పాట రాసిన గవర్నర్ | Goa Governor pens song for 'Swachh Bharat Abhiyan' | Sakshi
Sakshi News home page

పాట రాసిన గవర్నర్

Published Tue, Dec 29 2015 12:40 PM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

పాట రాసిన గవర్నర్

పాట రాసిన గవర్నర్

పణజి: స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం గోవా గవర్నర్ మృదులా సిన్హా తట్టా, బుట్టానే కాదు పెన్ను కూడా పట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ఓ పాటను రాశారు. ఇప్పుడు ఆ పాటలోని కొన్ని స్లోగన్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ముద్రిస్తున్నారు.

ఈ పాటలో  పరిశుభ్రతకు సంబంధించి స్లోగన్లతో పాటూ విద్యార్థులతో చేయించే ప్రతిజ్ఞ కూడా ఉంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిన ఆవశ్యకతను ఈ పాటలో వివరించారు. పరిశుభ్రంగా ఉండటానికి 'ఏం చేయాలి', 'ఏం చేయకూడదు' లాంటి అంశాలను అందులో ప్రస్తావించారు. కాగా, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రధాని నరేంద్ర మోదీ, మృదులా సిన్హాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement