అనంతపురంలో శ్రావణి.. కోరుట్లలో గణేశ్‌..  | students suicide in telugu states | Sakshi
Sakshi News home page

Nov 29 2017 11:07 AM | Updated on Nov 9 2018 4:51 PM

students suicide in telugu states - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి తట్టుకోలేక కొందరు, ఇతర కారణాలతో మరికొందరు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. కారణాలు ఏమైనా నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే చేజేతులా చిదిమేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు విషాదం నింపుతున్నాయి. 

అనంతపురం పట్టణంలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న శ్రావణి(16) ఆత్మహత్య చేసుకుంది. సీవీ రామన్‌ కాలేజీలో చదువుతున్న శ్రావణి.. కాలేజీ హాస్టల్‌లోనే ఉరివేసుకుని తనువు చాలించింది. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య
కోరుట్ల: కరీంనగర్‌ జిల్లా కోరుట్లలో పాలిటెక్నిక్‌ సెకండియర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం కమ్మిపల్లి తండాకు చెందిన గణేష్‌ హాస్టల్‌ గదిలో పురుగులమందు తాగి తనువు చాలించాడు. గణేశ్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమని స్థానికులు భావిస్తున్నారు. తల్లిదండ్రుల వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement