప్రారంభం.. కీరవాణికి సన్మానం (ఫొటోలు)
-
డిఫరెంట్ కాన్సెప్ట్తో ‘కలియుగం పట్టణంలో’
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా తాజా చిత్రం‘కలియుగ పట్టణంలో’. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం టైటిల్ లోగోని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదగా రిలీజ్ చేయగా.. మంచి స్పందల లభించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కడప జిల్లాలోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ఒకే షెడ్యూల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేస్తామని నిర్మాతలు చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమాను మేకర్లు రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ మాధవనేని కెమెరామెన్గా పని చేస్తున్నారు. గ్యారీ బీ.హెచ్. ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు. -
పట్టణంలో వినోదం
సుహాస్, షాలిని కొండేపూడి జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘కేబుల్ రెడ్డి’. శ్రీధర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీధర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి, స్క్రిప్ట్ని మేకర్స్కు అందించారు. అనంతరం సుహాస్ మాట్లాడుతూ– ‘‘రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఒక టౌన్లో జరిగే క్లీన్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. ‘‘బౌండెడ్ స్క్రిప్ట్తో షూట్కి వెళ్తున్నాం. మొదటి షెడ్యూల్ను 20 రోజుల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు బాలు వల్లు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగల. -
ప్రేమ.. వినోదం
‘చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్ జంటగా కొత్త సినిమా షురూ అయింది. సాయి తేజ దర్శకత్వంలో గౌతమ్స్ ఈగల్ ఎంటర్టైన్మెంట్పై ఎం.గౌతమ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది.ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాతలు సి.కల్యాణ్ క్లాప్ కొట్టగా, బెక్కం వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కామెడీ, లవ్, ఎమోషన్స్ .. వంటి ఆకట్టుకునే అంశాలు ఈ మూవీలో ఉంటాయి’’ అన్నారు ఎం.గౌతమ్. నిర్మాత రాచాల యుగంధర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మోహన్ పున్న,లైన్ ప్రొడ్యూసర్: వంశీ కృష్ణ, కెమెరా: పీసీ మౌళి, సంగీతం: గ్యాని. -
సంజోష్ హీరోగా కొత్త చిత్రం
బేవర్స్ చిత్రంతో హీరోగా తెరకు పరిచయం అయ్యాడు సంజోష్. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఆ చిత్రంలో సంజోష్ తన నటనతో అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం ఆయన కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా చంద్ర నిర్మిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో సంజోష్ బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ ప్రత్యేకంగా విషెస్ చెబుతూ, పోస్టర్ను రిలీజ్ చేసింది. (చదవండి: జులై 13 నాకు చాలా స్పెషల్ : సమంత) ఈ పోస్టర్లో సంజోష్ కూల్గా కనిపిస్తున్నాడు. పక్కింటి అబ్బాయిలా సహజంగా కనిపిస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు. -
శివ కార్తికేయన్ ‘మహావీరుడు’మూవీ స్టిల్స్
-
సమంత కీలక నిర్ణయం.. షాక్లో అభిమానులు!
అభిమానులకు, నిర్మాతలకు స్టార్ హీరోయిన్ సమంత భారీ షాకిచ్చింది. కొంతకాలం వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సమంత ‘సీటాడెల్’వెబ్ సిరీస్లో నటిస్తుంది. దీంతో పాటు విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ చిత్రం చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ నడుస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తయిన తర్వాత సమంత లాంగ్ బ్రేక్ తీసుకోనున్నారట. ఇకపై ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారట. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టనున్నారట. వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే ఆమె కొత్త సినిమాలకు సైన్ చేస్తారట. ఆ లోపు ఖుషి సినిమా ప్రమోషన్స్కి మాత్రం ఆమె హాజరవుతారవుతున్నట్లు సమాచారం. (చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) కొత్త సినిమాలకు కోసం తీసుకున్న అడ్వాన్స్లను తిరిగి నిర్మాతలకు ఇచ్చేస్తుండటంతో ఇకపై సామ్ సినిమాలు చేస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏడాది గ్యాప్ తర్వాత తిరిగి కచ్చితంగా సినిమాల్లో నటిస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి సమంత నిర్ణయంతో అటు ఫ్యాన్స్, ఇటు నిర్మాతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. -
స్టార్ హీరో షారుక్ ఖాన్కి యాక్సిడెంట్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్కి ప్రమాదం జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ సీన్ సందర్భంగా గాయమైంది. దీంతో హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పెద్దగా ప్రమాదం లేదని చెప్పినప్పటికీ.. మైనర్ సర్జరీ అవసరమని సూచించారట. ప్రస్తుతం షారుక్.. స్వదేశానికి వచ్చేశారని, రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) షారుక్కి యాక్సిడెంట్ నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. తన కొత్త సినిమా షూటింగ్ కోసం కొన్నాళ్ల ముందు షారుక్ లాస్ ఏంజెల్స్ వెళ్లారు. ఓ సన్నివేశం తీస్తున్న క్రమంలోనే ఆయన ముక్కుకి తీవ్ర గాయమైంది. డాక్టర్స్ అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడంతో త్వరగానే డిశ్చార్జ్ అయిపోయారు. కానీ మైనర్ సర్జరీ చేయాలని సూచించారు. ఈ ప్రమాదం కొన్నిరోజుల క్రితమే జరిగనప్పటికీ.. ఇప్పుడు ఈ విషయం లీక్ అయింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ షారుక్ క్షేమంగానే ఉన్నారని తెలిసి రిలాక్స్ అయ్యారు. 'జవాన్' కోసం వెయిటింగ్ దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన షారుక్ ఖాన్.. 'పఠాన్'తో బ్లాక్బ్లస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' మూవీ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో చేసిన 'జవాన్' విడుదలకు రెడీగా ఉంది. ఇది సెప్టెంబరు 7న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశాయి. ఇలా షారుక్ సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. గాయమైందనే వార్త కాస్త కలవరపరిచింది. (ఇదీ చదవండి: పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్తో!) -
ప్రెగ్నెంట్ అని తెలిసినా..ఆ అవకాశం వదులుకోలేదు: అలియా
వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. తాజాగా ఈ బ్యూటీ హాలీవుడ్లోనూ తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధమైంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’మూవీతో ఈ భామ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా.. ఈ మూవీ షూటింగ్ అనుభవాలు పంచుకుంది. ‘గతేడాది ఏప్రీల్లో రణ్బీర్తో నా పెళ్లి అయిన వెంటనే ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ షూటింగ్ ప్రారంభమైంది. అదే ఏడాది జూన్లో నేను గర్భం దాల్చాను. అయినప్పటికీ షూటింగ్లో పాల్గొన్నాను. షూటింగ్ మొత్తం అయ్యాక..కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాకపోవడంతో వాటిని మళ్ళీ రీషూట్ చెయ్యాలి అన్నారు. అప్పటికే నేను ప్రెగ్నెంట్. కానీ ఈ విషయం చెప్పకుండా షూటింగ్లో పాల్గొన్నాను. (చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!) అయితే కొంతమంది మాత్రం నా బేబీ బంప్ని గుర్తించారు. ఆ తర్వాత సులభంగా చీత్రీకరణలో పాల్గొన్నాను. షూటింగ్ సమయంలో చిత్రబృందం నాకు చాలా సౌకర్యాలు కల్పించింది. అందుకే ప్రెగ్నెంట్ అయినా సులభతరంగా షూటింగ్ పూర్తి చేశా. ఇది నా మొదటి హాలీవుడ్ మూవీ.అందుకే వదులుకోకూడదని ప్రెగ్నెంట్ అని తెలిసినా సినిమా చేశాను’అని అలియా చెప్పుకొచ్చింది. కాగా గతేడాది ఏప్రిల్లో స్టార్ హీరో రణబీర్ కపూర్తో అలియా పెళ్లి అయింది. ఆ తర్వాత రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. అదే ఏడాది నవంబర్లో ఓ పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. -
Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ మూవీ స్టిల్స్
-
మహిళల నేపథ్యంలో...
విశ్వ కార్తికేయ, ఆయుషీ పటేల్ జంటగా దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. కె. చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మిస్తున్నారు. తొలి సీన్కి దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత కేఎస్ రామారావు క్లాప్ కొట్టారు. డైరెక్టర్ నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సుమన్ స్క్రిప్ట్ని అందించారు. ‘‘స్త్రీలకు తల్లవ్వడం అనేది అదృష్టం. ఆ లక్ని సరిగ్గా వినియోగించుకోక΄ోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కథ’’ అన్నారు. ‘‘జూలైలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు చంద్ర ఓబుల్ రెడ్డి, రమేష్. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: అజయ్ అరసాడ. -
శ్రీకాకుళం యాసతో...
రవి మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా చల్లా రాజా రామ్మోహన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. బేబీ లాస్య రెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్పై వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా రాజా రామ్మోహన్ మాట్లాడుతూ– ‘‘కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలతో ఈ చిత్ర కథ ఆసక్తిగా ఉంటుంది. శ్రీకాకుళం యాస ఇతివృత్తంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, శియా గౌతమ్, ‘బాహుబలి’ ప్రభాకర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజేష్ రంబాల. -
లవ్... క్రైమ్
ప్రదీప్ విరాజ్, దివ్య ఖుష్వా జంటగా మనోజ్ ఎల్లుమహంతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా క్లాప్ ఇచ్చారు. బిజినెస్మ్యాన్ రామ్ ఎర్రమ్ స్క్రిప్ట్ని చిత్రయూనిట్కు అందించారు. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బీఎన్కే (బంగారు నవీన్ కుమార్) నిర్మించనున్నారు. దర్శకుడు మనోజ్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు బీఎన్కే. ఈ సినిమాకు కెమెరా: పంకజ్ తట్టోడ. -
షూటింగ్లో ప్రమాదం.. సల్మాన్ఖాన్కు గాయాలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గాయపడ్డాడు. సినిమా షూటింగ్లో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా సల్మాన్ భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ తెలిపారు. ఎడమ భుజానికి గాయమైనట్లుత తెలుపుతూ ఓ ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశారు.దీంతో గెట్ వెల్ సూన్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సల్మాన్ ‘టైగర్-3’షూటింగ్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైకి సీక్వెల్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతుంది. ఈ మూవీలో సల్మాన్పై భారీ యాక్షన్ సీన్స్ను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా సల్మాన్ భుజానికి గాయమైంది. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. చదవండి: ఒకే ఫ్రేమ్లో రజనీకాంత్, కపిల్ దేవ్.. నెట్టింట ఫోటో వైరల్ అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఓ యాక్షన్ సీన్ కూడా ఉండనుందట. ఇటీవలె కిసీకా భాయ్ కిసీకి జాన్తో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్కు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో టైగర్-3 కోసం బాగానే కసరత్తులు చేస్తున్నాడు ఈ కండల వీరుడు. Wen u think u r carrying the weight of the world on your shoulders , he says duniya ko chodo paanch kilo ka dumbbell utha ke dikhao .Tiger Zakhmi Hai . #Tiger3 pic.twitter.com/nyNahitd24 — Salman Khan (@BeingSalmanKhan) May 18, 2023 -
మహేశ్- రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్
హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆరంభించే ఆలోచనలో ఉన్నట్లుగా ఈ చిత్ర కథారచయిత విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. (చదవండి: పుష్ప 2పై అదిరిపోయే అప్డేట్.. ఆయన ప్రతీకారం మామూలుగా ఉండదట! ) ఇందుకు తగ్గట్లుగా ప్రీప్రొడక్షన్ వర్క్స్ను సెట్ చేస్తున్నారట రాజమౌళి అండ్ కో. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకోన్, ఆలియా భట్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే వెకేషన్కు వెళ్లిన మహేశ్ స్పెయిన్ నుంచి హైదరాబాద్కు తిరిగొచ్చారు. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నారు మహేశ్బాబు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది. -
సుడిగాలి సుధీర్ నాలుగో సినిమా షురూ
సుడిగాలి సుధీర్ హీరోగా నాలుగో సినిమా ‘ఎస్ఎస్4’ (వర్కింగ్ టైటిల్) షురూ అయింది. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్. లక్కీ మీడియా–మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్పై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి నిర్మాతలు డి. సురేశ్ బాబు, కేఎస్ రామారావు, సూర్యదేవర రాధాకృష్ణ, కేఎల్ దామోదర ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. తొలి సీన్కి నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ కొట్టారు. ‘‘మంచి కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇది’’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్. ‘‘ఒక గంట కథ వినగానే ఒప్పుకున్న సుధీర్కి థ్యాంక్స్’’ అన్నారు నరేష్ కుప్పిలి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం. -
శివ కార్తికేయన్, సాయి పల్లవి కొత్త సినిమా వేడుక (ఫొటోలు)
-
వరస సినిమాలు తో దూసుకుపోతున్న విశ్వక్
-
విశ్వక్సేన్ కొత్త మూవీకి ముహుర్తం.. క్లాప్ కొట్టిన దిల్ రాజు (ఫొటోలు)
-
చిలుకూరు బాలాజీ టెంపుల్ పాడుబడిందని అక్కడ మహేష్ బాబు సినిమా చేయలేదు
-
నితిన్, రష్మిక మందన చిత్రం మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో ప్రారంభం (ఫొటోలు)
-
రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
-
Allari Naresh: అల్లరి నరేశ్ 61వ సినిమా ఘనంగా ప్రారంభోత్సవం ( ఫొటోలు)
-
ఏ హైదరాబాద్కే పోకుండా.. గీ గోదావరిఖనిల తీసుడు ఎందుకే బావా?
‘సిన్మా తీయాలంటే ఏ హైదరాబాద్కే పోకుండా.. గీ గోదావరిఖనిల తీసుడు ఎందుకే బావా?..’.. ‘ఏతులు గొట్టకుండా సింగిల్ లైన్లో ఒక్కటి చెప్పన్నారా? గోదావరి ఖనిల సిన్మా తియ్యాల్నంటే 100 దళపతులు, 100 రక్తచరిత్రలు తీయొచ్చు..’ .. ఇటీవల గోదావరిఖని నేపథ్యంలో వచ్చింన ‘కొత్త సినిమా’ చిత్రం ట్రైలర్లోని సంభాషణలివి.. ఇవి కేవలం సినిమాలో డైలాగులు మాత్రమే కాదు. జరుగుతున్న వాస్తవం కూడా. ఒకప్పుడు కేవలం బొగ్గు వెలికితీతకు కేంద్రంగా మాత్రమే సింగరేణి పారిశ్రామిక ప్రాంతానికి గుర్తింపు ఉండేది. అడపాదడపా సినిమాల షూటింగులు జరిగినా.. కార్మిక హక్కుల కోసం తీసిన సినిమాల్లో ఒకట్రెండు సన్నివేశాలనే చిత్రీకరించారు. కాలక్రమంలో పరిస్థితి మారింది. నాలుగేళ్ల కింద గనుల నేపథ్యంలో విడుదలైన ‘కేజీఎఫ్’ సినిమా మంచి జనాదరణ దక్కించుకుంది. ఓపెన్ మైన్లలో పోరాట సన్నివేశాలు ఆ చిత్రానికి హైలైట్గా నిలిచాయి. అలాంటి సన్నివేశాలు, పోరాట దృశ్యాలు ఉండాలని కొందరు సినీహీరోలు, దర్శకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గనులకు నిలయమైన గోదావరిఖనికి ఆదరణ పెరిగింది. ఎన్నో ప్రత్యేకతలతో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) గోదావరి లోయను ఆనుకుని సింగరేణి పారిశ్రామిక ప్రాంతం ఉంది. విశాలమైన గోదావరి నది, దాని లోయను ఆనుకుని ఏర్పడిన సింగరేణి గనులు, ఎన్టీపీసీ, బొగ్గురవాణా కోసం ఏర్పాటైన ప్రత్యేక రైల్వే లైన్లు, రైల్వే బ్రిడ్జీలు, కన్వేయర్ బెల్టులు, 40 నుంచి 50 అడుగుల ఎత్తయిన భారీ డంపర్లు, క్రేన్లు ఇలా భారీ యంత్రాలు, హంగామా వంటివి ఇక్కడ కనిపిస్తాయి. రెండు రకాల గనులతో.. ఇక్కడి గనుల్లో రెండు రకాలు ఉంటాయి. బొగ్గు నిక్షేపాలను గుర్తించిన కొత్తలో ఏటవాలుగా క్రమపద్ధతిలో లోపలికి తవ్వి బొగ్గు తీస్తే అది భూగర్భ మైనింగ్. నిల్వలు చివరిదశకు వచ్చాక పేలుళ్లతో మిగతా బొగ్గును వెలికితీసి, భారీ యంత్రాలతో తరలిస్తే ఓపెన్కాస్ట్ (ఉపరితల మైనింగ్). ఇవి వందల మీటర్ల లోతు వరకు ఉంటాయి. బొగ్గు కోసం నిత్యం జరిపే పేలుళ్లతో బొగ్గు పెళ్లలు వందల అడుగులు పైకెగిరి పడుతూ ఉంటాయి. ఆ బొగ్గును తరలించేందుకు భారీ క్రేన్లు, డంపర్లు ఉంటాయి. బయటి ప్రాంతాల వారికి ఇదంతా కొత్త ప్రపంచం. కేజీఎఫ్ సినిమా కూడా ఇలాంటి ఓపెన్ కాస్ట్ ఇనుప ఖనిజం గనుల్లో తీసిందే కావడం గమనార్హం. మెల్లగా పెరుగుతున్నషూటింగ్లు.. భారీ యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో సింగరేణి ఓపెన్ కాస్టుల్లో షూటింగులు పెరుగుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ చిత్రంలోని పలు యాక్షన్ సన్నివేశాలను ఇటీవలే సెంటినరీ కాలనీ సమీపంలోని ఓపెన్కాస్టుల్లో షూట్ చేశారు. నాని నటించిన ‘దసరా’ సినిమా పూర్తిగా గోదావరిఖని పట్టణానికి ఆనుకుని ఉన్న ‘వీర్లపల్లె’ నేపథ్యంగా వచ్చింనదే. ఆ చిత్రాన్ని కూడా ఓపెన్కాస్టు గనుల్లోనే చిత్రీకరించారు. ఇక జాతిరత్నాలు సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు అనుదీప్ తొలిచిత్రం ‘పిట్టగోడ’ కూడా గోదావరిఖని నేపథ్యంలో తీసినదే. ఇక ఇటీవల విడుదలైన క్రైం థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు కూడా మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ‘సిరోంచ’ పేరుతో తీసిన సినిమాను నేరుగా యూట్యూబ్లో విడుదల చేశారు. ఆ సినిమా నచ్చింనవారు దర్శకుడికి ఇప్పటికీ డబ్బులు పంపుతున్నారు. ఇవే కాకుండా ‘కొత్త సినిమా’ పేరుతో ఒక చిత్రం, మరికొన్ని సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకొంటున్నాయి. గతంలో ఆర్.నారాయణమూర్తి చీకటిసూర్యులు, రానా నటించిన లీడర్ వంటి సినిమాల్లోని పలు సీన్లను ఈ ప్రాంతంలోనే చిత్రీకరించారు. సినిమా షూటింగ్లకు అనుకూలం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం సినిమా షూటింగ్లకు ఎంతగానో అనుకూలం. సలార్ సినిమా షూటింగ్ ఓసీపీ–2లో రెండువారాల పాటు సాగింది. భూగర్భగనులు, ఓసీపీలు, ఓబీ ప్రాంతాల్లో షూటింగ్లు చేయవచ్చు. సినిమాలతోపాటు టెలిఫిల్్మలు, చిన్న సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది. – కె.నారాయణ, ఆర్జీ–1 గని జనరల్ మేనేజర్ -
సస్పెన్స్ థ్రిల్లర్గా ‘హలో ఎవరు?’
టాలీవుడ్లో సస్పెన్స్ థ్రిల్లర్స్కు మంచి ఆదరణ ఉంది. అందుకే దర్శకనిర్మాతలు ఆ తరహా కథలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే తెలుగు ప్రేక్షకులను భయపెట్టడానికి మరో సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతుంది. వెంకట్రెడ్డి నంది దర్శకనిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హలో ఎవరు?’ అనే టైటిల్ని ఖరారు చేశారు. . శ్రీశివసాయి ఫిల్మ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రంతో జయ్ పాపిరెడ్డి కటకం, సౌమ్యశ్రీ ఉంతకల్ హీరోహీరోయిన్లుగా, వినాయక్ విలన్గా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎడిటింగ్, డబ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డీఐ పనులు జరుపుకుంటోంది. ఈ క్రైం ఆండ్ హరర్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు దర్శకనిర్మాత వెంకట్రెడ్డి నంది తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని, ఇండస్ట్రీలో ఈ చిత్రానికి స్పెషల్ క్రేజ్ రావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మే నెలలో 'హలో ఎవరు?' చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. -
బిగ్ బీ అమితాబ్ కు ప్రమాదం
-
కొద్దిలో చావు నుంచి తప్పించుకున్న విశాల్
-
కొద్దిలో చావు నుంచి తప్పించుకున్న విశాల్, వీడియో వైరల్
కోలీవుడ్ హీరో విశాల్ యాక్షన్ సీన్లలో డూప్ లేకుండా నటిస్తూ ఎన్నోసార్లు గాయపడ్డాడు. తాజాగా ఆయన 'మార్క్ ఆంటోని' సినిమా షూటింగ్లో ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అదుపుతప్పి వేగంగా వస్తున్న ట్రక్కు.. కింద పడి ఉన్న విశాల్ పక్క నుంచే వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ ప్రమాదం సంభవించిందని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది. అటు విశాల్ కూడా ఈ వీడియో షేర్ చేస్తూ.. 'కొద్ది క్షణాలు.. కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది. థ్యాంక్ గాడ్.. ఈ ప్రమాదం తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొన్నాం' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నటుడు దీపక్ పరమేశ్ దీనిపై స్పందిస్తూ.. 'చూడటానికే భయంకరంగా ఉంది. నీకేం కాలేదు, అంతే చాలు. మిగతా అందరూ కూడా క్షేమంగానే ఉన్నారని భావిస్తున్నాను' అని రాసుకొచ్చాడు. అభిమానులు సైతం 'షాట్ కోసం నిర్లక్ష్యంగా ఉండకండి, నిన్ను నమ్ముకుని చాలామందిమి ఉన్నాం, నువ్వు మాకెంతో అవసరం' అని కామెంట్లు చేస్తున్నారు. Jus missed my life in a matter of few seconds and few inches, Thanks to the Almighty Numb to this incident back on my feet and back to shoot, GB pic.twitter.com/bL7sbc9dOu — Vishal (@VishalKOfficial) February 22, 2023 చదవండి: గతేడాదే నా పెళ్లైపోయింది: రకుల్ -
వికాస్ హీరోగా దుశ్శాసన్ చిత్రం
తమిళ సినిమా: నటుడు వికాస్ కథానాయకుడిగా నటిస్తున్న దుశ్శాసన్ చిత్రం ఆదివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాయ్ తిరైయరంగం పతాకంపై ఎస్.అరుణ్ విఘ్నేశ్, ఆర్వేల్ మురుగన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. దళపతి దర్శకత్వం వహిస్తున్నారు. నటి రోహిణి నాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మనోహర్, మిల్టన్ మెడిసన్, ప్రభు శాస్త్రి, వేలాంగణి, సాయి రోహిణి, విఘ్నేష్ వీఎస్, శరవణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి బాల మురుగన్ చాయాగ్రహణం, విజయ్ ప్రభు సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ.. ద్రౌపతికి వ్రస్తాపహరణం చేసిన వాడే దుశ్శాసనుడు కాదు. ఇతరుల అవమానాలను, బాధలను పట్టించుకోకుండా తన స్వార్థం కోసం ఇతరులను మానసికంగా హింసించేవాడు.. వారి హక్కులను, ప్రాణాలను బలికొనేవాడూ దుశ్శాసనుడే అని చెప్పే కథా చిత్రంగా ఉంటుందన్నారు. దుకాణాల్లో దొంగతనం సంఘటనతో చిత్ర కథ మొదలయ్యి పోలీసుల దర్యాప్తు వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న చిత్రం దుశ్శాసన్ అని చెప్పారు. ఇందులో మూడు పాటలు, రెండు ఫైట్స్ ఉంటాయని తెలిపారు. -
కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర రామ్చరణ్ రాజకీయ సభ (ఫోటోలు)
-
జీవితంలో వెలుతురిని వెతుక్కోవాలి: సామ్ పోస్ట్ వైరల్
నిజ జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైన వాటిని బలంగా చేసుకుంటూ ముందుకు సాగుతుంది సమంత. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడాకులు.. ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడడం..ఇలా మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైన మనోధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. ధైర్యంగా నిలబడి మయోసైటిస్ని ఎదుర్కొంది. ఇప్పుడు రెట్టింపు ఉత్సహాంతో సినిమాల్లోకి వచ్చింది. (చదవండి: వాణి జయరామ్ పోస్ట్ మార్టం పూర్తి..తలకు ఒకటిన్నర ఇంచు గాయం!) చాలా కాలం తర్వాత ఇప్పుడు మేకప్ వేసుకొని కెమెరా ముందుకు రాబోతుంది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ను సెట్స్ మీదకు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్దేవరకొండ ‘ఖుషీ’ చిత్రంలోనూ సామ్ నటించనుంది. ఇన్నాళ్లు అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన సామ్.. ఇప్పుడు షూటింగ్లో పాల్గొనడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, సీటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్కి బయల్దేరిన సామ్.. కారులో ప్రయాణిస్తూ కళ్లు మూసుకొని ఓ ఫోటోకి పోజులిచ్చింది. ఆ ఫోటోని ఇన్స్టాలో షేర్ చేస్తూ.. వెలుతురిని మనమే వెతుక్కోవాలి అని క్యాప్షన్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
Saindhav Movie: ఘనంగా ప్రారంభమైన వెంకటేష్ 75వ చిత్రం (ఫొటోలు)
-
మహేష్, భూమిక హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం
యువ నటులు మహేష్, భూమిక హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. సి.హెచ్ సుజాత నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంతో సజ్జా కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గోల్డెన్ సినీ క్రియషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ లో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుజాత మాట్లాడుతూ.. ‘మా బ్యానర్ గోల్డెన్ సినీ క్రియషన్స్ లో ప్రొడక్షన్ నెం.1 చిత్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. డైరక్టర్ కుమార్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’అని అన్నారు. ‘మంచి సినిమా చేస్తాడని నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటాను’ అని దర్శకుడు కుమార్ అన్నారు. ‘ఈ సినిమాతో సుజాత, కుమార్లకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’అని సీనియర్ ప్రొడ్యూసర్ రామరాజు అన్నారు. షూటింగ్ ప్రారంభోత్సవంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు, విలయిల్ ఫిలిప్స్ థామస్ పాల్గొన్నారు. -
సత్యం రాజేష్ హీరోగా కొత్త చిత్రం.. షూటింగ్ షురూ
సత్యం రాజేష్, రిహ, సునీత హీరో హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి తెంగాణ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించబడుతుంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, మధు నందన్, చమ్మక్ చంద్ర, తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. -
హాసిని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్లో ‘యాక్షన్ డ్రామా- థ్రిల్లర్’
అభయ్, అస్మిత నర్వాల్, గిరిష్మ నేత్రిక హీరోహీరోయిన్లుగా హాసిని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్పై పాత్ లోథ్ శంకర్ గౌడ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్ సుమధుర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్లో జరిగాయి. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ పాత్ లోథ్ శంకర్ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు ఆర్ సుమధుర్ కృష్ణ మాట్లాడుతూ... యాక్షన్ డ్రామా, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇలాంటి కాన్సెప్ట్తో తెలుగులో ఇంతవరకు ఏ చిత్రం రాలేదు. జనవరి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది’ అని తెలిపారు. ‘డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను’అని హీరో అభయ్ అన్నారు. ఈ సినిమాలో నేను నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర చేయబోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు’అని అస్మిత నర్వాల్ అన్నారు. ‘ఒక మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’అని హీరోయిన్ గిరిష్మ అన్నారు. -
లండన్కు వెళ్లనున్న అనుష్క..10 రోజుల అక్కడే..కారణం ఇదే
టాలీవుడ్లో అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దేవసేనకు.. హీరోలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2005లో సూపర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు. బాహుబలి లాంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ అయింది. అనుష్క చివరిగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. . యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క నటిస్తుంది. ఇదిలా ఉంటే అనుష్క ఇప్పుడు లండన్ వెళ్లేందుకు సిద్దమతుందని సమాచారం. అయితే ఇది హాలీడే ట్రిప్ కాదట.. నవీన్ పొలిశెటి సినిమా షూటింగ్ కోసం ఆమె లండన్ వెళ్తున్నారు. దాదాపు పదిరోజుల పాటు అక్కడ షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్లో అనుష్క, నవీన్ పొలిశెట్టిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. లండన్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్లో కొన్ని కీలకమైన సీన్స్ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ ఎండ్లోగా షూటింగ్ను పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తోన్నారు. (చదవండి: స్వీటీకి అనుష్క పేరు ఎలా వచ్చిందో తెలుసా?) -
అరవింద్ స్వామితో ఫైట్కు సిద్ధమైన నాగచైతన్య
నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కృతీశెట్టి హీరోయిన్. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో ఆరంభం అయింది. ఓ భారీ సెట్లో నాగచైతన్య, అరవింద్ స్వామిలపై యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ మహేశ్ మాథ్యూ డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్లో కృతీశెట్టి, శరత్కుమార్, సంపత్ రాజ్ కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాకు తండ్రీకొడుకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా స్వరకర్తలు. -
Kajal Agarwal: కొడుకు విషయంలో కాజల్ షాకింగ్ నిర్ణయం!
సినిమాల కోసం కాజల్ అగర్వాల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ టాలీవుడ్ ‘చందమామ’ కి జూన్ 19న పండంటి మగ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన సమయమంతా కొడుకుకే కేటాయిస్తుంది ఈ బ్యూటీ. తల్లిగా తను పొందే ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటుంది. దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. మళ్లీ ఇటీవల షూటింగ్లకు హాజరవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుందట. దీంతో కొడుకు బాగోగులు చూసుకోవడం కాజల్కు ఇబ్బంది అవుతుందట. అందుకే కుమారుడి బాధ్యతను తన చెల్లి నిషా అగర్వాల్కి అప్పజెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిషాతో పాటు ఆమె తల్లి కూడా నీల్ కిచ్లూ బాగోగులు చూసుకుంటున్నారట. ఇండియన్-2తో పాటు కాజల్ తమిళ్లో మరో సినిమా చేస్తుంది. -
షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్
-
‘చెరసాల’ రిలీజ్కు ముందే రెండో సినిమా షురూ
సినీ ప్రేక్షకుల ఆలోచన మారింది. హీరో కాకుండా కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే యంగ్ డైరెక్టర్స్ డిఫరెంట్ కంటెంట్తో సినిమాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. దర్శకుడు రామ్ ప్రకాష్ గుణ్ణం కూడా ఓ కొత్త పాయింట్తో ‘చెరసాల’సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రెండో సినిమాకు శ్రీకారం చుట్టాడు ఈ యంగ్ డైరెక్టర్. ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా పరిశ్రమలోని ప్రముఖులతో పాటు సన్నిహితులు విచ్చేశారు. ముఖ్య అతిధులుగా నమీరుద్దీన్ అహ్మద్, కతేరి అంజమ్మ , కట్ల భాగ్య లక్ష్మి, రైటర్ నరేందర్ రెడ్డి, కిషోర్, తెలుగు మహేంద్ర విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్ ప్రకాష్ మాట్లాడుతూ..‘నన్ను నమ్మి ఎంతో ప్రోత్సహిస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. మంచి కంటెంట్ ను అందించే విధంగా సినిమా కోసం పనిచేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా లను వెండితెరపైకి తీసుకు వస్తాను’ అని అన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.6 కోట్ల మోసం జరిగింది. 30 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వారి బంధువులే టార్గెట్గా వారి నుంచి 6 కోట్లు వసూళ్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్లతో కూకట్పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి,నాగం ఉమాశంకర్లు మోసాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ బాధితులు సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. చదవండి: కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా? ఫిల్మ్ ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బొర్ వెల్స్ పలు రంగాలలో పెట్టుబడుల పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డారు. ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టొరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది పలు సినిమాలలో పెట్టుబడులు పెడతామని, వాటిలో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు ఇస్తామని వారు నమ్మించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్లను సీసీఎస్ పోలీసులు అదువులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు బాధితులు తెలిపారు. -
డంపింగ్ యార్డులో మూవీ సెట్ వేశాం : డైరెక్టర్
ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘నవాబ్’. రవిచరణ్ దర్శకత్వంలో నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎం నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో రవిచరణ్ మాట్లాడుతూ – ‘‘నా మొదటి సినిమా ‘నల్లమల’కు మంచి ఆదరణ లభించింది. ఆ ఉత్సాహంతో ‘నవాబ్’ తెరకెక్కిస్తున్నాం. పూర్తిగా డంపింగ్ యార్డ్లో సాగే కథతో ఈ సినిమా ఉంటుంది. దీని కోసం పదెకరాల్లో డంపింగ్ యార్డ్ సెట్ వేశాం. మా హీరో ముఖేష్ గుప్తా తెలుగు కాదు. ఆర్నెళ్లు తెలుగు నేర్చుకుని అద్భుతంగా నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఓ మంచి కథతో రూపొందుతున్న ‘నవాబ్’లో హీరోగా నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు ముఖేష్ గుప్తా. -
విశాఖ ఫిషింగ్ హార్బర్లో మెగాస్టార్.. ఫ్యాన్స్కు పండగ
కొమ్మాది(భీమిలి): విశాఖపట్నం నగరంలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న మెగాస్టార్ 154వ సినిమా (ప్రచారంలో వాల్తేరు వీరయ్య) షూటింగ్లో పాల్గొనేందుకు ఆయన నగరానికి చేరుకున్నారు. ఫిషింగ్ హార్బర్ వద్ద మంగళవారం ఆయనతో పాటు హీరో రవితేజపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. బుధవారం కూడా ఈ ప్రాంతంలో సినిమా చిత్రీకరణ ఉంటుందని సినీ వర్గాల సమాచారం. హీరోలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఫిషింగ్ హార్బర్కు చేరుకున్నారు. కాగా, చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. (క్లిక్: అలా అయితే నాకు మరో 20 ఏళ్లు పట్టేది.. అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్) -
SSMB28: మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్! అసలు కారణమిదేనా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రీప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్పైకి వచ్చింది. అంతేకాదు ఈ సినిమా కోసం మేకోవర్ కూడా అయ్యాడు మహేశ్. ఆయన న్యూలుక్కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ స్టార్ట్స్ అంటూ సెప్టెంబర్ 13న సెట్స్లోని ఓ సన్నివేశాన్ని షేర్ చేసింది చిత్ర బృందం. చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే! అయితే యాక్షన్ సీన్స్తో ఈ మూవీ షూటింగ్ను ప్రారంభించాడట త్రివిక్రమ్. ఈ క్రమంలో తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుందని, సెకండ్ షెడ్యూల్ దసరా తర్వాతే అంటూ తాజాగా మూవీ యూనిట్ ప్రకటన ఇచ్చింది. ఇదిలా ఉంతే రెండు, మూడు రోజుల్లోనే తొలి షెడ్యూల్ పూర్తి కావడంపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. దీని వెనక ఓ కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ తాజా బజ్ ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ను కావాలనే ఆపేసారంటున్నారు. ఇప్పటి వరకు చేసిన యాక్షన్ సీక్వెన్స్ విషయంలో మహేష్బాబు, త్రివిక్రమ్ సంతృప్తిగా లేరట. అనుకున్న విధంగా ఈ ఫైట్ సీన్లు రావడం లేదని, అందుకే షూటింగ్కు కావాలనే బ్రేక్ ఇచ్చినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: విషాదం.. స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి నిజానికి ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం తొలి షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు జరగాల్సి ఉందట. కానీ, యాక్షన్ సీన్స్ అనుకున్నట్టుగా రాకపోవడంతో ఆర్థాంతరంగా షూటింగ్ను నిలిపివేయాల్సి వచ్చిందని సినీవర్గాల నుంచి సమాచారం. కాస్తా సమయం తీసుకుని ప్రస్తుత ఫైట్ మాస్టర్ని కొనసాగించాలా? కొత్త మాస్టర్ని తీసుకోవాలా? అనే కీలక నిర్ణయం తీసుకొనున్నాడట దర్శకుడు. ఆ తర్వాతే తిరిగి షూటింగ్ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అందుకే దసరా వరకు త్రివిక్రమ్ టైం తీసుకుంటున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించేవరకు వేచి చూడాల్సిందే. First schedule of #SSMB28 has been completed with some kick-ass high octane epic action scenes 🔥 Thank you @anbariv masters for amazing stunt choreography 🤗 The second schedule will start post Dussehra with our Superstar @urstrulyMahesh garu & butta bomma @hegdepooja. — Naga Vamsi (@vamsi84) September 21, 2022 -
లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్గా ‘కంచర్ల’
ఉపేంద్ర హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘కంచర్ల’. ఎస్.ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ బేనర్పై కె. అచ్యుతరావు సమర్పణ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రెడ్డెం యాద కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వైజాగ్లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్గా జరిగింది. ఈ చిత్రంలో బాహుబలి ప్రభాకర్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర, హీరోయిన్లు మీనాక్షి జైస్వాల్, ప్రణీతలపై తొలి షాట్ని దర్శకుడు రెడ్డెం యాద కుమార్ చిత్రీకరించగా , సమర్పకులు కె. అచ్యుతరావు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. అనంతరం చిత్ర సమర్పకులు కె. అచ్యుతరావు మీడియాతో మాట్లాడుతూ...‘సినీ ప్రేక్షకులకు వినూత్న కథాంశంతో కూడిన చిత్రాన్ని అందించేందుకు ‘కంచర్ల’ చిత్రం రూపొందిస్తున్నామన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల, అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాం. ఉపేంద్ర హీరోగా నటిస్తున్న ‘కంచర్ల’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకులు రెడ్డెం యాద కుమార్ మాట్లాడుతూ .. ‘యువకులు రాజకీయాల్లోకి రావాలి. సేవా దృక్పథంతో ఉండాలి అనే కాన్సెప్ట్ తో లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తొలి షెడ్యూల్ ప్రారంభించాం. విశాఖ ప్రాంతంలోనే మొదటి షెడ్యూల్కు సంబంధించిన షూటింగ్ జరుపుతాం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ` అన్నారు. హీరో ఉపేంద్ర, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ మాట్లాడుతూ...‘కంచర్ల చిత్రం తమ నటనా జీవితానికి మలుపు రాయిగా నిలుస్తుంది’ అన్నారు. కార్యక్రమంలో సినీ నటుడు బాహుబలి ప్రభాకర్, డీఓపీ గుణశేఖర్, క్యాలు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
ఒంగోలులో శ్రీకారం చుట్టుకున్న‘సత్యం వధ - ధర్మం చెర’
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతూ తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యం వధ - ధర్మం చెర’. బాబు నిమ్మగడ్డ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై రమాదేవి నిమ్మగడ్డ నిర్మిస్తున్నారు. ఒంగోలు, గోపాలస్వామి కన్వెన్షన్ హాల్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రమణారెడ్డి-పూజలపై చిత్రీకరించిన ముహర్తపు సన్నివేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా హనుమంతరావు క్లాప్ కొట్టగా... రవి శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కంది రమేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మార్వెల్ గ్రైనేట్స్ అధినేత సూదనగుంట కోటేశ్వరరావు గౌరవ దర్సకత్వం వహించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతూ తెరకెక్కుతున్న ‘సత్యం వధ - ధర్మం చెర’ప్రేక్షకులతో ఆలోచింపజేస్తూనే అమితంగా అలరిస్తుందని దర్శకుడు బాబు నిమ్మగడ్డ అన్నారు. స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి, కీర్తి, రాజా, బద్రీనాథ్, సాగర్, సీత, బిందు భార్గవి, మమతారెడ్డి, బిందుకృష్ణ, మధుబాల, బాబు బంగారు, బి.కె.పి.చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్, అనంతలక్ష్మి, రమేష్ రాజా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్కు గాయాలు !
Popular Actor Nassar Wounded In Cinema Shooting: టాలీవుడ్ స్టార్ యాక్టర్స్లో నటుడు నాజర్ ఒకరు. దక్షిణాదిన అయన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలందరి సినిమాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ను అలరిస్తూ వస్తున్నారు. నాజర్ లేకుండ ఎలాంటి పెద్ద సినిమా లేదు అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. తండ్రిగా, పోలీసు ఆఫీసర్గా, విలన్గా, కమెడియన్గా ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయే ఆయన ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించారు. అయితే తాజాగా ఆయనకు గాయాలయ్యాయని తెలుస్తోంది. హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో బుధవారం (ఆగస్టు 17) ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న నాజర్ గాయాలపాలయ్యారని సమాచారం. నాజర్కు గాయాలు కాగా వెంటనే చికిత్స కోసం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా యాక్టింగ్కు రిటైర్మెంట్ ప్రకటించాలని నాజర్ స్వయంగా నిర్ణయించుకున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగిన విషయం తెలిసిందే. ఆనారోగ్య కారణాల దృష్ట్యా నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చదవండి: నేనేం స్టార్ కిడ్ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్పుత్ సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! 50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్ -
ఇద్దరు యువకుల కల ‘కర్ణపిశాచి’.. నటీనటులంతా వైజాగ్ వాసులే
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): ఇద్దరు యువకులు కన్న కల...‘కళ’ర్ఫుల్గా తెరపైకి తెచ్చారు. వెండితెరపై సత్తా చాటుకోవాలని తహతహలాడుతున్నారు. టైటిల్తోనే ఆసక్తి రేపుతూ సినిమాపై మంచి అంచనాలు పెంచేశారు. త్వరలో ఓటీటీ ప్లాట్ఫారంపై విడుదల కానున్న కర్ణపిశాచి కేరాఫ్ ఐటీ ఆఫీస్ సినిమా గురించి...ఆ యువకుల గురించి తెలుసుకుందాం. ప్రణవి విశాఖ అమ్మాయి. ఇంజినీరింగ్ పూర్తి చేసింది. సినిమాలంటే పిచ్చి. ఇప్పటికే ఎన్నో షార్ట్ఫిల్్మలు చేసి మెప్పించింది. సీన్ చెప్పగానే లీనమైపోవడం ఈమె ప్రత్యేకత. మంచి హావభావాలు, నాట్యం ఈమెకు ప్లస్ పాయింట్... కర్ణపిశాచిలో మెయిన్ లీడ్ పోషిస్తోంది. తెరపై ప్రణవి భయపెట్టడం ఖాయం. నిఖిల్ శ్రీకాకుళం కుర్రోడు... ఏయూలో లా చదువుతున్నాడు. మంచి టైమింగ్ ఉన్న మిమిక్రీ ఆరి్టస్ట్. సినిమాలో విలన్గా నటిస్తున్నాడు. ఒక అద్భుతమైన శక్తిని ఒక మంచివాడు ఎలా ఉపయోగిస్తాడు..చెడ్డవాడు ఎలా దుర్వినియోగం చేస్తాడో చెప్పే ఈ చిత్రంలో హీరోకి దీటుగా అదరగొట్టాడు. భరత్ కుమార్ సిగిరెడ్డి ఈ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. సౌతాఫ్రికాలో ఉద్యోగం...కోవిడ్ కారణంగా సొంతూరు అనకాపల్లి వచ్చేశాడు. వర్క్ ఫ్రం హోం. సొంతూరు..చిన్ననాటి కలలు నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం దొరికింది. భరత్కుమార్ చిన్నప్పటి నుంచి కథలు రాయడం ఇష్టం..ఆ రాసే కథలో తనను తాను ఊహించుకునేవాడు..అలా పలు షార్ట్ఫిల్మ్లకు కథలు రాయడం..అవకాశం ఉన్నప్పుడల్లా నటించడం చేసేవాడు. ఉద్యోగరీత్యా సౌతాఫ్రికా వెళ్లిపోవడంతో తాత్కాలికంగా తన కళకు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా హీరోగా...నిర్మాతగా మారి కర్ణపిశాచి అనే చిత్రానికి నాంది పలికాడు. ప్రస్తుతం సినిమా సెన్సార్కు వెళ్లింది. త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానుంది. చదవండి: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న షారుక్ ఖాన్ కుమారుడు నమావతి పేరే వెరైటీ. ఆమె నటన మరింత మెప్పిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అందం..అభినయం కలగలిపిన వర్ధమాన నటి నమావతి. కర్ణపిశాచిలో మూడో హీరోయిన్గా నటిస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నానని, తెరపై తన నటన చూసి విజల్స్ గ్యారంటీ అని చెబుతోంది. విజయ్ మల్లాది షార్ట్ ఫిల్మ్లతో కెరీర్ మొదలు పెట్టాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రికి బంధువు. విశాఖ వేదికగా చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసి గుర్తింపు పొందాడు. మంచి ప్రతిభ ఉన్న కుర్రోడు. విజయ్ టాలెంట్ను గుర్తించి భరత్ కుమార్ రాసుకున్న కర్ణపిశాచిని అతని చేతిలో పెట్టాడు. సినిమాలో నటించిన వారంతా విశాఖ కళాకారులే. సినిమా మొత్తం మన ఉత్తరాంధ్రలోనే షూటింగ్ జరుపుకుంది. స్క్రీన్ ప్లే, దర్శకత్వ ప్రతిభతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. -
సీనియర్ హీరోయిన్ టబుకు తీవ్రగాయాలు.. షూటింగ్కి బ్రేక్
సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్లో తీవ్రంగా గాయపడింది.బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును బైక్స్తో ఛేజ్ చేసే సీన్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగిలి టబు కన్ను, నుదుటికి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం జరగడంతో హీరో అజయ్ దేవగన్ షూటింగ్కు చిన్న విరామం ప్రకటించారు. రెప్ప పాటులో ఆమె కంటికి పెను ప్రమాదం తప్పిందని సమాచారం. దీంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా మరో సినిమా షూటింగ్ సెట్లో హీరోయిన్ శిల్పాశెట్టి గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఒకే రోజు ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ గాయపడటం గమనార్హం. -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నటి మాలాశ్రీ కూతురు
ప్రముఖ నిర్మాత దివంగత రాము, సీనియర్ నటి మాలా శ్రీ కుమార్తె రాథనా రామ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది.'చాలెంజింగ్ స్టార్' దర్శన్తో కలిసి D56 వర్కింగ్ టైటిల్తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్లైన్ వెంకటేష్ తన రాక్లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తెలుగు,కన్నడ , మలయాళం, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రాబర్ట్' ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు. బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ సినిమాను ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మాలాశ్రీ తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. లేడీ ఓరియెంటెండ్ చిత్రాలతోనూ మెప్పించారు. ఇప్పుడు మాలాశ్రీ కుమార్తె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా మాలాశ్రీ మాట్లాడుతూ.. 'రాధనాకు శుభాకాంక్షలు. ఆమెకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి. రాక్లైన్ నా సినిమాతో ప్రొడక్షన్లోని అడుగుపెట్టారు. ఇప్పుడు రాక్లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న సినిమాతో నా కూతురు నటిగా అరంగేట్రం చేస్తోంది. మంచి టీమ్తో ఆమె అరంగేట్రం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నటి కావాలనుకుంది. ముంబైలో నటన, డ్యాన్స్ నేర్చుకుంది. ఆమె గత కొన్నేళ్లుగా చాలా కష్టపడి పని చేసింది . నా కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకోవాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. -
సినిమా VS సినిమా