Goa
-
ఒడిశాపై గోవా గెలుపు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) 2–1 స్కోరుతో ఒడిశా జట్టుపై విజయం సాధించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో గోవా తరఫున బ్రిసన్ డ్యూబెన్ ఫెర్నాండెజ్ 29వ నిమిషంలో గోల్ సాధించి గోవాకు తొలి ఆధిక్యం ఇచ్చాడు. ఒడిశా ఆటగాడు లాల్తతంగ ఖవిహ్రింగ్ (47వ నిమిషంలో) చేసిన సెల్ఫ్ గోల్ గోవా ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. 54వ నిమిషంలో ఒడిశా స్ట్రయికర్ కేపీ రాహుల్ గోల్ చేసినప్పటికీ గోవా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. నిజానికి ఈ మ్యాచ్లో ఒడిశా తమ దాడులకు పదునుపెట్టలేకపోయింది. అవతలివైపు నుంచి గోవా ఎఫ్సీ ఆటగాళ్లు మాత్రం పదేపదే ప్రత్యర్థి గోల్పోస్ట్వైపు దూసుకొచ్చి ఏకంగా 20 షాట్లు కొట్టారు. లక్ష్యంపై ఆరుసార్లు గురిపెట్టగా ఒకసారి గోల్తో విజయవంతమైంది. ఒడిశా 15 షాట్లు ఆడినా... కేవలం ప్రత్యర్థి గోల్పోస్ట్పై రెండే సార్లు దాడి చేసింది. ఇందులో ఒకసారి మాత్రం ఫలితాన్ని సాధించింది. గోవా ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదిలారు. బంతిని ప్రత్యర్థులకంటే తమ ఆధీనంలో ఉంచుకునేందుకు అదేపనిగా చకచకా పాస్లు చేశారు. శుక్రవారం షిల్లాంగ్లో జరిగే పోరులో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ జట్టుతో ముంబై సిటీ ఎఫ్సీ తలపడుతుంది. -
ఈ అమ్మల ఒడికి చేరిన పద్మాలు
పోరాట స్వరం @100పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా లిబియా లోబో సర్దేశాయ్ పేరు వార్తల్లోకి వచ్చింది. నిజానికి లిబియా లోబో సర్దేశాయ్ అనేది ఒక పేరు కాదు. స్వాతంత్య్ర పోరాట స్వరం. గోవా స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన లోబో సర్దేశాయ్ పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడానికి అటవీప్రాంతంలో ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ అనే రేడియో స్టేషన్నిప్రారంభించారు.పద్మశ్రీ (Padma Shri) పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా... పోర్చుగీస్ పాలన నుంచి గోవాకు విముక్తి లభించిన రోజు ఎంత సంతోషంగా ఉన్నానో, ఇప్పుడూ అంతే సంతోషంగా ఉన్నాను’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది గోవా స్వాతంత్య్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దేశాయ్(lobo sardesai).గోవాకు విముక్తి లభించిన రోజున తన సహోద్యోగి, ఆ తర్వాత భర్త వామన్ సర్దేశాయ్తో కలిసి భారత వైమానిక దళం విమానంలో పనాజీ, గోవాలోని ఇతర ప్రాంతాల మీదుగా ప్రయాణించింది. అందులోని రేడియో ట్రాన్సిస్టర్కు లౌడ్ స్పీకర్ అమర్చి పోర్చుగీస్, కొంకిణి భాషల్లో ప్రకటనలు చేసి వారు కరపత్రాలు విసిరారు.‘పోర్చుగీసు వారు లొంగిపోయారు. 451 సంవత్సరాల వలస పాలన తరువాత గోవా స్వాతంత్య్రం పొందింది’ అనేది ఆ ప్రకటనల సారాంశం.‘ఈరోజు కూడా అలాంటి సంతోషమే నాకు కలిగింది. ఇలాంటి క్షణాలు నా జీవితంలో అరుదు. ఈ అవార్డు ఆశ్చర్యకరమైన ఆనందాన్ని కలిగించింది. నేనెప్పుడూ ఊహించలేదు. కోరుకోలేదు. ఈ అవార్డు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని, స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను’ అంటుంది లోబో సర్దేశాయ్. గత ఏడాది మేలో ఆమె శతవసంతాన్ని పూర్తి చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో (lobo sardesai)లోబో సర్దేశాయ్... ఇటాలియన్ యుద్ధ ఖైదీలు రాసిన రహస్య లేఖలను అర్థం చేసుకుంటూ, సెన్సార్ చేస్తూ ట్రాన్స్లేటర్ గా పనిచేసింది. బొంబాయిలోని ఆల్ ఇండియా రేడియోలో స్టెనోగ్రాఫర్, లైబ్రేరియన్గా పనిచేసింది. తరువాత న్యాయవాద వృత్తిలోకి వచ్చింది. కాలేజీలో చదివే రోజుల్లో గోవా జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనేది. విమోచనానంతరం న్యాయవాదిగా ప్రాక్టిస్ చేయడంతో పాటు మహిళా సహకార బ్యాంకును స్థాపించింది. రాష్ట్ర పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన తొలి టూరిజం డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకుంది.ఆమెకు ‘పద్మ’ పురస్కారం ప్రకటించిన సందర్భంగా గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై పణాజీలోని సర్దేశాయ్ నివాసానికి వెళ్లి ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందించి, అభినందించారు. ఆమె మరింతకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సర్దేశాయ్ జీవన గాథను శ్రద్ధగా అధ్యయనం చేసి, దానినుంచి స్ఫూర్తిని పొందవలసిందిగా విద్యార్థులకు సూచించారు. ‘మీరు చెబుతున్నంత గొప్పదాన్నేమీ కాదు, నా మార్గంలోకి ఏమి వచ్చిందో, నేను అదే చేసుకుంటూ పోయాను అంతే’ అని నిండుగా నవ్వారామె. మేలు బొమ్మలు@98‘తోలు బొమ్మలాట’ ఆడిస్తూనే 98 ఏళ్లకు చేరుకున్న భీమవ్వ చిర్నవ్వు నవ్వింది. ఆమెకు ‘పద్మశ్రీ’ ప్రకటించారు. టీవీలు, సినిమాలు, ఓటీటీలు వచ్చినా భారతీయ సంప్రదాయకళను ఏ ప్రయోజనం ఆశించక ఆమె కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ‘పద్మశ్రీ’ ఇస్తే ఆమె చేతి వేళ్లు కదిలి తోలుబొమ్మలు చప్పట్లు కొట్టొచ్చు. కాని నిజమైన చప్పట్లు జనం నుంచి ఆమెకు ఎప్పుడో దక్కాయి. భీమవ్వ లాంటి వాళ్లు రుషులు. పురస్కారాలకే వీరి వల్ల గౌరవం.భక్తులకు పుణ్యక్షేత్రాలు ఉంటాయి. కానీ ‘తోలుబొమ్మలాట’కు ఒక పుణ్యక్షేత్రం ఉందీ అంటే అది కర్నాటకలోని కొప్పల్ జిల్లాలోని ‘మొరనాల’ అనే పల్లెలో ఉన్న భీమవ్వ ఇల్లే. ఆ ఇంట్లో ఎవర్ని కదిలించినా తోలుబొమ్మలాట వచ్చు అని చెబుతారు. భీమవ్వకు ఇప్పుడు 96 సంవత్సరాలు. ఆమె కొడుకు కేశప్ప, మనవలు, మునిమనవలు అందరూ తోలుబొమ్మలాటలో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే వారి వంశం కనీసం రెండు వందల ఏళ్లుగా తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉంది. ‘నేను 14 ఏళ్ల వయసులో తోలుబొమ్మలాట నేర్చుకున్నాను’ అంటుంది భీమవ్వ. ఆమెకు ‘పద్మశ్రీ’ ప్రకటన వచ్చాక ఆమె ఇల్లు, ఊరు మాత్రమే కాదు మొత్తం కొప్పల్ జిల్లా సంబరం చేసుకుంటూ ఉంది. ఎందుకంటే భీమవ్వ ఆట కట్టని పల్లె ఆ జిల్లాలో లేదు. కర్నాటకలో లేదు. భీమవ్వ అందరికీ తెలుసు. ఉత్సవాలకు, జాతర్లకు భీమవ్వ ఆట ఉందంటే జనం బండ్లు కట్టుకుని వచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడూ ఆ ఘనత చెరగలేదు.‘నేను రామాయణ, మహాభారతాలను పొల్లు పోకుండా పాడగలను. భారతంలోని పద్దెనిమిది పర్వాలకూ ఆట కడతాను. అయితే కురుక్షేత్రం, కర్ణ పర్వం, ద్రౌపది వస్త్రాపహరణం, ఆది పర్వం ఇవి ఎక్కువగా చె΄్తాను. జనం వీటిని బాగా అడుగుతారు. రామాయణంలో లవకుశుల కథ చాలామందికి ఇష్టం’ అని చెప్పింది భీమవ్వ.గ్రామీణ కళ, జానపద కళ అయిన తోలుబొమ్మలాటను కర్నాటకలో ‘తొగలు గొంబెయాట’ అంటారు. తెలుగులో ఒకప్పుడు ప్రసిద్ధంగా ఉన్నట్టే కర్నాటకలో కూడా ఈ కళ ప్రసిద్ధం. అయితే భీమవ్వ వంశం దాని కోసం జీవితాలను అంకితం చేసింది. కనుక అక్కడ ఇంకా ఆ ఆట వైభవం కొనసాగుతూ ఉంది. ‘తోలు బొమ్మలాటలో నేనే రాముణ్ణి, సీతను, లక్ష్మణున్ని. అందరి పాటలూ పాడతాను. నా ఆట గొప్పదనం తెలిసిన ప్రపంచ దేశాలు నన్ను పిలిచి ఆట చూపించమన్నాయి. అమెరికా, పారిస్, ఇటలీ, ఇరాన్, ఇరాక్, స్విట్జర్లాండ్ ఈ దేశాలన్నింటికి వెళ్లి తోలుబొమ్మలాట ఆడాను’ అందామె. అదొక్కటే కాదు ఆమె దగ్గర 200 ఏళ్ల కిందటి తోలుబొమ్మలు భద్రపరిచి ఉన్నాయి.శిక్షణ ఇస్తున్నాతనకు తెలిసిన విద్య తన వాళ్లకే అనుకోలేదు భీమవ్వ(Bhimavva). ప్రతి ఏటా కొంతమంది యువతను ఎంపిక చేసి తోలుబొమ్మలాట(puppeteer)లో శిక్షణ ఇస్తుంది. అది నేర్చుకున్నవారు ఆటను కొనసాగిస్తున్నారు. కర్నాటక ప్రభుత్వం ఈ కృషిని గుర్తించి ఎన్నో పురస్కారాలు ఇచ్చింది. జనం భీమవ్వను గుండెల్లో పెట్టుకున్నారు. ‘ఇది మనదైన విద్య. దీనిని పోగొట్టుకోకూడదు. మన గ్రామీణ కళల్లో నీతి ఎంతో ఉంటుంది. మనిషికి నీతి చెప్పడానికైనా ఇలాంటి కళలను కాపాడుకోవాలి’ అంది భీమవ్వ.భీమవ్వ ఎన్నోసార్లు విమానం ఎక్కింది. కాని ఈసారి ఎక్కబోయే విమానం ఆమెను ‘పద్మశ్రీ’ ఇవ్వనుంది. ప్రధాని, కేంద్ర మంత్రులు, పెద్దలు కరతాళధ్వనులు చేస్తుండగా రాష్ట్రపతి చేతుల మీద ఆమె పద్మశ్రీ అందుకుని తోలు బొమ్మల ఆటకు కిరీటం పెట్టనుంది. -
గోవాబీచ్లో, సాయం సంధ్యలో.. మలైకా సన్బాత్
నటి మలైకా అరోరా జీవన శైలి ఫ్యాషన్ తీరు తెన్నుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆశించదగిన వార్డ్రోబ్ కలెక్షన్, ఫ్యాషన్ స్టైల్కు ఫిదా కాని ఫాలోయర్లు, అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తాజాగా గోవాలో హాలిడే ట్రిప్ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో ఇవి నెట్టింట హల్చల్ చేస్తున్నాయిమలైకా అరోరా గోవాలో సేదతీరుతోంది. ఆల్-వైట్ కో-ఆర్డ్ సెట్లో సన్సెట్ టైంలో ఎరుపు పసుపు కలగలిసిన సూర్యాస్తమయ ఛాయలో అందంగా మెరిసింది. నడుము చుట్టూ సెమీ-షీర్ ఆఫ్-షోల్డర్ బ్లౌజ్ ,మెర్మైడ్-ఫిట్ స్కర్ట్తో, బీచ్సైడ్ స్టైల్లో కనిపించింది. ఈ దృశ్యాలు ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేస్తున్నాయి. అంతకుముందు కూడా ఇటీవల సుప్రియా ముంజా డిజైన్ చేసిన ఐవరీ గౌనును ధరించి ఆకట్టుకుంది. మలైకా అరోరా అన్ని సీజన్లలోనూ వైట్ కలర్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. మరో సందర్బంలో వన్షోల్డర్లో గౌన్లో కనిపించి ఫ్యాన్స్ కళ్లను తనవైపు తిప్పుకుంది. వన్ సైడ్ కటౌట్ డిజైన్ ఈ డ్రెస్ హైలైట్. అంతేకాదు మలైకాఅరోరా ఫిట్నెస్కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. యోగాసనాలు, జిమ్లో వర్కౌట్లతో తన బాడీని ఫిట్గా ఉంచుకుంటుంది. ముఖ్యంగా సన్బాత్ తన ఫిట్నెస్ అండ్ సీక్రెట్ అని కూడా చెప్పవచ్చు.సన్బాత్లేలేత సూర్యకిరణాలతో డి విటమిన్ లభిస్తుంది. మితంగా సూర్యరశ్మి మన శరీరానికి తాకేలాగా సూర్యరశ్మి కాంతికి పడుకొని దానిని ఆస్వాదించడాన్ని సన్ బాత్ అంటారు. దీని వల్ల శరీరం చురుగ్గా ఉండేలా చేస్తుంది. సన్ బాత్ రెగ్యులర్గా చేస్తే వృద్ధాప్య ఛాయలు తొందరగా రావు. చర్మంపై ముడతలు మచ్చలు తగ్గిపోతాయి. దీనివల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఒత్తిడి తొలగి, మంచి నిద్ర పడుతుంది. మంచి శక్తి వస్తుంది. ఉదయం వేళల్లోగానీ, సాయం సంధ్యవేళ గానీ సూర్యునికి ఎదురుగా నిలబడి వ్యాయమాలు చేయడం, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.మరోవైపు దాదాపు అయిదేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకున్న లవ్బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా ఇటీవలే బ్రేకప్ చెప్పున్నట్టు ప్రకటించారు. అయితే వీరిద్దరూ ఒకే చోట కనిపించారు. దీంతో ఈ జంట మళ్లీ కలిసిపోయిందా అని పుకార్ల తెర లేచింది. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ దుండగుల కత్తిపోట్లకు గురై, ఆస్పత్రిలో చేరాడు. ఈ సమయంలో సైఫ్ను పరామర్శించేందుకు అర్జున్ కపూర్, మలైకా అరోరా కలిసి రావడం బీటౌన్లో హాట్ టాపిక్గా మారిన సంగతి విదితమే. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) చదవండి: తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?గొంతులో గర గర వేధిస్తోందా? ఈ చిట్కాలతో ఉపశమనం -
గోవాలో హై డిమాండ్ వేటికంటే..
పర్యాటక రంగంలో వృద్ధికి సంబంధించిన ఆందోళనలు ఉన్నప్పటికీ, అధిక నికర ఆస్తులు కలిగిన వ్యక్తులు (HNI), విదేశీ పెట్టుబడిదారులకు గోవా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆసక్తిగా కనిపిస్తోంది. హాలిడే హోమ్లు, స్టేయింగ్ రూమ్లకు డిమాండ్ అధికంగా ఉంది. అధిక అద్దె రాబడి, స్థిరమైన జీవనం సాగించేందుకు చాలామంది గోవాను ఎంచుకుంటున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థలు, డెవలపర్ల ప్రకారం గోవాలోని బ్రాండెడ్ హోటళ్లు, రెంటల్ విల్లాలు పీక్ సీజన్లో పూర్తిగా బుక్ అవుతున్నాయి. ఈ కేటగిరీల్లో పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయని కొనుగోలు దారులు భావిస్తున్నారు. సుస్థిర జీవనానికి ప్రాధాన్యమిచ్చే హెచ్ఎన్ఐలకు గోవా(Goa Realty)లోని పర్యావరణ అనుకూల గేటెడ్ కమ్యూనిటీలు ఆకర్షణీయంగా తోస్తున్నాయి.అంజునా, అర్పోరా, బగా, కలంగుటే, కాండోలిమ్, వాగ్తోర్ వంటి ప్రాంతాలతో సహా గోవా నార్త్ బీచ్ పోర్చుగీస్ పరిసరాలు, ప్రసిద్ధ రెస్టారెంట్లు, హోటళ్లు, బీచ్లకు దగ్గరగా ఉండటం వల్ల గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరుగుదల నమోదు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: క్రికెట్ యాడ్స్ ద్వారా రూ.6,000 కోట్లు టార్గెట్విదేశీ పెట్టుబడిదారులు(foreign funds) తమ పోర్ట్ఫోలియోలను వైవిధ్యంగా విస్తరించడానికి గోవాలోని నాణ్యమైన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హెచ్ఎన్ఐలు అద్దె ఆదాయాన్ని సృష్టించడానికి విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. ఓ విదేశీ సంస్థ గోవాలోని ప్రతిష్టాత్మక హోటల్ను కొనుగోలు చేసే చివరి దశలో ఉంది. యాక్సిస్ ఈకార్ప్ సీఈఓ ఆదిత్య కుష్వాహా మాట్లాడుతూ..‘దేశీయ, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆకర్షణ గోవా రియల్టీ వ్యాపారం మరింత మెరుగుపడేలా చేస్తోంది. స్థిరంగా అద్దె వస్తుండడంతో ఎన్ఆర్ఐ కస్టమర్లు ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు’ అని తెలిపారు. -
గోవా ఘన విజయం
భువనేశ్వర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా ఫుట్బాల్ క్లబ్ ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్లో గోవా 4–2 గోల్స్ తేడాతో ఒడిశాను చిత్తుచేసింది. గోవా జట్టు తరఫున బ్రిసన్ ఫెర్నాండెస్ (8వ, 53వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో విజృంభించగా... ఉదాంత సింగ్ (45+2వ నిమిషంలో), అమెయ్ రణవాడె (56వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. ఒడిశా తరఫున అహ్మద్ (29వ నిమిషంలో), జెరీ (88వ ని.లో) చెరో గోల్ చేశారు. ఓవరాల్గా మ్యాచ్లో ప్రత్యర్థి గోల్ పోస్ట్పై గోవా 7 షాట్స్ ఆడగా... ఒడిశా 5 షాట్లు కొట్టింది. తాజా సీజన్లో 13 మ్యాచ్లాడిన గోవా 7 ఇజయాలు, 2 పరాజయాలతు, 4 ‘డ్రా’లతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఒడిశా 14 మ్యాచ్ల్లో 5 విజయాలు, 4 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 20 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ 2–1 గోల్స్ తేడాతో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్పై గెలుపొందింది. జంషెడ్పూర్ తరఫున జోర్డన్ ముర్రే (84వ నిమిషంలో), మొహమ్మద్ ఉవైస్ (90వ నిమిషంలో) చెరో గోల్ సాధించగా... బెంగళూరు తరఫున అల్బెర్టో నొగురె (19వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్ ఆరంభంలో దూకుడు కనబర్చిన బెంగళూరు 19వ నిమిషంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా జంషెడ్పూర్ వెంటవెంటనే రెండు గోల్స్ చేసి విజయం సాధించింది. ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన బెంగళూరు 8 విజయాలు 3 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 27 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో కొనసాగుతుండగా... జంషెడ్పూర్ 13 మ్యాచ్ల్లో 8 విజయాలు 5 పరాజయాలతో 24 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం జరగనున్న మ్యాచ్లో పంజాబ్ ఫుట్బాల్ క్లబ్తో కేరళ బ్లాస్టర్స్ జట్టు తలపడుతుంది. -
గోవాలో ఏం జరుగుతోంది?.. సీఎం రియాక్షన్ ఇదే!
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అక్కడి పర్యాటకం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గోవాలో పరిస్థితులు మునుపటిలా లేవని.. పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోతూ వస్తోందన్న గణాంకాలను ఆయన కొట్టిపారేశారు. తమ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసేలా తప్పుగా వ్యవహరించొద్దంటూ ఆయన పిలుపు ఇస్తున్నారు. ఇంతకీ గోవాలో ఏం జరుగుతోందంటే.. ఈసారి ఇయర్ ఎండ్లో గోవాకు సందర్శకుల తాకిడే లేకుండా పోయిందని.. హోటల్స్, బీచ్లు బోసిపోయాయని పలు జాతీయ మీడియా ఛానెల్స్ కథనాలు ఇచ్చాయి. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులతో పాటు గోవాలోని పర్యాటకుల జేబులను గుళ్ల చేస్తున్న మాఫియా ముఠాలే అందుకు కారణమని విశ్లేషించాయి కూడా. అయితే..ఈ కథనాలకు మూలం.. కొందరు సోషల్ మీడియా(Social Media) ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన పనేనని తేలింది. అయినప్పటికీ అది పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందనే ఆందోళనలతో సీఎం ప్రమోద్ సావంత్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది.‘‘సోషల్ మీడియాలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఈసారి ఇయర్ ఎండ్ వేడుకులకు గోవాకు పెద్దగా పర్యాటకులెవరూ రాలేదని.. వేరే ప్రాంతాలకు వెళ్లారని పోస్టులు చేశారు. వాళ్లు చేసింది ముమ్మాటికీ తప్పు. గోవా గురించి తప్పుడు సందేశాలు పంపారు వాళ్లు. వాళ్లకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మీరు ఇక్కడికి వచ్చి తీర ప్రాంతాన్ని ఆస్వాదించండి’’ అని సీఎం ప్రమోద్ సావంత్ పిలుపు ఇచ్చారు.అదే సమయంలో గోవా(Goa)లో జరిగే పలు మాఫియాల మీద ఆయన స్పందించారు. గోవాకు వచ్చే పర్యాటకులు ఇక్కడి ప్రాంతాలను ఆస్వాదించాలి. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలి అనుకోవాలి. అంతేగానీ.. చేదు అనుభవాలతో తిరిగి వెళ్లకూడదు. పర్యాటకులతో సవ్యంగా మసులుకోకుంటే.. అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు. అలాగే.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను మోహరించేలా చూస్తామని ప్రకటించారాయన. ‘‘యావత్ దేశం నలుమూలల నుంచి గోవాకు ఇదే మా ఆహ్వానం. నవంబర్, డిసెంబర్, జనవరి.. ఈ మూడు నెలలు గోవాకు ఎంతో కీలకం. రకరకాల పండుగలు, వేడుకలు జరుగుతుంటాయి. వాటి కోసం దేశవిదేశాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఇప్పటికే గోవాలో అన్ని హోటల్స్ నిండుగా ఉన్నాయి. విమానాలు కూడా నిండుగా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో.. కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు అని పేర్కొన్నారాయన.నిజంగానే పడిపోయిందా?చిన్నరాష్ట్రమైన గోవా జనాభా సుమారు 16 లక్షలు. పర్యాటకుల సంఖ్య మాత్రం ఏయేడు కాయేడూ పెరుగుతూనే వస్తోంది. అయితే తాజా గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి.2015లో గోవాను సందర్శించిన పర్యాటకుల సంఖ్య ఐదు లక్షల 20 వేలు2023లో సుమారు 8 లక్షల 50 వేల మంది పర్యటించారు2019లో ఏకంగా 9 లక్షల 40 వేల మంది పర్యటించి రికార్డు క్రియేట్ చేశారు2024 నవంబర్నాటికి ఆ సంఖ్య సుమారు 4 లక్షలుగా ఉంది.*ఓహెర్లాడో గణాంకాల ప్రకారంఒక్కడితో మొదలై.. గోవా టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంపై సోషల్మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తోంది. గోవా మునుపటి ఫ్రెండ్లీ స్పాట్లా లేదని.. పర్యాటకానికి ప్రతికూలంగా మారిందనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ పర్యాటక ప్రాంతాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అదే టైంలో.. గోవాలో మోసాలు ఎక్కువగా జరుగుతాయనే భావన పర్యాటకుల్లో విపరీతంగా పేరుకుపోయిందని చెబుతూ రామానుజ్ ముఖర్జీ అనే ఎంట్రప్రెన్యూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. తప్పుడు గణాంకాలతో అతను పోస్ట్ చేశాడంటూ గోవా పోలీసులు కేసు నమోదు చేశాడు. దీంతో ఆయన మరోసారి స్పందించారు. ఈసారి ఏకంగా సీఎం ప్రమోద్ సావంత్కే ఓ లేఖ రాశారు. విదేశీ పర్యాటకులు గోవాను ఏమాత్రం సురక్షిత ప్రాంతంలా భావించడం లేదని, ట్యాక్సీ సర్వీసుల మొదలు.. లిక్కర్, హోటల్, ఫుడ్, చివరికి చిరువ్యాపారులు సైతం తమను దోపిడీ చేస్తున్నారనుకుంటున్నారని, ఈ పరిస్థితి మారకపోతే రాబోయే రోజుల్లో గోవా పర్యాటకానికి గడ్డు పరిస్థితులు తప్పవని సీఎంకు సూచించాడాతను. అటుపై.. అతనికి మద్ధతుగా ఖాళీ బీచ్లు, హోటల్స్, సెలబ్రేషన్స్ ఫొటోలు పెడుతూ వస్తున్నారు. చదవండి👉🏾: రెస్టారెంట్ సిబ్బందితో గొడవ.. గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య -
గోవాలో తాడేపల్లిగూడెం యువకుడి హత్య
తాడేపల్లిగూడెం: నూతన సంవత్సర వేడుకలను మిత్రులతో సంతోషంగా జరుపుకుందామని గోవా వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాలు.. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్లా రవితేజ(28) హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రవితేజతో పాటు మరో నలుగురు యువకులు, ముగ్గురు యువతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు శనివారం గోవా వెళ్లారు. రెండు రోజుల పాటు గోవాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి.. డిసెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి నార్త్గోవా జిల్లా కలంగూట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక రెస్టారెంట్కు వెళ్లారు. అర్ధరాత్రి అయినందున బిల్లు మీద అధికంగా చెల్లించాలని రెస్టారెంట్ యజమాని డిమాండ్ చేయడంతో.. అక్కడి సిబ్బందికి, రవితేజ స్నేహితులకు మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో తన స్నేహితురాలితో అక్కడి సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించడంతో రవితేజ జోక్యం చేసుకున్నాడు. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది కర్రలతో రవితేజతో పాటు అతని స్నేహితులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వెదురు కర్ర విరిగి గుచ్చుకోవడంతో రవితేజ తలకు తీవ్ర గాయమైంది. మిగిలినవారు స్వల్పంగా గాయపడ్డారు. రవితేజను ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రవితేజ స్నేహితులను విచారించారు. దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. -
గోవాలో దారుణ హత్యకు గురైన రవితేజ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత
-
గోవా టూర్లో బాయ్ ఫ్రెండ్తో హీరోయిన్ తమన్నా (ఫొటోలు)
-
శీతల ప్రయాణం..
కొద్ది రోజుల క్రితం సాధారణ స్థాయిలో ఉన్న విమానయాన ధరలు అమాంతం రెట్టింపయ్యాయి. ముఖ్యంగా డిసెంబర్ 15 నుంచి 31 తేదీల్లో గతంతో పోల్చితే రెండింతలు, మూడింతల మేర పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నగర వాసుల్లో ప్రయాణాల పట్ల ఉన్న ఆసక్తే దీనికి కారణం. కాగా ప్రస్తుత నెలల్లో వరుసగా క్రిస్మస్, ఇయర్ ఎండ్, న్యూఇయర్, సంక్రాంతి వంటి పండుగల నేపథ్యంలో నగరవాసులకు భారీగా సెలవులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ట్రావెలింగ్ మంత్గా డిసెంబర్ను ఎంచుకుంటున్నారు. ప్రతి యేడాదీ డిసెంబర్ నెలలో ఏదో ఒక టూర్ వేయడం అందివచ్చిన సెలవులను వినియోగించుకోవడం నగర వాసులకు అలవాటే. ఇందు కోసం ముందస్తుగానే నగరంలోని ప్రయాణ ప్రేమికులు వారి ప్రయాణ గమ్యస్థానాలకు మార్గాలను సుగమం చేసుకున్నారు. యువత, టెకీలు ట్రావెలింగ్ ప్లాన్స్లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా డొమెస్టిక్ ప్రయాణాలు ఇప్పటికే సోల్డ్ ఔట్ బోర్డ్పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో.కొందరు ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ టెకీలు యేడాదంతా వారి సెలవులను వినియోగించకుండా తమ తమ విధులు నిర్వహిస్తుంటారు. దీంతో పాటు మరికొందరు టెకీలకు, కాల్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ ఉద్యోగులకూ డిసెంబర్ నెలలో భారీగా సెలవులు ఉంటాయి. దీంతో ఆయా సెలవుదినాలను డిసెంబర్ డెస్టినేషన్ కోసమే వినియోగిస్తుంటారు.. నగరంలో విస్తరిస్తున్న ఐటీ ట్రెండ్తో గత కొన్నేళ్లుగా ట్రావెలింగ్ రంగంలోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు మిగిలిపోయిన సెలవులు, మరోవైపు నగరంలోని విదేశాలకు చెందిన గ్లోబల్ కంపెనీల క్రిస్మస్ లీవ్స్ దీనికి ప్రామాణికం అవుతున్నాయి.వీటిని ఎంజాయ్ చేయడానికి ఇప్పటికే యుద్ధప్రాతిపధికన టీమ్ హెడ్లకు మెయిల్స్ పెట్టేయడం, ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించడం, పర్యాటక ప్రాంతాల్లో విడిది, విందు, వినోదం తదితరాలకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇది కొత్తేం కాకపోయినప్పటికీ.. ఈ కల్చర్ ఈ ఏడాది మరింత పుంజుకోవడం విశేషం. సాధారణ రోజుల్లో 4 నేల నుంచి 9 వేల వరకూ ఉండే దేశీయ విమాన చార్జీలు ప్రస్తుతం 14 నుంచి 20 వేలకు పైగా కొనసాగడం ఈ సంస్కృతి ప్రభావానికి నిదర్శనం. కన్యాకుమారి, కేరళ మొదలు.. మనాలి, డార్జిలింగ్ వంటి శీతల ప్రదేశాలకు బయలు దేరుతున్నారు. మరికొందరైతే స్విస్ దేశాలు, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ వంటి విదేశాలకు బుకింగ్లు మొదలెట్టారు. ఏడాదికి వీడ్కోలు.. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పడం, నూతన ఏడాదికి నూతనోత్సాహాన్ని పొందడం కోసం కూడా ట్రావెలింగ్ డెస్టినేషన్లనే ఎంచుకుంటున్నారు ఈ తరం యువత. ఇయర్ ఎండ్ వేడుకలకైతే గోవాలాంటి మ్యూజికల్ నైట్స్ కోసం పరితపిస్తున్నారు నగర వాసులు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు వేసిన కొత్త రైలు సేవలు పొందడానికి ముందస్తుగానే బెర్త్ కరారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యంగా బుక్ చేస్తే ఈ చార్జీలు మరింత పెరిగిపోతాయని ఇప్పటికే చాలా టూర్స్ ప్లానింగ్, బుకింగ్ పూర్తయ్యాయని గూగుల్ చెబుతుంది. ఈ వేదికల్లో అవకాశం లేకపోతే ప్రైవేటు ట్రావెల్స్ను సైతం ఆశ్రయిస్తూ, సెల్ఫ్ డ్రైవింగ్కు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంతో పాటు దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లోని ట్రావెలింగ్ ఏజెన్సీలు, ఈవెంట్ ఆర్గనైజర్లు ముందస్తు పండగలు చేసుకుంటున్నారు.గోవా పార్టీలకు... యేడాది చివరి వేడుకలకు నగర యువత భారీగా ఆసక్తి చూపిస్తోంది. వీరిలో అత్యధికులు వెళ్లే ఏకైక డెస్టినేషన్ మాత్రం గోవానే. ఎందుకంటే..నగర కల్చర్లో భాగంగా పంబ్ పారీ్టలు, లైవ్ కాన్సర్ట్, డీజే మ్యూజిక్ వంటి ట్రెండ్స్ని ఆస్వాదించే వారు, ప్రకృతిని కోరుకునే వారు వేరు వేరుగా ఈస్ట్ గోవా, నార్త్ గోవాలను ఎంచుకుంటారు. తమకు అనుకూలమైన, అనువైన స్పాట్స్ను ముందస్తుగానే ఎంచుకుని అందుకు అనుగునంగా ప్రయాణాలకు టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్లో వైజాగ్, అరకు వ్యాలీ సైతం టాప్లోనే ఉన్నాయి.ఎతైన ప్రదేశాలకు.. ఇప్పటికే ఈ సీజన్లో దక్షిణాది రాష్ట్రాల్లోని కూర్గ్, ఊటీ, మున్నార్, వయనరాడ్, కొడైకెనాల్, ఇడుక్కి, యరక్కాడ్, కున్నూర్ వంటి హిల్ స్టేషన్స్కి భారీగా టికెట్లు బుక్ అయ్యాయని లోకల్ ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నామాట. దీంతోపాటు ఈ మధ్య కాలంలో మనాలి, డార్జిలింగ్, సిమ్లా, షిల్లాంగ్ వంటి చల్లటి ప్రకృతి ప్రాంతాలను ఆస్వాదించడానికి ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ట్రిప్స్లో భాగంగానే నార్త్కు ఎక్కువగా ప్రయాణమవుతున్నారు. అంతేకాకుండా సాంస్కృతిక వైవిధ్యాన్ని తిలకించడానికి కేరళ, ఊటీ వంటి ప్రదేశాలను వారి గమ్యస్థానాలుగా చేర్చుకున్నారు. -
ఎంపీ సంజయ్ సింగ్పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా.. కోర్టు నోటీసులు
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్కు భారీ షాక్ తగిలింది. క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో తన ప్రమేయం ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ సింగ్పై గోవా సీఎం ప్రమాద్ సావంత్ సతీమణి రూ.100కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు సంబంధించి గోవా కోర్టు సంజయ్ సింగ్కు నోటీసులు పంపించింది. పరువు నష్టం దావా కేసుపై జనవరి 10లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రమోద్ సావంత్ భార్య సులక్షణ సావంత్ ఉత్తర గోవాలోని బిచోలిమ్లోని సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ కోర్టులో కేసు వేసినట్లు బీజేపీ అధికార ప్రతినిధి గిరిరాజ్ పాయ్ వెర్నేకర్ తెలిపారు. తాత్కాలిక సివిల్ జడ్జి ఆ పిటిషన్పై విచారణ జరిపిన అనంతరం నోటీసులు జారీ చేసినట్లు వెర్నేకర్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఢిల్లీ మీడియా సమావేశంలో సులక్షణ సావంత్పై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై సులక్షణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. పరువుకు భంగం కలిగేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సంజయ్ సింగ్ తనకు రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తన గురించి సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. -
లవ్ మ్యారేజెస్ తో... స్టార్ హీరోయిన్స్ బిజీ ?
-
గోవాలో ఘనంగా జరిగిన కీర్తిసురేష్ వివాహం
-
హిందూ సంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్,ఆంటోనీల పెళ్లి
హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్ను పెళ్లి చేసుకుంది. గోవా వేదికగా వారిద్దరూ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరుకుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కీర్తి మెడలో ఆంటోనీ మూడుముళ్ల వేయడంతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో కొత్త దంపతులు పంచుకున్నారు.గోవా వేదికగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొందిమంది సన్నిహితులు పాల్గొన్నారు. నూతన వధూవరులను వారందరూ ఆశీర్వదించారు. దీంతో అభిమానులు కూడా వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాది దీపావళి రోజున ఆంటోనీ తాటిల్తో తన ప్రేమ విషయాన్ని కీర్తి సురేశ్ తెలియజేసింది. సౌత్లో బిజీ హీరోయిన్గా ఉన్న ఆమె కెరీర్ పీక్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బేబీ జాన్ మూవీతో ఆమె బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ త్వరలోనే విడుదలకానుంది.కీర్తి సురేష్ పెళ్లిలో పాల్గొన్న వారందరికీ KA అని ముద్రించి ఉన్న హ్యాండ్ బ్యాండ్స్ ఇచ్చారట.. వాటిని ధరించిన వారికి మాత్రమే పెళ్లి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారట. ఆంటోనీతో ప్రేమ, వివాహం గురించి ఇటీవల కీర్తి ఇన్స్టా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఒక ఫొటో విడుదల చేసిన ఆమె.. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనున్నట్లు తెలిపింది. ఆంటోనీ కుటుంబం వ్యాపార రంగంలో రానిస్తుంది. కొచ్చి, చెన్నైలలో వారికి వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కలిసే ఉన్న కీర్తి, ఆంటోనీ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెళ్లితో ఒక్కటిగా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
గోవాలో కీర్తి సురేశ్ పెళ్లి వేడుక.. ఫోటో పంచుకున్న హీరోయిన్!
హీరోయిన్ కీర్తి సురేశ్ వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈనెల 12న తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తటిల్ను పెళ్లాడనుంది. ఇప్పటికే కీర్తి సురేశ్ తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గోవాలో జరగనున్న వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తాజాగా కీర్తి సురేశ్ తన ఇన్స్టా స్టోరీస్లో ఫోటోను షేర్ చేసింది. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులంతా గోవాలో ల్యాండైనట్లు తెలుస్తోంది. కాగా.. 15 ఏళ్లుగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు.రెండు సంప్రదాయాల్లో వివాహం..ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈనెల 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. కాగా.. కీర్తి సురేశ్ ప్రస్తుతం హిందీలో బేబీ జాన్ మూవీతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. -
భారత్లో మొట్టమొదటి ఎయిర్బీఎన్బీ అకాడమీ: ఎక్కడంటే..
గ్లోబల్ హోమ్స్టే అండ్ హోటల్ అగ్రిగేటర్ 'ఎయిర్బీఎన్బీ'.. గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ సహకారంతో.. గోవాలో భారతదేశపు మొట్టమొదటి ఎయిర్బీఎన్బీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అకాడమీని ప్రారంభించింది. హోమ్స్టే టూరిజాన్ని ప్రోత్సహించడానికి.. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని హాస్పిటాలిటీ వ్యాపారవేత్తలలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి కంపెనీ గోవాలోని పర్యాటక శాఖ (DoT) మధ్య ఉన్న అవగాహన ఒప్పందం (MOU)లో భాగంగా ఈ అకాడమీ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే, ఎయిర్బీఎన్బీ ఇండియా జనరల్ మేనేజర్ అమన్ప్రీత్ బజాజ్ పాల్గొన్నారు.కొత్త అకాడమీ ద్వారా.. వ్యక్తులను కంపెనీ హోస్ట్ చేసే ప్రపంచానికి పరిచయం చేయడమే ఎయిర్బీఎన్బీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దీనికోసం కంపెనీ ఇంటరాక్టివ్ వర్క్షాప్ల ద్వారా 25 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. ఉత్తర గోవా నుంచి పాల్గొనేవారి కోసం మిరామార్ రెసిడెన్సీలో మొదటి రౌండ్ వర్క్షాప్లు జరిగాయి. దక్షిణ గోవా నుంచి మరో 25 మంది ట్రైనీలను లక్ష్యంగా చేసుకుని మడ్గావ్లో తదుపరి రౌండ్ శిక్షణలు నిర్వహించనున్నారు.ఎయిర్బీఎన్బీ అకాడమీ ప్రారంభం సందర్భంగా పర్యాటక మంత్రి రోహన్ ఖౌంటే మాట్లాడుతూ.. గోవా సంస్కృతిని సంరక్షించడం ద్వారా పునరుత్పాదక పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో హోమ్స్టే విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ ఒప్పందం గ్రామీణ గోవాకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.ఎయిర్బీఎన్బీతో అవగాహన ఒప్పందం.. ఎంటర్ప్రెన్యూర్షిప్ అకాడమీని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. స్థానిక కమ్యూనిటీలకు సాధికారత కల్పిస్తూనే.. గోవా తన ప్రత్యేక సాంస్కృతిక, సహజ ఆస్తులను ఉపయోగించుకోవడానికి ఈ చొరవ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం గోవా విభిన్నమైన, ప్రామాణికమైన అనుభవాలను ప్రదర్శించడానికి సహాయం చేస్తుందని పేర్కొన్నారు. -
రెండు సంప్రదాయాలను గౌరవిస్తూ కీర్తి సురేష్ పెళ్లి
సినీ తారల ప్రేమ, పెళ్లి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి సీజనే నడుస్తోందని చెప్పవచ్చు. ఇటీవల నటుడు నాగచైతన్య, శోభిత వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగిన విషయం తెలిసిందే. మరుపక్క నటి సమంత బాలీవుడ్కు చెందిన ఓ నటుడి ప్రేమలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇకపోతే కురక్రారుల డ్రీమ్ గర్ల్ కీర్తి సురేష్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న హిందీ చిత్రం బేబీ జాన్తో ఈ అమ్మడు పాన్ ఇండియా కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఇలా కథానాయకిగా ఉన్నత స్థాయిలో రాణిస్తున్న సమయంలోనే కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమవడం చాలామందిని ఆసక్తికి గురిచేసింది. 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తన పాఠశాల స్నేహితుడు ఆంటోనితో ఏడడుగులు నడవడానికి కీర్తి సురేష్ సిద్ధమవుతున్నారు. కాగా తను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి క్రిస్టియన్ మతానికి చెందినవాడు కావడంతో నటి కీర్తి సురేష్ కూడా మతం మారడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే అది నిజం కాదంటూ తమ ప్రేమ, పెళ్లికి మతం సమస్య కాదని ఈ క్రేజీ జంట నిరూపించుకున్నారు. ఆ విధంగా ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వీరి పెళ్లి ఈనెల 12న గోవాలో జరగనుంది. అక్కడ 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. -
కళనే లాభదాయకమైన వృత్తిగా మలిచింది! హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీకే..
గోవా కళాప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహిళ శారదా కేర్కర్. ఆమె యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేసింది. సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో స్పెషలైజేషన్ చేసింది. ఇండియాకి వచ్చి గోవాలో మ్యూజియం ఆఫ్ గోవా (ఎంఓజీ)కి చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. చిల్డ్రన్ ఆర్ట్ స్టూడియో స్థాపించి పిల్లలకు కళారంగం కోసం కొంత సమయాన్ని కేటాయించే అవకాశం కల్పించింది. కళారంగంలో ఉపాధి పొందడానికి అవసరమైన భరోసా కల్పిస్తూ కళాసాధనను లాభదాయకమైన వృత్తిగా మార్చింది.గోవా రాష్ట్రాన్ని కళలు, కళారంగం, వాటికి మార్కెట్ కల్పిస్తూ సామాజిక వ్యవస్థాపనల దిశగా నడిపిస్తోంది శారదాకేర్కర్. సాహిత్యం, రంగస్థలం, విజువల్ ఆర్ట్స్, సంగీతం, నాట్యరీతులను సుసంపన్నం చేయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోంది. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులను ఒక్కో విభాగాన్ని ఒక్కో కేటగిరీగా వర్గీకరించి వారి కళారూపాల ప్రదర్శనలను నిర్వహిస్తోందామె. అలాగే సాంకేతికత సహకారంతో సృజనాత్మక రంగంలో ఎన్ని ప్రయోగాలు చేయవచ్చనేది ఆచరణలో చూపిస్తోంది. గ్రాఫిక్ డిజైనింగ్, ఫ్యాషన్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, యానిమేషన్, గేమింగ్, ఆర్ట్ డైరెక్షన్, సౌండ్ ఇంజనీరింగ్ వంటి సృజనాత్మకమైన ఉపాధి రంగాలను కళల విభాగంలోకి తీసుకువస్తూ కళారంగాన్ని విస్తరిస్తోంది శారద కేర్కర్. గడచిన తొమ్మిదేళ్లలో 600 మంది హస్తకళాకారులు తమ ఉత్పత్తులతో ఎమ్ఓజీ నిర్వహించిన ఎగ్జిబిషన్లలో పాల్గొన్నారు. దివ్యాంగులైన కళాకారుల చిత్రాలతో ‘ఆర్ట్ ఇంక్’, పిల్లల చిత్రాలతో ‘ఏ వరల్డ్ ఆఫ్ మై ఓన్’, మహిళా చిత్రకారులతో ‘అన్ ఎర్త్డ్’ చిత్రకళా ప్రదర్శనలను నిర్వహించింది శారద. ఎమ్ఓజీని రోజుకు 200 మంది సందర్శిస్తారు.సంస్కృతి ప్రతిబింబాలుమ్యూజియం ఆఫ్ గోవా కోసం శారద పాతికమంది గోవా ఆర్టిస్టులు చిత్రించిన గోవా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలను సేకరించింది వీటిని ఎమ్ఓజీ నిర్వహించే ప్రతి ఎగ్జిబిషన్లోనూ ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ‘హోమోలూడెన్స్: ద ఆర్ట్ ఆఫ్ ప్లే’ ప్రదర్శన జరుగుతోంది. అందులో గోవా ఆర్టిస్టులతోపాటు అనేక రాష్ట్రాలు, నెదర్లాండ్ దేశం నుంచి కూడా ఆర్టిస్టులు మొత్తం వంద మంది చిత్రకారుల కళారూపాలున్నాయి. బీచ్ కంటే మ్యూజియం సందర్శనలోనే ఎక్కువ ఎంజాయ్ చేశాం అని ఫీడ్బ్యాక్ బుక్లో రాస్తున్నారు. ఏడాదికి పదివేల మంది స్టూడెంట్స్ సందర్శిస్తున్నారు. వాళ్లు సమకాలీన కళలతోపాటు గోవా చరిత్రను తెలుసుకుంటున్నారు.కళాకృతులకు మార్కెట్ వేదికగడచిన ఎనిమిదేళ్లుగా ప్రతి ఆదివారం ఎంఓజీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వివిధ రంగాలకు చెందిన నాలుగు వందల మంది నిపుణులు హాజరై ప్రసంగించారు. ఆర్ట్, ఆర్కిటెక్చర్, సైన్స్, మేనేజ్మెంట్, బిజినెస్, ఎన్విరాన్మెంట్, పాలసీ మేకింగ్, యాక్టివిజమ్ అంశాల్లో కళాకారులకు సమగ్రమైన అవగాహన కల్పించారు. ‘ఆమి గోవా’ నాన్ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజ్ ద్వారా అల్పాదాయ వర్గాల మహిళలు తయారు చేసే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉత్పత్తులను విక్రయించడానికి ఒక వేదిక ఏర్పాటు చేసింది శారద. ఇందులో మహిళల స్వావలంబన సాధికారత, గోవా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ అనే రెండు రకాల ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. స్వయం సహాయక బృందాల మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. శారద కేర్కర్ చొరవతో గోవా హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీ కొత్త రూపు సంతరించుకుంటోంది. (చదవండి: కేరళను ఊపేసిన ఘటన! ఒక్క ఆవు కోసం ముగ్గురు మహిళలు..) -
ఇఫీలో మా కాళి
రైమా సేన్, అభిషేక్ సింగ్ ప్రధాన పాత్రల్లో విజయ్ యెలకంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘మా కాళి’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన మల్టీ లింగ్వల్ మూవీ ఇది. హిందీలో నిర్మించిన ఈ చిత్రం బెంగాలీ, తెలుగులో 2025లో విడుదల కానుంది. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ(ఇంటర్నేనేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో ‘మా కాళి’ సినిమాని ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్, గోవా రాష్ట్ర డీజీపీ అలోక్ కుమార్ హాజరయ్యారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ– ‘‘మా కాళి’ చిత్రాన్ని భారతదేశ విభజన, డైరెక్ట్ యాక్షన్ డే నేపథ్యంలో తీశారు. 1947లో స్వాతంత్య్రం పొందిన మన దేశం ఆ తర్వాత ఇండియా, పాకిస్థాన్ గా మారింది. 1971 నాటికి పాకిస్థాన్, బంగ్లాదేశ్గా మారింది. ఒక దేశం మూడు ముక్కలైంది. అయినప్పటికీ భారతదేశం మాత్రమే ఇప్పటికీ రాజ్యాంగాన్ని నమ్ముతుంది. ‘మా కాళి’ వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడింది. డైరెక్ట్ యాక్షన్ డే అనేది మన దేశ చరిత్రలో ఒక బ్లాక్ డే’’ అని తెలిపారు. ‘‘మా కాళి’కి ప్రమోద్ సావంత్, ఆనంద బోస్గార్ల నుంచి వచ్చిన ప్రశంసల్ని సత్కారంగా భావిస్తున్నాం’’ అన్నారు విజయ్ యెలకంటి, నిర్మాత వందనా ప్రసాద్. -
ప్రేక్షకులూ భాగస్వాములే!
‘‘ఆర్టిస్టుగా ప్రతిభ ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ ఎవర్నీ ఆపలేరు’’ అని అంటున్నారు. కృతీ సనన్. గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో ఆమెపాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సమావేశంలో బంధు ప్రీతి గురించి కృతీ సనన్ మాట్లాడిన వ్యాఖ్యలు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో నాకు మంచి ఆహ్వానమే లభించింది. అయితే ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కొంత సమయం పట్టడం సహజమే.మేగజీన్స్లో మన ఫొటోలు కనిపించేందుకు కూడా సమయం పటొచ్చు. ఇదంతా స్ట్రగుల్లో భాగమే. అయితే రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత, ప్రతిభతో, బాగా కష్టపడితే ఏదీ ఆపలేదు’’ అని అన్నారు. ఇంకా ఇండస్ట్రీలో బంధుప్రీతి గురించి కృతీ చెబుతూ– ‘‘బంధుప్రీతి అపవాదు మొత్తం బాధ్యతను ఇండస్ట్రీయే మోయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఈ విషయంలో ప్రేక్షకుల భాగస్వామ్యం కూడా ఉంది. స్టార్ కిడ్స్ అంటూ మీడియా వాళ్లు వారిపై ప్రత్యేక ఫోకస్ పెడతారు. దీంతో ఆడియన్స్ స్టార్ కిడ్స్ను ఫాలో అవుతుంటారు. స్టార్ కిడ్స్పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి, స్టార్ కిడ్స్తోనే సినిమాలు తీయాలని నిర్మాతలు అనుకుంటారు. అయితే ఆడియన్స్కు కనెక్ట్ కాని వారు ఎవరూ ఇండస్ట్రీలో ఉండలేరు. అది నిజం. ప్రతిభ ఉన్నవాళ్లే ఉంటారు’’ అన్నారు. -
ఇఫీలో హను–మాన్ భాగం కావడం ఆనందం: తేజ సజ్జా
‘‘కథా కథనాల పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిరుచి మన సినిమా అభివృద్ధికి దోహదపడుతుంది’’ అన్నారు హీరో తేజ సజ్జా. ‘‘హను–మాన్’ కేవలం సినిమా కాదు.. మన సాంస్కృతిక మూలాలు, సంప్రదాయాలకు కట్టిన పట్టం’’ అని కూడా అన్నారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇండియన్ పనోరమా విభాగంలో ‘హను–మాన్’ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ... ‘‘కల్పిత గ్రామమైన అంజనాద్రి నేపథ్యంలో దైవిక శక్తులను పొందిన ఓ చిన్న దొంగ... మహా శక్తిమంతుడైన హనుమంతుని దాకా సాగించే ప్రయాణాన్ని ఈ చిత్రం చూపించిందని, భారతీయ పురాణాల విశిష్టతను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఈ చిత్రం ద్వారా నిర్వర్తించామనీ అన్నారు. ఈ చిత్రం మన పౌరాణిక మూలాలను చాటి చెబుతూ భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలిపిందన్నారు.‘హను–మాన్ ’ సీక్వెల్ రూపకల్పన కోసం పని చేస్తున్నట్టు ధృవీకరించారు. తెలుగు పరిశ్రమ వినూత్న కథనాలతో అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు సాధిస్తోందన్నారు. ‘హను–మాన్’ సాంస్కృతిక వారసత్వం, ఆధునిక కథల శక్తిమంతమైన సమ్మేళనమని, భారతీయ పనోరమాలో భాగం కావడం ఈ చిత్ర కళాత్మక సాంస్కృతిక విశిష్టతకు నిదర్శనం’’ అంటూ తన ఆనంద వ్యక్తం చేశారు తేజ సజ్జా. – గోవా నుంచి సాక్షి ప్రతినిధి -
సినిమా... సాహిత్యం మధ్య సాన్నిహిత్యం పెరగాలి: దర్శకుడు మణిరత్నం
‘‘సినిమా... సాహిత్యం మధ్య ఎంత సాన్నిహిత్యం పెరిగితే అంతగా భారతీయ సినిమా మెరుగుపడుతుంది’’ అని అభిప్రాయపడ్డారు దక్షిణాది దర్శక దిగ్గజం మణిరత్నం. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో భాగంగా ‘ట్రాన్స్ఫార్మింగ్ లిటరరీ మాస్టర్పీస్’ అనే అంశంపై ‘మాస్టర్ క్లాస్’లో ఆయన మాట్లాడారు. మరో దక్షిణాది ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా మణిరత్నంతో సంభాషించారు. ‘‘నేను ఇప్పటికీ ప్రేక్షకులలో ఒక్కడిగా కూర్చుని సినిమా చూసే వ్యక్తినే’’ అని మణిరత్నం అన్నారు. ఏళ్లుగా మాస్టర్ పీస్ లాంటి సినిమాలు అందిస్తున్నప్పటికీ తనను తాను అనుభవశూన్యుడిలా, ప్రారంభ దశలో ఉన్నట్లుగానే భావిస్తాను అన్నారాయన. సినిమా, సాహిత్యం మధ్య లోతైన అనుబంధం ఏర్పడేలా సినిమా నిర్మాతలు చూడాలని మణిరత్నం కోరారు.పుస్తకానికి దృశ్యరూపం ఇవ్వాలంటే...పుస్తకాలను చలన చిత్రాలలోకి మార్చడంలోని సూక్ష్మ నైపుణ్యాలను ఈ సందర్భంగా మణిరత్నం వివరించారు. ‘‘సినిమాలు దృశ్య మాధ్యమానికి చెందినవి. కానీ పుస్తకాలు ప్రధానంగా ఊహాజనితమైనవి. పుస్తకాలకు దృశ్యరూపం ఇచ్చేటప్పుడు ఫిల్మ్ మేకర్కు అదనపు సామర్థ్యం ఉండాలి. పాఠకుడి ఊహకు ప్రాణం పోయడంలో జాగ్రత్త వహించాలి’’ అని సూచించారు. ఇంకా పురాణాలు, ప్రాచీన భారతీయ చరిత్ర తన దృక్పథాన్ని ప్రభావితం చేశాయని మణిరత్నం అన్నారు. కల్కి కృష్ణమూర్తి 1955 నాటి ఐకానిక్ రచనల నుంచి స్వీకరించిన తన ‘΄పొన్నియిన్ సెల్వన్’ చిత్రం గురించి మాట్లాడుతూ... చోళుల కాలాన్ని చిత్రించేందుకు పడిన వ్యయ ప్రయాసలను వివరించారు. తంజావూరులో ఆ కాలపు అవశేషాలు కూడా లేకుండా యాయని, అయితే సెట్లను రూపొందించడానికి ఇష్టపడక భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో షూటింగ్ చేశామని, అక్కడి నిర్మాణాన్ని చోళుల వాస్తుశిల్పం ప్రకారం మార్చామనీ అన్నారు. సృజనాత్మక స్వేచ్ఛను తీసుకుంటున్నప్పుడు ఆలోచనాత్మకంగా, పుస్తకాన్ని దాని అసలు స్ఫూర్తిని కాపాడేలా చూడాలని యువ సినీ రూపకర్తల్ని మణిరత్నం కోరారు.వినోదమే ప్రధానం: శివ కార్తికేయన్‘‘సినిమా పరిశ్రమలోకి రావడానికి నేను ఏ లక్ష్యాలను పెట్టుకోలేదు. కేవలం ప్రేక్షకులకు వినోదం అందించాలని తప్ప’’ అన్నారు ప్రముఖ నటుడు శివ కార్తికేయన్. ‘ఇఫీ’లో భాగంగా కళా అకాడమీ ప్రాంగణంలోని ఇంట్రాక్టీవ్ సెషన్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి ఖుష్బూ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ... తాను స్టార్ కావాలని రాలేదని, చేసే పాత్రల ద్వారా ప్రేక్షకులకు వినోదం పంచాలనుకున్నానని, అందుకు అనుగుణంగానే తొలుత టీవీ కార్యక్రమాలు... ఆ తర్వాత అంతకన్నా పెద్దదైన వెండితెరపైనా అవకాశాలు అందుకున్నాననీ శివ కార్తికేయన్ పేర్కొన్నారు. 200 సినిమాలకు పైగా నటించినా ఇప్పటికీ తన లక్ష్యం ప్రేక్షకులకు వినోదం అందించడమే అన్నారాయన. – గోవా నుంచి సాక్షి ప్రతినిధిఇఫీలో ఎమ్ 4 ఎమ్మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’(మోటివ్ ఫర్ మర్డర్). జో శర్మ, సంబీత్ ఆచార్య లీడ్ రోల్స్లో నటించారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ (యూఎస్ఏ) బ్యానర్పై రూపొందిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది. కాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ని ‘ఇఫీ’లో శనివారం విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం గురించి మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ–‘‘యూనివర్సల్ సబ్జెక్ట్తో సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’. ప్రేక్షకులు మా మూవీని చూసి థ్రిల్ అవుతారు’’ అన్నారు. -
గోవా ఐఎఫ్ఎఫ్ఐ ఈవెంట్లో అక్కినేని ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
-
గోవా తీరంలో జలాంతర్గామిని ఢీకొట్టిన పడవ
న్యూఢిల్లీ: గోవా తీరం నుంచి సముద్రంలో 70 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. భారత నావికా దళానికి చెందిన జలాంతర్గామిని మత్స్యకారుల పడవ ఢీకొట్టినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సముద్రంలో చేపలు పట్టేందుకు ఉపయోగించే ఈ పడవ పేరు మార్తోమా. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 13 మంది ఉన్నారు. వారిలో 11 మందిని అధికారులు రక్షించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం ఆరు నౌకలను, హెలికాప్టర్లను రంగంలోకి దించినట్లు నావికా దళం అధికార ప్రతినిధి చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని పేర్కొన్నారు. ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ)తో కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. కోస్ట్ గార్డ్ సిబ్బంంది సేవలు కూడా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, జలాంతర్గామిని పడవ ఢీకొన్న ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు నావికా దళం ఆదేశాలు జారీ చేసింది. -
IFFI : గోవా సినిమా పండుగ..సందడి చేసిన స్టార్లు (ఫొటోలు)
-
IFFI : ఘనంగా గోవా సినిమా పండుగ ప్రారంభం.. సందడి చేసిన నాగ్, ఇతరులు (ఫొటోలు)
-
గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో...
జో శర్మ, సంబీత్ ఆచార్య లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ (యూఎస్ఏ) బ్యానర్పై ఈ సినిమా రూపొందింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హిందీ ట్రైలర్ని ఈ నెల 23న గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో విడుదల చేయనున్నారు. -
మా నాన్న వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను – నాగార్జున
‘‘మా నాన్న నేర్పిన జీవిత పాఠాలు నన్ను ఎన్నో రకాలుగా ప్రభావితం చేశాయి. మా నాన్న బాటలో నడవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రసార సమాచార శాఖ సహకారంతో జాతీయ చిత్ర పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇఫీ) బుధవారం గోవాలోప్రారంభమైంది. ఈ నెల 28 వరకూ ఈ చిత్రోత్సవం జరగనుంది. తొలి రోజు నటులు ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, దర్శకుడు తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా లెజండరీ ఆల్బమ్ని విడుదల చేశారు. ఈ వేదికపై తండ్రి ఏఎన్నార్ గురించి మాట్లాడారు నాగార్జున. యాంకర్ కోరిన మీదట తాను నటించిన ‘బంగార్రాజు’ చిత్రంలోని ‘వాసివాడి తస్సాదియ్యా..’ డైలాగ్ చెప్పారు నాగార్జున. ఈ చిత్రోత్సంలో నాగార్జున, అమల దంపతులను, నటుడు శరత్ కుమార్, దర్శకుడు ఆర్కే సెల్వమణి, చిదానంద నాయక్, నిర్మాత–దర్శకుడు సుభాష్ ఘాయ్, నటీమణులు నిత్యా మీనన్, ప్రణీతలను సన్మానించారు. ‘‘పేపర్ బాయ్గా నా ప్రస్థానం ప్రారంభించాను’’ అని శరత్కుమార్ పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమాల్లోని కొత్తదనం, పాజిటివిటీ అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు టాలీవుడ్ని చేరువ చేస్తున్నాయి’’ అన్నారు అమల.ఐఫీ... ఇంకొన్ని విశేషాలు→ కార్యక్రమప్రారంభంలో భారత వందనం నృత్య కార్యక్రమం ఆహూతులను విశేషంగా అలరించింది.→ సినీ దిగ్గజాలు అక్కినేని నాగేశ్వరరావు, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా, రాజ్ కపూర్ల జీవితం గురించి బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ అందించిన వీడియో సహిత కార్యక్రమం ఆకట్టుకుంది.→ పలుమార్లు ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం ప్రస్తావన వచ్చింది.→ చిత్రోత్సవంలో భాగంగా విభిన్న కేటగిరీలో చిత్రాలను ఎంపిక చేసే జ్యూరీల్లో తెలుగు దర్శకుడు హరీష్ శంకర్, హైదరాబాద్కు చెందిన యువ డిజైనర్ అర్చనా రావు ఉన్నారు.→ బాలీవుడ్ నటి మానుషీ చిల్లర్ ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ పాటకు నృత్యంతో అలరించారు.→ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురు పండిట్ రవిశంకర్ జీవిత ఘట్టాల ఆధారంగా తీస్తున్న చిత్ర విశేషాలు ప్రదర్శించారు.→ ఆహూతుల్లో ఖుష్బూ, సుశాంత్ తదితరులు ఉన్నారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
ఇఫీలో గుస్సాడీ నృత్యం
తెలంగాణ సంప్రదాయ నృత్య వైభవం మరోసారి జాతీయ అంతర్జాతీయ వేదికలపై తళుక్కుమననుంది. గోవాలో అట్టహాసంగా బుధవారం జరుగనున్న అంతర్జాతీయ భారత్ చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. ఇఫీ)ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఆదివాసీ గోండు గిరిజనుల గుస్సాడీ నృత్యం ప్రదర్శనకు అవకాశం దక్కించుకుంది. ఈ నృత్య కళాకారునిగా ఇటీవలే కీర్తిశేషులైన పద్మశ్రీ కనకరాజు జాతీయ స్థాయిలో పేరొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో తెలంగాణ సంప్రదాయ నృత్య ప్రదర్శనకు నోచుకోవడం, ఆ ప్రదర్శనలో పాల్గొనే కళాకారులు అందరూ దివంగత కనకరాజు శిష్యులే కావడంతో ఇది గత నెలలోనే దివికేగిన గుస్సాడీ నృత్య దిగ్గజానికి ఘన నివాళిగా చెప్పొచ్చు. – సాక్షి, హైదరాబాద్ -
గోవా ట్రిప్ ఎంజయ్ చేస్తున్న వితిక శేరు , నిహారిక కొణిదెల (ఫొటోలు)
-
గోవా లో కీర్తి సురేష్ పెళ్లి.. పెళ్లి కొడుకు ఎవరంటే..
-
Peruri Jyoti Varma: పవర్ ఫుల్
విరామం అంటే వెనక్కి తగ్గడం కాదు, పరాజయం అంతకంటే కాదు. విత్తనం నాటిన రోజు నుంచి అది పచ్చగా మొలకెత్తడానికి మధ్య కూడా విరామం ఉంటుంది. ఒకప్పుడు హ్యాండ్బాల్ గేమ్ నేషనల్ ప్లేయర్ అయిన జ్యోతి పెళ్లి తరువాత కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. విరామం తర్వాత మళ్లీ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టిన పేరూరి జ్యోతి పవర్ లిఫ్టింగ్లో తక్కువ సమయలోనే సాధన చేసి గోవాలో జరిగిన బెంచ్ప్రెస్ నేషనల్ చాంపియన్షిప్లో 45 కిలోల బరువు ఎత్తి కాంస్యం సాధించింది. నిజానికి అది పతకం కాదు... అపూర్వమైన ఆత్మవిశ్వాసం...జ్యోతి స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్పూర్. పెళ్లికిముందు హ్యాండ్బాల్ గేమ్లో నేషనల్ ప్లేయర్. 1994లో ‘విజ్ఞాన్ యూనివర్శిటీ’లో ప్రొఫెసర్గా చేస్తున్న డాక్టర్ పిఎల్ఎన్ వర్మతో వివాహం జరగడంతో గుంటూరుకు వచ్చింది. కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు దూరంగా ఉండక తప్పలేదు. అయితే వ్యాయామాలకు, యోగ సాధనకు విరామం ఇవ్వలేదు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మగ్గం పని... వంటి అభిరుచుల పట్ల మక్కువను విడవలేదు. మనం అడుగుపెట్టే స్థలాలు కూడా భవిష్యత్ను నిర్ణయిస్తాయి అంటారు. జ్యోతి విషయంలో అలాగే జరిగింది.ఏడాది క్రితం స్థానిక ‘ఇన్ఫినిటీ జిమ్’లో చేరి రకరకాల వ్యాయామాలు చేసేది. ఆమె ఉత్సాహం, పట్టుదల చూసి కోచ్ రమేష్ శర్మ ‘మీరు పవర్ లిఫ్టింగ్లో అద్భుతాలు సాధించగలరు’ అన్నారు. ఆమె నవ్వుతూ ఊరుకుంటే ఆ కథ అక్కడితో ముగిసేది. కోచ్ మాటలను ఆమె సీరియస్గా తీసుకుంది. ‘ఒకసారి ఎందుకు ప్రయత్నించకూడదు’ అనుకున్నది. అలా అనుకోవడంలో పతకాలు సాధించాలనే ఆశయం కంటే... ఆటల పట్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టమే కారణం. ఆరు నెలల క్రితం పవర్ లిఫ్టింగ్లో సాధన మొదలుపెట్టింది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. ‘ఇంకా నువ్వు కాలేజీ స్టూడెంటే అని అనుకుంటున్నావా’ లాంటి వెటకారాలు వినిపించాయి. అయితే ఈ వెటకారాలు, మిరియాలు ఆమె సాధన ముందు నిలవలేకపోయాయి. మరింత దీక్షతో సాధన చేసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్లో కొద్దితేడాతో పతకం మిస్ అయింది. ‘పతకంతో తిరిగి వస్తావనుకున్నాం’ అన్నారు మిత్రులు. ‘వంద పతకాలతో తిరిగి వచ్చాను’ అన్నది జ్యోతి నవ్వుతూ. ఆమె చెప్పిన వంద పతకాలు... ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతోనే గోవాలో జరిగిన బెంచ్ప్రెస్ నేషనల్స్ చాంపియన్ షిప్లో రికార్డు స్థాయిలో 45 కేజీలు బరువు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. నిజానికి ఇదిప్రారంభం మాత్రమే. ఆమె ఉత్సాహం, పట్టుదల చూస్తుంటే మరిన్ని విజయాలు ఆమె ఖాతాలో పడతాయని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే...ఏదైనా సాధించాలంటే మన విలువ మనం ముందుగా గుర్తించాలి. నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం అవుతుంది. నాకు ఆరోగ్య సమస్యలున్నాయి. హైపో థైరాయిడ్, స్పాండిలైటిస్ నన్ను ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నాను. రోజూ యోగ, జిమ్, మెడిటేషన్, గార్డెనింగ్ చేస్తాను.– పేరూరి జ్యోతి– దాళా రమేష్బాబు, సాక్షి, గుంటూరుఫొటోలు: మురమళ్ల శ్రీనివాసరావు. -
ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు.. రికార్డులు బద్దలు
రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్ల్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఇద్దరు గోవా బ్యాటర్లు అజేయ ట్రిపుల్ సెంచరీలతో చెలరేగారు. స్నేహల్ కౌతంకర్ 215 బంతుల్లో 45 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 314 పరుగులు చేయగా.. కశ్యప్ బాక్లే 269 బంతుల్లో 39 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 300 పరుగులు చేశారు. స్నేహల్, కశ్యప్ మూడో వికెట్కు అజేయమైన 606 పరుగులు జోడించి రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. స్నేహల్, కశ్యప్ ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడటంతో గోవా తొలి ఇన్నింగ్స్లో (93 ఓవర్లలోనే) రెండు వికెట్ల నష్టానికి 727 పరుగులు చేసింది. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 84 పరుగులకు ఆలౌటైంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. 643 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ ఈ ఇన్నింగ్స్లోనూ పేలవ ప్రదర్శన కొనసాగించి 92 పరుగులకు చాపచుట్టేసింది. ఫలితంగా గోవా ఇన్నింగ్స్ 551 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విశేషాలు.. నమోదైన రికార్డులు..రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు చేయడం ఇది రెండో సారి మాత్రమే.1989లో గోవాతో జరిగిన మ్యాచ్లో తమిళనాడుకు చెందిన డబ్ల్యూవీ రామన్, అర్జున్ క్రిపాల్ సింగ్ ఒకే ఇన్నింగ్స్లో ట్రిపుల్ సెంచరీలు చేశారు.స్నేహల్, కశ్యప్ మూడో వికెట్కు అజేయమైన 606 పరుగులు జోడించి రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.ఈ మ్యాచ్లో గోవా చేసిన స్కోర్ (727/2) రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్గా నమోదైంది.రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చరిత్రలో అత్యధిక స్కోర్ మేఘాలయ చేసింది. 2018 సీజన్లో సిక్కింతో జరిగిన మ్యాచ్లో మేఘాలయ 826 పరుగులు చేసింది.ఈ మ్యాచ్లో గోవా చేసిన స్కోర్ (727/2) యావత్ రంజీ ట్రోఫీ చరిత్రలోనే తొమ్మిదో అత్యధిక స్కోర్గా రికార్డైంది.ఈ మ్యాచ్లో స్నేహల్ చేసిన ట్రిపుల్ సెంచరీ మూడో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీగా (205 బంతుల్లో) రికార్డైంది.రంజీల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు తన్మయ్ అగర్వాల్ పేరిట ఉంది. తన్మయ్ గత రంజీ సీజన్లో 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. -
ఐదు వికెట్లతో చెలరేగిన అర్జున్ టెండుల్కర్.. మెగా వేలంలో...
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ రంజీ మ్యాచ్లో అదరగొట్టాడు. అరుణాచల్ ప్రదేశ్తో పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ గోవా ఆల్రౌండర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. అర్జున్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. 84 పరుగులకే ఆలౌట్ అయింది.గోవాకు ప్రాతినిథ్యంకాగా ముంబైకి చెందిన అర్జున్ టెండుల్కర్ దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఎడమచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన అర్జున్.. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా! ఇక 25 ఏళ్ల అర్జున్ రంజీ ట్రోఫీ 2024-25లో ప్లేట్ గ్రూపులో ఉన్న గోవా.. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో తలపడుతోంది.పొర్వోరిమ్లోని గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్లో బుధవారం ఇరుజట్ల మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన అరుణాచల్ ప్రదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే అటాక్ మొదలుపెట్టిన గోవా ఆల్రౌండర్ అర్జున్ టెండుల్కర్.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బెంబేలెత్తించాడు.టాప్-5 వికెట్లు అతడి ఖాతాలోనేఅర్జున్ ధాటికి టాపార్డర్తో పాటు మిడిలార్డర్ కకావికలమైంది. ఓపెనర్ నబాం హచాంగ్ను డకౌట్ చేయడంతో వికెట్ల వేట మొదలుపెట్టిన అర్జున్.. మరో ఓపెనర్ నీలం ఒబి(22), వన్డౌన్ బ్యాటర్ చిన్మయ్ పాటిల్(3), నాలుగో స్థానంలో వచ్చిన జే భస్వార్(0), ఐదో నంబర్ బ్యాటర్ మోజీ ఎటె(1)లను పెవిలియన్కు పంపాడు.ఫస్ట్క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతద్వారా అర్జున్ టెండుల్కర్.. తన ఫస్ట్క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన(5 Wicket Haul) నమోదు చేశాడు. ఇక అర్జున్తో పాటు గోవా బౌలర్లలో కేత్ పింటో రెండు, మోహిత్ రేడ్కర్ మూడు వికెట్లతో రాణించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే కుప్పకూలిన అరుణాచల్ ప్రదేశ్.. 84 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్ను ముగించింది.ముంబై తరఫున కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అర్జున్ టెండుల్కర్ ఈమేరకు ఉత్తమ ప్రదర్శన కనబరచడం.. అతడికి సానుకూలాంశంగా మారింది. ఈ ఆల్రౌండర్ను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇక సచిన్ టెండుల్కర్ మెంటార్గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్లు ఆడి 13 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. అయితే, రిటెన్షన్స్లో భాగంగా ఐదుగురిని అట్టిపెట్టుకున్న ముంబై.. అర్జున్ను వదిలివేసింది. ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్ వేలంపాట జరుగనుంది.చదవండి: ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్లన్నీ మా దేశంలోనే.. పాక్ ప్రభుత్వ వైఖరి ఇదే! -
ఇఫీలో శతాబ్ది వేడుకలు
అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా... భారతీయ చిత్రసీమలో ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. నటులుగా ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడిగా మహమ్మద్ రఫీ, దర్శకుడిగా తపన్ సిన్హా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ) ఘనంగా నివాళులర్పించనుంది. 55వ ఇఫీ వేడుకలు గోవాలో ఈ నెల 20న ఆరంభమై 28 వరకూ జరుగుతాయి.22న అక్కినేని నాగేశ్వరరావు, 24న రాజ్ కపూర్, 26న మహమ్మద్ రఫీ, 27న తపన్ సిన్హాలకు చెందిన శతాబ్ది వేడుకలను జరపడానికి ‘ఇఫీ’ నిర్వాహకులు ప్లాన్ చేశారు. గోవా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చిత్రోత్సవాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇక నలుగురు లెజెండ్స్ నివాళి కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. ⇒ నలుగురు లెజెండ్స్ కెరీర్లో చెరగని ముద్ర వేసిన చిత్రాలను, పాటలను ప్రదర్శించనున్నారు. ఏఎన్నార్ క్లాసిక్ మూవీ ‘దేవదాసు’, రాజ్ కపూర్ కెరీర్లో మైలురాయి అయిన ‘ఆవారా’, తపన్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో అద్భుత చిత్రం ‘హార్మోనియమ్’ చిత్రాలను ప్రదర్శించడంతో పాటు ‘హమ్ దోనో’లో మహమ్మద్ రఫీ పాడిన పాటలను వినిపించనున్నారు. కాగా, వీక్షకులకు నాణ్యతతో చూపించడానికి ఈ చిత్రాలను పునరుద్ధరించే బాధ్యతను నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఫిల్మ్ ఆరై్కవ్ ఆఫ్ ఇండియా తీసుకుంది. అలాగే ఈ ప్రముఖుల సినిమా కెరీర్కి సంబంధించిన ఏవీ (ఆడియో విజువల్) చూపించనున్నారు. ⇒నలుగురు కళాకారుల ప్రత్యేక నివాళిలో భాగంగా వారి విజయాలను గౌరవిస్తూ పద్మశ్రీ సుదర్శన్ పటా్నయక్ గోవాలోని కళా అకాడమీలో సృష్టించే ‘శాండ్ ఆర్ట్’ ఇల్ల్రస్టేషన్ని ప్రదర్శించనున్నారు. ⇒ సినిమా రంగంలో, భారతీయ సంస్కృతిపై వీరు వేసిన ముద్రకు ప్రతీకగా ఈ నలుగురు దిగ్గజాలకు అంకితం చేస్తూ ప్రత్యేక స్టాంపును ఆవిష్కరించనున్నారు. ⇒ ఈ నలుగురి కెరీర్లో తీపి గుర్తులుగా నిలిచిపోయిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేకమైన ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ‘ఇఫీ’ ప్లాన్ చేస్తోంది. ⇒ రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ కెరీర్లోని చిత్రాల్లోని 150 పాటలు, ఏఎన్నార్, తపన్ సిన్హా చిత్రాల్లోని 75 పాటలు... మొత్తంగా 225 పాటలతో ఓ సంగీత విభావరి జరగనుంది.భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ నలుగురు కళాకారుల శతాబ్ది వేడుకల్లో భాగంగా ఇంకా పలు కార్యక్రమాలను ప్లాన్ చేశారు. -
ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!
గోవా విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు వెలుస్తున్నాయి. టాక్సీ మాఫియా, అధిక ధరలే ఇందుకు కారణమని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. గోవాకు రాకపోకలు సాగిస్తున్న పర్యాటకులకు సంబంధించి పారిశ్రామికవేత్త రామానుజ ముఖర్జీ ఎక్స్లో డేటాను షేర్ చేశారు. 2019లో గోవా సందర్శకుల సంఖ్య 85 లక్షల నుంచి 2023లో 15 లక్షలకు తగ్గుముఖం పట్టినట్లు డేటాలో వెల్లడించారు.ముఖర్జీ షేర్ చేసిన డేటాపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధుర్ స్పందించారు. ‘గోవాలోని బెనౌలిమ్ బీచ్ వద్ద జర్మనీ నుంచి వచ్చిన నా స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లాను. వెంటనే దాదాపు పది మందికి పైగా టాక్సీ డ్రైవర్లు నన్ను చుట్టుముట్టారు. విదేశీ పర్యాటకులు స్థానిక టాక్సీలోనే వెళ్లాలని డిమాండ్ చేశారు. తర్వాత నా స్నేహితుడు 37 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.1,800 చెల్లించాల్సి వచ్చింది. గోవాలో టాక్సీ మాఫియా పెరుగుతోంది. గోవా అభివృద్ధికి ఈ మాఫియా ఆటంకంగా నిలుస్తోంది’ అని అన్నారు.Goa’s taxi mafia is responsible for it. 100%I went to pick up a friend (from Germany) from Benaulim Beach and I was accompanied by another friend (a local Goan). A taxi guy (in Benaulim) saw us, he stopped us and in no time there were 10+ taxi drivers ready to beat us up. The… https://t.co/V43IsQXBm9— Madhur (@ThePlacardGuy) November 5, 2024ఇదీ చదవండి: ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్వరుణ్ రావు అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ పోస్ట్కు స్పందిస్తూ టాక్సీ, ఆటో మాఫియా గోవాలో పర్యాటకం వృద్ధిని అడ్డుకుంటున్నాయని చెప్పారు. ‘ట్యాక్సీ డ్రైవర్లు స్థానిక ప్రభుత్వానికి ప్రధాన ఓటు బ్యాంకు. కాబట్టి వారి ప్రవర్తన వల్ల వృద్ధి కుంటుపడుతున్నా, పర్యాటకులు ఇబ్బంది పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య తీసుకునే ధైర్యం చేయరు’ అని అన్నారు. -
బెంగళూరుకు తొలి ఓటమి
మార్గావ్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తున్న బెంగళూరు ఫుట్బాల్ క్లబ్కు భంగపాటు ఎదురైంది. తాజా సీజన్లో ఓటమి లేకుండా సాగుతున్న బెంగళూరు జట్టు... శనివారం జరిగిన పోరులో 0–3తో గోవా ఫుట్బాల్ క్లబ్ చేతిలో ఓడింది. సీజన్లో రెండో విజయం నమోదు చేసుకున్న గోవా జట్టు తరఫున ఆర్మాండో సాడికు (63వ నిమిషంలో), బ్రిసన్ ఫెర్నాండెస్ (72వ ని.లో), డెజాన్ డ్రాజిక్ (90+3వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. భారత జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్ మనోలో మార్క్వెజ్ శిక్షణలో బరిలోకి దిగిన గోవా జట్టు... మ్యాచ్పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. నిర్ణీత సమయంలో గోవా 19 షాట్లు ఆడగా... బెంగళూరు బుల్స్ 8 షాట్లు ఆడింది. లక్ష్యంపైకి ఐదు షాట్లు సంధించిన గోవా... అందులో మూడింటిని గోల్ పోస్ట్లోకి పంపింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన బెంగళూరు 5 విజయాలు, ఒక పరాజయం, ఒక ‘డ్రాతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 7 మ్యాచ్ల్లో 2 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లు నమోదు చేసుకున్న గోవా 9 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం జరగనున్న మ్యాచ్ల్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్తో ఒడిషా ఫుట్బాల్ క్లబ్తో... ముంబై సిటీ జట్టుతో కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ క్లబ్ తలపడతాయి. -
ఇఫీలో కల్కి... 35: చిన్న కథ కాదు
ఒక భారీ చిత్రం... ఒక చిన్న చిత్రం... తెలుగు పరిశ్రమ నుంచి ఈ రెండు చిత్రాలు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ప్రదర్శితం కానున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం ‘కల్కి’, నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శిల కాంబినేషన్లో నందకిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా నిర్మించిన చిన్న చిత్రం ‘35: చిన్న కథ కాదు’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికయ్యాయి.దేశ వ్యాప్తంగా పోటీలో నిలిచిన 384 ఫీచర్స్ ఫిల్మ్స్లో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో 5 చిత్రాలను, ఇండియన్ పనోరమా విభాగంలో 20 చిత్రాలను... మొత్తంగా 25 చిత్రాలను ఎంపిక చేశారు. ఇక నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీలో నిలిచిన 262 చిత్రాల్లో 20 చిత్రాలను ఎంపిక చేశారు. ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శితం కానున్న 5 చిత్రాల్లో ‘కల్కి’, ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శితం కానున్న 20 చిత్రాల్లో ‘35: చిన్న కథ కాదు’ ప్రదర్శితం కానున్నాయి.మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. ఇక కురుక్షేత్ర యుద్ధంతో మొదలై, అక్కణ్ణుంచి 6 వేల సంవత్సరాల తర్వాతి కథతో దాదాపు రూ. 600 కోట్లతో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి’ హాలీవుడ్ సినిమాని తలపించి, భారీ వసూళ్లను రాబట్టి, ఘనవిజయం సాధించింది. ఇక కుమారుడు పాస్ మార్కులు తెచ్చుకోవాలని ఓ తల్లి పడే తపనతో రూపొందిన ‘35: చిన్న కథ కాదు’ ఎమోషనల్గా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ప్రారంభ చిత్రంగా ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ ఇండియన్ పనోరమా విభాగంలోప్రారంభ చిత్రంగా హిందీ ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ని ప్రదర్శించనున్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్న యోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్లో టైటిల్ రోల్ను రణ్దీప్ హుడా పోషించారు. అది మాత్రమే కాదు.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఒక రచయితగా, ఓ నిర్మాతగానూ వ్యవహరించారు రణ్దీప్.ముందు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలోనే ఈ చిత్రం ఆరంభమైంది. అయితే క్రియేటివ్ పరంగా ఏర్పడ్డ మనస్పర్థల వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత రణ్దీప్ దర్శకత్వ బాధ్యతను నిర్వర్తించారు. ఈ చిత్రంలో చరిత్రను ఏకపక్షంగా చూపించారంటూ కొన్ని విమర్శలు ఎదురైనప్పటికీ నటీనటుల నటనకు ప్రశంసలు లభించాయి. రణ్దీప్ టైటిల్ రోల్లో అంకితా లోఖండే, అమిత్ సాయి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. దక్షిణాది ప్రముఖులకు జ్యూరీలో చోటు లేదు‘ఇఫీ’ ఉత్సవాల్లో మొత్తం 25 ఫీచర్ íఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ íఫిల్మ్స్ ప్రదర్శిస్తారు. దేశంలోని వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు జ్యూరీలో ఉంటారు. ఫీచర్ ఫిల్మ్స్ ఎంపిక కోసం 12 మంది సభ్యులతో కూడిన జ్యూరీ, నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కోసం ఆరుగురు సభ్యు లతో కూడిన జ్యూరీ సినిమాలను ఎంపిక చేసింది. అయితే దక్షిణాదికి చెందిన ప్రముఖులు ఎవరూ జ్యూరీలో లేకపోవడం గమనార్హం. ఇక గోవా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న ఈ 55వ ‘ఇఫీ’ వేడుకలు నవంబరు 20న ఆరంభమై 28న ముగుస్తాయి. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైన చిత్రాల్లో బెంగాలీ చిత్రం ‘మొనిహార’ ఒకటి. కోల్కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న సుభాదీప్ బిస్వాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన కరీంనగర్కు చెందిన వారాల అన్వేష్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన మొనిహార కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇక గతంలో వారాల అన్వేష సినిమాటోగ్రాఫర్గా రూపొందిన ‘అపార్, ‘నవాబీ శౌక్’ చిత్రాలు ఇండో బంగ్లాదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్తో సహా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమయ్యాయి. ఇంకా తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన పట్నాల పై అన్వేష్ తీసిన డాక్యుమెంటరీ బతుకమ్మ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. -
ప్రజా న్యాయస్థానం సుప్రీంకోర్టు
పనాజీ: పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్రను సుప్రీంకోర్టు పోషించకూడదని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. ప్రజల కోర్టుగా సుప్రీంకోర్టు పాత్రను ఎప్పటికీ పరిరక్షించాలని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రజల న్యాయస్థానంగానే పని చేయాలని పేర్కొన్నారు. ప్రజల కోర్టు అంటే దాని అర్థం పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్ర కాదని ఉద్ఘాటించారు. గోవాలో శనివారం సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏఓఆర్ఏ) సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం పొందే విషయంలో గత 75 ఏళ్లలో ఒక స్పష్టమైన విధానం అభివృద్ధి చేసుకున్నామని, అది దారితప్పకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. సమాజంలో సంపద పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతులకే న్యాయం దక్కుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. అందులో ఎలాంటి నిజం లేదని, సుప్రీంకోర్టు అంటే ముమ్మాటికీ ప్రజల కోర్టు అని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టును చూసే దృక్కోణం విషయంలో జనం మధ్య విభజన కనిపిస్తోందన్నారు. అనుకూలమైన తీర్పు వస్తే సుప్రీంకోర్టు చాలా గొప్పదని ప్రశంసించడం ప్రతికూలమైన తీర్పు వస్తే దూషించడం పరిపాటిగా మారిందన్నారు. కేవలం తీర్పుల ఆధారంగా సుప్రీంకోర్టు పనితీరు, అది పోషించే పాత్రను నిర్ణయించడం సరికాదన్నారు. కేసులో మెరిట్ను బట్టే న్యాయమూర్తులు తీర్పు ఇస్తుంటారని, ఇందులో వారి సొంత అభిప్రాయానికి స్థానం ఉండదని గుర్తుచేశారు. జడ్జిలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారని చెప్పారు. ప్రజల ఇళ్లలోకి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలోఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు కేసుల ఈ–ఫైలింగ్, కేసు రికార్డుల డిజిటలైజేషన్, కోర్టు వ్యవహారం ప్రత్యక్ష ప్రసారం వంటివి తీసుకొచ్చామని గుర్తుచేశారు. ప్రత్యక్ష ప్రసారం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు అని తెలిపారు. ఇప్పుడు కోర్టురూమ్ అనేది కొందరు లాయర్లు, జడ్జిలకు మాత్రమే పరిమితం కాదని, అది ప్రజలకు ఒక్క క్లిక్తో అందుబాటులోకి వచి్చందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నేరుగా ప్రజల ఇళ్లల్లోకి చేరిందన్నారు. కోర్టుల్లో గౌరవప్రదమైన భాష వాడుదాం మనుషులను కించపర్చే భాషకు కోర్టు ప్రాంగణాల్లో స్థానం లేదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ప్రధానంగా మహిళల పట్ల అభ్యంతర వ్యాఖ్యలు, దిగజారుడు భాషను సహించే ప్రసక్తే లేదని అన్నారు. మహిళలతోపాటు సమాజంలోని అణగారిన వర్గాలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం కొందరికి అలవాటని చెప్పారు. అభ్యంతరకర భాష పట్ల మహిళా న్యాయవాదుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తుంటాయని తెలిపారు. న్యాయ వ్యవస్థలోనూ ఇలాంటి జాడ్యం ఉందని, ఈ పరిస్థితి మారాలని తేలి్చచెప్పారు. న్యాయస్థానాల్లో ఉపయోగించే భాష పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతవాతావరణ మార్పుల దుష్పరిణామాల పట్ల జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా సమాజంలో అట్టడుగు వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయని చెప్పారు. రైతులు, మత్స్యకారులు, పేదలకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. గోవా గవర్నర్ పి.ఎస్.శ్రీధరన్ పిళ్లై రాసిన ‘భారతదేశ సంప్రదాయ వృక్షాలు’ అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రచూడ్ శనివారం ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని స్పష్టంచేశారు. -
ముంబై బోణీ
మార్గావ్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ తొలి విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో ముంబై జట్టు 2–1 తేడాతో గోవా ఫుట్బాల్ క్లబ్పై విజయం సాధించింది. గోవాపై ముంబైకిది వరుసగా 13వ విజయం కావడం విశేషం. ముంబై జట్టు తరఫున నికోస్ కరెలిస్ (21వ నిమిషంలో), యోల్ వ్యాన్ నిఫ్ (40వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... గోవా జట్టు తరఫున ఆర్మాండో సాడికు (55వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. తొలి అర్ధభాగంలోనే రెండు గోల్స్తో అదరగొట్టిన ముంబై సిటీ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లగా... గోవా జట్టు వెనుకబడిపోయింది. ద్వితీయార్ధంలో పుంజుకొని పోరాడే ప్రయత్నం చేసినా ఒక గోల్తోనే సరిపెట్టుకుంది. తాజా సీజన్లో ముంబై సిటీ జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడగా... ఇదే తొలి విజయం ఒక ఓటమి, రెండు ‘డ్రా’లతో మొత్తంగా 5 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ముంబై జట్టు పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరోవైపు ఐదు మ్యాచ్లు ఆడిన గోవా ఫుట్బాల్ క్లబ్ ఒక విజయం రెండు పరాజయాలు, రెండు ‘డ్రా’లతో 5 పాయింట్లతో ముంబై తర్వాతి స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు 2–0తో ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్పై విజయం సాధించింది. మోహన్ బగాన్ తరఫున జెమీ మెక్లారెన్ (41వ నిమిషంలో), దిమిత్రీ పెట్రాటోస్ (89వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. ఈ విజయంతో మోహన్ బగాన్ జట్టు మూడో గెలుపు నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ ఓడిన ఈస్ట్ బెంగాల్ జట్టు పట్టిక అట్టడుగున ఉంది. లీగ్లో భాగంగా ఆదివారం మొహమ్మదాన్ స్పోర్ట్స్ క్లబ్తో కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ క్లబ్ తలపడనుంది. -
జానీ మాస్టర్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. గత నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ను గోవాలోని ఓ లాడ్జిలో నార్సింగి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించారు. ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేర కు జ్యుడీíÙయల్ రిమాండ్కు తరలిస్తామని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్గా పనిచేసిన మైనర్ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ మాస్టర్పై ఐపీసీ 376 (2) (ఎ¯Œ), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో కింద కేసు నమోదు చేశారు. భార్య ఇచి్చన సమాచారంతోనే.. జానీ మాస్టర్తో పాటు ఆయన భార్య కూడా పలుమార్లు తనపై శారీరకంగా దాడికి పాల్పడిందంటూ మైనర్ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్ భార్యను నార్సింగి పోలీసులు స్టేషన్ లో విచారించారు. ఈనెల 15 నుంచే పరారీ లో ఉన్న జానీ మాస్టర్ తన ఫోన్ను స్విఛాఫ్ చేసుకున్నా డు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. జానీ భార్యను విచారిస్తున్న క్రమంలో ఆయన ఎక్కడున్నాడనే సమాచారాన్ని పోలీసులు రాబట్టారు.ఆ సమాచారం ఆధారంగా గోవాకు వెళ్లిన ప్రత్యేక బృందం జానీని అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి పాస్ పోర్ట్, సెల్ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. బాధితురాలితో జానీ మాస్టర్ జరిపిన కాల్స్, వాట్సాప్ చాటింగ్, ఇతరత్రా ఆధారాలను సేకరించేందుకు సెల్ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. తదుపరి విచారణ నిమిత్తం జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించిన పోలీసులు.. ఈమేరకు సోమవారం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైనర్పై లైంగిక వేధింపులు! ఓ డ్యాన్స్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచి్చన బాధితురాలికి జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో జానీ 2019లో తన నృత్య బృందంలో సహాయ కొరియోగ్రాఫర్గా ఆమెను నియమించుకున్నాడు. ఓ డ్యాన్స్ ప్రాజెక్టు నిమిత్తం జానీ మాస్టర్తో పాటు ముంబై వెళ్లిన బాధితురాలిపై అక్కడి ఓ హోటల్లో జానీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అప్పటికి బాధితురాలు వయసు 17 ఏళ్లే కావడం గమనార్హం. కాగా జానీ ఆ తర్వాత కూడా తనపై పలుమార్లు వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. -
సచిన్ తనయుడి సూపర్ పెర్ఫార్మెన్స్..!
కేఎస్సీఏ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో (కెప్టెన్ కే తిమ్మప్పయ్య మెమోరియల్) క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అద్బుత ప్రదర్శనతో మెరిశాడు. ఈ టోర్నీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్.. ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల ఘనత నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన అర్జున్.. సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టాడు. అర్జున్ చెలరేగడంతో ఈ మ్యాచ్లో గోవా ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 103 పరుగులకు ఆలౌటైంది. అర్జున్ 13 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం అభినవ్ తేజ్రాణా సెంచరీతో (109) కదంతొక్కడంతో గోవా తొలి ఇన్నింగ్స్లో 413 పరుగులు చేసింది. గోవా ఇన్నింగ్స్లో మంతన్ కుట్కర్ అర్ద సెంచరీతో (69) రాణించాడు. భారీ వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక..సెకెండ్ ఇన్నింగ్స్లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. అర్జున్ 13.3 ఓవర్లలో 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో కర్ణాటక సెకెండ్ ఇన్నింగ్స్లో 121 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఈ మ్యాచ్లో గోవా భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ మొత్తంలో అర్జున్ 26.3 ఓవర్లు వేసి 87 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. వచ్చే వారం 25వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న అర్జున్.. సీనియర్ లెవెల్లో ఇప్పటివరకు 49 మ్యాచ్లు (మూడు ఫార్మాట్లలో) ఆడాడు. ఇందులో 68 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్ అర్మ్ మీడియం పేసర్ అయిన అర్జున్ తన కెరీర్లో 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. చదవండి: బంగ్లాతో తొలి టెస్టు.. కోహ్లికి చుక్కలు చూపించిన బుమ్రా -
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. టేకాఫ్ నిలిపివేత
పనాజి: గోవా డబోలిమ్ ఎయిర్పోర్టులో టేకాఫ్కు సిద్ధమైన ఎయిర్ఇండియా విమానానికి పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం గాల్లోకి ఎగరలేదు. ఈ ఘటన బుధవారం(ఆగస్టు14) తెల్లవాారుజామున 6.45గంటలకు జరిగింది. సౌత్గోవాలోని డబోలిమ్ విమానాశ్రయం నుంచి విమానం ముంబై వెళ్లాల్సిఉంది. రన్వేపైనే విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో టేకాఫ్ నిలిపివేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానానికి ఏవైనా రిపేర్లు అవసరమా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
ఆ రాష్ట్రంలో ఏటా రెండుసార్లు స్వాతంత్య్ర వేడుకలు
ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే మనదేశంలోని ఆ రాష్ట్రంలో రెండుసార్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. దీనివెనుక చారిత్రక కారణం ఉంది.గోవాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటారు. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. భారతదేశం 1947, ఆగష్టు 15న బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్య్రం పొందింది. బ్రిటీష్ వారు భారతదేశానికి రాకముందే పోర్చుగీస్వారు గోవాలో స్థిరపడ్డారు. భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసినప్పటికీ, పోర్చుగీస్వారు 14 ఏళ్ల తర్వాత గోవాకు స్వాతంత్య్రాన్ని అందించారు. పోర్చుగీసువారు 1510 నుండి గోవాలో తిష్టవేశారు. అక్కడ నివసిస్తున్న హిందువులను నానా హింసలకు గురిచేశారు. పోర్చుగీస్ ప్రభుత్వం ఎవరైనా హిందువులు స్వచ్ఛందంగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే, వారికి 15 ఏళ్లపాటు పాటు భూమి పన్ను నుండి విముక్తి కల్పిస్తామని ప్రకటించింది.భారతదేశనికి స్వాతంత్య్రం లభించాక గోవాను భారత్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే పోర్చుగీస్ వారు దీనిని వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో 1940 నుంచి గోవాలో స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రమయ్యింది. పలు సత్యాగ్రహాలు నిర్వహించారు. గోవాను మహారాష్ట్రలో కలపాలని కొందరు, కర్ణాటకలో కలపాలని మరికొందరు డిమాండ్ చేశారు. కొందరు పోర్చుగీసు వారి ఆధీనంలో ఉంటూ, స్వయంప్రతిపత్తిని కోరుకున్నారు. మరికొందరైతే పూర్తి స్వాతంత్ర్యం కోరుకున్నారు.ఈ పరిస్థితులను గమనించిన మహాత్మాగాంధీ గోవా విముక్తి విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని సూచించారు. 1947లో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయ్యింది. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పోర్చుగీస్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. 1961, డిసెంబరు18న నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు 30 వేల మంది భారతీయ సైనికులు గోవాపై దాడి చేసి ఫోర్చుగీసువారిని గోవా నుంచి తరిమికొట్టారు. ఈ మొత్తం ఆపరేషన్కు భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ అనే పేరు పెట్టింది. సందర్భాన్ని పురస్కరించుకుని గోవాలో ప్రతీయేటా డిసెంబరు 19న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. అలాగే భారత్లో గోవా భాగమైనందున ఆగస్టు 15న కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటాయి. -
AP: కర్ణాటక నుంచి భారీగా అక్రమ మద్యం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలే లిక్కర్ మాఫియాలా చెలరేగుతున్నారు. కర్ణాటక, గోవా నుంచి మద్యాన్ని లారీలు, కంటైనర్లలో తెప్పించి గ్రామగ్రామాన విక్రయిస్తున్నారు. గత నెల రోజుల్లో భారీ మొత్తంలో మద్యాన్ని అక్రమంగా దిగుమతి చేసుకొని, కాసుల పంట పండించుకుంటున్నారు. భారీ మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లారీల నంబర్లు ముందే చెప్పి తనిఖీ చేయొద్దని హుకుం జారీ చేయడంతో పోలీసులు ఆ లారీలను వదిలేస్తున్నారు. దీంతో అక్రమ మద్యం నిరాఘాటంగా రాష్ట్రంలోకి వచ్చేస్తోంది. కర్నూలులోని ఆళ్లగడ్డ, పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు సహా పలు నియోజకవర్గాలకు కర్ణాటక, గోవా మద్యం సరఫరా అవుతోంది. ఆళ్లగడ్డలో ఇప్పటికే కర్ణాటక నుంచి 3 లారీల మద్యం దిగుమతి అయింది. జిల్లా నుంచి ఇతర జిల్లాలకూ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ మద్యం దందాలో టీడీపీకి చెందిన కొందరు మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు భాగస్వామ్యమైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. గోవా బ్రూవరేజి కంపెనీ నుంచి.. కర్నూలు జిల్లాలో మద్యం వ్యాపారంలో ఆరితేరి మంత్రిగా పని చేసిన ఓ నేతకు గోవాలోని ఓ బ్రూవరేజి కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. 2014 డిసెంబర్లో టీడీపీ ప్రభుత్వం ఉండగానే గోవా నుంచి కర్నూలు జిల్లాకు వెళుతున్న మద్యం కంటైనర్ను గుత్తి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు కూడా చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గోవాకు వెళ్లి అక్కడి బ్రూవరీని పరిశీలిస్తే నకిలీ మద్యం తయారు చేస్తున్నారని స్పష్టమైంది. అప్పట్లో మంత్రి ప్రమేయంతో ఈ కేసును నీరుగార్చారు. ఇప్పుడు మళ్లీ అధికారం దక్కడంతో అక్కడి బ్రూవరేజి కంపెనీ నుంచి తిరిగి మద్యం సరఫరా మొదలైంది. ఇప్పటికే కర్నూలు జిల్లాకు రెండు, తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాకు ఒక కంటైనర్ మద్యం వచ్చినట్లు సమాచారం. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాహనాల ద్వారా ఈ మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, గోవా లిక్కర్తో భారీ ఆదాయం మన రాష్ట్రంలోని మద్యం ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్) బేస్డ్తో తయారవుతుంది. కర్ణాటక, గోవాలో ఆర్ఎస్ (రెక్టిఫైడ్ స్పిరిట్) బేస్డ్తో తయారవుతుంది. ఈఎన్ఏతో పోలిస్తే ఆర్ఎస్ బేస్డ్ మద్యం ధర తక్కువ. అందువల్ల కర్ణాటక, గోవా మద్యం తక్కువకు లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈఎన్ఏ మద్యం నాణ్యమైనది. కర్ణాటకలో 90 ఎంఎల్ టెట్రాప్యాకెట్ ధర రూ.45, క్వార్టర్ రూ.90 మాత్రమే. ఇది అక్కడి మద్యం షాపుల్లోని రేటు. నేరుగా బ్రూవరేజెస్ నుంచి తెప్పించుకుంటే మరింత తక్కువకు వస్తుంది. ధర తక్కువ కావడంతో కర్ణాటక, గోవా నుంచి అక్రమంగా మద్యం తెస్తున్నారు. ఇది అక్రమంగా వచ్చేది కావడంతో పన్నులు కూడా ఉండవు. దీంతో టీడీపీ నేతలు తక్కువకు కొని, ఎక్కువకు అమ్ముకొని డబ్బులు దండుకొంటున్నారు. గ్రామాల్లోనే విచ్చలవిడిగా మందు కర్నూలు నగరంలోని ప్రభుత్వ వైన్షాప్ పక్కనే మద్యం తాగుతున్న మందుబాబులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో మద్యం నివారించాలని బెల్ట్షాపులను రద్దు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో టీడీపీ నేతలే జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతల ద్వారా గ్రామాల్లోనే బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మేస్తున్నారు. మద్యం దుకాణాలు ఉన్న చోట సీటింగ్కు కూడా అనధికారికంగా అనుమతి ఇచ్చి, అక్కడా అక్రమ మద్యాన్నే తక్కువ ధరకు అమ్ముతున్నారు. -
వీకెండ్ మస్తీ..హాయిగా కునుకు : ‘స్లీప్ టూరిజం’
పర్యాటక రంగంలో ఇటీవలి కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది స్లీప్ టూరిజం. ఈ కొత్త కాన్సెప్ట్కు ఆదరణ క్రమంగా పెరుగు తోంది. స్లీప్ టూరిజం అంటే ఆహ్లాద కరమైన పర్యాటక ప్రదేశానికి వెళ్లి ఆనందంగా నిద్రపోతూ సేదదీరడమే. ప్రధానంగా వేళా పాళా లేకుండా పని ఒత్తిడిలో మునిగి తేలుతున్న కార్పొరేట్ ఉద్యోగులు, ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ , యువత ఈ స్లీప్ టూరిజంపై ఆసక్తి చూపుతోంది. స్లీప్ టూరిజం సేవలు అందించే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం రండి!జీవనశైలి మార్పులు, మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగం కూడా ట్రెండ్ మార్చుకుంటోంది. అలా వచ్చిందే స్లీప్ టూరిజం. బిజీ బిజీ జీవితంనుంచి విశ్రాంతి, కోరుకునే వారి అభిరుచులకు అనుగుణంగానే అన్ని రంగాల్లాగే పర్యాటక రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సస్టెయినబుల్ టూరిజం, ఫుడ్ టూరిజం, ఎక్స్పరిమెంటల్ టూరిజం, వెల్నెస్ టూరిజం.. ఈ జాబితాలో వచ్చిందే స్లీప్ టూరిజం. దీన్నే ‘నాప్కేషన్స్' లేదా 'నాప్ హాలిడేస్' అని కూడా పిలుస్తారు.స్లీప్ టూరిజంలో యోగ, స్విమ్మింగ్, స్పా, పార్లర్ సెషన్లు , ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు గంటల కొద్దీ నిద్ర ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పచ్చని ప్రకృతి, కొండలు, లోయలు, సెలయేరుల సవ్వడి, బుజ్జి పిట్టల కిలకిలా రావాలు వీటి మధ్య హాయిగా సేదతీరడం అన్నమాట. రొమాంటిక్ అనుభవం కావాలనుకుంటే జంటగా వెళ్లవచ్చు, లేదా ఏకాంతంగా గడపాలనుకుంటే సోలోగా కూడా వెళ్లవచ్చు. అసలు ఈ ఊహే కొండంత ప్రశాంతతనిస్తుంది కదా. మరింకెందుకు ఆలస్యం. భారతదేశంలో స్లీప్ టూరిజం ప్రదేశాలు, రిసార్ట్లు, ధ్యానం, ఆయుర్వేద చికిత్సలు, థెరపీలు,నిద్రకోసం మంచి ప్యాకేజీలను అందించే కొన్ని ప్రదేశాలను చెక్ చేద్దాం.కూర్గ్: కూర్గ్ కర్నాటకలోని ఒక సుందరమైన హిల్ స్టేషన్. అక్కడి పచ్చదనం , ప్రశాంతమైన వాతావరణం స్లీప్ టూరిజానికి బెస్ట్ డెస్టినేషన్.లేహ, లడాఖ్: అందమైన సరస్సులు, కొండలు, లోయలు, కేవలం ఎండకాలంలో మాత్రమే కాదు ఏ సీజన్లో అయినా మనల్ని ఆకట్టుకునే చక్కటి ప్రకృతి రమణీయ దృశ్యాలు మంచి ఆహ్లాదాన్ని పంచుతాయి.అలెప్పీ..కేరళలోని అలెప్పీ బ్యాక్ వాటర్స్ అందాలో మంచి పర్యాటక ప్రదేశంగా పాపులర్. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వీలుగా, హౌస్బోట్లలో హాయిగా నిద్రపోయే సౌకర్యాలున్నాయి.గోవా: స్లీప్ టూరిజం సేవలకు గోవా మరో మంచి ఆప్షన్. అప్పుడే లేలేత ఎండ ..అప్పుడే చిరుజల్లులొస్తాయి భలే ఉంటుంది. ఇక్కడ రిసార్ట్లు ,హోటళ్లు , స్పా చికిత్సలు, యోగా, మంచి ఆహారం తదితర సౌకర్యాలతో మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయి.మైసూర్: మీరు ఒక వేళ దేవాలయాలను సందర్శించి, దైవ దర్శనం చేసుకొని, ప్రశాతంత పొందాలనుకుంటే మైసూర్ చక్కటి. ఇక్కడ స్లీప్ టూరిజం అవకాశాలు బాగానే ఉన్నాయి.రిషికేశ్: చుట్టూ పర్వతాలు ,బియాస్ నది పరవళ్లు, చల్లని గాలులతో రిషికేష్ కూడా హాయిగా కనుకు తీసేందుకు అనువైన ప్రదేశం.నాకో: హిమాచల్ ప్రదేశ్లోని పిన్ డ్రాప్ సైలెన్స్ ప్రాంతంగా గుర్తింపు పొందిన నాకో అనే హిల్స్టేషన్ కూడా స్లీప్ టూరిజానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ ఎంత చిన్న శబ్దమైనా చాలా దూరం వినిపిస్తుందని అంటారు. చుట్టూ పచ్చని అడవులు, అందమైన లొకేషన్ల మధ్య ఉండే ఈ ప్రాంతం హాయిగా కునుకు తీసేందుకు సరిగ్గా ఉంటుంది. దువార్స్: పశ్చిమ బెంగాల్లోని దువార్స్ పట్టణం స్లీప్ టూరిజాన్ని కోరుకునేవారికి చక్కటి ప్రదేశం అని చెప్పవచ్చు. చుట్టూ తేయాకు తోటలు, దట్టమైన అటవీ ప్రాంతం, రిసార్టులతో అత్యంత రమణీయంగా ఉంటుంది. -
సికింద్రాబాద్ – గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలనుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఈ బై వీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయల్దేరి గోవా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇప్పటివరకు వారానికి ఒక రైలు 10 కోచ్లతో సికింద్రాబాద్ నుంచి బయల్దేరి గుంతకల్కు చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 కోచ్లతో కలుపుకుని గోవాకు చేరుకునేది. ఇది కాకుండా కాచిగూడ –యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్లను కలిపేవారు. ఈ 4 కోచ్లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ – గోవా మధ్య తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. అయితే సికింద్రాబాద్ – గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలామంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ...రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ఈ ఏడాది మార్చి 16న కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు.మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో..ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్రెడ్డి గుర్తు చేశారు. దీనిపై అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. దీంతో సికింద్రాబాద్–వాస్కోడిగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడిగామా చేరుకుంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై జి.కిషన్రెడ్డి ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
గోవా వెళ్లే తెలుగు వారికి కేంద్రం గుడ్న్యూస్..
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ను ప్రారంభించనుంది. సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో ఈ రైలు గోవా బయలుదేనుంది. గోవా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం కానుంది. సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని, రైల్వే శాఖ మంత్రులకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచీగూడ - యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు.ఇలా సికింద్రాబాద్ - గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ మార్చి 16, 2024 నాడు రాశారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైల్వేశాఖ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టాల్సి వచ్చింది.మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో.. ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. దీంతో సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది.ఈ నిర్ణయంపై కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవసరమైన ఈ రైలును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది. -
ఆ పేరు వినబడితే చాలు.. వెన్నులోంచి వణుకొస్తుందట!!
గోవా అనగానే గుర్తొచ్చేది అందమైన సముద్ర తీరాలు.. అంతులేని సరదాలే! అయితే వాటితోపాటు హారర్ దృశ్యాలూ అక్కడ కామనే! వాటిల్లో ‘సాలిగావ్ మర్రిచెట్టు’ ఒకటి. సాలిగావ్ పేరు వినబడితే చాలు గోవన్లకు వెన్నులోంచి వణుకొస్తుందట. పనాజీ నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న సాలిగావ్.. హడలెత్తించే దయ్యం కథలకు ప్రసిద్ధి.‘మే డి డ్యూస్’ క్యాథలిక్ చర్చ్కి సమీపంలోని ఓ పెద్ద మర్రిచెట్టు వెనుక.. సుమారు 72 ఏళ్లనాటి బెదరగొట్టే హారర్ స్టోరీ ఉంది. అందుకే రాత్రి పూట ఆ చెట్టు వైపు చూడాలన్నా ఆ ఊరివారు భయపడుతుంటారు. దడపుట్టించే ఈ కథ 1952లో వినపడటం మొదలైంది.ఆ ఏడాది చివరిలో సాలిగావ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిలెర్నేలో క్రిస్టియన్ సెమినరీ (క్రైస్తవ మతబోధనలు జరిగే విద్యాలయం) నిర్మాణం మొదలైంది. దానికి ఇనాషియో లారెంకో పెరీరా అనే పోర్చుగీస్ ఫాదర్.. మేనేజర్గా నియమితుడయ్యాడు. అతను సాలిగావ్లో నివాసం ఉంటూ.. సెమినరీ పనులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.ఒక ఆదివారం ఉదయాన్నే సెమినరీకి వెళ్లి తిరిగి రాలేదు. మరునాడు కూడా అతని జాడ లేకపోవడంతో.. అతని కోసం స్థానికులు, చర్చ్ ఫాదర్స్ ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. ఆ గాలింపులో పెరీరా సాలిగావ్లోని మర్రిచెట్టు పక్కనే బురదలో అపస్మారకస్థితిలో కనిపించాడు. అతనిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ రాత్రే అతను సృహలోకి వచ్చినా 4 రోజుల పాటు మౌనంగానే ఉండిపోయాడు. ఐదోరోజు ఉదయాన్నే అతను ఆడ గొంతుతో కొంకణీ భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు.పెరీరాకు దయ్యం పట్టిందని గుర్తించిన క్రైస్తవ గురువులు.. ఆ మర్రిచెట్టుకు.. జీసస్ శిలువను రక్షణగా కట్టారు. వైద్యం అందిస్తున్నా పెరీరా ఆరోగ్యస్థితి మెరుగుపడలేదు. మరింత క్షీణించసాగింది. మధ్యమధ్యలో అతను ‘క్రిస్టలీనా’ అని అరవసాగాడు. దాంతో పెరీరాకు పట్టిన దయ్యం పేరు ‘క్రిస్టలీనా’ అని అక్కడివారు నిశ్చయించుకున్నారు.ఆధునిక వైద్యం కోసం అతనిని స్వదేశమైన పోర్చుగల్కు పంపించేశారు. ఇక పెరీరా తిరిగి రాలేదు. సరిగ్గా ఐదేళ్లకు అంటే 1957లో ఆ మర్రిచెట్టుకు కట్టిన శిలువ సగభాగం మాయమైపోయింది. దాంతో క్రిస్టలీనా దయ్యం తిరిగి ఆ మర్రిచెట్టును చేరుకుందని ఆ ఊరి వారు నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ దయ్యం అక్కడే ఉందని విశ్వసిస్తారు. దాంతో అటు హిందువులు.. ఇటు క్రైస్తవులు కూడా క్రిస్టలీనాను శాంతపరచే పూజలు చేస్తూ.. రాత్రిపూట ఆ మర్రిచెట్టు దరిదాపుల్లోకి పోకుండా జాగ్రత్తపడుతున్నారు.ఆ చెట్టు గోవా మొత్తానికీ ఆత్మలు గుమిగూడే ప్రదేశమని.. అక్కడ దయ్యాలు, అతీంద్రియశక్తులు కొలువుంటాయని స్థానికుల గట్టి నమ్మకం. అందుకే అటువైపు ఎవ్వరూ పోయే సాహసం చెయ్యరు. మరి ఆ మర్రిచెట్టులో క్రిస్టలీనా ఆత్మ ఉందా? అసలు ఆమె ఎవరు? ఎందుకు పెరీరాను పీడించింది? అసలు పెరీరా ఏమయ్యాడు? ఇలాంటి సందేహాలకు నేటికీ సమాధానం లేదు. అందుకే ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
గోవాలో ఒక్కసారిగా పెరిగిన ఇంధన ధరలు
గోవా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) పెంపును ప్రకటించింది. పెట్రోల్ ధర రూ.1, డీజిల్ ధరను 60 పైసలు పెంచుతూ.. స్టేట్ గవర్నమెంట్ అండర్ సెక్రటరీ (ఆర్థిక) ప్రణబ్ జి భట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ధరల పెరుగుదల ఈ రోజు (జూన్ 22) నుంచే అమలులోకి వస్తాని పేర్కొన్నారు.ధరల పెరుగుల తరువాత గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ. 95.40, డీజిల్ రూ. 87.90 వద్ద ఉంది. కర్ణాటకలో ఇంధన ధరలను పెంచుతూ ప్రకటనలు జారీ చేసిన తరువాత గోవా ప్రభుత్వం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే కర్ణాటక పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 3, రూ. 3.5 పెంచుతూ గత వారంలో కీలక ప్రకటన వెల్లడించింది.ధరల పెరుగుదల సమంజసం కాదని, ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యూరి అలెమావో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల మీద పెను భారం మోపాలని ఇలాంటి ప్రకటనలు చేస్తుందని అన్నారు. ఇటీవలే విద్యుత్ చార్జీలు పెంచారు, ఇప్పుడు ఇంధన ధరలు పెంచారని అలెమావో పేర్కొన్నారు.విద్యుత్ చార్జీలను పెంచిన తరువాత, అవినీతికి ఆజ్యం పోయడానికి ఇప్పుడు ఇంధన ధరలను పెంచిందని, సామాన్యులను ఇంకెంత బాధపెడతారు అంటూ.. గోవా ఆమ్ ఆద్మీ ప్యారీ చీఫ్ అమిత్ పాలేకర్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. -
దేవర అప్డేట్.. హైదరాబాద్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్!
టాలీవుడ్ యంగ్ టైగర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.తాజాగా గోవా షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గోవా షెడ్యూల్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని వచ్చారు. కాగా.. దేవరలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా అంటూ దేవర కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. Jr NTR is back in Hyderabad, and his upcoming film Devara: Part 1 is releasing later in 2024.#jrntr #devara #devarapart1 #airportdiaries #siima pic.twitter.com/dJjHCY3Hq6— SIIMA (@siima) June 12, 2024 -
గోవాలో ఆటా పాటా...
మళ్లీ గోవా వెళ్లాడు దేవర. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగాన్ని ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ వెల్లడించారు.ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఎన్టీఆర్తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో ఓ సాంగ్, కొంత టాకీ పార్ట్, ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట. ఈ ఏడాది మార్చిలో ‘దేవర’ యూనిట్ గోవాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది. ఇప్పుడు మళ్లీ గోవాలో షూటింగ్ జరుగుతోంది. -
ఫ్యామిలీతో గోవా బీచ్లో చిల్ అవుతున్న యాంకర్ లాస్య (ఫోటోలు)
-
పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్లు
వేసవిలో సరదాగా గడపాలనుకునేవారికి భారత్లో కొన్ని ప్రదేశాలను సూచిస్తూ అమెరికాకు చెందిన ఎయిర్బీఎన్బీ రిపోర్ట్ విడుదల చేసింది. ట్రెండింగ్ వేసవి గమ్యస్థానాల్లో గోవా, వర్కాల బీచ్లను స్వర్గధామాలుగా పేర్కొంది. జూన్, జులై, ఆగస్టులో బస చేయడానికి పర్యాటకులు జనవరి నుంచి మార్చి 15, 2024 వరకు చేసిన శోధనల ఆధారంగా ఈ రిపోర్ట్ను తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది.ఎయిర్బీఎన్బీ తెలిపిన వివరాల ప్రకారం..భారతదేశంలో ట్రెండింగ్ వేసవి గమ్యస్థానాల్లో గోవా, వర్కాల బీచ్లు కీలకంగా మారాయి. వారణాసి, దిల్లీ వంటి సాంస్కృతిక కేంద్రాలు, కొచ్చి వంటి సుందరమైన నగరాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయంగా మిలన్, అమాల్ఫీ, టోక్యో, రోమ్, ఫ్రాంక్ఫర్ట్ వంటి దేశాల్లోని ప్రదేశాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఈ సందర్భంగా ఎయిర్బీఎన్బీ జనరల్ మేనేజర్ అమన్ప్రీత్ సింగ్ బజాజ్ మాట్లాడుతూ..‘భారతీయ పర్యాటకులు వేసవిలో సేదతీరేందుకు గోవా, వర్కాల వంటి బీచ్లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. వారణాసి వంటి సాంస్కృతిక కేంద్రాలను ఎంచుకుంటున్నారు. అంతర్జాతీయంగా టోక్యోతో పాటు మిలన్, అమాల్ఫీ, రోమ్, ఫ్రాంక్ఫర్ట్ వంటి యూరోపియన్ దేశాలు విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. పర్యాటకుల ప్రాధాన్యతలకు అనుగుణంగా సంస్థ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సీజన్లో భారతీయ ప్రయాణికులు దేశంలో, విదేశాల్లో తమ గమ్యస్థానాలను అన్వేషించడానికి వీలు కల్పిస్తోంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: డిగ్రీ ఉన్నా..లేకపోయినా భారీ ఉద్యోగాలు.. లింక్డ్ఇన్ నివేదికఎయిర్బీఎన్బీ స్వల్ప, దీర్ఘకాలిక విడిదికోసం ప్రయాణికులకు బస ఏర్పాటు చేస్తోంది. ఈ అమెరికన్ కంపెనీ ఆన్లైన్లో సేవలందిస్తోంది. ప్రయాణికులు, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది. ప్రతి ఆన్లైన్ బుకింగ్ నుంచి కొంత కమీషన్ వసూలు చేస్తోంది. ఈ కంపెనీను 2008లో బ్రియాన్ చెస్కీ, నాథన్ బ్లెచార్జిక్, జో గెబ్బియా స్థాపించారు. ఎయిర్బీఎన్బీ అసలు పేరు ఎయిర్ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్. -
గుడారాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు కూలీలు మృతి
పనాజీ: గోవాలో బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వెళ్తూ అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కనున్న గుడారాల్లోకి దూసుకెళ్లింది. శనివారం(మే25) రాత్రి పనాజీకి దక్షిణాన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్నా పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుడారాల్లో నిద్రిస్తున్న నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారు నలుగురు దినసరి కూలీలని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినపుడు మొత్తం మూడు గుడారాల్లో తొమ్మిది మంది ఉన్నారు. రోడ్డు పనులు చేయడం కోసం కూలీలు బీహార్ నుంచి వచ్చినట్లు తెలిసింది. ఒక కంపెనీ ఉద్యోగులకు చెందిన బస్సు ఈ ప్రమాదానికి కారణమైంది. ప్రమాదం కారణంగా బస్సులో ఉన్నవారెవరికీ ఏమీ కాలేదు. -
నేడు ఆప్-కాంగ్రెస్ కూటమికి తొలి అగ్ని పరీక్ష!
నేడు(మంగళవారం) జరిగే లోక్సభ మూడో దశ ఓటింగ్ ఆప్-కాంగ్రెస్ కూటమికి తొలి అగ్ని పరీక్ష కానుంది. ఈ దశలో 12 రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుంది. అయితే గుజరాత్లోని మొత్తం 26 స్థానాలకు జరుగుతున్న ఓటింగ్పైనే అందరి దృష్టి ఉంది. గోవాలోని రెండు స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ- కాంగ్రెస్ కూటమిగా పోటీ చేయడం ఇదే తొలిసారి.గుజరాత్లోని రెండు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 24 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మంచి ఫలితాలను రాబట్టింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ భరూచ్, భావ్నగర్ల నుంచి అభ్యర్థులను నిలబెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, ఆప్లకు ఈ పొత్తు వల్ల ఎంత మేలు జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.చాలా కాలంగా ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు సవ్యంగా లేవు. పంజాబ్లో కాంగ్రెస్ను ఓడించి ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో ఇరు పార్టీలు పరస్పరం సహాయ సహకారాలను అందించుకుంటున్నాయి. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ను కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ కలిశారు.గోవాలో రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి. అవి దక్షిణ గోవా, ఉత్తర గోవా. ఉత్తర గోవాను బీజేపీకి కంచుకోటగా పరిగణిస్తారు. దక్షిణ గోవాలో గత 16 ఎన్నికల్లో కాంగ్రెస్ 10 సార్లు విజయం సాధించింది. 1999, 2014లో తప్ప దక్షిణ గోవా సీటును బీజేపీ ఎప్పుడూ గెలుచుకోలేదు. నార్త్ గోవా లోక్సభ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ శ్రీపాద్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి రమాకాంత్ ఖలాప్తో తలపడుతుండగా, దక్షిణ గోవాలో అధికార పార్టీ(బీజేపీ) అభ్యర్థి పల్లవి డెంపో కాంగ్రెస్ అభ్యర్థి విరియాటో ఫెర్నాండెజ్తో తలపడనున్నారు. ఉత్తర, దక్షిణ గోవా లోక్సభ స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వెబ్సైట్లోని డేటా ప్రకారం రాష్ట్రంలో 11,79,644 మంది ఓటర్లు ఉన్నారు. -
Lok sabha elections 2024: సీట్లు రెండే... పోటీ సయ్యారే !
సాగర తీర పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన గోవాలో రాజకీయాలు అనిశి్చతిమయం. నేతల పార్టీ ఫిరాయింపులు ఇక్కడ పరిపాటి. దేశానికి 1947లోనే స్వాతంత్య్రం వచి్చనా గోవా మాత్రం 1961 దాకా పోర్చుగీసు పాలనలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగి 1987లో రాష్ట్ర హోదా పొందింది. దేశంలోనే అతి చిన్న రాష్ట్రమైనా కొత్త కూటములు, కొత్త పార్టీలు, పదేపదే సీఎంల మార్పుకు మారుపేరుగా మారింది. కొందరు రెండు మూడు విడతలు పాలించగా, మరికొందరు నెల రోజులు కూడా సీఎంగా కొనసాగలేదు. ఇక్కడ పోరు జాతీయ పార్టీల చుట్టూనే తిరుగుతున్నా ప్రాంతీయ పారీ్టలూ చక్రం తిప్పుతున్నాయి... గోవాలో రెండు లోక్సభ సీట్లే ఉన్నా ఈ రాష్ట్రాన్ని పారీ్టలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో కాంగ్రెస్కు బాగా పట్టున్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ ఆధిపత్యం నడుస్తోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో కాషాయదళం ఇక్కడి రెండు సీట్లనూ దక్కించుకుని సత్తా చాటింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పారీ్టగా నిలిచినా బీజేపీ నాటకీయంగా అధికారం దక్కించుకుంది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), కొత్తగా పుట్టుకొచ్చిన గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ), కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యే మద్దతుతో మనోహర్ పారికర్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. 2019లో పారికర్ మరణానంతరం ప్రమోద్ సావంత్ సీఎం అయ్యారు. తర్వాత కూడా బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలస కొనసాగింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో సీటు దక్కించుకున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పారీ్టగా నిలిచిన బీజేపీ ప్రాంతీయ పారీ్టలతో కలిసి అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్లో ముసలం పుట్టి 11 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీలోకి జంప్ చేశారు. ఉత్తర గోవా లోక్సభ స్థానం బీజేపీకి, దక్షిణ గోవా కాంగ్రెస్కు కంచుకోటలుగా మారాయి. లోకల్ ఎఫెక్ట్ ‘ఇండియా’ కూటమి దన్నుతో కాంగ్రెస్ బరిలోకి దిగింది. రెండు సీట్లలోనూ పోటీ చేస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితరాలను ప్రచారాస్త్రాలుగా సంధిస్తోంది. బీజేపీ మోదీ, అభివృద్ధి, అయోధ్య రామ మందిరం, హిందుత్వ నినాదాలతో బరిలోకి దిగుతోంది. సౌత్ గోవాలో బీజేపీ నుంచి పల్లవి డెంపో, కాంగ్రెస్ నుంచి మాజీ నేవీ అధికారి విరియాటో ఫెర్నాండెజ్ పోటీ చేస్తున్నారు. ఉత్తర గోవాలో సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున రమాకాంత్ ఖలప్ తలపడుతున్నారు. ఇండియా కూటమి భాగస్వామి గోవా ఫార్వర్డ్ పార్టీ కాంగ్రెస్కు దన్నుగా ఉంది. ఎంజీపీ వంటి పారీ్టలు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరి అవకాశాలకు గండి కొడతాయనేది ఆసక్తికరంగా మారింది.సర్వేలు ఏమంటున్నాయి... గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకోవచ్చని మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి.ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తించిన కాంగ్రెస్కు సుప్రీంకోర్టు తాజా తీర్పు చెంపపెట్టు. ప్రజలకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి. అభివృద్ధికి పెద్దపీట వేసి, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న ఎన్డీఏ కూటమి ఒకవైపు... అవినీతి, వారసత్వ రాజకీయాలు, సొంత ప్రయోజనాలే పరమావధిగా ఉన్న ఇండియా కూటమి మరోవైపున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను గోవా సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది. నిజమైన సెక్యులరిజం, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తోంది. – గోవా ఎన్నికల సభలో ప్రధాని మోదీఅధికారంలోకి వస్తే గోవాలో మైనింగ్ కార్యకలాపాలను మూడు నెలల్లో ప్రారంభిస్తామని 2014లో మోదీ హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చనందుకు గోవా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నదుల అనుసంధానం పేరుతో మా నదులపై కేంద్రం పెత్తనం చేస్తోంది. వాటి పేర్లు మార్చేస్తోంది. గోవా గుర్తింపు, సంస్కృతిని నావనం చేస్తోంది. – ఎన్నికల ర్యాలీలో గోవా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ పాట్కర్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
పల్లవి శ్రీనివాస్ డెంపో. దక్షిణ గోవా నుంచి బీజేపీ టికెట్పై లోక్సభ బరిలో ఉన్నారు. గోవాలో బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన తొలి మహిళగా నిలిచారు. అఫిడవిట్లో పల్లవి ప్రకటించిన ఆస్తులు చూసి అంతా నోరెళ్లబెట్టారు. భర్తతో కలిపి ఏకంగా రూ.1,361 కోట్ల ఆస్తులు వెల్లడించారు. మూడో దశలో రేసులో మొత్తం 1352 మంది అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. గోవా ఎన్నికల చరిత్రలో అత్యంత సంపన్న వ్యక్తి పల్లవే. ఏ రాజకీయానుభవం లేని కుటుంబానికి చెందిన ఆమెను ఎంపిక చేసుకోవడానికి ఆమె దాతృత్వ నేపథ్యమే కారణం కావచ్చంటున్నారు...దాతృత్వం నుంచి రాజకీయాలకు 49 ఏళ్ల పల్లవి స్వస్థలం గోవాలోని మార్గావ్. టింబ్లో కుటుంబంలో జని్మంచారు. రసాయన శాస్త్రంలో డిగ్రీ, పుణెలోని ఎంఐటీ నుంచి ఎంబీఏలో పీజీ చేశారు. 1997లో డెంపో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీనివాస్ డెంపోను పెళ్లాడారు. వారి కుటుంబం ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. డెంపో గ్రూప్ మైనింగ్ వ్యాపారంతో మొదలుపెట్టి ఫుడ్ ప్రాసెసింగ్, షిప్ బిల్డింగ్, న్యూస్ పేపర్ పబ్లిíÙంగ్, పెట్రోలియం, కోక్, రియల్ ఎస్టేట్ తదితరాలకు విస్తరించింది. పల్లవి ప్రస్తుతం డెంపో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మీడియా, రియల్ ఎస్టేట్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. డెంపో చారిటీస్ ట్రస్టీగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ప్రత్యేకించి గోవాలో బాలికల విద్యను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త వంటకాలను ప్రయతి్నంచడం తన అభిరుచి అంటారామె. ఇప్పుడు రాజకీయాల్లోకి దిగి మరో ప్రయోగం చేయబోతున్నారు. ఎన్నికల బాండ్ల రగడ... 2022 జనవరిలో గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెల ముందు పల్లవి భర్త శ్రీనివాస్ వ్యక్తిగతంగా రూ.1.25 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడవడం కలకలం రేపింది. ఇక గోవా కార్బన్ లిమిటెడ్, దేవశ్రీ నిర్మాణ్ ఎల్ఎల్పి, నవ్హింద్ పేపర్స్ అండ్ పబ్లికేషన్స్తో సహా డెంపో, గ్రూప్ అనుబంధ సంస్థలు 2019 నుంచి 2024 మధ్య రూ.1.1 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశాయి. ఇవన్నీ బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి.బీజేపీ సిద్ధాంతాలు నమ్మి... దక్షిణ గోవా కాంగ్రెస్ కంచుకోట. 2019లో ఈ స్థానాన్ని బీజేపీ కేవలం 9 వేల పై చిలుకు ఓట్ల తేడాతో చేజార్చుకుంది. ఈ సారి ఎలాగైనా ఇక్కడ నెగ్గి తీరాలని పట్టుదలగా ఉంది. క్యాథలిక్ క్రిస్టియన్ల ఓట్లపై పల్లవి ప్రధానంగా దృష్టి పెట్టారు. కాంగ్రెస్ కూడా నాలుగు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ ఫ్రాన్సిస్కో సార్డినాను అనూహ్యంగా పక్కనబెట్టి మాజీ నేవీ అధికారి కెపె్టన్ విరియాటో ఫెర్నాండెజ్ను బరిలోకి దించింది. అయితే ఏకంగా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ చేయడం వంటివన్నీ ఆ పారీ్టకి కలిసొచ్చేలా ఉన్నాయి. ఆప్, గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ) వంటి ఇండియా కూటమి భాగస్వాముల దన్నుతో బీజేపీని కాంగ్రెస్ ఢీకొంటోంది. స్థానిక రివల్యూషనరీ గోవన్స్ (ఆర్జీ) పార్టీ అభ్యర్థి రూబర్ట్ పెరీరియా ఆ రెండింటికీ సవాలు విసురుతున్నారు. అయినా పల్లవి మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు. ‘‘రాజకీయాలు నా మనసులో ఎప్పుడూ లేవు. మూడు దశాబ్దాలుగా కుటుంబ వ్యాపారాలు, సేవా కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాను. అయితే దేనికైనా ఒక ఆరంభమంటూ ఉంటుంది. రాజకీయాల్లో ఇది నా తొలి అడుగు. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి ముందడుగు వేస్తున్నాను’’ అంటున్న ఆమె కాంగ్రెస్కు కంచుకోటలో చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు
కొల్హాపూర్/గోవా: కేంద్రంలో విపక్ష ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానమంత్రులు కుర్చీ ఎక్కుతారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఆ కూటమి గెలిచే అవకాశమే లేనప్పటికీ ఎవరెప్పుడు ప్రధాని కావాలన్న దానిపై ఇప్పటినుంచే మంతనాలు సాగిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను దేశం భరించబోదని అన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్తోపాటు గోవాలో ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించారు. కర్ణాటకలో ఓబీసీల జాబితాలో ముస్లింలను చేర్చారని తప్పుపట్టారు. దీంతో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు దక్కడం లేదన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కర్ణాటక మోడల్ దేశమంతటా అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. సామాజిక న్యాయాన్ని హత్య చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమా? అని నిలదీశారు. కాంగ్రెస్కు ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలే తప్ప ప్రజల సంక్షేమం పట్టడం లేదని దుయ్యబట్టారు. వారసత్వ పన్ను విధించి జనం ఆస్తులు లాక్కోవాలని చూస్తున్న పార్టీలను అధికారానికి ఆమడ దూరంలో ఉంచాలని ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నించింనందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్నారు. ఈసారి ఎన్నికలు రెండు శిబిరాల మధ్య జరుగుతున్నాయని వివరించారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్న ఎన్డీయే ఒకవైపు, సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఉందని పేర్కొన్నారు. -
Vini Tandon Keni: చీర... నా రెండో గుర్తింపు
అప్పటివరకు గృహిణిగానే కాలం వెళ్లబుచ్చింది వినీ టాండన్ కెనీ. 53 ఏళ్ల వయసులో చీరకట్టు ద్వారా బిజినెస్ ఉమెన్గా మారింది. నేటి తరం అమ్మాయిలకు చీరకట్టు నేర్పించడానికి గోవాలో ప్రత్యేకంగా ‘శారీ స్పీక్’ స్టూడియోను ఏర్పాటు ద్వారా చేనేతకారులను ప్రోత్సహిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ‘శారీ గ్రూప్’ ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలను ప్రభావితం చేస్తోంది. ‘చీర నా రెండో గుర్తింపు’ అంటున్న వినీ గురించి ... వినీ టాండన్ కెనీ ని పలకరిస్తే చాలు చీరల పట్ల తనకున్న ప్రేమను ఎంతో ఆనందంగా వ్యక్తపరుస్తుంది. ‘శారీ స్పీక్’ స్టూడియో వ్యవస్థాపకురాలుగా ఆమె ప్రయాణం నేటితరానికి కొత్త పాఠం. భార్య.. తల్లి... కోడలు.. శారీ ఇన్ఫ్లుయెన్సర్, కామిక్ కంటెంట్ సృష్టికర్త కూడా... ఇన్ని పాత్రలను చిరునవ్వుతో పోషించవచ్చుననడానికి వినీనే ఉదాహరణ. ‘నా కుటుంబమే నాకు బలం. ఉత్సాహం. మా కుటుంబ సభ్యులే నా ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు. ఫేస్బుక్ గ్రూప్ ‘శారీ స్పీక్’ని క్రియేట్ చేసి రేపటికి ఏడేళ్లు పూర్తవుతాయి. ఈ గ్రూప్ కారణంగా చాలామంది మహిళల ఆలోచనల్లో చీర గురించిన నిర్వచనమే మారిపోయింది. ఖాళీ నుంచి మొదలైన ప్రయాణం... నేను పుట్టి పెరిగింది ఉత్తర్ప్రదేశ్లోని హర్దోయ్లో. మా నాన్నగారు మెరైన్ ఇంజనీర్ అవడంతో ఆయన ఉద్యోగరీత్యా వివిధ నగరాల్లో నివసించాం. నాన్నగారికి గోవాలో పోస్టింగ్ వచ్చినప్పుడు అక్కడ ప్రసాద్ కెనీతో నా పెళ్లి జరిగింది. అలా నేను గోవాలోనే ఉండిపోయాను. ఇద్దరు అబ్బాయిల పెంపకంలో ఎప్పుడూ తీరికలేకుండా ఉండేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లై కాలేజీలకు వెళుతున్నప్పుడు నాలో ఏదో వెలితి ఏర్పడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా ఆసక్తుల వైపు దృష్టి సారించాను. మొదట సినిమా అభిమానుల కోసం ‘మూవీ స్పీక్’ పేరుతో ఫేస్బుక్ గ్రూప్ను క్రియేట్ చేశాను. ఆ తర్వాత వివిధ రకాల కళలు, కవులు .. మొదలైన గ్రూప్లను సృష్టించాను. అదే సమయంలో ‘శారీ స్పీక్’ బృందం కూడా ఏర్పాటయింది. అలా మొదలైంది... మా అమ్మ, అత్తగారు సౌకర్యం కోసం చీర నుంచి సల్వార్ కమీజ్కు మారినప్పుడు నాకెందుకో మనసు చివుక్కుమంది. ఈ విధంగా ఆలోచిస్తే అందరూ చీర కట్టుకోవడం మానేస్తారని అనిపించేది. దీంతో నేను చీర కట్టుకోవడం మొదలుపెట్టాను. నన్ను చీరలో చూసి, నా చుట్టూ ఉన్న ఆడవాళ్లు కూడా చీరలవైపు మొగ్గు చూపేవారు. చీరకట్టు ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేసేదాన్ని. నాకు మంచి స్పందన రావడంతో వాళ్లూ పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. చేనేత కారులే నా బ్రాండ్... మా చిన్నబ్బాయి సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయమన్నప్పుడు శారీ ఐడియా గురించి చెప్పాను. స్టూడియో ఏర్పాటుకు తనే మద్దతుగా నిలిచాడు. దీంతో 53 ఏళ్ల వయసులో శారీ స్టూడియోతో వ్యాపారవేత్తను అయ్యాను. నా సొంత బ్రాండ్ అంటూ ఏమీ లేదు. దేశవ్యాప్తంగా ఉన్న నేత కార్మికుల నుంచి చేనేత చీరలను కొనుగోలు చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాను. నా స్టూడియోలో 95 శాతం చేనేత చీరలే ఉంటాయి. ఇప్పుడు చీరలను ఇష్టపడే మహిళలు వాటిని కొనడానికి నా స్టూడియోకు రావడం మొదలుపెట్టారు. కొందరు చీర కట్టుకోవడం తమకు చేతకాదని, ఇంకొందరూ తమకు అసౌకర్యం అని చెబుతుంటారు. చీరకట్టుకోవడానికి ఐదు నిమిషాలు చాలు. ఇక అసౌకర్యం ఎందుకో నాకు అర్థం కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నా స్టూడియోలో చీరకట్టుకు సులువైన టెక్నిక్స్ ఇస్తుంటాను. శారీ స్పీక్ స్టోరీలు... చీరకట్టు గురించి మాత్రమే కాదు వారి ఆనందం, అలాగే తమ మానసిక వేదనల నుంచి బయటపడే విధానాల గురించి చెప్పినప్పుడు వాటినీ సోషల్ మీడియా వేదికగా పంచుతుంటాను. బెంగళూరుకు చెందిన ఉషా అగర్వాల్ అనే మహిళ తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. కొన్ని రోజులకు నా పోస్ట్లను చూసి తనూ ప్రతి రోజూ కొత్త చీర కట్టుకొని, వాటిని పోస్ట్ చేసింది. ఆ మార్పుతో తన బాధ నుంచి కొద్ది రోజుల్లోనే బయటపడగలిగింది. ఆమె శారీ స్పీక్కి కృతజ్ఞతలు తెలిపింది. వెయ్యిమందిలో... ప్యాంటు నుండి సల్వార్ డ్రెస్సుల వరకు అన్నీ ధరిస్తాను. కానీ, నాకు అపారమైన నమ్మకాన్ని ఇచ్చేది శారీనే. చీర కట్టుకోగానే నా ముఖంలో చిరునవ్వు వచ్చేస్తుంది. నాతో చీర మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. కిందటేడాది భారతీయ నేత కార్మికులకు సహాయం చేయడానికి యూకే రాయల్ ఆస్కాట్ హార్స్ రేస్లో సుమారు వెయ్యిమంది వరకు చీరలు ధరించారు. వారిలో నేనూ ఉన్నాను. మేం తమ దేశంలో చీర ధరించాలని నిర్ణయించుకున్నందుకు బ్రిటిషర్లు మా వేషధారణను చూసి ఎంతో ఆనందించామని చెప్పారు. అప్పుడు నాకు చాలా సంతోషమనిపించింది. లక్షా డెబ్భై వేల మంది సభ్యులు... శారీ స్పీక్ ఫేస్బుక్ అకౌంట్కి ప్రపంచం నలుమూలల నుండి లక్షా డెబ్భై వేల మంది సభ్యులు గా ఉన్నారు. ఈ గ్రూపులో మహిళలు మాత్రమే సభ్యులు. ఈ గ్రూప్ చీరలను మాత్రమే ప్రమోట్ చేస్తుంది. ఇన్నేళ్లుగా చీర నన్ను బిజీగా ఉంచింది. నిన్ను చూడగానే చీరలు కట్టుకోవడం మొదలు పెట్టామంటూ చాలా మంది మహిళలు నాకు మెసేజ్ చేస్తుంటారు. మీ వల్లే మాకు ప్రమోషన్ వచ్చిందని, మా అమ్మకాలు పెరిగాయని చేనేత కార్మికులు అంటున్నారు. ఇదంతా వింటే మరింత పనిచేయాలనే ధైర్యం వస్తుంది. ఈ నెల 14న మా గ్రూప్ ఎనిమిదో వార్షికోత్సవాన్ని జరపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీరూ చీరలో ఆనందంగా విహరించండి’ అంటున్నారు వినీ టాండన్. -
జనసేన ‘కిక్కు’ దిగింది
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల్లో ఏదోవిధంగా తాయిలాలతో గెలవాలని, దానికి భారీగా మద్యం అందిస్తేనే ఫలితం ఉంటుందని భావించారు. భారీగా మద్యం తీసుకొచ్చి గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టాలనే ఆలోచనతో టీడీపీ, జనసేన నేతలు దాదాపు 39,163 క్వార్టర్ బాటిళ్లు గోవా నుంచి అక్రమంగా కొనుగోలు చేశారు. దశలవారీగా మద్యాన్ని వినియోగిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా గడ్డివాములో దాచి సమావేశాలు నిర్వహించినప్పుడల్లా గుట్టు చప్పుడు కాకుండా బయటకు తీస్తున్నారు. తీరా తీగలాగితే డొంక కదిలినట్లు అనుమానాస్పదంగా బైక్పై వెళ్తున్న ముగ్గుర్ని పోలీసులు ప్రశ్నిస్తే బండారం బయటపడింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్కు మద్యం విక్రయించేందుకు అక్కడి టీడీపీ నాయకుడు కర్రి వెంకటస్వామి చేస్తున్న అక్రమ మద్యం సరఫరా గుట్టురట్టయింది. వారి నుంచి దాదాపు రూ. 50లక్షల విలువైన 7 వేల లీటర్ల గోవా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు టీడీపీ నేతలు అరెస్ట్ అక్రమ మద్యం స్వా«దీనం చేసుకున్న సంఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ శనివారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. యలమంచిలి మండలం సోమలింగపాలెంకు చెందిన ప్రధాన నిందితుడు, టీడీపీ నేత కర్రి వెంకటస్వామి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తుంటాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కర్రి ధర్మతేజ, బొడ్డేటి దినేష్కుమార్ సహకరించారు. పది రోజుల క్రితం గోవా నుంచి సరుకు తెప్పించి, యలమంచిలి మున్సిపాలిటీ పరిధి సోమలింగంపాలెంలోని తన పశువుల పాక వద్ద గడ్డివాములో దాచిపెట్టాడు. ఈ మద్యాన్ని యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒక్కసారిగా ఇస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉందని సమావేశాలు నిర్వహించినప్పుడల్లా వెంకటస్వామి మద్యం అందించేవాడు. శనివారం మధ్యాహ్నం మునగపాక గ్రామంలో అక్రమ మద్యం రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారంతో మునగపాక ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పద వస్తువులను పట్టుకెళుతున్నట్టు గమనించి వారి లగేజ్ను తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 5 కేసుల్లో 180 మిల్లీ లీటర్లు కలిగిన 240 రాయల్ బ్లూ లిక్కర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. అంతేగాక మరికొంత మద్యాన్ని దాచిపెట్టినట్లు చెప్పడంతో గడ్డివాము వద్ద భారీ ఎత్తున దాచిన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అక్రమ మద్యం ఎవరెవరికి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. డంపు వెనక ఎవరున్నారు, అనే విషయాలను విచారిస్తున్నామని ఎస్పీ చెప్పారు. దీని వెనుక ఎవరున్నా అరెస్టు చేస్తామన్నారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, యలమంచిలి సీఐ గఫNర్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి అనకాపల్లి జిల్లా జడ్జి వద్ద హాజరు పరిచారు. నిందితుల నుంచి రెండు బైక్లను స్వాదీనం చేసుకున్నారు. -
గోవా: మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
పనాజీ: గోవాలో అదృశ్యం అయిన నేపాల్లోని ధంగధి సబ్ మెట్రోపాలిటన్ నగరం మేయర్ కుమార్తె ఆర్తీ హామల్ ఆచూకీ రెండు రోజుల తర్వాత లభించింది. ఆర్తీ హామల్ రెండు రోజుల క్రితం గోవాలో అదృశ్యమైన విషయాన్ని ఆమె తండ్రి వెల్లడించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అదృశ్య ఘటనపై కేసు నమోదు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎట్టకేలకు పోలీసులకు ఆమె ఆచూకీ లభించింది. ఆమె నార్త్ గోవాలోని మాండ్రేమ్లో ఓ హెటల్లో కనిపించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆమెతో మరో ఇద్దరు మహిళలతో ఆమెను ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నామని పోలీసులు తెలిపారు. ఆర్తీ హామల్ గత కొన్ని నెలలుగా గోవాలో ఉంటున్నారు. ఆమె చివరిగా సోమవారం రాత్రి 9.30కు అశ్వేం వంతెన సమీపంలో కనిపించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆమె స్థానికంగా ఉండే ఓషో మెడిటేషన్ సెంటర్లో ధ్యాన శిక్షణ పొందుతున్నట్లు నేపాల్ మీడియా పేర్కొంది. ఆర్తీ స్నేహితురాలు ఆమె తండ్రికి అదృశ్యం విషయం తెలియజేయగా ఆయన సోషల్ మీడియా వేదికగా తమ కూతురి ఆచూకీ తెలియజేయాలని కోరారు. ‘ఆర్తీ నా పెద్ద కూతురు. ఆమె ఓషో ధ్యాన సాధకురాలు. కొన్ని నెలలుగా గోవాలో ఉంటుంది. ఆర్తీ కనిపించటం లేదని ఆమె స్నేహితురాలు సమాచారం అందించటంతో విషయం తెలిసింది. గోవా ఉండేవారు నా కూతురి ఆచూకీ తెలపటంలో సాయం చేయాలని కోరుతున్నా’అని ఆయన ఎక్స్ వేదికగా కోరారు. అదేవిధంగా తన చిన్న కూతురు, అల్లుడు గోవాకు బయల్దేరారని తెలిపారు. తన కూతురును వెతకటంలో సాయం అందించాలని ఆచూకీ తెలియటంతో తమను సమాచారం ఇవ్వాలని ఫోన్ నంబర్లను జత చేశారు. -
పాట.. ఫైటు
గోవాకు బై బై చెప్పారు ‘దేవర’. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. శ్రుతీ మరాఠి, చైత్ర, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. కాగా ఇటీవల గోవాలో మొదలైన ‘దేవర’ సినిమా చిత్రీకరణ ముగిసిందని సమాచారం. ఓ ఫైటు సీక్వెన్స్ తో పాటు ఓ పాటను చిత్రీకరించారట మేకర్స్. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లోని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందని తెలిసింది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభం అవుతుందని, ఏప్రిల్ మొదటివారంలో ఈ కొత్త షెడ్యూల్ ఉండే అవకాశం ఉందని భోగట్టా. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. -
గోవా క్యాంప్లో కేటీఆర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ తీవ్రంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లను గోవాకు తరలించారు. ఈ క్రమంలో గోవా క్యాంప్లో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సమావేశం కావడం హాట్టాపిక్గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పార్టీ చూసుకుంటుందని హామీ ఇచి్చనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా పార్లమెంట్ పోరులో ముందంజలో ఉంటామని.. ప్రతి ఒక్కరూ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచి్చనట్టు తెలిసింది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 1,439 ఓట్లు ఉన్నాయని.. ఇందులో వెయ్యికి పైగా ఓటర్లు బీఆర్ఎస్కు చెందిన వారేనని.. నవీన్కుమార్రెడ్డి గెలుపు ఖాయమని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని.. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని.. వారిలో ఆత్మస్థైర్యం నింపేలా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. కేటీఆర్ వెంట మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్రెడ్డి, ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ తదితరులు ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నెల 28న పోలింగ్ జరగనుండగా.. ఆయా పారీ్టలు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్లకు తరలించాయి. బీఆర్ఎస్ గోవా, ఊటీ.. కాంగ్రెస్ గోవాతో పాటు ఏపీ, కర్ణాటకలో శిబిరాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. 100 మంది వరకు స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్న బీజేపీ సైతం కొడైకెనాల్లో క్యాంప్ ఏర్పాటు చేయడం పోరు తీవ్రతకు అద్దం పడుతోంది. బీఆర్ఎస్ నుంచి మాజీ జెడ్పీ వైస్చైర్మన్ నవీన్కుమార్రెడ్డి, కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్రెడ్డి పోటీపడుతున్నారు. -
గోవాలో ఆటా పాటా
గోవాలో ఆట పాటలతో సందడి చేస్తున్నాడు ‘దేవర’. ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగుకి పరిచయమవుతున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఓ మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ కోసం గోవా చేరుకుంది ‘దేవర’ యూనిట్. గోవాలో మొదలైన కొత్త షెడ్యూల్లో రాజు సుందరం మాస్టర్ నేతృత్వంలో ఓ మాంటేజ్ సాంగ్ తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఈ సందర్భంగా ‘దేవర’ నుంచి ఓ వర్కింగ్ స్టిల్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్తో పాటు కొరటాల శివ, రాజు సుందరం మాస్టర్ కనిపిస్తున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఇప్పటికే గోవాలో కొంత టాకీ పార్ట్ చిత్రీకరించాం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త మాస్ పాత్రలో కనిపిస్తారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు మేకర్స్. సైఫ్ అలీఖాన్, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు. -
ఎన్టీఆర్ 'దేవర'.. చలో గోవా
గోవాకు వెళ్లనున్నారట దేవర. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘దేవర’. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కల్యాణ్రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలకానుంది. తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. కాగా ‘దేవర’ సినిమా యూనిట్ పాటల చిత్రీకరణ కోసం గోవా వెళ్లనున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. అతి త్వరలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది తెలిసింది. గోవా షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరిస్తారట మేకర్స్. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. -
గోవా జైలే డ్రగ్స్కు అడ్డా.. 500 మందితో నెట్వర్క్..
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట డ్రగ్స్ కేసు నిందితుడు స్టాన్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్తో స్టాన్లీ పట్టుబడ్డాడు. ఇక, స్టాన్లీ డ్రగ్స్ లింక్స్.. పోలీసుల కస్టడీ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 500 మందితో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్న్యాబ్) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో స్టాన్లీకి విదేశాల నుంచి మాదకద్రవ్యాలు చేరవేసే వ్యవహారం అంతా గోవాలోని కోల్వలే జైలు కేంద్రంగా సాగిందని వెల్లడికావడంతో టీఎస్న్యాబ్ అటువైపు దృష్టి సారించింది. అక్కడి జైల్లో ఖైదీలుగా ఉన్న నైజీరియన్ ఓక్రాతోపాటు ఆ ముఠాలో కీలకంగా ఉన్న ఫైజల్లను తీసుకువచ్చే ప్రయత్నాల్లో తలమునకలైంది. న్యాయస్థానం అనుమతితో ఓ బృందం ఇప్పటికే గోవాకు వెళ్లింది. వారిద్దరినీ విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇక, గోవా కేంద్రంగా సింథటిక్ డ్రగ్స్ను సరఫరా చేయడంలో స్టాన్లీ ముఠా ఆరితేరింది. ఆ క్రమంలో హైదరాబాద్కు వచ్చిన స్టాన్లీ సుమారు రూ.8 కోట్ల విలువైన మాదకద్రవ్యాలతో ఇటీవల టీఎస్న్యాబ్కు చిక్కాడు. అతడిని విచారించిన క్రమంలో ఈ ముఠాకు యూరోపియన్ దేశాల నుంచి డ్రగ్స్ అందుతున్నట్లు తేలింది. ఆయా దేశాల నుంచి ఓడల్లో తొలుత ముంబైకి సరకు చేరుతున్నట్లు, అక్కడి నుంచి హైదరాబాద్ సహా దేశంలోని ఇతర మెట్రో నగరాలకు సరఫరా అవుతున్నట్టు నిర్ధారణయింది. కొకైన్, ఎల్ఎస్డీ బ్లాట్స్, చరస్, హెరాయిన్, అంపిటమైన్, మారిజువానా, ఓజీ కుష్.. తదితర మాదకద్రవ్యాల్ని ఈ ముఠా తెప్పించి అవసరమైన కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారానికి గోవాలోని కోల్వలే జైలు కేంద్రబిందువుగా ఉన్నట్లు, జైల్లో ఉన్న ఓక్రా, ఫైజల్లు సెల్ఫోన్ల ద్వారానే డ్రగ్స్ కోసం విదేశాలకు అర్డర్లు పంపిస్తున్నట్లు, సరకు చేరిన అనంతరం సౌరవ్ అనే పెడ్లర్ ద్వారా స్టాన్లీ సహా ఇతర డ్రగ్ ముఠాలకు దాన్ని అందజేసేలా ఓక్రా నెట్వర్క్ను సృష్టించినట్టు విచారణలో స్టాన్లీ వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విచారణలో వెల్లడైన అంశాలను టీఎస్న్యాబ్ బృందం ఐదారు రోజుల క్రితం గోవా పోలీసులకు చేరవేసి అప్రమత్తం చేసింది. అనంతరం కోల్వలే జైల్లో అక్కడి అధికారులు తనిఖీలు నిర్వహించగా ఖైదీల వద్ద 16 సెల్ఫోన్లు లభించడం కలకలం రేపింది. ఎఫ్ఎస్ఎల్లో సెల్ఫోన్లలోని సమాచారాన్ని విశ్లేషించడంపై ప్రస్తుతం గోవా పోలీసులు దృష్టి సారించారు. సదరు కాల్డేటాను తెప్పించుకోవడంతోపాటు ఓక్రా, ఫైజల్లను ఇక్కడికి తీసుకొచ్చి విచారిస్తే ఈ ముఠా లీలలతోపాటు యూరోపియన్ దేశాల్లో డ్రగ్స్ సరఫరా దందాపై కీలక సమాచారం లభిస్తుందని టీఎస్న్యాబ్ భావిస్తోంది. -
గోవాలో గ్రాండ్ గా రకుల్ పెళ్లి
-
పోలీస్ కస్టడీకి గోవా డ్రగ్ పెడ్లర్ స్టాన్లీ
-
గుట్టుగా గోవాలో..పెళ్లి చేసుకున్న నటి
2011లో టాలీవుడ్లో చిత్రం బ్రమ్మిగాడి కథ మూవీతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ అస్మితా సూద్ మూడు ముళ్లు వేయించుకున్న సంబరంలో మునిగి తేలుతోంది. గోవాలో జరిగిన ఒక ప్రయివేట్ ఈవెంట్లో ప్రియుడు, గుజరాతీ వ్యాపారవేత్త సిద్ధ్ మెహతాను పెళ్లాడింది. బాలీవుడ్షాదీస్డాట్కామ్ ప్రకారం అస్మితా సూద్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గోవాలో ఫిబ్రవరి తొలి వారంలో 'లవ్ ఆఫ్ లైఫ్' సిద్ధ్ మెహతాను వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. గులాబీ రంగు లెహంగా, డిజైనర్ ఆభరణాలతో పెళ్లి కూతురిగా అస్మితా, వైల్ కలర్ బంద్గాలా సూట్లో సిద్ ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేశారు. అంతేకాదు తొలి రోజు సంగీత్, కాక్టెయిల్ పార్టీ, రెండో రోజు హల్దీ వేడుకలను చేసుకున్న ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. బ్రమ్మిగాడి కథ తరువాత, 40కి పైగా బ్రాండ్లలలో కనిపించింది. అలాగే ‘ఫిర్ భీ నా మానే’...‘బత్తమీజ్ దిల్’, ‘దిల్ హీ తో హై’సహా అనేక టెలివిజన్ షోలతో పాపులర్ అయింది. ఇక చివరిసారిగా టీవీ షో, ‘జనమ్ జనమ్ కా సాత్’లో కనిపించింది. ఇప్పటికే సిద్ధ్ తో డేటింగ్లో ఉన్న ఈ అమ్మడు ఇటీవల వెకేషన్ ఫోటోలను, ప్రియుడు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతేడాది సెప్టెంబర్లోనే నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. -
'గోబీ మంచూరియా'ని ఆ నగరం పూర్తిగా బ్యాన్ చేసిందట!
గోబీ మంచూరియాని ఇష్టపడిని వాళ్లు ఉండరు. దాన్ని చూస్తేనే నోటిలో నీళ్లు ఊరిపోతాయి. అలాంటి గోబీ మంచూరియాని భారత్లోని ఆ నగరం పూర్తిగా నిషేధం విధించింది. అంతేకాదండోయ్ అక్కడ స్టాల్స్లో దీన్ని ఎక్కడైన అమ్మితే అధికారులు వాటిపై దాడులు కూడా నిర్వహిస్తారట. ఎందుకని ఇంతలా గోబీ మంచూరియాపై యుద్ధం చేస్తున్నారో వింటే కచ్చితంగా మనం కూడా బుద్ది తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తామేమో!. ఏంటీ ఇలా అంటున్నారేంటీ అనుకోకండి. వింత రుచుల మాయలో అందులో ఏం వాడుతున్నారు? ఎలాంటివి తినేస్తున్నాం అనేవి మర్చిపోతున్నాం. జిహ్వ చాపల్యంతో కోరి కష్టాలు తెచ్చుకునే నేటి జనరేషన్కు ఇదొక కనువిప్పు అనే చెప్పాలి. ఎందుకిలా చెబుతున్నానంటే.. గోబీ మంచూరియా రుచే వేరబ్బా!. తింటే వదలరు అనేంత టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు ఎంతో ఇష్టమైన వంటకం ఇది. అయితే దీన్ని కార్న్ప్లోర్ పిండిలో ముచి వేయించి ఆ తర్వాత సోయా సాస్, వెనిగర్, పంచదార, టొమోటా సాస్తో కాస్త గ్రేవీ లేదా డ్రైగా చేసి ఇస్తారు. ఇలా స్పెషల్గా చేసే వంటకం కావడంతోనే నిషేధం విధించింది భారత్లోని గోవా నగరం. అందులో వినియోగించే పదార్థాల వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు. అయితే దాని రుచికి ఫిదా అయ్యి ప్రజలు అవేమీ పట్టించుకోకుండా లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. దీంతో గోవా మపుసా మున్సిపల్ కౌన్సిల్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెసిపీ విక్రయాలను పూర్తిగా నిషేధించింది. ఎక్కడైన ఫుడ్ స్టాల్స్లో ఈ డిష్ ఉంటే వెంటనే వాటిపై దాడులు నిర్వహించడం వంటివి చేసేలా అధికారులుకు ఆదేశాలను జారీ చేసింది కూడా. కేవలం మున్సిపల్ పౌర సంస్థే కాదు. గోవాలోని శ్రీ దామోదర్ ఆలయంలో వాస్కో సప్తాహ్ ఫెయిర్ సందర్భంగా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) గోబీ మంచూరియా అమ్మే స్టాళ్లను తీసేయాలని మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్కు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాదు ఆ డిష్ అమ్మకాలు అరికట్టేలా ఎప్డీఏ స్టాల్స్పై పలు దాడులు కూడా నిర్వహించింది. దీంతో ఆ వంటకం గోవా వీధుల్లోని స్టాల్స్లో ఎక్కడ కనిపించదనే చెప్పొచ్చు. నిజానికి ఈ గోబీరియా మంచూరియా అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం. ముంబైకి చెందిన చైనీస్ పాక శాస్త్ర నిపుణుడు నెల్సన్ వాంగ్ ఈ వంటకాన్ని కనిపెట్టాడు. 1970లలో క్రిక్ట్ క్లబ్ ఆప్ ఇండియాలో క్యాటరింగ్ చేస్తున్నప్పుడూ చికెన్ మంచూరియాను తయారు చేశాడు. అతను చికెన్ నగ్గెట్లను స్పైసీ కార్న్ఫ్లోర్ పిండిలో వేయించి పొడిగా లేదా సోయా సాస్, వెనిగర్, పంచదార లేదా టోమాట సాస్లో గ్రేవీ రూపంలో సర్వ్ చేసేవాడు. ఇక శాకాహార ప్రియులకు ఆ లోటును భర్తీ చేసేలా దాని స్థానంలో గోబీ మంచూరియాని తీసుకొచ్చాడు. అలాంటి గోబీ మంచూరియాని ప్రజల ఆరోగ్యం కోసం గోవా నగరం నిషేధించడం విశేషం. ఇలా ప్రతీ నగరంలోని అధికారులు భావిస్తే ప్రజలు అనారోగ్యం బారినపడటం తగ్గుముఖం పడుతుంది కదూ!. (చదవండి: బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నో షుగర్ డైట్!అలా చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి?) -
గోవాలో మాఫియా
ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముంబై నేపథ్యంతో మాఫియా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తిరుపతిలో ప్రారంభమైంది. కాగా ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ గోవాలో జరగనున్నట్లు తెలిసింది. దాదాపు రెండు వారాలపాటు సాగే ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తారట దర్శకులు శేఖర్ కమ్ముల. ఈ షెడ్యూల్లోనే రష్మికా మందన్నా కూడా జాయిన్ అవుతారట. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
మహేందర్ది హత్యా ? ఆత్మహత్యా ?
నందిపేట్(ఆర్మూర్): సుపారీ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.. పలు కేసుల్లో అత్యంత వివాదాస్పదుడు నందిపేట మండలం లక్కంపల్లి తాజామాజీ సర్పంచు సుమలత భర్త మూడ మహేందర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆర్మూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రధాన అనుచరుడిగా పేరుపొందిన ఆయన శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు మొదట ప్రచారం జరిగింది. అయితే శనివారం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో పోస్టుమా ర్టం నిర్వహించడంతో మహేందర్ది హత్యా ? ఆత్మహత్యా ? అనుమానాలతో చర్చనీయాంశమైంది. గత నెల 22న ఇద్దరు స్నేహితులు, ఇద్దరు పోలీసు శాఖకు చెందిన వారితో కలిసి గోవాకు వెళ్లిన మహేందర్ అక్కడ నిషేధిత డ్రగ్స్ అతిగా తీసుకుని పక్షవాతానికి గురైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసి ఆయన భార్య మరుసటి రోజు గోవాకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడి ఆస్పత్రిలో నాలుగు రోజుల చికిత్స అనంతరం ఒక పోలీస్ అధికారి సహాయంతో హైదారాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరిన మహేందర్ మృతి చెందాడు. కాగా ఆయనకు పక్షవాతం వచ్చిన విషయాన్ని, చివరికి చనిపోయిన మూడు గంటల వరకు ఎందుకు ఎవరికీ తెలియనీయలేదని, గుండె పోటుతో మరణిస్తే ఎందుకు పోస్టు మార్టం చేస్తారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య ఫిర్యాదు.. గోవాలో మెడికల్ లీగల్ కేసుగా నమోదైనందున ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మహేందర్ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు నందిపేట ఎస్సై రాహుల్ తెలిపారు. ఫిట్స్తో పాటు గుండెపోటుతో మృతి చెందినట్లు మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శనివారం స్వగ్రామంలో జరిగిన మహేందర్ అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, పలువురు తాజా మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. స్టేటస్లో ఫొటోలు.. ఓ వైపు పక్షవాతానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు మహేందర్ ఫోన్ స్టేటస్లో ప్రతిరోజు గోవాలో తిరుగుతున్నట్లు ఆయన ఫొటోలు దర్శన మిచ్చాయి. చివరికి ఆయన చనిపోయిన రోజు కూడా ఉదయం 10.36 గంటలకు స్టేటస్లో గోవా బీచ్ ఫొటోలు కనిపించాయి. మహేందర్ మృతి ఘటన వెనుక రహస్యాలను మరుగు పర్చడానికే ఇలా స్టేటస్లో ఫొటోలు అప్లోడ్ చేసి ఉంటారని అంటున్నారు. గోవాలో నిషేధిత డ్రగ్స్ స్వయంగా తీసుకున్నాడా.. అతనికి ఉన్న క్రిమినల్ నేపథ్యం వెనుక సూత్రధారులెవరైనా బలవంతంగా ఎక్కువ డోసులు ఇచ్చారా అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. -
Rakul, Jackky Wedding: పెళ్లి విషయంలో రకుల్ యూ టర్న్.. అదే కారణమా?
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిల్లీ భామ తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో అభిమానుల్లో పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత లౌక్యం, కరెంటు తీగ, కిక్ -2, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, స్పైడర్ సినిమాల్లో స్టార్ హీరోలతో నటించింది. అయితే గత రెండేళ్లుగా బాలీవుడ్కు మకాం మార్చింది. అక్కడ అటాక్, రన్ వే -34, ఛత్రీవాలీ, ఐ లవ్ యూ లాంటి సినిమాలు చేసింది. అయితే గత కొన్నాళ్లుగా నటుడు-నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమాయణం కొనసాగిస్తోంది ముద్దుగుమ్మ. ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇక త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది భామ. ఈ జంట తమ వివాహా వేడుక కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. విదేశాల్లో పెళ్లి చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. గోవాకు మారిన వెడ్డింగ్.. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సడన్గా యూ టర్న్ తీసుకుంది. తన పెళ్లి కోసం విదేశాలకు వెళ్లడం లేదని తెలుస్తోంది. పెళ్లి వేదికను ఇండియాలోని గోవాకు మార్చుకుంది. ఫిబ్రవరి 22న వీరిద్దరి వివాహా వేడుక గోవాలో జరగనుంది. అయితే చివరి నిమిషంలో లొకేషన్ను ఇండియాకు మార్చడానికి నిర్ణయం తీసుకోవడానికి అదే కారణమా అంటూ నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. అదేంటో తెలుసుకుందాం. మోదీ పిలుపే కారణమా? రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని మొదట్లో విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ని ప్లాన్ చేశారు. కానీ సడన్గా ఈ నిర్ణయం మార్చుకోవడం వెనుక మన ప్రధాని మోదీనే కారణమని వార్త నెట్టింట వైరలవుతోంది. ఎందుకంటే గతేడాది డిసెంబర్లో ధనిక, వ్యాపార, సెలబ్రిటీల కుటుంబాలు తమ పెద్ద పెద్ద ఈవెంట్లకు భారతదేశాన్ని వేదికగా ఎంచుకోవాలని పీఎం పిలుపునిచ్చారు. అందువల్లే రకుల్, జాకీ విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవలే లక్షద్వీప్ వెళ్లిన మోదీ చేసిన ఫొటోషూట్ తర్వాత మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్స్తో వివాదం మొదలైంది. ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీలు అక్కడి వెకేషన్లను సైతం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవలే ఈ జంట ముంబైలోని రామమందిరంలో ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. గోవాలో ఫిబ్రవరి 22న జరగబోయే వీరి వివాహానికి బాలీవుడ్తో పాటు సౌత్ ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులు హాజరుకానున్నారు. -
దారుణం: భార్యను సముద్రంలో ముంచి చంపి.. ఆపై..!
పనాజీ: గోవాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను సముద్రంలో ముంచి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వివాహేతర సంబంధంపై భార్య ప్రశ్నించినందుకు నిందితుడు హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోవాలోని కాబో డి రామా బీచ్లో ఈ ఘటన జరిగింది. గౌరవ్ కటియార్(29) సౌత్ గోవాలోని ఓ లగ్జరీ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. దీక్షా గంగ్వార్(27) అనే యువతిని గతేడాదే వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ లక్నోకు చెందినవారు. గోవాలోనే నివసిస్తున్నారు. అయితే.. కటియార్ వివాహేతర సంబంధంపై గంగ్వార్ ఇటీవల ప్రశ్నించింది. దీంతో భార్యను హత్య చేయాలనే కుట్ర పన్నిన కటియార్.. ఆమెను బీచ్కు షికారుకు తీసుకువెళ్లాడు. ఎవరూ లేని రాళ్ల ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెను నీళ్లలో ముంచి చంపేశాడు. ఆ తర్వాత యథావిధిగా కార్యాలయానికి తీరిగివచ్చాడు. తన భార్య చనిపోయిందో? లేదో నిర్దారించుకోవడానికి మళ్లీ ఓ సారి వెళ్లి చూశాడు. ఆ తర్వాత తన భార్య నీళ్లలో మునిగి చనిపోయిందని పోలీసులకు తెలిపాడు. ఆందోళన పడుతున్నట్లు హంగామా సృష్టించాడు. అయితే.. ఓ యాత్రికుడు తీసిన వీడియో ఆధారంగా కటియార్ కుట్ర బయటపడింది. కటియార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: డబ్బుల కోసం బామ్మను చంపేశాడు -
Asmita Sood: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్ (ఫోటోలు)
-
Suchana Seth: బ్యాగులో మద్యం బాటిళ్లున్నాయ్!
బెంగళూరు: గోవాలో నాలుగేళ్ల కొడుకు చంపి, మృతదేహం ఉంచిన సూట్ కేసును బెంగళూరుకు తీసుకువచ్చిన సీఈవో సూచనా సేథ్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 12 గంటలపాటు కొడుకు మృతదేహంతో కారులో ప్రయాణించిన సమయంలో ఆమె ఎలా ప్రవర్తించిందనే విషయాన్ని క్యాబ్ డ్రైవర్ రేజాన్ డిసౌజా వెల్లడించాడు. ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు డిసౌజా తెలిపాడు. జనవరి 7వ తేదీన అర్ధరాత్రి 12.30 సమయంలో గోవాలోని కండోలిమ్లో ఉన్న ‘సోల్ బన్యాన్ గ్రాండ్’అనే సర్వీస్ అపార్టుమెంట్ నుంచి డిసౌజాకు కాల్ వచ్చింది. ఒక మహిళను అర్జంటుగా బెంగళూరుకు తీసుకెళ్లాల్సి ఉందనేది కాల్ సారాంశం. వెంటనే డిసౌజా కారుతో అక్కడికి వెళ్లాడు. ఒంటి గంటకు సూచనా సేథ్ బయటకు వచ్చింది. డిసౌజా ఆమెను రిసెప్షన్ దగ్గర రిసీవ్ చేసుకున్నాడు. ఆమెతోపాటు ఉన్న నల్ల రంగు బ్యాగు చాలా బరువుగా ఉంది. బ్యాగు గురించి ఆ సమయంలో డిసౌజాకు ఎటువంటి అనుమానం రాలేదు. ‘మద్యం బాటిళ్లు గానీ ఉన్నాయా మేడం, బ్యాగు బరువుగా ఉంది’అని అడిగా. అందుకామె, అవును, మద్యం బాటిళ్లున్నాయి అని సమాధానమిచ్చిందని డిసౌజా తెలిపాడు. ప్రయాణం మొత్తమ్మీద దాదాపుగా వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. గోవా–కర్ణాటక సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్తో 4 గంటలు లేటయింది. అయినా కూడా సూచన ఎటువంటి అసహనం కానీ, భయపడ్డట్లుగానీ కనిపించలేదని డిసౌజా చెప్పాడు. ‘ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు. ఆమెకు కూడా ఫోన్ కాల్స్ రాలేదు’అని తెలిపాడు. ‘ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు ఆలస్యమవుతుంది మేడం. అర్జంటు అన్నారు కదా, యూ–టర్న్ తీసుకుని ఎయిర్ పోర్టుకు పోనివ్వమంటారా? అని అడిగా. అయితే, ఆమె ఎయిర్పోర్టుకు వద్దు, ట్రాఫిక్ క్లియర్ అయ్యాకే వెళ్దామని బదులిచ్చింది. అర్జంటుగా వెళ్లాలంటూనే, ట్రాఫిక్ సమస్య ఉన్నా సమస్య లేదనడం వింతగా అన్పించింది. కర్ణాటక సరిహద్దులు దాటగానే గోవా పోలీసుల నుంచి ఫోనొచ్చింది. కారులో ఉన్న మహిళతోపాటు బాబు ఉన్నాడా అని అడిగారు. ఆమె ఇచ్చిన అడ్రస్, ఇతర వివరాలన్నీ ఫేక్ అని చెప్పారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. నేరుగా పోలీస్ స్టేషన్లావరణలో కారును ఆపడంతో, సూచన ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అని అడిగింది. పోలీసులు మీతో మాట్లాడుతామన్నారు’అని ఆమెకు చెప్పినట్లు వివరించాడు. ‘పోలీసులు కారు సోదా చేసి, బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు’అని డిసౌజా చెప్పాడు. -
BRS MLA Malla Reddy Goa Trip: గోవాలో చిల్ అయిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.. ఫొటోలు వైరల్
హైదరాబాద్: భారాస ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అంటే సందడి. ఎక్కడ ఉన్నా, ఏం చేసినా ఆయన జోష్ చూపిస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు ఎన్నికల హడావుడితో అలసిపోయిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గోవాకు వెళ్లి చిల్ అయ్యారు. ఆయన తన బృందంతో కలిసి గోవాకు వెళ్లి అక్కడ సముద్రంలో బోటింగ్, స్కూబాడైవింగ్ చేశారు. బోటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోవాలో ఆయన చేసిన జల్సాల ఫొటోలు వైరల్ అయ్యాయి. పలువురు నెటిజన్లు మల్లన్నా.. మజాకా అంటూ కామెంట్స్ చేశారు. -
గోవాలో స్టార్టప్ సీఈఓ దారుణం.. ఆపై బెంగళూరుకు..
పనాజీ: బెంగళూరులో ఓ స్టార్టప్ కంపెనీ నిర్వహిస్తున్న మహిళా సీఈఓ గోవాలో దారుణానికి ఒడిగట్టింది. తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసి మృతదేహాన్ని కర్ణాటక వరకు తీసుకువెళ్లింది. బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెల్సిజెన్స్కు సంబంధించిన మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీకి సుచనా సేథ్ సీఈఓగా ఉన్నారు.అయితే ఆమె గోవాలోని ఓ అపార్టుమెంట్ భవనంలో తన నాలుగెళ్ల కుమారుడిని చంపినట్లు తెలుస్తోంది. తర్వాత ఆమె తన కొడుకు మృతదేహాన్ని బ్యాగ్లో మూటకట్టి టాక్సీలో కర్ణాటకకు తీసుకువెళ్లింది. మంగళవారం జరిగిన ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు. టాక్సీలో ఉన్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ఆరెస్ట్ చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బెంగళూరు చెందిన మహిళ.. గోవాలో తన కొడుకును హత్య చేయడానికి గల కారణాలపై లోతుగా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. చదవండి: రూ.45 వేలకోట్లతో రివర్క్రూజ్ టూరిజం.. ఏం చేస్తారో తెలుసా.. -
Bhumika Chawla: వ్యాపారంలోకి అడుగుపెట్టిన భూమిక.. అదేంటో తెలుసా? (ఫొటోలు)