rishi sunak
-
ముంబయిలో క్రికెట్ ఆడిన బ్రిటన్ మాజీ ప్రధాని
ముంబయి:బ్రిటన్ మాజీ ప్రధాని,ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ ఆదివారం(ఫిబ్రవరి2) ముంబయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ ముంబయిలోని పార్సీ జింఖానా గ్రౌండ్లో కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ విషయమై ఆయన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడకుండా తన ముంబయి పర్యటన ఎప్పుడూ ఉండదని తెలిపారు.రాజస్థాన్లోని జైపూర్లో ఐదు రోజులపాటు జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు రిషి సునాక్ భారత్కు వచ్చారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శనివారం సాయంత్రం ముంబయికి చేరుకున్నారు.ఆదివారం ఉదయం ఇక్కడి పార్సీ జింఖానా మైదానానికి వెళ్లారు.క్లబ్ వార్షికోత్సవాల నేపథ్యంలో అక్కడికి వచ్చిన వారితో కాసేపు ముచ్చటించారు. క్లబ్ సాధించిన విజయాల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం బ్యాట్ పట్టుకుని టెన్నిస్బాల్తో కాసేపు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. -
‘మా అల్లుడు వెరీగుడ్’: సుధా మూర్తి
తన అల్లుడు ఎంతో మంచివాడని, ఆయన్ని చూస్తే ఎంతో గర్వకారణంగా ఉందని అంటున్నారు ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి. లండన్ విద్యాభవన్లో జరిగిన దీవాళి గళా కార్యక్రమంలో ఆమె భారతీయ విలువలు, సంస్కృతి మీద మాట్లాడుతూ..మనిషికి మంచి చదువే కాదు.. సంప్రదాయ మూలాలు కూడా ముఖ్యమేనని అంటున్నారు సుధా మూర్తి. శనివారం లండన్లో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్లో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కూతురు అక్షతా మూర్తి, ఆమె భర్త..బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్లు హాజరయ్యారు.మంచి విద్య మీకు పైకి ఎగరడానికి(ఎదగడానికి) రెక్కలను ఇస్తుంది, కానీ గొప్ప సంస్కృతి మిమ్మల్ని మీ మూలాల్లో నిలబెట్టేలా చేస్తుంది. ఉషా సునాక్(రిషి తల్లి) ఆయన్ని(రిషి) అద్భుతంగా పెంచారు. ఆ పెంపక పునాదుల్లో.. బలమైన భారతీయ సంస్కృతి ఉంది. సునాక్ బ్రిటిష్ జాతి గర్వించదగ్గ వ్యక్తి. అదే సమయంలో.. ఆయన భారతీయ వారసత్వంలో విలువలు కూడా కనిపిస్తాయి అంటూ అల్లుడిని ఆకాశానికెత్తారామె.ఈ సందర్భంగా.. భారతీయ కళను, సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు భారతీయ విద్యాభవన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. భారతీయ సంప్రదాయాల్ని నేర్చుకునేందుకు మీ పిల్లలను ఇక్కడికి(విద్యాభవన్)కు పంపండి. మనం ఒక వయసుకి వచ్చాక.. మన మూలాలను తాకాల్సి ఉంటుంది అంటూ ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి రిషి సునాక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్లు సైతం హాజరయ్యారు. విద్యాభవన్ నిర్వాహకులకు రిషి, అక్షతలు మెమోంటోలు ఇచ్చి సత్కరించారు. ఎన్నారై వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్,అంతకు ముందు.. భవన్ యూకే చైర్మన్ సుభాను సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎన్ నందకుమారలు వేద మంత్రాలు చదువుతూ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే.. భారత కళలను ఎలా ప్రదర్శిస్తున్న తీరును, ఆ సెంటర్ సాధించిన విజయాల్ని ఏవీ రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి.. రామాయణం, కలిపూజ వంటి అంశాలను ప్రస్తావించారు. పలువురు కళాకారులు భారతీయ నృత్య కళలు ప్రదర్శించారు. -
వివాదంలో బ్రిటన్ ప్రధాని.. భారతీయులకు క్షమాపణలు చెబుతారా?
లండన్ : బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ప్రధాని కీర్ స్టార్మర్ తన నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులకు ఇచ్చిన ఆతిథ్యం వివాదంగా మారింది. యూకే ప్రధాని అధికారిక నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ నాయకులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన దీపాలు వెలిగించడం, కూచిపూడి నృత్య ప్రదర్శన, కీర్ స్టార్మర్ ప్రసంగం జరిగింది. అంనతరం, అతిథులకు భోజనం ఏర్పాటు చేశారు.అయితే, అతిథులుగా వచ్చిన తమ మనోవభావాలు దెబ్బతినేలా ప్రధాని కీర్ స్టార్మర్ తమకు నాన్వెజ్, లిక్కర్లను అందించారని బ్రిటన్ హిందువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్రిటిష్ హిందూ పండిట్ సతీష్ కే శర్మ.. ప్రధాని కార్యాలయం ఇచ్చిన ఆతిథ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత 14 సంవత్సరాలుగా10-డౌనింగ్ స్ట్రీట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పుడూ నాన్ వెజ్ ఐటమ్స్, వైన్స్, బీర్ వంటి వాటికి జోలికి వెళ్లలేదు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ సంవత్సరం దీపావళి వేడుకల్లో మాంసాహారంతో చేసిన వంటకాలు పెట్టారు. వైన్,బీర్లను అందించి మూర్ఖం, ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.దీపావళి వేడుకల్లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సలహాదారులు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ అంశంపై కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం బ్రిటన్,భారత్లలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్మారర్ స్పందించాల్సి ఉంది.కాగా, బ్రిటన్ లో 14 ఏళ్ల తర్వాత అధికారం మారింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ చరిత్ర సృష్టించింది. 650 స్థానాలకు గాను నాలుగు వందలకు పైగా సీట్లు గెలుచుకొని లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. -
రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ
బెంగళూరు: బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తితో కలిసి బెంగళూరులో పర్యటించారు. కార్తీక మాసం పవిత్రమైన మాసం కావడంతో గురురాఘవేంద్ర స్వామి ఆశీస్సులు పొందేందుకు ఈ దంపతులు మఠాన్ని సందర్శించారు. జయనగర్లో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు సునక్ అత్తమామలు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు. గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా దర్శనమిచ్చాయి. స్వామివారి దర్శనం సందర్భంగా ఆలయ సంప్రదాయ పూజల్లో వారు పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయాలపై తన విశ్వాసం గురించి బహిరంగంగానే ప్రకటించే రిషి సునాక్.. గతంలో దేశంలో పర్యటించినప్పుడు అనేక దేవాలయాలను సందర్శించారు. ఈ ఏడాది జనవరిలో సునాక్ లండన్లోని ప్రఖ్యాత బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్ను సందర్శించారు. ‘‘నేను హిందువును. అందరిలాగే, నేనూ నా విశ్వాసం నుంచి ప్రేరణను, ఓదార్పును పొందుతాను. పార్లమెంటు సభ్యుడిగా ‘భగవద్గీత’పై ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. -
విపక్ష నేత పదవికి సునాక్ గుడ్బై
లండన్: బ్రిటన్ విపక్ష నేత పదవి నుంచి రిషి సునాక్ (44) బుధవారం తప్పుకున్నారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా రెండేళ్ల క్రితం ఆయన చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఆయన సారథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ గత జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయం పాలైంది. నాటినుంచి సునాక్ తాత్కాలికంగా విపక్ష నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం పార్లమెంటులో ప్రకటించారు. ‘రెండేళ్ల నాడు దీపావళి సంబరాల సందర్భంగానే నా పార్టీ నాయకునిగా ఎన్నికయ్యా. మళ్లీ అవే సంబరాల వేళ తప్పుకుంటున్నా’ అంటూ హాస్యం చిలికించారు. ‘‘ఈ గొప్ప దేశానికి తొలి బ్రిటిష్ ఏషియన్ ప్రధాని కావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. బ్రిటన్ అనుసరించే గొప్ప విలువలకు ఇది తార్కాణంగా నిలిచింది’’ అన్నారు. తన చివరి ప్రైమ్మినిస్టర్స్ క్వశ్చన్స్ (పీఎంక్యూస్)లో భాగంగా ప్రధాని కియర్ స్టార్మర్కు సునాక్ పలు సరదా ప్రశ్నలు వేసి అందరినీ నవ్వించారు. వెనక బెంచీల్లో కూచుంటాఅమెరికాలో స్థిరపడాలని తాను భావిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను ఈ సందర్భంగా సునాక్ తోసిపుచ్చారు. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ ఎంపీగా పారల్మెంటులో వెనక బెంచీల్లో కూర్చుని కనిపిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. దాంతో సహచర ఎంపీలంతా నవ్వుల్లో మునిగిపోయారు. -
Britain: రిషి వారసుడెవరో?!
బ్రిటన్లో రిషి సునాక్ వారసునిగా విపక్ష కన్జర్వేటివ్ పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సూటి వ్యాఖ్యలకు పెట్టింది పేరైన 44 ఏళ్ల కేమీ బేడ్నాక్ మొదలుకుని పార్టీకి పరమ విధేయుడైన జేమ్స్ క్లెవర్లీ దాకా నలుగురు నేతలు రేసులో ఉన్నారు. ఎన్నికల్లో దారుణ పరాజయంతో నైరాశ్యంలో కూరుకుపోయిన శ్రేణుల్లో నూతన జవసత్వాలు నింపగల నేత వీరిలో ఎవరన్న దానిపై బహుశా బుధవారం స్పష్టత వచ్చే అవకాశముంది.గత జూలైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయంతో కన్జర్వేటివ్ (టోరీ) పార్టీ కకావికలైంది. దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న అనంతరం టోరీలు ఘోర ఓటమి చవిచూశారు. పార్టీ 190 ఏళ్ల చరిత్రలోనే అత్యంత దారుణ ఓటమిగా అది రికార్డులకెక్కింది. పార్లమెంటులో టోరీ ఎంపీల సంఖ్య 365 నుంచి ఎకాయెకి 121కి పడిపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి జనాదరణ పొందేందుకు ఏం చేయాలన్న దానిపై నాయకులంతా వర్గాలుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీకి నూతన దిశానిర్దేశం చేయడం కొత్త నాయకునికి పెను సవాలే కానుంది. భారత మూలాలున్న మాజీ హోం మంత్రి ప్రీతీ పటేల్, మెల్ స్ట్రైడ్ తొలి రౌండ్లలోనే వైదొలిగి రేసులో నలుగురు మిగిలారు. వారిలో క్లెవర్లీకే మొగ్గున్నట్టు పలు సర్వేలు తేల్చినా టోరీ ఎంపీలు, నేతలు జెన్రిక్ వైపే మొగ్గుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.కేమీ బేడ్నాక్ (44)నైజీరియా తల్లిదండ్రులకు లండన్లో జన్మించారు. 2017, 2022ల్లో ఎంపీగా గెలిచారు. బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక పార్టీ నేత పదవికి తొలిసారి పోటీ పడి నాలుగో స్థానంలో నిలిచారు. ముక్కుసూటి నాయకురాలిగా పేరు. దివంగత ప్రధాని మార్గరెట్ థాచర్ తనకు ఆదర్శమంటారు. ట్రాన్స్జెండర్ల హక్కులు మొదలుకుని ప్రతి అంశంపైనా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సమర్థులకు కీలక బాధ్యతలివ్వడం ద్వారా పార్టీలో సమూల ప్రక్షాళనే లక్ష్యమని చెబుతున్నారు.జేమ్స్ క్లెవర్లీ (54)పార్టీకి అత్యంత నమ్మకస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలం సైన్యంలో పని చేశారు. పార్టీలో చేరి ఎంపీగా అయ్యాక హోం, విదేశాంగ మంత్రిగా చేశారు. బ్రెగ్జిట్కు గట్టి మద్దతుదారు. పార్టీకి బ్రిటన్లోని నల్లజాతీయుల మద్దతు సాధించి పెట్టే ప్రయత్నంలో తలమునకలుగా ఉన్నారు. పార్టీలో ఇటు వామపక్ష, అటు రైట్వింగ్ నేతల ఆదరణ సాధించేందుకు సెంట్రిస్ట్ ఇమేజీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నేత. పలు సర్వేల్లో ముందంజలో ఉన్నారు.రాబర్ట్ జెన్రిక్ (42)పార్టీలో అతివాద నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వలసలపై మరింత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. వాటి కట్టడికి ఉద్దేశించిన రువాండా స్కీం ఆశించిన ఫలితాలివ్వడం లేదంటూ గత డిసెంబర్లో వలసల మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. మిగతా నేతలకు గట్టి పోటీ ఇస్తున్నారు.టామ్ టూగన్హాట్ (51)మాజీ సైనికుడు. ఇరాక్లో పని చేశారు. అరబిక్లో ధారాళంగా మాట్లాడగలరు. సెంట్రిస్ట్ నాయకుడు. 2022లో పార్టీ నేత పదవికి జరిగిన పోరులో లిజ్ ట్రస్ చేతిలో ఓడారు. ఎంపిక ఇలా...టోరీల సారథి ఎంపిక ప్రక్రియ కాస్ల సంక్లిష్టంగా ఉంటుంది. తుది రేసులో ఉన్న నలుగురు నేతలు పార్టీ ఎంపీలు, ముఖ్య నేతల మద్దతు గెలుచుకోవడం కీలకం. అందుకోసం పలు అంశాలపై తమ వైఖరిని వారి ముందుంచాలి. ఈ ప్రక్రియ తుది దశకు చేరింది. టోరీ ఎంపీలు, నేతల 4 రోజుల కీలక సదస్సు బర్మింగ్హాంలో ఆదివారం మొదలైంది. అభ్యర్థులను వారు మంగళవారం దాకా ఇంటర్వ్యూ చేస్తారు. చివరి రోజైన బుధవారం అభ్యర్థులకు ప్రధాన పరీక్ష ఎదురవుతుంది. ఒక్కొక్కరు 20 నిమిషాల పాటు చేసే ప్రసంగం కీలకం కానుంది. ఎంపీలు, నేతలను ఆకట్టుకునే వారి ఎన్నిక దాదాపు లాంఛనమే అవుతుంది. అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే టోరీ ఎంపీల ఓటింగ్ ప్రక్రియ అనంతరం చివరికి ఇద్దరు అభ్యర్థులు రేసులో మిగులుతారు. వారి నుంచి తమ నాయకున్ని ఎన్నుకునేందుకు 1.7 లక్షల పై చిలుకు టోరీ సభ్యులు అక్టోబర్ 15 నుంచి 31 దాకా ఆన్లైన్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. విజేత ఎవరన్నది నవంబర్ 2న తేలుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రిటన్ రాజకీయాలు నేర్పుతున్న పాఠాలు
దాదాపు ఒక దశాబ్దకాలంగా మనం బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, విశ్వసనీయత లేని రాజకీయ నాయకులు, నాణ్యమైనవి కాని మౌలిక సదుపాయాలు, క్రమంగా క్షీణిస్తున్న పాలనా ప్రతిష్ఠ... వంటివాటిని మాత్రమే బ్రిటన్ గురించి చూడడానికి అలవాటు పడుతూ వచ్చాము. అది మన తప్పు కాదు. కానీ ఇప్పుడు బ్రిటన్ను భిన్నంగా చూసే అవకాశం వచ్చింది. అలాగే ఇండియాలో మనం కూడా ఈసారి కొన్ని అమూల్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. యునైటెడ్ కింగ్డమ్ బహుశా ప్రపంచంలోనే అత్యంత బహుళ సాంస్కృతిక సమాజం. భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశానికి ప్రధానిగా పని చేశారు. ఇంకా అనేకమంది నల్లజాతీయులు లేదా ఆసియాకు చెందినవారు చాన్స్లర్లుగా, విదేశీ కార్యదర్శులుగా, హోమ్ శాఖ కార్యదర్శులుగా; స్కాట్లాండ్, వేల్స్, లండన్ల అధినేతలుగా ఉన్నారు. మిగతా ఏ దేశమూ ఇంతగా అపూర్వమైన స్థాయిలో వైవిధ్యాన్ని కలిగి ఉంటుందని నేను అనుకోను. గత సభలోని 10 శాతంతో పోల్చి చూస్తే ఇటీవల హౌస్ ఆఫ్ కామన్స్కు ఎంపికైన ఎంపీలలో 13 శాతం మంది నల్లజాతీయులు / ఆసియన్లు లేదా మైనారిటీ జాతుల మూలవాసులే. వీరిలో 29 మంది భారత సంతతి వారు కాగా, 15 మంది పాకిస్తాన్కు చెందినవారు. 12 మంది సిక్కులు. అయితే బ్రిటన్ జనాభాలో ఆసియన్లు 8 శాతం మాత్రమే కాగా, నల్లజాతీయులు 4 శాతం, భారత సంతతివారు 3.1 శాతం, పాక్కి చెందినవారు 2.7 శాతం మాత్రమే. హౌస్ ఆఫ్ కామన్స్తో పోల్చి చూసినప్పుడు.. భారతదేశ జనాభాలో దాదాపు 15 శాతంగా ఉన్న ముస్లింలు దామాషా ప్రకారం మన లోక్సభలో 74 మంది ఉండాలి. కానీ ఉన్నది 24 మందే. 2019లో వారి సంఖ్య 26. ఆ ముందు 2014లో 23. దేశంలోని 28 రాష్ట్రాల్లో మనకు ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి కూడా లేరు. 15 రాష్ట్రాలలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు. 10 రాష్ట్రాలలో ఒక ముస్లిం ఉన్నారు కానీ, ఆ ఒక్కరూ ఉన్నది అల్పసంఖ్యాక వ్యవహారాలకు ఇన్ఛార్జిగా మాత్రమే!ఇంకా చెప్పాలంటే, అధికార బీజేపీ పార్టీకి లోక్సభలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు. 20 శాతం ముస్లింలు ఉన్న ఉత్తర ప్రదేశ్లో ఆ పార్టీకి శాసన సభలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. 2017లో కూడా అంతే. గుజరాత్లో బీజేపీ 1998 నుండి లోక్సభ ఎన్నికల్లో గానీ, విధాన సభ ఎన్నికల్లో కానీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. రాష్ట్రంలో 9 శాతం మంది ముస్లింలే అయినప్పటికీ ఒక పావు శతాబ్దం నుంచీ ఆ పార్టీ ముస్లిములతో ఉద్దేశపూర్వకమైన దూరాన్ని పాటిస్తోంది. మనం నేర్చుకోవలసిన చాలా భిన్నమైన రెండో పాఠం కూడా ఉంది. మీరు మీ పార్టీని ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయం వైపు నడిపించినప్పుడు మీ స్పందన ఎలా ఉండాలన్నది. బ్రిటన్లో అయితే రిషీ సునాక్ రాజీనామా చేశారు. 12 గంటలు గడవక ముందే ఆయన అలా చేశారు. నిజానికి ఫలితాలింకా పూర్తిగా వెల్లడవక ముందే కన్జర్వేటర్లు తాము తిరిగి అధికారంలోకి రావాలంటే తామెలాంటి పార్టీగా ఉండాలన్న దానిపై బహిరంగంగా చర్చించటం ప్రారంభించారు. రానున్న వారాల్లో, నెలల్లో ఆ చర్చ మరింత తీవ్రతరం అవుతుంది. మొత్తం దేశం అందులో పాల్గొంటుంది. మీడియా ప్రశ్నిస్తుంది. రెచ్చగొడుతుంది. ఎంపీలు తగాదా పడతారు. వాదోపవాదాలు జరుగుతాయి. ఆశావహులు ముందుకు వస్తారు. వెనక్కు తగ్గుతారు. అనేకమంది వ్యక్తిగత ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. పార్టీకి అది ఇబ్బందికరమైన పరిస్థితిగా పరిణమిస్తుంది. అయితే చివరికి ఒక కొత్త పార్టీ ఆవిర్భవిస్తుంది. ఇప్పుడొకసారి, 2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో కుప్పకూలి పోయాక ఏం జరిగిందో చూద్దాం. ఎవరూ రాజీనామా చేయలేదు. పార్టీ తన భవిష్యత్తు గురించి చర్చించలేదు. సోనియా గాంధీ మరో మూడు సంవత్సరాలు అధ్యక్షురాలిగా కొనసాగి, చివరికి తన కుమారుడికి మార్గం ఏర్పరిచారు. గాంధీల కుటుంబానికి వెలుపలి వ్యక్తిని అధ్యక్షుడిని చేసే ఎన్నిక 2022 వరకు జరగలేదు. అప్పుడు కూడా శశిథరూర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. పదేళ్ల తర్వాత ఈ రోజుకు కూడా ఆ పార్టీ గాంధీల గట్టి నియంత్రణలోనే ఉంది. మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడే కావచ్చు, కానీ రాహులే కీలకమైన వ్యక్తి. సోనియా గాంధీ వార్ధక్యంలో ఉన్నా, అస్వస్థతతో ఉంటున్నా, పార్లమెంటులో మాట్లాడేందుకు అనాసక్తతను కనబరుస్తున్నా కూడా సోనియానే పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. మూడో పాఠం కూడా ఉంది కానీ నేను దానిని క్లుప్తంగా మాత్రమే ప్రస్తావిస్తాను. సునాక్ రాజీనామా చేసేందుకు ప్రధాని అధికారిక వాహనంలో బకింగ్హామ్ ప్యాలెస్కు వెళ్లారు. రాజీనామా అనంతరం ప్రైవేటు వాహనంలో ప్యాలెస్ పక్క ద్వారం నుండి బయటికి నిష్క్రమించారు. ఒక గంట తర్వాత కొత్తగా ఎన్నికైన ప్రధాని స్టార్మర్ ప్రతిపక్ష నాయకుడి కారులో అక్కడికి వచ్చారు. ప్రధాన మంత్రిగా తన నియామకం జరిగాక ప్రధాని అధికారిక వాహనం లిమజీన్ కారులో 10, డౌనింగ్ స్ట్రీట్కు వెళ్లారు. ఆయన అక్కడికి చేరుకునే సమయానికి సునాక్ కుటుంబానికి చెందిన వస్తువుల్ని ప్యాక్ చేసి, తరలించారు. 10 డౌనింగ్ స్ట్రీట్ కొత్త ప్రభుత్వాధినేతకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ఇదంతా కూడా ఫలితాలు స్పష్టమైన కొద్ది గంటల్లోనే జరిగింది. వైభవోపేతమైన ప్రమాణ స్వీకారోత్సవం కోసం రాజ్యాంగ ప్రక్రియకు వాళ్లేమీ ఐదు రోజుల విరామం ఏమీ ఇవ్వలేదు. ఎన్నికలు ముగియటంతోనే పాలన ప్రారంభమై పోయింది. ప్రపంచంలోని కొత్త ప్రధానులందరూ వెంటనే పని మొదలు పెడతామని చెప్పినా, వాస్తవానికి బ్రిటన్ మాత్రమే ఆ పని చేయగలిగింది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
British Parliament Election 2024: ఆ డ్రెస్సేంటి?
లండన్: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీ నేత రిషి సునాక్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లండన్లోని తన అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ గుమ్మం ఎదుట మీడియాతో మాట్లాడారు. ప్రధానిగా చివరి మాటలు చెప్పేసి వెళ్లిపోయారు. ఆయన భార్య అక్షతా మూర్తి వ్యవహారమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమెను విమర్శిస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. జోకులు సైతం విసురుతున్నారు. ఆమె ధరించిన డ్రెస్సు ధరపై కూడా చర్చ జరుగుతోంది. రిషి సునాక్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్షతా మూర్తి ఆయన వెనుకే గొడుగు పట్టుకొని నిల్చున్నారు. నీలం, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన నిలువు, అడ్డం చారల డ్రెస్సును ధరించారు. ఈ డ్రెస్సు చాలామందికి నచ్చలేదు. ఆ సందర్భానికి అలాంటి వ్రస్తాలు నప్పలేదని అంటున్నారు. చూడడానికి ఎబ్బెట్టుగా ఉందని చెబుతున్నారు. డెస్సుపై క్యూఆర్ కోడ్ మాదిరిగా ఆ చారలేంటి అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అక్షతా మూర్తి డెస్సు ఖరీదు 395 పౌండ్లు(రూ.42,000). రిషి సునాక్ వెనుక ఆమె అలా గొడుగు పట్టుకొని నిల్చోవడం అస్సలు బాగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అక్షతా మూర్తి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, భారత రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి దంపతుల కుమార్తె అనే సంగతి తెలిసిందే. -
స్వరం మార్చిన బ్రిటన్!
జనాభాపరంగా చూస్తే బ్రిటన్ దేశం ఇంచుమించుగా మన కర్ణాటక రాష్ట్రంతో సమానం. కానీ ఒకప్పుడు రవి అస్తమించనంత మేర విశాల భూభాగాలను తన సింహాసన ఛత్ర ఛాయలోకి తెచ్చుకున్న దేశం బ్రిటన్. ఈ ఘనత (?) న భూతో న భవిష్యతి. భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యాలను స్థాపించిన మౌర్య, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోని భూఖండాల కంటే బ్రిటిష్ సామ్రాజ్యం తొమ్మిది, పది రెట్లు పెద్దది. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్లు మనదేశాన్ని కూడా రెండు శతాబ్దాలు పాలించి పీడించి దేశ సంస్కృతిపై బలమైన ముద్రనే వేశారు. కనుక బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలపై భారతీయులు ఆసక్తి చూపడం చాలా సహజం.పైపెచ్చు నిన్నటి దాకా ప్రధానిగా ఉన్న రిషి సునాక్ భారతీయ మూలాలున్న వ్యక్తి. భారత జాతీయతనూ, హిందూ మతాన్నీ పర్యాయపదాలుగా మార్చుకున్న మన ఎగువ మధ్యతరగతి శిష్ట వర్గాలకు సునాక్ మరింత ప్రీతిపాత్రుడు. ఆయన కుటుంబం టెన్ డౌనింగ్ స్ట్రీట్ వాకిట్లో దీపావళి కాకరపువ్వొత్తులు కాలిస్తే మనవాళ్లు పులకించిపోవడం కూడా తాజా జ్ఞాపకమే! మన ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి, ఆయన సతీమణి – మోటివేషనల్ స్పీకర్ హోదాలో రాజ్యసభలో అడుగుపెట్టిన సుధామూర్తిల ఏకైక అల్లుడు. అందువల్ల సునాక్ మళ్లీ ప్రధాని అవుతాడా లేదా అనే ఉత్కంఠ భారతీయులకు ఉండటంలో ఆశ్చర్యం లేదు.సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. అయితే ఆయన మాత్రం తన నియోజకవర్గం నుంచి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. భారతీయ మూలాలున్న వ్యక్తులు 29 మంది ఈ ఎన్నికల్లో గెలుపొందారు. సునాక్ మళ్లీ ప్రధాని కానందుకు బాధపడే భారతీయులెవరైనా ఉంటే వారికి ఈ సంఖ్య పెద్ద ఊరట. ఇటీవల జరిగిన ఇండియన్ పార్లమెంట్ దిగువ సభ ఎన్నికల్లో గెలిచిన ముస్లిం అభ్యర్థుల కంటే బ్రిటన్ దిగువ సభకు ఎక్కువమంది భారతీయులు ఎన్నికయ్యారు.భారతదేశంతో సంబంధాల విషయంలో కన్సర్వేటివ్, లేబర్ పార్టీల మధ్యనున్న ప్రధాన తేడా కశ్మీర్ అంశంపైనే! ఈ అంశంపై రెఫరెండం జరగాలన్నది లేబర్ పార్టీ పాత విధానం. అయితే ఇప్పుడు అది పెద్దగా పట్టింపులకు పోవడం లేదంటున్నారు. అట్లాగే సునాక్ హయాంలో రెండు దేశాల మధ్య చర్చకు వచ్చిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) పట్ల కొత్త ప్రధాని కెయిర్ స్టార్మర్ కూడా ఆసక్తిగానే ఉన్నట్టు సమాచారం. సునాక్ ప్రధాని కాలేదన్న లోటును ఎక్కువమంది భారతీయ సంతతివారు ఎన్నికల్లో గెలిచి భర్తీ చేశారు. కనుక భారత్కు సంబంధించినంత వరకు బ్రిటన్లో జరిగిన అధికార బదిలీ ఎటువంటి మార్పులకూ దారితీయకపోవచ్చు.స్టార్మర్ గెలుపు ఇండియా విషయంలో యథాతథ స్థితి కొనసాగింపే కావచ్చు. కానీ ప్రపంచ రాజకీయ వేదికపై ఓ పెద్ద మార్పు. ఒక గొప్ప ఊరట. మితవాద (రైటిస్టు) భావాల ఉప్పెన పాన్ అట్లాంటిక్ దేశాల రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో ఒక మధ్యేవాద – వామపక్షంగా గుర్తింపు పొందిన లేబర్ పార్టీ బ్రిటన్లో ఆ ఉప్పెనను తట్టుకొని నిలవడం, భారీ విజయాన్ని నమోదు చేయడం విశేషంగానే చెప్పుకోవాలి. ఈమధ్యనే జరిగిన యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎన్నికల్లో మితవాద పార్టీలు వాటి తఢాఖాను చూపెట్టాయి. ఇటలీ, నెదర్లాండ్స్ ఎన్నికల్లో మితవాద శక్తులు విజయం సాధించాయి. ఫాసిస్టు నేత బెనిటో ముస్సోలినికి అసలు సిసలైన సైద్ధాంతిక వారసురాలు జోర్జా మెలోని ఇటలీ అధ్యక్షురాలయ్యారు. ఇండియన్ రైటిస్టు నాయకుడు మోడీతో సెల్ఫీలు దిగి ‘మెలోడీ’ పేరుతో ఆమె ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే!ఈ ఏడాది చివర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రపంచ మితవాద శక్తులకు సూపర్ బాస్ లాంటి డోనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. బ్రిటన్ ఎన్నికల్లో కరుడుగట్టిన మితవాద నాయకుడు నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని ‘రిఫార్మ్ యూకే’ పార్టీ ఎన్నడూ లేని విధంగా 14 శాతం ఓట్లను సాధించింది. ఎన్నో దండయాత్రల తర్వాత ఫరాజ్ పార్లమెంట్కు ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఫరాజ్ను డొనాల్డ్ ట్రంప్ అభినందనల్లో ముంచెత్తడాన్ని చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా మితవాద శక్తుల ఐక్యత అల్లుకుంటున్న సంగతి బోధపడుతుంది. ట్రంప్కు అనుకూలంగా మన ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం చేసిపెట్టిన వైనాన్ని కూడా ఈ కోణంలోంచే చూడాలి. ఫ్రాన్స్లో కూడా ఒక మితవాద సునామీ వేగంగా సన్నద్ధమవుతున్న సూచనలు వెలువడుతున్నాయి. మెలైన్ లీపెన్ నాయకత్వంలోని ఆర్ఎన్ (నేషనల్ ర్యాలీ) అనే పార్టీ అనూహ్యంగా బలం పుంజుకుంటున్నది. ఆమె గతంలో మూడుసార్లు ఫ్రెంచి అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయారు. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో 32 శాతం ఓట్లు సాధించి లీపెన్ పార్టీ అధ్యక్షుడు... మేక్రాన్ అలయెన్స్ను మూడో స్థానానికి నెట్టివేశారు. దీంతో అప్రమత్తమైన మేక్రాన్ పార్లమెంట్ ఎన్నికలకు ఇంకో మూడేళ్ల గడువు ఉన్నప్పటికీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి.జూన్ 30న తొలి రౌండ్ జరిగింది. మితవాద ఆర్ఎన్ పార్టీకి 34 శాతం ఓట్లు వచ్చాయి. వామపక్ష కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ 28 శాతం ఓట్లను సాధించింది. మేక్రాన్ నాయకత్వంలోని మధ్యేవాద కూటమికి 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మొదటి రౌండ్ ఎన్నికల్లో 12.5 శాతం (ఎనిమిదో వంతు) ఓట్ల కంటే తక్కువ వచ్చిన వాళ్లను తొలగిస్తారు. ఈ ఆదివారం నాడు రెండో రౌండ్ పోలింగ్ జరుగుతున్నది. తొలి రౌండ్లో ప్రజానాడిని గమనించిన మధ్యేవాద – వామపక్ష కూటములు ఈ ఎన్నికల్లో ఏకమయ్యాయి. ఓట్ల బదిలీ జరిగి మితవాద శక్తులను ఈ కూటమి ఓడిస్తుందా, లేదా అన్న సంగతి తేలిపోనున్నది. ఒకవేళ ఆర్ఎన్ పార్టీయే పైచేయి సాధిస్తే మేక్రాన్ అధ్యక్ష పాలనకు ఒడుదొడుకులు తప్పవు.మేక్రాన్ అధ్యక్ష పదవికి ఇంకో మూడేళ్ల గడువున్నది. సాంకేతికంగా చూస్తే ఆయన తప్పుకోవలసిన అవసరం ఉండదు. మిగిలిన యూరప్ దేశాలతో పోలిస్తే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడంలో మేక్రాన్ సాపేక్షంగా విజయం సాధించినట్టే లెక్క. రాజకీయంగా కూడా మేక్రాన్ మధ్యేవాద మితవాదే (రైట్ ఆఫ్ ది సెంటర్). ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి కొనసాగుతున్న వలసలను నిరోధించడంలో ప్రభుత్వాధినేతలు విఫలమవడం పట్ల యూరప్ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతున్నది. అన్ని దేశాల్లోనూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కవల పిల్లల్లా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక కారణాలు మితవాద రాజకీయ శక్తులకు ఆక్సిజన్ మాదిరిగా పనిచేస్తున్నాయి.వలసల పట్ల స్థానిక ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని తగ్గించడానికి రిషి సునాక్ కొంత ప్రయత్నం చేశారు. అక్రమ వలసదారులను గుర్తించి, వారిని మధ్య ఆఫ్రికాలోని రువాండా దేశానికి తరలించి, పునరావాస ఏర్పాట్లు చేయాలని భావించారు. ఈ మేరకు రువాండాతో బ్రిటన్కు ఒప్పందం కూడా కుదిరింది కానీ ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. యూరప్ దేశాలు ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యలకు వలసలే కారణమనే వాదాన్ని కూడా పలువురు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని తరాల ముందే వలస వచ్చి ఆ యా దేశాల ఆర్థిక, సాంస్కృతిక అభ్యున్నతిలో భాగస్వాములైన వారిపై కూడా వివక్షాపూరిత దృక్కులు ప్రసరిస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది.ప్రస్తుతం జరుగుతున్న ఫుట్బాల్ యూరో కప్ పోటీల ప్రారంభం ముందు ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కిలియన్ బప్పే చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ‘‘మితవాద రాజకీయ భావాలు అధికారపు వాకిట్లోకి వచ్చి కూర్చున్నాయి. మా విలువల్నీ, మనోభావాల్నీ గౌరవించని దేశం తరఫున ఆడేందుకు మేం సిద్ధంగా లేము’’. ఆఫ్రో – యూరోపియన్ల మనోభావాలను ఆయన బలంగా వెళ్లగక్కారు. అక్రమ వలసదారులు వస్తున్నారని యూరప్ ప్రజలు నిందిస్తున్న దేశాలన్నీ ఒకప్పుడు యూరప్ దేశాల వలసలే! వంద నుంచి రెండొందల ఏళ్లపాటు యూరోపియన్లు ఈ దేశాల వనరుల్ని యథేచ్ఛగా దోపిడీ చేశారు. ఆ దేశాల ఆర్థిక మూలుగల్ని పీల్చి పిప్పి చేశారు. ఫలితంగా వలస దేశాల అభివృద్ధి చరిత్ర శతాబ్దాల పర్యంతం ఘనీభవించిపోయింది. వలస దేశాల సంపదతోనే యూరప్ దేశాలు చాలా కాలంపాటు వైభవోజ్జ్వల అధ్యాయాలను లిఖించుకున్నాయి. ఇప్పుడు ఈ దేశాల్లోకి వలస వస్తున్న ప్రజలకు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం లేదు. పొట్టకూటి కోసం వారు వస్తున్నారు. ప్రతిభకు తగిన గుర్తింపు కోసం వస్తున్నారు. ఉన్నత విద్య కోసం, అవకాశాల కోసం వారు వస్తున్నారు. వలసలపై యూరప్ దేశాల మితవాదుల వైఖరి ఇట్లా వుంటే... అమెరికా మితవాదుల ధోరణి మరింత ఆశ్చర్యకరంగా ఉన్నది. అమెరికా నిర్మాణానికి వలసలే పునాది. అక్కడి భూమి పుత్రుడెవరు మిగిలారు అమెరికాలో! వాళ్లందరినీ యూరప్ వలసదారులు ఎప్పుడో వేటాడి నిర్మూలించారు. యూరప్ దేశాల ఆశాజీవులు, ఆఫ్రికా నుంచి బంధించి తెచ్చిన బానిసల సహాయంతో పెరిగిన అమెరికా ఒక వలసదారుల దేశం. వలసలకు కేరాఫ్ అడ్రస్. ఆ దేశంలోని ట్రంపిస్టులు కూడా వలసలకు వ్యతిరేకంగా మాట్లాడటం న్యూయార్క్ నగరంలోని స్వేచ్ఛా ప్రతిమ పాదపీఠిక మీద చెక్కిన ఎమ్మా లాజరస్ కవితా పంక్తుల స్ఫూర్తికి విరుద్ధం. ఆ స్వేచ్ఛా ప్రతిమ వలస జీవులను రారమ్మని పిలుస్తున్నట్టుగా ఆ కవితా పంక్తులు ఉంటాయి. ‘‘డస్సిపోయిన మీ జనాలనూ, మీ నిరుపేదలనూ, / స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు తహతహలాడుతున్న మీ సకల కూటములనూ, / మీ తీరాలలో కిక్కిరిసిన తిరస్కృతులనూ, / నిరాశ్రయులనూ, తుపానుల్లో చిక్కుకుపోయిన అభాగ్యులనూ నా దరికి పంపండి. / బంగారు ద్వారం పక్కన దారిదీపాన్ని పైకెత్తి నిలుచున్నాను.’’ – (తెలుగు అనువాదం).మితవాద శక్తుల ప్రభంజనం నేపథ్యంలో బ్రిటన్లో లేబర్ పార్టీ గెలుపునకు చాలా ప్రాధాన్యం ఉన్నది. ప్రపంచవ్యాపితంగా వున్న మితవాద రాజకీయ పక్షాలన్నిటికీ మతవాద, జాతివాద సారూప్యతలే కాకుండా ఆర్థిక విధానాల సారూప్యతలు కూడా ఉన్నాయి. కొంతమందే సంపద సృష్టించి, దాన్ని వారే సొంతం చేసుకునే ఆర్థిక కార్యక్రమం వారిది. బ్రిటన్ కొత్త ప్రధాని కెయిర్ స్టార్మర్ భిన్నమైన గళాన్ని ఎన్నికలకు ముందే వినిపించారు. కార్మిక వర్గం కోసం సంపద సృష్టించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్య సేవలను ప్రధాన ఎజెండాగా ప్రకటించారు. న్యాయమైన ఈ ఎజెండాకు బ్రిటన్ ప్రజలు జైకొట్టడం ఆహ్వానించదగిన పరిణామం. వలసదారుడిని ప్రధానిగా చేసిన పార్టీని శిక్షించడానికే ప్రజలు లేబర్ పార్టీని గెలిపించారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇది బ్రిటన్ ప్రజల విజ్ఞతనూ, చైతన్యాన్నీ శంకించడమే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బ్రిటన్ ఎన్నికల్లో భారతీయ పరిమళం
లండన్: భారతీయమూలాలున్న వ్యక్తులు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి విదేశంలోనూ తమ సత్తా చాటారు. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో 28 మంది భారతీయసంతతి నేతలు విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ ఓడినా మాజీ ప్రధాని, భారతీయ మూలాలున్న రిషిసునాక్ తన రిచ్మండ్ నార్త్ అలెర్టాన్ నియోజకవర్గంలో గెలిచారు. ఈసారి అన్ని పార్టీల తరఫున 107 మంది బ్రిటిష్ ఇండియన్లు బరిలో దిగగా 28 మంది గెలిచారు! ఇవి రెండూ రికార్డులే. కేరళ నుంచి పంజాబ్దాకా పలు రాష్ట్రాల నుంచి వలసవచ్చిన భారతీయ సంతతి వ్యక్తులు ఎక్కువగా ఎన్నికల్లో పోటీచేశారు. విజేతల్లో ఎక్కువ మంది లేబర్ పార్టీ అభ్యర్థులు కావడం విశేషం!గెలిచిన మహిళా మంత్రులుకన్జర్వేటివ్ పార్టీ నేతలు, మాజీ హోం శాఖ మహిళా మంత్రులు సుయెల్లా బ్రేవర్మ్యాన్, ప్రీతిపటేల్ గెలిచారు. ఎసెక్స్ పరిధిలోని వీథెమ్ నియోజకవర్గంలో ప్రీతి, ఫేర్హామ్ వాటరలూవిల్లే నియోజకవర్గంలో బ్రేవర్మ్యాన్ విజయం సాధించారు. లీసిస్టర్లో పుట్టిపెరిగిన శివానీ రాజా కన్జర్వేటివ్ అభ్యర్థినిగా లీసిస్టర్ ఈస్ట్ స్థానంలో గెలిచారు. పంజాబ్ నుంచి వలసవచ్చిన గగన్ మోహేంద్ర కన్జర్వేటివ్ నేతగా మరోసారి హార్ట్ఫోర్డ్షైర్ నుంచి జయకేతనం ఎగరేశారు. ఈయన తాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. గోవా నుంచి వలసవచ్చిన క్లెయిర్ కాటిన్హో కన్జర్వేటివ్ నాయకురాలిగా ఈస్ట్ సర్రే నుంచి విజయం సాధించారు. 12 ఏళ్ల వయసులో కుటుంబంతో కలిసి బ్రిటన్కు వలసవచ్చిన కనిష్క నారాయణ్ లేబర్ పార్టీ నేతగా బరిలో దిగి వేల్స్ స్థానంలో గెలిచారు. ఈయన గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా డేవిడ్ కామెరూన్, లిజ్ ట్రస్ ప్రభుత్వాల్లో పనిచేశారు. 13 ఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్న లేబర్ పార్టీ నాయకురాలు సీమా మల్హోత్రా ఫెల్తామ్ హీస్టన్ నుంచి గెలిచారు. గోవా మూలాలున్న లేబర్ నేత వలేరీ వజ్ మరోసారి వాల్సేల్ బ్లాక్స్విచ్ నుంచి విజయం సాధించారు. పంజాబీ సిక్కు కుటుంబానికి చెందిన నాదియా ఎడిత్ విట్టోమే లేబర్ పార్టీ తరఫున నాటింగ్హామ్ ఈస్ట్ నుంచి గెలుపొందారు. 2019లో 23 ఏళ్లవయసులోనే ఎంపీగా గెలిచిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్ నెలకొల్పారు. సిక్కు నాయకురాలు, లేబర్ పార్టీ నేత అయిన ప్రీతి కౌర్ గిల్ మరోసారి బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ నుంచి గెలిచారు. పార్లమెంట్లో తొలి సిక్కు మహిళా ఎంపీగా నాడు చరిత్ర సృష్టించారు. బ్యాగీ శంకర్ (డర్బీ సౌత్), హర్ప్రీత్ ఉప్పల్ (హడర్స్ఫీల్డ్), సోనియా కుమార్ (డడ్లే) తదితరులూ విజయం సాధించారు. -
UK Election Result 2024: ఇక స్టార్మర్ శకం
లండన్: అంతా ఊహించిందే జరిగింది. గురువారం జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. హౌజ్ ఆఫ్ కామన్స్లో 650 స్థానాలకు గాను ఏకంగా 412 సీట్లు కైవసం చేసుకుంది. ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఏకంగా 252 స్థానాలు కోల్పోయింది! ఇది ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయం. లేబర్ పార్టీకి 33.7 శాతం రాగా కన్జర్వేటివ్లకు 23.7 శాతమే లభించాయి. శుక్రవారం మధ్యాహా్ననికల్లా ఫలితాలు వెలువడటం, సునాక్ రాజీనామా చేయడం, లేబర్ పార్టీని విజయపథంలో నడిపిన కియర్ స్టార్మర్ దేశ 58వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. దాంతో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెర పడింది. భారత మూలాలున్న తొలి ప్రధాని సునాక్ పాలన కూడా 20 నెలలకే ముగిసింది. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ స్థానం నుంచి ఆయన ఘనవిజయం సాధించినా మాజీ ప్రధాని లిజ్ ట్రస్తో పాటు గ్రాంట్ షేప్స్, పెన్నీ మోర్డంట్, జాకబ్ రీస్ మాగ్ వంటి పలువురు కన్జర్వేటివ్ హేమాహేమీలు ఓటమి చవిచూశారు. దాంతో ఫలితాల అనంతరం మాట్లాడుతూ 44 ఏళ్ల సునాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘లేబర్ పార్టీకి, స్టార్మర్కు అభినందనలు. ఘోర ఓటమి చవిచూసిన నా కేబినెట్ సహచరులకు సానుభూతి. నాయకునిగా వారిని గెలిపించుకోలేకపోయినందుకు క్షమాపణలు. ప్రజల అంచనాలు అందుకోలేకపోయినందుకు వారికి కూడా క్షమాపణలు’’ అన్నారు. ఓటమికి బాధ్యత వహిస్తూ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సునాక్ ప్రకటించారు. అయితే ప్రధానిగా తన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేశానన్నారు. ప్రధానిగా కుటుంబంతో కలిసి అధికార నివాసంలో జరుపుకున్న దీపావళి వేడుకలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘మా తాతల కాలంలో చేతిలో పెద్దగా ఏమీ లేకుండా ఇంగ్లండ్ వచి్చన కుటుంబం మాది. అలాంటిది రెండే తరాల్లో నేను ప్రధాని కాగలిగాను. నా పిల్లలు డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై దీపావళి ప్రమిదలు వెలిగించగలిగారు. అదీ దేశ గొప్పదనం’’ అంటూ కొనియాడారు. ‘‘నా వారసునిగా అత్యంత సవాళ్లమయమైన బాధ్యతను స్వీకరిస్తున్న నూతన ప్రధానికి 10, డౌనింగ్ స్ట్రీట్కు హార్దిక స్వాగతం. నూతన బాధ్యతల్లో ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ఆయన విజయమే మనందరి విజయం. ప్రచారంలో విమర్శలు గుప్పించుకున్నా స్టార్మర్ చాలా మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగానో అభిమానిస్తాను’’ అన్నారు. అనంతరం రాజు చార్లెస్–3కు సునాక్ రాజీనామా సమర్పించారు. తర్వాత భార్య అక్షత, పిల్లలతో కలిసి అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్టార్మర్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.దేశాన్ని పునర్నిర్మిస్తాం : స్టార్మర్ ప్రజలు మార్పు కోసం నిర్ణాయక రీతిలో ఓటేశారని 61 ఏళ్ల స్టార్మర్ అన్నారు. శుక్రవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన తొలి ప్రసంగం చేశారు. ‘‘ప్రజల త్యాగాలకు, ప్రతిగా వారికందుతున్న సేవలకు మధ్య అంతరం ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తు పట్ల వారిలో మిగిలేది నిరాశా నిస్పృహలే. ముందు వారిలో విశ్వాసాన్ని పాదుగొల్పాలి. ఇది మాటలతో కాదు. చేతల్లోనే చూపాలి. మనముందు భారీ లక్ష్యాలున్నాయి. కనుక నేటినుంచే పని మొదలవుతుంది’’ అన్నారు. ‘‘సేవే ఏకైక లక్ష్యంగా లేబర్ పార్టీని పునర్ వ్యవస్థీకరించాం. దేశమే ముందు, ఆ తర్వాతే పార్టీ అంటూ సమూలంగా మెరుగుపరిచి ప్రజల ముందుంచాం. అలాగే దేశాన్ని కూడా అన్ని రంగాల్లోనూ బలోపేతం చేసి చూపిస్తాం. ‘సేవల ప్రభుత్వం’గా పని చేస్తాం. లేబర్ పార్టీకి ఓటేయని వారికి కూడా అంతే చిత్తశుద్ధితో సేవ చేస్తాం. ప్రజలందరి నమ్మకాన్నీ నిలబెట్టుకుంటాం. బ్రిటన్ను పూర్తిస్థాయిలో పునర్నరి్మస్తాం’’ అని ప్రకటించారు. సునాక్పై ప్రశంసల జల్లు ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారంటూ స్టార్మర్ ప్రశంసలు కురిపించడం విశేషం! 20 నెలల పాలనలో దేశ ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధితో ఎంతగానో కృషి చేశారంటూ కొనియాడారు. ‘‘ఆసియా మూలాలున్న తొలి బ్రిటిష్ ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారు. ఆ ఘనతలను ఏ మాత్రం తక్కువ చేసి చూడలేం. ప్రధానిగా ఆయన పనితీరుకు జోహార్లు’’ అన్నారు. ఫలితాలు వెలువడగానే స్టార్మర్ బకింగ్హాం రాజ ప్రాసాదానికి వెళ్లి రాజు చార్లెస్–3తో భేటీ అయ్యారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా స్టార్మర్ను రాజు లాంఛనంగా ఆహ్వానించారు. కేబినెట్లోకి లీసా నందిస్టార్మర్ మంత్రివర్గంలో భారతీయ మూలాలున్న 44 ఏళ్ల లీసా నందికి చోటు దక్కింది. ఆమెను సాంస్కృతిక, క్రీడా, సమాచార ప్రసార మంత్రిగా నియమించారు. విగాన్ నుంచి ఆమె వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లీసా తండ్రి దీపక్ విద్యావేత్త. 1950ల్లో బ్రిటన్ వెళ్లారు. అక్కడి అమ్మాయిని పెళ్లాడారు. జాతుల సయోధ్యకు బ్రిటన్లో గుర్తింపు పొందారు. లీసా 2020లో లేబర్ పార్టీ నాయకత్వం కోసం స్టార్మర్తో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. -
యూకే ఎన్నికల్లో గెలిచిన కైర్ స్టార్మర్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖతాలో ఒక పోస్ట్ పెట్టారు.‘యూకే సార్వత్రిక ఎన్నికలలో అపూర్వ విజయం సాధించిన కీర్ స్టార్మర్కు హృదయపూర్వక అభినందనలు. భారత్-యూకే మధ్య పరస్పర వృద్ధి, శ్రేయస్సును పెంపొందిస్తూ అన్ని రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మీ సానుకూల, నిర్మాణాత్మక సహకారం కోసం నేను ఎదురు చూస్తున్నాను.’ అని పేర్కొన్నారు.అదేవిధంగా ఎన్నికల్లో ఓటమి పాలైన కన్జర్వేటివ్ పార్టీ నేత, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు సైతం మోదీ తన సందేశాన్ని అదించారు. సునాక్ అద్బుతమైన నాయకత్వం, భారత్-యూకే సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.కాగా యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది. Heartiest congratulations and best wishes to @Keir_Starmer on the remarkable victory in the UK general elections. I look forward to our positive and constructive collaboration to further strengthen the India-UK Comprehensive Strategic Partnership in all areas, fostering mutual…— Narendra Modi (@narendramodi) July 5, 2024 -
యూకే ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బ్రేవర్మాన్ సంచలనం
2024 యూకే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన, మాజీ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ సంచలనం రేపారు. కన్జర్వేటివ్ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకున్నప్పటికీ తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఫేర్హామ్ అండ్ వాటర్లూవిల్లే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. లేబర్కు చెందిన గెమ్మా ఫర్నివాల్పై 6,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2015 నుండి ఆమె ఫారెహామ్కు ఎంపీగా ఉన్నారు . అక్టోబర్ 2022-నవంబర్ 2023 వరకు హోం సెక్రటరీగా పనిచేశారు.తన విజయం గత 14 సంవత్సరాలుగా కన్జర్వేటివ్ పార్టీ పనితీరుపై ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పారు. వాగ్దానాలను నిలబెట్టు కోలేకపోయిందనీ, కన్సర్వేటివ్ పార్టీ ప్రజల్ని నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. పార్టీ తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.తాజా ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ అధికారాన్నిచేజిక్కించుకుంది. 10 లక్షల మందికి పైగా భారత సంతతి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో 107 మంది బ్రిటీష్ ఇండియన్లు పోటీ చేశారు. 2019లో ఈ సంఖ్య 63 కాగా, అందులో 15 మంది నెగ్గారు. -
బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్.. 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఆసక్తికర నేపథ్యం
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. 650 సీట్లున్న పార్లమెంట్లో లేబర్ పార్టీ ఇప్పటివరకు 400 సీట్లకు పైగా గెల్చుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 326 సీట్లు వస్తే సరిపోతుంది. దీంతో లేబర్ పార్టీకి చెందిన నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.కీర్ స్టార్మర్ మాజీ మానవ హక్కుల న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మ్యూజీషియన్ కూడా. ఆయన వయసు ప్రస్తుతం 61 ఏళ్లు. గత 50 ఏళ్లలో ఈ వయసులో బ్రిటన్ ప్రధానమంత్రి అయిన వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. అంతేగాక పార్లమెంట్కు ఎన్నికైన తొమ్మిదేళ్లలోనే ప్రధానమంత్రి పదవి చేపడుతుండటం మరో విశేషం.సెప్టెంబరు 2, 1962న జన్మించిన కీర్.. రోడ్నీ స్టార్మర్, లండన్ శివార్లలో ఒక ఇరుకైన ఇంట్లో బాల్యాన్ని గడిపాడు. అతనికి ముగ్గురు తోబుట్టువులు. లీడ్స్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో న్యాయ విద్యను అభ్యసించాడు. అనంతరం వామపక్ష కారణాలు, డిఫెండింగ్ ట్రేడ్ యూనియన్లు, మెక్డొనాల్డ్స్ వ్యతిరేక కార్యకర్తలు, విదేశాల్లోని ఖైదీల మరణ శిక్షలు వంటి వాటిపై దృష్టి సారించాడు. అనంతరం మానవ హక్కుల న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడుతొలుత 2003లో ఉత్తర ఐర్లాండ్లోని పోలీసులు మానవ హక్కుల చట్టంలో చిన్న ఉద్యోగంలో చేరాడు. అయిదేళ్ల తర్వాత లేబర్ పార్టీకి చెందిన గోర్డాన్ బ్రౌన్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్కు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్గా నియమితుడయ్యాడు.2008 నుంచి 2013 మధ్య వరకు ఎంపీలు తమ ఖర్చులను దుర్వినియోగం చేయడం, జర్నలిస్టుల ఫోన్ హ్యాకింగ్, గ్లండ్లో యువత అల్లర్ల వంటి విచారణలను ఆయన పర్యవేక్షించాడు. తన పనితనంతో క్వీన్ ఎలిజబెత్ 2 చేత నైట్ ర్యాంక్ బిరుదు పొందారు. 50 ఏళ్ల వయసులో కీర్ స్టామర్ రాజకీయాల్లోకి రావడం గమనార్హం. 2015 నార్త్ లండన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.స్టార్మర్కు వివాహం కాగా భార్య పేరు విక్టోరియా. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లల ఉన్నారు. శుక్రవారం వరకు పనిలో నిమగ్నమయ్యే కీర్.. శని, ఆదివారాలు మాత్రం పూర్తిగా కుటుంబానికి కేటాయిస్తాడు.రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాద వృత్తిలో సుధీర్ఘకాలం కొనసాగారు. ఆయన ఆధునిక రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటారనే పేరు ఉంది. ఈ ఎన్నికల్లో బ్రిటన్లో రాజకీయాలను తిరిగి సేవలోకి తీసుకురావాలి.. పార్టీ కంటే దేశం ముందు అనే ప్రధాన నినాదాలతో ప్రచారంలో ముందుకు సాగారు. గత 14 ఏళ్లలో కన్జర్వేటివ్ పార్టీ అయిదుగురు ప్రధానులను మార్చిన ఉద్దేశంలో ఆయన ఈ నినాదాలను నడిపించారు.ప్రజలు మార్పును కోరుకుంటే వారు లేబర్ పార్టీకి ఓటు వేయాలని ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పారు. దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి మా పార్టీ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలి.2019 తర్వాత లేబర్ పార్టీ ప్రధాన నాయకుడిగా అవతరించిన కీర్.. తమ ప్రభుత్వం మొత్తం దృష్టి దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ ఆరోగ్య సేవపైనే ఉంటుందని చెప్పారు.కాగా యూకే పార్లమెంట్లో మొత్తం 650 సీట్లు ఉండగా 400కు పైగా మెజార్టీ స్థానాల్లో లేబర్ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. ఆపార్టీ చీఫ్ కీర్ స్టార్మర్ తన నియోజకవర్గం లండన్లోని హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్క్రాస్లో 18,884 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాను గెలిపించినందుకు నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తికి సేవ చేస్తానంటూ ఈ సందర్భంగా స్టార్మర్ ప్రకటించారు.ఇక రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ కేవలం 112 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. దీంతో 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి ముగింపు పడబోతుంది. భారత్- బ్రిటన్ మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి..లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్-యూకే సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. యూకే- భారత్ సంబంధాలను బలోపేత చేయడం తన విదేశాంగ విధానం ఎజెండాలో కీలక అంశమని గతంలో స్టార్మర్ పేర్కొన్నాడు. కశ్మీర్ వంటి సమస్యలపై లేబర్ పార్టీ వైఖరిని కూడా తెలియజేస్తూ.. భారత్తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), సాంకేతికత, భద్రత, విద్య, వాతావరణ మార్పులలో మెరుగైన ద్వైపాక్షిక సహకారానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్తో సంబంధాలను పెంచుకోవాలనే ఆశయంతో ఉన్నట్లు నొక్కిచెప్పారు. ఇక భారత్తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్ధతతో ఉన్నట్లు అతని మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు. కాగా గత రెండు ఏళ్లుగా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)పై భారతదేశం, బ్రిటన్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. -
ఘోర పరాజయంపై రిషి సునాక్ క్షమాపణలు
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం మొదలైన ఓట్ల లెక్కింపులో ప్రతిపక్ష లేబర్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. దాదాపు 300కు పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతుంది. భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకన్జర్వేటివ్ పార్టీ కేవలం 63 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. దీంతో బ్రిటన్ను 14 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి భంగపాటు ఖాయంగా మారింది. ఇక బ్రిటన్ ఎన్నికల్లో కన్వర్జేటివ్ పార్టీ ఓటమిని ప్రధాని రిషి సునాక్ అంగీకరించారు. రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలెర్టన్లో తన మద్దతుదారులను ఉద్దేశించి రిషి సునాక్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో కన్వర్జేటివ్ పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ఆయన దేశ ప్రజలను క్షమాపణలు కోరారు.‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్ స్టామర్కు అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం శాంతియుతంగా, సరైన పద్దతిలో చేతులు మారుతుంది. ఇది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది’ అని సునాక్ అన్నారు.ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్ (61) బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రి అవనున్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు వెలువడటంతో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మార్పు చెందిన లేబర్ పార్టీపై నమ్మకం ఉంచిన కార్యకర్తలు, ఓటర్లకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. -
యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విక్టరీ
లండన్: యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది. గురువారం యూకే హౌజ్ ఆఫ్ కామన్స్ 650 స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడగా.. ఆ వెంటనే కౌంటింగ్ మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచి ఫలితాలు వెల్లడయ్యాయి. ఊహించినట్లుగానే.. లేబర్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. లేబర్ పార్టీ 411 స్థానాల్లో నెగ్గి ఘన విజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ 119 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. లిబరల్ డెమోక్రట్స్ పార్టీ 71 స్థానాలు దక్కించుకుంది. సంబంధిత వార్త: 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎవరీ కీర్ స్టార్మర్ఇదిలా ఉంటే.. ఫలితాలు వెలువడ్డాక కాసేపటికే రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వాళ్లకు రిషి సునాక్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే యూకే కాబోయే ప్రధాని, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్కు అభినందనలు తెలియజేశారు. సంబంధిత వార్త: నన్ను క్షమించండి: రిషి సునాక్ఘోర పరాభవం నుంచి..2019 సార్వత్రిక ఎన్నికల్లో జెర్మీ కోర్బిన్ నేతృత్వంలో లేబర్ పార్టీ కేవలం 201 స్థానాలే గెల్చుకుంది. 1935 తర్వాత ఆ పార్టీ ఎదుర్కొన్న ఘోరమైన పరాభవం ఇదే. అదే సమయంలో బోరిస్ జాన్సన్ నేతృత్వంలో 365 స్థానాలు గెలిచి వరుసగా అధికారం కైవసం చేసుకుంది. అయితే 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని.. ఈసారి ఓటర్లు పక్కనపెట్టేశారు. లేబర్ పార్టీని ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించారు. వ్యతిరేకత ఇలా.. బ్రెగ్జిట్ తర్వాత మందగించిన ఆర్థిక వ్యవస్థ, అధికార పార్టీ కన్జర్వేటివ్ కుంభకోణాలు ప్రజారోగ్య వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనలో వైఫ్యలం, 14 ఏళ్ల పాలనలో ఐదుగురు ప్రధానుల్ని మార్చడం, వాళ్ల అనాలోచిత నిర్ణయాలు.. ఇలా కన్జర్వేటివ్ పార్టీ పట్ల జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ తర్వాత.. అనూహ్య పరిణామాల మధ్య బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టారు రిషి సునాక్. అయితే కన్జర్వేటివ్ పార్టీ ప్రజా వ్యతిరేకతను పసిగట్టి ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారాయన. అయినప్పటికీ ఫలితాలు వ్యతిరేకంగానే వచ్చాయి. Thank you, Holborn and St Pancras, for putting your trust in me again.Change begins right here. pic.twitter.com/XZfi5OIoyH— Keir Starmer (@Keir_Starmer) July 5, 2024 To the hundreds of Conservative candidates, thousands of volunteers and millions of voters:Thank you for your hard work, thank you for your support, and thank you for your vote. pic.twitter.com/GcgvI7bImI— Rishi Sunak (@RishiSunak) July 4, 2024 లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని సునాక్ ఎన్నికల ప్రచారం వర్కవుట్ కాలేదు. అదే సమయంలో.. తరచూ ప్రధానులు మారే అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని, దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని స్టార్మర్ ఓటర్లకు చేసిన విజ్ఞప్తి ఫలించింది. ఎగ్జిట్పోల్స్ నిజమయ్యాయి!యూకేలోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మొత్తం 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్ దిగువ సభ(హౌజ్ ఆఫ్ కామన్స్)లో ఏకంగా 410 స్థానాలు కీర్ స్మార్టర్ నేతృత్వంలో లేబర్ పార్టీ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తెలిపాయి. కన్జర్వేటివ్ కేవలం 131 స్థానాలకు పరిమితం కావొచ్చని తెలిపాయి. -
Britain general elections: బ్రిటన్లో ప్రశాంతంగా ఎన్నికలు
లండన్: పధ్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు యూకే పౌరులు చరమగీతం పాడనున్నారన్న విశ్లేషణల నడుమ బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పర్వం గురువారం ప్రశాంతంగా పూర్తయింది. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు, వలసల కట్టడిలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్న భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెల్సిందే. ఉదయాన్నే భార్య అక్షతామూర్తితో కలిసి సునాక్ నార్త్ఆలెర్టన్ సిటీ దగ్గర్లోని కిర్బీ సిగ్స్టన్ గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ‘మార్పు’ నినాదంతో ఎన్నికల్లో ఫేవరెట్గా నిలిచిన విపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ సైతం భార్య విక్టోరియాతో కలిసి ఉత్తర లండన్లోని క్యామ్డెన్ విల్లింగ్హామ్ హాల్ పోలింగ్కేంద్రంలో హుషారుగా ఓటేశారు. బ్రిటిష్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడుగంటలకే 40,000 పోలింగ్బూత్లలో పోలింగ్ మొదలైంది. బ్రిటన్లో 4.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 10 గంటలదాకా అంటే భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల దాకా పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ అయిన ‘హౌజ్ ఆఫ్ కామన్స్’లో ఉన్న మొత్తం 650 ఎంపీ స్థానాలకు పోలింగ్ చేపట్టారు. సాధారణ మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు గెలవాలి. ప్రధానమైన కన్జర్వేటివ్, లేబర్ పార్టీలతోపాటు లిబరల్ డెమొక్రాట్స్, గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, ఎస్డీఎల్పీ, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ, సిన్ ఫియెన్, ప్లెయిడ్ సిమ్రూ, ది యాంటీ ఇమిగ్రేషన్ రిఫామ్ పార్టీలతోపాటు స్వతంత్రులు బరిలో దిగారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిశాక ఎగ్జిట్పోల్స్ వెలువడే అవకాశముంది. కన్జర్వటివ్ పార్టీ కేవలం 53–150 సీట్లు సాధిస్తుందని, లేబర్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే ఓపీనియన్స్ పోల్స్ వెల్లడయ్యాయి. -
యూకే ఎన్నికలు: సతీసమేతంగా ఓటేసిన సునాక్
బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7గం. పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం క్యూ కట్టారు. మరోవైపు భార్య అక్షతా మూర్తితో కలిసి ఓటేసిన ఆ దేశ ప్రధాని రిషి సునాక్.. ఆపై ఎక్స్ ద్వారా ఓటర్ల కోసం సందేశం ఇచ్చారు.పోలింగ్ ప్రారంభమైందని, లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక తరం మొత్తం పన్నుల మోతతో ఇబ్బంది ఎదుర్కుంటుందని, కాబట్టి కన్జర్వేటివ్పార్టీకి ఓటేసి గెలిపించాలని పిలుపు ఇచ్చారాయన.The polls are open. Vote Conservative to stop the Labour supermajority which would mean higher taxes for a generation. pic.twitter.com/NPH7lSeDFc— Rishi Sunak (@RishiSunak) July 4, 2024మరోవైపు దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ కోరుతున్నారు. దేశవ్యాప్తంగా 40 వేల పోలింగ్ బూత్లలో 4.6 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం 7గం. నుంచి రాత్రి 10గం. దాకా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాతే ఎగ్జిట్పోల్స్ వెలువడతాయి. మరో గంట వ్యవధి తర్వాత ఫలితాల లెక్కింపు మొదలవుతుంది. పూర్తి ఫలితాలు రేపు ఉదయం 6గం.30 కల్లా..(భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11గం.కల్లా) వెలువడే ఛాన్స్ ఉంది.పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగాల్సి ఉంది. యునైటెడ్ కింగ్ డమ్లో మొత్తం 392 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. కన్జర్వేటివ్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. గత 14 ఏళ్లలో అధికారంలో కొనసాగిన కన్జర్వేటివ్ పార్టీ.. ఐదుగురు ప్రధానుల్ని మార్చింది. భారత సంతతికి చెందిన 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది.మరోవైపు.. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పార్టీకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు ఒపీనియన్ పోల్స్ సైతం లేబర్ పార్టీకే అనుకూలంగా వచ్చాయి. ఇక.. 10 లక్షల మందికి పైగా భారతీయ మూలాలు ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి ఏకంగా 107 మంది బ్రిటీష్ ఇండియన్లు బరిలో దిగుతుండటం విశేషం. 2019లో ఆ సంఖ్య 63 కాగా, అందులో 15 మంది గెలిచారు. -
UK general elections: ముందస్తు ఓటమే?!
సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికలకు వేళైంది. హోరాహోరీ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. సాయంత్రం నుంచే ఫలితాల వెల్లడి మొదలవుతుంది. శుక్రవారం ఉదయానికల్లా పూర్తి ఫలితాలు వెలువడతాయి. కొత్త సభ జూలై 9న కొలువుదీరుతుంది. స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారాల తర్వాత నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిస్తుంది. విపక్ష నేత స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ మెజారిటీతో 14 ఏళ్ల అనంతరం గద్దెనెక్కడం ఖాయమని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. భారత మూలాలున్న ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎదురీదుతోందని అప్పటికే స్పష్టం చేశాయి. సునాక్ కూడా బుధవారం ప్రచారాన్ని ముగిస్తూ, ‘లేబర్ పార్టీకి ఘనవిజయం దక్కకుండా అడ్డుకుందాం’ అని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎన్నికలు డిసెంబర్లో జరగాల్సి ఉన్నా ప్రజల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ముందే పసిగట్టి సునాక్ ముందస్తుకు వెళ్లారు. కానీ అది కూడా కలిసొచ్చేలా కని్పంచడం లేదు... బరిలో భారతీయం బ్రిటన్ ఎన్నికల బరిలో భారతీయుల జోరు పెరుగుతోంది. 2019లో 63 మంది బ్రిటిష్ఇండియన్లు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. ఈసారి ఏకంగా 107 మంది బరిలో దిగుతుండటం విశేషం. ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్తో పాటు రిఫామ్ యూకే వంటి కొత్త పారీ్టల నుంచి కూడా ఇండియన్లు పోటీలో ఉన్నారు. పలు స్థానాల్లో బ్రిటిష్ ఇండియన్లే ప్రత్యర్థులుగా తలపడుతుండటం మరో విశేషం. హారో ఈస్ట్ స్థానం నుంచి ప్రిమేశ్ పటేల్ (లేబర్), రీతేంద్రనాథ్ బెనర్జీ (లిబరల్ డెమొక్రాట్స్), సారాజుల్హగ్ పర్వానీ (వర్కర్స్ పార్టీ ఆఫ్ బ్రిటన్) బరిలో ఉన్నారు. లీసెస్టర్ ఈస్ట్లో లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ (లేబర్), శివానీ రాజా (కన్జర్వేటివ్) పోటీ చేస్తున్నారు. 37.3 లక్షల బ్రిటిష్ ఇండియన్లు బ్రిటన్లో భారత మూలాలున్న వారి సంఖ్య ఏకంగా 37.3 లక్షలు దాటేసింది! ఓటర్లలోనూ వారు 10 లక్షల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూలాలున్న వారు కూడా భారీగానే ఉన్నారు. దాంతో వారిని ఆకట్టుకోవడానికి పారీ్టలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. లేబర్ పార్టీ నేత స్టార్మర్ ఇటీవల బ్రిటిష్ బంగ్లాదేశీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, గాజా దుస్థితిపై ఆ పార్టీ వైఖరి కారణంగా ముస్లిం ఓటర్లు గుర్రుగా ఉన్నారు. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు కన్జర్వేటివ్ నేతలు ప్రయతి్నస్తున్నారు. కన్జర్వేటివ్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలతో పాటు 23 మంది బ్రిటిష్ ఇండియన్లకు కొత్తగా టికెట్లిచ్చింది. వీరిలో ప్రధాని రిషి సునాక్, మాజీ మంత్రులు ప్రీతీ పటేల్, సుయెల్లా బ్రేవర్మన్తో పాటు చంద్ర కన్నెగంటి, నీల్ శాస్త్రి హర్స్సŠట్, నీల్ మహాపాత్ర, రేవ గుడి, నుపుర్ మజుందార్, ఎరిక్ సుకుమారన్ తదితరులున్నారు. లేబర్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలు కాగా 26 మంది కొత్తవారు. వీరిలో ఉదయ్ నాగరాజు, హజీరా ఫరానీ, రాజేశ్ అగర్వాల్, జీవన్ సంధెర్ తదితరులున్నారు.ఒపీనియన్ పోల్స్ ఏం చెబుతున్నాయ్.. లేబర్ పారీ్టకి కనీసం 41 శాతం ఓట్లు ఖాయమని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీకి 21 శాతానికి మించబోవని అవి జోస్యం చెప్పాయి. రిఫామ్ పారీ్టకి 16 శాతం, లిబరల్ డెమొక్రాట్లకు 12 శాతం రావచ్చని పేర్కొన్నాయి. అవే నిజమైతే లేబర్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమే. సునాక్ ఎదురీత వెనక... 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఆర్థిక సంక్షోభం కొన్నేళ్లుగా బ్రిటన్కు చుక్కలు చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆర్థిక నిపుణుడై ఉండి కూడా పరిస్థితిని రిషి చక్కదిద్దలేదన్నది బ్రిటన్వాసుల ఫిర్యాదు. ప్రధానమైన హౌజింగ్ సంక్షోభాన్ని చక్కదిద్దడంలోనూ ఆయన విఫలమయ్యారని వారు భావిస్తున్నారు. దాంతో ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామన్న తాజా హామీలను ఎవరూ నమ్మడం లేదు. యూగవ్ తాజా సర్వేలో 52 శాతం మంది ఆర్థిక సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరోగ్య సమస్యలు తమను బాగా కుంగదీస్తున్నట్టు 50 శాతం చెప్పారు. కీలకమైన వలసదారులు, వారికి ఆశ్రయం విషయంలో కన్జర్వేటివ్ పార్టీ వైఖరిని 40 శాతం మంది తప్పుబడుతున్నారు. ఎలా చూసినా సునాక్ పాలనకు 20 నెలలకే తెర పడటం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా విని్పస్తోంది.స్టార్మర్కు కలిసొచ్చిన అంశాలు... ప్రధానంగా 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పారీ్టకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. లేబర్ పార్టీకి ఓటేస్తే ఆర్థిక స్థిరత్వానికి వేసినట్టేనన్న ఆయన ప్రచారానికి విశేష స్పందన లభించింది. నిరుపేద కారి్మక కుటుంబం నుంచి వచి్చన తనకు సామాన్యుల కష్టనష్టాలు బాగా తెలుసునని, ధరాభారాన్ని తగ్గించి తీరతానని, సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హామీలిచి్చన స్టార్మర్ వైపు ప్రజలు స్పష్టమైన మొగ్గు చూపుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
UK PM Rishi Sunak: హిందూ ధర్మమే నాకు స్ఫూర్తి
లండన్: హిందూ ధర్మమే తనకు ప్రేరణను, సాంత్వనను అందిస్తుందని భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ’’భగవద్గీతపై పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని భగవద్గీత బోధిస్తుంది’ అని ఆయన అన్నారు. ఆదివారం రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్లోని నియాస్డెన్ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ మందిరాన్ని సందర్శించుకున్నారు. వచ్చే 4వ తేదీన బ్రిటన్ పార్లమెంట్కు ఎన్నికలు జరగనున్న వేళ వారు ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు రిషి సునాక్ దంపతులకు ఆలయంలోకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జై స్వామినారాయణ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సునాక్ టీ20 ప్రపంచ కప్ను భారత జట్టు గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించడం విశేషం. చీర ధరించిన అక్షతా మూర్తి అక్కడి మహిళలు, చిన్నారులతో ముచ్చటించారు. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటున్న వేళ ప్రతిపక్ష లిబరల్ పార్టీ నేత కీర్ స్టార్మర్ హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శుక్రవారం లండన్లోని కింగ్స్బరీ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. జై స్వామి నారాయణ్ అంటూ స్టార్మర్ ప్రసంగించారు. అధికారంలోకి వస్తే భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. 2021 గణాంకాల ప్రకారం బ్రిటన్లో హిందువులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. దాంతో ప్రధాన పార్టీలు హిందువుల ఓట్లపై కన్నేశాయి. -
UK general election 2024: స్టార్మర్... సరికొత్త ఆశాకిరణం
కెయిర్ రాడ్నీ స్టార్మర్. ఈ 61 ఏళ్ల లేబర్ పార్టీ నాయకుని పేరు ఇప్పుడు బ్రిటన్లో మార్మోగుతోంది. ఆర్థిక ఇక్కట్లు మొదలుకుని నానా రకాల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు ఆయనలో తమ నూతన నాయకున్ని చూసుకుంటున్నారని సర్వేలన్నీ చెబుతున్నాయి. జూలై 4న జరగనున్న ఎన్నికల్లో లేబర్ పార్టీని ఆయన ఘనవిజయం దిశగా నడిపించడం, ప్రధాని పీఠమెక్కడం ఖాయమని ఘోషిస్తున్నాయి. అదే జరిగితే 14 ఏళ్ల అనంతరం లేబర్ పార్టీని గెలుపు బాట పట్టించిన నేతగా స్టార్మర్ నిలవనున్నారు. సాక్షి, నేషనల్ డెస్క్నిరుపేద నేపథ్యం..దేశంలోనే పేరుమోసిన లాయర్. ఐదేళ్ల పాటు బ్రిటన్ చీఫ్ ప్రాసిక్యూటర్. ఆ హోదాలో రాజవంశానికి చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన అత్యున్నత పౌర పురస్కారమైన సర్. ఇదంతా 61 ఏళ్ల స్టార్మర్ నేపథ్యం. దాంతో ఆయన సంపన్నుల ప్రతినిధి అంటూ కన్జర్వేటివ్ పార్టీ ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు. వీటన్నింటికీ తన నేపథ్యమే సమాధానమని సింపుల్గా బదులిస్తారు స్టార్మర్. కలవారి కుటుంబంలో పుట్టి, మల్టీ బిలియనీర్ కూతురిని పెళ్లాడిన తన ప్రత్యరి్థ, ప్రధాని రిషి సునాక్దే సిసలైన సంపన్న నేపథ్యమంటూ చురకలు వేస్తుంటారు. స్టార్మర్ 1963లో లండన్ శివార్లలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టారు. తండ్రి పనిముట్లు తయారు చేసే కారి్మకుడు. తల్లి నర్సు. నలుగురు సంతానం కావడంతో నిత్యం డబ్బు కటకట మధ్యే పెరిగారాయన. తన నిరుపేద నేపథ్యాన్ని ఎన్నికల ప్రచారంలో స్టార్మర్ పదేపదే ప్రస్తావిస్తున్నారు. ‘‘ద్రవ్యోల్బణమంటే ఏమిటో, కుటుంబాలను అది ఎంతగా కుంగదీస్తుందో నాకు చిన్నప్పుడే అనుభవం. ధరల పెరుగుదల ఎంత దుర్భరమో కన్జర్వేటివ్ పార్టీ నేతలందరి కంటే నాకంటే ఎక్కువగా తెలుసు. పోస్ట్మ్యాన్ వస్తున్నాడంటే చాలు, ఏ బిల్లు తెచి్చస్తాడో, అది కట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడాలో అని ఇంటిల్లిపాదీ బెదిరిపోయేవాళ్లం. ఫోన్ బిల్లు కట్టలేక నెలల తరబడి దాన్ని వాడకుండా పక్కన పెట్టిన సందర్భాలెన్నో’’ అంటూ చేస్తున్న ఆయన ప్రసంగాలకు విశేష స్పందన వస్తోంది. తన కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే కావడం విశేషం. లీడ్స్ వర్సిటీ, ఆక్స్ఫర్డ్లో లా చేశారు. పేదరికమే తనలో కసి నింపి చదువుల్లో టాపర్గా నిలిచేందుకు సాయపడిందంటారు. 50 ఏళ్ల తర్వాత రాజకీయ అరంగేట్రం 50 ఏళ్లు దాటాక స్టార్మర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2015లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రెండు వరుస ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో జెరెమీ కోర్బిన్ విఫలం కావడంతో 2020లో లేబర్ పార్టీ పగ్గాలతో పాటు విపక్ష నేత బాధ్యతలు కూడా చేపట్టారు. వస్తూనే పారీ్టలో అంతర్గతంగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. బాధ్యతాయుతంగా, మేనేజర్ తరహాలో, కాస్త డల్గా కనిపించే వ్యవహార శైలి స్టార్మర్ సొంతం. ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమవుతున్న బ్రిటన్కు ఇప్పుడు కావాల్సిన సరిగ్గా అలాంటి నాయకుడేనన్నది పరిశీలకుల అభిప్రాయం. చరిష్మా ఉన్న నేత కంటే నమ్మకం కలిగించగల నాయకుడినే బ్రిటన్వాసులు కోరుకుంటున్నారని చెబుతున్నారు. అందుకు తగ్గట్టే నాలుగేళ్లుగా విపక్ష నేతగా తన పనితీరుతోనూ, కీలక విధానాంశాలపై స్పష్టమైన అభిప్రాయాలతోనూ ప్రజలను స్టార్మర్ బాగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, హౌజింగ్ సంక్షోభం వంటి పెను సమస్యల పరిష్కారంలో భారత మూలాలున్న తొలి ప్రధాని రిషి సునాక్ విఫలమయ్యారన్న అభిప్రాయం దేశమంతటా బాగా విని్పస్తోంది. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెర పడటం ఖాయమన్న విశ్లేషణలే విని్పస్తున్నాయి. అందుకే కొద్ది రోజులుగా వెలువడుతున్న ఎన్నికల సర్వేలన్నీ లేబర్ పార్టీ ఘనవిజయం ఖాయమని చెబుతున్నాయి. విజయమే లక్ష్యంగా... కన్జర్వేటివ్ పార్టీ పాలనపై దేశమంతటా నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను స్టార్మర్ ముందుగానే పసిగట్టారు. అందుకే ఘనవిజయమే లక్ష్యంగా కొద్ది నెలలుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బ్రెగ్జిట్ తప్పుడు నిర్ణయమంటూనే తాను అధికారంలోకి వస్తే దాన్ని సమీక్షించబోనని చెబుతున్నారు. ఇది ఆయన సిద్ధాంతరాహిత్యానికి నిదర్శనమన్న కన్జర్వేటివ్ నేతల విమర్శలను తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. తాను కేవలం మెజారిటీ ప్రజల ఆకాంక్షలను అంగీకరిస్తున్నానంటూ దీటుగా బదులిస్తున్నారు. ‘‘నేను కారి్మక కుటుంబం నుంచి వచ్చాను. జీవితమంతా పోరాడుతూనే వస్తున్నా. ఇప్పుడు దేశ ప్రజల స్థితిగతులను మెరుగు పరిచి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు మరింతగా పోరాడతా’’ అంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘పార్టీ కంటే దేశమే ముందు’ నినాదంతో దూసుకుపోతున్న స్టార్మర్లో బ్రిటన్ ప్రజలు ఇప్పటికే తమ ప్రధానిని చూసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. 18 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు 1997లో తెర దించిన టోనీ బ్లెయిర్ ఫీటును ఈసారి ఆయన పునరావృతం చేస్తారన్న భావన అంతటా వ్యక్తమవుతోంది.కొసమెరుపు లేబర్ పార్టీ తొలి నాయకుడు కెయిర్ హార్డీ మీద అభిమానంతో స్టార్మర్కు తల్లిదండ్రులు ఆయన పేరే పెట్టుకున్నారు. ఇప్పుడదే లేబర్ పారీ్టకి ఆయన నాయకునిగా ఎదగడం విశేషం!ప్రస్తుత బలాబలాలుబ్రిటన్ పార్లమెంట్ లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లోని 650 స్థానాలకు జూలై 4న ఎన్నికలు జరగనున్నాయి. మెజారిటీ మార్కు 326.పార్టీ స్థానాలుకన్జర్వేటివ్ 344లేబర్ 205ఎస్ ఎన్ పీ 43లిబరల్ డెమొక్రాట్స్ 15ఇతరులు 43 -
Britain general elections: సునాక్ ఎదురీత!
బ్రిటన్లో పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెరపడనుందా? భారత మూలాలున్న తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ గద్దె దిగాల్సి వస్తుందా? అవుననే అంటున్నాయి ఒపీనియన్ పోల్స్. షెడ్యూల్ ప్రకారం ఏడాది చివరిదాకా ఆగితే తన ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి తారస్థాయికి చేరి ఓటమి ఖాయమనే భావనతో రిషి అనూహ్యంగా జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చని సర్వేలంటున్నాయి. విపక్ష లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నాయి. స్వయానా రిషీ కూడా ఎదురీదుతున్నారని, సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా కోల్పోవచ్చని సావంత పోల్ పేర్కొంది! అదే జరిగితే సొంత పార్లమెంటు స్థానంలో ఓడిన తొలి సిట్టింగ్ ప్రధానిగా బ్రిటన్ చరిత్రలో రిషి నిలిచిపోతారు...ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే కన్జర్వేటివ్ పార్టీ ఓటమి సగం ఖాయమైందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీది 190 ఏళ్ల చరిత్ర. ఇంత సుదీర్ఘ చరిత్రలో 1906లో వచి్చన 131 సీట్లే అత్యల్పం. ఈసారి ఆ రికార్డును అధిగమించవచ్చని సర్వేలంటున్నాయి. ‘‘సునాక్ ఉత్తర ఇంగ్లాండ్లోని కన్జర్వేటివ్ల కంచుకోటైన తన సొంత పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోవచ్చు. ఆర్థిక మంత్రి జెరెమీ హంట్తో సహా పలువురు సీనియర్ మంత్రులకు ఓటమి తప్పదు’’ అని సావంత పోల్ పేర్కొంది. కన్జర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం తప్పక పోవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత సంతతికి చెందిన వారు ఈసారి కన్జర్వేటివ్ పారీ్టకి ఓటేయకపోవచ్చనేది పోల్స్టర్ల అంచనా. లేబర్ పారీ్టకి 425కు పైగా సీట్లు...! హౌజ్ ఆఫ్ కామన్స్లో 650 సీట్లకు గాను లేబర్ పార్టీ 425కు పైగా సాధించి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 108 స్థానాలకు పరిమితమవుతుందని యూగవ్, కేవలం 53 స్థానాలకే పరిమితమవుతారని సావంత పోల్ పేర్కొన్నాయి. సావంత అయితే లేబర్ పార్టీకి దాని చరిత్రలోనే అత్యధికంగా 516 సీట్లు రావచ్చని అంచనా వేయడం విశేషం! కన్జర్వేటివ్లకు 72కు మించబోవని, లేబర్ పార్టీ 456 సీట్లు దాటుతుందని బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వే అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 43.6 శాతం ఓట్లతో 365 సీట్లు సాధించగా లేబర్ పార్టీకి 32.1 శాతం ఓట్లతో 202 స్థానాలు దక్కాయి. ఆకట్టుకుంటున్న కైర్ స్టార్మర్ ‘లెఫ్టీ లండన్ లాయర్’గా పేరు తెచ్చుకున్న కైర్ స్టార్మర్ లేబర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 14 ఏళ్లుగా విపక్షంలో ఉంటూ కుంగిపోయిన పారీ్టలో ఆయన జోష్ నింపుతున్నారు. ఇళ్ల సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, పన్ను పెంపుదల లేకుండా మెరుగైన ప్రజా సేవలను అందిస్తామనే మామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన దాత అయిన బిలియనీర్ జాన్ కాడ్వెల్ కూడా ఈసారి లేబర్ పారీ్టకి మద్దతిస్తున్నారు. తాను లేబర్ పారీ్టకే ఓటేస్తానని బాహాటంగా చెబుతున్నారు. అందరూ అదే చేయాలని పిలుపునిస్తున్నారు.ప్రజల్లో వ్యతిరేకతకు కారణాలెన్నో... బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ కామెరాన్ రాజీనామా అనంతరం చీటికీమాటికీ ప్రధానులు మారడం కన్జర్వేటివ్ పార్టీకి చేటు చేసింది. థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి రూపంలో ఏకంగా నలుగురు ప్రధానులు మారారు. వీరిలో 45 రోజులే కొనసాగిన ట్రస్ పారీ్టకి గట్టి నష్టాన్ని కలిగించారని, దాన్ని సునాక్ పూడ్చలేకపోయారని అంటున్నారు.→ 2022 అక్టోబర్లో రిషి ప్రధాని అవుతూనే ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని, రుణ భారాన్ని, నేషనల్ హెల్త్ సరీ్వస్ వెయిటింగ్ జాబితాను తగ్గిస్తానని, అక్రమ వలసలను అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఇవేవీ చేయలేకపోగా సంప్రదాయ ఓటర్లనూ మెప్పించలేకపోయారని విమర్శ ఉంది.→ ఐదేళ్లలో బ్రిటన్ వాసుల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. వారిపై పన్ను భారమైతే గత 70 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉంది. అక్రమ వలసలు పెరిగాయి. ప్రధానిగా సునాక్ నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలొచ్చాయి. → వీటికి తోడు 14 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.→ రిఫార్మ్ యూకే పార్టీ పుంజుకోవడం కూడా కన్జర్వేటివ్లను దెబ్బ తీయనుంది. ఈ పారీ్టకి 15 శాతం ఓట్ల వాటా ఉంది. ఈసారి చాలా స్థానాల్లో కన్జర్వేటివ్ ఓటు బ్యాంకుకు భారీగా గండి పెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
రిషి సునాక్కు షాక్ తప్పదా.?.. తాజా సర్వే ఏం చెప్పింది?
లండన్ : ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. రిషి సునాక్కు ఓటమి తప్పేలా లేదు. బ్రిటన్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోరంగా ఓడిపోనుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు రిషి సునాక్కు ఓడిపోవడం ఖాయమని చెప్పగా.. తాజాగా మరో సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.రిషి సునాక్కు షాక్ తప్పదా.? అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. బ్రిటన్కు తొలి భారత సంతతి ప్రధాని అయిన రిషి సునాక్కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఒపీనియన్ పోల్స్ ఇదే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఈ సారి తుడిచిపెట్టుకుపోతుందని ఇప్పటికే మూడు సర్వేలు వెల్లడించగా.. తాజాగా మరో సర్వే కూడా జూలై 4న జరుగనున్న ఎన్నికల్లో సునాక్ ఘోరంగా ఓడిపోతారని అంచనా వేసింది.సండే టెలిగ్రాఫ్ పత్రిక కోసం మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సావంత సర్వేను నిర్వహించింది. జూన్ 12 నుంచి 14 మధ్య సర్వే చేసినట్లు వెల్లడించింది. ఈ సర్వేలో ప్రతిపక్ష లేబర్ పార్టీకి 46 శాతం మద్దతు లభించగా, కన్జర్వేటివ్ పార్టీకి మద్దతు నాలుగు పాయింట్లు తగ్గి 21 శాతానికి చేరుకుంది. రాబోయే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయానికి దూరమవుతుందని తాము నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయని సావంత పొలిటికల్ రీసెర్చ్ డైరెక్టర్ క్రిస్ హాప్కిన్స్ తెలిపారు. ఇక.. ప్రజలు పోస్టల్ బ్యాలెట్లు అందుకోవాడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందే సర్వే ఫలితాలు వెలువడటం విశేషం.కన్జర్వేటివ్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని సర్వే సంస్థలు చెబుతున్నాయి. 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్లో కన్జర్వేటివ్ పార్టీ కేవలం 72 సీట్లకు పరిమితమవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. 200 ఏండ్ల బ్రిటన్ ఎన్నికల చరిత్రలో ఇదే అతి స్వల్పం. లేబర్ పార్టీకి 456 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాగా, మే 22న ముందస్తు ఎన్నికలను ప్రకటించి రిషి సునాక్ అందరినీ ఆశ్చర్యపరిచారు. -
బ్రిటన్ ఒపీనియన్ పోల్స్.. ప్రధాని రిషి సునాక్ ఓటమి?
బ్రిటన్లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఒపీనియన్ పోల్స్లో ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఘోరంగా ఓడిపోతారని మరో సర్వే అంచనా వేసింది. జూలై 4న జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఈసారి తుడిచిపెట్టుకుపోతుందని ఇప్పటివరకూ మూడు సర్వేలు వెల్లడించాయి.తాజా సర్వేలో కైర్ స్టార్మర్స్ లేబర్ పార్టీకి 46 శాతం మద్దతు లభించగా, కన్జర్వేటివ్ పార్టీకి మద్దతు నాలుగు పాయింట్ల మేరకు తగ్గి 21 శాతానికి చేరుకుంది. జూన్ 12- జూన్ 14 మధ్య ఈ సర్వేను మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సావంత ‘సండే టెలిగ్రాఫ్’ కోసం నిర్వహించింది. కొంతమేరకు ఎన్నికల ప్రచారం ముగిసిన తరుణంలో ఈ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. త్వరలో కన్జర్వేటివ్, లేబర్ పార్టీలు రెండూ తమ మ్యానిఫెస్టోలతో ప్రజల ముందుకు వెళ్లనున్నాయి.కాగా మే 22న ముందస్తు ఎన్నికలను ప్రకటించి రిషి సునాక్ అందరినీ ఆశ్చర్యపరిచారు. రాబోయే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయానికి దూరమవుతుందని తాము నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయని సావంత పొలిటికల్ రీసెర్చ్ డైరెక్టర్ క్రిస్ హాప్కిన్స్ తెలిపారు. ఈ సర్వేలో 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్లో కన్జర్వేటివ్ పార్టీ కేవలం 72 సీట్లకు పరిమితమవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. ఇది 200 సంవత్సరాల బ్రిటన్ ఎన్నికల చరిత్రలో అతి స్వల్పం. లేబర్ పార్టీకి 456 సీట్లు వస్తాయని ఈ సర్వే తెలిపింది.బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వేలో ప్రధాని సునాక్ తన సీటును సైతం కాపాడుకోలేరని పేర్కొన్నారు. బెస్ట్ ఫర్ బ్రిటన్ 15,029 మంది నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. దీని ఆధారంగా రూపొందించిన నివేదికలో ప్రతిపక్ష లేబర్ పార్టీ 45 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ పార్టీ ఈసారి 468 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. -
G7 Summit 2024: స్వేచ్ఛా వాణిజ్యంపై మోదీ, రిషీ సమీక్ష
జీ7 భేటీ కోసం వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తోనూ మోదీ భేటీ అయ్యారు. భారత్–యూకే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పట్టిష్టంచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో పురోగతిపై సునాక్తో కలిసి మోదీ సమీక్ష చేశారు. మూడోసారి ప్రధాని అయ్యారంటూ మోదీని సునాక్ అభినందనలు తెలపగా త్వరలో జరగబోయే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలంటూ సునాక్కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు చేయాల్సిన కృషిపై కూలంకషంగా చర్చించారు. ‘‘ రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు, కీలక, అధునాతన సాంకేతిక రంగాలతోపాటు ప్రజాసంబంధాల్లోనూ ఇరుదేశాల మధ్య భాగస్వామం మరింత బలపడటంపై ఇరు నేతలు చర్చించారు’’ అని భేటీ తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. -
రిషి సునాక్ బ్యాగ్ ధరెంతో తెలుసా..
సెలబ్రిటీలు వాడే ప్రతి వస్తువు సామాన్యులకు ఎప్పుడూ ప్రత్యేకమే. వారు ధరించే షూ, వేసుకునే దుస్తులు, వాడే కారు, పెట్టుకునే వాచీలు, ఉపయోగించే బ్యాగులు.. ఇలా అన్ని స్పెషల్గా కనిపిస్తాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ రైల్వేస్టేషన్లో యూకే ప్రధాని రిషిసునాక్ వాడిన బ్యాగ్ గురించి నెట్టింట వైరల్గా మారింది.రాబోయే బ్రిటిష్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా రిషి సునక్ ప్రచారంలో పాల్గొనేందుకు ఇటీవల రైలులో ప్రయాణించారు. లండన్ నుంచి బయలుదేరిన ఆయన రాత్రంతా రైలు స్లీపర్క్లాస్లో ప్రయాణించి కార్న్వాల్కు చేరుకున్నారు. అందులో ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా. రిషి రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే అందరి కళ్లు ఆయనతోపాటు తాను వాడుతున్న బ్యాగ్పై పడింది. దేశంలోని అత్యంత పేద ప్రాంతాల్లో ఒకటైన 'ఆర్ఎస్'ను సూచించే మోనోగ్రామ్ ఉన్న బ్యాక్ప్యాక్ను ధరిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దాంతో వీక్షకులు తాను వినియోగించిన బ్యాక్ప్యాక్ ధరెంతో తెలుసుకునే పనిపడ్డారు. దీని విలువ సుమారు రూ.79వేలు ఉంటుందని తెలిసింది.ఇదీ చదవండి: అంబానీ మనవరాలా..మజాకా..క్రూయిజ్లో ఫస్ట్ బర్త్డేది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ రిపోర్ట్ ప్రకారం..రిషి సునక్, తన భార్య అక్షతామూర్తి నికర విలువ 651 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు(సుమారు రూ.6900 కోట్లు). బ్రిటిష్ రాజు కింగ్ చార్లెస్ 3 కంటే వీరే సంపన్నులు. ఈ జంట సంపద కేవలం ఒక సంవత్సరంలోనే 120 మిలియన్ పౌండ్లకు పైగా పెరిగింది.Paddington Station, London: Rishi Sunak boarding the sleeper train to Cornwall, sporting a £750 luxury monogrammed Tumi Arrive Bradley backpack pic.twitter.com/ojWi76ovcu— Jane Fleming (@fleming77) May 29, 2024 -
British Parliament Dissolve: బ్రిటన్ పార్లమెంట్ రద్దు..
బ్రిటన్ పార్లమెంట్ రద్దైంది. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్కు అనుగుణంగా పార్లమెంట్ను గురువారం రద్దు చేశారు. ఇక, పార్లమెంట్ రద్దుతో ఐదు వారాల ఎన్నికల ప్రచారం నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. దీంతో, నేటి నుంచి ఎన్నికల ప్రచారం షురూ కానుంది.కాగా, జూలై నాలుగో తేదీన ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 23న ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’ వద్ద సునాక్ ఎన్నికల తేదీపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సునాక్ మాట్లాడుతూ..‘ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో విజయాలను సాధించాం. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చింది’ అంటూ కామెంట్స్ చేశారు. #BreakingNews #Updates #ukpolitics#British Parliament is formally dissolved ahead of July 4 general #election which polls indicate #Labour is expected to win over ruling #Conservative party pic.twitter.com/Lubf43M6r4— Tanveer Roomi (@TanveerRoomi) May 30, 2024ఇక బ్రిటన్ పార్లమెంట్లో మొత్తం 650 మంది సభ్యులు ఉన్నారు. కాగా, గత 14 ఏళ్లుగా బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే, ప్రధానిగా సునాక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నుంచి దాదాపు 129 మంది ఎంపీలు పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. -
యూకే నా సొంతిల్లు
లండన్: త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల తర్వాత తన కుటుంబం అమెరికాకు తరలిపోతుందని సొంత పార్టీలో చక్కర్లు కొడుతున్న వార్తను బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ కొట్టిపారేశారు. మంగళవారం సునాక్ ఆగ్నేయ ఇంగ్లాండ్లోని అమెర్శామ్ ప్రాంతంలో కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ మద్దతుదారులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ మాజీ విదేశాంగ మంత్రి, పార్టీ నేత జాక్ గోల్డ్స్మిత్ మాటలు వింటుంటే ఆశ్చర్యమేస్తోంది. అసలు ఆయనతో నేను మాట్లాడక చాలా కాలమైంది. నా విషయాలు ఆయనకెలా తెలుస్తాయి.అయినా నేను బ్రిటన్ను వదిలి అమెరికాకు వెళ్లట్లేను. యూకే నా సొంతిల్లు. ఇక్కడి సౌతాంప్టన్లో పుట్టి పెరిగా’’ అని సునాక్ వ్యాఖ్యానించారు. బ్రిటన్ను వీడతారంటూ వచ్చిన వదంతులను ఇటీవల ‘లూజ్ ఉమెన్’ టెలివిజన్ షోలోనూ రిషి కొట్టిపారేశారు. ‘‘ఇక్కడ ఎంపీగా ఉండటానికే ఇష్టపడుతున్నా. ఇక్కడే ఉంటా. నా నియోజకవర్గ ప్రజలను ప్రేమిస్తా. నార్త్ యార్క్షైర్లోని నా సొంతిల్లు అంటే చెప్పలేని ప్రేమ’’ అని అన్నారు. అయితే ముందస్తు ఎన్నికలకు సొంత పార్టీ నేతలు సన్నద్ధం కాకపోవడం, ఈసారి విపక్ష లేబర్ పార్టీ మెజారిటీ సాధిస్తుందని సర్వేల్లో తేలడంతో సొంత కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో గుబులు పెరిగింది. దీంతో చాలా మంది ఎంపీలు పార్టీ మారొచ్చని వార్తలొచ్చాయి. -
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృక.. బ్రిటన్లో ఆర్థిక సంక్షోభం మధ్య ఎన్నికలు
పార్లమెంటరీ ప్రాజాస్వామ్యానికి మాతృకగా పరిగణించే ఇంగ్లండ్లో ఆర్థిక సంక్షోభం మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. భారత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన (జూన్ 4) నెల రోజులకు అంటే వచ్చే జులై 4న బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లోని మొత్తం 650 సీట్లకు పోలింగ్ నిర్వహించడానికి ఇంగ్లండ్ రాజు నుంచి చార్లెస్ 3 నుంచి అనుమతి తీసుకున్నారు.భారత సంతతికి చెందిన యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రధాని రిషి సునాక్.. దాదాపు రెండు పార్టీల వ్యవస్థ స్థిరపడిన ఇంగ్లండ్లో 2010 నుంచీ కన్సర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. ఇండియాలో కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే ఇంగ్లండ్లో సుదీర్ఘ చరిత్ర (190 ఏళ్లు) ఉన్న పార్టీ కన్సర్వేటివ్ పార్టీ. ఈ పార్టీకి తన పూర్వ రూపమైన టోరీ పార్టీ అని కూడా పేరుంది.ప్రస్తుత బ్రిటిష్ పార్లమెంటు పదవీకాలం 2025 జనవరి వరకూ ఉన్నా దేశాన్ని సంక్షోభం నుంచి కాపాడడానికి ప్రజల మద్దతు కోసం ముందస్తు ఎన్నికలు జరిపించడానికి ప్రధాని సునాక్ నిర్ణయించడం విశేషం. బుధవారం యూకే రాజు మూడో చార్లెస్ తో మాట్లాడి పార్లమెంటును రద్దుచేయించి, ఎన్నికలు జరిపించడానికి ప్రధాని అనుమతి తీసుకున్నారు.124 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రస్తుత ప్రతిపక్షం లేబర్ పార్టీ చివరి ప్రధాని గోర్డన్ బ్రౌన్ నుంచి కన్సర్వేటివ్ పార్టీ ఇంగ్లండ్లో అధికారం హస్తగతం చేసుకున్నపటి నుంచి ఇప్పటి వరకూ ఈ 14 సంవత్సరాల్లో సునాక్ సహా ఐదుగురు ప్రధానులు మారారు. 2010 మేలో డేవిడ్ కేమరూన్ తో మొదలైన కన్సర్వేటివ్ పార్టీ హయాంలో ఆయన తర్వాత వరుసగా థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టారు. ఈ ఐదుగురులో డేవిడ్ కేమరూన్ ఎక్కువ కాలం (2010–2016 మధ్య 6 ఏళ్ల 64 రోజులు) అధికారంలో ఉన్నారు. ఆయన తర్వాత కన్సర్వేటివ్ పార్టీకే చెందిన థెరిసా మే, బోరిస్ జాన్సన్ చెరో మూడు సంవత్సరాలు ప్రధాన మంత్రి పదవిలో కొనసాగారు. హౌస్ ఆఫ్ కామన్స్ పదవీకాలం గరిష్ఠంగా 5 ఏళ్ల వరకూ ఉంటుంది.వివాదాస్పద ప్రధాని బోరిస్ జాన్సన్ హయాంలో టోరీ పార్టీకి భారీ మెజారిటీ!ఒక తాత వైపు నుంచి టర్కీ కుటుంబ నేపథ్యం ఉన్న బోరిస్ జాన్సన్ హయాంలో కిందటిసారి 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీకి మెజారిటీ (365 సీట్లు) లభించింది. అయితే, కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి విందులో పాల్గొన్నారనే కారణంగా 2022 సెప్టెంబర్ మొదటి వారం జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన తర్వాత ప్రధాని అయిన మూడో మహిళా నేత లిజ్ ట్రస్ ఒక ప్రభుత్వ సంక్షోభం వల్ల 50 రోజులకే రాజీనామా చేశారు. ఇలా ఆమె బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానిగా ఉన్న నేతగా రికార్డుకెక్కారు.అనుకోని పరిస్థితుల్లో 2022 అక్టోబర్ 25న ఇంగ్లండ్ ప్రధాని పదవి చేపట్టిన తొలి హిందువుగా చరిత్ర సృష్టించిన 'రిషి సునాక్'ది పంజాబీ కుటుంబ నేపథ్యం. ఆయన భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి, సుధా మూర్తిల అల్లుడనే విషయం తెలిసిందే. తన సంపదకు తోడు భార్య అక్షత ఆస్తి తోడవడంతో యూకేలో రాజు మూడో చార్లెస్ కన్నా ఎక్కువ సంపద ఉన్న వ్యక్తిగా ఇటీవల సునాక్ వార్తల్లో నిలిచారు.గతంలో ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థికవ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ గతేడాది ఆ హోదాను కోల్పోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. సునాక్ ప్రధాని పదవి చేపట్టిన 2022 అక్టోబర్ నెలలో దేశంలో 11 శాతం దాటిన ద్రవ్యోల్బణాన్ని కన్సర్వేటివ్ సర్కారు సగానికి తగ్గించగలిగింది. అయితే, 2023 చివర్లో సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి ఇంగ్లండ్ ప్రవేశించడంతో కన్సర్వేటివ్ పార్టీ విధానాలపై ఇంగ్లిష్ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీకి ఇప్పుడు మెజారిటీ ప్రజల సానుకూలత ఉన్నట్టు సర్వేలు సూచిస్తున్నాయి. లేబర్ పార్టీ నేత కియర్ స్టార్మర్ (61) 2020 నుంచీ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కుటుంబ సంబంధ ఆర్థికపరమైన వివాదాలతోపాటు, దేశంలో ఆర్థిక సంక్షోభాలను తట్టుకుని నిలబడిన 44 ఏళ్ల రిషి సునాక్ జులై 4 ఎన్నికల్లో తన పార్టీని మెజారిటీ దిశగా (650 సీట్లలో కనీసం 326) నడిపించి రెండోసారి ప్రధాని అవుతారా? అనేది మిలియన్ పౌండ్ల ప్రశ్నగా మారింది.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
రిషి సాహసం!
వచ్చే జులై 4న బ్రిటన్ దిగువసభ ఎన్నికలు నిర్వహిస్తామంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బుధవారం చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కన్సర్వేటివ్ పార్టీ నిరంతరాయంగా పద్నాలుగేళ్లనుంచి అధికార పీఠాన్ని అంటిపెట్టుకుంది. అయిదేళ్ల గడువుకు అయిదు నెలల ముందే జరుగుతున్న ఈ ఎన్నికలు వారి పాలనకు చరమగీతం పాడతాయా, మరోసారి అందలమెక్కిస్తాయా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ కన్సర్వేటివ్లకు ఆ విషయంలో అనుమానం లేదు. ఓటమి ఖాయమన్న దిగులు ఆ పార్టీని ఆవరించింది. విశ్వవిఖ్యాత కవి, రచయిత విలియం షేక్స్పియర్ విరచిత ‘హామ్లెట్’ నాటకంలోని పాత్ర పలికిన ఆత్మగత సంభాషణలో ‘టు బీ ఆర్ నాట్ టు బీ...’ అందరికీ గుర్తుండిపోయే పదబంధం. బతకటమా, చావటమా అనే సందిగ్ధ స్థితిని అది చెబుతుంది. కన్సర్వేటివ్ పార్టీ ప్రస్తుతం ఆ సంకటస్థితిలోనే ఉంది. నిరుడు జులైలో దిగువ సభకు జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒకటే గెల్చుకుంది. ఈ నెల మొదట్లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ దాని పరిస్థితి ఏమంత బాగులేదు. నిజానికి నిరుడూ, అంతకు ముందు సంవత్సరమూ దేశం అధిక ద్రవ్యోల్బణంతో కుంగిపోయింది. కానీ నెలరోజుల్లో ఉప ఎన్నికలుంటాయనగా అది చెప్పుకోదగ్గ మేర తగ్గింది. అయినా వోటర్లు కరుణించలేదు. మొన్న స్థానిక ఎన్నికల సమయానికి కూడా ఆర్థిక స్థితి మెరుగుపడిన సూచనలు కనబడ్డాయి. వృద్ధి రేటు బాగుందని జీడీపీ గణాంకాలు చాటాయి. ఆర్థిక మాంద్య ప్రమాదం తప్పిందన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ స్థానిక ఎన్నికల్లో జనం లేబర్ పార్టీవైపే మొగ్గారు. కన్సర్వేటివ్ పార్టీ రేటింగ్ కనీవినీ ఎరుగని రీతిలో 20 శాతానికి పడిపోయిందని, లేబర్ పార్టీ 44 శాతంతో ముందంజలో ఉన్నదని సర్వేలు చెబుతున్నాయి. బహుశా అందుకే కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలూ, రిషి మంత్రివర్గ సహచరులూ గడువుకు ముందే పార్లమెంటు రద్దు చేయటం ప్రమాదకరమంటూ వాదించారు. అయితే రిషి సునాక్ లెక్కలు వేరు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందు వెల్లడైన ఆర్థిక గణాంకాలు ఆయనకు ధైర్యాన్నిచ్చాయి. ద్రవ్యోల్బణం మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని గణాంకాలు తేల్చాయి. 2022 అక్టోబర్లో 11.1 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ప్రస్తుతం 2.3 శాతానికి దిగొచ్చింది. కన్సర్వేటివ్లు పెట్టుకున్న 2 శాతం లక్ష్యం కన్నా ఇది కాస్తా ఎక్కువే అయినా ఇంతకు మించి ఆశించకూడదన్న అభిప్రాయం అధికారపక్షంలో ఉంది. మరోపక్క అక్రమ వలసదారులను రువాండాకు సాగనంపే చట్టం ఆమోదం పొందాక ఆ తరహా వలసలు కొద్దో గొప్పో తగ్గాయి. ఈ నేపథ్యంలోనే రిషి అత్యుత్సాహంగా ఎన్నికల ప్రకటన చేశారు. అయితే ఈ పరిస్థితి నిలకడగా కొనసాగుతుందా... మళ్లీ దిగజారుతుందా అన్న సంశయం కన్సర్వేటివ్ శ్రేణులను పట్టి కుదుపుతోంది.అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా తప్పుడు సమాచారాన్ని జనం మెదళ్లకు ఎక్కించే ప్రయత్నం రివాజుగా మారింది. బ్రిటన్ కూడా అందుకు మినహాయింపు కాదు. దేశం ఎదుర్కొంటున్న సకల అరిష్టాలకూ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగటమే కారణమన్న తప్పుడు ప్రచారాన్ని తలకెత్తుకున్నది కన్సర్వేటివ్ పార్టీయే. చివరకు వారి ఏలుబడిలోనే తప్పనిసరై ఆ తంతు ముగించారు. బ్రిటన్ స్వేచ్ఛాజీవి అయింది. అయినా ఆర్థిక ఒడుదొడుకులు దాన్ని పీడించాయి. అధిక ధరలు, నిరుద్యోగం పాలకపక్షాన్ని నిద్రపోనీయకుండా చేశాయి. వోటర్లలో కనబడిన అనాసక్తత వల్ల 2019 డిసెంబర్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చన్న అంచనాలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా కన్సర్వేటివ్ పార్టీ నికరమైన మెజారిటీతో బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దలేక ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో వచ్చిన లిజ్ ట్రస్ సైతం ప్రజల్ని నిరాశపరిచారు. కనుకనే ప్రధానిగా రిషి సునాక్ను కన్సర్వేటివ్ పార్టీ ఎంచుకుంది. కానీ పదవిలోకొచ్చింది మొదలు రిషికి సమస్యలు తప్పలేదు. జాన్సన్, ట్రస్ల మాదిరే ఆయనపై కూడా సాధారణ వోటర్లలో ఏవగింపు మొదలైంది. వ్యక్తిగతంగా రిషి రేటింగ్ కూడా తీసికట్టే! సర్వేలన్నీ వరసబెట్టి దీన్నే చాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు సిద్ధపడటమంటే ఏ ప్రధానికైనా ఆత్మహత్యాసదృశమే. కానీ రిషి తెగింపు వెనక కారణం ఉంది. ప్రత్యర్థి లేబర్ పార్టీకి వోటర్ల ఆదరణ బాగానేవున్నా వ్యక్తిగతంగా ఆ పార్టీ నాయకుడు కియర్ స్టార్మర్ పై ప్రజలకంత విశ్వాసం లేదు. అందుకే ఎన్నికలకు ఇంతకన్నా మంచి ముహూర్తం ఉండబోదన్న నిర్ణయానికి రిషి వచ్చివుండొచ్చు. దానికితోడు స్టార్మర్ ప్రధాన నినాదం ‘ఆర్థిక సుస్థిరత’. అది ఇప్పటికే సాధించినట్టు గణాంకాలు చెబుతుండగా ఆ నినాదానికి విలువుండదని రిషి నమ్మకం.రష్యా దురాక్రమణ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ, ఇరాన్ దూకుడు... మరో ప్రపంచయుద్ధానికి దారితీస్తాయన్న భయాందోళనలు అన్నిచోట్లా ఉన్నట్టే బ్రిటన్లోనూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మితవాద పార్టీ కన్సర్వేటివ్లు అధికారంలో ఉండటమే ఉత్తమమన్న వాదనను ఆ పార్టీ తెరపైకి తీసుకొస్తోంది. సైనిక వ్యయాన్ని అదుపు చేస్తామన్న లేబర్ పార్టీ వాగ్దానం ప్రమాదకరమని కూడా ఆ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. కనుక రాబోయే ఎన్నికలు రక్షణ, భద్రత చుట్టూ తిరిగే అవకాశం లేకపోలేదు. తనకొచ్చిన అవకాశాన్ని లేబర్ పార్టీ సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వస్తుందా లేక వోటర్లను ఒప్పించలేక చతికిలపడుతుందా అన్నది మరికొన్నాళ్లలో తేలిపోతుంది. -
ముందస్తు ఎన్నికలకు సునాక్
లండన్: ముందస్తు ఎన్నికలపై జోరుగా సాగిన ఊహాగానాలే నిజమయ్యాయి. పలురకాలుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాజు చార్లెస్–3కి తెలిపానని, పార్లమెంట్ రద్దుకు ఆయన అనుమతించారని వెల్లడించారు. వేసవిలో ఆరు వారాల్లో ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పారు. అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో కేబినెట్ భేటీ అనంతరం భారతీయ సంతతి బ్రిటన్ ప్రధాని సునాక్ ముందస్తు ఎన్నికల ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమైతే 2025 జనవరిలోగా బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. 10 డౌనింగ్ స్ట్రీట్ బయట ఎన్నికల ప్రకటన చేస్తూ.. తన పదవీకాలంలో సాధించిన విజయాలను సునాక్ వివరించారు. ‘మీకు వీలైనంత భద్రత ఇవ్వడానికి నా అధికార పరిధికి లోబడి చేయగలిగినంతా చేస్తాను. ఇది నా హామీ. బ్రిటన్ తన భవిష్యత్తును ఎంచుకోవాల్సిన తరుణమిది’ అని రిషి సునాక్ దేశ ప్రజలనుద్దేశించి అన్నారు. సునాక్ కన్జర్వేటివ్ పారీ్టకి ఓటమి తప్పదని, లేబర్ పార్టీకి విస్పష్ట మెజారిటీ కనిపిస్తోందని చాలా ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో వరుసబెట్టి లేబర్ పారీ్టయే గెలుస్తూ వచ్చింది. ఈ తరుణంలో రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేయడం గమనార్హం. అంతకుముందు బుధవారమే పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సునాక్ బదులిస్తూ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలుంటాయని చెప్పారు. అయితే ఆకస్మింగా కేబినెట్ భేటీని ఏర్పాటు చేయడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆకస్మిక కేబినెట్ భేటీ కోసం విదేశాల్లో ఉన్న మంత్రులు సైతం అర్ధంతరంగా తమ పర్యటనలు ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. చివరికి కేబినెట్ సమావేశం అనంతరం సునాక్ జూలై 4న ఎన్నికలుంటాయని ప్రకటించారు. -
యూకే పోస్టు–స్టడీ వీసాలు రద్దు!
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోకి వలసలను అరికట్టడానికి ప్రధానమంత్రి రిషి సునాక్ కొత్తరకం ఆలోచనలు చేస్తున్నారు. యూకేలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కల్పించే పోస్టు–స్టడీ వీసాను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై సొంత మంత్రివర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడం గమనార్హం. యూకే పోస్టు–స్టడీ వీసా పథకం 2021లో ప్రారంభమైంది. దీనితో భారతీయ విద్యార్థులు అధికంగా ప్రయోజనం పొందుతున్నారు. యూకేలో యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ అభ్యసించిన తర్వాత రెండేళ్లదాకా ఇక్కడే ఉంటూ ఉద్యోగాలు చేసుకొనే వెసులుబాటు లభిస్తోంది. ఒకవేళ ఈ వీసాను రద్దుచేస్తే భారతీయ విద్యార్థులే ఎక్కువగా నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో యూకేలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవన్నీ చట్టబద్ధంగానే జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. వలసలను అరికట్టే చర్యల్లో భాగంగా పోస్టు–స్టడీ వీసాలపై ఆంక్షలు విధించడమా లేక శాశ్వతంగా రద్దు చేయడమా అనే దానిపై ప్రధాని రిషి సునాక్ తర్జనబర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనను పలువురు యూకే మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి గిలియన్ కీగన్, విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. -
అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్లిస్ట్లో రిషి సునాక్ దంపతులు
ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా యూకే ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి వ్యక్తిగత సందప అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రిషిసునాక్ దంపతుల వ్యక్తిగత ఆస్తి 120 మిలియన్ యూరోలకు పెరిగింది. ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ వార్షిక నివేదికలో రిషి సునాక్ దంపతుల ఆస్తుల వివరాల్ని వెల్లడించింది. అయితే యూకేలో ఆర్ధిక అనిశ్చితి నెలకొన్న వారి ఆస్తులు పెరిగిపోతుండడం గమనార్హం.ఇన్ఫోసిస్లో2023లో రిషి సునాక్ దంపతుల సంపద 529 యూరోల నుంచి 651 మిలియన్ యూరోలకు చేరింది. ఈ మొత్తం సంపద పెరుగుదల ఇన్ఫోసిస్లోని వాటానే కారణమని సమాచారం. ఇన్ఫోసిస్లో అక్షతా మూర్తి వాటా విలువ 55.3 బిలియన్ యూరోలు. ఆమె షేర్ల విలువ 108.8 మిలియన్ యూరోలకు పెరగ్గా.. ఏడాది కాలానికి ఆ విలువ 590 యూరోలకు చేరింది. కింగ్ చార్లెస్ సంపదఇదిలా ఉండగా, కింగ్ చార్లెస్ సంపద ఏడాది కాలంలో పెరిగిందని, 600 మిలియన్ యూరోల నుండి 610 మిలియన్ యూరోలకు పెరిగినట్లు సండే టైమ్స్ రిచ్ లిస్ట్ నివేదించింది. అదే సమయంలో బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య తగ్గిపోయిందని ఈ నివేదిక హైలెట్ చేసింది. తగ్గిపోతున్న బిలియనీర్లు2022లో బిలియనీర్ల గరిష్ట సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా.. మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది .యూకేలోనూ భారతీయుల హవాబ్రిటన్లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్ యూరోల నుండి 37.2 బిలియన్ యూరోలకు పెరిగింది. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు ఊహించని ఎదురుదెబ్బ!
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. స్థానిక ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి ఎదురైంది. గత 40 ఏళ్ల చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఇంతలా ఓటమి చెందడం ఇదే మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. బ్రిటన్లో ఈ ఏడాది చివర్లలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఫలితాలు రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. కాగా, బ్రిటన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా కన్జర్వేటివ్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో, ప్రధాని రిష్ సునాక్పై ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. అలాగే, ఈ ఫలితాలు ప్రధాని పీఠంపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, బ్రిటన్లో 107 కౌన్సిల్స్కు ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ముందంజలో కొననసాగుతోంది. Disaster for Tories. Love to see it. Now @RishiSunak call for general elections. pic.twitter.com/6Bj1ARAUbh— OppaGaymer 🇵🇸 (@RafLee84) May 3, 2024 కాగా, బ్లాక్పూల్ సౌత్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డేవిడ్ జోన్స్పై లేబర్ పార్టీ అభ్యర్థి క్రిస్ వెబ్ ఘన విజయం సాధించారు. టోరీల నుంచి లేబర్ పార్టీకి 26 శాతం ఓటు స్వింగ్ అయింది. 1945 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. గత 40 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే దారుణ ఫలితమని, కన్జర్వేటివ్ ప్రభుత్వ పనితీరును అంతా గమనిస్తున్నారని ప్రొఫెసర్ జాన్ కర్టీస్ తెలిపారు. Local elections in England and Wales have delivered a blow to Prime Minister Rishi Sunak and his governing Conservative Party. The opposition Labour Party is on track to win the next general election which takes place later this year pic.twitter.com/iiHfbaqqUZ— TRT World (@trtworld) May 3, 2024 మరోవైపు.. బ్లాక్పూల్ సౌత్ ఉపఎన్నికలో టోరీ మెజారిటీ తారుమారైంది. ఇక్కడ ప్రతిపక్ష లేబర్ పార్టీ గణనీయ విజయాలను సాధించింది. బ్లాక్పూల్ సౌత్ ఉప ఎన్నికల్లో 26 శాతంతో తమ పార్టీ విజయం సాధిచడం కీలక పరిణామం అని లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ అన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఫలితాలు టోరీలు కౌన్సిల్ సీట్లలో సగం కోల్పోవచ్చని అంచనాలు వస్తున్నాయని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఈ వారాంతంలో లండన్ మేయర్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో లేబర్ పార్టీ లండన్ మేయర్ అభ్యర్థి సాదిక్ ఖాన్ మూడోసారి తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక, ప్రచారంలో తనకు సహకరించిన ప్రజలకు, తనను ఆదరించిన ఓటర్లకు ఆయన ప్రత్యర్థి బ్రిటీష్ భారతీయ వ్యాపారవేత్త తరుణ్ గులాటి కృతజ్ఞతలు తెలిపారు. తనకు భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోందని గులాటి వ్యాఖ్యలు చేశారు. -
అలెర్ట్ : యూకే వీసా నిబంధనలు కఠినతరం.. తక్షణమే అమల్లోకి
లండన్ : 2025 జనవరిలో జరగనున్న యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్తో ఓడిపోనున్నారా? ఆ ఓటమి నుంచి గట్టెక్కేందుకు వీసా మంజూరులో కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారా? అంటే అవుననే అంటున్నాయి యూకేలోని తాజా పరిణామాలు. వీసా మంజూరులో యూకే ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. యూకేకు వలసదారుల్ని తగ్గించే ప్రణాళికల్లో భాగంగా యూకేలో విధులు నిర్వహిస్తూ వారికి కుటుంబ సభ్యులకు వీసా స్పాన్సర్ చేయాలంటే అవసరమైన కనీస ఆదాయ పరిమితిని పెంచినట్లు యూకే ప్రకటించింది. కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు తెలిపింది. స్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసాస్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీస ఆదాయ పరిమితిని 55 శాతం పెంచింది. అంటే స్పాన్సర్డ్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీసం 18,600 నుంచి 29,000 పౌండ్స్ ఆదాయం ఉండాలి. వచ్చే ఏడాది వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 38,700 పౌండ్స్కు పెంచుతున్నట్లు యూకే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తేపలు నివేదికల ప్రకారం.. యూకేలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటముల్ని నిర్ధేశించడంలో ఇమ్రిగ్రేషన్ అంశం కీలకం.ఈ నేపథ్యంలో ఆయా పొలికల్ ఏజెన్సీలు,మీడియా సంస్థలు సర్వేలు చేయగా అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చిన అధికార కన్జర్వేటీవ్ పార్టీలో సగానికిపైగా ఎంపీలో ఓటమి పాలవుతారని సర్వేలు హైలెట్ చేశారు. ఇంతకంటే సులభమైన మార్గం లేదా?అందుకే వలస దారుల్ని కట్టడి చేయడంతో పాటు యూకేలోని పన్ను చెల్లింపు దారులపై భారం పడకుండా ఉండేలా యూకే ప్రధాని రిషి సునాక్ ప్రణాళికల్లో ఓ భాగమని చెబుతున్నాయి.వీసా మంజూరులో కొత్త నిబంధనలపై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ మాట్లాడుతూ.. యూకే ప్రజలకు ఆమోదయోగ్యం పరిపాలన అందిస్తూ..దేశంలోకి వలసలు విపరీతంగా పెరగుతున్న తరుణంలో వాటికి కట్టడి చేసేందుకు మాకు ఇంతకంటే సులభమైన మార్గం కన్పించలేదని తెలిపారు. -
స్మోకింగ్ బ్యాన్..! రిషి సునాక్పై వ్యతిరేకత
లండన్: బ్రిటన్లో స్మోకింగ్ బ్యాన్ చట్టంపై ప్రధాని రిషి సునాక్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2009 తర్వాత పుట్టిన వారికి అంటే.. 15, 15 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడాన్ని నిషేధించే చట్టాన్ని సునాక్ గతేడాదే ప్రతిపాదించారు. మంగళవారం (ఏప్రిల్16) ఈ చట్టాన్ని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రవేశపెట్టారు. సునాక్ సొంత పార్టీ కన్జర్వేటివ్స్ ఎంపీల్లో కొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ ప్రధానులు లిజ్ ట్రుస్, బొరిస్ జాన్సన్లు కూడా ఈ చట్టంపై వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమలు చేయడమంటే ప్రజల ఇష్టాఇష్టాలను నియంత్రించడమేననేది వారి వాదన. వేల కొద్ది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఒక జనరేషన్ను స్మోకింగ్ నుంచి దూరంగా ఉంచేందుకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని యూకే హెల్త్ సెక్రటరీ విక్టోరియా అట్కిన్స్ తెలిపారు. ఈ చట్టం దేశంలో ప్రొడక్టివిటీని పెంచడమే కాకుండా నేషనల్ హెల్త్ సర్వీస్పై భారాన్ని తగ్గిస్తుందన్నారు. ఇదీ చదవండి.. మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్ -
అలెర్ట్ : యూకే వీసా నిబంధనలు కఠినతరం.. తక్షణమే అమల్లోకి
లండన్ : 2025 జనవరిలో జరగనున్న యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్తో ఓడిపోనున్నారా? ఆ ఓటమి నుంచి గట్టెక్కేందుకు వీసా మంజూరులో కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారా? అంటే అవుననే అంటున్నాయి యూకేలోని తాజా పరిణామాలు. వీసా మంజూరులో యూకే ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. యూకేకు వలసదారుల్ని తగ్గించే ప్రణాళికల్లో భాగంగా యూకేలో విధులు నిర్వహిస్తూ వారికి కుటుంబ సభ్యులకు వీసా స్పాన్సర్ చేయాలంటే అవసరమైన కనీస ఆదాయ పరిమితిని పెంచినట్లు యూకే ప్రకటించింది. కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు తెలిపింది. స్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసా స్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీస ఆదాయ పరిమితిని 55 శాతం పెంచింది. అంటే స్పాన్సర్డ్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీసం 18,600 నుంచి 29,000 పౌండ్స్ ఆదాయం ఉండాలి. వచ్చే ఏడాది వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 38,700 పౌండ్స్కు పెంచుతున్నట్లు యూకే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే పలు నివేదికల ప్రకారం.. యూకేలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటముల్ని నిర్ధేశించడంలో ఇమ్రిగ్రేషన్ అంశం కీలకం.ఈ నేపథ్యంలో ఆయా పొలికల్ ఏజెన్సీలు,మీడియా సంస్థలు సర్వేలు చేయగా అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చిన అధికార కన్జర్వేటీవ్ పార్టీలో సగానికిపైగా ఎంపీలో ఓటమి పాలవుతారని సర్వేలు హైలెట్ చేశారు. ఇంతకంటే సులభమైన మార్గం లేదా? అందుకే వలస దారుల్ని కట్టడి చేయడంతో పాటు యూకేలోని పన్ను చెల్లింపు దారులపై భారం పడకుండా ఉండేలా యూకే ప్రధాని రిషి సునాక్ ప్రణాళికల్లో ఓ భాగమని చెబుతున్నాయి.వీసా మంజూరులో కొత్త నిబంధనలపై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ మాట్లాడుతూ.. యూకే ప్రజలకు ఆమోదయోగ్యం పరిపాలన అందిస్తూ..దేశంలోకి వలసలు విపరీతంగా పెరగుతున్న తరుణంలో వాటికి కట్టడి చేసేందుకు మాకు ఇంతకంటే సులభమైన మార్గం కన్పించలేదని తెలిపారు. -
జట్టుకు ఎంపిక చేయమన్న రిషి సునాక్: ఇప్పుడే కుదరదన్న ఈసీబీ!
యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ మరోసారి ఇంగ్లండ్ క్రికెటర్లతో మమేకమయ్యారు. ఆట పట్ల మరోసారి తన అభిరుచిని చాటుకున్నారు. దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో తన బ్యాటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించారు. కాగా క్రికెట్ను మరింతగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రధాని రిషి సునాక్ 35 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల(GBP- British pound sterling ) ప్యాకేజీని ప్రకటించారు. పాఠశాల స్థాయి నుంచే క్రికెట్ పట్ల ఆసక్తి కనబరిచే వారికి ప్రోత్సాహం అందించేందుకు ఈ భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. దాదాపు తొమ్మిది లక్షల మందికి ప్రయోజనం చేకూర్చేవిధంగా ప్రణాళికలు రచించినట్లు రిషి సునాక్ వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని ప్రకటించే క్రమంలో లండన్లో ఆయన.. ఇంగ్లండ్ క్రికెటర్లతో పాటు వర్ధమాన ఆటగాళ్లను కలిశారు. ఈ సందర్భంగా.. ఆండర్సన్తో ఫ్యాన్ బాయ్ మూమెంట్ను సునాక్ షేర్ చేసుకోవడం ఆయన హుందాతనానికి నిదర్శనంగా నిలిచింది. అదే విధంగా.. యువ క్రికెటర్లను సైతం ఉత్సాహరుస్తూ వారికి ఆటోగ్రాఫ్లు ఇచ్చారు సునాక్. కాగా ఆండర్సన్ను ఎదుర్కొనేందుకు తాను ముందుగానే నెట్ సెషన్లో పాల్గొన్నానంటూ రిషి సునాక్ వెల్లడించడం విశేషం. ఇందుకు బదులిచ్చిన ఆండర్సన్ ఆయన అభిమానానికి ఫిదా అయ్యాడు. ఇక ఈ విశేషాలకు సంబంధించిన వీడియో షేర్ చేసిన రిషి సునాక్.. ‘‘ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పిలుపునకు సిద్ధంగా ఉన్నా’’ అని తన సెలక్షన్ గురించి ఈసీబీకి సరదాగా రిక్వెస్ట్ పెట్టారు. ఇందుకు బదులిచ్చిన ఈసీబీ.. ‘‘బాగానే ఆడారు. కాకపోతే మీరు ఇంకొన్ని నెట్ సెషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది’’ అని అంతే సరదాగా స్పందించింది. కాగా 2026లో మహిళా టీ20 ప్రపంచకప్, 2030లో పురుషుల టీ20 వరల్డ్కప్నకు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈసీబీకి మరింత బూస్ట్ ఇచ్చేలా ప్రధాని రిషి సునాక్ ఈమేరకు ప్యాకేజీ ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆండర్సన్ సహా పలువురు క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. Not bad, perhaps a few more net sessions first 😉 https://t.co/u7AHCOMO08 — England Cricket (@englandcricket) April 5, 2024 -
UK Elections: చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమా?
లండన్: కన్జర్వేటివ్ పార్టీ.. బ్రిటన్లో దాదాపు పదిహేన్లపాటు అధికారంలో కొనసాగింది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. గత రెండు మూడేళ్లుగా ఆ దేశ రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి(ప్రధాని, మంత్రుల రాజీనామాలు.. తొలగింపులు), మరీ ముఖ్యంగా భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలో ఆ పార్టీ ఇమేజ్ మరింత దిగజారిపోయిందని ఆ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో యూకేలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో(తేదీలు ఖరారు కావాల్సి ఉంది) లేబర్ పార్టీ ప్రభంజనం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. కన్జర్వేటివ పార్టీ గత ఐదేళ్లలో ఇచ్చిన హామీలీను నెరవేర్చకపోగా.. దేశాన్ని వరుస సంక్షోభాల్లోకి నెట్టేసిందన్న అభిప్రాయంలో ఉన్నారు అక్కడి ప్రజలు. పైగా కాస్ట్ ఆఫ్ లివింగ్ సైతం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా.. మార్చి 7వ తేదీ నుంచి 27 తేదీ మధ్య YouGov ఓ పబ్లిక్ సర్వే నిర్వహించింది. అందులో 18, 761 మంది పౌరులు పాల్గొన్నారు. వాళ్లలో మెజారిటీ పౌరులు.. లేబర్ పార్టీకే ఓటేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంట్లో.. అధికారం చేపట్టాలంటే 326 స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే యూజీవోవీ సర్వేలో లేబర్ పార్టీకి 403 స్థానాలు, కన్జర్వేటివ్ పార్టీ కేవలం 155 స్థానాలు దక్కించుకుంటాయని సదరు సర్వే తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇదే సంస్థ జరిపిన సర్వేలో కన్జర్వేటివ్ పార్టీకి 169 స్థానాలు రావొచ్చని అంచనా వేయగా.. తాజా సర్వేలో ఆ స్థానాలు మరింత తగ్గడం గమనార్హం. పోల్ ఆఫ్ పోల్స్ పోలిటికో సైతం ఇలాంటి ట్రెండ్నే ప్రకటించింది. మార్చి 31వ తేదీన వెల్లడించిన సర్వేలో.. 44 శాతం లేబర్ పార్టీకి, 23 శాతం కన్జర్వేటివ్పార్టీకి సీట్లు దక్కవచ్చని వెల్లడించింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ అక్టోబర్ 24, 2022లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన ముందు పెను సవాళ్లు ఉండగా.. ఆయన వాటిని అధిగమిస్తానని స్పష్టం చేశారు. అయితే.. అప్పటి నుంచి బ్రిటన్ సంక్షోభం మరింత ముదిరింది. ఈ మధ్యలో ఆయన పైనా విమర్శలు వెల్లువెత్తుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మే 2వ తేదీన యూకేలో మేయర్, లోకల్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను వాయిదా వేయించాలని కన్జర్వేటివ్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ, కోర్టులు అందుకు అంగీకరించలేదు. ఇక ఈ ఎన్నికల్లోనూ కన్జర్వేటివ్ పార్టీ ఓటమి తప్పదంటూ ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయి. -
సర్వేల్లో రిషి సునాక్కు షాక్
లండన్: బ్రిటన్లో ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే భారత సంతతికి చెందిన రిషి సునాక్తోపాటు ఆయన కేబినెట్లోని సగానికి పైగా మంత్రులకు పరాజయం తప్పదని ముందస్తు సర్వేలో తేలింది. అధికార కన్జర్వేటివ్ పార్టీకి 100 పార్లమెంట్ స్థానాలు కూడా దక్కడం గగనమేనని, అదే సమయంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ 468 సీట్లు గెలుచుకుని, 286 సీట్ల మెజారిటీ సాధిస్తుందని కూడా అంచనా వేసింది. బెస్ట్ ఫర్ బ్రిటన్ తరఫున సర్వేషన్ సంస్థ 15,029 మందితో తాజాగా సర్వే జరిపింది. ఇందులో పాల్గొన్న వారిలో 45 శాతం మంది ప్రతిపక్ష లేబర్ పార్టీకే ఓటేశారు.పాయింట్ల వారీగా చూస్తే అధికార కన్జర్వేటివ్ పార్టీ కంటే లేబర్ పార్టీ 19 పాయింట్లు ముందంజలో ఉంది. గత ఏడాది డిసెంబర్లో చేపట్టిన పోలింగ్తో పోలిస్తే ఇది మూడు పాయింట్లు ఎక్కువ. కన్జర్వేటివ్ పార్టీ 100 లోపే సీట్లు గెలుచుకోవడం, అంటే 250 ఎంపీ స్థానాలను కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారవుతుందని నిర్వాహకులు విశ్లేషిస్తున్నారు. సొంత సీటు రిచ్మండ్ అండ్ నార్త్అల్లెర్టన్లో ప్రధాని రిషి సునాక్కు లేబర్ పార్టీ కంటే 2.4 శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.ఈ పోలింగ్లో ఎటు వైపూ మొగ్గు చూపని 15 శాతం మంది ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదని ‘సర్వేషన్’తెలిపింది. కన్జర్వేటివ్ పార్టీ పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా ఉంటుందని ఓ విశ్లేషకుడు అన్నారు. ఇలా ఉండగా, మే 2వ తేదీన స్థానిక కౌన్సిళ్లు, మేయర్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ పేలవమైన ఫలితాలను సాధించిన పక్షంలో ప్రధాని రిషి సునాక్పై సొంత పారీ్టలోనే తిరుగుబాటు రావడం ఖాయమని కూడా అంటున్నారు. -
'సింప్లిసిటీకి కేరాఫ్ సింబల్ వాళ్లు'!దటీజ్ అక్షత మూర్తి!
అక్షతా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక దేశ ప్రధాని భార్య అయినా చాలా సాదాసీదాగానే ఉంటారు. ఇక ఆమె తల్లిదండ్రులు నారాయణ మూర్తి దంపతులు గురించి అస్సలు చెప్పాల్సిన పనిలేదు. అంత పెద్ద టెక్ కంపెనీ వ్యవస్థాపకులై కూడా నారాయణ మూర్తి దంపతులిద్దరూ ఎంత సింపుల్గా ఉంటారో అందరికి తెలిసిందే. ఇక వాళ్ల పెంపకంలో పెరిగిన కూతురు అక్షతా వారిలానే కదా! ఉండేది. ఆ కుటుంబం అంతా రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చారు. అక్కడ ఎలాంటి సెక్యూరిటీ గార్డులు లేకుండా సాధారణ వ్యక్తుల్లా మెలిగారు. పైగా ఎవ్వరూ వారిని గుర్తుపట్ట లేనంతగా చాలా సాధార వ్యక్తుల్లా వ్యవహరించడమ గ్రేట్ కదా!. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కొంతమంది బిలియనర్లు, పలుకు బడిన వ్యక్తులు అలాంటి దేవాలయాలకు వస్తే హడావిడి ఓ రేంజ్లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సాధారణ భక్తులకు కూడా వీళ్ల హడావిడి కారణంగా దర్శనం కూడా దొరకపోగా గంటల తరబడి వెయింట్ చేస్తు ఉండాపోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతుంది. కానీ ఇక్కడ యూకే ప్రధాని భార్య అక్షతామూర్తి, తన ఇద్దరు కూతుళ్లు అనౌష్క, కృష్ణ, తల్లిదండ్రులు నారాయణమూర్తి, సుధా మూర్తిలతో కలిసి రాఘవేంద్ర స్వామి ఆలయంలో సందడి చేశారు. అక్కడ మఠంలోని పుస్తకాలను వెతుకుతూ కనిపించారు. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా సాధారణ భక్తుల్లా వ్యవహరించిన తీరు నెటిజన్లను ఆకర్షించడమే గాక వాళ్ల సింపుల్ సిటీకి ఫిదా అవ్వుతూ గ్రేట్ అంటూ నెట్టింట ప్రశంసల జల్లు కురిపించారు కాగా, ఈ నెలలోనే అక్షత తల్లిదండ్రులతో కలిసి రచయిత్రి చిత్ర బెనర్జీ దివాకరుణి తాజా పుస్తకం 'యాన్ అన్కామన్ లవ్': ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి' ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక అక్షతామూర్తి ఆమె భర్త రిషి సునాక్ గతేడాది సెప్టెంబర్లో జీ20 సదస్సు కోసం భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. అప్పుడు ఈ దంపతులిద్దరూ అక్షరధామ్ మందిర్ దర్శనం చేసుకుని పూజలు చేశారు. UK PM Rishi Sunak's wife and kids spotted at Raghavendra Mutt in Bengaluru, accompanied by Infosys Founder Narayanamurthy. Their simplicity shines through, with no security in sight. pic.twitter.com/WxIAvHh40w — M.R. Guru Prasad (@GuruPra18160849) February 26, 2024 (చదవండి: వింత పెళ్లి!.. వధూవరులెవరో తెలిస్తే కంగుతింటారు!) -
UK:మేయర్పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంపీ సస్పెండ్
లండన్: బ్రిటన్ అధికార కన్జర్వేటివ్ పార్టీ.. తన సొంతపార్టీ ఎంపీ, మాజీ డిప్యూటీ చైర్మన్పై సస్పెన్షన్ వేటు వేసింది. లండన్ మేయర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ లీ అండర్సన్ను ప్రధానమంత్రి రిషి సునాక్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం కన్జర్వేటివ్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. లండన్ మేయర్ సాదిక్ ఖాన్పై ఇస్లామిస్టుల ప్రభావం ఉందని, వారి నియంత్రణలో ఆయన ఉన్నారని ఓ టీవీ ఇంటర్వ్యూలో ఎంపీ లీ అండర్సన్ అన్నారు. దీంతో అయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాన మంత్రి రిషి సునాక్తో పాటు పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు జాత్యహంకార పూరితమైనవి అని వెంటనే క్షమాపణలు చేప్పాలని పెద్దఎత్తన డిమాండ్ చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి లీ అండర్సన్ నిరాకరించారు. ‘లండన్ మేయర్పై లీ ఆండర్సన్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపన చెప్పడానికి నిరాకరించారు. దీంతో పార్టీ చీఫ్ విప్.. ఆయన్ను ఎంపీ పదవిపై సప్పెన్షన్ విధించారు’ అని అధికార ప్రతినిధి టోరీ శాసనసభ్యుడు సైమన్ హార్ట్ తెలిపారు. ఇక.. ఇజ్రాయెల్ దేశం.. గాజాపై దాడులు చేయటం ప్రారంభించినప్పటి నుంచి బ్రిటన్లో ఇస్లాంపై ద్వేషం, యూదులపై వ్యతిరేకమైన సంఘటనలు చోటు చేసుకోవటం పెరిగినట్లు తెలుస్తోంది. -
వివాదంలో యూకే ప్రధాని.. కాంట్రాక్ట్లన్నీ ‘మామకే’ అప్పనంగా కట్టబెట్టేస్తున్నాడు!?
యూకే ప్రతిపక్ష ‘లేబర్ పార్టీ’, పలు మీడియా సంస్థలు బాంబు పేల్చాయి. భారత్కు చెందిన రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ యూకేలో వృద్ది సాధించేలా, అందుకు తాను సహాయం చేయడంపై సంతోషంగా ఉన్నట్లు ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి లార్డ్ డొమినిక్ జాన్సన్ అన్నారని, అందుకు ఊతం ఇచ్చేలా కొన్ని ఫోటోల్ని, పలు కీలక డాక్యుమెంట్లను బహిర్గతం చేశాయి. ఇంతకి ఆ ఫోటోలు ఎవరివి? ఆ డాక్యుమెంట్లలో ఏముంది? లేబర్ పార్టీ విడుదల చేసిన డాక్యుమెంట్లలో.. యూకేలో ప్రైవేట్, ప్రభుత్వ కాంట్రాక్ట్లు ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలంటే అందుకు తప్పని సరిగా ప్రభుత్వ అనుమతులు ఇవ్వడంతో పాటు బిడ్డింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అవేం లేకుండా నేరుగా యూకే ప్రభుత్వం ఇన్ఫోసిస్కు ప్రైవేట్,ప్రభుత్వ కాంట్రాక్ట్లను అప్పనంగా కట్టబెడుతున్నాయి ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇన్ఫోసిస్కు 750 మిలియన్ పౌండ్స్ కాంట్రాక్ట్ యూకేలో 750 మిలియన్ పౌండ్ల విలువైన కాంట్రాక్ట్ను రిషిసునాక్, ఆయన భార్య, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ కుమార్తెకు వాటాలున్నా ఇన్ఫోసిస్కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్లు మీడియా సంస్థలు జరిపిన అంతర్గత విచారణలో తేలినట్లు పేర్కొన్నాయి. ఇటీవల 750 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ విలువైన యూకే ప్రభుత్వ కాంట్రాక్టులను పేరున్న ఐటీ కంపెనీలకు అందించేలా రిషి సునాక్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన జాబితాలో ఇన్ఫోసిస్ ఉన్నట్లు సమాచారం. 250 మిలియన్ పౌండ్స్ కాంట్రాక్ట్ అంతేకాదు ‘ఇంటెలిజెంట్ ఆటోమేషన్’ అని పిలవబడే కాంట్రాక్ట్ను ఎన్హెచ్ఎస్ షేర్డ్ బిజినెస్ సర్వీసెస్ అనే సంస్థ యూకేలో 250 మిలియన్ పౌండ్ల కాంట్రాక్ట్ను 25 ఐటీ కంపెనీలకు అప్పగించినట్లు, వాటిల్లో భారత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నట్లు లేబర్ పార్టీ విడుదల చేసిన ఆ డాక్యుమెంట్లలో ఉంది. నేరుగా కాంట్రాక్ట్లు కట్టబెట్టి రిషి సునాక్ ప్రభుత్వ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ) విభాగానికి ఐటీ సేవలు అత్యవసరం. ఇందుకోసం 562.5మిలియన్ల విలువైన కాంట్రాక్ట్ కోసం 62 సంస్థలు పోటీ పడ్డాయి. వాటిల్లో ఇన్ఫోసిస్ ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ ‘ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్’ కిందకి వస్తాయి. అంటే టెండరింగ్ లేకుండా ప్రభుత్వ సంస్థలు నేరుగా కాంట్రాక్టులను ప్రైవేటు సంస్థలకు ఇచ్చేందుకు అనుమతిస్తాయి. ఇక యూకే ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్లు పొందినందుకు ఎలాంటి చెల్లింపులు జరపలేదని, ట్యాక్స్ చెల్లించే అవకాశం ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్సీఏ ప్రతినిధులు మాత్రం తాజా డిజిటల్ సర్వీసెస్ ఫ్రేమ్వర్క్ ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్నవే తప్పా.. మేం ఇంకా ఎవరికి ఎలాంటి కాంట్రాక్టులను ఇవ్వలేదని తెలిపారు. ఇన్ఫోసిస్కు సాయం.. సంతోషంలో యూకే మంత్రి పైన పేర్కొన్నట్లుగా 750 మిలియన్ల పౌండ్ల ప్రభుత్వ కాంట్రాక్ట్ను ఇన్ఫోసిస్కు అప్పగించే సమయంలో యూకే వాణిజ్య శాఖ మంత్రి లార్డ్ డొమినిక్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు లేబర్ పార్టీ విడుదల చేసిన డాక్యుమెంట్లలో హైలెట్ చేసింది. తమ దేశంలో ఇన్ఫోసిస్ వృద్ది సాధించేందుకు తన వంతు చేస్తున్న ‘సహాయం’పై జాన్సన్ సంతోషం వ్యక్తం చేసినట్లు విమర్శలు కురిపిస్తుంది. అంతే కాదు, యూకేలో ఇన్ఫోసిస్ బిజినెస్ పరంగా తనవల్ల ఎంత మేరకు లాభం చేకూరుతుందో అంత చేయాలని ఇన్ఫోసిస్ ప్రతిధినిధులు జాన్సన్తో చెప్పారని పేర్కొన్నాయి. బెంగళూరులో ఇన్ఫోసిస్ మంత్రి ప్రత్యక్షం యూకేలో వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన అంశంలో భారత్లోని ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయంలో బెంగళూరులో యూకే వాణిజ్య శాఖ మంత్రి డొమినిక్ జాన్సన్ ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన ఫోటోల్ని విడుదల చేసింది. ఈ అంశంపై ఇన్ఫోసిస్, అటు రిషి సునాక్లు స్పందించాల్సి ఉంటుంది. -
UK Prime Minister: చిన్నతనంలో వివక్షకు గురయ్యా: సునాక్
లండన్: చిన్నతనంలో జాతి వివక్షకు గురయినట్లు భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ వెల్లడించారు. ఇంగ్లిష్ ఉచ్చారణలో యాస లేకుండా తన తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. ‘చిన్నప్పుడు జాతి వివక్షకు గురయ్యా. నాతోబుట్టువుల నుద్దేశించి కొందరు చేసిన వెటకారం, వెక్కిరింపులను ప్రత్యక్షంగా చూశా. ఎంతో బాధేసింది’అని సునాక్ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన పిల్లలు జాతి వివక్షను ఎదుర్కోవడం లేదని అన్నారు. తన భారతీయ వారసత్వం గురించి చెబుతూ సునాక్... ఆకారం, రూపం ఒక అవరోధంగా మారకూడదని తల్లిదండ్రులు తమకు చెప్పేవారన్నారు. భారతీయ తరహా యాస బయటపడకుండా మాట్లాడాలని వారు పదేపదే చెప్పేవారు. మేం మాట్లాడే భాషపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు. అలా, సరైన అభ్యాసంతో బ్రిటిష్ యాసను మేం సరిగ్గా అనుకరించ గలిగేవాళ్లం. అది చూసి మా అమ్మ చాలా సంతోషించారు’అని సునాక్ అన్నారు. జాత్యహంకార ధోరణి ఏ రూపంలోనిదైనా ఆమోదం యోగ్యం కాదని రిషిసునాక్ చెప్పారు. -
భారతీయులకు షాకుల మీద షాకులిస్తున్న యూకే ప్రధాని రిషి సునాక్!
భారతీయులతో పాటు, ఇతర విదేశీయులకు యూకే ప్రధాని రిషి సునాక్ వీసా మంజూరులో షాకుల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే నాన్ రీసెర్చ్ పీజీ విద్యార్థులు తమ వెంట కుటుంబ సభ్యులను (dependent visa) తీసుకుని వచ్చేందుకు అవసరమయ్యే డిపెండెంట్ వీసాను రద్దు చేశారు. తాజాగా యూకేలో ఇపై జాబ్ చేయాలంటే ఉద్యోగుల (skilled worker visa) జీతం ఎక్కువగా ఉండాలనే కొత్త నిబంధనను తెచ్చింది. దీంతో విద్యార్ధులతో పాటు ఉద్యోగం చేసే వారు సైతం ఇకపై యూకేకి వెళ్లడం మరింత కఠినంగా మారనుంది. వచ్చే ఏడాది యూకేలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా దేశంలోకి వలసల్ని నిరోధించేలా వీసా మంజూరులో కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. యూకేలో ఫ్యామిలీ వీసా రూల్స్? తాజాగా, స్కిల్డ్ వర్క్ వీసా పొందాలంటే ఉద్యోగుల కనీస వేతనాన్ని 47 శాతం అంటే 29,000 యూరోల నుంచి 38,700 యూరోలకు పెంచింది. అయితే ఈ కనీస వేతనం హెల్త్ కేర్, సోషల్ కేర్ విభాగాలకు వర్తించదు. కేర్ వర్క్ర్లు వాళ్ల కుటుంబ సభ్యుల్ని యూకేకి తెచ్చుకునేందుకు అనుమతి లేదు. యూకేకి పెరిగిపోతున్న విదేశీయుల తాకిడి ఈ ఏడాది జూన్లో 70,000 మంది విదేశీయులు యూకేలో నివసించేందుకు వచ్చారు. అయితే, రోజురోజుకు విదేశీయుల తాకిడి పెరుగుతుండటంతో వసతుల కల్పన బ్రిటన్ సర్కార్కు ఇబ్బందికరంగా మారింది. కాబట్టే ఈ ఆంక్షల్ని విధించింది. అదే సమయంలో ఇప్పటికే వీసా ఉండి దానిని రెన్యూవల్ చేసుకునే వీసా దారులకు కొత్త నిబంధనలు వర్తించవని యూకే ఇమ్మిగ్రేషన్ విభాగం హోం ఆఫీస్ తెలిపింది. స్కిల్డ్ వర్క్ వీసా పొందాలంటే? యూకే విధించిన కొత్త నిబంధనల ఆధారంగా స్కిల్డ్ వర్క్ వీసా పొందాలంటే వీసా దారులు కనీసం 70 పాయింట్స్ ఉండాలి. అందులో 50 పాయింట్లు మీరు కనీస నైపుణ్య స్థాయి కంటే ఎక్కువ జాబ్ ఆఫర్ను కలిగి ఉండటం, ఇంగ్లీష్ మాట్లాడటం ద్వారా పొందవచ్చు. మిగిలిన 20 పాయింట్లు ఎక్కువ జీతం, చేస్తున్న విభాగంలో ఉద్యోగుల కొరత ఉండాలి. లేదంటే చేసే జాబ్కు అనుగుణంగా పీహెచ్డీ చేసి ఉండాలి. యూకేలో ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉన్న విభాగాలు తక్కువ వేతనం ఉండి ఉద్యోగుల డిమాండ్ ఎక్కువగా ఉన్న విభాగాలకు చెంది ఉండి ఉంటే పైన పేర్కొన్న విధంగా 70 పాయింట్లు లభిస్తాయి. వీసా ఈజీగా దొరుకుతుంది. ఇక యూకేలో ఉద్యోగులు తక్కువగా ఉన్న విభాగాల్ని పరిశీలిస్తే ఆరోగ్యం, విద్యా కేర్ టేకర్లు గ్రాఫిక్స్ డిజైనర్లు కన్స్ట్రక్టన్ వర్కర్లు పశువైద్యులు నాన్ రీసెర్చి కోర్సుల్లోని పీజీ విద్యార్ధులకు నో ఛాన్స్ భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్ధులకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలకు తరలివెళుతుంటారు. వారితో పాటు వారి కుటుంబసభ్యులు డిపెండెంట్ వీసాను అందిస్తుంటాయి. జనవరి 1 నుంచి యూకే ప్రభుత్వం నాన్ రీసెర్చి కోర్సుల్లోని పీజీ విద్యార్ధులకు డిపెండెంట్ వీసాను రద్దు చేసింది. బ్రిటన్ విధానం ప్రకారం వీసా హోల్డర్పై ఆర్థికంగా ఆధారపడిన వారిని మాత్రమే డిపెండెంట్గా పరిగణిస్తారు. ఆ జాబితాలోకి జీవిత భాగస్వామి అంటే భార్య లేదా భర్త, 18 ఏండ్ల లోపు పిల్లలు వస్తారు. కొన్ని సందర్భాల్లో 18 ఏండ్లు దాటిన పిల్లలు, తల్లిదండ్రులు, బామ్మలు, తాతయ్యలు వస్తారు. -
యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్..
స్వదేశీయులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి.. ఇమ్మిగ్రేషన్ను తగ్గించడానికి బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్రిటన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ను తగ్గించడానికి "రాడికల్ యాక్షన్" ప్రకటించింది. ఇందులో భాగంగానే నైపుణ్యం కలిగిన విదేశీయుడు యూకేలో పనిచేయడానికి వీసా కావాలనుకుంటే.. కనీస వేతనాన్ని కూడా భారీగా పెంచింది. 2022లో ప్రభుత్వం జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్య 745000. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికంగా కావడం గమనార్హం. పెరిగిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్యను మూడు లక్షల కంటే తక్కువకు తీసుకురావాలనుకునే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ దేశ హోమ్ మినిష్టర్ 'జేమ్స్ క్లెవెర్లీ' (James Cleverly) తెలిపారు. అంతే కాకుండా కొత్త రాకపోకలను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్పై ఒత్తిడి పెరగటం కూడా ఇందుకు ఒక కారణం అని తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ చాలా ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడించాయి, దానిని తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు, ఇవన్నీ యూకే ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయని.. రిషి సునాక్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ విదేశీ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్కు తీసుకుని రావడంపై కూడా నిషేధం ఉంది. అయితే రీసెర్చ్ డిగ్రీలు చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇందులో నుంచి మినహాయింపు ఉంటుంది. విదేశీ ఉద్యోగుల జీతం కూడా 38,000 పౌండ్లకు (రూ.40,01,932) పెంచింది. గతంలో యూరోపియన్ యూనియన్ దేశాల వారు ఎక్కువగా బ్రిటన్ దేశానికీ వలసలు వచ్చేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఇండియా, నైజీరియా, చైనా నుంచి బ్రిటన్ వెళ్లేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని సమాచారం. Immigration is too high. Today we’re taking radical action to bring it down. These steps will make sure that immigration always benefits the UK. pic.twitter.com/osz7AmcRgY — Rishi Sunak (@RishiSunak) December 4, 2023 We've just announced the biggest ever cut in net migration. No Prime Minister has done this before in history. But the level of net migration is too high and it has to change. I am determined to do it. — Rishi Sunak (@RishiSunak) December 4, 2023 -
రిషి సునాక్ పాపులారిటీ రేటింగ్ 25%
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్కు, అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఇదొక పెద్ద ఊరట. ఇటీవల మంత్రివర్గంలో మార్పుల తర్వాత సునాక్ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. పార్టీలో అసమ్మతి మొదలైంది. అయితే, శీతాకాల బడ్జెట్లో కొన్నిరకాల పన్నులను తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీంతో రిషి సునాక్తోపాటు ప్రభుత్వానికి ప్రజాదరణ స్వల్పంగా పెరిగినట్లు తాజాగా ‘ద టైమ్స్’ పత్రిక నిర్వహించిన ఓపీనియన్ పోల్స్లో వెల్లడయ్యింది. బడ్జెట్ను బుధవారం పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పన్ను మినహాయింపుల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. సర్వేలో సునాక్ ప్రభుత్వ పాపులారిటీ రేటింగ్ 25 శాతానికి చేరినట్లు తేలింది. గత వారంతో పోలిస్తే ఇది 4 పాయింట్లు అధికం కావడం విశేషం. ఇటీవలి కాలంతో కన్జర్వేటివ్ పారీ్టకి దక్కిన అత్యధిక రేటింగ్ ఇదే. ఇదిలా ఉండగా, ప్రతిపక్ష లేబర్ పార్టీ రేటింగ్లో ఎలాంటి మార్పు జరగలేదు. ప్రజాదరణ 44 శాతంగానే ఉన్నట్లు సర్వే వెల్లడించింది. -
రిషి సునాక్పై సుయెల్లా బ్రేవర్మన్ ధ్వజం: మూడు పేజీల లేఖ కలకలం
మంత్రివర్గంలో అనూహ్యంగా మార్పులు చేసి, కొత్త వివాదానికి తెరలేపిన బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత, భారత్ సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ స్పందించారు. ప్రధాని సునాక్కు ఎవరూ మద్దతుగా లేని సమయంలో తాను ఎంతో అండగా నిలిచానని, వాగ్దానాలన్నింటినీ పక్కన బెట్టి, పాలనలో విఫలమై, ఇపుడు తనపై వేటు వేశారంటూ ఘాటు విమర్శలతో ఒక లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం నుండి వైదొలగమని కోరినందుకు ధన్యవాదాలు. ఇది బాధ కలిగించింది కానీ, బ్రిటీష్ ప్రజలు కోరికమేరకు హోం సెక్రటరీగా పని చేయడం తన అదృష్టమనీ, ఈ సందర్బంగా పౌరసేవకులు, పోలీసులు, బోర్డర్ ఫోర్స్ అధికారులు , భద్రతా నిపుణులందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు. కొన్ని షరతులపై 2022లో అక్టోబ్లో హోం సెక్రటరీగా సేవ చేయడానికి ఆఫర్ని అంగీకరించాను అంటూ తన లేఖను మొదలు పెట్టారు. (వర్క్ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే: దిగ్గజాలు ఇపుడేమంటాయో?) రిషి సునాక్ ప్రధాని కావడానికి తాను ఎంతో తోడ్పాడ్డానని ఆమె పేర్కొన్నారు. కీలకమైన పాలసీలపై తనకిచ్చిన దృఢమైన హామీల మేరకు ఆయనకు మద్దతిచ్చాననీ, అయితే ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి, కీలకమైన విధానాల అమల్లో విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే దేశానికి మేలు చేస్తానని బ్రిటన్ ప్రజలకిచ్చిన హామీలను రిషి విస్మరించాంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అంతేకాదు ప్రధానిగా కొన సాగేందుకు రిషి సునాక్ అనర్హుడంటూ మండిపడ్డారు. అక్రమ వలసలను తగ్గించడం, ఇంగ్లీషు ఛానల్నుదాటకుండా వలస పడవలను ఆపడం, బయోలాజికల్ సెక్స్ను రక్షించేలా పాఠశాలలకు చట్టబద్ధమైన మార్గదర్శకత్వం జారీ చేయడం, ఉత్తర ఐర్లాండ్ ప్రోటోకాల్పై లాంటి వాగ్దానాల్ని ఆమె ప్రస్తావించారు. ఇది తమ పరస్పర ఒప్పందానికి ద్రోహం మాత్రమే కాదు, దేశానికి చేసి ద్రోహం కూడా అంటూ మూడు పేజీల లేఖలో బ్రేవర్మన్ ధ్వజమెత్తారు. ఎవరైనా నిజాయితీగా ఉండాలి అసలు మీ ప్లాన్లేవీ పని చేయడం లేదు, రికార్డు స్థాయిలో ఎన్నికల పరాజయాల్ని చూశాం. సమయం మించి పోతోందంటూ ఆమె ఒక రేంజ్లో ప్రధానిపై విరుచుకుపడ్డారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: కీలక పరిణామం, ఇది వాడి పనేనా?) ఇది ఇలా ఉంటే రిషి సునాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. సొంత పార్టీ నుంచే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. రిషి క్యాబినెట్లోని సీనియర్, సుయెల్లా బ్రేవర్మన్ను హోంమంత్రిగా తొలగించడాన్ని వారు తప్పు పడుతున్నారు. గాజాపై ఇజ్రాయేల్ దాడులను వ్యతిరేకిస్తూ లండన్ వీధుల్లో పాలస్తీనా మద్దతుదారులు మార్చ్, పోలీసుల తీరుపై గత వారం చేసిన వ్యాఖ్యల తర్వాత సుయెల్లాను తొలగించిన విషయం తెలిసిందే. -
బ్రిటన్ పీఎం సునాక్కు పదవీ గండం!
లండన్: తన మంత్రివర్గంలో అనూహ్యంగా మార్పులు చేసి, కొత్త వివాదానికి తెరలేపిన యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని, పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ సొంత పార్టీ(కన్జర్వేటివ్) ఎంపీ ఆండ్రియా జెన్కిన్స్ తాజాగా ‘1922 కమిటీ’ చైర్మన్ సర్ గ్రాహమ్ బ్రాడీకి లేఖ రాశారు. అయితే, రిషి సునాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి డిమాండ్ తెరపైకి రావడం ఇదే మొదటిసారి. సొంత పార్టీ నుంచే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. యూకే మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ను మద్దతుదారుగా పేరుగాంచిన ఎంపీ ఆండ్రియా జెన్కిన్స్ రాసిన అవిశ్వాస లేఖ చర్చనీయాంశంగా మారింది. సునాక్ పదవి నుంచి తప్పుకోవాలని, ఆ స్థానంలో అసలు సిసలైన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిని నియమించాలని జెన్కిన్స్ తేల్చిచెప్పారు. ‘జరిగింది ఇక చాలు. రిషి సునాక్ ఇంటికెళ్లాల్సిన సమయం వచ్చింది’ అని ‘ఎక్స్’లో జెన్కిన్స్ పోస్టు చేశారు. అవిశ్వాస లేఖను కూడా జతచేశారు. ప్రధానమంత్రిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ పదవి ఊడడానికి ముమ్మాటికీ సునాక్ కారణమని ఆయన ఆరోపించారు. సుయెల్లా బ్రేవర్మన్ను హోంమంత్రి పోస్టు నుంచి తొలగించడాన్ని జెన్కిన్స్ తప్పుపట్టారు. నిజాలు మాట్లాడినందుకే ఆమెపై వేటు వేశారని ఆక్షేపించారు. సునాక్ రాజీనామా కోసం తన సహచర ఎంపీలు కూడా గళమెత్తుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం కోసం తాము పోరాడుతున్నామని పేర్కొన్నారు. అవిశ్వాసం సాధ్యమేనా? అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో 15 శాతం మంది ఎంపీలు అవిశ్వాసాన్ని కోరుతూ లేఖలు రాస్తే సునాక్కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. పార్లమెంట్లో అవిశ్వాస పరీక్ష ఎదుర్కోక తప్పదు. నైపుణ్యం, అనుభవానికి పెద్దపీట: సునాక్ మంతివర్గంలో మార్పులపై ప్రధాని రిషి సునాక్ స్పందించారు. తన ప్రతిస్పందనను ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశానికి దీర్ఘకాలంలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుట్టడానికి సిద్ధంగా ఉండే ఒక ఉమ్మడి బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నైపుణ్యం, అనుభవం, సమగ్రతకు పెద్దపీట వేశామన్నారు. దేశ కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బృందం తోడ్పడుతుందని వివరించారు. -
మార్పుల వ్యూహంతో మేలెంత?!
మార్పు మంచికే! అయితే, అన్ని మార్పులూ మంచి చేస్తాయా? మంచిని ఆశించడమే తప్ప, ఆఖరికి ఏమవుతుందో అప్పటికప్పుడు చెప్పలేం. బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ప్రస్తుతం మార్పునే నమ్మారు. క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించారు. పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్శనలపై విరుచుకుపడిన హోమ్ మంత్రి సువెల్లా బ్రేవెర్మన్ను పక్కకు తప్పించారు. ఆమె స్థానాన్ని విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీకి అప్పగించారు. మాజీ ప్రధాని అయిన 57 ఏళ్ళ డేవిడ్ కామెరాన్ను విదేశాంగ మంత్రిగా ముందుకు తెచ్చారు. భారతీయ సంతతికి చెందిన 43 ఏళ్ళ బ్రేవెర్మన్ ఛాందసవాద, వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుపడడంతో, ఆమెకు ఉద్వాసన పలికి, మధ్యేవాదానికి జై కొడుతున్నట్టు కనిపించే యత్నం చేశారు. మునుపటి లిజ్ ట్రస్ హయాం నుంచి ప్రతికూలత మూటగట్టుకున్న కన్జర్వేటివ్ పార్టీ పట్ల మళ్ళీ నమ్మకం కలిగించడానికి సునాక్కు ఇవి సరిపోతాయా? కన్జర్వేటివ్ పార్టీ తన సొంత ఉనికిని కాపాడుకొనేందుకు కిందా మీదా పడుతోందనడానికి తాజా ఉదాహరణ రిషీ సునాక్ తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని విశ్లేషకుల మాట. బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఒక్కరే కాక ఇంకా పలువురు పెద్ద పదవులు నిర్వహించినవారు సైతం ఈ మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో చిన్న హోదాలు చేపట్టారు. గతంలో ప్రధానమంత్రి పదవికి రేసులో నిలబడ్డ నాయకురాలు, వ్యాపార శాఖ మంత్రి అయిన డేమ్ ఆండ్రియా లెడ్సమ్ ఇప్పుడు జూనియర్ హెల్త్ మినిస్టర్ పదవి చేపట్టారు. అలాగే ఇంకొందరు! సునాక్ వైపు నుంచి చూస్తే – ఇది మునుపటి లిజ్ ట్రస్ హయాం వారిని కొందరినైనా వదిలించుకొని, తనదైన జట్టును నిర్మించుకొనేందుకు ఆయన చేస్తున్న యత్నంగా కనిపిస్తుంది. మరోవైపు నుంచి చూస్తే – మునుపటి లిజ్ పాలన తలనొప్పులు తేవడంతో ఏడాది క్రితం ఆ స్థానంలోకి వచ్చిన సునాక్ తన సర్కార్పై నమ్మకం కలిగించడంలో విఫలమయ్యారనీ, అందుకే ఈ మార్పులనీ అనిపిస్తుంది. ప్రధానిగా పదవి చేపట్టినప్పటి నుంచి సునాక్ తరచూ కామెరాన్తో సంభాషిస్తున్నారనీ, వారం రోజుల క్రితమే విదేశాంగ మంత్రిగా పగ్గాలు పట్టాల్సిందిగా కోరారనీ ఒక కథనం. ఇంతలోనే బ్రేవెర్మన్ దురుసు రాతలతో రచ్చ రేగింది. చివరకు సునాక్ అనుకుంటున్న మార్పే అనివార్యంగా, ముందుకు తోసుకొచ్చింది. ‘డీసీ’గా అభిమానులు ముద్దుగా పిలుచుకొనే డేవిడ్ కామెరాన్ పునరాగ మనంతో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి పాలకçపక్షం చిక్కుల్లో పడి, బయటపడేందుకు మరో మార్గం లేనప్పుడు పాత కాపులను మళ్ళీ రంగంలోకి దింపి ఉన్నత పదవులివ్వడం, ఎంపీలు కాని వారిని ఎగువ సభ ద్వారా పార్లమెంట్లోకి తేవడం బ్రిటన్లో తరచూ ఉన్నదే! వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం వెన్నాడుతున్న వేళ సునాక్ సర్కార్ ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి. అందులో భాగమే తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, కామెరాన్ పునరాగమనం లాంటి చర్యలు. మాటలతో ముగ్ధుల్ని చేయగల కామెరాన్ను జనం నమ్ముతారనీ, రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా మారుతుందనీ సునాక్ అంచనా. అయితే, పదకొండేళ్ళు పార్టీకి నేతగా, ఆరేళ్ళ కాలం ప్రధానిగా పనిచేసి, గత ఏడేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన కామెరాన్ అనుభవం కష్టాల్లో ఉన్న పార్టీకీ, సునాక్ ప్రభుత్వానికీ ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. కామెరాన్కు పలువురు ప్రపంచ నేతలతో స్నేహం, అంతర్జాతీయ వ్యవహారాలపై పట్టు ఉన్నాయి. భౌగోళిక రాజకీయాలన్నీ అస్థిరంగా ఉన్న వర్తమానంలో అది బ్రిటన్ ప్రభుత్వానికి ఉపయుక్తమే. కానీ, వచ్చే ఎన్నికల్లో కలిసిరావడం మాత్రం కష్టమే. కేవలం 24 శాతం మంది బ్రిటన్ వయోజనులు కామెరాన్కు సానుకూలంగా ఉంటే, 45 శాతం మంది ఆయనకు ప్రతికూలంగా ఉన్నారని నెల కిందటి తాజా సర్వే. వెరసి కామెరాన్పై సునాక్ అతిగా ఆశలు పెట్టుకుంటే నిరుత్సాహం తప్పదు. పదమూడేళ్ళ పాటు సొంత కన్జర్వేటివ్ పార్టీయే గద్దె మీద ఉన్నాక వచ్చే ఎన్నికలు సునాక్కు ఏటికి ఎదురీతే. ఆయన తనను తాను మార్పుకు ప్రతిరూపంగా, స్థిరచిత్తుడిగా జనానికి చూపుకోవడం అవసరం. అందుకని మాటల్లో, రాతల్లో జాత్యహంకార, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బ్రేవెర్మన్ను పదవిలో కొనసాగిస్తే కష్టం. గతంలో పలుమార్లు మాటల తూటాలు పేల్చిన ఆమె తాజాగా పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్శనపై నిర్లక్ష్యంగా, నొప్పించేలా ‘ది టైమ్స్’ పత్రికలో రాశారు. ప్రధాని ఆమోదం లేని ఆ వ్యాసంతో తన కథకు తానే ముగింపు రాసుకున్నారు. స్వతంత్ర పోలీసు వ్యవస్థను తప్పుబట్టడమే కాక, నిరసనను ప్రాథమిక హక్కుగా భావించే ఆధునిక బ్రిటన్ సమాజాన్నీ దూరం చేసుకున్నారు. పదవీచ్యుతురాలయ్యారు. అయితే, రానున్న రోజుల్లో ఆమె ఊరకుంటారని అనుకోలేం. సునాక్ పాలన అనంతరం అవసరమైతే పార్టీ పగ్గాలు చేపట్టగల ఛాందస వర్గ నేతగా ఆమె తనను తాను గట్టిగా నిలుపుకొన్నారు. అయిదేళ్ళ లోపల 650 మంది సభ్యుల దిగువ సభకు ఎన్నికలు జరగడం బ్రిటన్ విధానం. ఆ లెక్కన 2025 జనవరి 28 లోపల ఎన్నికలు జరగాలి. ఏ తేదీన జరగాలో నిర్ణయించే అధికారం ప్రధా నిదే. 2011లో చట్టం తెచ్చి, దాన్ని మార్చినా, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత కన్జర్వేటివ్లు మళ్ళీ యథాపూర్వ స్థితిని పునరుద్ధరించారు. ఆ లెక్కన పార్లమెంట్ను ముందే రద్దు చేసి, ఎన్నికలు జరిపించమని సునాక్ కోరినా కోరవచ్చు. ఏడాది క్రితం సునాక్ పగ్గాలు చేపట్టినప్పటితో పోలిస్తే, కన్జర్వే టివ్ల ప్రతిష్ఠ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అప్పటి అనుకూల వాతావరణమూ లేదు. మరి, సునాక్ చేసిన తాజా మార్పులు ఎన్నికల నాటికి అద్భుతాలు చేయగలవా? ఏమో గుర్రం ఎగరావచ్చు! -
బ్రిటన్ మంత్రివర్గంలో కుదుపు
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సోమవారం తన మంత్రివర్గంలో ఆకస్మిక మార్పుచేర్పులు చేశారు. కొంతకాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత మూలాలున్న హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ను విదేశాంగ మంత్రిగా నియమిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటిదాకా విదేశాంగ మంత్రిగా ఉన్న జేమ్స్ క్లెవర్లీని బ్రేవర్మన్ స్థానంలో హోం మంత్రిగా నియమించారు. ప్రధాని సిఫార్సుల మేరకు వారిద్దరి నియామకాలకు రాజు చార్లెస్ ఆమోదముద్ర వేసినట్టు డౌనింగ్ స్ట్రీట్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు హౌజింగ్ మంత్రి రేచల్ మెక్లీన్ను కూడా సునాక్ పదవి నుంచి తప్పించారు.ఈ నేపథ్యంలో మరో ఆరుగురు జూనియర్ మంత్రులు కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు! థెరెసా కోఫీ, నిక్ గిబ్, నీల్ ఓబ్రియాన్, విల్ క్విన్స్, జెస్సీ నార్మన్ ఈ జాబితాలో ఉన్నారు. కామెరాన్... అనూహ్య ఎంపిక 57 ఏళ్ల కామెరాన్కు రిషి విదేశాంగ బాధ్యతలు అప్పగించడం అనూహ్యమేనని చెప్పాలి. ఒక మాజీ ప్రధానిని ఇలా మంత్రివర్గంలోకి తీసుకోవడం బ్రిటన్లో చాలా అరుదు. పైగా ప్రధానిగా రాజీనామా చేశాక కామెరాన్ ఏడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అంతేగాక ప్రస్తుతం ఎంపీ కూడా కాదు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్లోకి తీసుకున్నారు. బ్రిటన్లో ఇలా విదేశాంగ మంత్రి ఎగువ సభ్య సభ్యుడిగా ఉండటం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1980ల్లో లార్డ్స్ సభ్యుడైన పీటర్ కారింగ్టన్ మార్గరెట్ థాచర్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. కష్టకాలంలో ప్రధానిగా రిషి పనితీరు గొప్పగా ఉందంటూ కామెరాన్ ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. ‘‘కొన్ని వ్యక్తిగత నిర్ణయాల విషయంలో రిషితో నేను గతంలో విభేదించ ఉండొచ్చు. కానీ ఆయన అత్యంత సమర్థుడైన ప్రధాని’’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశ భద్రత, ప్రగతి తదితర కీలకాంశాల్లో ఆశించిన ఫలితాల సాధనలో రిషికి శక్తివంచన లేకుండా తోడ్పడతా. ఏడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నా కీలక సవాళ్లను దీటుగా ఎదుర్కోవడంలో రిషికి దన్నుగా నిలిచేందుకు నా రాజకీయ అనుభవమంతటినీ రంగరిస్తా’’ అని చెప్పారు. 2010 నుంచి 2016 దాకా ఆరేళ్లపాటు ఆయన బ్రిటన్ ప్రధానిగా ఉన్నారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగాలని గట్టిగా వాదించారు. ఈ విషయమై 2016లో మూడు రెఫరెండాలు తెచ్చారు. కానీ ప్రజలు ఈయూ నుంచి వైదొలగేందుకు (బ్రెగ్జిట్)కే ఓటేయడంతో రాజీనామా చేశారు. సునాక్ కూడా బ్రెగ్జిట్కే మద్దతిచ్చారు. పైగా ఆ సమయంలో కామెరాన్ మంత్రివర్గంలో సునాక్ జూనియర్ మంత్రి కూడా కావడం విశేషం! విదేశాంగ మంత్రి జై శంకర్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉన్నారు. ఆదివారం సునాక్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కూడా. పర్యటనలో భాగంగా క్లెవర్లీతో జై శంకర్ సమావేశాలు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా విదేశాంగ బాధ్యతలు స్వీకరించిన కామెరాన్తో జై శంకర్ చర్చలు ఎలా జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. బ్రేవర్మన్.. రెండోసారి ఉద్వాసన ఇక రిషి మంత్రివర్గంలో సీనియర్ సభ్యురాలైన 43 ఏళ్ల బ్రేవర్మన్ హోం శాఖ మంత్రిగా తప్పుకోవాల్సి రావడం ఇది రెండోసారి! ఈసారి ఆమెపై వేటు ఒకవిధంగా ఊహిస్తున్నదే. గోవా మూలాలున్న ఆమె రెచ్చగొట్టే మాటలు, వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల లండన్లో జరిగిన పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శిస్తూ ద టైమ్స్ పత్రికలో బ్రేవర్మన్ రాసిన వ్యాసంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. హోం మంత్రిగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహించరానిదంటూ విపక్షాలతో పాటు అధికార కన్సర్వేటివ్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మండిపడ్డారు. వ్యాసంలోని సదరు విమర్శలను తొలగించాలని ప్రధాని కార్యాలయం ఆదేశించినా ఆమె బేఖాతరు చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో బ్రేవర్మన్ను తప్పించడం ఖాయమని అంతా భావించారు. అంతకుముందు లిజ్ ట్రస్ మంత్రివర్గం నుంచి కూడా ఆమె రాజీనామా చేయడం విశేషం. అప్పుడు కూడా మంత్రిగా పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పలు కీలకాంశాలపై ట్రస్ సర్కారు అయోమయంలో ఉందని ఆమె బాహాటంగా విమర్శించడం సంచలనం సృష్టించింది. వలసదారులపై ఆమె వ్యాఖ్యలూ దుమారమే రేపాయి. తర్వాత వలసలకు సంబంధించి అధికార పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా సహచర పార్టీ ఎంపీకి చూపించిన అంశంలో రాజీనామా చేయాల్సి వచి్చంది. ట్రస్ స్థానంలో రిషి ప్రధాని అయ్యాక బ్రేవర్మన్ను అనూహ్యంగా మంత్రివర్గంలోకి తీసుకోవడమే గాక మళ్లీ కీలకమైన హోం శాఖ బాధ్యతలే అప్పగించారు. దీనిపై అప్పట్లోనే ఆశ్చర్యం వ్యక్తమైంది. తాజా వేటు నేపథ్యంలో సునాక్కు ఆమె కంట్లో నలుసుగా మారడం ఖాయమంటున్నారు. కన్సర్వేటివ్ పారీ్టలోని తన మద్దతుదారుల దన్నుతో ప్రభుత్వానికి సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజీనామా అనంతరం విడుదల చేసిన సంక్షిప్త ప్రకటనలో ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా దీన్ని బలపరిచేలానే ఉన్నాయి. ‘‘ఇంతకాలం హోం మంత్రిగా పని చేయడం నాకు గొప్ప గౌరవం. సమయం వచి్చనప్పుడు చాలా సంగతులు చెప్తా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు! వివాదాస్పద వ్యాఖ్యలు ► బ్రిటన్లో వీసా కాల పరిమితి ముగిసినా దేశం వీడని వారిలో అత్యధికులు భారతీయులేనన్న బ్రేవర్మన్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ► భారత్తో ఓపెన్ మైగ్రేషన్ విధానాన్నీ ఆమె తప్పుబట్టారు. ► మరో సందర్భంలో బ్రిట న్లోని అక్రమ వలసదారులను ఆఫ్రికాలోని రువాండాకు తరలిస్తానన్నారు. ► బ్రిటన్లో ఎక్కడ పడితే అక్కడ వీధుల్లోనే నివసిస్తున్న వారు చాలావరకు అక్రమ వలసదారులేనన్నారు. ► శరణార్థుల తాకిడిని వలసదారుల దండయాత్రగా అభివరి్ణంచారు. ► అతి వేగంగా కారు నడిపిన కేసులో జరిమానా, ఫైన్ పడ్డ విషయాన్ని దాచేందుకు ప్రయతి్నంచారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్కు ఉద్వాసన
లండన్: బ్రిటిష్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్కు ఉద్వాసన పలికింది రిషి సునాక్ ప్రభుత్వం. పాలస్తీనా అనుకూల ఆందోళనలను అణిచివేయడంలో లండన్ పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. బ్రేవర్మన్ వ్యాఖ్యలపై గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో సునాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయాల్సిందిగా బ్రేవర్మన్ను సునాక్ అడిగినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సునాక్ ఆదేశాలకు ఆమె అంగీకరించినట్లు రాయిటర్స్లో కథనం వెలువడింది. గాజాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేపట్టాలని బ్రిటన్ వేదికగా ఆందోళనకారులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలమైతున్నారని ప్రధాని సునాక్ అంతరంగిక మంత్రి బ్రేవర్మన్ మండిపడ్డారు. ఆందోళనల పట్ల అధికారులు కూడా సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని సునాక్ అనుమతి లేకుండానే ఈ అంశంపై ఓ కథనం కూడా ప్రచురించారు. ఈ అంశం గత కొద్ది రోజులుగా బ్రిటన్లో వివాదానికి దారి తీసింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆమెను పదవి నుంచి తొలగించాలని నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. బ్రేవర్మన్ను తొలగించాల్సిందిగా సునాక్పై ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇలా ఉంటే.. బ్రిటన్ కేబినెట్లో సుయెల్లా బ్రేవర్మన్ సీనియర్ మంత్రి. గతంలో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ మంత్రివర్గంలో కూడా ఆమె పనిచేశారు. అప్పట్లో లిజ్ ట్రస్ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు. అదే సమయంలో మైగ్రేషన్ అంశంపై అధికారిక పత్రాలను వ్యక్తిగత మెయిల్ ద్వారా షేర్ చేసినందుకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇంటీరియర్ మినిస్టర్గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమె ప్రచురించిన కథనం వివాదాస్పదం కావడంతో మరోసారి పదవి కోల్పోయారు. గతంలో ఆమె వలసదారులపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్కు చోటు బ్రేవర్మన్ స్థానంలో విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీని బ్రిటన్ కొత్త హోం మంత్రిగా సునాక్ ప్రభుత్వం నియమించింది. మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ను బ్రిటన్ తదుపరి విదేశాంగ మంత్రిగా ఎంపిక చేసింది. త్వరలో వారు అధికారికంగా పదవులు చేపట్టనున్నారు. కామెరూన్ 2010 నుంచి 2016 వరకు ప్రధానిగా పనిచేశారు. ఇదీ చదవండి: Jaishankar Gift To Rishi Sunak: బ్రిటీష్ ప్రధానికి భారత్ దీపావళి కానుక -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
బ్రిటీష్ ప్రధానికి భారత్ దీపావళి కానుక
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్, అతని భార్య అక్షతా మూర్తిని కలుసుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రిషి సునాక్కు వినాయకుని విగ్రహాన్ని, భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ను బహూకరించారు. జై శంకర్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఖాతాలో .. ‘భారతదేశం- యూకేలు ప్రస్తుతం సంబంధాలను బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. అందుకు ఇందుకు సహకారం అందిస్తున్న సునాక్కు ధన్యవాదాలు. వారి సాదర స్వాగతం, ఆతిథ్యం అద్భుతం" అని పేర్కొన్నారు. బ్రిటిష్ పీఎం రిషి సునక్ కూడా తన భావాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలలోని వివిధ అంశాలను సమీక్షించడం, స్నేహపూర్వక సంబంధాలలో కొత్త ఉత్సాహాన్ని కల్పించే లక్ష్యంతో జైశంకర్ ఐదు రోజుల బ్రిటన్ పర్యటన కోసం లండన్ చేరుకున్నారు. నవంబర్ 15న జైశంకర్ విదేశీ ప్రయాణం ముగియనుంది. జైశంకర్ తన పర్యటనలో పలువురు ప్రముఖులను కలుసుకోనున్నారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. దీనితోపాలు భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన దీపావళి ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: నీరుగారిన నిషేధం: పేలిన టపాసులు, ఎగిరిన తారాజువ్వలు! The Prime Minister @RishiSunak welcomed @DrSJaishankar to Downing Street this evening. Together they expressed their very best wishes as Indian communities around the world begin #Diwali celebrations. 🇬🇧🇮🇳 pic.twitter.com/gjCxQ0vr8d — UK Prime Minister (@10DowningStreet) November 12, 2023 -
రిషి సునాక్ ఇంట దీపావళి వేడుక
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్ స్ట్రీట్లోని తమ అధికార నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. బుధవారం జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొ న్నారు. ప్రధానిగా సునాక్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నివాసాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. ప్రధాని రిషి సునాక్, అక్షతామూర్తి దంపతులు కలిసి దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను ప్రధాని కార్యాలయం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ప్రధాని రిషి సునాక్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కమలా హ్యారిస్ నివాసంలోనూ.. వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మంగళవారం వాషింగ్టన్లోని తన అధికార నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు భారతీయ అమెరికన్లు సహా 300 మంది వరకు పాల్గొన్నారు. దీపాలు వెలిగించిన అనంతరం చట్టసభల ప్రతినిధులైన రో ఖన్నా, శ్రీ థానెదార్, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ తదితరులతో ఆమె మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరును ప్రస్తావించారు. పాలస్తీనియన్లకు సాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. -
Rishi Sunak : డౌనింగ్ స్ట్రీట్లో ఘనంగా దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
బ్రిటన్ ప్రధాని ఇంట.. దీపావళి సంబరాలు
లండన్: లండన్ వేదికగా దీపావళి సంబరాలు ఊపందుకున్నాయి. సాక్షాత్తు ప్రధాని నివాసం అధికారిక భవనంలో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగాయి. దీపావళి వేడుకలకు హిందూ బంధువులను ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఆహ్వానించారు. చీకటిపై వెలుతురు విజయ సూచకంగా దీపాలను వెలిగిస్తున్న ఫొటోలను ప్రధాని రిషి సునాక్ అధికారిక ఖాతాలో పంచుకున్నారు. అక్షతా మూర్తి దీపాలను వెలిగిస్తుండగా.. ఆమె చుట్టూ జనం గుమిగూడి ఉన్న ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. యూకే, ప్రపంచమంతటా దీపావళి వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. Tonight Prime Minister @RishiSunak welcomed guests from the Hindu community to Downing Street ahead of #Diwali – a celebration of the triumph of light over darkness. Shubh Diwali to everyone across the UK and around the world celebrating from this weekend! pic.twitter.com/JqSjX8f85F — UK Prime Minister (@10DowningStreet) November 8, 2023 చీకటిపై వెలుతురు, చెడుపై మంచి విజయసూచకంగా దీపావళి పండుగను హిందువులు ఈ ఏడాది నవంబర్ 12న జరుపుకుంటారు. ఇరు దేశాల నాయకులు రిషి సునాక్, ప్రధాని మోదీ ఇటీవల టెలిఫొన్లో సంభాషించుకున్నారు. స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందంపై పురోగతి దిశగా అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. వరల్డ్ కప్ సందర్భంగా భారత్కు రిషి సునాక్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: నేను భారతీయురాలినైతేనా..? నితీష్ వ్యాఖ్యలపై అమెరికా సింగర్ ఫైర్ -
మాంద్యంలో బ్రిటన్! పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం.. అసలేం జరుగుతోంది?
పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం బ్రిటన్ను కలవరపెడుతున్నాయి. దేశం మాంద్యంలోకి వెళ్లిపోతోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధికమవుతున్న నిరుద్యోగం కారణంగా బ్రిటన్ బహుశా ఇప్పటికే మాంద్యంలో ఉన్నట్లు బ్లూమ్బర్గ్ ఎకనామిక్స్ విశ్లేషణ పేర్కొంటోంది. వరుసగా తిరోగమనం వరుసగా రెండు త్రైమాసికాల్లో వృద్ధి మందగించిన క్రమంలో ఈ సంవత్సరం ద్వితీయార్థంలో తేలికపాటి మాంద్యం ఏర్పడే అవకాశం 52 శాతం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. త్వరలో బ్రిటన్ జీడీపీ గణాంకాలు అధికారికంగా వెలువడనున్న నేపథ్యంలో ఈ విశ్లేషణ ప్రచురితమైంది. వృద్ధి సంకోచం తేలికపాటిగానే కనిపిస్తున్నప్పటికీ ఈ అసమానతలు మాంద్యానికి దారితీసినట్లు బ్లూమ్బెర్గ్ ఎకనామిక్స్ అనలిస్ట్ డాన్ హాన్సన్ ప్రచురణ నోట్లో పేర్కొన్నారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్రిటన్ జీడీపీ 0.1 శాతం పడిపోయిందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం, 4.3 శాతం ఉండగా 2026 నాటికి ఇది 5.1 శాతానికి పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేసింది. రిషి సునక్కు తలనొప్పిగా మాంద్యం! బ్రిటన్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక మాంద్యం ప్రధానమంత్రి రిషి సునక్కు తలనొప్పిగా మారనుంది. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు అనివార్యం కానున్నాయి. తన అంచనాల్లో ఇప్పటికే తేలికపాటి మాంద్యాన్ని సూచించిన బ్లూమ్బెర్గ్ ఎకనామిక్స్ మూడో త్రైమాసికంలో జీడీపీ తిరోగమన అవకాశం 70 శాతం ఉంటుందని అంచనా వేస్తోంది. జులైలో 0.6 శాతం జీడీపీ క్షీణించగా ఆగస్టులో పెద్దగా పుంజుకోలేదు. కాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మాత్రం మాంద్యానికి 50 శాతం అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. -
సునాక్ పాలనకు ఏడాది
లండన్: భారతీయ మూలాలున్న రిషీ సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో ఏడాది పూర్తి చేసుకున్నారు. అయితే వార్షికోత్సవ సంబరాల వంటివాటికి దూరంగా రోజంతా ఆయన రోజువారీ అధికారిక విధుల్లోనే గడపడం విశేషం. 43 ఏళ్ల సునాక్ సరిగ్గా ఏడాది కింద ఎన్నో సవాళ్ల నడుమ ప్రధాని కావడం తెలిసిందే. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ‘ఏడాదిలో ఎంతో సాధించాం. కానీ సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది’ అంటూ సోషల్ మీడియాలో ఆయన వీడియో పోస్ట్ చేశారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ చైర్మన్ గ్రెగ్ హ్యాండ్స్ సైతం రిషి పాలనను ఈ సందర్భంగా ప్రశంసించారు. -
లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం
లండన్: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలపై ప్రధాని రిషి సునాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యూదులతో పాటు ప్రజాస్వామ్య విలువలకు ముప్పులా పరిణమిస్తుందని అన్నారు. లండన్లో ఇలాంటి నినాదాలను సహించబోమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనియన్లకు మద్దతుగా లండన్, బర్మింగ్హామ్, కార్డిఫ్, బెల్ఫాస్ట్ సహా ఇతర నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇందులో కొందరు ఆందోళనకారులు జిహాద్ నినాదాలు కూడా చేశారు. 'ఈ శనివారం జరిపిన నిరసనల్లో వీధుల్లో ద్వేషాన్ని చూశాము. జిహాద్ పిలుపులు యూదు సమాజానికి మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య విలువలకు కూడా ముప్పు. మన దేశంలో యూదు వ్యతిరేకతను ఎప్పటికీ సహించము. తీవ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలను పోలీసులు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం.' అని రిషి సునాక్ అన్నారు. గ్రేటర్ లండన్ ప్రాంతంలో పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసనలు చేలరేగగా.. ద్వేషపూరిత నినాదాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. ఆందోళనలు అదుపుతప్పాయని చెప్పారు. ఈ ఘటనల్లో ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారని వెల్లడించారు. జిహాద్ అంటూ నినాదాలు చేస్తున్న ఓ వ్యక్తి వీడియోను కూడా షేర్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో రిషి సునాక్ ఇజ్రాయెల్ పట్ల నిలబడిన విషయం తెలిసిందే. హమాస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలను నిలిపివేయాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో తాము తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం -
ఇజ్రాయెల్కు పూర్తి మద్ధతు: రిషి సునాక్
టెల్ అవివ్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ గురువారం యుద్ధ ప్రభావిత ప్రాంతం ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్కు తాము పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడూ, ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ దేశం పక్షాన నిలబడతామని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్లో అడుగుపెట్టిన రిషి సునాక్కు.. ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల అగ్రనేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిషి సునాక్ మీడియాతో మాట్లాడారు. హమాస్లా కాకుండా తమ పౌరులకు ఏ హానీ జరగకుండా ఇజ్రాయెల్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తమకు తెలుసన్నారు. యుద్ధ ప్రాంతం నుంచి బ్రిటిష్ పౌరులను తరలించినందుకు నెతన్యాహుకి ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్ పౌరులే కాక పాలస్తీనియన్లు కూడా హమాస్ బాధితులని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. To have a child taken from you is a parent’s worst nightmare. This morning I heard from families going through this unbearable agony. Working with our partners, we’re determined to secure the release of the hostages taken by Hamas terrorists. pic.twitter.com/F7AV021o9x— Rishi Sunak (@RishiSunak) October 19, 2023 మానవతా సహాయం కోసం సరిహద్దులను తెరిచినందుకు సంతోషంగా ఉందన్నారు. అన్నింటికంటే మించి ఇజ్రాయెల్ ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేయడానికి ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ మాటల్లో చెప్పలేని భయంకరమైన తీవ్రవాద చర్యను ఎదుర్కొంటుందని, యునైటెడ్ కింగ్డమ్, తాను ఆ దేశానికి అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. చదవండి: పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు British PM Rishi Sunak arrives in Tel Aviv, Israel, according to Reuters. (Photo source: Reuters) pic.twitter.com/V2plUYLe2p — ANI (@ANI) October 19, 2023 కాగా పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. మరింత ప్రాంతాలకు వ్యాపించకుండా యుద్ధంవెంటనే ఆపాలని ప్రపంచ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్లో పర్యటించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమై యుద్ధ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హమాస్కు వ్యతిరేకంగా చేస్తోన్న పోరులో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ వెంటనే నేడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ యుద్ధ భూమిలో అడుగుపెట్టారు. -
ఇజ్రాయెల్ చేరుకున్న రిషి సునాక్.. నెతన్యాహుతో చర్చలు
జెరూసలేం: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్లతో సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న ఇజ్రాయెల్లో పర్యటించారు. గాజా ఆస్పత్రి దాడి అంశంలో ఇజ్రాయెల్ వాదనకు మద్దతు తెలిపారు. బైడెన్ పర్యటన అనంతరం యుద్ధంలో ఇజ్రాయెల్ కాస్త పట్టు సడలించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చిన్నాభిన్నమైన గాజాకు ఆహారం, నీటిని రాఫా సరిహద్దు గుండా సరఫరా చేయడానికి అనుమతించారు. గాజాలో ఆస్పత్రిపై రాకెట్ దాడులు జరిపింది హమాస్ దళాల పనే అని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా బహిర్గతం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ వాదనలకు అమెరికా మద్దతుగా నిలిచింది. అటు.. గాజా ఆక్రమణ దిశగా ఇజ్రాయెల్ ఆలోచన సరైంది కాదని తెలుపుతూనే యుద్ధంలో కాల్పుల విరమణ వైపు ఆలోచించాలని అమెరికా కోరింది. ఆ తర్వాత తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్పై దాడులు చేశాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తోంది. గాజాలో నక్కిన హమాస్ దళాలను అంతం దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే యుద్ధంలో ఇరుపక్షాల వైపు దాదాపు 4000 మంది మరణించారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు చొరవ తీసుకుంటున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతున్నాయి. ఇదీ చదవండి: బైడెన్ చొరవ.. ఈజిప్ట్ గ్రీన్సిగ్నల్.. గాజాకి అందనున్న మానవతా సాయం -
బ్రిటన్ ధూమపాన రహితదేశం కానుందా? ప్రధాని రిషి సునాక్ ప్లాన్ ఏమిటి?
బ్రిటన్ కొత్త ప్రతిపాదిత చట్టం ప్రకారం రాబోయే కొద్ది సంవత్సరాలలో బ్రిటన్లో ధూమపానం సమర్థవంతంగా నిర్మూలనకానుంది. 2040 నాటికి బ్రిటన్ ‘పొగ రహిత’ దేశంగా మారుతుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ తర్వాత రాబోయే తరం ధూమపానం చేయకుండా నిరోధించడానికి చట్టం చేసిన రెండవ దేశం బ్రిటన్. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ధూమపానం ఒక సామాజిక దురాచారంగా మారింది. ధూమపానం కారణంగా లెక్కలేనంతమంది క్యాన్సర్తోపాటు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 2040 నాటికి దేశాన్ని ధూమపాన రహితంగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం బ్రిటన్లో కొత్త చట్టాలను రూపొందించడంపై చర్చ జరుగుతోంది. బ్రిటీష్ వయోజనులలో 12.9 శాతం మంది ధూమపానం చేస్తున్నారు. 8.7 శాతం మంది ప్రతిరోజూ ఇ-సిగరెట్లను ఉపయోగిస్తున్నారు. నూతన చట్టాలను అమలు చేయడం ద్వారా 2075 నాటికి 1.7 మిలియన్ల మంది ధూమపానం చేయడాన్ని తగ్గించవచ్చని బ్రిటీష్ ప్రభుత్వం భావిస్తోంది. యూకేలో అమలుకానున్న కొత్త చట్టం జనవరి 1, 2009న లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరికైనా పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని చట్టవిరుద్ధం చేశారు. ప్రస్తుతం ధూమపానం చేసే వయస్సు 18 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం చట్టబద్ధంగా ధూమపానం చేసే వయస్సును పెంచడం అనేది సమీక్ష ముఖ్య సిఫార్సులలో ఒకటి. ధూమపానం అనేది గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్, అంగస్తంభన, గర్భస్రావం వంటి 50 అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం సంవత్సరానికి 76,000 మందిని పొట్టనపెట్టుకుంటోంది. కేఫ్లు, పబ్లు, బార్లు, రెస్టారెంట్లలో ధూమపానాన్ని నిషేధించిన ఏకైక దేశం న్యూజిలాండ్. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా న్యూజిలాండ్ తరహాలో దేశంలో ధూమపానాన్ని నిషేధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కూడా చదవండి: ఇందిర సభలోకి సింహం ఎందుకు వదిలారు? -
భారత్–కెనడాల మధ్య ఉద్రిక్తతలు సమసిపోవాలి
లండన్: భారత్–కెనడాల మధ్య విభేదాలు సమసిపోవాల్సిన అవసరం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. భారత్–కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రిషి సునాక్, ట్రూడోలు ఫోన్లో మాట్లాడుకున్నారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది, భారత్లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తముందనేందుకు ఆధారాలున్నాయంటూ ట్రూడో చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. అదేవిధంగా, బ్రిటన్లోని ఓ గురుద్వారా కమిటీ సమావేశానికి వెళ్లిన భారత దౌత్యాధికారి విక్రమ్ దొరైస్వామిని ఖలిస్తానీ అనుకూలవాదులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇరు దేశాల ప్రధానులు సంభాషించుకున్నారు. భారత్తో విభేదాలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, జెనీవా ఒప్పందంతోపాటు దేశాల సార్వభౌమాధికారాన్ని, చట్ట నియమాలను గౌరవించాలన్నారు. భారత్తో సంబంధాలు త్వరలోనే మెరుగుపడతాయని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
డౌనింగ్ స్ట్రీట్ మార్జాల మిత్రుడు
నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ‘ల్యారీ’ ఎందుకు కనిపించడు అని బ్రిటన్ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహూతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కొనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. అవడానికి అది మామూలు మార్జాలమే అయినప్పటికీ దానిని ‘సివిల్ సర్వెంట్’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం చీఫ్ మౌజర్ హోదాలో ఉన్న ఆ సివిల్ సర్వెంట్ పేరే ‘ల్యారీ’. 2011 నుంచి ల్యారీ బ్రిటన్ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్ కామెరున్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రుస్, రుషి సునాక్... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్ స్ట్రీట్ నుంచి కదలించగలవు. పెంపుడు కుక్కలపై మక్కువ కలిగిన వారిగా బ్రిటిషర్లు లోక విదితం అయినప్పటికీ, వారి ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ప్రాముఖ్యం పొందే చతుష్పాదం మాత్రం మార్జాలమే. పిల్లిది అక్కడ ‘చీఫ్ మౌజర్’ హోదా. చీఫ్ మౌజర్ ప్రధాన విధి డౌనింగ్ స్ట్రీట్లో ఒక్క ఎలుకైనా లేకుండా చూడటం. డౌనింగ్ స్ట్రీట్లోనే ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయాలు ఉంటాయి. అవడానికి అది మామూలు మార్జాలమే కానీ, దానిని ‘సివిల్ సర్వెంట్’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం చీఫ్ మౌజర్ హోదాలో ఉన్న ఆ సివిల్ సర్వెంట్ పేరు ‘ల్యారీ’. ‘బ్యాటర్సీ డాగ్స్ అండ్ క్యాట్స్ హోమ్’ నుంచి తప్పించి, దానిని అక్కడికి తెప్పించారు. 2011 నుంచి ల్యారీ బ్రిటన్ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్ కామెరున్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రుస్, రుషి సునాక్... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్ స్ట్రీట్ నుంచి కదలించగలవు. జీవిత చరిత్రల రచనలో ప్రావీణ్యం కలిగిన నా మేనకోడలు నారాయణీ బసు బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక మార్జాలాల జీవిత చరిత్రను సంక్షిప్తంగా సంకలన పరిచారు. ఎనిమిదవ హెన్రీ చక్రవర్తి కాలం నాటి బ్రిటిష్ ప్రభుత్వ మార్జాల జీవిత చరిత్రతో సంకలనం మొదలౌతుంది. ఆ కాలపు రాజనీతిజ్ఞుడు, క్యాథలిక్ బిషప్ అయిన లార్డ్ ఛాన్స్లర్... థామస్ వోల్సే దగ్గర ఆ మార్జాలం ఉండేది. 1929కి ముందే బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా పిల్లి సంరక్షణ బాధ్యతలను చేపట్టినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. పిల్లి పోషణ, పాలన కోసం రోజుకు ఒక పెన్నీ కేటాయించినట్లు అప్పటి బడ్జెట్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నాటి నుంచి పిల్లి ఖర్చు క్రమంగా పెరుగుతూ వచ్చి 21వ శతాబ్దానికి ‘చీఫ్ మౌజర్’ బ్రిటిష్ ఖజానాకు పెట్టిస్తున్న ఖర్చు 100 పౌండ్లకు చేరుకుంది. డౌనింగ్ స్ట్రీట్ వెబ్సైట్ ప్రకారం ల్యారీ విధులు ఇలా ఉన్నాయి: ఇంటికి వచ్చే అతిథులను పలకరించడం, భద్రతకు ఉద్దేశించిన రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేయడం, కునుకు తీయడానికి పురాతన ఫర్నిచర్ ఏ మాత్రం నాణ్యతను కలిగి ఉన్నదో పరీక్షించడం. అలాగే, భవంతిలో ఎలుకలు చేరకుండా ఉండేందుకు పరిష్కారం ఆలోచించడం కూడా చేస్తోందనీ, ఆ పరిష్కారం ఇంకా వ్యూహాత్మక ప్రణాళిక దశలోనే ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిందని కూడా వెబ్సైట్లో ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ల్యారీ తన బాధ్యతల కంటే కూడా ప్రధాని కార్యాలయ అవసరాలను చూడ్డానికే ఎక్కువ ఇష్టపడుతుంది. నారాయణి పరిశోధనను బట్టి కామెరున్ దగ్గర తన తర్వాత వచ్చిన ప్రధానుల కంటే కూడా ల్యారీ గురించి చెప్పడానికే ఎక్కువ సమాచారం ఉంది. ఆ పిల్లి గురించి సునాక్ అభిప్రాయాన్ని నారాయణి ప్రస్తావించలేదు. కనుక ల్యారీని అర్థం చేసుకోవాలంటే మనం కామెరున్ మీద ఆధారపడాలి. ఆయన చెబుతున్న దానిని బట్టి ల్యారీ పురుషుల సమక్షంలో కాస్త బెరుకుగా ఉంటాడు. అయితే అందుకు బరాక్ ఒబామా మినహా యింపు. ‘‘తమాషా ఏంటంటే ఒబామాను ల్యారీ ఇష్టపడతాడు. ఒబామా అతడికి మృదువైన చిన్న తాటింపు వంటి స్పర్శను ఇస్తాడు. దాంతో ల్యారీ ఒబామా దగ్గర సౌఖ్యంగా ఉంటాడు. అయితే ల్యారీ ప్రధానమంత్రుల సతీమణులను కలవరపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ల్యారీ ఒంటి వెంట్రుకలు తన భర్త సూట్లపై కనిపించడంతో సమంతా కామెరున్ ల్యారీని ప్రధాని నివాసంలోకి అడుగు పెట్టనివ్వకుండా చేశారు. అంతెందుకు, పక్కనే ఉండే విదేశాంగశాఖ కార్యాలయంలోకి ల్యారీని ప్రవేశించనివ్వకుండా క్యాట్–ప్రూఫ్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. విదేశాంగ కార్యదర్శి విలియం హేగ్ దానిని కిందికి తీసుకెళ్లండి అని కోరారు. అయితే హేగ్కి ల్యారీ పట్ల కొంత ఆపేక్ష ఉండేదట. కఠోర వాస్తవం ఏంటంటే ల్యారీకి ఉన్న ప్రజాదరణ కారణంగా తరచూ ప్రధాన మంత్రి కంటే కూడా ఎక్కువగా ల్యారీకి భద్రతా బలగం అవసరం అయ్యేది. కామెరాన్ దంపతులు ఆ పిల్లిని ఇష్ట పడటం లేదని కథలు వ్యాప్తి చెందడం ప్రారంభవమడంతో ల్యారీ, తను ‘పర్–ఫెక్ట్లీ వెల్’ అని ప్రధాని కామెరున్ తప్పనిసరై ట్వీట్ చేయవలసి వచ్చింది. ఆ ట్వీట్ బ్రిటిష్ ప్రభుత్వానికి భరోసాను ఇచ్చింది. నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ల్యారీ ఎందుకు కనిపించడు అని బ్రిటన్ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహుతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. 10 డౌనింగ్ స్ట్రీట్ ప్రవేశ ద్వారం వద్ద ట్రంప్తో కలిసి థెరెసా మే, ఆమె భర్త ఫొటోలు దిగుతున్నప్పుడు ల్యారీ వారి వెనుక కిటికీ అంచుపై నిలబడి ప్రతి ఫొటోలోనూ కనిపించింది. తర్వాత వర్షం నుంచి తలదాచుకోడానికి సాయుధుల కనురెప్పల కాపలాలో ఉన్న ట్రంప్ క్యాడిలాక్ కారు కింద దూరిన ల్యారీని ఎంత నచ్చచెప్పీ బయటకు రప్పించలేక పోయారు. బి.బి.సి.కి చెందిన జోన్ సోపెల్ ఆ ఘటనను... ‘‘బ్రేకింగ్ న్యూస్: ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనకారులు డొనాల్డ్ ట్రంప్ వాహన శ్రేణిని నిలువరించడంలో విఫలమయ్యారు. కానీ 10 డౌనింగ్ స్ట్రీట్ పిల్లి ఆ పని చేయగలిగింది’’... అని ట్వీట్ చేశారు. కొంతకాలంగా ల్యారీపై మునుపెన్నడూ లేని విధంగా తరచూ విమర్శలు వినవస్తున్నాయి. ల్యారీ స్వభావం, పనితీరు చుట్టూ కేంద్రీకృతం అయిన విమర్శలవి. వేటాడి చంపే క్రూర స్వభావం ల్యారీలో విస్పష్టంగా లోపించడాన్ని డౌనింగ్ స్ట్రీట్ అధికారులు గమనించారు. ‘‘ఎలుకల్ని వేటాడడం కన్నా ఎక్కువ సమయం ల్యారీ నిద్రలోనే గడుపుతున్నాడు’’ అని కొందరు ఫిర్యాదు చేశారు. అయితే నేను విన్నదేమంటే సునాక్ అతడిని విధుల నుంచి విరమింపజేసే ప్రమాదం లేదని. ఏ విధంగా చూసినా కూడా సునాక్ దంపతులకు వీడ్కోలు పలికి, కొత్తగా వచ్చేవాళ్ల మెప్పు పొందే వరకైనా ల్యారీ అక్కడ ఉంటాడు. ల్యారీ మాంసం కూరను ఇష్టపడతాడా లేక పప్పూ, అన్నం అంటాడా అనేది బహుశా అప్పుడు మనం తెలుసుకోవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సంపన్న రాజ్యాల కపటత్వం
‘పర్యావరణ పరిరక్షణ విషయంలో నిర్లిప్తంగా ఉండటం ద్వారా మానవాళి నరకానికి ద్వారాలు తెరుస్తోంది సుమా...’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించిన మర్నాడే 2015 ప్యారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సుకు పూచీపడిన లక్ష్యాలను నీరుగారుస్తూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిర్ణయాలు తీసుకున్నారు. సహజంగానే పర్యావరణ ఉద్యమకారులను ఈ ప్రకటన దిగ్భ్రాంతిపరిచింది. గతంలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక గత ప్రభుత్వ నిర్ణయాలను తాము ఆమోదించబోమని ప్యారిస్ ఒడంబడిక నుంచి వైదొలగారు. తిరిగి జో బైడెన్ వచ్చాకే అమెరికా పాత విధానానికి మళ్లింది. సునాక్ అంత మాట అనకపోయినా ఆయన తాజా చర్యలు మాత్రం అలానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాన్ని 2030 నుంచి నిలిపేస్తామని ప్యారిస్ శిఖరాగ్ర సదస్సులో బ్రిటన్ వాగ్దానం చేయగా, దీన్ని ఆయన మరో అయిదేళ్లు పొడిగించారు. అలాగే 2035 నాటికి కొత్త గ్యాస్ బాయిలర్ల ఏర్పాటును ఆపేస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కన బెట్టారు. 2050 నాటికల్లా కర్బన ఉద్గారాలను సంపూర్ణంగా తొలగించటమే లక్ష్యమని చెబుతూనే ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలను వాయిదా వేయటం సంపన్న రాజ్యాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. హరిత లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకుంటే ఉపాధి దెబ్బతింటుందని, జనాగ్రహం వెల్లువెత్తుతుందని ఆయన చెబుతున్న మాటలు కేవలం సాకు మాత్రమే. కర్బన ఉద్గారాలకు కారణమయ్యే పరిశ్రమలు మూతబడినా, హరిత ఇంధనంతో పనిచేసే పరిశ్రమల్లో ఉపాధి లభిస్తుంది. భిన్నరూపాల్లో సబ్సిడీలు, ఆర్థిక సాయం అందిస్తే ప్రజలకు అంత కష్టం అనిపించదు. అందుకు భిన్నంగా ఆ లక్ష్యాల నుంచే తప్పుకోవటం అన్యాయం. వచ్చే ఎన్నికల్లో మధ్యతరగతి మద్దతు కోసం వారికి నొప్పి కలిగించే నిర్ణయాలు తీసుకోరాదని సునాక్ భావిస్తున్నారు. ఇందుకు పర్యావరణం బలయ్యే ప్రమాదం ఉన్నా ఆయనకు పట్టడం లేదు. అసలు సంపన్న రాజ్యాల తీరుతెన్నులను ఐక్యరాజ్యసమితి సదస్సే పట్టిచూపింది. ఆ సదస్సుకు 34 దేశాల ప్రతినిధులు హాజరుకావాల్సివుండగా ప్రధాన కాలుష్యకారక దేశాలైన అమెరికా, చైనా లతో సహా ఎవరూ రాలేదు. నిజానికి బ్రిటన్ ప్రధాని హోదాలో పాల్గొనే అవకాశం తొలిసారి వచ్చినందున రిషి సునాక్ తప్పక హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన గైర్హాజరు కావటమే కాదు... పర్యావరణానికి ముప్పు తెచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధులు లక్ష్యసాధన దిశగా తీసుకున్న చర్యలేమిటో, వైఫల్యాలుంటే కారణాలేమిటో చెప్పాలని సమితి అన్ని దేశాలనూ కోరింది. సరైన చర్యలు తీసుకుంటున్న దేశాలు ఇతర దేశాలకు స్ఫూర్తిదాయ కంగా నిలుస్తాయన్నది ఐక్యరాజ్యసమితి ఉద్దేశం. కానీ హోంవర్క్ చేయని పిల్లలు ఆ మర్నాడు బడి ఎగ్గొట్టినట్టు పర్యావరణ హిత నిర్ణయాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్న దేశాలన్నీ ఈ సదస్సుకు గైర్హాజరయ్యాయి. చిత్తశుద్ధి ఉంటే స్వచ్ఛమైన గాలి, నిరపాయకరమైన ఇంధనం అందు బాటులోకి రావటం పెద్ద కష్టం కాదని...ఈ రంగాల్లో ఉపాధి కల్పన అవకాశాలు కూడా పెరుగు తాయని గుటెరస్ చెబుతున్న మాట అరణ్యరోదనే అయింది. 2030 నాటికి బొగ్గు వినియోగం నుంచి ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) దేశాలు పూర్తిగా వైదొలగితే, మరో పదేళ్లకు ఇతర దేశాలు దాన్ని సాధించగలుగుతాయని పారిస్ సదస్సు నిర్దేశించింది. కానీ సంపన్న రాజ్యాలు సభ్యులుగా ఉన్న ఓఈసీడీలో ఏ ఒక్క దేశమూ ఆ దిశగా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. సరి గదా కెనడా, అమెరికా, బ్రిటన్ తదితర సంపన్న దేశాలు మూతబడిన పాత ఫ్యాక్టరీలను సైతం తెరుస్తూ బొగ్గు వినియోగాన్ని మరింత పెంచాయి. ఈ ఏడాది జూన్–ఆగస్టు మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిశ్రామికీకరణకు ముందున్న వాతావరణంతో పోలిస్తే కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగటం ఎంతో దూరంలో లేదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పిన మాట అక్షరసత్యమని ఈ పరిణామం వెల్లడిస్తోంది. గుటెరస్ చేస్తున్న హెచ్చరిక మరింత గుబులు పుట్టిస్తుంది. మరో 2.8 డిగ్రీల సెల్సి యస్ ఉష్ణోగ్రత పెరిగే క్రమంలో ఉన్నామని ఆయన ప్రకటించారు. ప్యారిస్ ఒడంబడిక కుదిరిన సమ యంలో ప్రపంచ దేశాలన్నీ 2020నాటికే ఇంతకు మూడింతల క్రియాశీల కార్యాచరణకు పూనుకోవా లని సదస్సు నిర్దేశించింది. అలాగైతే తప్ప లక్ష్యసాధనను చేరుకోలేమని చెప్పింది. కానీ మరో నాలుగేళ్లకే సంపన్న రాజ్యాల నిర్వాకం బయటపడింది. 2019లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో దాదాపు 60 దేశాలు తాము పూచీపడిన లక్ష్యాలకు మించి కర్బన ఉద్గారాలను తగ్గించు కున్నామని ప్రకటించగా...అందులో అత్యధిక దేశాలు చిన్నవే, తక్కువస్థాయి కాలుష్య కారక దేశాలే. మరి సంపన్న దేశాలు ఏం చేసినట్టు? ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి, పర్యావరణానికి తూట్లు పొడిచాయి. ఈ విషయంలో కాస్తయినా సిగ్గుపడటం మానేశాయి. వాతావరణ సదస్సుకు ముందురోజే జరిగిన సమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భూగోళాన్ని వడగాడ్పులు చుట్టుముట్టడం, అడవులు తగలబడటం, కరువుకాటకాలు, వరదలు వగైరాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. శిలాజ ఇంధనాల వాడకం ఆపకపోతే ఈ ముప్పు మరింత పెరుగుతుందని హెచ్చరించారు. కానీ గత అయిదేళ్లలో సాధించిందేమిటో చెప్పాలి గనక ఆ మర్నాడు జరిగిన సదస్సుకు మాత్రం గైర్హాజరయ్యారు. ఇలాంటి ధోరణులు సరి కాదు. ఇప్పటికైనా సంపన్న రాజ్యాల తీరు మారాలి. భూగోళం ఉనికికి ముప్పు తెచ్చే చర్యలకు స్వస్తి పలకాలి. ఇది కూడా చదవండి: నారీలోకానికి నీరాజనం! -
దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..
రిషి సునక్ (Rishi Sunak) యూకే ప్రధాన మంత్రి కావడంలో భారతీయ బిలియనీర్, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి (Narayana Murthy) పాత్ర ఉందని ఆ దేశ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) నమ్ముతున్నారని ఇటీవల విడుదలైన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. 'ది రైట్ టు రూల్' అనే ఈ పుస్తకాన్ని ది టెలిగ్రాఫ్ వార్తాపత్రికకి పొలిటికల్ ఎడిటర్ అయిన బెన్ రిలే-స్మిత్ రచించారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్కు సంబంధించిన పలు విషయాలను ఇందులో ప్రస్తావించారు. పార్టీగేట్ కుంభకోణం గురించి స్యూ గ్రే ప్రాథమిక దర్యాప్తు ఫలితాలు ప్రధాని జాన్సన్ తన అధికారిక నివాసంలో పార్టీలకు ఆతిథ్యం ఇవ్వడానికి కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినట్లు ఆరోపించినప్పుడు 2023 ఫిబ్రవరి కంటే ముందే రిషి సునక్ తన ప్రధాని పదవి కోసం రంగం సిద్ధం చేయడం ప్రారంభించాడని రచయిత పుస్తకంలో పేర్కొన్నారు. (Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!) బోరిస్ జాన్సన్ రాజకీయ కుట్రలను నమ్మేవారని 'ది రైట్ టు రూల్' పుస్తకం పేర్కొంది. బోరిస్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు ముఖ్య సలహాదారుగా పనిచేసిన బ్రిటిష్ రాజకీయ వ్యూహకర్తను ప్రస్తావిస్తూ, "సునక్ మామ, భారతీయ బిలియనీర్ నారాయణ మూర్తి.. డొమినిక్ కమ్మింగ్స్ను తన పక్కన పెట్టుకున్నట్లు పుకారును బోరిస్ వినిపించేవారని పుస్తకంలో రాశారు. పార్టీగేట్ తిరుగుబాటు కాలంలో కమ్మింగ్స్ డౌనింగ్ స్ట్రీట్లో ఎలాంటి అధికారిక పాత్రను పోషించలేదు. 2020 నవంబర్లోనే ఆయన రాజీనామా చేశారు. జాన్సన్ తన మాజీ రాజకీయ సహాయకుడు, అతనితో విభేదాలు ఉన్నందున, ఇప్పుడు సునక్ రాజకీయ అదృష్టాన్ని పెంచడానికి కృషి చేస్తున్నాడని నమ్మినట్లుగా పుస్తకంలో రాసుకొచ్చారు. -
భయపడొద్దు.. కుక్కలను కంట్రోల్ చేస్తున్నాం: బ్రిటన్ ప్రధాని
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బ్రిటన్లో పెరుగుతున్న కుక్కల బెడదపై దృష్టి సారించి, అత్యంత ప్రమాదకరమైన శునకజాతిపై నిషేధం విధించారు. బ్రిటన్లో పెరుగుతున్న కుక్క కాట్లను నివారించేందుకు రుషి సునాక్ అమెరికన్ ఎక్స్ఎల్ బులీ జాతికి చెందిన కుక్కల పెంపకంపై నిషేధం విధించారు. ఈ సందర్భంగా సునాక్ మాట్లాడుతూ అమెరికన్ ఎక్స్ఎల్ బులీ డాగ్స్ మనుషులకు ప్రమాదకరంగా పరిణమించాయని, ముఖ్యంగా ఇవి చిన్నారులపై దాడులు చేస్తున్నాయన్నారు. ఈ తరహా కుక్కలు దాడులకు పాల్పడటానికి సంబంధించిన కొన్ని వీడియోలను ఆయన షేర్ చేశారు. ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన శునకాలతో సమస్య లేదని, అయితే ఎక్స్ఎల్ బులీ డాగ్స్ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో గుర్తించలేమన్నారు. బ్రిటన్లో పెరుగుతున్న కుక్కల బెడద నివారణకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని తెలియజేశారు. ఇటీవల జరిగిన దాడులకు కారణంగా నిలిచిన కుక్కల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామన్నారు. ప్రజల రక్షణకు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని తెలిపారు. కాగా ఇటీవల స్టాఫోర్డ్షైర్లో ఎక్స్ఎల్ బులీ జాతి శునకం ఒక వ్యక్తిపై దాడి చేయగా, అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికిముందు 11 ఏళ్ల చిన్నారిపై ఇదేవిధమైన దాడి జరిగింది. కాగా ఎక్స్ఎల్ బులీ అనేది అమెరికన్ పిట్బుల్ టెరియర్స్- అమెరికన్ స్టాఫోర్డ్షైర్ టెరియర్స్ల క్రాస్ బ్రీడ్. ఇది కూడా చదవండి: సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం? It’s clear the American XL Bully dog is a danger to our communities. I’ve ordered urgent work to define and ban this breed so we can end these violent attacks and keep people safe. pic.twitter.com/Qlxwme2UPQ — Rishi Sunak (@RishiSunak) September 15, 2023 -
జీ20 సమ్మిట్: ఆకట్టుకున్న అక్షత, గ్రాండ్గా గుడ్బై, రిషీ వీడియో వైరల్
జీ 20 సమ్మిట్ లో యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతదేశంలో మూడు రోజుల పాటు జరిగిన G20 సమ్మిట్లో UK ప్రధాన మంత్రి రిషి సునక్ ,భార్య అక్షతా మూర్తి హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా భారతీయ కుటుంబానికి చెందిన అక్షతామూర్తి కట్టు బొట్టుతో తనదైన శైలితో మరింత ఆకట్టుకున్నారు. రెండు రోజులపాటు సాగిన భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. An important trip to India for the G20, delivering for the UK on the world stage 🇬🇧 👇 pic.twitter.com/H3MvrCJ7zg — Rishi Sunak (@RishiSunak) September 11, 2023 ఈ సందర్బంగా భారతదేశానికి వీడ్కోలు పలుకుతున్నప్పుడు సంప్రదాయ చీరలో అత్యంత మనోహరంగా కనిపించారు అక్షత. రా మ్యాంగో లేబుల్ నుండి పింక్ చీర,చెవిపోగులు, చిన్న బిందీతో ఇండియన్ లుక్తో అక్షతా మూర్తి తన భారత పర్యటనను ముగించారు. అంతేకాదు భారత సంతతికి చెందిన ఈ జంట ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారత గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి ముఖ్యంగా అక్షత సాంప్రదాయ చీర లుక్ చర్చనీయాంశంగా నిలిచింది. యూకే ఆధారిత సస్టైనబుల్ లేబుల్ విత్ నథింగ్ అండర్ నీత్తో కూడిన తెల్లటి బటన్ డౌన్ షర్ట్ను ధరించాలరు. ఢిల్లీలో పూల ప్రింటెడ్ స్కర్ట్తో భారత మండపంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నిర్వహించిన G20 డిన్నర్లో ఇండో-వెస్ట్రన్ మ్యాక్సీ డ్రెస్ ధరించారు. పర్యటన ముగించుకొని వెడుతున్న సందర్బంగా రిషి సునక్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను,వీడియోను పంచుకున్నారు.దీంతో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Rishi Sunak (@rishisunakmp) దేశ రాజధాని నుండి బయలుదేరే ముందు, అక్షత , రిషి సునక్ అక్షరధామ్ ఆలయంలో పూజలు చేశారు. ఇక్కడ కూడా ఆమె పింక్ పలాజో , పింక్ దుపట్టాతో కూడిన ఆకుపచ్చ కుర్తాతో కనిపించగా, మరోవైపు, బ్రిటన్ ప్రధాని అధికారిక దుస్తులు ధరించారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన మిల్లెట్ ఎగ్జిబిషన్కు హాజరైనప్పుడు, అక్షత లిలక్ మార్బుల్-ప్రింట్ డ్రెస్లో కనిపించారు. కాగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి , రచయిత్రి సుధా మూర్తి కుమార్తె అక్షత అన్న సంగతి తెలిసిందే. -
జీ20 సమ్మిట్: కనువిందు చేసిన రిషి సునాక్ దంపతులు..
ఢిల్లీ: జీ20 సదస్సుకు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి జంట సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచింది. సమావేశంలో భాగంగా భార్య భర్తల దృశ్యాలు నెటిజన్ల మనసును దోచేస్తున్నాయి. ఒకరంటే మరొకరు శ్రద్ద కనబరిచే దృశ్యాలకు నెట్టిళ్లు ఫిదా అయింది. ఢిల్లీకి చేరుకోగానే విమానం దిగే క్రమంలో అక్షతా మూర్తి.. రిషి సునాక్కు జాగ్రత్తగా టై కడుతున్న దృశ్యాలు.. వారి మధ్య ప్రేమానురాగాలను సూచించాయి. రిషి సునాక్ వ్యక్తిగత జీవితం ఎంత బాగుందో ఈ ఫొటోలు తెలుపుతున్నాయని నెటినజన్లు కామెంట్లు పెట్టారు. విమానం నుంచి దిగిన తర్వాత కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే రిషి సునాక్ జంటకు స్వాగతం పలికారు. అనంతరం బ్రిటన్ ప్రధాని ఆయన భార్యతో కలిసి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరూ పిల్లలతో సరదాగా మాట్లాడుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. శనివారం రాత్రి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జీ20 నేతలను విందుకు ఆహ్వానించారు. దేశ విదేశాల నేతలు భారతీయత ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులు ధరించి విందుకు వచ్చారు. అక్షతా మూర్తి ఇండియన్ స్టైల్లో వస్త్రాలు ధరించి, భర్తతో కలిసి ఉన్న దృశ్యాలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆదివారం ఉదయం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, అక్షతా మూర్తి ఢిల్లీలోని అక్షర్ధామ్ దేవాలయాన్ని దర్శించారు. దేవుడికి ప్రార్ధనలు చేసి, హారతి ఇచ్చారు. ఈ క్రమంలో రిషి సునాక్ జంట హారతి ఇస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. భారతీయ జంటలాగే ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది కదా..! దాంపత్యం అంటే అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ డిక్లరేషన్ వెనక కఠోర శ్రమ వీరిదే.. -
అక్షరధామ్ ఆలయంలో రిషి సునాక్ ప్రార్ధనలు
ఢిల్లీ:బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తితో కలిసి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. దాదాపు గంటపాటు దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హిందువుగా గర్విస్తున్నానని అన్నారు. 'నేను హిందువునని గర్విస్తున్నాను. అదే వాతావరణంలో పెరిగాను. ఇప్పటికీ అలానే ఉన్నాను. ఢిల్లీలో ఉండే ఈ రెండు రోజుల్లో ఒక మందిరాన్ని దర్శించాలని అనుకున్నాను.' అని రిషి సునాక్ అన్నారు. రిషి సునాక్ రాకతో దేవాలయంతో సహా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. జీ20 సమావేశాలకు హాజరుకావడానికి శుక్రవారం ఢిల్లీకి వచ్చారు రిషి సునాక్ దంపతులు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే 'జై శ్రీరాం' అని పలకరిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వారికి స్వాగతం పలికారు. రుద్రాక్ష, భగవద్గీత, హనుమాన్ చాలీసాను రిషి సునాక్ దంపతులకు అందించారు. శనివారం జీ20 సదస్సు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక చర్చలు జరిపారు రిషి సునాక్. వాణిజ్య, పెట్టుబడుల అంశంలో మరిన్ని ఒప్పందాలు చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: G20 Summit: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్.. -
G20 Summit: జీ20 అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు
న్యూఢిల్లీ: జీ20 కూటమి నేతలు, అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఢిల్లీలో భారత్ మండపం వద్ద ఘనమైన విందు ఇచ్చారు. తృణధాన్యాలు, కశ్మీరీ కాహా్వతో తయారు చేసిన పసందైన వంటకాలను ఈ సందర్భంగా అతిథులు రుచి చూశారు. ముంబై పావ్, బాకార్ఖానీ అనే రొట్టెలు వడ్డించారు. డార్జిలింగ్ టీ ఏర్పాటు చేశారు. భారతీయ వంటకాల్లోని వైవిధ్యం ఇక్కడ సాక్షాత్కారించింది. తొలుత రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ జీ20 నేతలకు స్వాగతం పలికారు. స్వాగత వేదిక వెనుక ప్రాచీన నలందా విశ్వవిద్యాలయ శిథిలాల చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే జీ20 థీమ్ ‘వసుధైవ కుటుంబం’ అని లిఖించారు. రాష్ట్రపతి ఇచి్చన విందులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 300 మంది హాజరయ్యారు. సునాక్ వెంట ఆయన భార్య అక్షతా మూర్తి కూడా వచ్చారు. నలందా విశ్వవిద్యాలయం గురించి బైడెన్కు, సునాక్ దంపతులకు ప్రధాని మోదీ తెలియజేశారు. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా భార్య యోకో కిషిదా భారతీయ సంప్రదాయ చీరను ధరించి రావడం విశేషం. -
రిషి సునాక్- ప్రధాని మోదీ భేటీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులపై లోతుగా చర్చించినట్లు పేర్కొన్నారు. జీ20 సమ్మిట్ మొదటి సెషన్ అనంతరం ఇరు దేశాల నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ప్రధాని మోదీని రిషి సునాక్ భారతీయ సాంప్రదాయంలో నమస్తేతో పలకరించారు. 🇬🇧🇮🇳 Two nations, one ambition. An ambition rooted in our shared values, the connection between our people and – of course – our passion for cricket. pic.twitter.com/1W4wkiYCjY — Rishi Sunak (@RishiSunak) September 9, 2023 'రెండు దేశాలు.. ఒకే ఆశయం. ఇరు దేశాల మధ్య పరస్పర విలువలు, ప్రజల మధ్య అనుబంధం ప్రత్యేకమైనవి' అని రిషి సునాక్ ట్విట్టర్(ఎక్స్) పోస్ట్లో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల వంటి ఒప్పందాల్లో మరింత పరస్పర సహకారం దిశగా అడుగులు వేయాలని చర్చించినట్లు రిషి సునాక్ తెలిపారు. ఇండియా, యూకేలు సుస్థిరాభివృద్ధి దిశగా ప్రయత్నాలు చేస్తాయని చెప్పారు. జీ20 సదస్సుకు హాజరవడానికి రిషి సునాక్ ఢిల్లీకి చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు జీ20 సమ్మిట్లో మొదటిరోజు ఢిల్లీ డిక్లరేషన్పై అన్ని దేశాల నేతలు ఏకాభిప్రాయానికి ఆమోదం తెలిపారు. అనంతరం ఇద్దరు నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇదీ చదవండి: G20 Summit: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్.. -
జీ20 సమ్మిట్: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్..
ఢిల్లీ: జీ20 సమావేశాలకు హాజరైన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయన భార్య అక్షతా మూర్తి మధ్య ప్రేమానురాగాలకు సంబందించిన దృశ్యాలు వైరల్గా మారాయి. రిషి సునాక్కు స్వయంగా అక్షతా మూర్తి టై కట్టారు. ఈ దృశ్యాలపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. జీ20 సమ్మిట్ కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్కు వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో తన భార్య అక్షతా మూర్తితో కలిసి దిగారు. విమానం నుంచి కిందకు దిగే క్రమంలో అక్షతా మూర్తి తన భర్త రిషి సునాక్కు టై కట్టారు. సునాక్ నల్లని సూటు ధరించి ఆరెంజ్ కలర్లో టై ధరించారు. అక్షతా మూర్తి తెల్లని షర్ట్తో కనిపించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Rishi Sunak (@rishisunakmp) రిషి సునాక్కు అక్షతా మూర్తి టై కట్టిన దృశ్యాలపై నెటిజన్లు స్పందిస్తూ.. భార్యభర్తల మధ్య ప్రేమకు నిదర్శనమని కామెంట్లు పెట్టారు. రిషి సునాక్ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో ఈ దృశ్యాలు తెలుపుతున్నాయని మరికొందరు స్పందించారు. బ్యూటిఫుల్ పిక్చర్ అంటూ కామెంట్ చేశారు. అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూమార్తే. కాగా.. రిషి సునాక్, అక్షతామూర్తిలకు 2009లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. భారత్కు చేరుకున్న రిషి సునాక్ దంపతులకు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్వాగతం పలికారు. భారత్కు రావడం తనకు చాలా ప్రత్యేకమని రిషి సునాక్ తెలిపారు. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్: ఉక్రెయిన్ యుద్ధంపై ఏమని తీర్మానించారంటే.. -
G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం
► జీ20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం పొందింది. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని భారత్ సాధించింది. ప్రధాని మోదీ ఈ అంశాన్ని జీ20 వేదికగా వెల్లడించారు. డిక్లరేషన్పై ఏకాభిప్రాయం కుదిరేలా కృషి చేసిన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. #WATCH | G-20 in India: PM Narendra Modi says, " I have received good news. Due to the hard work of our team, consensus has been built on New Delhi G20 Leaders' Summit Declaration. My proposal is to adopt this leadership declaration. I announce to adopt this declaration. On this… pic.twitter.com/7mfuzP0qz9 — ANI (@ANI) September 9, 2023 ►సదస్సు మధ్యలో ప్రధాని మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. యూకే ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ భేటీ కానున్నారు. ►‘15 సంవత్సరాల క్రితం ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచ వృద్ధిని పునరుద్ధరించడానికి తొలిసారి జీ20 నేతలు కలిసి మందుకువచ్చాం. అపారమైన సవాళ్ల సమయంలో కలిసాం. జీ20 నాయకత్వాన్ని అందించేందుకు ప్రపంచం మరోసారి చూస్తోంది. మనమంతా కలిసి ఈ సవాళ్లను పరిష్కరించగలమని నేను నుమ్ముతున్నాను’ అని| బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ట్వీట్ చేశారు. G 20 in India | UK Prime Minister Rishi Sunak tweets, "15 years ago, #G20 leaders came together for the first time to restore global growth after the financial crisis. We meet at a time of enormous challenges – the world is looking to the G20 once again to provide leadership.… pic.twitter.com/SDsQ350kWH — ANI (@ANI) September 9, 2023 ►జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. పలు కీలక ఒప్పందాలపై ప్రపంచ నేతలు చర్చలు జరుపుతున్నారు. అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, భారత్ మధ్య మెగా రైల్-పోర్టు కనెక్టివిటీ డీల్ను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. G 20 in India | President of South Africa Cyril Ramaphosa tweets, "We are delighted that the G20 has accepted the African Union as a member of the G20..." pic.twitter.com/IhvmBOedfr — ANI (@ANI) September 9, 2023 ►G20లో శాశ్వత సభ్యదేశంగా మారినందుకు ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ అజలీ అసోమానిని ప్రధాని మోదీ హత్తుకున్నారు. ఆఫ్రికన్ యూనియన్ అధినేతకు మోదీ అభినందనలు తెలిపారు. Honoured to welcome the African Union as a permanent member of the G20 Family. This will strengthen the G20 and also strengthen the voice of the Global South. pic.twitter.com/fQQvNEA17o — Narendra Modi (@narendramodi) September 9, 2023 G 20 in India | Prime Minister Narendra Modi and other Heads of State/Government and Heads of international organisations participate in Session 1 of the G20 Summit at Bharat Mandapam in Delhi. pic.twitter.com/2CFr1iatYq — ANI (@ANI) September 9, 2023 ►జీ20 రౌండ్టేబుల్పై ప్రధాని మోదీ కూర్చున్న చైర్ వద్ద ఉన్న నేమ్ప్లేట్పై ఇండియా అని కాకుండా భారత్ అని రాసి ఉంది. అలాగే మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. భారత్ మిమ్మల్ని స్వాగతిస్తోందన్నారు. G20 Summit in New Delhi admits African Union as permanent member Read @ANI Story | https://t.co/WDp55u7O54#G20India2023 #G20SummitDelhi #PMModi #AfricanUnion pic.twitter.com/r3S8L89nkF — ANI Digital (@ani_digital) September 9, 2023 ►గత కొన్ని రోజుల నుంచి ఇండియా పేరు మార్పు విషయంలో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా భారత్ను ఇండియాగా గుర్తించే వారు. ఇప్పుడు తొలిసారి ఓ అంతర్జాతీయ సమావేశంలో ఇండియాను భారత్గా గుర్తిస్తూ.. రౌండ్టేబుల్పై దేశం నేమ్ప్లేట్ను ఏర్పాటు చేశారు. #WATCH | G 20 in India | Prime Minister Narendra Modi says, "India's G20 presidency has become a symbol of inclusion, of 'sabka saath' both inside and outside the country. This has become people's G20 in India. Crores of Indians are connected to this. In more than 60 cities of… https://t.co/rc2iIO2IGf pic.twitter.com/SgE8r2Nojk — ANI (@ANI) September 9, 2023 ►జీ20 సదస్సులో తొలి సెషన్ ప్రారంభమైంది. వన్-ఎర్త్పై ప్రపంచ నేతలు చర్చలు సాగిస్తున్నారు. ►భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సదస్సు ‘సాబ్కా సాథ్’ చేరికలకు చిహ్నంగా మారిందన్నారు. ఇది భారత్లో ప్రజల జీ20గా మారిందని తెలిపారు. కోట్లాది మంది భారతీయులు దీనికి కనెక్ట్ అయ్యారని 60కి పైగా నగరాల్లో 200 కంటే ఎక్కువ సమావేశాలు జరిగాయని పేర్కొన్నారు. 'సబ్కా సాథ్' భావనతో ఆఫ్రికన్ యూనియన్కు G20 శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేయాలని భారత్ ప్రతిపాదించిందని తెలిపారు. ►ప్రపంచానికి కొత్త దిశను చూపించడానికి 21వ శతాబ్దం ఒక ముఖ్యమైన సమయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాత సమస్యల నుంచి కొత్త సవాళ్లను కోరుతున్న సమయంలో మనం మన బాధ్యతలను మానవతావాదిగా నిర్వర్తిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కోవిడ్ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడిందని.. యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచిందన్నారు. కొవిడ్ను ఓడిస్తే ఈ విశ్వాస రాహిత్యంపై కూడా విజయం సాధించవచ్చని తెలిపారు. అ #WATCH | G 20 in India | PM Modi at the G 20 Summit says "Today, as the president of G 20, India calls upon the world together to transform the global trust deficit into one of trust and reliance. This is the time for all of us to move together. In this time, the mantra of 'Sabka… pic.twitter.com/vMWd9ph5nY — ANI (@ANI) September 9, 2023 ►జీ 20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభోపన్యాసం చేస్తూ మనమందరం కలిసి కదలాల్సిన సమయం ఇదని తెలిపారు. ఈ సందర్భంగా 'సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్' మనకు టార్చ్ బేరర్గా పనిచేస్తుంది. భవిష్యత్తు తరాలకు సంబంధించి ఆహారం, ఇంధన నిర్వహణ, ఉగ్రవాదం, సైబర్ భద్రత, ఆరోగ్యం, శక్తి , నీటి భద్రత వంటి విషయాల్లో పరిష్కారాన్ని కనుగొనాలి. ► జీ20 శాశ్వత సభ్య దేశంగా కొత్తగా చేరిన యూనియన్ ఆఫ్ కొమొరోస్, ఆఫ్రికన్ యూనియన్ ఛైర్పర్సన్ అజలీ అసోమనిని మోదీ గ్రూప్లోకి స్వాగతించారు. ఆయనను అభినందించి సభ్య దేశాలకు కేటాయించిన కుర్చులీ కూర్చోబెట్టారు. #WATCH | G 20 in India | President of the Union of Comoros and Chairperson of the African Union (AU), Azali Assoumani takes his seat as the Union becomes a permanent member of the G20. pic.twitter.com/Sm25SD80n9 — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India | Prime Minister Narendra Modi invites the Head of the African Union to take his seat, as a permanent member of the G20 as the first session of the Summit begins. pic.twitter.com/ueCe7pwNLS — ANI (@ANI) September 9, 2023 ► జీ20 సదస్సు ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ముందుగా మోరాకో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ ప్రకృతి విలయంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు సాధ్యమైన సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. న్యూఢిల్లీ: భారత్ అధ్యక్షతన తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్టాత్మక జీ20 సదస్సు ఢిల్లీలో ప్రారంభమైంది. ముందుగా జీ20 దేశాధినేతలు ఒక్కొక్కరిగా భారత మండపానికి చేరుకున్నారు. దేశాధినేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఉదయం 10:30కు ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో జీ20 సదస్సు ప్రారంభం అయ్యింది. #WATCH | G 20 in India | PM Modi at the G 20 Summit says "Before we start the proceedings of G20, I want to express my condolences over the loss of lives due to an earthquake in Morocco. We pray that all injured recover at the earliest. India is ready to offer all possible… pic.twitter.com/ZTqcg11cKI — ANI (@ANI) September 9, 2023 ►అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, సౌదీ అరేబియా ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ జీ20 సదస్సు వేదిక అయిన ప్రగతి మైదాన్లోని భారత్ మండపానికి చేరుకున్నారు. #WATCH | G 20 in India: US President Joe Biden arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/jrGkcgJ4Rz — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: Crown Prince of Saudi Arabia Muhammed Bin Salman arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/NNyI9CmSy3 — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: United Kingdom PM Rishi Sunak arrives at Bharat Mandapam, arrives at the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/EUVAtTTBIm — ANI (@ANI) September 9, 2023 ►బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్, దక్షిణాఫికా అధ్యక్షుడు సిరిల్ రమసోఫా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని జీ20 సదస్సు వేదిక భారత్ మండపానికి చేరుకున్నారు. #WATCH | G 20 in India: Premier of the People's Republic of China Li Qiang arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/Fs6715qUzn — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: President of South Africa Cyril Ramaphosa arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/OM5J5KCGWV — ANI (@ANI) September 9, 2023 ► ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ, జపాన్ ప్రధాని కిషిదా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ప్రగతి మైదాన్లోని జీ20 సదస్సు వేదిక భారత్ మండపానికి చేరుకున్నారు. #WATCH | G 20 in India: President of the European Commission, Ursula von der Leyen arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/TqBlOiFysj — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: Prime Minister of Italy Giorgia Meloni arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/jSIhNZcAzU — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: Japanese PM Fumio Kishida arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/V2pkp7VlJK — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: Indonesian President Joko Widodo arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/qyIYG4rhFw — ANI (@ANI) September 9, 2023 ► చైనా మంత్రి లీ కియాంగ్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఢిల్లీలోని భారత్ మండపానికి చేరుకున్నారు. భారత్ మండపానికి చేరుకున్నారు. #WATCH | G-20 in India: German Chancellor Olaf Scholz arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/PkBvhCKWEO — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: Japanese PM Fumio Kishida arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/V2pkp7VlJK — ANI (@ANI) September 9, 2023 బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్ జీ 20 సమ్మిట్కు వేదికైన భారత్ మండపానికి చేరుకున్నారు. #WATCH | G 20 in India: President of Brazil Luiz Inacio arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/y32cs8XEho — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: President of Turkey, Recep Tayyip Erdogan arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/e8IxFZPsgq — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: President of South Korea Yoon Suk Yeol arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/7q5wGgxqR6 — ANI (@ANI) September 9, 2023 #WATCH | G 20 in India: President of the European Council Charles Michel arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/VWxAtsclEK — ANI (@ANI) September 9, 2023 జీ20 సదస్సులో భాగంగా ఇవాళ.. పదిన్నర నుంచి ఒకటిన్నర మధ్యలో వన్ ఎర్త్ సమ్మిట్ జరగనుంది. ఆపై 1.30గం నుంచి 3.00 మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. మ.3- మ.4.45 మధ్య సెషన్ 2లో భాగంగా.. వన్ ఫ్యామిలీ సమ్మిట్ జరుగుతుంది. ఇక రాత్రి 7గం - 8గం మధ్య జీ20 దేశాధినేతలు గ్రూప్ ఫోటో దిగుతారు. రా.8గం 9.15గం సమయంలో జీ20 దేశాధినేతల డిన్నర్ మీటింగ్ ఉంటుంది. #WATCH | G 20 in India | Visuals from Bharat Mandapam the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/1It0LslPBV — ANI (@ANI) September 9, 2023 అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే జీ20 సదస్సు ఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత మండపం వేదికగా రెండు రోజులపాటు(ఇవాళ, రేపు) సాగనుంది. వసుదైక కుటుంబం పేరుతో ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు నినాదంగా భారత్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరిష్కారం చూపుతూ.. భౌగోళికంగా ముక్కలైన రాజకీయ వాతావరణానికి చికిత్స చేసే సమ్మిళిత వృద్ధి దిశగా ప్రపంచాన్ని పరుగులు పెట్టించడంపై ఈ సదస్సు దృష్టి పెట్టబోతోంది. . 1. -
G20 Summit: ఖలిస్థానీ తీవ్రవాదాన్ని సహించేది లేదు: రిషి సునాక్
ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు దేశ రాజధానిలో అడుగుపెట్టడంతో హస్తీనాలో కోలాహలం పెరిగింది. 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం ఢిల్లీ చేరుకుంది. శనివారం సైతం మరికొందరు నేతలు విచ్చేస్తున్నారు.మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నారు. జీ-20 శిఖరాగ్ర సదస్సుకు వేదికగా నిలిచిన భారత్కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. తన భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీలోని విమానాశ్రయంలో దిగారు. కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే వీరికి స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనను రిషి సునాక్ దంపతులు కాసేపు వీక్షించారు. అనంతరం షాంగ్రీలా హోటల్కు చేరుకొని బస చేశారు. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని సునాక్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పలు అసక్తికర విషయాలు పంచుకున్నారు. హిందువుగా తాను గర్విస్తున్నానని అన్నారు. భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఇండియాకు రావడం వ్యక్తిగతం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. భారత్ అల్లునిగా.. జీ20 పర్యటన తనకు చాలా ప్రత్యేకమైనదని అన్నారు. తనను ప్రేమగా భారతదేశ అల్లునిగా పిలుస్తారని గుర్తు చేశారు. కాగా భారత్కు చెందిన ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని సునాక్ వివాహామాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సునాక్ ఈ విధంగా చమత్కరించారు. చదవండి: జీ20 సదస్సు.. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం.. ఇంకా ఎన్నో! ఖలిస్థానీ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బ్రిటన్ (యునైటెడ్ కింగ్డమ్) భారత్తో కలిసి పనిచేస్తోందని రిషి సునాక్పేర్కొన్నారు. హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని అన్నారు. దీనికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు సహకరిస్తున్నాయని చెప్పారు. ‘తీవ్రవాదం, హింస వంటివి ఏ రూపంలో ఉన్న బ్రిటన్లో వాటికి తావులేదు. అందుకే ఖలిస్థానీ అనుకూల తీవ్రవాదాన్ని అధిగమించేందుకు భారత్తో కలిసి పనిచేస్తున్నాం. ఇటీవల బ్రిటన్ భద్రతా మంత్రి టామ్ తుగేన్ధాట్ భారత్లో పర్యటించారు. లండన్లోని భారతీయ దౌత్య సిబ్బందికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారత్ ఆందోళనలు బ్రిటీష్ ప్రభుత్వానికి తెలుసు. ఇది భారత్ సమస్య మాత్రమే కాదు బ్రిటన్ది కూడా. కాబట్టి కీలక సమాచారాన్ని పంచుకుంటూ.. ఈ తరహా హింసను నిర్మూలించేందుకు భారత్తో కలిసి పనిచేస్తున్నాం. హింసాత్మక చర్యలు సరైనవి కావు. బ్రిటన్లో దానిని నేను సహించను’ అని సునాక్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్థానీ వాదులు గత మార్చిలో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఖలిస్థానీ కార్యకలాపాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన యూకే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల భారత్కు వచ్చిన ఆదేశ భద్రతా మంత్రి కూడా దీనిపై ప్రధానంగా చర్చలు జరిపిన అనంతరం తీవ్రవాదంపై కలసికట్టు పోరుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ స్పష్టం చేసింది. అక్కడ ఖలిస్థానీ తీవ్రవాదం నిరోధానికి ప్రత్యేకంగా 95,000 పౌండ్లు(కోటి రూపాయలు) కూడా కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. -
G20 Summit 2023: శిఖరాగ్ర భేటీకి శ్రీకారం
న్యూఢిల్లీ: అద్భుతమైన ప్రపంచ ఆర్థికాభివృద్ధి సాధనే పరమావధిగా సాగే జీ20 అగ్రరాజ్యాల కూటమి సమావేశానికి హస్తిన సర్వాంగ సుందరంగా ముస్తాబై సభ్య దేశాల అధినేతలకు సాదర స్వాగతం పలుకుతోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర ప్రపంచ దేశాల ఆగమనంతో జీ20 శిఖరాగ్ర సదస్సు హడావిడి మరింత పెరిగింది. శనివారం సైతం మరికొందరు నేతలు విచ్చేస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టగానే బైడెన్తో మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ శ్రేయస్సుకు పాటుపడతామని ప్రకటించారు. మానవ కేంద్రిత, సమ్మిళిత అభివృద్ధి దిశగా సదస్సు కొత్త బాటలుపరుస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని, ఏకాభిప్రాయం సాధిస్తామని భారత్ ధీమా వ్యక్తంచేసింది. 9, 10 తేదీల్లో (శని, ఆదివారాల్లో) జరిగే సదస్సుకు హాజరయ్యే నేతల రాక, సాదర స్వాగతం, అతిథులకు ఆతిథ్యంతో ఢిల్లీలో కోలాహలం పెరిగింది. పసందైన వంటకాలు, భిన్న సంప్రదాయ వాయిద్యాలతో సంగీత విభావరి ఇలా పలు రకాల కార్యక్రమాలు, ప్రదర్శనలతో అధినేతలకు మరెప్పుడూ మరిచిపోలేని రీతిలో అద్భుతంగా అతిథ్యం ఇవ్వనున్నారు. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఆర్థిక అనిశి్చతి, మాంద్యం భయాలు వంటి కీలక అంశాలతో చర్చలు శిఖరాగ్రానికి చేరుకోనున్నాయి. ఎలాగైనా సరే సదస్సు ముగిసేనాటికి అందరి ఏకాభిప్రాయంతో సంయుక్త ప్రకటన విడుదల చేసేందుకు భారత్ శాయశక్తులా కృషిచేస్తోంది. నేడు మొదలయ్యే ఈ చర్చా సమరంలో నేతలు చివరకు ఎలాంటి వాగ్దానాలు చేస్తారో, ఏమేం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్దాం..!! దుర్భేద్యమైన భద్రత ముఖ్యనేతలంతా ఢిల్లీకి వచ్చేస్తున్న నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీలో భద్రతా బలగాలను మొహరించారు. చర్చలకు ప్రధాన వేదిక అయిన ‘భారత్ మండపం’ కాంప్లెక్స్ వద్ద భద్రతను పోలీసులు, పారామిలటరీ, నిఘా వర్గాలతో కట్టుదిట్టం చేశారు. తొలిసారిగా ఇండియా ఈ సదస్సును నిర్వహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చేసేందుకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సదస్సు వివరాలను జీ20లో భారత షెర్పా అమితాబ్ కాంత్ శుక్రవారం ఢిల్లీలో వివరించారు. ‘ మన న్యూఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధం. దానిని ఇప్పుడు బహిర్గతం చేయలేం. ఎందుకంటే డిక్లరేషన్ తాలూకు ప్రతిపాదలను అధినేతలకు సమరి్పస్తాం. వారి సూచనలు, సవరణల తర్వాతే దానికి ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాతే డిక్లరేషన్ ద్వారా సాధించబోయే విజయాలను వివరిస్తాం’ అని అమితాబ్ చెప్పారు. ‘ ఐక్యరాజ్యసమితి తర్వాత అత్యంత క్రియాశీలకమైన కూటమిగా ఉన్న ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో చేర్చుకునేందుకు దాదాపు అందరినీ ఒప్పించడం భారతదేశ నిబద్ధతకు నిదర్శనం’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్ ఆగమనం మాకు సంతోషదాయకమే అని యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ అన్నారు. ఆఫ్రికన్ యూనియన్లో మొత్తంగా 55 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమిది మహా ఉపనిషత్తు నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు ఇతివృత్తం’ నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. కాగా, చర్చల్లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించి చర్చించాలని బ్రిటన్ భావిస్తోంది. దీంతో ఈ చర్చలో భారత్ పాత్ర కీలకంగా మారనుంది. ‘ ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ, మానవ హక్కుల హననంపై ఇండియా తన నిర్ణయం వెలువరచాలని చర్చలో పట్టుబడతాం. మోదీతో, ఇతరులతో భేటీలను పుతిన్ దారుణ అకృత్యాలను ఆపేందుకు సాధనాలుగా వినియోగిస్తాం’ అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికార ప్రతినిధి చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కూటమి సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలున్నా ఏకాభిప్రాయానికి ప్రయతి్నస్తామని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ చెప్పారు. కాగా, భారత్ తమకు వ్యతిరేకంగా జీ20 వేదికగా ప్రకటన చేయాలని జీ7 దేశాలు ఒత్తిడి చేస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది. డిజిటల్ మౌలిక వసతులు, వాతావరణ సంబంధ నిధులు, సుస్థిరాభివృద్ధి, శుద్ధ ఇంథనం వంటి అంశాల్లో జీ20 వేదికగా సానుకూల నిర్ణయాలు వెలువడతాయని అంతర్జాతీయ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీన కూటమి సారథ్య బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్న భారత్ అప్పట్నుంచీ దేశవ్యాప్తంగా భిన్న నగరాలు, వేదికలపై 200 సమావేశాలను నిర్వహించింది. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల జనసంఖ్య జీ20 దేశాల్లోనే ఉంది. అందుకే ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు పెను ప్రభావం చూపిస్తాయి. సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం జీ20 శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తదితరులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. సంప్రదాయ నృత్యాల నడుమ వీరికి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జియెవా విమానాశ్రయంలో డ్యాన్స్ చేశారు. భారతీయ సంస్కృతిపై క్రిస్టలినా చూపిన మక్కువను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రశంసించారు. వచ్చే రెండు రోజుల్లో వివిధ దేశాల నేతలతో ఫలప్రదమైన చర్చలు జరిపేందుకు ఆసక్తితో ఉన్నట్లు ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం భారత్కు వచ్చారు. ఆయన సతీమణి జిల్ బైడెన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బైడెన్కు చేసిన రెండు పరీక్షల్లోనూ నెగెటివ్గా రావడం పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజే, దర్శనా జర్దోష్ స్వాగతం పలికారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే, అర్జెంటినా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్కు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్వాగతం పలికారు. కొమరోస్ అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్ చైర్ పర్సన్ కూడా అయిన అజలి అస్సౌమనీ, రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్, ఒమన్ డిప్యూటీ ప్రధాని సయ్యిద్ ఫహద్, ఈజిప్టు అధ్యక్షుడు ఫతా ఎల్–సిసి, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్, యూఏఈ ప్రెసిడెంట్ అల్ నహ్యాన్లకు కూడా ఘన స్వాగతం లభించింది. ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్కు అధికారులు స్వాగతం పలికారు. జీ20(గ్రూఫ్ ఆఫ్ 20)లో అర్జెంటినా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)సభ్యులన్న విషయం తెలిసిందే. బ్రిటిష్ కౌన్సిల్ విద్యార్థులతో సునాక్ ముఖాముఖి శుక్రవారం యూకే ప్రధాని రిషి సునాక్ ఢిల్లీలోని బ్రిటిష్ కౌన్సిల్కు వెళ్లి సిబ్బంది, విద్యార్థులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. -
భారత్ అల్లునిగా.. జీ20 పర్యటన చాలా ప్రత్యేకం: రిషి సునాక్
ఢిల్లీ: జీ-20కి వేదికగా నిలిచిన భారత్కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చేరుకున్నారు. రిషి సునాక్ తన భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీలోని విమానాశ్రయంలో దిగారు. కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే ఆయనకు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనను రిషి సునాక్ ప్రశంసించారు. భారత్లో జరుగుతున్న జీ20 సమావేశాలకు బ్రిటన్లో బయలుదేరే ముందు రిషి సునాక్ మీడియాతో మాట్లాడారు. భారత్ తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. తనను భారతదేశ అల్లునిగా వ్యవహరించడాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. తనపై ప్రేమతో భారతీయులు అలా పిలుస్తారని అన్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా చర్చలు జరుపనున్నట్లు చెప్పారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు స్పష్టం చేశారు. జీ-20 సమావేశానికి ప్రపంచ అగ్రదేశాదినేతలు హాజరవుతున్నారు. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి జపాన్ ప్రధాని పుమియో కిషిదా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇదీ చదవండి: భారత్ను ఇలా చూడడం గర్వంగా ఉంది: రిషి సునాక్ -
భారత్ను ఇలా చూడడం గర్వంగా ఉంది: రిషి సునాక్
ఢిల్లీ: ఇండియాకు రావడం చాలా సంతోషంగా ఉందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. మోదీ అంటే తనకు ప్రత్యేక అభిమానం అని అన్నారు. వసుధైక కుటుంబం అనే గొప్ప థీమ్తో జీ20 సమావేశం జరుగుతున్నందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. జీ20 నిర్వహణకు భారత్ సరైన వేదిక అని రిషి సునాక్ తెలిపారు. భారత్-బ్రిటన్ మధ్య ప్రత్యేకమైన వాణిజ్య ఒప్పందానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. జీ20 కార్యక్రమాన్ని భారత్ దిగ్విజయంగా నిర్వహిస్తున్నందున గర్వంగా ఉందని అన్నారు. #WATCH | G 20 in India | On G20 India's theme 'Vasudhaiva Kutumbakam', UK PM Rishi Sunak says, "I think it is a great theme. When you say 'One Family', I am an example of the incredible living bridge that PM Modi described between the UK and India - almost 2 million like me in… pic.twitter.com/ALtze1jpPt — ANI (@ANI) September 8, 2023 జీ20 థీమ్ వసుధైక కుటుంబంపై హర్షం వ్యక్తం చేశారు రిషి సునాక్. ఒకే కుటుంబం థీమ్.. భారత్-యూకే మధ్య స్నేహసంబంధాలకు సరిగ్గా సరిపోతుందని చెప్పారు. ఖలిస్థానీ వివాదంపై మాట్లాడిన రిషి సునాక్.. యూకేలో ఇలాంటి శక్తులకు స్థానం లేదని చెప్పారు. #WATCH | G-20 in India | On the Khalistan issue, United Kingdom Prime Minister Rishi Sunak to ANI says, "It's a really important question and let me just say unequivocally that no form of extremism or violence like that is acceptable in the UK. And that's why we are working very… pic.twitter.com/443p1vz1pS — ANI (@ANI) September 8, 2023 భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపిన రిషి సునాక్.. తన కుటుంబం ఇక్కడి నుంచే ప్రారంభం అయిందని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించనని అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ తీరుపై ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇండియా శాంతివైపే ఉంటుందని అన్నారు. #WATCH | G 20 in India | On G20 India's theme 'Vasudhaiva Kutumbakam', UK PM Rishi Sunak says, "I think it is a great theme. When you say 'One Family', I am an example of the incredible living bridge that PM Modi described between the UK and India - almost 2 million like me in… pic.twitter.com/ALtze1jpPt — ANI (@ANI) September 8, 2023 ఇదీ చదవండి: ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్ చీఫ్.. ఫోక్ సాంగ్కు డ్యాన్సులు.. -
యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి భారత్కు రిషి
-
G20 Summit: అతిథులొస్తున్నారు...
ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నారు. ఏయే దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు శుక్రవారం ఏ సమయానికి విచ్చేస్తున్నారో ఓసారి చూద్దామా! ► రేపు ఢిల్లీలో ప్రారంభంకానున్న జీ–20 శిఖరాగ్ర సదస్సు బ్రిటన్ :: రిషి సునాక్ జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని అయిన సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్ శ్లాఘించారు. జపాన్ :: ఫుమియో కిషిదా సునాక్ విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే పాలెం విమానాశ్రయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా విమా నం ల్యాండ్ కానుంది. మధ్యా హ్నం 2.15 గంటలకు ఆయన భారత గడ్డపై అడుగుపెడతారు. ఈయనను సైతం కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి రిసీవ్ చేసుకోనున్నారు. కిషిదా భారత్కు రావడం ఇది రెండోసారి. ఇటీవల మార్చి నెలలో భారత్లో రెండు రోజులపాటు పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా :: జో బైడెన్ అగ్రరాజ్యాధినేత జో బైడెన్ రాకపైనే అందరి కళ్లు. ఈయన సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ బైడెన్కు సాదర ఆహ్వానం పలుకుతారు. బైడెన్ సతీమణి జిల్కు కరోనా పాజిటివ్ రావడంతో బైడెన్ జీ20 సదస్సుకు వస్తారో రారో అనే సందిగ్ధత నెలకొంది. బైడెన్కు చేసిన కరోనా టెస్ట్లో నెగటివ్ ఫలితం రావడంతో ఆయన పర్యటన ఖాయమైంది. అయినా సరే సదస్సు సందర్భంగా ఆయన మాస్క్ ధరించే పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. కెనడా :: జస్టిన్ ట్రూడో అమెరికా తర్వాత ఆ దేశానికి ఉత్తరవైపు పొరుగు దేశం కెనడా తరఫున ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారత్లో అడుగుపెడతారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాలెం ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జస్టిన్కు సాదర స్వాగతం పలుకుతారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు చిరునామాగా నిలిచిన కెనడాలో ఇటీవల వేర్పాటువాద సంస్థలు రెచ్చిపోయాయి. భారత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ కెనడా–భారత్ సత్సంబంధాలను క్షీణింపజేశాయి. ప్రతిపాదిత వాణిజ్య ఒడంబడికను కెనడా అర్ధంతరంగా ఆపేసింది. ఈ తరుణంలో జీ20 వేదికగా కెనడా అగ్రనేత భారత్లో పర్యటించడం ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. చైనా :: లీ కియాంగ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వాస్తవానికి ఈ సదస్సులో పాల్గొనాలి. కానీ ఈసారి ఆయన బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ వస్తున్నారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ‘జిన్పింగ్ గైర్హాజరు ఊహించిందే. ఇది జీ20 కూటమి పరస్పర ఉమ్మడి నిర్ణయాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావంచూపబోదు’అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కుండబద్దలు కొట్టారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అకాŠస్య్ చిన్ ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ తమ కొత్త భౌగోళిక పటాన్ని చైనా విడుదలచేయడంతో డ్రాగన్ మీద భారత్ ఆగ్రహంగా ఉంది. జర్మనీ, ఫ్రాన్స్ల నేతలూ.. యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ రాత్రి ఏడున్నరకు ఢిల్లీలో దిగుతారు. యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ సైతం జీ20 సదస్సుకు వస్తున్నారు. సింగపూర్ ప్రధాని లూంగ్ లీని కేంద్ర సహాయ మంత్రి మురుగన్ రిసీవ్ చేసుకుంటారు. జర్మనీ చాన్స్లర్ స్కోల్జ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నారు. ఈయనను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ రిసీవ్ చేసుకోనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ శనివారం మధ్యాహ్నం 12.35 నిమిషాలకు వస్తారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మహిళా మంత్రి అనుప్రియా సింగ్ పాటిల్ మేక్రాన్కు స్వాగతం పలుకుతారు. క్యూ కట్టనున్న నేతలు సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకుంటారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ ఇయోల్ యూన్ సాయంత్రం 5.10కి వస్తున్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసీ, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చేరుకుంటారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో రాత్రి సమయంలో రానున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పదిగంటలకు చేరుకుంటారు. స్పెయిన్ అధ్యక్షుడు పెట్రో పెరిజ్ రాత్రి 10.15కు చేరుకుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు..
ఢిల్లీ: జీ20 సమావేశానికి హాజరుకావడానికి అగ్ర దేశాల నేతలు రేపు ఢిల్లీకి చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తదితరులకు రెండు రోజుల పాటు దేశ రాజధానిలో అతిథ్యం ఇవ్వనున్నారు. భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే జీ20 కార్యక్రమంలో ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చిస్తారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కానున్న విషయం తెలిసిందే. రిషి సునాక్.. బ్రిటన్కు చెందిన తొలి భారత సంతతి ప్రధానమంత్రి రిషి సునక్ సెప్టెంబర్ 8న శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆయనకు స్వాగతం పలుకుతారు. ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్లో రిషి సునాక్కు బస ఏర్పాట్లు చేశారు. జో బైడెన్.. శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ చేరుకుంటారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి VK సింగ్ స్వాగతం పలుకుతారు. జో బైడెన్కు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బస ఏర్పాట్లు చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన జీ20 సమావేశాలకు హాజరవుతారా..? లేదా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. కానీ బైడెన్కు కరోనా నెగటివ్ రావడంతో ఆయన భారత్కు రానున్నారు. జస్టిన్ ట్రూడో.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రేపు సాయంత్రం 7 గంటలకు భారత్కు చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆయనకు ఆహ్వానం పలుకుతారు. ట్రూడో ఢిల్లీలోని లలిత్ హోటల్లో బస చేస్తారు. కెనడాలో ఈ మధ్య ఖలిస్థానీ ఉగ్రవాదం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన భారత్కు రావడం ప్రధాన్యత సంతరించుకుంది. జపాన్ ప్రధాని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా రేపు భారత్కు వస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు పాలం ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగుతారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆహ్వానం పలుకుతారు. కిషిదా భారత్కు రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో భారత్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన.. ప్రధాని మోదీతో సమావేశమై భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇదీ చదవండి: Sanathana Dharma Row: అందుకే దేవాలయానికి వెళ్లలేదు.. సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. -
భారత మూలాలు... నాకెంతో గర్వకారణం...!
న్యూఢిల్లీ: ఆయన రిషి సునాక్. బ్రిటన్ ప్రధాని. ఆ పీఠమెక్కిన తొలి భారత మూలాలున్న నేత. అత్తామామలు ఇన్ఫోసిస్ వంటి దిగ్గజం ఐటీ కంపెనీ వ్యవస్థాపకులు. అంతా కలిస్తే భోజనాల బల్ల దగ్గర వాళ్ల మధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయి? రాజకీయాలా? అస్సలు కాదట. కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారట. చివరికి రిషి ఇద్దరు కూతుళ్లు కూడా క్రికెట్ అంటే ప్రాణం పెడతారట. ఎంతగా అంటే, సర్వ కాల సర్వావస్థల్లోనూ భారత జట్టునే సమరి్థంచేటంతగా. అయితే, ఫుట్బాల్లో మాత్రం ఇంగ్లాండ్ జట్టును సమరి్థంచాలన్నదే వారికి ఆయన విధించే ఏకైక షరతు! సునాక్ తల్లిదండ్రులు ఇద్దరూ భారత మూకాలున్న వారే. తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్ వెళ్లారు. ఇక ఆయన భార్య అక్షతా మూర్తి నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల ఏకైక సంతానం. జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్న నేపథ్యంలో బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇచి్చన ఇ– మెయిల్ ఇంటర్వ్యూలో రిషి పలు అంశాలు పంచుకున్నారు. సరదా సంగతుల నుంచి భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక బంధం దాకా అన్ని అంశాలనూ స్పృశించారు. భారత మూలాలు తనకెంతో గర్వకారణమని పునరుద్ఘాటించారు రిషి. బ్రిటన్ ప్రధానిగా తాను బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయుల నుంచి వ్యక్తమైన హర్షాతిరేకాలు చెప్పలేని అనుభూతి ఇచ్చాయని గుర్తు చేసుకున్నారు. అత్తామామలతో ముచ్చటించేటప్పుడు భారత రాజకీయాలు, టెక్నాలజీ, ప్రధానిగా బ్రిటన్ను నడిపించడంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యల వంటివి ఎంతమాత్రమూ ప్రస్తావనకు రావని ఒక ప్రశ్నకు బదులుగా రిషి చెప్పారు. ‘ రాజకీయాలను, కుటుంబాన్ని విడిగా ఉంచడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మోదీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నా... ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు రిషి చెప్పారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక కృషి పాత్రపై లోతుగా చర్చిస్తామన్నారు. గత ఏడాది కాలంలో భారత్లో పర్యటించిన తన మంత్రివర్గ సహచరులు రెట్టించిన ఉత్సాహంతో తిరిగొచ్చారని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్–ఇంగ్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు మరి కాస్త సమయం పడుతుందని రిషి అభిప్రాయపడ్డారు. కానీ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేయడమే లక్ష్యంగా అధునాతన ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వెలిబుచ్చారు. ‘బ్రిటన్ వాణిజ్య మార్కెట్లో 4.8 కోట్లకు పైగా భారతీయ చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలున్నాయి. భారత ఎగుమతిదారులకు వాటితో యాక్సెస్ కల్పించేలా ఒప్పందం ఉండాలి. వార్షిక ద్వైపాక్షిక వర్తకం ఇప్పటికే రూ.3.5 లక్షల కోట్లు దాటేసింది‘ అని అన్నారు. ఇంగ్లాండ్లో 16 లక్షలకు పైగా భారతీయులున్నారు. భారత్ కు జీ 20 సారథ్యం... జీ 20 సారథ్యానికి భారత్ సరైన దేశమని రిషి అన్నారు. అపార వైవిధ్యానికి నెలవు భారత్. కొన్నేళ్లుగా అన్ని రంగాల్లోనూ అసాధారణ విజయాలు సాధిస్తూ ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోంది. అలాంటి దేశం జీ 20 సదస్సుకు సారథ్యం వహిస్తుండటం సరైన సమయంలో జరుగుతున్న చక్కని ఘటన‘ అని అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిజంగా సెల్యూట్ చేస్తున్నా. ప్రపంచ సారథిగా భారత్ పోషిస్తున్న కీలక పాత్ర నిజంగా శ్లాఘనీయం‘ అన్నారు. ► బ్రిటన్ ప్రధాని కాగానే నేను చేసిన మొదటి పని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్లో దీపావళి విందు ఇవ్వడమే. భవనమంతా విద్యుద్దీపాలు, పూలతో మెరిసిపోతుంటే చూసి చెప్పలేనంత భావోద్వేగానికి లోనయ్యా. ఒక భారతీయునిగా నాకెంతో గర్వకారణమైన విషయమది. ► నా గాథ నిజానికి లోతైన భారత మూలాలున్న ఎంతోమంది బ్రిటన్ వాసుల కథే. ఈ భిన్నత్వంలో ఏకత్వం బ్రిటన్ బలం. ► నేను పాటించే విలువలకు నా భార్య, ఇద్దరు కూతుళ్లు, తల్లిదండ్రులు, అత్తామామలు దారి చూపే దీపాలుగా నిలుస్తారు. ముఖ్యంగా అత్తామామల ఘనతలు చూసి నేనెంతో గరి్వస్తాను. ఏమీ లేని స్థితి నుంచి మొదలై ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీని స్థాపించే దాకా వాళ్ల ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. భారత్, ఇంగ్లాండ్ల్లో వేలాది మందికి అది ఉపాధి కలి్పస్తోంది. ప్రతి పౌరుడూ అలాంటి విజయాన్ని సాధించేందుకు వీలు కలి్పంచేలా బ్రిటన్ను తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం. ► జీ 20 సదస్సు కోసం భార్య అక్షతతో కలిసి భారత్ లో పర్యటించనుండటం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నా. బిజీ బిజీగా గడిపేలా ఇప్పటికే మొత్తం ప్లానింగ్ చేసుకున్నాం. భారత్లో మేం గతంలో వెళ్లాలని అనుకున్న పలు ప్రాంతాలకు వెళ్తాం. -
రిషి కేబినెట్లోకి మరో భారత సంతతి మహిళ
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కొత్తగాకేబినెట్లోకి క్లెయిర్ కౌటిన్హో(32) అనే భారత సంతతి మహిళా సభ్యురాలిని చేర్చు కున్నారు. ఇంధన భద్రత మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మెన్తోపాటు క్లెయిర్ పూర్వీకులు కూడా గోవాకు చెందిన వారే. రక్షణ మంత్రి బెన్ వాలెస్ రాజీనామాతో ఆ బాధ్యతలను ఇంధన మంత్రి గ్రాంట్ షాప్స్కి అప్పగించారు. షాప్స్ నిర్వహించిన శాఖను క్లెయిర్కు ఇచ్చారు. ఈస్ట్ సర్రే నుంచి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. -
రిషి సునాక్పై తీవ్ర విమర్శలు చేసిన బ్రిటన్ ఎంపీ
లండన్: బ్రిటిష్ మాజీ కల్చర్ సెక్రెటరీ నాడైన్ డోరీస్ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలో ప్రధాని రిషి సునాక్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బోరిస్ జాన్సన్ ఎంపీగా రాజీనామా చేసినప్పుడే ఆమె కూడా రాజీనామా చేయాల్సి ఉంది కానీ అప్పుడు ఆమె రాజీనామా చేయనందుకు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు రాజీనామా చేసిన ఆమె రిషి సునాక్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ భారీ లేఖను రాశారు. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్కు అత్యంత సన్నిహితురాలైన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ నాడైన్ డోరీస్ చాలా కాలంగా రిషి సునాక్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ప్రధాని జాంబీల ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయనకు ఎటువంటి రాజకీయ ముందుచూపు లేదన్నారు. రిషి సునాక్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఆర్ధిక పరమైన కుంభకోణాలతో పాటు మరికొన్ని కుంభకోణాల కారణంగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవి నుండి తప్పుకున్నారు. మాజీ ఆర్ధిక మంత్రి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన రిషి సునాక్ పార్టీ నాయకత్వ పోటీలో నామినేట్ చేయబడిన ఏకైక అభ్యర్థి కావడంతో ప్రధానిగా నియమితులయ్యారు. ఎంపీ రాసిన రాజీనామా లేఖ సంగతి అటుంచితే రిషి సునాక్ ప్రభుత్వం ప్రస్తుతానికైతే వెంటిలేటర్పైనే ఉండాలి చెప్పాలి. కొద్దీ రోజుల క్రితం ఖాళీ అయిన పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ రెండు స్థానాలను కోల్పోగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన చోట మాత్రం గెలిచింది. ప్రధాని రిషి సునక్ తన సాంకేతిక నాయకత్వాన్ని ఉపయోగించుకుని పార్టీ విశ్వసనీయతను కాపాడుకంటూ వస్తున్నారు. కానీ అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక స్తబ్దత, పారిశ్రామిక అస్థిరత ప్రభుత్వ ఆరోగ్య సేవల్లో జాప్యం వంటి కారణాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఈ కారణాల వల్లనే వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ప్రత్యర్థి లేబర్ పార్టీ కంటే చాలా వెనుకబడి ఉన్నారని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. -
ప్రధానిగా కాదు ఒక హిందువుగా వచ్చాను: రిషి సునాక్
లండన్: భారత్ దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాణ్ని పురస్కరించుకుని వేడుకల్లో మునిగిన వేళ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన రామకథా కార్యక్రమానికి హాజరైన బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ నేను ప్రధానిగా కాకుండా ఒక హిందువుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యానని చెప్పారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ మొరారి బాపు మాట్లాడుతూ.. ఒక సాధారణ వ్యక్తిలా రిషి గారు ఇక్కడికి వచ్చారు. మీకు నా ప్రేమ పూర్వక స్వాగతం. దేవుడి ఆశీస్సులు మీపైనా బ్రిటీష్ ప్రజలపైనా మెండుగా ఉంటాయని ఆశీర్వదిస్తూ ప్రధానికి ఆహ్వానం పలికారు. ఈ సందర్బంగా ప్రధాని రిషి సునాక్ మాట్లాడుతూ.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరుగుతున్న మొరారి బాపు రామ కథా కార్యక్రమానికి హాజరుకావడం గౌరవం గానూ సంతోషంగానూ భావిస్తున్నానని, ఈరోజు ఇక్కడికి ప్రధానిగా కాకుండా ఒక హిందువుగా వచ్చినట్లు తెలిపారు. మత విశ్వాసమనేది వ్యక్తిగతమైనది. నా జీవితంలో ఆ విశ్వాసమే నాకు తోడుండి నడిపిస్తోంది. ఒక ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడం ఏమంత సులువు కాదు. నిర్ణయాలు తీసుకోవడంలోనే కాదు కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడంలోనూ ఆ నమ్మకమే నాకు శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తోందని అన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దేవుడు నాకు నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటారు. ఈ సందర్బంగా రిషి సునాక్ సౌతాంఫ్టన్ లో తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబంతో కలిసి అక్కడ దగ్గర్లో ఉన్న గుడికి వెళ్తూ ఉండేవాళ్లమని అన్నారు. తాము కూడా సాంప్రదాయ హిందూ కుటుంబం లాగే హోమయజ్ఞాది పూజలను నిర్వహించేవారమని తెలిపారు. మా సోదరులు, సోదరీమణులతో కలిసి అన్న ప్రసాదాలను కూడా వడ్డించేవాడినని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆధ్యాత్మిక గురువు బాపు జీవితం విలువలతో కూడుకున్నదని ఆయన భక్తి, నిస్వార్ధమైన సేవాతత్వ దృక్పధం అందరికీ మార్గదర్శకమని అన్నారు. బాపు గారు చెప్పిన రామాయణం, భగవద్గీత, హనుమాన్ చాలీసా స్మరించుకుంటూ వెళ్తున్నానని జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి వినయపూర్వక పరిపాలనతో నిస్వార్దమైన సేవలందించడంలో శ్రీరామచంద్రుడే నాకు స్ఫూర్తి అని సునాక్ చెప్పారు. ఇది కూడా చదవండి: రష్యాలో భారీ పేలుడు.. 35 మంది మృతి -
సునాక్ ఇంటిపై నల్లవస్త్రం
లండన్: బ్రిటన్ ప్రధాని ఇంటిపై నల్లటి వ్రస్తాన్ని కప్పిన నలుగురు పర్యావరణ కార్యకర్తలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉత్తర ఇంగ్లాండ్లో నార్త్ యార్క్షైర్ ప్రాంతంలోని రిచ్మండ్లో ఉన్న రిషి సునాక్ ఇంటిపై వారు నల్లటి వస్త్రం కప్పి తమ నిరసనను తెలియజేశారు. వీరు ‘గ్రీన్పీస్’ అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. సముద్రంలో చమురు, గ్యాస్ వెలికితీతను మరింత విస్తరిస్తూ సునాక్ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా నిరసన వ్యక్తం చేశారు. సునాక్ ఇంటిపైకి ఎక్కి 200 చదరపు మీటర్ల నల్ల వస్త్రాన్ని కప్పారు. అలాగే సునాక్ ఇంటి ముందు మరో ఇద్దరు కార్యకర్తలు ‘చమురు లాభాలు ముఖ్యమా? లేక మా భవిష్యత్తు ముఖ్యమా?’ అని ప్రశ్నిస్తూ బ్యానర్ను ప్రదర్శించారు. ఈ సమయంలో సునాక్ కుటుంబసభ్యులెవరూ ఆ ఇంట్లో లేరు. -
అక్షతామూర్తి ధరించే చెప్పుల ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తి విభిన్నమైన దుస్తులతో ఫ్యాషన్కే ఐకాన్గా ఉంటుంది. ఆమెకూడా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో ఆమె ధరించే దుస్తులు దగ్గర నుంచి చెప్పులు వరకు బ్రిటన్ అంతటా ఓ హాట్టాపిక్ ఉంటుంది. బ్రిటన్లో మంచి ఫ్యాషన్ డిజైనర్వేర్లతో ఆకట్టుకునే ప్రుమఖ వ్యక్తుల్లో అక్షతామూర్తి కూడా ఒకరు. యూకేలో మంచి ఫ్యాషన్ బ్రాండ్ దుస్తులతో ఓ ట్రెండ్ సృష్టించిన వ్యక్తిగా అక్షతామూర్తినే ముందుంటారు. యూకేలో మంచి ఫ్యాషన్ ఫాలో అయ్యే ప్రముఖ బాలీవుడ్ హిరోల సరసన ఆమె కూడా ఉండటం విశేషం. ఆమె చెప్పులకు పెట్టే ఖర్చే వేలల్లో ఉంటుందని సమాచారం. ఈవిషయమై ఆమె వార్తల్లో కూడా నిలిచారు. ఈ విషయాన్ని యూకేలోని ప్రఖ్యాతి గాంచిన టాట్లర్ మ్యాగ్జైన్ ఓ కథనంలో పేర్కొంది. ఆమె కేవలం స్కూల్ రన్ కోసం దాదాపు రూ. 60 వేలు ఖరీదు చేసే చెప్పులను ధరించినట్లు వెల్లడించింది. ఆమె బ్రిటన్లో వాడే పిల్బాక్స్ టోపీలు, లేయర్డ్ ముత్యాలు ధరించకుండా చాల సింపుల్ సిటీతో ఉన్నట్లు కనిపించినప్పటకీ..ఆమె మంచి లగ్జరీతో కూడిన ష్యాషన్ని ఫాలో అవుతుంది. ఆమె ధరించే స్కర్ట్ ధర సైతం రూ. లక్ష రూపాయాల పైనే ఉంటుంది. పెద్ద హడావిడి ఆర్భాటంగా ఉండదు. పైకి ఏదో ఓ సాధారణ స్తీలా ఆమె ఆహార్యం ఉంటుంది . బహుశా దీనినే 'స్టెల్త్ హెల్త్' అంటారు కాబోలు. ఇదిలా ఉండగా ఇలా బ్రిటన్ ప్రధాని రుషి సునాక్, ఆమె భార్య ధరించే ఫ్యాషన్ డిజైనర్ వేర్ రేంజ్ విషయమై తరుచుగా విమర్శపాలయ్యారు. బ్రిటన్ ప్రధాని సునాక్ ప్రచారానికి వెళ్లేటప్పుడూ ధరించే సూట్(కోటు) ధరే రూ. 3 కోట్లుపైనే ఉందని, అతడి ధరించే షూ ధర సైతం రూ. 51 వేలు వరకు ఉంటుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే అక్షత మూర్తి బీరువా ర్యాకులన్నీ ఖరీదైన బ్రాండ్లతో ఓ మాల్ని తలిపిస్తుందని బ్రిటన్ వాసులు చర్చించుకోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Akshata Murty (@akshatamurty_official) (చదవండి: ఆ గోల్డ్కి పెరుగుతున్న క్రేజ్..రోజుకో నగతో మహిళామణులు ధగ ధగ మెరుస్తున్నారు!) -
ఖలిస్థానీల ముసుగులో అక్రమ వలసలు..
లండన్: భారత అక్రమ వలసదారులకు ఇంగ్లాండ్లో ఎలాగోలా ఆశ్రయం కల్పించేందుకు బ్రిటీష్ లాయర్లలో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. వీరంతా మాఫియాలా ఏర్పడి బాధితుల నుండి నగదు వసూలు చేసి బదులుగా ఖలిస్తానీలుగానూ, స్వలింగ సంపర్కులగానూ చెప్పి భారత్లో తమ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు కోర్టుకు చెప్పమని చెబుతున్నట్టు ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ఓ స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటన్ ప్రధాని తీవ్రస్థాయిలో స్పందించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత్ నుంచి ఇంగ్లాండ్ వలసవచ్చే వారిలో ఎవరైనా సరైన డాక్యుమెంట్లు లేకుండా అక్కడ అడుగుపెట్టారా.. వారు అక్కడి లాయర్ల చేతికి చిక్కినట్లే. పడవల్లో వలస వచ్చే భారతీయులే ఈ లాయర్ల ప్రధాన లక్ష్యం. వీరికి ఇంగ్లాండ్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మతాంతర వివాహం చేసుకున్నామని, స్వలింగ సంపర్కులమని, ఖలిస్తానీ మద్దతుదారులమని చెప్పమంటున్నారు. మీరు కోర్టుకి ఈ మాట చెబితే చాలు మీ ప్రాణానికి భారత్లో ప్రాణహాని ఉందని కోర్టుని నమ్మిస్తానని దీనికోసం 5500 యూరో పౌండ్లను సిద్ధం చేసుకోవాలని ఒక రిపోర్టర్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో లాయర్ చెబుతుండగా వీడియో తీశారు. ఈ వీడియో ప్రధాని రిషి సునాక్ కు చేరడంతో ఆయన ఈ వ్యవహారంపై చాలా సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యకలాపాలకు మేమెప్పుడూ వ్యతిరేకమే. ప్రతిపక్ష లేబర్ పార్టీవారు, కొంతమంది లాయర్లు, క్రిమినల్ గ్యాంగులు వారి జేబులు నింపుకోవడం కోసం అక్రమ వలసదారులకు చట్టవ్యతిరేక మార్గంలో సహాయపడుతున్నారు. దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసనీ అన్నారు. This is what we’re up against. The Labour Party, a subset of lawyers, criminal gangs - they're all on the same side, propping up a system of exploitation that profits from getting people to the UK illegally. I have a plan to stop it. Here’s how 🧵https://t.co/ez3rYIU0uQ — Rishi Sunak (@RishiSunak) July 25, 2023 ఇది కూడా చదవండి: ఏకాంతంగా బ్రతకాలనుకున్నారు.. చివరికి... -
రిషి సునాక్ ప్రభుత్వానికి షాక్.. ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ..
లండన్: బ్రిటన్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ త్రుటిలో చావు దెబ్బ తప్పించుకుంది. మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క సీటు గెలుచుకుని మిగిలిన రెండు చోట్ల ఓటమిపాలైంది. అసలే సార్వత్రిక ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు చాలా కీలకంగా నిలిచాయి. మొత్తం మూడు స్థానాలకుగాను జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానాన్ని మాత్రం స్వల్ప మెజారిటీతో తిరిగి దక్కించుకుంది. ఒకవేళ ఆ స్థానాన్ని కూడా కోల్పోయి ఉంటే ఒకే రోజు మూడు సీట్లు కోల్పోయిన ప్రధానిగా రిషి సునాక్ చరిత్రలో నిలిచిపోయేవారు. అదృష్టవశాత్తు ఉక్స్ రిడ్జ్, సౌత్ రూస్లిప్ పరిధిలోని వెస్ట్ లండన్ లో గెలిచి ఆయన ఈ ఘోర అవమానం నుండి తప్పించుకున్నారు. మిగిలిన రెండు స్థానాల్లో సోమర్టన్, ఫ్రోమ్ సీట్ లో 19 వేలు, సెల్బీ.ఎయిన్స్టీ నియోజకవర్గంలో 20 వేలు మెజార్టీతో లేబర్ పార్టీ చేతిలో ఓడిపోయింది కన్జర్వేటివ్ పార్టీ. సెల్బీ, ఎయిన్స్టీలో గెలిచిన అభ్యర్థి కెయిర్ మాథెర్(25) మాట్లాడుతూ.. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి ఇక్కడివారు అసంతృప్తితో ఇచ్చిన తీర్పు ఇదని అన్నారు. సోమర్టన్, ఫ్రోమ్ లో గెలిచిన లేబర్ పార్టీ అభ్యర్థి సారా డైక్ మాట్లాడుతూ.. ఇది చారిత్రిక విజయం. ఈ ప్రభుత్వం చేతకానితనంతో సర్కస్ చేస్తోందని ప్రజలకు అర్ధమైపోయిందన్నారు. అసలే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికల ఫలితాలు రిషి సునాక్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ గా మారాయి. గతేడాది మార్చ్ నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలను లేబర్ పార్టీ గెలుచుకోవడం ఆందోళనకరమని చెబుతున్నాయి కన్జర్వేటివ్ పార్టీ వర్గాలు. గడిచిన 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వడ్డీ రేట్లు పెరగడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందుకే జనం ప్రభుత్వ విధానాలపై కొంత అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు స్థానికులు. ఇది కూడా చదవండి: 40 ఏళ్లుగా ప్రధాని.. మళ్ళీ ఆయనే.. -
తప్పయి పోయింది క్షమించండి.. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్
లండన్: ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్ బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ సైన్యానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన స్వలింగసంపర్కులైన సైనికులకు బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పారు. సైన్యంలోకి వారిని తీసుకోకుండా నిషేధించడం బ్రిటీష్ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యమని అన్నారు. దయచేసి క్షమించండి.. రిషి సునాక్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. 2000 సంవత్సరానికి ముందు వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా స్వలింగ సంపర్కులైన సైనికులపై బ్రిటీష్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషం. స్వలింగ సంపర్కులను సైన్యం నుండి నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి జీవితాల పైనా వారి కుటుంబాలపైనా ఎంతటి తీవ్ర ప్రభావం చూపిందో మేము అర్ధం చేసుకున్నాము. ఆరోజున వివక్షకు గురైన ఆనాటి వీరులందరికీ బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నాను. మీరు కూడా మిగతా సైన్యంలాగే దేశం కోసం చేసిన త్యాగాలను, క్లిష్ట సమయాల్లో చూపిన ఆపార ధైర్య సాహాసాలను తలచుకుని గర్వపడాలన్నారు. ఆయన ఈ ప్రకటన చేయగానే సభ్యులంతా హర్షాతిరేకాలు తెలిపారు. యూకే డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ మాట్లాడుతూ.. 1967-2000 మధ్యలో అనుభవజ్ఞులైన ఎందరో స్వలింగసంపర్కులైన సైనికులు చాలా వివక్షకు గురయ్యారు. సైన్యంలోకి వారిని నిషేధించడంతో వారి జీవితాలు ఛిద్రమయ్యాయి. బ్రిటీష్ సాయుధ దళాల చరిత్రలోనే అదొక అవమానకరమైన సహించరాని పొరపాటని అన్నారు. On a historic day, the Prime Minister @10DowningStreet has apologised on behalf of the British state for the treatment of veterans who were affected by the ban on LGBT personnel before 2000.https://t.co/FHIu0baTEU pic.twitter.com/3a8trpaJgI — Office for Veterans' Affairs (@VeteransGovUK) July 19, 2023 ఇది కూడా చదవండి: ప్రపంచ కప్ టోర్నమెంటుకు ముందు కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి -
బ్రిటన్లో టాటా గిగాఫ్యాక్టరీ!
ముంబై/లండన్: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా బ్రిటన్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీల తయారీ కోసం గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా 4 బిలియన్ పౌండ్లు (సుమారు రూ. 42,500 కోట్లు) వెచి్చంచనున్నట్లు తెలిపింది. తమ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) వాహనాలతో పాటు ఇతరత్రా సంస్థల కోసం కూడా ఇందులో బ్యాటరీలను తయారు చేయనున్నట్లు పేర్కొంది. 2026 నుంచి ఈ గిగాఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలో బ్యాటరీల వాటా దాదాపు సగం పైగా ఉంటుంది. వేల కొద్దీ ఉద్యోగాలకు ఊతం.. గిగాఫ్యాక్టరీపై పెట్టుబడులతో స్థానికంగా 4,000 పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాలు, సరఫరా వ్యవస్థలో పరోక్షంగా వేల మందికి ఉపాధి లభించగలదని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2030 నాటికి తమకు అవసరమయ్యే బ్యాటరీల్లో ఈ ప్లాంటు దాదాపు సగభాగం ఉత్పత్తి చేయగలదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మళ్లాలన్న తమ లక్ష్యం మరింత వేగవంతంగా సాకారం కాగలదని వివరించారు. భారీగా సబ్సిడీలు.. గిగాఫ్యాక్టరీ కోసం బ్రిడ్జ్వాటర్ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు జేఎల్ఆర్ మాతృ సంస్థ టాటా సన్స్ తెలిపింది. 40గిగావాట్అవర్స్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యంతో ఇది యూరప్లోని భారీ గిగాఫ్యాక్టరీల్లో ఒకటిగాను, భారత్కు వెలుపల టాటా గ్రూప్నకు తొలి భారీ గిగాఫ్యాక్టరీగా నిలవనుంది. 1980ల్లో నిస్సాన్ రాక తర్వాత బ్రిటన్ ఆటోమోటివ్ రంగంలో ఇది అత్యంత భారీ పెట్టుబడి కానుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం టాటా గ్రూప్నకు ప్రభుత్వం నుంచి వందల కొద్దీ మిలియన్ పౌండ్ల మేర ప్లాంటుకు సబ్సిడీల హామీ లభించి ఉంటుందని పేర్కొన్నాయి. విద్యుత్, గ్రాంటు, సైటుకు రహదారిని మెరుగుపర్చటం తదితర రూపాల్లో 500 మిలియన్ పౌండ్ల మేర సబ్సిడీలు అందించాలని ప్రభుత్వాన్ని టాటా గ్రూప్ కోరినట్లు సమాచారం. అయితే, ఇటు టాటా గ్రూప్, అటు బ్రిటన్ ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వలేదు. పారదర్శక విధానాల్లో భాగంగా వీటిని తర్వాత ప్రచురించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్లో ప్రస్తుతం ఒక్క బ్యాటరీల తయారీ ప్లాంటు ఉంది. కొత్తగా మరో ఫ్యాక్టరీ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు యూరోపియన్ యూనియన్లో 35 పైచిలుకు ప్లాంట్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇప్పటికే పనిచేస్తుండగా, కొన్ని నిర్మాణంలోనూ, కొన్ని ప్రతిపాదనల దశల్లోనూ ఉన్నాయి. అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు.. ‘బిలియన్ల కొద్దీ పౌండ్ పెట్టుబడులు, అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసే ప్లాంటు.. ఆటోమోటివ్ రంగం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వేగవంతంగా మళ్లేందుకు తోడ్పడగలదు. ఇప్ప టికే బ్రిటన్లో వివిధ రంగాల్లో మా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. బ్రిటన్లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని తెలిపేందుకు తాజా ఇన్వెస్ట్మెంట్ నిదర్శనం‘ అని టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. ‘భారత్కు వెలుపల తమ తొలి భారీ ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పాలని టాటా గ్రూప్ నిర్ణయం తీసుకోవడమనేది బ్రిటన్ కార్ల తయారీ పరిశ్రమ, నిపుణులపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. మా ఆటోమోటివ్ రంగంలో అత్యంత భారీ పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటిగా నిలవనుంది’ – బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ -
అమెరికా అధ్యక్షుడి చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేస్..?
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్లో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వద్ద న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ దర్శనమిచ్చింది. ఆయన ఎక్కడికెళ్తే అక్కడకు ఆయనతో పాటు ఈ బ్లాక్ లెదర్ సూట్ కేసును వెంట తీసుకెళ్లడం రష్యాకు కీడు శంకిస్తోందని చెబుతున్నాయి స్థానిక మీడియా వర్గాలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సమయంలో వైట్ హౌస్ దాటి ఎక్కడికైనా బయటకు వెళ్ళినపుడు ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును అయన తన వెంట తీసుకెళ్లడం చేస్తుంటారు. కానీ లండన్ పర్యటనకు ఈ బ్రీఫ్ కేసును తీసుకెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ అంటే.. అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అణుబాంబుల ప్రయోగానికి ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసు నుంచి ఆదేశించవచ్చు. 20 కిలలో బరువుండే ఈ బ్యాగ్లో న్యూక్లియర్ లాంచ్ కు సంబంధించిన కోడ్ పొందుపరచి ఉంటుంది. దీన్నే అటామిక్ బాంబు గానూ ప్రెసిడెంట్ అత్యవసర హ్యాండ్ బ్యాగ్ గానూ చెబుతూ ఉంటారు. సాయుధ దళానికి చెందిన సైనికుడు అధ్యక్షుడి వెంట దీన్ని తీసుకెళ్తూ ఉంటారు. రష్యా గురించేనా..? రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలోనే జో బైడెన్ ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును తనవెంట తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నాయి మీడియా వర్గాలు. ఉక్రెయిన్ పై రష్యా అణుబాంబులు ప్రయోగానికి సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ కు ఆదేశాలిచ్చేందుకే అమెరికా అధ్యక్షుడు తన చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేసు తీసుకెళ్లారని వారంటున్నారు. నాటో సమావేశానికి ముందు సన్నాహకంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో భేటీ అయిన బైడెన్ ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి ఆయనతో చర్చించినట్టు సమాచారం. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాతే ఉక్రెయిన్ సభ్యత్వం గురించి పరిగణిస్తామని ఇదివరకే చెప్పిన బైడెన్ వారికి అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇది కూడా చదవండి: ఉద్యోగిని వేధించిన కంపెనీ.. నష్టపరిహారం కోట్లలోనే..? -
'అరె శాండ్పేపర్ మరిచిపోయా'.. ఆసీస్ ప్రధానికి రిషి సునాక్ కౌంటర్
ప్రతిష్టాత్మ యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడు టెస్టు మ్యాచ్లు ముగిశాయి. తొలి రెండింటిలో ఆసీస్ విజయం సాధించగా.. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించి రేసులో నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై 19 నుంచి 23 వరకు జరగనుంది. ఈ విషయం పక్కనబెడితే లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంతి డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజు దాటడంతో ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ వికెట్లకు గిరాటేశాడు. నిబంధనల ప్రకారం థర్డ్ అంపైర్ బెయిర్ స్టో ఔట్ అని ప్రకటించాడు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఆస్ట్రేలియా ప్రవర్తించిందంటూ అభిమానులు సహా ఇంగ్లీష్ మీడియా తమ కథనాల్లో హోరెత్తించింది. విమర్శల స్థాయి ఎలా ఉందంటే అది మూడో టెస్టుకు కూడా పాకింది. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అలెక్స్ కేరీ కనిపించిన ప్రతీసారి ఇంగ్లీష్ అభిమానులు అతన్ని టార్గెట్ చేశారు. ఇక బెయిర్ స్టో ఔట్ వివాదంపై రెండు దేశాల ప్రధానులు కూడా జోక్యం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమంటే.. ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ రిషి సునాక్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అయితే క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ అని.. ఇక్కడితో ఈ వివాదానికి స్వస్తి పలకాలని ఇరు దేశాల ప్రధానులు అభిమానులను కోరారు. తాజాగా ఇరుదేశాల ప్రధానులు మరోసారి సమావేశమయ్యారు. అయితే ఈసారి దేశాల మధ్య అనుబంధం మరింత పెంపొందించేందుకు సమ్మిళిత అభివృద్ధి సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ చాలెంజెస్, యూకే-ఆస్ట్రేలియా మధ్య వ్యాపార రంగానికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నారు. వీటిలోనే యాషెస్ సిరీస్ ప్రస్తావన కూడా వచ్చినట్లు ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ ట్విటర్ వేదికగా తెలిపారు. ఆసీస్ ప్రధాని ఆంథోని షేర్ చేసిన వీడియోలో.. యాషెస్పై ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మొదట అల్బనీస్ యాషెస్లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉన్నట్లు ఒక పేపర్పై చూపించారు. ఆ తర్వాత రిషి సునాక్ లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించిన పేపర్ కట్ను చూపించారు. ఇక ఆసీస్ ప్రధాని ఈసారి లార్డ్స్ టెస్టులో బెయిర్ స్టో ఔటైన విధానంకు సంబంధించిన పేపర్ క్లిప్ను చూపించగా.. రిషి సునాక్.. ''సారీ తాను శాండ్పేపర్(Sandpaper-Ball Tampering) గేట్ ఉదంతం పేపర్ క్లిప్పింగ్ను మరిచిపోయాను'' అంటూ పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శాండ్పేపర్ వివాదమేంటి? రిషి సునాక్ ప్రస్తావించిన శాండ్ పేపర్ వివాదం 2018లో జరిగింది. ఐదేళ్ల క్రితం సౌతాఫ్రికాతో టెస్టు సందర్భంగా ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్క్రాఫ్ట్ శాండ్పేపర్ ముక్కతో బంతిని రుద్దడం అప్పట్లో వైరల్గా మారింది. ఇలా చేయడం వల్ల బంతి స్వింగ్కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ శాండ్పేపర్ ఉదంతం వెనుక అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లది కీలకపాత్ర అని తేలడంతో ఏడాది నిషేధం పడింది. బెన్క్రాఫ్ట్ తొమ్మిది నెలలు నిషేధానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ తన తప్పును క్షమించమంటూ కెమెరా ముందు బోరున ఏడ్వడం ఎప్పటికి మరిచిపోలేం. ఈ ఉదంతం అనంతరం స్మిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే ఏడాది తర్వాత స్మిత్, వార్నర్లు మళ్లీ జట్టులోకి రాగా.. బెన్క్రాఫ్ట్ మాత్రం మళ్లీ అడుగుపెట్టలేకపోయాడు. And of course we discussed the #Ashes pic.twitter.com/FeKESkb062 — Anthony Albanese (@AlboMP) July 11, 2023 చదవండి: Asia Cup 2023: 'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే' #NovakDjokovic: 46వసారి సెమీస్లో.. ఫెదరర్ రికార్డు సమం -
Ashes 2023: రిషి సునాక్కు స్ట్రాంగ్ కౌంటర్! మాములుగా లేదు..
Bairstow Controversial Dismissal: ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లిష్ క్రికెటర్ జానీ బెయిర్స్టో అవుటైన తీరుపై వివాదం కొనసాగుతూనే ఉంది. బంతి వికెట్కీపర్ చేతిలో ఉండగానే.. బెయిర్స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సమయస్ఫూర్తితో బెయిర్స్టోను స్టంపౌట్ చేసిన ఆసీస్ వికెట్కీపర్ అలెక్స్ క్యారీ సహా ఇతర ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ అభిమానులు, కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియా తీరుపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడిన నేపథ్యంలో.. తామైతే ఇలా ఆసీస్ తరహాలో గెలుపొందాలని కోరుకోమని వ్యాఖ్యానించాడు. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం స్టోక్స్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. రిషి సునాక్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇందుకు ప్రతిస్పందనగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ సైతం రంగంలోకి దిగారు. తమ జట్టుకు పూర్తి మద్దతు ప్రకటించారు. యాషెస్ సిరీస్లో తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్పై విజయం సాధించిన ఆస్ట్రేలియా మహిళా, పురుష క్రికెట్ జట్లను చూసి తాను గర్వపడుతున్నానన్నారు. ‘‘అదే ఆసీస్.. పూర్వవైభవాన్ని గుర్తు చేస్తూ.. ఎల్లప్పుడూ విజయాలు సాధిస్తూనే ఉంటుంది. వాళ్లు విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా.. విజేతలైన మా ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని ఆంథనీ అల్బనీస్ పేర్కొన్నారు. పరస్పరం విమర్శలు కాగా యాషెస్ సిరీస్ రెండో టెస్టు ఆఖరి రోజు ఆట సందర్భంగా.. ఓవర్ పూర్తైందని భావించిన బెయిర్స్టో క్రీజు దాటి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని వికెట్లకు గిరాటేసి.. రనౌట్కు అప్పీలు చేశాడు. అయితే, బెయిర్స్టో కీపర్ లేదంటే అంపైర్కి సిగ్నల్ ఇవ్వకుండా క్రీజు దాటడంతో థర్డ్ అంపైర్ అతడిని అవుట్గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందంటూ ఇంగ్లండ్ అభిమానులు, మీడియా ప్రత్యర్థి జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆసీస్ మీడియా కూడా తగ్గేదేలే అన్నట్లు స్టోక్స్ ఫొటోలతో ఇంగ్లండ్ విమర్శలను తిప్పి కొట్టింది. తాజాగా ఇరు దేశాల ప్రధానులు సైతం తమ తమ ఆటగాళ్లకు అండగా నిలుస్తూ కౌంటర్ అటాక్ చేసుకోవడం విశేషం. చదవండి: BCCI: అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాతే ఆ కీలక ప్రకటన! ఇక కోహ్లి, రోహిత్.. నెదర్లాండ్స్ ఆశలు సజీవం BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 -
Ashes 2023: బెయిర్స్టో స్టంపౌట్ ఉదంతం.. ప్రధాని సైతం స్పందించారు..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్స్టో వివాదాస్పద స్టంపౌట్పై క్రికెట్ను ఎంతగానో ఇష్టపడే బ్రిటన్ ప్రధాని రిషి సునక్ స్పందించారు. బెయిర్స్టో విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. ఈ వివాదంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందనతో ఏకీభవించారు. ఆస్ట్రేలియా తరహాలో గేమ్ గెలవాలని తాను కోరుకోనని అన్నారు. ఆసీస్ వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాలను రిషి సునక్ ప్రతినిధి వెల్లడించారు. కాగా, యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో బెయిర్స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఔటైన విషయం తెలిసిందే. బంతి వికెట్కీపర్ చేతిలో ఉండగానే బెయిర్స్టో ఓవర్ పూర్తయ్యిందనుకుని క్రీజ్ దాటి వెళ్లాడు. ఇది గమనించిన వికెట్కీపర్ వికెట్లను గిరాటు వేశాడు. సుదీర్ఘ పరిశీలన అనంతరం ధర్డ్ అంపైర్ బెయిర్స్టోను స్టంపౌట్గా ప్రకటించాడు. దీంతో వివాదం రాజుకుంది. నిబంధనల ప్రకారం ఇది ఔటే అయినా.. ఆసీస్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసీస్ క్రీడాస్పూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ కెప్టెన్ అయితే తాము ఆసీస్ తరహాలో మ్యాచ్ గెలవాలని ఎప్పటికీ కోరుకోమని వ్యాఖ్యానించాడు. ఇదే విషయాన్ని తాజాగా బ్రిటన్ ప్రధాని కూడా వెల్లబుచ్చారు. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్లో బెయిర్స్టో కీలక సమయంలో ఔట్ కావడంతో ఇంగ్లండ్ 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్, ఆసీస్ మధ్య మూడో టెస్ట్ జులై 6 నుంచి హెడింగ్లీలో ప్రారంభమవుతుంది. -
రిషి సునాక్ వాడుతున్న పెన్నుపై వివాదం.. ఎందుకంటే..?
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక పత్రాలపై ఎరేజబుల్ (చెరిపివేయదగిన) ఇంక్ పెన్నులను వాడుతారని గార్డియన్ పత్రిక తెలిపింది. దీంతో అధికారిక పత్రాల భద్రత అంశాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛాన్సలర్గా పనిచేసినప్పుడు కూడా అవే పెన్నులను రిషి సునాక్ ఉపయోగించినట్లు గార్డియన్ తన నివేదికలో వెల్లడించింది. చెరిపివేయదగిన ఇంక్ పెన్నులను వాడితే.. అధికారిక పత్రాలపై రాతలను తారుమారు చేసే అవకాశం ఉండకపోదని నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. చరిత్ర గుర్తుంచుకోవాల్సిన పత్రాలపై అలాంటి పెన్నుల వాడకాన్ని విమర్శిస్తున్నారు. రిషి సునాక్ ఉపయోగించే పెన్నులు యూకేలో ఒక్కోటి రూ.495 ఖరీదు ఉంటాయి. వాటిపై ఎరేజబుల్ అనే లోగో కూడా ఉంటుందని గార్డియన్ వెల్లడించింది. ఇంక్తో రాయడం నేర్చుకునేవారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే తప్పు రాస్తే ఎరాడికేటర్లతో వెంటనే చెరిపివేసుకోవచ్చు. ఈ ఉద్దేశంతోనే ఆ సంస్థ కూడా మార్కెటింగ్ చేస్తుందని గార్డియన్ పేర్కొంది. రిషి సునాక్ అధికారిక కార్యదర్శి మాత్రం ఈ విషయాన్ని ఖండించారు. సునాక్ వాడుతున్న పెన్నులు బ్రిటన్లో సివిల్ సర్వీస్ ఉద్యోగులు వాడుతున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు ఆ పెన్నులనే పంపిస్తున్నామని అన్నారు. చెరిగిపోయే పనులను ప్రధాని రిషి సునాక్ ఎన్నటికీ చేయరని స్పష్టం చేశారు. అయితే.. గతంలో క్యాబినెట్లో రిషి సునాక్ ఎరేజబుల్ పెన్నులను ఉపయోగిస్తున్న ఫొటోలు కూడా బయటకు ప్రచారం అయ్యాయి. పలు అధికారిక సమావేశంలోనూ ఆ పెన్నులను ఉపయోగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అన్లాక్ డెమోక్రసీ గ్రూప్ అధ్యక్షుడు టామ్ బ్రేక్ ప్రజల నమ్మకాలను తుడిచేయడమే ఆ పెన్నుల వాడకానికి ఉద్దేశమని విమర్శించారు. రాజకీయ నాయకుల మాటలకు నమ్మకం తక్కువ. ఎరేజబుల్ ఇంక్ పెన్నుల వాడకంతో ఆ నమ్మకం ఇక పాతాళానికి చేరుతుందని అన్నారు. ఇదీ చదవండి: 'కరోనా వైరస్ అక్కడి నుంచే..' వుహాన్ ల్యాబ్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు.. -
సునాక్ అమ్మ చేతి వంట.. జెలెన్స్కీ రుచిచూస్తే..
Viral Video: భారతీయ సంప్రదాయ వంటకాలకు అంతర్జాతీయంగా మాంచి గుర్తింపే ఉంది. అందునా మన అమ్మల చేతి వంటల్లోని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం తన తల్లీ చేతి వంటకం.. దానిని ఓ ప్రముఖుడికి అందించిన విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నాకు మా అమ్మ(ఉషా సునాక్) భారతీయ తీపి వంటకాలను ఇవ్వాలనుకుంది. అందుకోసం బర్ఫీ చేసి ఇచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, నేను కలుసుకుని కబుర్లు చెప్పుకున్నాం. మధ్యలో ఆయన ఆకలిగా ఉన్నట్లు అర్థమైంది. అందుకే అమ్మ చేసిన బర్ఫీని ఆయకు ఇచ్చా. ఈ విషయం తెలిసి మా అమ్మ ఎంతో సంతోషించింది. ఎంతో థ్రిల్గా ఫీలయ్యింది కూడా అని ఆయన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంట్లో మీ అమ్మ తయారుచేసిన స్వీట్లను ప్రయత్నించడం ప్రతిరోజూ వీలుకాదు కదా అంటూ ఇన్స్టాగ్రామ్లో జెలెన్స్కీ ఉద్దేశించి ఓ వీడియోను సైతం రిషి సునాక్ పోస్ట్ చేశారు. యూరోపియన్ పర్యటనలో భాగంగా జెలెన్స్కీ.. బ్రిటన్ ప్రధాని సునాక్ను కలిసినప్పుడు ఇది జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. ఒకవైపు పాశ్చాత్య దేశాల మద్దతుతో రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు జెలెన్స్కీ. మరోవైపు పాలనాపరమైన విమర్శలు ఎదుర్కొంటూ వచ్చే ఎన్నికలకు రిషి సునాక్ సిద్ధమవుతున్నాడు. View this post on Instagram A post shared by Rishi Sunak (@rishisunakmp) ఇదీ చదవండి: నిత్యయవ్వనంగా ఉండాలని.. రక్తం తాగేస్తూ.. -
ఒడిశా రైలు ప్రమాద ఘటన: ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
లండన్/మాస్కో: దుర్ఘటనకు పలు ప్రపంచదేశాల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఈ విషాద సమయంలో భారత్కు అండగా నిలుస్తామని భరోసానిస్తూ సంతాప సందేశాలు పంపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ‘మృతుల కుటుంబాల బాధను మేమూ పంచుకుంటాం. గాయాలపాలైన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అని టెలిగ్రామ్ ద్వారా ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సందేశం పంపారు. ‘విషాదంలో మునిగిన వారు, ప్రధాని మోదీ తరఫున మేం ప్రార్థనలు చేస్తున్నాం’ అంటూ రిషి సునాక్ ఒక ట్వీట్చేశారు. ‘ఒడిశా ప్రమాద ఘటనలో భారత్కు సంఘీభావంగా నిలుస్తున్నాం’ అని మాక్రాన్ ట్వీట్చేశారు. ప్రమాదంలో ఇంతటి ప్రాణనష్టం జరగడంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జపాన్ ప్రధాని కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ) , పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, శ్రీలంక విదేశాంగ మంత్రి, భూటాన్ ప్రధాని షెరింగ్, ఇటలీ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసభ అధ్యక్షుడు కసాబా కొరొసో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ సానుభూతి సందేశాలు పంపించారు. -
బ్రిటన్ ప్రధాని నివాసంపై కారుతో దాడికి యత్నం?
బ్రిటన్ ప్రధాన మంత్రి అధికారిక నివాసం వద్ద ఓ వ్యక్తి కారుతో దాడికి యత్నించాడు. ఈ పరిణామం అందర్నీ షాక్ కి గురి చేసింది. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆ సమయంలో సునాక్ తన కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. లండన్ లోని ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ గేటును ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నివాసం గేటును కారు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాస్త వయసున్న ఆ వ్యక్తిని సంకెళ్లతో బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. సాధారణంగా బ్రిటన్ ప్రధాని నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఎప్పుడూ గట్టి సెక్యూరిటీ ఉంటుంది. రక్షణ వ్యవస్థలో భాగంగా బలమైన ఇనుప గేట్లు ఉంటాయి. దేశ పార్లమెంటుకు ఇది దగ్గరి మార్గం. ఇక్కడి ఎంట్రెన్స్ వద్ద గతంలోనే లోనే భారీ గేట్లను ఏర్పాటు చేశారు. 1991లో ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ లండన్లో బాంబు దాడులకు పాల్పడిన దృష్ట్యా ఇక్కడ భద్రతను పెంచారు. కాగా తాజా ఘటన వెనుక నిందితుడి ఉద్దేశం ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం బ్రిటన్ ప్రధాని నివాసం వద్ద జరిగింది ఉగ్ర దాడి కాకపోవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. క్రిమినల్ డ్యామేజ్, డేంజరస్ డ్రైవింగ్ ఆరోపణలపై అతడిని అరెస్టు చేసినట్టు వారు చెప్పారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద 19 ఏళ్ళ సాయివర్షిత్ కందుల ఓ అద్దె ట్రక్కుతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకే బ్రిటన్ ప్రధాని నివాసం వద్ద అదే తరహా ఘటన చోటు చేసుకోవడగం గమనార్హం. ఇదీ చదవండి: అడ్డొస్తే ఎవరినైనా లేపేస్తా: సాయివర్షిత్ -
సునాక్ దంపతుల సంపద తగ్గింది
లండన్: గత ఏడాది యూకే ధనవంతుల జాబితాలో తొలిసారిగా చోటుదక్కించుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతుల సంపద ఈ ఏడాది కొంత తగ్గిపోయింది. ఏడాది వ్యవధిలో వారు 201 మిలియన్ పౌండ్ల సంపద కోల్పోయినట్లు శుక్రవారం విడుదలైన ‘ద సండే టైమ్స్ రిచ్ లిస్ట్–2023’ను బట్టి తేటతెల్లమవుతోంది. ఇన్ఫోసిస్ కంపెనీలో అక్షతా మూర్తి షేర్ల విలువ పడిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 2022 నాటి సంపన్నుల జాబితాలో రిషి సునాక్ దంపతులు 222వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జాబితాలో వారి ర్యాంక్ 275కు చేరింది. ప్రస్తుతం వారి సంపద 529 మిలియన్ పౌండ్లని (రూ.5,461 కోట్లు) అంచనా. సునాక్ దంపతుల సంపదలో సింహభాగం ఇన్ఫోసిస్ షేర్ల రూపంలోనే ఉంది. ఇక 35 బిలియన్ పౌండ్లతో (రూ.3.61 లక్షల కోట్లు) బ్రిటన్ సంపన్నుల జాబితాలో ఈ ఏడాది కూడా తొలి స్థానాన్ని భారత సంతతికి చెందిన హిందుజా కుటుంబమే దక్కించుకుంది. -
బ్రిటన్ ప్రధాని అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు: సుధామూర్తి
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి అందరికీ సుపరిచితురాలే. రచయిత్రి, విద్యావేత్త, సామాజిక వేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. కోట్ల సంపద ఉన్నప్పటికీ సాధారణ మహిళగానే జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. కాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సుధామూర్తికి సొంత అల్లుడు అన్న విషయం తెలిసిందే. నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షరతో రిషి వివాహం 2009లో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం(కృష్ణ సునక్, అనౌష్క సునక్). గతేడాది సెప్టెంబర్లో రిషి సునాక్ యూకే ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల సుధామూర్తి లండన్కు వెళ్లగా అక్కడ ఎదురైన ఓ ఆసక్తికర విషయాన్ని బాలీవుడ్ టాక్షో ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొని పంచుకున్నారు. లండన్లో తన అడ్రస్ చెబితే ఇమిగ్రేషన్ అధికారులు నమ్మలేదని తెలిపారు. తాను ప్రధాని అత్తగారినంటే ‘జోక్ చేస్తున్నారా’ అని అడిగారని పేర్కొన్నారు. ‘నేను ఒకసారి యూకే వెళ్లాను. లండన్లో ఎక్కడ ఉంటారని ఇమిగ్రేషన్ అధికారులు నా రెసిడెన్షియల్ అడ్రస్ అడిగారు. నాతో పాటు మా అక్క కూడా ఉన్నారు. నా కొడుకు కూడా లండన్లో నివసిస్తున్నాడు. కానీ నాకు అతని పూర్తి అడ్రస్ తెలియదు. అందుకే అల్లుడు రిషి సునాక్ నివాసించే 10 డౌనింగ్ స్ట్రీట్’ను అడ్రస్గా రాశాను. అది చూసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు నావైపు అదో రకంగా చూశారు. మీరు జోక్ చేస్తున్నారా అని అడిగారు. నేను నిజమే అని చెప్పాను. కానీ ఆయన నమ్మినట్లు నాకు అనిపించలేదు.72 ఏళ్ల వయసున్న నాలాంటి సాధారణ మహిళ బ్రిటన్ ప్రధాని రిషి అత్తగారంటే అక్కడ ఎవరూ నమ్మలేదు.’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ షోలో సుధామూర్తితో పాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్, నిర్మాత గునీత్ మోంగా కూడా పాల్గొన్నారు. చదవండి: ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్.. సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు.. -
అంగరంగ వైభవంగా..చార్లెస్ పట్టాభిషేకం
లండన్: రవి అస్తమించినా అలనాటి రాజ వైభవానికి, అట్టహాసాలకు, ఆడంబరానికి మాత్రం ఏ లోటు లేని రీతిలో బ్రిటన్ రాజ సింహాసనంపై చార్లెస్ 3 కొలువుదీరారు. వెయ్యేళ్లకు పైగా కొనసాగుతున్న సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం బ్రిటన్ 40వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. పలువురు దేశాధినేతలు, ముఖ్య నేతలు తదితరుల సమక్షంలో లాంఛనంగా కిరీటధారణ చేశారు. దాంతో బ్రిటన్కు లాంఛనప్రాయ అధినేతగా చార్లెస్ అధికారికంగా పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టినట్టయింది. లండన్ వీధుల గుండా భార్యాసమేతంగా బంగారు రథంలో ఊరేగుతూ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పట్టాభిషేకానంతరం దారి పొడవునా ప్రజలు, అభిమానుల అభినందనలు స్వీకరిస్తూ బకింగ్హాం రాజప్రాసాదానికి చేరుకున్నారు. అనంతరం చారిత్రక బాల్కనీ నుంచి రాజ దంపతులు మరోసారి అందరికీ అభివాదం చేయడంతో కార్యక్రమం ముగిసింది. అత్యంత లేటు వయసులో బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించిన రికార్డును కూడా 74 ఏళ్ల చార్లెస్ సొంతం చేసుకున్నారు! ఆయనతో పాటు భార్య కెమిల్లా (75)కు కూడా రాణిగా పట్టాభిషేకం జరిగింది. 2022 సెప్టెంబర్లో తన తల్లి, బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణానంతరం బ్రిటన్ రాజుగా చార్లెస్ బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. 70 ఏళ్ల తర్వాత... అప్పుడెప్పుడో 70 ఏళ్ల కిందట, అంటే 1953లో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్–2కు పట్టాభిషేకం జరిగింది. తర్వాత మళ్లీ ఇంతకాలానికి జరిగిన పట్టాభిషేక క్రతువు అందరినీ ఎంతగానో ఆకర్షించింది. అప్పట్లాగే శనివారం కూడా కార్యక్రమం ఆసాంతం వాన పడటం విశేషం. దేశ విదేశాల్లో లక్షలాది మంది కార్యక్రమాన్ని అత్యంత ఆసక్తిగా వీక్షించారు. మరోవైపు ఈ ప్రజాస్వామిక యుగంలోనూ ఇంకా ఈ కాలం చెల్లిన రాచరికపు పోకడలు ఏమిటంటూ జోరుగా విమర్శలు కూడా వచ్చాయి. వందలాది నిరసనకారులు రాజ దంపతుల ఊరేగింపు మార్గంలో బారులు తీరి నినాదాలకు దిగారు. ముందుజాగ్రత్తగా వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. సునాక్ బైబిల్ పఠనం ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్బరీ సమక్షంలో మొదలైన కార్యక్రమం రాజుగా చార్లెస్ను గుర్తించడం, ప్రమాణం, ప్రకటన, కిరీటధారణ, పట్టాభిషేకం... ఇలా ఐదు దశల్లో 2 గంటలపాటు సాగింది. ముందుగా చార్లెస్ను సభికులందరికీ ఆర్చిబిషప్ పరిచయం చేశారు. చార్లెస్ అందరికీ కన్పించేలా నాలుగు దిక్కులకూ తిరిగారు. తర్వాత చట్టాన్ని కాపాడుతూ న్యాయంగా, దయతో పాలిస్తానని, ఇంగ్లండ్ చర్చికి విధేయుడైన క్రైస్తవునిగా ఉంటానని చార్లెస్ రెండు ప్రమాణాలు చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం కెమిల్లాకు చార్లెస్ ఉంగరం తొడిగారు. తద్వారా రాజ దంపతులు లాంఛనంగా మళ్లీ పెళ్లాడారు. అనంతరం బ్రిటన్ తొలి హిందూ ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వ సారథి హోదాలో బైబిల్ పంక్తులు చదివి వినిపించారు! హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ, యూదుమత ప్రతినిధులను కూడా తొలిసారిగా కార్యక్రమానికి ఆహ్వానించారు. హిందూ ప్రతినిధి రాజ చిహ్నాన్ని చార్లెస్కు అందజేశారు. అనంతరం బంగారు అంగవస్త్రం ధరించి దాదాపు 800 ఏళ్ల నాటి సింహాసనాన్ని అధిష్టించారు. దాని కింది అరలో స్కాట్లాండ్ నుంచి తెప్పించిన పవిత్ర శిలనుంచారు. చార్లెస్పై తెరచాటుగా చాతి, చేతులు, ముఖంపై జెరూసలేం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పవిత్ర తైలం చిలకరించారు. చార్లెస్కు తెరచాటు కోసం ఉపయోగించిన వస్త్రంపై 56 కామన్వెల్త్ దేశాలకు ప్రతీకగా 56 ఆకులతో కూడిన చెట్టును చిత్రించారు. తర్వాత శిలువతో కూడిన గోళాకారపు బంగారు రాజముద్ర, రాజదండాన్ని ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్ అందుకున్నారు. వేలికి రాజముద్ర తొడిగాక చివరగా అతి ప్రధాన ఘట్టంలో 360 ఏళ్ల నాటి సెయింట్ ఎడ్వర్డ్ స్వర్ణ కిరీటాన్ని చార్లెస్ ధరించారు. దీన్ని ఆయన మరింకెప్పుడూ ధరించబోరు. ఆ వెంటనే గాడ్ సేవ్ ద కింగ్ గీతాలాపనతో, గంటల మోతతో వెస్ట్ మినిస్టర్ అబే మారుమోగింది. అనంతరం చార్లెస్ రాజఖడ్గం చేబూని 1937లో క్వీన్ ఎలిజబెత్ దంపతులు పట్టాభిషేకానికి వాడిన సింహాసనంపై ఆసీనులయ్యారు. ఆర్చిబిషప్తో పాటు చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం మోకాళ్లపై కూర్చుని ఆయన కుడిచేతిని ముద్దాడారు. తర్వాత నిరాడంబరంగా కెమిల్లాకు రాణి కిరీటధారణ జరిగింది. ఆహూతుల కళ్లెదుట రాణిపై పవిత్ర తైలం చిలకరించారు. తర్వాత 1911లో క్వీన్ మేరీ ధరించిన 2,200 వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ఆమె ధరించారు. కోహినూర్ సహా మూడు పెద్ద వజ్రాలతో ఈ కిరీటం మెరిసిపోయేది. వివాదాలకు తావు లేకుండా ఇటీవల కోహినూర్ను కిరీటం నుంచి తొలగించారు. అనంతరం ఎడ్వర్డ్ కిరీటాన్ని తీసేసి అధికారిక రాజ కిరీటాన్ని చార్లెస్ ధరించారు. రాణితో కలిసి దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ బంగారు రథంలో బకింగ్హాం ప్యాలెస్కు తిరిగి వెళ్లారు. ప్యాలెస్ బాల్కనీ నుంచి పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం దంపతులతో కలిసి చార్లెస్ దంపతులు ప్రజలకు దర్శనమివ్వడంతో పట్టాభిషేక కార్యక్రమానికి తెరపడింది. చివరగా రాయల్ ఎయిర్ఫోర్స్ విమానాలు విన్యాసాలతో అలరించాయి. వర్షం కారణంగా చాలా కార్యక్రమాలను కుదించి త్వరగా ముగించారు. బంగారు ఆకుల డిజైన్లలో బైబిల్ చార్లెస్ ప్రమాణస్వీకారం కోసం వాడిన బైబిల్ను ఆక్స్ఫర్డ్ ప్రెస్లో ప్రత్యేకంగా తయారు చే యించారు. బంగారు ఆకులు తదితర డిజైన్లతో తీర్చిదిద్దారు. అందులో దాదాపు 350 అచ్చు తప్పులను సరిచేసి మరీ కార్యక్రమం కోసం సిద్ధం చేశారు. అచ్చం 1611 నాటి కింగ్ జేమ్స్ బైబిల్లా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజు వెడలె... లండన్లోని వెస్ట్ మినిస్టర్స్ అబేలో శనివారం చార్లెస్ 3 పట్టాభిషేక కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. 1066లో విలియం ద కాంకరర్కి ఇక్కడే పట్టాభిషేకం జరిగింది. నాటి నుంచీ ఈ కార్యక్రమం ఇక్కడే జరుగుతోంది. చార్లెస్, కెమిల్లా దంపతులు ఉదయం 11 గంటలకు బకింగ్హాం ప్యాలెస్ నుంచి ప్రత్యేక బంగారు రథంలో ఊరేగింపుగా వెస్ట్ మినిస్టర్స్ అబేకు తరలి వెళ్లారు. ఈ రథాన్ని 1831 నుంచి ప్రతి పట్టాభిషేక వేడుకకూ ప్రత్యేకంగా వాడుతున్నారు. సైనిక సిబ్బంది గుర్రాలపై, కాలి నడకన రథాన్ని అనుసరించారు. వేలాదిగా ప్రజలు సెంట్రల్ లండన్ వీధుల నిండా బారులు తీరి రాజ దంపతులకు చేతులూపుతూ కన్పించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన 2,200 మంది పై చిలుకు ఆహూతులు అబే వద్ద రాజ దంపతులకు స్వాగతం పలికారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ దంపతులు పాల్గొన్నారు. వారు కామన్వెల్త్ దేశాధినేతల వరుసలో కూర్చున్నారు. దూరదూరంగా హారీ రాచరికాన్ని వదులుకుని రాజ కుటుంబానికి దూరమైన చార్లెస్ రెండో కుమారుడు హారీ పట్టాభిషేక కార్యక్రమంలో అంటీ ముట్టనట్టుగా పాల్గొన్నారు. 10 వరుసల ఆవల మౌనంగా కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఆయన భార్య మెగన్ మార్కెల్, ఇద్దరు పిల్లలు కార్యక్రమానికి రాకుండా అమెరికాలోనే ఉండిపోయారు. శనివారమే నాలుగో పుట్టినరోజు జరు పుకున్న కుమారుడు ఆర్చీ కోసం కార్యక్రమం ముగియగానే హారీ అమెరికా పయనమయ్యా రు. రాజ దంపతులు, అన్న విలియం తనను ఎన్నడూ సరిగా చూడలేదంటూ ఇటీవలి ఆత్మకథలో ఆయన తూర్పారబట్టడం తెలిసిందే. చార్లెస్ తమ్ముడు కూడా... రాచరిక హోదాను కోల్పోయిన చార్లెస్ తమ్ముడు ఆండ్రూ కూడా దూరంగా కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించడానికే పరిమితమయ్యారు. లైంగిక వేధింపుల కేసు తదితరాల్లో చిక్కడంతో ఆండ్రూ రాచరికపు హోదాలను తల్లి ఎలిజబెత్ తొలగించారు. 𝐓𝐡𝐞 𝐂𝐫𝐨𝐰𝐧𝐢𝐧𝐠 𝐨𝐟 𝐓𝐡𝐞 𝐊𝐢𝐧𝐠 The Archbishop of Canterbury places St Edward’s Crown on The King’s anointed head. The clergy, congregation and choir all cry ‘God Save The King’.#Coronation pic.twitter.com/kGrV3W0bky — The Royal Family (@RoyalFamily) May 6, 2023 look at camilla she can’t believe what her and charles have gotten away with and that smirk says it all #Coronation pic.twitter.com/gtQ9rIGiEj — ᴀᴅᴇʏᴇᴍɪ 🚩 (@LE4NDROAI) May 6, 2023 చదవండి: యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ -
యూకేలో కౌన్సిలర్గా ఎన్నికైన తెలుగు వ్యక్తి మువ్వల చంద్రశేఖర్
ఇటీవల జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో లండన్ నగరంలో గల 'స్లో బరో' లోని లాంగ్లే మేరీస్ వార్డు నుంచి అందరు తెలుగు వ్యక్తులు గర్వపడేలా రెండవసారి అత్యధిక మెజారితో 'మువ్వల చంద్రశేఖర్' గెలుపొందారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బ్రిటన్ ప్రధాన మంత్రి 'రిషి సునాక్' నేతృత్వం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ నుంచి బంపర్ మెజారితో గెలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంతే కాకుండా నా గెలుపుకి సహకరించిన యూకేలోని తెలుగువారందరికీ ఎల్లవేళలా ఋణపడి ఉంటానని పేర్కొన్నారు. లాంగ్లే మేరీస్ వార్డులో ఉన్న వివిధ దేశాలవారందరికీ తనవంతు సహకారం అందించి, సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గతంలో నేను వార్డు సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషిని గుర్తించి మళ్ళీ అవకాశం కల్పించినందుకు తప్పకుండా నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు. థేమ్స్ నదీ తీరాన ఒక తెలుగు బిడ్డగా గెలుపొందడం నాకు గర్వంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆప్యాయమైన స్నేహం, మంచి పలకరింపు తనం తన సొంతమని తోటి స్నేహితుడు, తెలంగాణ అసోషియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అడ్వైజరీ చైర్మన్ వెంటెద్దు మట్టారెడ్డి అన్నారు. -
యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ
లండన్: యూకే స్థానిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టాక జరిగిన మొదటి ఎన్నికలివి. ఇంగ్లండ్లోని 317 కౌన్నిళ్లకుగాను 230 కౌన్సిళ్లలోని 8 వేల సీట్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో అధికార పార్టీ 20కిపై కౌన్సిళ్లను కోల్పోయింది. ఎన్నికలు జరిగిన 8 వేల సీట్లలో లేబర్ పార్టీ 1,384, కన్జర్వేటివ్ పార్టీ 1,041, లిబరల్ డెమోక్రాట్లు 768 సీట్లను సాధించాయి. 20 ఏళ్లుగా అధికారపక్షానికి కంచుకోటగా ఉన్న మెడ్వే లాంటి కౌన్సిళ్లను సైతం లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు. మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా వెలువడిన ఈ ఫలితాలపై ప్రధాని రిషి సునాక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
Sudha Murty: 'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది!'
రిషి సునాక్ అతి చిన్న వయసులో బ్రిటన్ ప్రధాని అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతని అత్తగారు సుధా మూర్తి చేసిన వ్యాఖ్యలు.. అతని అధికార హోదాను మరోసారి వార్తల్లో హైలెట్గా నిలిచేలా చేసింది. ఈమేరకు ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుడు, దిగ్జజ పారిశ్రామిక వేత్త నారాయణ మూర్తి భార్య సుధామూర్తి మాట్లాడుతూ..తన కూతురు కారణంగానే రిషి సునాక్ అతి చిన్న వయసులో యూకేకి ప్రధాని అయ్యారని ఆన్లైన్లో ప్రసారం అవుతున్న ఓ వీడియోలో అన్నారు. ఆ వీడియోలో..తన కూతురే దీన్ని సాధ్యం చేసిందన్నారు. తాను తన భర్తను వ్యాపారవేత్తను చేస్తే తన కుమార్తె తన భర్తను ప్రధానిని చేసిందని చెప్పారు. "ఇదంతా భార్య మహిమే. భార్య భర్తను ఎలా మారుస్తుందో చూడండి. ఐతే నేను నా భర్తను మాత్రం మార్చలేకపోయాను..నేను ఆయన్ని కేవలం వ్యాపారవేత్తని చేశానని, కానీ నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అన్నారు. కాగా, రిషి సునాక్ 2009లో అక్షతామూర్తిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడేళ్లలోనే యూకేకి ప్రధాని అయిన ఎంపీగా నిలవడమే గాక, అతిపిన్న వయస్కుడైన ప్రధానిగా పేరుగాంచారు. కాగా అక్షతమూర్తి ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్లలో ఒకరి కుమార్తె, దాదాపు 730 మిలియన్ల పౌండ్ల వ్యక్తిగత సంపదతో శక్తిమంతమైన మహిళగా ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు, భారతదేశానికి చెందినవారు. అక్షతామూర్తి తండ్రి నారాయణమూర్తి ఇన్పోసిస్ వ్యవస్థాపకుడు, భారతదేశంలోని అత్యంత సంపన్నులో ఆయన ఒకరు. (చదవండి: మణిపూర్లో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు) -
నియంత కిమ్లా మారిన రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని తీరుపై నెటిజన్లు ఫైర్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్పై నెటిజన్లు మండిపడ్డారు. లండన్లోని డౌనింగ్ స్ట్రీట్కు వచ్చే సమయంలో సునాక్ కాన్వాయ్ ముందు సెక్యూరిటీ గార్డులు సైకిల్ తొక్కుకుంటూ కన్పించారు. మరికొంత మంది సెక్యూరిటీ ఆయన కారుతో పాటు పరుగులు తీస్తూ డౌనింగ్ స్ట్రీట్కు వెళ్లారు. రిషి సునాక్ రేంజ్ రోవర్ కారు ముందు సెక్యూరిటీ ఇలా సైకిల్పై రావడం, పరుగులు పెట్టుకుంటూ వెళ్లడం చూసిన స్థానికులు అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Is this really necessary? 😳 Look at how @RishiSunak gets escorted through London. pic.twitter.com/O6VaiNneyV — Charlotte, The Baroness 💫 (@CharlotteEmmaUK) April 24, 2023 ఈ వీడియో చూసిన నెటిజన్లు సునాక్పై విమర్శలు గుప్పించారు. ఈ సెక్యూరిటీని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ సెక్యూరిటీతో పోల్చారు. రిషి సునాక్ కూడా కిమ్లా ప్రవర్తిస్తున్నారని, నియంతలా మారిపోయారని ధ్వజమెత్తారు. మరికొందరేమో కిమ్ జోంగ్ లండన్ వచ్చారా? ఆయన సెక్యూరిటీ ఇక్కడ ఉందేంటి? అని సునాక్ తీరుపై సెటైర్లు వేశారు. 'రిషి సునాక్లా చేసినట్టు గతంలో ఏ ప్రధాని చేయలేదు. పోలీసు బలగాలను వృథా చేస్తున్నారు. ఉత్తర కొరియాను ఫాలో అవడం బాలేదు' అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. సునాక్ కాన్వాయ్ ముందు సైకిళ్లపై వచ్చిన సెక్యూరిటీ రోడ్డుపై ఉన్నవారిని పక్కకు తప్పుకోవాలని హెచ్చరించింది. దారివ్వండి, తప్పుకోండి అంటూ అరుస్తూ ముందుకు సాగింది. దీంతో వీళ్ల హడావుడి చూసి స్థానికులు అవాక్కయ్యారు. చదవండి: ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు -
బ్రిటన్ ఉప ప్రధాని రాజీనామా
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు అక్కడ ఎదురు గాలి వీస్తోంది. బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. న్యాయశాఖలో పాటు వైట్హాల్ విభాగాల్లో ఆయన సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డారంటూ గత కొంతకాలంగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు కమిటీ రిపోర్ట్ గురువారం ప్రధాని సునాక్కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం డొమినిక్ రాబ్ తన పదవులకు రాజీనామా ప్రకటించారు. ఈ సీనియర్ కన్జర్వేటివ్ ఎంపీ తన పేషీలో పని చేసే సిబ్బందిని వేధించినట్లు, అవమానించినట్లు, ఏడ్పించినట్లు.. సిబ్బంది ఫిర్యాదులు చేశారు. ఈ విషయాన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్ గార్డియన్ తొలుత బయటపెట్టింది. అయితే.. ఆరోపణలను డొమినిక్ రాబ్ ఖండిస్తూ వస్తున్నప్పటికీ, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా సీనియర్ న్యాయవాది అడమ్ టోలీని కిందటి ఏడాది నవంబర్లో నియమించారు ప్రధాని సునాక్. రెండు ఫిర్యాదుల మీద మొదలైన ఈ వ్యవహారంలో దర్యాప్తు.. మలుపులు తీసుకుంటూ ఎక్కడికో పోయింది. రాబ్కు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించుకుంటూ పోయింది అడమ్ టీం. రాబ్ దగ్గర పని చేసే సిబ్బంది నుంచి వాంగ్మూలం సేకరించి.. నివేదికను సిద్ధం చేసింది. గురువారం ఆ నివేదికను రిషి సునాక్కు సమర్పించారు అడమ్ టోలీ. ఆ నివేదిక ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది. ఈ లోపే రాబ్ అనూహ్యాంగా రాజీనామా ప్రకటించారు. My resignation statement.👇 pic.twitter.com/DLjBfChlFq — Dominic Raab (@DominicRaab) April 21, 2023 అయితే.. తీవ్ర ఆరోపణలు, రాబ్పై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ సునాక్ను.. మంత్రిగా కొనసాగించడంపై ప్రధాని రిషి సునాక్ రాజకీయపరంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు కిందటి ఏడాది అక్టోబర్లో రిషి సునాక్ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా.. ఈ ఆరు నెలల కాలంలో ముగ్గురు కేబినెట్ మంత్రులు వ్యక్తిగత ప్రవర్తన కారణంగానే పదవుల నుంచి వైదొలగాల్సి రావడం గమనార్హం. -
ఒక్కరోజులో రూ.500 కోట్లు ఆవిరి! భారీగా నష్టపోయిన రుషి సునాక్ భార్య..
బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ భార్, భారతీయ ఐటీ వ్యాపార దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ షేర్ల పతనంతో భారీగా నష్టపోయారు. ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం (ఏప్రిల్ 17) 9.4 శాతం పడిపోయాయి. ఫలితంగా అక్షతా మూర్తి సుమారు రూ. 500 కోట్లు నష్టపోయారు. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. 2020 తర్వాత ఇన్ఫోసిస్ షేర్ల అత్యంత భారీ పతనం ఇదే. ఇన్ఫోసిస్లో అక్షతా మూర్తికి 0.94 శాతం షేర్లు ఉన్నాయి. వీటి విలువ ఇప్పటికీ రూ. 4,586 కోట్లకు పైమాటే. ఆమె షేర్లపై లక్షలాది డివిడెండ్లను సంపాదించారు. ఆమె ఎన్నారై కావడంతో తన ఆదాయంలో ఎక్కువ భాగంపై పన్నులు చెల్లించలేదు. ఇది తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఆమె యునైటెడ్ కింగ్డమ్లో పన్నులు చెల్లిస్తానని చెప్పడంతో ఏప్రిల్లో వివాదానికి తెరపడింది. విలాసవంతమైన జీవనాన్ని గడిపే రుషి సునాక్, అక్షతా మూర్తి దంపతులకు లండన్లో 7 మిలియన్ పౌండ్ల విలువైన ఇల్లు ఉంది. అమెరికాలో ఓ ఫ్లాట్ ఉంది. వారు ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం 4 లక్షల డాలర్లు అంటే దాదాపు రూ.3.3 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదీ చదవండి: Air India Salaries: జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా.. పైలట్ జీతమెంతో తెలుసా? -
సునాక్పై పార్లమెంటరీ కమిషనర్ విచారణ!
లండన్: తన భార్య అక్షతా మూర్తి నిర్వహిస్తున్న ‘కొరు కిడ్స్ లిమిటెడ్’ అనే సంస్థకు లబ్ధి చేకూరేలా బడ్జెట్లో కొత్త పథకాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రకటించారని బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గుతేల్చడానికి ‘యూకే పార్లమెంటరీ కమిషనర్ ఫర్ స్టాండర్స్’ విచారణ ప్రారంభించింది. అతి త్వరలో రిషి సునాక్ను ప్రశ్నించనుంది. కొరు కిడ్స్ లిమిటెడ్ సంస్థ చిన్నపిల్లల సంరక్షణ సేవలను అందిస్తోంది. -
బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి ఒక్క రోజులో రూ.68 కోట్లు అందుకోనున్నారు. భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఇటీవల డివిడెండ్లను ప్రకటించింది. వీటి ద్వారా అక్షతా రూ.68.17 కోట్లు ఆర్జించనున్నారు. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి. గత ఏడాది ఆమె కంపెనీకి చెందిన 3.89 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున జూన్ 2 నాడు ఆమె ఈ మొత్తాన్ని అందుకోనున్నారు. అయితే దాని కోసం ఆమె తన స్టాక్ హోల్డింగ్ను కొనసాగించాల్సి ఉంటుంది. గతేడాది కంపెనీ డివిడెండ్ కలిపితే ఆమె మొత్తం ఆదాయం రూ.132.4 కోట్లు అవుతుంది. ఇన్ఫోసిస్ అక్టోబర్లో ఒక్కో షేరుకు రూ.16.50 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. గతేడాది మూర్తి ఒక్కో షేరుకు రూ.31 డివిడెండ్ను అందుకున్నారు. దీంతో ఆమెకు రూ.120.76 కోట్లు వచ్చాయి. ఇన్ఫోసిస్లో ఆమె షేర్ల విలువ రూ.5400 కోట్లు. ఆమె భర్త, భారత సంతతికి చెందిన రుషి సునాక్ గత అక్టోబర్లో బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. రుషి సునాక్ బ్రిటిష్ పౌరుడు. కానీ అక్షత మాత్రం తన భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు. అందుకే ఆమె అక్కడ నివాసితురాలు కాదు. దీని కారణంగా యూకే చట్టాల ప్రకారం.. ఆమె 15 సంవత్సరాల పాటు పన్నులు చెల్లించకుండా దేశంలో నివసించవచ్చు. ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే తన ఆదాయంపై పన్నులు ఉన్నాయని వాటిని ఎప్పుడూ చెల్లిస్తానని ఆమె చెప్పారు. (tata motors: మళ్లీ పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఎందుకంటే..) అక్షతా మూర్తి కర్ణాటకలోని హుబ్బళ్లిలో జన్మించారు. బెంగళూరులో ఆమె పాఠశాల విద్యను అభ్యసించించారు. కాలిఫోర్నియాలోని క్లేర్మాంట్ మెక్కెన్నా కాలేజీలో ఎకనామిక్స్ అండ్ ఫ్రెంచ్లో డ్యూయల్ మేజర్లు పూర్తి చేశారు. తర్వాత లాస్ ఏంజిల్స్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీని పొందారు. స్టాన్ఫోర్డ్లో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్న సమయంలో ఆమె రుషి సునాక్ను కలిశారు. వీరికి 2009లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు కృష్ణ, అనౌష్క. రుషిసునాక్, అక్షత దంపతులు రియల్ ఎస్టేట్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. కెన్సింగ్టన్లో వీరికి సొంత ఇల్లు ఉంది. దీని విలువు రూ.71 కోట్లు. వీరికి అక్కడ ఫ్లాట్ కూడా ఉంది. కాలిఫోర్నియాలో ఒక పెంట్హౌస్, యార్క్షైర్లో ఒక భవనం కూడా ఉన్నాయి. అక్షత తల్లి సుధా మూర్తి రచయిత్రి. సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. అక్షతా మూర్తికి అక్షతా డిజైన్స్ అనే ఫ్యాషన్ లేబుల్ ఉంది. మారుమూల గ్రామాల్లోని కళాకారులతో కలిసి ఫ్యూజన్ దుస్తులను ఆమె తయారు చేస్తుంటారు. -
భారత వ్యతిరేక శక్తులపై గట్టి చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గురువారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ యూకేలో దౌత్య కార్యాలయాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తానీ అనుకూలవాదులు కొందరు ఇటీవల లండన్లో భారత దౌత్య కార్యాలయంపై దాడికి దిగడం, భారత జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనలను ఈ సందర్భంగా రిషి సునాక్తో ప్రస్తావించారు. భారత వ్యతిరేక శక్తులపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా, ఆర్థిక నేరస్తులను భారత్కు తిరిగి అప్పగించేందుకు తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలు, ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక రంగాల పురోగతిని సమీక్షించారని అధికారులు తెలిపారు. -
మనమెందుకు ఇలా ఉన్నాం!
బ్రిటన్ మారిపోయింది! నిగ్గర్స్, బ్లాక్స్, బ్రౌన్ స్కిన్డ్ పీపుల్... ఇలాంటి జాత్యహంకార దూషణలేవీ పనిగట్టుకుని ఇప్పుడు అక్కడ లేవు. అక్కడి తెల్లవాళ్లు... తమలా ‘తెల్లగా’ లేని వాళ్లను సైతం తమ తలపై ఇష్టంగా మోస్తున్నారు. ఓట్లేసి మరీ కిరీటధారులను చేస్తున్నారు. దేశ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. అక్కడి నాన్– వైట్స్లో ఒకరు ఇప్పుడు ‘ప్రధాని’! మరొకరు ‘ఫస్ట్ మినిస్టర్’! ఇంకొకరు మేయర్! సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఒకప్పుడు లోకాన్ని ఏలిన ఈ అగ్రరాజ్యం... ‘‘మమ్మేలు గణనాథా... మాలోని చెడులను మాయింపగా...’’ అన్నట్లుగా శ్వేత జాతేతరుల పాలనకు మొగ్గు చూపుతోంది. వలసలన్న వివక్ష చూపక విశ్వమానవ భావనకు తలవొగ్గుతోంది. మరి మనం ఎందుకు భిన్నంగా ఉంటున్నాం? తోటి పౌరులను – వారి పూర్వీకులు శతాబ్దాల క్రితమే ఇక్కడ జన్మించి ఉన్నవారైనప్పటికీ, సాటి భారతీయుల్లా హిందువులలో కలిసిపోయి జీవిస్తూ ఉన్నప్పటికీ – వారిని ఎందుకు వేరుగా చూస్తున్నాం? బ్రిటిషర్లను జాత్యంహంకారులు అని కదా మనం తరచూ అంటుంటాం. ఇప్పుడు చెప్పండి, మనకు ఏ విశేషణం సరైనది? మనల్ని మనం ఏమని పిలుచుకోవాలి? ఒకవేళ అది గానీ నిజంగా జరిగి ఉండకపోతే, అది జరుగుతుందని నమ్మడానికే కష్టంగా ఉండేది. అదొకవేళ కల్పితం అయివున్నా ఆ కల్పన కూడా అతీంద్రియ భావనలా అనిపించేది. అయినప్పటికీ అది జరిగింది! నన్ను నిరుత్తరుడిగా మిగిల్చింది. నేడు బ్రిటన్లో అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉండే మూడు అత్యున్నత స్థానాలలో భారత్ లేదా పాకిస్తాన్ సంతతి వారు ఉన్నారు మరి! ఐదేళ్ల క్రితమైతే ఇలా జరగడం అన్నది ఊహకు సైతం అసాధ్యమైన సంగతే. గత వేసవిలో రిషీ సునాక్ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం కోసం పోటీ పడి లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోయి నప్పుడైతే... ఇక తమ జీవితకాలంలో ఎప్పటికైనా గోధుమ రంగు చర్మం కలిగివున్న ఒక వ్యక్తిని బ్రిటన్కు ప్రధాన మంత్రిగా చూస్తామని ఎవరూ అనుకుని ఉండరు. అందరూ ఎన్నికైనవాళ్లే! కానీ అక్టోబర్లో భారతీయ సంతతికి చెందిన హిందూ మతస్థుడు రిషీ సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యారు. గతవారం స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ (ప్రధాని)గా పాకిస్తానీ ముస్లిం హమ్జా యూసఫ్ బాధ్యతలు చేపట్టారు. పాకిస్తానీ మూలాలున్న మరొక ముస్లిం సాదిఖ్ ఖాన్ 2016 నుంచీ లండన్ మేయరుగా కొన సాగుతున్నారు. ఆయన ఇప్పుడు తన రెండవ టర్మ్లో కొనసాగు తున్నారు. ఈ ముగ్గురూ ఎన్నికైన వారే తప్ప నియామకంతో వచ్చి దర్జాగా పీఠంపై కూర్చున్నవారు కాదు. వీళ్లను ఎన్నుకున్న ఓటర్లలో అత్యధికులు శ్వేత జాతీయులే. 2021 జనాభా లెక్కల ప్రకారం బ్రిటన్ జనాభాలో భారతీయ సంతతికి చెందిన వారు కేవలం 2.86 శాతం. పాకిస్తానీ మూలాలు ఉన్న ప్రజలైతే ఇంకా తక్కువగా 1.8 శాతం మాత్రమే. ఇది నాకు 1976 డిసెంబరు నాటి కేంబ్రిడ్జి యూనియన్ చర్చను గుర్తుకు తెస్తోంది. పదవి నుంచి నిష్క్రమిస్తున్న ఆంగ్లో–పోలిష్ సంతతి యూనియన్ ప్రెసిడెంటు పీటర్ ఫుడకోవ్స్కీ నుంచి కొత్త అధ్యక్షుడిగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భం అది. అధ్యక్ష పదవి చర్చకు సంబంధించిన తీర్మానంలో ఆ వెళ్లిపోతున్న పీటర్ మాట్లాడుతూ... ‘‘ఈ యూనియన్ శ్వేత జాతీయులు కాని వారి చేతుల్లోకి వెళుతోంది’’ అని తమాషాకు అన్నారు. ఆయన తమాషా యాభై ఏళ్ల తర్వాత నిజమైంది. మన ప్రవర్తన విరుద్ధం బ్రిటన్ చిరకాలం వర్ధిల్లాలి. ఎంత అద్భుత మైన దేశం! మరొకటి కూడా జోడించి చెబుతాను. మిగతా ప్రపంచ దేశాలకు బ్రిటన్ ఒక దీపస్తంభం. ముఖ్యంగా మనకు! వలస వచ్చిన హిందువులు, ముస్లింలలో రెండవ తరం, మూడవ తరం వారిని కూడా బ్రిటన్ తన ప్రభు త్వంలో కీలక స్థానాలకు చేర్చి కూర్చోబెట్టింది. గొప్ప సంగతేమంటే దీనికి స్థానికులెవరూ అభ్యంతరం చెప్పడం లేదు. అరచి గీపెట్టడం లేదు. ప్రజా నిరసనలు లేవు. మన దగ్గర చూడండి. అందుకు పూర్తిగా విరుద్ధం. మనం మన తోటి ముస్లిం పౌరులను – వారి పూర్వీకులు శతాబ్దాల క్రితమే ఇక్కడ జన్మించి ఉన్నవారైనప్పటికీ, సాటి భారతీయుల్లా హిందువులలో కలిసిపోయి జీవిస్తూ ఉన్నప్పటికీ – ‘పాకిస్తాన్ వెళ్లిపోండి...’ అని వారికి ఎప్పుడూ చెబుతూ ఉంటాం. మన రాజకీయ నాయకులు వారిని బహిరంగంగా దూషిస్తుంటారు. వారి ఇళ్లను పోలీసులు చట్ట బద్ధం కాని పద్ధతుల్లో కూలగొడుతుంటారు. శ్రీరామనవమి సంద ర్భంగా మనం వారి దుకాణాలను బలవంతంగా మూత వేయిస్తాం. వారిపై ‘లవ్ జిహాద్’ నిందను వేస్తాం. కొన్నిసార్లు వారి గుర్తింపును కూడా తిరస్కరిస్తాం. వారిని హైందవ ముస్లింలుగా వ్యవహరిస్తాం. చెదపురుగులు అని కూడా అంటాం. బ్రిటిషర్లను జాత్యహంకారులు అని కదా మనం తరచూ అంటుంటాం... ఇప్పుడు చెప్పండి, మనకు ఏ విశేషణం సరైనది? మనల్ని మనం ఏమని పిలుచుకోవాలి? సమాధానం చెప్పండి అని నేను మిమ్మల్ని బలవంతం చేయడం లేదు. అలా అడిగితే అది మిమ్మల్ని రెచ్చగొట్టినట్లు అవుతుంది, లేదంటే జవాబు కోసం మొండిపట్టు పట్టినట్లుగా ఉంటుంది. కానీ ఈ ప్రశ్నను నేను కచ్చితంగా లేవ నెత్తుతాను. ఎందుకంటే, మనం మన తోటి పౌరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దాని గురించి ఈ ప్రశ్న మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది అని నా ఆశ. అంతేకాదు, వారిపై మన ప్రవర్తన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే ఆలోచన కూడా రావాలి. కానీ మనలో చాలా మందికి ఈ ప్రభావం అన్నది అసలు ఆలోచించే విషయమే కాదు. కించపరచడం చాలా తేలిక. ఆ పనిని మనం అనా లోచితంగా చేసేస్తుంటాం. అది మనకు ఏ విధంగానూ అసౌకర్యాన్ని కలిగించదు. కానీ ఆ గాయాన్ని భరించడం, గాయంతో జీవించడం అవ తలి వాళ్లకు దుర్భరం అవుతుంది. ఇంకా దారుణం ఏమిటంటే... ఇది తప్ప వేరే ఇల్లు లేదని, ఈ ఇంటి నుంచి తప్పించుకునే వీలు కూడా లేదని నీకు తెలుస్తూ ఉండటం! బ్రిటన్ మారిపోయింది నేను చదువుకున్న బ్రిటన్ కూడా నిస్సందేహంగా ఇందుకు భిన్నమైనదేం కాదు. గోధుమ రంగు చర్మం ఉన్న వారికి అక్కడ నాన్–వైట్స్ అని, నల్ల జాతీయులు అని, నిగ్గర్స్ అని పిలిచేవారు. తెల్లవాళ్లలో కూడా స్థాయిని బట్టి, యాసను బట్టి హెచ్చుతగ్గుల విభజనకు గురయినవాళ్లూ ఉన్నారు. నిన్నెలా చూస్తారన్నది నువ్వెలా మాట్లాడుతున్నావన్న దాన్ని బట్టే అక్కడ ఉంటుంది. కానీ ఈ యాభై ఏళ్లలో బ్రిటన్ మారిపోయింది. పాత దేశం కను మరుగైపోయింది. బాహ్యంగా పూర్వపు అవశేషాలు ఉంటే ఉండొచ్చు. కానీ గుండె లోతుల్లో అయితే బ్రిటన్ పునర్నిర్మాణం జరిగిపోయింది. ఇదే సవాలును మనం ఇప్పుడు భారత్లో ఎదుర్కొంటున్నాం. మన లోపలి అసురులను దాటుకుని మనం పైకి రాగలమా? ఆ అసురులను మనం జయించగలమా? చాలా గణనీయమైన విస్తృతిలో బ్రిటన్ దీనిని సాధించింది. మరి మనం సాధించగలమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసే నాటికి నేను ఉండకపోవచ్చు. మార్పునకు ఒకటో, రెండో జీవితకాలాలు పట్టొచ్చు. ఇప్పటికైతే నేను మనుషుల మధ్య వినిపిస్తున్న ప్రేమరాహిత్య మౌన రాగాన్ని మాత్రమే వినగలుగుతున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సుధామూర్తికి పద్మభూషణ్.. అత్తపై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు
సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రి, విద్యావేత్త సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితురాలే. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే వారు అతి తక్కువమంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సుధామూర్తి ముందువరుసలో ఉంటారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు. కంప్యూటర్ ఇంజనీర్గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్,. గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే పలు అనాథాశ్రయాలను ప్రారంభించిన ఆమె.. గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలందింస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడుతున్నారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తల్లికి దక్కిన గౌరవంపై మురిసిపోతూ ఆమె కూతురు, యూకే ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టారు. రాష్ట్రపతి నుంచి మా అమ్మ పద్మభూషన్ను అందుకుంటున్న క్షణాలను చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యానని అన్నారు. సమాజం కోసం చేసిన సేవకు ఆమెకీ అవార్డు దక్కిందని చెప్పుకొచ్చారు ‘25 సంవత్సరాలుగా స్వచ్చంద సంస్థలను ఏర్పాటు చేసి అక్షరాస్యతను పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలలు నిర్వహిస్తుంది. ఆమె జీవితం నాకొక ఉదాహరణ. ఎలా జీవించాలో తనను చూసి నేర్చకున్నాను. గుర్తింపుకోసం అమ్మ ఎప్పుడూ ఎదురు చూడలేదు. కానీ నిన్న దక్కిన గుర్తింపు ప్రత్యేకం. మా తల్లిదండ్రులు మాకు(తమ్ముడు, నాకు) కష్టపడి పనిచేయడం, మానవత్వం చూపడం, నిస్వార్థంగా జీవించడం వంటి ఎన్నో విలువలు నేర్పించారు’ అంటూ తల్లిపై ప్రేమను చాటుకున్నారు. అక్షతమూర్తి పోస్టుపై అల్లుడు రిషి సునాక్ స్పందించారు. సుధామూర్తి ఘనతను కొనియాడుతూ.. ‘గర్వించదగ్గ రోజు’ అంటూ క్లాప్ ఎమోజీని షేర్ చేశారు. కాగా ఇప్పటికే సుధామూర్తి అందించిన సామాజిక కార్యక్రమాలకుగానూ 2006లో ఆమెను పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Akshata Murty (@akshatamurty_official) -
Rishi Sunak: విదేశీ పర్యటనల కోసం ఏకంగా రూ. 4 కోట్లు
యూకే ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనపై వివాదాలు విమర్శలు వెల్లువలా వస్తునే ఉన్నాయి. తాజగా విదేశీ పర్యటన ఖర్చుల విషయమై మరోసారి వివాదాస్పద వార్తల్లో నిలిచారు. ఆయన విదేశీ పర్యటనల కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బును ఇష్టా రాజ్యంగా ఖర్చు పెట్టారంటూ విపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి. ఈ మేరకు యూకే ప్రధాని రిషి సునాక్ విదేశీ పర్యటనల కోసం కేవలం ప్రైవేట్ జెట్ల కోసమే సుమారు రూ. 4 కోట్ల ఖర్చు పెట్టినట్లు నివేదిక వెల్లడించింది. ఈజిప్టులో జరిగిన కాప్ 27 సదస్సుకు హాజరయ్యేందకు ప్రభుత్తం ప్రైవేట్ జెట్లకు దాదాపు రూ. 96 లక్షలు ఖర్చు చేసింది. ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సుకు సుమారు రూ. 300 లక్షలు ఖర్చుపెట్టింది. అలాగే లాట్వియా నుంచి ఎస్టోనియా పర్యటలనకు రూ. 55 లక్షలు ఖర్చు పెట్టగా, ఆయన వ్యక్తిగత ఖర్చులుగా సుమారు రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. దీంతో ప్రతిపక్ష లిబర్ డెమొక్రాట్ పార్టీ సభ్యులు జీవన వ్యయ సంక్షోభంలో ఇలా ప్రజా ధనాన్ని ఇలా ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తారంటూ ఆగ్రహించారు. ప్రజలు ఒకపక్క పన్నులు చెల్లించలేని దీనస్థితిలో ఉంటే ఇలా దిగ్బ్రాంతికరంగా ఖర్చు చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీనిపై కన్జర్వేటివ్ పార్టీ వ్యాఖ్యనించిదని కూడా ఆరోపణలు చేశాయి. దీంతో లండన్లోని ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ స్పందిస్తూ..ప్రపంచ నాయకులతో కీలక సమావేశాలు కోసం ఇది తప్పదని పేర్కొంది. భద్రత, రక్షణ వాణిజ్యంతో సహా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై చర్చించడానికి ద్వైపాక్షిక పర్యటనలు, శిఖరాగ్ర సమావేశాల సమయంలో ప్రపంచ నాయకులతో కీలక సమావేశాలను నిర్వహించడం ప్రధానమంత్రి పాత్రలో ఒక భాగమని తేల్చి చెప్పింది. అలాంటి వాటికి కోసం ప్రధాని హోదాలో ఖర్చు చేయక తప్పదని కూడా డౌన్ స్ట్రీట్ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా, ఇటీవల రిషి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఓ కొత్త పాలసీపై విపక్షాలు ఇప్పటికే మండిపడుతున్నాయి. తన భార్య అక్షతా మూర్తి వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ నూతన విధానాన్ని తీసుకొచ్చారంటూ రిషిపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: హిందూ ఫోబియాని ఖండించే తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్రంగా జార్జియా!) -
టి20 ఛాంపియన్స్తో క్రికెట్ ఆడిన బ్రిటన్ ప్రధాని
-
ఇంగ్లండ్ క్రికెటర్ వలలో చిక్కుకున్న బ్రిటన్ ప్రధాని!
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన చర్యతో సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారారు. టి20 వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుతో రిషి సునాక్ సరదాగా గడిపారు. తాను నివాసం ఉంటున్న 10 డౌనింగ్ స్ట్రీట్కు ఇంగ్లండ్ ఆటగాళ్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాడు. కెప్టెన్ బట్లర్ సహా సామ్ కరన్, డేవిడ్ మలాన్, ఫిల్ సాల్ట్, టైమల్ మిల్స్, రిచర్డ్ గ్లెసన్, క్రిస్ జోర్డాన్లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని రిషి సునాక్ వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ముందు బ్యాటింగ్లో కవర్ డ్రైవ్తో అలరించిన రిషి సునాక్ ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ వలలో చిక్కుకున్నాడు. జోర్డాన్ బంతిని పుల్ చేయబోయి స్లిప్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బౌలింగ్లో సామ్ కరన్ను క్లీన్బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ సర్రీ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ఇక టి20 ఛాంపియన్స్గా నిలిచిన ఇంగ్లండ్ జట్టును అభినందించడానికి ప్రధాని రిషి సునాక్ తన నివాసానికి ఆహ్వనించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. స్వతహగా క్రికెట్ అభిమాని అయిన రిషి సునాక్ తమ దేశం పొట్టి క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్స్గా అవతరించడంతో వారిని సత్కరించాలని భావించారు. అందుకే ఆటగాళ్లకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. కాగా గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. -
రూల్స్ బ్రేక్, చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని.. పెంపుడు కుక్కతో పార్క్కి వెళ్లి
ప్రముఖులు ఏం చేసినా అవి వైరల్గా మారుతుంటాయి. ఈ అంశంలో దేశాధినేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు నడిచే నడక నుంచి, ప్రవర్తించే తీరు.. ఇలా ప్రతిదీ కెమెరా కంట పడుతుంది. అందుకే వాళ్లు కూడా చాలా జాగ్రత్తలు వహిస్తుంటారు. అయితే ఒక్కోసారి తెలిసో తెలియకో చిన్న చిన్న పోరపాట్లు చేస్తూ వార్తల్లోకెక్కుతుంటారు. ఈ తరహాలోనే ఇటీవల బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వార్తల్లో నిలుస్తున్నారు. మొదట లాక్ డౌన్ చట్టం ఉల్లంఘణ, ఆ తర్వాత కారు సీటు బెల్టు పెట్టుకోనందుకు జరిమానా.. తాజాగా మరోసారి తన పెంపుడు కుక్క వల్ల రూల్స్ను బ్రేక్ చేసి చిక్కుల్లో పడ్డారు రిషి సునాక్. అసలేం జరిగిందంటే.. పెంపుడు కుక్కతో పార్క్కు.. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ లండన్లోని హైడ్ పార్క్కు కాసేపు కాలక్షేపానికి వెళ్లారు. వారి వెంట తెచ్చుకున్న ఓ పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లి ఆ పార్కులో వదిలేశారు. అయితే జంతువుల్ని అలా వదిలేయడం ఆ పార్క్ నిబంధనలకు విరుద్ధం. దీంతో పార్కులోకి వన్య ప్రాణులను బంధించి తీసుకురావాలన్న రూల్ను సునాక్ బ్రేక్ చేశారు. స్వేచ్ఛగా అక్కడ సంచరిస్తోన్న కుక్కను గమనించిన సిబ్బంది వెంటనే ప్రధాని వద్దకు వెళ్లి పార్క్ రూల్స్ను వివరించారు. దీంతో పాటు సునాక్ పెంపుడు కుక్క మెడకు పట్టీ పెట్టి అందించారు. దీనంతటిని ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్గా మారింది. ఇది కాస్తా దేశ వ్యాప్తంగా చర్చకు కారణంగా మారింది. గతంలొ కరోనా మహమ్మారి నిబంధనలు కట్టుదిట్టంగా అమలుచేస్తున్న సమయంలో ప్రధాని రిషి సునాక్ కారులో సీటు బెల్టు పెట్టుకోకుండా ప్రయాణించారు. రూల్స్ బ్రేక్ చేసినందుకు గానూ ఆయనకు ట్రాఫిక్ పోలీసులు 50 పౌండ్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. తాజాగా తన పెంపుడు కుక్క వ్యవహారంతో మరో సారి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. Rishi Breaks Law Walking Dog With No Lead in Royal Parkhttps://t.co/dgjkp0z2kZ pic.twitter.com/hcgr39MHSi — Guido Fawkes (@GuidoFawkes) March 14, 2023 -
ఆస్ట్రేలియాకు అమెరికా సబ్మెరైన్లు
వాషింగ్టన్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల ‘ఆకస్’ కూటమి మరో అడుగు ముందుకేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంత స్వేచ్ఛా, సంరక్షణ కోసం అణు జలాంతర్గాముల ప్రాజెక్ట్పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఈ మూడు దేశాలు ప్రకటించాయి. ఇందుకు సోమవారం అమెరికాలోని శాన్ డీగోలో జరిగిన ఒక కార్యక్రమం వేదికైంది. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ పాల్గొన్నారు. ఆకస్ ఒప్పందంలో అంతర్భాగమైన అణు జలాంతర్గామి ప్రాజెక్టులో భాగంగా ఆ్రస్టేలియాకు అమెరికా 2030దశకం తొలినాళ్లలో దశలవారీగా మూడు అణుఇంథనంతో పనిచేసే జలాంతర్గాములను అందించనుంది. ‘వచ్చే ఐదేళ్లలో అమెరికా జలాంతర్గాముల నిర్మాణ సామర్థ్యం పెంపు, వర్జీనియా శ్రేణి సబ్మెరైన్ల నిర్వహణ కోసం మొత్తంగా 460 కోట్ల డాలర్లు వినియోగిస్తాం. ‘వర్జీనియా’ జలాంతర్గాములతో దశాబ్దకాలం ముందుగానే ఆస్ట్రేలియా జలాంతర సామర్థ్యం ద్విగుణీకృతం అవుతోంది’ అని సునాక్, అల్బనీస్ల సమక్షంలో బైడెన్ ప్రకటించారు. బ్రిటన్ జలాంతర్గామి టెక్నాలజీ, అమెరికా సాంకేతికతల మేలిమి కలయికగా అణుఇంధనంతో నడిచే సంప్రదాయక ఆయుధాలు అమర్చిన జలాంతర్గామి తయారుకాబోతోంది’ అని బైడెన్ చెప్పారు. మూడు దేశాల మైత్రిలో కొత్త అధ్యాయం మొదలైందని ఈ సందర్భంగా అల్బనీస్ వ్యాఖ్యానించారు. హిందూ మహాసముద్రం, పశ్చిమ, మధ్య పసిఫిక్ సముద్రం, దక్షిణ చైనా సముద్రాలు ఉన్న ఇండో–పసిఫిక్ ప్రాంతం భౌగోళికంగా, అంతర్జాతీయ జలరవాణాకు కీలకమైన ప్రాంతం. దక్షిణ చైనా సముద్ర జలాలపై హక్కులు తనకే చెందుతాయని చైనా వాదిస్తుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తెల్సిందే. -
ఇక ఊరుకునేదిలే: రిషి సునాక్
లండన్: అక్రమ వలసదారులను అరికట్టేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా తెచ్చిన కొత్త పథకం(అక్రమ వలసల కట్టడి బిల్లు).. విమర్శలకు తావు ఇస్తోంది. బ్రిటన్లోకి అక్రమంగా ప్రవేశించే వారిని ఆశ్రయం పొందేందుకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని సునాక్ తాజాగా హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు కొత్త చట్టం తీసుకురాగా.. తద్వారా అక్రమ చొరబాట్లను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రభుత్వానికి హక్కు లభించినట్లయ్యింది. అయితే ఈ చట్టంపై ప్రతిపక్షాలు, మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. మీరు చట్టవిరుద్ధంగా ఇక్కడకు వస్తే.. ఆశ్రయం పొందలేరు. ఆధునిక బానిసత్వ రక్షణల నుంచి ప్రయోజనం పొందలేరు. మీరు నకిలీ మానవ హక్కుల దావాలు చేయలేరు. ఇక్కడ ఉండలేరు అంటూ ట్వీట్ చేశారాయన. చట్టవిరుద్ధంగా ఇక్కడికి ప్రవేశించేవాళ్లను అదుపులోకి తీసుకుని.. కొన్ని వారాలలోపు వాళ్లను పంపించేస్తాం. సురక్షితమని భావిస్తే.. వాళ్ల సొంత దేశానికే పంపిస్తాం. కుదరకుంటే రువాండా లాంటి మరో దేశానికి తరలిస్తాం. అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నాసరే మా దేశంలోకి మళ్లీ ప్రవేశించకుండా నిషేధించబడతారు అంటూ హెచ్చరించారాయన. If you come to the UK illegally you will be stopped from making late claims and attempts to frustrate your removal. You will be removed in weeks, either to your own country if it is safe to do so, or to a safe third country like Rwanda. pic.twitter.com/8NFaa4DbwT — Rishi Sunak (@RishiSunak) March 7, 2023 ఇల్లీగల్ మైగ్రేషన్ బిల్లుగా పిలవడబడుతున్న ముసాయిదా చట్టం.. ఇంగ్లీష్ చానెల్ గుండా చిన్నచిన్న బోట్ల ద్వారా అక్రమంగా ప్రవేశించే వాళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది సౌత్ఈస్ట్ ఇంగ్లండ్ గుండా 45 వేలమంది వలసదారులు బ్రిటన్కు చేరుకున్నారు. ఇది గత ఐదేళ్లలుగా పోలిస్తే.. వార్షికంగా 60 శాతం పెరిగిందని నివేదికలు చెప్తున్నాయి. రిషి సునాక్ తీసుకొచ్చిన కొత్త పథకంపై మానవ హక్కుల సంఘాలు, బ్రిటన్ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కొత్త చట్టం వర్కవుట్ అయ్యే అవకాశమే లేదని, అంతర్జాతీయ చట్టాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావొచ్చని ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈచట్టంతో దుర్బల పరిస్థితుల్లో ఉన్న శరణార్థులు బలి పశువులు అవుతారంటూ వాదిస్తున్నాయి మానవ హక్కుల సంఘాలు. మూలాలను ప్రస్తావించిన హోం సెక్రెటరీ ఇదిలా ఉంటే.. బ్రిటన్ హోం కార్యదర్శి Suella Braverman సుయెల్లా బ్రేవర్మాన్(భారత సంతతి).. మంగళవారం కొత్త చట్టాన్ని ప్రకటించారు. అక్రమ వలసల కట్టడి బిల్లు ప్రకారం.. చిన్న చిన్న పడవలపై అక్రమంగా యూకేలోకి వచ్చే వలసదారులను అదుపులోకి తీసుకుని.. వాళ్లను వీలైనంత త్వరగా బయటకు పంపించేస్తారు. ఈ చట్టం చట్టవిరుద్ధమైన వలసలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బలమైన విధానమని బ్రేవర్మాన్ ప్రకటించారు. అంతేకాదు.. బిల్లు గురించి ప్రకటించే సమయంలో ఆమె తన స్వంత వలస మూలాలను కూడా ప్రస్తావించారు. బ్రేవర్మాన్ తండ్రి గోవాకు చెందిన వ్యక్తి, అలాగే తల్లి తమిళ మూలాలున్న వ్యక్తి. ఇప్పుడు.. యూకే ప్రపంచంలోని అత్యంత దుర్బలమైన శరణార్థులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2015 యూకే దాదాపు ఐదులక్షల మందికి పైగా ఆశ్రయం అందించింది. హాంకాంగ్ నుండి 150,000 మంది, ఉక్రెయిన్ నుంచి 1,60,000 మంది ప్రజలు.. అలాగే తాలిబాన్ చెర నుంచి పారిపోయి చేరుకున్న అఫ్ఘన్లు పాతిక వేల మంది దాకా ఉన్నారు. వాస్తవానికి.. నా తల్లిదండ్రులు దశాబ్దాల కిందట ఈ దేశంలో భద్రత, అవకాశాలను కనుగొన్నారు. ఇందుకు నా కుటుంబం ఎప్పటికీ బ్రిటన్కు కృతజ్ఞతలు తెలుపుతుంది అని తెలిపారామె. అయినప్పటికీ.. మన సరిహద్దులను ఉల్లంఘించే అక్రమ వలసదారుల అంశంపై ప్రభుత్వం స్పందించకపోవడం అంటే.. మనల్ని ఎన్నుకున్న ప్రజల అభీష్టానికి ద్రోహం చేసినట్టే అని పేర్కొన్నారామె. కొత్త చట్టం నుంచి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. పద్దెనిమిదేళ్ల లోపు వాళ్లకు అదీ తీవ్రమైన వైద్య పరిస్థితులు ఉన్నవారికి, ప్రాణ హాని ఉన్నవారిని యూకేలోకి అనుమతిస్తారు. -
తప్పు చేయొద్దు! అక్రమ వలసదారులకు రిషి సునాక్ స్ట్రాంగ్ వార్నింగ్
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ అక్రమ వలసదారులను అనుమతించమని ఖరాకండీగా చెప్పేశారు. దేశంలోకి ప్రవేశించే ప్రతి అక్రమ వలసదారుడిని బహిష్కరించడమే గాక ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని కూడా అనుమతించమని స్పష్టం చేశారు. యూరప్ నుంచి సరిహద్దులు దాటి ప్రవేశిస్తున్న అక్రమ వలసదారులకు అడ్డుకట్టవేసేలా కఠిన చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. పడవలపై అక్రమంగా ప్రవేశిస్తున్న వలసదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక రువాండ లేదు సురక్షితమైన మూడో దేశం నుంచి పడవల ద్వారా అక్రమంగా వస్తున్న వలసదారులను బహిష్కరించి, శాశ్వతంగా రాకుండా నిషేధించేలా హోం సెంక్రటరీ బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన అక్రమ వలసదారులను ఉద్దేశిస్తూ.. తప్పు చేయొద్దు, చట్టవిరుద్ధంగా ఇక్కడకు వస్తే మీరు ఉండలేరు. అక్రమ వలసలు నేరమని, పైగా అక్రమంగా ప్రవేశించిన ముఠాలను అనైతిక వ్యాపారాలు కొనసాగించేలా అనుమతించడం సరికాదని బ్రిటీష్ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించారు. అలాగే పడవలను ఆపేస్తానన్న నా వాగ్దానాన్ని కూడా నెరవేర్చాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. సరిహద్దు దాటిని అక్రమ వలసదారులను అనుమతించడానికి, ఆశ్రయం పొందాలన్న యూకేలోని చట్టాలను అనుసరించాలని చెప్పారు. వలసదారుల కేసు విచారణ కోసం ఉన్నప్పుడూ అనుమతిస్తారని, కానీ కొత్త చట్టం ప్రకారం అటువంటి వలసదారులు మొదటి స్థాయిలో ఆశ్రయం పొందకుండా నిరోధిస్తుందని ప్రధాని రిషి సునాక్ చెప్పారు. కాగా, ఫ్రాన్స్ నుంచి యూకేకి ప్రమాదకర స్థాయిలో శరణార్థులు వలస రావడాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. (చదవండి: పాక్లో ఆత్మాహుతి దాడి..తొమ్మిది మంది పోలీసులు మృతి) -
బిల్గేట్స్, రిషితో చాట్జీపీటీ ఆసక్తికర ఇంటర్వ్యూ
లండన్: చాట్జీపీటీ. ప్రపంచమంతటా విశేషంగా ఆదరణ పొందుతున్న కృత్రిమ మేధ ఏఐ) ఆధారిత చాట్బాట్. టెక్ ప్రపంచంలో కొత్త ఒరవడికి నాంది పలికింది చాట్జీపీటీ. సందేహాలు తీర్చుకోవాలన్నా, సంగీత స్వరాలు కూర్చాలన్నా, కవిత్వం రాయాలన్నా, వ్యాసాలు సిద్ధం చేసుకోవాలన్నా, కొత్త ఐడియాలు సృష్టించుకోవాలన్నా, చివరికి ప్రేమలేఖ రాయాలన్నా చలో చాట్జీపీటీ అనే పరిస్థితి! మరి చాట్జీపీటీయే యాంకర్ అవతారమెత్తితే? ఇద్దరు అత్యంత ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తే? అదే జరిగింది! బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్లకు చాట్జీపీటీ పలు ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టింది. చాట్జీపీటీతో తమ ఇంటర్వ్యూను బిల్ గేట్స్ లింక్డ్ఇన్లో షేర్ చేశారు. తమ సంభాషణ అద్భుతంగా సాగిందన్నారు. రిషి మాటలతో వీడియో మొదలైంది. బిల్ గేట్స్, తాను లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో ఉన్నామని, యూకేలో క్లీన్ టెక్నాలజీ రంగంలోని అగ్రశ్రేణి ఆవిష్కర్తలను కలిశామని ఆయన చెప్పారు. తర్వాత గేట్స్ తెరపైకి వచ్చి సంభాషణలో పాలుపంచుకున్నారు. తమను చాట్జీపీటీ ఇంటర్వ్యూ చేయబోతోందని అన్నారు. ఇలా సాగింది... రాబోయే పదేళ్లలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, జాబ్ మార్కెట్పై టెక్నాలజీ ప్రభావం ఏ మేరకు ఉండబోతోందని చాట్జీపీటీ ప్రశ్నించింది. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో నిపుణులైన ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని, మరింత సమర్థులు అవసరమని గేట్స్ బదులిచ్చారు. ఈ విషయంలో కృత్రిమ మేధ వంటి టెక్నాలజీ సహకరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో నైపుణ్యాలున్న మానవ వనరులను తయారు చేసుకోవచ్చన్నారు. అనంతరం, ‘‘కాలచక్రంలో మీరు యువకులుగా ఉన్న రోజుల్లోకి, అంటే మీ కెరీర్ ప్రారంభంలో ఉన్న నాటికి వెళ్తే మీకు మీరు ఎలాంటి సలహా ఇచ్చుకుంటారు?’’ అంటూ చాట్జీపీటీ ఆసక్తికరమైన ప్రశ్న వేసింది. అతిగా ఆలోచించడం మాని వర్తమానంలో జీవించేందుకు మరింతగా ప్రయత్నిస్తామంటూ వారిద్దరూ అంతే ఆసక్తికరంగా సమాధానమిచ్చారు! ‘‘కెరీర్ ఆరంభంలో చాలా ఏళ్ల పాటు వీకెండ్స్, సెలవులంటే నాకు పెద్దగా ఇష్టముండేది కాదు. ఎక్కువగా ఆలోచించేవాన్ని. కష్టపడి పని చేసేవాన్ని. కానీ, అంత అతిగా శ్రమించడం అవసరం లేదని ఇప్పుడు భావిస్తున్నా’’ అని గేట్స్ చెప్పారు. దానితో రిషి కూడా ఏకీభవించారు. ‘‘మాది బ్రిటన్కు వలస వచి్చన కుటుంబం. కనుక బాగా పనిచేసి అన్నింటా ముందంజలో ఉండాలని అప్పట్లో ఎంతో ప్రయతి్నంచేవాడిని. కానీ గతంలోనూ, భవిష్యత్తులోనూ కాకుండా వర్తమానంలోనే జీవించాలని క్రమంగా తెలుసుకున్నా’’ అని చెప్పుకొచ్చారు. -
రిషి సునాక్, బిల్గేట్స్ను ఇంటర్వ్యూ చేసిన చాట్బాట్.. ఏయే ప్రశ్నలు అడిగిందో తెలుసా?
ఇప్పుడు ప్రపంచమంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభంజనమే. అందరూ చాట్బాట్ గురించే చర్చించుకుంటున్నారు. చాట్జీపీటీ వంటి చాట్బాట్లతో మాట్లాడేందుకు ప్రముఖులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏఐ ఆధారిత ప్లాట్ఫారమ్ నుంచి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సాంకేతికత, ఆవిష్కరణలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై తమ అంతరార్థాలను ఆవిష్కరించారు. వీరిని ఇంటర్వ్వూ చేసేందుకు ఈ చాట్బాట్ అధునాతన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్లను ఉపయోగించింది. గతంలో వారిద్దరు చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, పబ్లిక్ స్టేట్మెంట్ల నుంచి ప్రశ్నలను రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారితో సమాధానాలు రాబట్టేందుకు చాలా తెలివిగా ప్రశ్నలు సంధించింది. 10 డౌనింగ్ స్ట్రీట్ అనే యూట్యూబ్ ఛానెల్లో ఈ ఇంటర్వ్వూ వీడియోను పోస్ట్ చేశారు. రాబోయే పదేళ్లలో గ్లోబల్ ఎకానమీ, జాబ్ మార్కెట్పై సాంకేతికత ఎలా ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారు?.. అంటూ ఇంటర్వ్వూను ప్రారంభించిన చాట్బాట్.. ఇద్దరినీ ఆలోచనలను రేకెత్తించే పలు ప్రశ్నలను సంధించింది. దీనికి బిల్గేట్స్ స్పందిస్తూ.. కార్మిక కొరత, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అంశాల్లో ప్రపంచం మరింత పురోగతి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రశ్న అడిగిన చాట్బాట్ను అభినందిస్తూ తాము మరింత సమర్థవంతంగా పనిచేయడంలో ఏఐ సహాయపడుతుందన్నారు. చాట్బాట్ తర్వాతి ప్రశ్న.. ‘మీరు ఇప్పటివరకు స్వీకరించిన అతి ముఖ్యమైన సలహా ఏమిటి, అది మీ వృత్తిని, జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది’.. దీనిపై బిల్స్గేట్, రిషిసునాక్ ఇద్దరూ సమాధానమిచ్చారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అందిన సహకారాన్ని, సలహాలను పంచుకున్నారు. మీ విధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాల్సివస్తే దేన్ని చేయాలని మీరు కోరుకుంటారు అని అడిప్రశ్నకు గేట్స్ సమాధానమిస్తూ.. తాను నోట్స్ తయారు చేసే క్రమంలో డ్రాయింగ్లు, పద్యాలను జోడించడానికి ఏఐ సహాయం తీసుకుంటానన్నారు. ప్రధాని ప్రశ్నోత్తరాల సమయంలో తన తరఫున ఏఐ పాల్గొనడాన్నిఇష్టపడతానని రిషి సునాక్ చెప్పారు. బ్రెగ్జిట్ అనంతరం యూకే ఆర్థిక పరిస్థతి, వృద్ధి, ఆవిష్కరణల కోసం కొత్త అవకాశాలను సృష్టించడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి రిషి సునాక్ను చాట్బాట్ ప్రశ్నించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కొత్త సాంకేతికతలలో పెట్టుబడులు, ఇన్వెస్టర్లు, చిన్న వ్యాపారారులకు మద్దతిచ్చే వ్యవస్థను సృష్టించడం వంటివాటి ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. కోవిడ్ అనంతర ప్రపంచం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, క్లిష్ట సమయాల్లో ఒకరికొకరు ఎలా తోడుగా నిలివాలి వంటి అంశాలను కూడా ఆయన స్పృశించారు. సమాజంలో ఏఐ పాత్ర, వాతావరణ మార్పు, ప్రపంచ ఆరోగ్యం వంటి అత్యంత ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడానికి దీన్ని ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి బిల్ గేట్స్ను అడగ్గా నైతికంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. దీని ప్రయోజనాలు ప్రజలందరికీ అందేలా ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు, పౌర సమాజం మధ్య సహకారం కావాలని పిలుపునిచ్చారు. -
AirIndia Deal: యూకే పీఎం రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచంలోని అగ్ర దేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ సంస్థలతో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కుదుర్చుకున్న ఒప్పందాలపై ఆయా దేశాల అధినేతలు స్పందించారు. బ్రిటన్కు చెందిన రోల్స్ రాయిస్, ఎయిరిండియా మధ్య జరిగిన డీల్ ఓ మైలురాయిలా నిలిచిపోతుందని యూకే ప్రధాని రిషి సుకాక్ అభివర్ణించారు. టాటా నేతృత్వంలోని ఎయిరిండియా అమెరికాకు చెందిన బోయింగ్, ఫ్రాన్స్కు చెందిన ఎయిర్ బస్ సంస్థలతో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. వాటి నుంచి మొత్తం 470 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బ్రిటన్కు చెందిన రోల్స్ రాయిస్ నుంచి కూడా ఎక్స్డబ్ల్యూబీ ఇంజిన్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు లింక్డ్ఇన్లో చేసిన పోస్టులో రిషి సునాక్.. ఎయిరిండియా, ఎయిర్బస్, రోల్స్రాయిస్ల మధ్య జరిగిన డీల్స్ యూకే ఏరోస్పేస్ రంగానికి హద్దులు లేకుండా చేశాయన్నారు. ఎయిర్బస్ విమానాల రెక్కలను యూకేలోనే తయారు చేస్తుందని, అలాగే ఏ350 ఎయిర్ క్రాఫ్ట్స్కు రోల్స్ రాయిస్ ఎక్స్డబ్ల్యూబీ ఇంజిన్లను సమకూర్చుతుందన్నారు. ఎయిరిండియా డీల్తో యూకే ఏరోస్పేస్ రంగంలో మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. అలాగే 2050 కల్లా భారత్ ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. (ఇదీ చదవండి: బోయింగ్కు హైదరాబాద్ నుంచి తొలి ‘ఫిన్’ డెలివరీ) మరోవైపు ఎయిరిండియా డీల్పై యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మైక్రాన్ కూడా స్పందన తెలియజేశారు. ఎయిరిండియాతో ఒప్పందం అమెరికాలో లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని, అదే సమయంలో ఎయిరిండియాకు ట్రాన్స్పోర్టేషన్ డిమాండ్లు తీరుతాయని వైట్హౌస్ తెలియజేసింది. ఎయిరిండియా-ఎయిర్బస్ ఒప్పందం ఇండియా-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయమని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మైక్రాన్ ట్విటర్ ద్వారా అభిప్రాయపడ్డారు. -
ఏ చర్యలకైనా సిద్ధం!
లండన్: తమ దేశాన్ని భద్రంగా ఉంచేందుకు ఎటువంటి చర్యకైనా వెనుకాడబోమని బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. అట్లాంటిక్ మిత్ర దేశాలతో నిత్యం టచ్లో ఉంటూ, రక్షణపరంగా సన్నద్ధతతో ఉన్నట్లు ఆయన తెలిపారు. సోమవారం ఆయన ఉత్తర ఇంగ్లండ్లోని ఓ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రజలు గ్రహించాలని కోరారు. తమ దేశ గగనతలాన్ని కాపాడుకునేందుకు టైఫూన్ యుద్ధ విమానాలను అప్రమత్తంగా ఉంచామన్నారు. అనుమానిత చైనా నిఘా బెలూన్లను అమెరికా సైన్యం కూల్చివేయడం, యూకేకు కూడా బెలూన్ల బెడద ఉందన్న వార్తలపై రిషి పై విధంగా స్పందించారు. -
రష్యా యుద్ధంలో ఓడిపోతుంది.. జెలెన్స్కీ జోస్యం
లండన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం ఆకస్మికంగా బ్రిటన్ పర్యటనకు వచ్చారు. పార్లమెంటునుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత ఆయన బ్రిటన్కు రావడం ఇదే తొలిసారి. ఈ యుద్ధంలో రష్యా ఓడిపోతుందని జెలెన్స్కీ జోస్యం చెప్పారు. యుద్ధం మొదలైన మొదటి రోజు నుంచి తమకు అండదండగా ఉన్న బ్రిటన్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘ధైర్యసాహసాలు కలిగి ఉన్న మా సైనికుల తరఫున నేను మీ ఎదుట నిలబడి ఉన్నాను. ప్రస్తుతం మా సైన్యం శతఘ్నుల కాల్పుల మధ్య పోరాటం చేస్తోంది’’ అని జెలెన్స్కీ వెస్ట్మినిస్టర్ హాలులో సమావేశమైన బ్రిటన్ ప్రజాప్రతినిధుల సమక్షంలో చెప్పారు. అంతకు ముందు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్కి అన్ని విధాలా అండగా ఉంటామని సునాక్ స్పష్టం చేశారు. -
కత్తిమీద సాములా భయపెట్టిస్తున్నా.. కర్తవ్యంగా స్వీకరిస్తున్నా! రిషి సునాక్
బ్రిటన్ ప్రధానిగా అత్యున్నత పదవిని అలంకరించిన రిషి సునాక్ తన ప్రధాని పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్యోగం తనకు కత్తిమీద సాములాంటిదే అయినా దీన్ని తన కర్తవ్యంగా భావించి సమర్ధవంతంగా చేస్తానని చెప్పారు. ఈ మేరకు మీడియా సమావేశంలో భారత సంతతి వ్యక్తిగా ఈ పదవిని చేపట్టి సరిగ్గా వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా రిషి సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఈ బాధ్యతలను చాలా వైవిధ్యంగా పూర్తి చేయగలనని చెప్పారు. హిందూమతంలో ఉన్న 'ధర్మం' అనే భావన తనకు ప్రేరణ అని, అదే ఈ పదవిని తన కర్తవ్యంగా మారుస్తుందని చెప్పుకొచ్చారు. అదే తనకు ప్రజలు ఆశించిన విధంగా పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. అలాగే తాను సేవను ప్రగాఢంగా విశ్వశిస్తునని తెలిపారు. అందుకే ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులు గురించి తెలిసినా..ముందుకు వచ్చానని చెప్పారు. తన భార్య అక్షతామూర్తి గురించి కూడా ప్రస్తావించారు. ఆమెకు తాను ఎలా ప్రపోజ్ చేసింది, ఆమె తనకిస్తున్న సపోర్టు గురించి కూడా మాట్లాడారు. అలాగే ఆయన ఆదాయ వివరాలు గురించి ప్రశ్నించగా.. ఎప్పటిలానే మౌనం వహించారు. అదే సమయలో పన్ను రిటర్న్లకు సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలను పారదర్శకంగా ఉంచడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలిపారు. వేతనం విషయమై ప్రభుత్వ రంగ ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకత గురించి ప్రస్తావించగా..తాను నర్సులకు భారీ వేతనం పెంచేందుకు ఇష్టపడతానని చెప్పారు. కానీ అలా చేస్తే ద్రవ్యోల్బణం పెరుతుందని అందువల్ల తాను చేయలేనని కూడా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనాదరణ పొందకపోయినా పర్వాలేదు గానీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా దేశానికి దిశా నిర్దేశం చేయడమే కీలమైన చర్య అని సునాక్ చెప్పారు. (చదవండి: చైనా నిఘా బెలూన్ వ్యవహారం: అంతలోనే అక్కడ మరొకటి!) -
యూకేలో ఉద్యోగుల భారీ సమ్మె
లండన్: యూకేలో దశాబ్ద కాలంలోనే అతిపెద్ద సమ్మె బుధవారం జరిగింది. సుమారు 5 లక్షల మంది ఉపాధ్యాయులు, కాలేజీ లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, రైల్ డ్రైవర్లు విధులను బహిష్కరించారు. ఫలితంగా 85% స్కూళ్లు మూతబడ్డాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో రైళ్లు నిలిచిపోయాయి. నాలుగు దశాబ్దాల్లోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం 10% మించి పోవడంతో అందుకు తగినట్లుగా వేతనాలు పెంచాలంటూ ఆరోగ్య, రవాణా రంగ సిబ్బంది దగ్గర్నుంచి అమెజాన్ వేర్ హౌస్ ఉద్యోగులు, రాయల్ మెయిల్ పోస్టల్ ఉద్యోగుల వరకు సమ్మెలకు దిగుతున్నారు. వేతనాల పెంపు డిమాండ్తో వచ్చే వారంలో విధులు బహిష్కరిస్తామంటూ నర్సులు, అంబులెన్సు సిబ్బంది, పారామెడిక్స్, ఎమర్జెన్సీ, ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే ప్రకటించారు. కాగా, సమ్మెలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని రిషి సునాక్ ఆందోళన వ్యక్తం చేశారు. బదులుగా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు. అయితే, సమస్యలను పరిష్కరించడానికి బదులుగా..కొన్ని రంగాల్లో సమ్మెలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల సంబంధాలు మరింత దెబ్బతింటాయని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. -
సహచర మంత్రి జహావిపై సునాక్ వేటు
లండన్: పన్నుల వివాదంలో చిక్కుకున్న అధికార కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్, సహచర కేబినెట్ మంత్రి నదీమ్ జహావిని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ మంత్రి మండలి నుంచి తొలగించారు. జహావి పన్ను వ్యవహారాల్లో మంత్రులకుండే నియమనిబంధనల్ని ఉల్లంఘించారంటూ విచారణలో తేలడంతో సునాక్ ఆయనపై వేటు వేశారు. ప్రస్తుతం జహావి శాఖ లేని మంత్రిగా కేబినెట్లో ఉన్నారు. ప్రభుత్వం నియమించిన స్వతంత్ర విచారణ నివేదికను కూడా సునాక్ విడుదల చేశారు. ఇరాక్లో జన్మించిన జహావి ఆర్థిక మంత్రిగా ఉండగా అంతకు ముందు కట్టని పన్నులకు పెనాల్టీగా 50 లక్షల పౌండ్లు చెల్లించారు. ఈ విషయాన్ని దాయడం మినీస్టిరియల్ కోడ్ను ఉల్లంఘించడమేనని విచారణ నివేదిక తేల్చి చెప్పింది. -
సీట్ బెల్ట్ వివాదం.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు జరిమానా
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. కారులో సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణించినందుకు 100 పౌండ్ల ఫైన్ విధించినట్లు లంకాషైర్ పోలీసులు తెలిపారు. కాగా కారులో ప్రయాణిస్తున్న రిషి సునాక్ ఓ ప్రచార కార్యక్రమం కోసం సీటు బెల్టు తొలగించి వీడియో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివాదం రాజుకుంది. ప్రధాని అయ్యి ఉండి నిబంధనలు ఉల్లంఘించారంటూ రిషిసునాక్పై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రిషి సునాక్ బ్రిటన్ ప్రజలకు క్షమాపణలు తెలియజేశారు. సీటుబెల్ట్ ధరించకుండా ప్రయాణించడం తప్పేనని ఒప్పుకున్నారు. ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని కోరారు. అయితే యూకే చట్టాల ప్రకారం బ్రిటన్లో కారులో ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాల్సి ఉంటుంది. అత్యవసర వైద్యం పొందాల్సిన వ్యక్తి మినహా ప్రతీఒక్కరూ సీటు బెల్టు ధరించాల్సిందే. లేదంటూ డ్రైవర్లు, ప్రయాణీకులకు భారీగా జరిమానా విధిస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండే అక్కడికక్కడే 100 పౌండ్లు జరిమానా చెల్లించాలి. వ్యవహారం కోర్టుకు చేరితే 500 పౌండ్ల వరకు జరిమానా పెరిగే అవకాశం ఉంటుంది. చదవండి: గోడపై మూత్రం పోస్తే చింది మీదనే పడుతుంది Apologies for not wearing a seatbelt, but I thought that rule only applied to other people and not to us. You know, like all the other rules.#LevellingUpFundpic.twitter.com/ZzFmiHcgFL — Parody Rishi Sunak (@Parody_PM) January 19, 2023 -
బ్రిటన్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. కారులో ప్రయాణిస్తూ సీటు బెల్టు ధరించనందుకు తీవ్ర విమర్శలు రావడంతో ఆయన ఈమేరకు స్పందించారు. రిషి అధికార ప్రధినిధి జేమీ డేవిస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ ప్రచార కార్యక్రమం కోసం వీడియో చిత్రీకరిస్తుండగా రిషి సునాక్ కారులో వెనకాల కూర్చొని మాట్లాడారు. ఈ సమయంలో ఆయన సీటు బెల్టు ధరించలేదు. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని అయి ఉండి రూల్స్ పాటించకపోవడంపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో రిషి తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు. గతంలో కరోనా ఆంక్షల సమయంలో కూడా రిషి నిబంధనలు అతిక్రమించారు. పోలీసులు అందుకు జరిమానా కూడా విధించారు. అప్పుడు కూడా ప్రజల ఆగ్రహానికి గురై విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోమారు ఇరకాటంలో పడ్డారు. దీన్నే అవకాశంగా తీసుకున్న ప్రతిపక్ష లేబర్ పార్టీ రిషిపై విమర్శలతో విరుచుకుపడింది. గతంలో ఓసారి ఆయన కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డును ఉపయోగించేందుకు ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేసింది. 'రిషి సునాక్కు సీటు బెల్టు పెట్టుకోవడం రాదు. డెబిట్ కార్డు ఉపయోగించడం రాదు. రైలు సేవలు, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా తెలియదు' అని లేబర్ పార్టీ ఎద్దేవా చేసింది. చదవండి: బాప్రే!..పాత సామాన్లు అమ్ముకున్న ఎలాన్ మస్క్, ఏ వస్తువు ఎంత ధర పలికిందంటే -
మోదీపై డాక్యుమెంటరీ దుమారం! రిషి సునాక్ స్పందన
న్యూఢిల్లీ/లండన్: భారత ప్రధాని నరేంద్ర మోదీపై.. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తీసిన ఓ డాక్యుమెంటరీ పెను దుమారాన్ని రేపుతోంది. ‘ఇండియా ది మోదీ క్వశ్చన్’ పేరుతో రెండు పార్ట్ల సిరీస్గా డాక్యుమెంటరినీ రూపొందించింది బీబీసీ. అయితే ఈ సిరీస్పై భారత ప్రభుత్వం, మరోవైపు ప్రవాస భారతీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. డాక్యుమెంటరీ.. దానిని రూపొందించిన ఏజెన్సీకి ప్రతిబింబంగా ఉంది. అపఖ్యాతి పాలుజేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రచార భాగం అని మేము భావిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. పక్షపాతం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద మనస్తత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి చేష్టలను గౌరవించలేం అని బాగ్చీ పేర్కొన్నారు. ఈ సిరీస్ను ప్రసారం చేయడంలో ఎజెండా ఏమిటని బీబీసీని నిలదీశారు. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ (BBC) మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002 అలర్లకు సంబంధించిన మోదీ పాత్ర అంటూ డాక్యుమెంటరీలో హైలైట్ చేసింది బీబీసీ. ఆ టైంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ విమర్శలు గుప్పించింది. మోదీ, భారతదేశంలోని ముస్లిం మైనారిటీల మధ్య ఉద్రిక్తతలను పరిశీలించడం, వెయ్యి మంది వరకు మరణించిన గుజరాత్ 2002 అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర గురించి వాదనలను పరిశీలించడం లాంటి ఉద్దేశాలను ప్రముఖంగా చూపించడంతో.. దుమారం మొదలైంది. భారత సంతతి మండిపాటు అపఖ్యాతిపాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని బీబీసీని భారత ప్రభుత్వం దుయ్యబట్టింది. బ్రిటన్లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. మరోవైపు భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనోభావాలను బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు. వలసవాద ఆలోచనా ధోరణిని ప్రతిబింబించే డాక్యుమెంటరీ అంటూ బీజేపీ శ్రేణులు సైతం మండిపడుతున్నాయి. రిషి సునాక్ స్పందన మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పార్లమెంట్లో స్పందించారు. పాక్ సంతతికి చెందిన ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ బ్రిటన్ పార్లమెంట్లో ఈ డాక్యుమెంటరీపై మాట్లాడుతూ.. మోదీపై విమర్శలు గుప్పించారు. అయితే.. హుస్సేన్కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి మద్ధతుగా స్పందించారు. ‘‘దీనిపై UK ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. దీర్ఘకాలంగా ఉన్న ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. అలాగని ఎక్కడైనా హింసను సహించబోం.’’ అంటూ రిషి సునాక్ పాక్ సంతతి ఎంపీ నోరు మూయించారు. UK PM #RishiSunak dismisses Pak-origin #British MP's statement about #PMModi's leadership during 2002 Gujarat riot over BBC documentary#Pakistan #NewsUpdate #ModiGovt @PMModiNews @rishisunakmp1 @PMModiArmy #RIOT @PmModiFanClub1 @rishisunak_66 Video Credit: @kapilkumaron pic.twitter.com/uFhN8gOTMw — News9 (@News9Tweets) January 19, 2023 ఆ కామెంట్లపై అభ్యంతరాలు ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని, అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నలు తలెత్తుతోంది. పైగా అది ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని, దానిపైన ఇప్పుడు ఎందుకు స్పందించాలని, జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని బీబీసీ ఎలా ప్రసారం చేసిందని అభ్యంతరాలతో ఏకిపడేస్తున్నారు కొందరు. గుజరాత్ అల్లర్ల నేపథ్యం 2002 ఫిబ్రవరి నెలలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలులో కరసేవకులు ఉన్న బోగీకి గోద్రా రైల్వేస్టేషన్ లో నిప్పు పెట్టడంతో 59 మంది చనిపోయారు. ఈ ఘటనతో గుజరాత్ వ్యాప్తంగా హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తాయి. మూడు నెలల పాటు గుజరాత్ రాష్ట్రం అట్టుడికింది. ఈ ఘర్షణలో వెయ్యి మరణించారు. ఆ సమయంలో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారు. అయితే ఈ అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్ 2012లో ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్లలో ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పింది. కొంతమంది మాత్రం నరేంద్రమోదీ పాత్ర ఉందని తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడించింది. ఇక తీస్తా సెతల్వాడ్ అనే హక్కుల కార్యకర్త నరేంద్ర మోదీని తప్పుడు ఆరోపణలతో ఇరికించే ప్రయత్నం చేసినట్లు తేలింది. దీనికి కాంగ్రెస్ పార్టీ, దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కిందటి ఏడాది.. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గతంలో హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఆ హింసాకాండలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు అర్హత లేనిదిగా పేర్కొంది కూడా. -
2024లో రిషి గెలుపు కష్టమే!
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో పాటు ఆయన కేబినెట్లోని 15 మంది మంత్రులు 2024 ఎన్నికల్లో గెలవడం కష్టమేనని తాజా సర్వేలో తేలింది. ఈ మేరకు వివరాలను ది ఇండిపెండెంట్ వెల్లడించింది. రిషి, డిప్యూటీ పీఎం డొమినిక్ రాబ్, ఆరోగ్య మంత్రి స్టీవ్ బార్క్లేతో పాటు అధికార కన్జర్వేటివ్ పార్టీలోని సీనియర్ సభ్యులకు ఓటమి గండముందని ఒక్కో సీటుకు వేర్వేరుగా చేపట్టిన ఫోకల్డేటా పోలింగ్లో వెల్లడైంది. బెస్ట్ ఫర్ బ్రిటన్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. రిషి కేబినెట్లో జెరెమీ హంట్, సుయెల్లా బ్రేవర్మన్, మైకేల్ గోవ్, నదీమ్ జహావీ, కేమీ బడెనోక్ మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. రిషి కేబినెట్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుందని ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవోమి స్మిత్ చెప్పారు. అయితే తమ సర్వేలో ఓటెవరికో చెప్పలేని వారు ఎక్కువగా ఉన్నారని ఆయనన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు కన్జర్వేటివ్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఫలితం వేరుగా ఉంటుందని తెలిపారు. -
బ్రిటన్ విద్యార్థులు 18 ఏళ్లొచ్చేదాకా... గణితం నేర్వాల్సిందే: రిషి
లండన్: బ్రిటన్ విద్యార్థులకు 18 ఏళ్లు వచ్చేదాకా గణిత బోధన ఖచ్చితంగా ఉండాలని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. ‘ 18 ఏళ్లు వచ్చేవరకు ప్రతి ఏటా గణితం చదవాల్సిందేననే నిబంధన బ్రిటన్లో ఇన్నాళ్లూ లేదు. ఇకపై అలా కుదరదు. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రపంచంలో ఏ ఉద్యోగం చూసినా డేటా, గణాంకాలతో ముడిపడి ఉంది. విద్యా వ్యవస్థకు గణితమే ప్రధాన భూమిక. అలాంటి విభాగంలో బ్రిటన్ విద్యార్థులు వెనుకంజ వేయొద్దు. గణితం నేర్వాల్సిందే’ అని కొత్త ఏడాదిలో చేసిన తొలి ప్రసంగంలో సునాక్ స్పష్టంచేశారు. గణితం బోధనను తప్పనిసరి చేసేలా నిబంధనలను మార్చుతామని ప్రధాని చెప్పారని ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, బ్రిటన్లో చాన్నాళ్లుగా గణిత బోధకుల తీవ్ర కొరత ఉందని ది అసోసియేషన్ ఆఫ్ స్కూల్, కాలేజ్ లీడర్స్ తెలిపింది. -
2023లో సమస్యలతో సావాసమే: సునాక్
లండన్: బ్రిటన్వాసులకు ప్రధాని రిషి సునాక్ తన న్యూ ఇయర్ సందేశంలో చేదు వార్త విన్పించారు. దేశాన్ని వేధిస్తున్న పెను సమస్యలు 2023లో పూర్తిగా పరిష్కారం కాబోవని స్పష్టం చేశారు. ‘‘నేనలాంటి డొల్ల మాటలు చెప్పబోను. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఆర్థికంగా బ్రిటన్తో పాటు ప్రపంచం వెన్ను విరిచింది. రుణ భారాన్ని అదుపులోకి తెచ్చే క్రమంలో కఠినమే అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు. -
నేను నటించదల్చుకోలేదు.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కొత్త సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించిన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిని యూకేకు కష్టకాలంగా అభివర్ణించిన ఆయన.. సమస్యలు ఇంకా తీరిపోలేదని, వచ్చే ఏడాదిలో అవి కొనసాగుతాయనే పేర్కొన్నారు. నేను నటించదల్చుకోలేదు. అందుకే కొత్త ఏడాదిలో మన సమస్యలన్నీ తీరిపోతాయని మిమ్మల్ని మభ్యపెట్టను. కానీ, 2023 ప్రపంచ వేదికపై అత్యుత్తమ ప్రదర్శనకు బ్రిటన్కు ఒక అవకాశం ఇస్తుందని చెప్పగలను. ఉక్రెయిన్ యుద్ధం.. బ్రిటన్ ముందున్న అతిపెద్ద సవాల్. కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో.. రష్యా ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగింది. ఈ యుద్ధం బ్రిటన్తో పాటు యావత్ ప్రపంచంపై ఆర్థికంగా ప్రభావం చూపెట్టింది. బ్రిటన్ సైతం ఆ ప్రతికూలత నుంచి కోలుకోలేకపోయింది. ఇక్కడి పౌరులపై ఆ ప్రభావం పడిందనే అనుకుంటున్నా. అందుకే ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు సిద్ధపడిందని తెలిపారు. అయినప్పటికీ.. అవి సహేతుకంగా ఉన్నాయని భావిస్తున్నాని చెప్పారాయన. మూడు నెలల కిందట.. ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి విరామం లేకుండా పని చేస్తున్నామని, అందులో భాగంగానే జాతీయ వైద్య సేవలను పునరుద్ధరించే పనులు వేగం పుంజుకుందని రిషి సునాక్ తెలిపారు. అలాగే.. అక్రమ వలసలను సైతం అడ్డుకుంటున్నామని, ప్రత్యేకించి నేరగాళ్లపై ప్రత్యేక నజర్ పెట్టామని తెలిపారాయన. రాబోయే రోజుల్లోనూ ఉక్రెయిన్కు తమ మద్ధతు కొనసాగుతుందని ప్రకటించిన రిషి సునాక్.. బ్రిటన్ను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు యత్నిస్తామని పేర్కొన్నారు. 2023 will have its challenges, but the government I lead will always put your priorities first. My New Year message 👇 pic.twitter.com/KatjfHHjty — Rishi Sunak (@RishiSunak) December 31, 2022 -
Rishi Sunak: ఓటమి భయంతో..
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్పై అధికార కన్జర్వేటివ్ పార్టీలో నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన అధినాయకత్వంలో తిరిగి గెలుస్తామన్న ధీమా లేకపోవడంతో.. చట్ట సభ్యులంతా ఆందోళనతో గందరగోళానికి తెర తీస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందుతామనే ఆందోళనలో కూరుకుపోయారు కన్జర్వేటివ్ సభ్యులు చాలామంది. ఈ నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారట చాలామంది. అంతేకాదు.. మరికొందరైతే వేరే చోట్ల పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పావులు కదుపుతున్నట్లు సమాచారం. రిషి సునాక్ నేతృత్వంలో ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం చాలా కొద్ది మందిలోనే నెలకొన్నట్లు పార్టీ అంతర్గత సమావేశాలు, పోల్స్ ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామాలపై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత స్పందిస్తూ.. బహుశా ఎంపీలు హెలికాప్టర్లలో తమ తమ నియోజకవర్గాలను వెతుక్కుంటే బావుంటేదేమో అంటూ చమత్కరించారు. 90వ దశకంలో టోనీ బ్లేయర్ నేతృత్వంలోని ప్రతిపక్ష లేబర్ పార్టీ.. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఓడిపోకుండా ఉండేందుకు సురక్షితమైన స్థానాల్లో పోటీ కోసం చేసిన ప్రయత్నాలను చికెన్ రన్గా అభివర్ణించాయి. అంటే కోళ్లు పరిగెత్తినట్లు హడావుడిగా తమ తమ సురక్షిత స్థానాల కోసం ఎంపీలు పరుగులు పెట్టారని ఎద్దేవా చేసింది. అప్పటి నుంచి ఆ పదం అలా బ్రిటన్ రాజకీయాల్లో స్థిరపడిపోయింది. -
FIFA World Cup 2022: ఖతర్ను పొగుడుతూ ట్వీట్.. రిషి సునాక్పై విమర్శలు!
లండన్: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్లో మ్యాచ్లు తుది అంకానికి చేరుకుంటున్నాయి. ఏమాత్రం అంచనాలు లేని జట్టు బలమైన జట్లను ఓడించాయి. ఇదిలా ఉంటే..ఫిఫా ప్రపంచకప్పై బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ చేసిన ఓ ట్వీట్ విమర్శలకు దారి తీసింది. 16వ రౌండ్లో సెనెగల్తో ఇంగ్లాండ్ మ్యాచ్కు ముందు ఫిఫా ప్రపంచకప్ను నిర్వహిస్తున్న ఖతర్ను పొగుడుతూ ట్వీట్ చేశారు రిషి సునాక్. ‘ఇప్పటివరకు అద్భుతమైన ప్రపంచకప్ను నిర్వహించినందుకు ఖతార్కు హ్యాట్సాఫ్. గ్రూప్ దశలు ఆల్ టైమ్ గ్రేట్స్లో ఒకటిగా గుర్తుండిపోతాయి. కమాన్ ఇంగ్లాండ్.. మన కలను సజీవంగా కొనసాగించండి.’ అంటూ ట్విట్టర్ వేదికగా ఖతార్పై ప్రశంసలు కురింపించారు. ఆయన ట్వీట్కు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ‘నిజంగానా? ఆల్ టైమ్ గ్రేట్స్? మీరు ఏం చూస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు.’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మరోవైపు.. కొందరు ఇంగ్లాండ్, సెనెగల్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగినట్లు పేర్కొన్నారు. ‘ఎస్ రిషి సునాక్, ఖతర్ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొంత మందికి మాత్రం సమస్యగా ఉన్నా.. చూడదగ్గ ఈవెంట్.’ అంటూ మరొకరు రాసుకొచ్చారు. మరోవైపు.. ఇంగ్లాండ్ గత మ్యాచ్లో విజయం సాధించటంపై ప్రశంసలు కురింపించారు. తాము గతంలో ఎన్నడూ ఇంగ్లాండ్ ఆటను ఈ విధంగా చూడలేదని పేర్కొన్నారు. సెనెగల్పై విజయం సాధించిన ఇంగ్లాండ్.. డిసెంబర్ 11 డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫ్రాన్స్తో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. Hats off to Qatar for hosting an incredible World Cup so far. The group stages will be remembered as one of the all-time greats. Come on @England keep the dream alive 🦁🦁🦁#FIFAWorldCup #ENGSEN pic.twitter.com/YyLv9Y2VjZ — Rishi Sunak (@RishiSunak) December 4, 2022 ఇదీ చదవండి: FIFA World Cup 2022: మరో సంచలనం.. బెల్జియంను ఖంగుతినిపించిన మొరాకో -
బకింగ్హాం ప్యాలెస్ రేసిజం ఉదంతం: నేనూ రేసిజం బాధితున్నే.. రిషి సునాక్
లండన్: జాత్యహంకార భూతం తననూ బాధించిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు. భారత మూలాలున్న ఆయన బ్రిటన్లోనే పుట్టి పెరగడం తెలిసిందే. ‘‘బాల్యంలో, పెరిగి పెద్దవుతున్న దశలో నేను రేసిజాన్ని ఎదుర్కొన్నా. అయితే ఈ సామాజిక సమస్యను ఎదుర్కొనే విషయంలో నాటితో పోలిస్తే బ్రిటన్ ఇప్పుడు ఎంతో ప్రగతి సాధించింది’’ అని అభిప్రాయపడ్డారు. బకింగ్హాం ప్యాలెస్లో తాజాగా రేసిజం ఉదంతం వెలుగులోకి రావడం తెలిసిందే. దివంగత రాణి ఎలిజబెత్ 2 సన్నిహితురాలు, ప్రిన్స్ విలియం గాడ్మదర్ లేడీ సుసాన్ హసీ ప్యాలెస్లో పని చేస్తున్న ఒక ఆఫ్రికన్ ఉద్యోగిని పదేపదే ఆమె స్వస్థలం గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. ‘‘నేను బ్రిటిషర్నే అని ఎన్నిసార్లు చెప్పినా ఆఫ్రికాలో ఎక్కడి నుంచి వచ్చానంటూ సుసాన్ నన్ను పదేపదే నిలదీసింది. నా జుట్టును పక్కకు తోసి మరీ నా నేమ్ బ్యాడ్జ్ను పట్టి పట్టి చూసింది. ఇది నన్నెంతో బాధించింది’’ అంటూ సదరు ఉద్యోగి ట్వీట్ చేయడంతో వివాదం రేగింది. చివరికి సుసాన్ క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది చాలా బాధపడాల్సిన విషయమని బకింగ్హాం ప్యాలెస్ పేర్కొంది. జాత్యహంకారానికి బ్రిటిష్ సమాజంలో స్థానం లేదంటూ ప్రిన్స్ విలియం దంపతులు కూడా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రిషి మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. ‘‘రేసిజం ఎక్కడ కన్పించినా తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. దాన్ని తుదముట్టించే దిశగా చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ మెరుగైన భవిష్యత్తు దిశగా సాగాలి’’ అన్నారు. -
భారత్తో స్వేచ్ఛా వాణిజ్యానికి సై: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్
లండన్: భారత్–బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) అమలుకు కట్టుబడి ఉన్నట్లు బ్రిటన్ నూతన ప్రధాని రిషీ సునాక్ మరోమారు స్పష్టంచేశారు. ఒప్పందం వాస్తవరూపం దాల్చేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. విదేశాంగ విధానంపై బ్రిటన్ పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల అతిథులు, ఆర్థిక నిపుణులు పాల్గొనే వార్షిక లండన్ మేయర్ బ్యాంకెట్ కార్యక్రమంలో సోమవారం సునాక్ ప్రసంగించారు. ‘ ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బ్రిటన్ ముందునుంచీ మద్దతు పలుకుతోంది. రాజకీయాల్లోకి రాకమునుపు నేను ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో వ్యాపారం చేశా. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో వ్యాపార అవకాశాలు పుష్కలం. 2050కల్లా ప్రపంచవాణిజ్యంలో సగం వాటాను ఇండో–పసిఫిక్ హస్తగతం చేసుకుంటుంది. అందుకే ఇండో–పసిఫిక్ సమగ్రాభివృద్ధి ఒప్పందం(సీపీటీపీపీ)లో భాగస్వాములం అవుతున్నాం. ఇందులోభాగంగా భారత్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగా అమల్లోకి వచ్చేందుకు కృషిచేస్తున్నాను’ అని సునాక్ అన్నారు. చైనాతో స్వర్ణయుగ శకం ముగిసినట్లే ‘చైనాతో బ్రిటన్ కొనసాగించిన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన స్వర్ణయుగం ముగిసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరిగాక అది సామాజిక, రాజకీయ సంస్కరణలు, సత్సంబంధాలకు దారితీయాలి. కానీ చైనా రాజ్యవిస్తరణవాదం, ఆధిపత్య ధోరణి కారణంగా అవి సాధ్యపడలేదు. చైనాతో బ్రిటన్ అద్భుత వాణిజ్యానికి తెరపడినట్లే’ అన్నారు. -
బ్రిటన్, చైనా మధ్య స్వర్ణయుగం ముగిసింది: రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్లో సోమవారం జరిగిన సమావేశంలో తొలిసారి విదేశాంగ విధానంపై ప్రసంగించారు. బ్రిటన్ చైనా మధ్య స్వర్ణ యుగంగా పిలవబడే సంబంధాలు ముగిశాయని వ్యాఖ్యానించారు. యూకే విలువలు, ఆసక్తులపై చైనా వ్యవస్థాగత సవాలు విసరుతోందని, ఇది మరింత తీవ్రమవుతున్నాయని మండిపడ్డారు. చైనా నిరంకుశ పాలనపట్ల బ్రిటన్ దృక్పథాన్ని అభివృద్ధి పరచాల్సిన సమయమిదని అన్నారు. చైనాలో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని విమర్శించారు. ‘సామాజిక రాజకీయ సంస్కరణలకు దారితీస్తుందనే అమాయక ఆలోచనతో పాటు మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ కాలంలో స్వర్ణయుగంగా పిలవబడిన సంబంధాలు బ్రిటన్, చైనా మధ్య ముగిశాయని స్పష్టం చేస్తున్నాను. మన విలువలు, ఆసక్తులకు వ్యతిరేకంగా డ్రాగన్ దేశం వ్యవస్థాగత సవాలు విసురుతుందని మేము గుర్తించాం. ఇది తీవ్రతరమవుతూ.. మరింత నిరంకుశత్వం వైపు మళ్లుతోంది’ అని అన్నారు. కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్ట్ను చైనా పోలీసులు అరెస్ట్ చేసి దాడి చేసిన ఘటనను ఖండిస్తూ రిషి సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పు వంటి ప్రపంచ వ్యవహారాల్లో చైనా అందించిన ప్రాముఖ్యతను మరచిపోలేదని రిషి సునాక్ తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్తోపాటు అనేక ఇతర దేశాలు కూడా దీనిని అర్థం చేసుకున్నాయని అన్నారు. అలాగే ఉక్రెయిన్కు గత ప్రధానులు బోరిస్, ట్రస్ అందించిన మద్దతును కొనసాగిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఉక్రెయిన్కు సైనిక, మానవతా సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ మిత్రదేశాలతో వాణిజ్యం, భద్రతా సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. చదవండి: మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..! కాగా రిషి సునాక్ చైనాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. ప్రధాని రేసులో ఉన్న సమయంలో కూడా బ్రిటన్తోపాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరిణమించిందంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా నుంచి భారత్ వరకు ఎన్నో దేశాలను చైనా లక్క్ష్యంగా చేసుకుందనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. బ్రిటన్ ప్రధానిగా తాను ఎన్నికైతే డ్రాగన్ దేశం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రణాళికలు తన దగ్గర ఉన్నాయన్నారు. చైనా సాంకేతిక దూకుడుకు ముక్కుతాడు వేసేందుకు నాటో మాదిరి సరికొత్త మిలటరీ వ్యవస్థను రూపొందిస్తానని తెలిపారు ‘జీరో కోవిడ్’ పేరుతో చైనా నాయకత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలను ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని పెద్దపెద్ద నగరాలు, యూనివర్సిటీలలో నిరసనలు చెలరేగుతున్నాయి. షాంఘైలో నిరసనకు దిగిన కొందరు, ‘షీ జిన్పింగ్ దిగిపోవాలి’ అంటూ నినాదాలు చేస్తున్నారు. చైనాలో కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను కవర్ చేస్తున్న సమయంలో బీబీసీ జర్నలిస్టు ఒకరిని పోలీసులు అరెస్టు చేసి కస్టడిలో ఆమెపై దాడి చేసినట్లు తెలిసింది. బీబీజీ ప్రతినిధిపై దాడి ఘటన తీవ్రంగా కలవరపరిచిందని యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ అన్నారు. చదవండి: రిషి తోటలో రూ.12 కోట్ల శిల్పం.. వివాదాస్పదంగా ప్రధాని అధికార నివాసం -
రిషి తోటలో రూ.12 కోట్ల శిల్పం.. వివాదాస్పదంగా ప్రధాని అధికార నివాసం
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ లండన్లోని డౌనింగ్ స్ట్రీట్లోని తన అధికార నివాసం తోటలో దాదాపు రూ.12.83 కోట్ల విలువైన శిల్పాన్ని ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ శిల్పి హెన్రీ మూర్ రూపొందించిన ఈ శిల్పాన్ని గత నెలలో క్రిస్టీ సంస్థ నిర్వహించిన వేలంలో బ్రిటన్ ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వైపు దేశంలో జీవన వ్యయం పెరిగిపోయి, జనం కష్టాలు పడుతున్న వేళ పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును ఇలా ఖర్చు చేయడమేంటంటూ విమర్శలు చుట్టుముడుతున్నాయి. -
బ్రిటన్లోకి విదేశీ విద్యార్థుల వలసల కట్టడికి రిషి స్కెచ్!
లండన్: బ్రిటన్లోకి విదేశీ విద్యార్థుల రూపంలో పోటెత్తుతున్న వలసల కట్టడికి ప్రధాని రిషి సునాక్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దిగువ శ్రేణి డిగ్రీ చదివేందుకు, డిపెండెంట్లుగా ఉండేందుకు వస్తున్న వారందరినీ నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని కార్యాలయ ఉన్నతాధికారి వెల్లడించారని బీబీసీ పేర్కొంది. ‘‘వలసలు బ్రిటన్ను వేధిస్తున్నాయి. 2021లో 1,73,000గా ఉన్న వలసలు ఈ ఏడాది 5,04,000కు పెరిగాయి. విదేశీ విద్యార్థుల్లో చైనాను భారతీయులు వెనక్కినెట్టారు. కానీ వీరిని తగ్గిస్తే ఆ సీట్లను బ్రిటన్ వర్సిటీలు స్థానిక విద్యార్థులకు తక్కువ ఫీజుకే ఇవ్వాల్సి ఉంటుంది. అవి భారీ ఆదాయాన్ని కోల్పోతాయి. ఆదాయం కాపాడుకుంటూ, అంతర్జాతీయ విద్యార్థుల్ని తగ్గించుకోవడం సంక్షిష్టమైన అంశం’’ అని సునాక్ అధికార ప్రతినిధి శుక్రవారం అన్నారు. భారత విద్యార్థులు వీసా ముగిసినా బ్రిటన్లో తిష్ట వేస్తున్నారన్న హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ వ్యాఖ్యలు దీనికి నేపథ్యంగా భావిస్తున్నారు. -
Video: కూచిపూడి డ్యాన్స్తో అలరించిన రిషి సునాక్ కూతురు
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ శుక్రవారం లండన్లో సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. తొమ్మిదేళ్ల అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటోంది. ఈ క్రమంలో రేజ్- ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022లో భాగంగా పలువురు చిన్నారులతో కలిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు. అనౌష్క చేసిన కూచిపూడి నృత్యం అందరిని ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా యూకేలో జరిగే డ్యాన్స్ ఈవెంట్స్లో ఇదే అతిపెద్దది. నాలుగు నుంచి 85 ఏళ్ల వయసున్న దాదాపు వందమంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగీత విద్వంసులు, డ్యాన్సర్స్, వీల్చెయిర్ నృత్యకారులు, పోలాండ్లోని నటరంగ్ గ్రూప్కు చెందిన అంతర్జాతీయ బర్సరీ విద్యార్థులు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ డ్యాన్స్ ఈవెంట్కు రిషి సునక్ తల్లిదండ్రులతో పాటు అనౌష్క తల్లి అక్షతా మూర్తి హాజరయ్యారు. Watch: Rishi Sunak's Daughter Performs Kuchipudi At UK Event https://t.co/cTDhegSN9Y pic.twitter.com/IisEz55stc — NDTV (@ndtv) November 26, 2022 కాగా యూకే ప్రధాని పదవిని చేపట్టిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 42 ఏళ్ల రిషి బ్రిటన్ పగ్గాలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా అవతరించారు. ప్రధాని రిషి సునాక్కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కృష్ణ, అనౌష్క. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు అక్షతామూర్తిని రిషి పెళ్లి చేసుకున్నారు. చదవండి: బాక్సర్తో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్ -
ఉక్రెయిన్కి సాయం అందిస్తాం: రిషి సునాక్
కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రిషి సునాక్ బ్రిటన్ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్లో పర్యటించారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో రష్యా చేస్తున్న దురాక్రమణ యుద్ధంలో ఉక్రెయిన్కి బ్రిటన్ అన్ని విధాలుగా మద్ధతు ఇస్తుందని సునాక్ హామీ ఇచ్చారు. జెలెన్ స్కీ కీవ్ని సందర్శించినందుకు సునాక్కి ధన్యావాదాలు తెలిపారు. అంతేగాదు బ్రిటన్కి స్వాతంత్య్రం కోసం పోరాడటం అంటే ఏమిటో తెలుసునని సునాక్ అన్నారు. అలాగే ఉక్రెయిన్ కోసం పోరాడుతున్న పరాక్రమ యోధులకు సాయం అందిస్తామని వాగ్ధానం చేశారు. పైగా ఉక్రెయిన్ ప్రజలకు కావాల్సిన ఆహారం, ఔషధాలు, అందుబాటులో ఉండేలా బ్రిటన్ మానవతా సహాయాన్ని అందిచడం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ మేరకు జెలెన్స్కీ ట్విట్టర్లో..."ఇరు దేశాలకు స్వాతంత్యం కోసం నిలబడటం తెలుసు. బ్రిటన్ లాంటి స్నేహితులు పక్కన ఉంటే విజయం సాధించడం తధ్యం" అని ధీమగా చెప్పారు. ఇదిలా ఉండగా..సునాక్ ఆగస్టులో ఉక్రెయిన్కి స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖలో రష్యా దూకుడుకి ఎదురు నిలబడి అజేయమైన ధైర్యసాహాసాలో పోరాడుతున్నందుకు ఉక్రెయిన్ని ప్రశంసలతో ముంచెత్తారు సునాక్. నిరంకుశత్వానికి పరాకాష్టగా పోరాటం సాగిస్తున్న వారెవ్వరూ విజయం సాధించలేరంటూ ఒక చక్కటి సందేశాన్ని పంపారు సునాక్. Britain knows what it means to fight for freedom. We are with you all the way @ZelenskyyUa 🇺🇦🇬🇧 Британія знає, що означає боротися за свободу. Ми з вами до кінця @ZelenskyyUa 🇺🇦🇬🇧 pic.twitter.com/HsL8s4Ibqa — Rishi Sunak (@RishiSunak) November 19, 2022 (చదవండి: వందేళ్ల వయసులోనూ విరామమెరుగని వృద్ధ డాక్టర్) -
భారత్తో సాధ్యమైనంత త్వరగా ఎఫ్టీఏ: రిషి సునాక్
లండన్: భారత్తో సాధ్యమైనంత త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదుర్చొనేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. ఈ ఒప్పందంపై చర్చలను త్వరలోనే విజయవంతంగా ముగించాలని భావిస్తున్నామని తెలిపారు. రిషి సునాక్ తాజాగా యూకే పార్లమెంట్ దిగువ సభలో మాట్లాడారు. ఇండోనేషియాలో జీ–20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ఎఫ్టీఏ పురోగతిపై సమీక్షించానని వెల్లడించారు. భారత్తో ఒప్పందాన్ని ఎప్పటిలోగా కుదుర్చుకుంటారో చెప్పాలని ప్రతిపక్ష లేబర్ పార్టీతోపాటు అధికార కన్జర్వేటివ్ ఎంపీలు కోరారు. ఒప్పందంపై ప్రధాని మోదీతో ఇప్పటికే మాట్లాడానని, ఈ విషయంలో భారత్–యూకే మధ్య చర్చలకు సాధ్యమైనంత త్వరగా విజయవంతమైన ముగింపు పలకాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. వాస్తవానికి అక్టోబర్ ఆఖరులోనే ఇరు దేశాల చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. కొన్ని అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సి ఉందని, పరస్పరం సంతృప్తికరమైన పరిష్కారం కనుక్కొంటామన్నారు. భారత్–యూకే బంధం వాణిజ్యానికి పరిమితమైందని కాదని, అంతకంటే విస్తృతమైనదని సునాక్ తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భేటీ..
-
భారతీయులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన సునాక్!
UK-India Young Professionals Scheme: ఇండోనేషియాలో బాలి వేదికగా జరుగుతున్న జీ20 తొలిరోజు సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు ఇరువురు నేతలు ముచ్చంటించారు. అదీగాక సునాక్ ప్రధాని అయ్యాక వారివురు భేటీ అవ్వడం ఇదే తొలిసారి. సమావేశం అనంతరం యూకే ప్రధాని భారత్కి ఒక పెద్ద వీసా స్కీం ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు యూకేలో ఉండి, పనిచేసేలా భారత యువ నిపుణలు కోసం ప్రతి ఏడాది సుమారు 3 వేల వీసాలకు అనుమతిస్తున్నట్లు బ్రిటన్ కార్యాలయం పేర్కొంది. గతేడాది అంగీకరించిన యూకే భారత్ స్వేచ్ఛ వలసల ఒప్పంద(మొబిలిటీ అండ్ మైగ్రేషన్ అగ్రిమెంట్) భాగస్వామ్యన్ని గురించి నొక్కి చెబుతూ ఇటువంటి పథకం కింద ప్రయోజనం పొందిన మొదటి దేశం భారత్ అని బ్రిటన్ ప్రభుత్వ పేర్కొంది. ఈ మేరకు ధృవీకరించిన యూకే యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి, డిగ్రీ చదివిన భారతీయ పౌరులు రెండేళ్ల వరకు యూకేలో ఉండి, పనిచేయడం కోసం 3 వేల వీసాలకు అనుమతిచ్చింది బ్రిటన్. ఈ పథకం ద్వారా భారత్ బ్రిటన్ల ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడం తోపాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సంబంధాలు ఏర్పడటానికి ఉపకరిస్తుందని యూకే ప్రధాని డౌన్ స్ట్రీట్ కార్యాలయం పేర్కొంది. అలాగే ఇండో ఫసిఫిక్ ప్రాంతాల్లో దాదాపు అన్ని దేశాల కంటే యూకే భారత్తోనే ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపింది. అంతేగాక బ్రిటన్లో అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు నాలుగింట ఒక వంతు భారత్కి చెందిన వారు ఉన్నారని అందువల్ల యూకేలోని భారత్ పెట్టుబడితో యూకే అంతటా వారికి సుమారు 9,500 ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందని చెప్పింది. ప్రస్తుతం యూకే భారత్తో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నట్లు బ్రిటన్ వెల్లడించింది. ఒకవేళ ఈ ఒప్పందం ఖరారు అయితే యూరోపియన్ దేశంతో జరుపుకున్న తొలి ఒప్పందం అవుతుందని పేర్కొంది. అదిగాక ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న దాదాపు 24 బిలయిన్ పౌండ్ల వాణిజ్య సంబంధాలను ఈ ఒప్పందం మరింత బలపరుస్తుందని చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశం అయిన భారత్ ఈ ఆర్థిక అవకాశాలను వినియోగించుకునేలా బ్రిటన్తో వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలని బ్రిటన్ ఆకాంక్షిస్తోంది. భారత్తో మొబిటిటీ(స్వేచ్ఛ) భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేలా ఇమ్మిగ్రేషన్ నేరస్తులను తొలగించే సామర్థ్యాన్ని కూడా పటిష్టం చేసుకుంటున్నట్లు బ్రిటీష్ ప్రభుత్వం పేర్కొంది. The British government said that India is the first visa-national country to benefit from such a scheme, highlighting the strength of the UK-India Migration and Mobility Partnership agreed last year.@RishiSunak #UK #India #Visa https://t.co/VWRRWoRvoh pic.twitter.com/oDN1B6jULH — Khaleej Times (@khaleejtimes) November 16, 2022 (చదవండి: జీ20: బైడెన్తో మీట్.. సునాక్తో ముచ్చట్లు.. ఆయనతో షేక్హ్యాండ్) -
బైడెన్తో మీట్.. సునాక్తో ముచ్చట్లు.. ఆయనతో షేక్హ్యాండ్
బాలి: జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అమెరికాతో భారత సంబంధాలపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని మోదీ లోతైన చర్చలు జరిపారు. సమీప భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారనున్న పలు అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానాల వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు పురోగతిని సమీక్షించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపైనా చర్చించారు. జీ 20 సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు మంగళవారం విడిగా సమావేశమయ్యారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపైనా బైడెన్తో మోదీ చర్చించినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘‘క్వాడ్, ఐ2యూ2 తదితర నూతన గ్రూపుల్లో భారత్, అమెరికా సన్నిహిత సంబంధాల పట్ల ఇరువురూ సంతృప్తి వెలిబుచ్చారు. ఇండో–యూఎస్ బంధాన్ని బలోపేతం చేసేందుకు మద్దతుగా నిలుస్తున్నందుకు బైడెన్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది భారత సారథ్యంలో జరిగే 18వ జీ 20 సదస్సు సందర్భంగా కూడా ఈ సహకారం ఇలాగే కొనసాగుతుందని విశ్వాసం వెలిబుచ్చారు’’ అని వివరించింది. ఇరువురి మధ్య ప్రయోజనాత్మక చర్చలు జరిగినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. గత వారం కాంబోడియా రాజధాని నాంఫెన్లో ఆసియాన్ ఇండియా శిఖరాగ్రం సందర్భంగా భారత, అమెరికా విదేశాంగ మంత్రులు చర్చలు జరపడం తెలిసిందే. జిన్పింగ్తో కరచాలనం జీ20 సదస్సు సందర్భంగా బాలిలో మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కరచాలనం చేసుకోవడం దేశాధినేతలతో సహా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇండోనేíషియా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన స్వాగత విందు ఇందుకు వేదికైంది. అటుగా వెళ్తున్న జిన్పింగ్ ఆగి మోదీకి షేక్హ్యాండిచ్చారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ కన్పించారు. అధికారిక భేటీ కూడా ఉంటుందని ప్రచారమైనా అలాంటిదేమీ జరగలేదు. భారత్, చైనా మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు పెరగడం తెలిసిందే. 2020లో గాల్వన్ లోయలో చైనా సైన్యం భారత సైనికులపై దొంగ దెబ్బ తీసి 20 మందికి పైగా పొట్టన పెట్టుకున్న తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. అప్పటినుంచీ మోదీ, జిన్పింగ్ల ముఖాముఖి జరగలేదు. సెప్టెంబర్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ వార్షిక శిఖరాగ్రం సందర్భంగా ఇరువురూ కలుసుకున్నారు. సునాక్తో మోదీ ముచ్చట్లు కొంతకాలంగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. గత నెలలో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై, ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. బాలిలో జీ 20 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించారు. సునాక్ పీఎం అయ్యాక వారిరువురూ భేటీ కావడం ఇదే తొలిసారి. నేతలిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారంటూ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ, ఇతర దేశాధినేతలు, ఐఎంఎఫ్ చీఫ్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు తదితరులతోనూ మోదీ ముచ్చటించారు. రిషి, మాక్రాన్, విడొడొతో బుధవారం ఆయన సుదీర్ఘ చర్చలు జరపనున్నారు. -
Bali G20 Summit: జీ 20 సదస్సుకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ/బాలి: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కొల్జ్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లు కూడా హాజరవనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు. అధ్యక్ష బాధ్యతలు భారత్కు 20 దేశాల కూటమి అయిన జీ 20 18వ సదస్సుకు 2023లో భారత్ అధ్యక్షత వహించనుంది. బాలి సదస్సులో ఇండొనేసియా నుంచి సారథ్య బాధ్యతలను భారత్ అందుకోనుంది. సునాక్తో ప్రత్యేకంగా భేటీ! జీ 20 సదస్సుకు హాజరయ్యే దేశాధినేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. దీంతో అందరి దృష్టి భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో మోదీ భేటీపై ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరి మధ్య భేటీ ఉంటుందో లేదో ఇరుపక్షాలు కూడా స్పష్టం చేయలేదు.