చెరువులో పడ్డ బస్సు : 11 మంది మృతి | Overloaded China kindergarten bus crash kills 11 | Sakshi
Sakshi News home page

చెరువులో పడ్డ బస్సు : 11 మంది మృతి

Published Fri, Jul 11 2014 11:55 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

Overloaded China kindergarten bus crash kills 11

మధ్య చైనా హునన్ ప్రావెన్స్ సియాంగ్టన్ నగర పర్వత ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. కిండర్గార్డెన్ విద్యార్థులతో వెళ్తున్న మినీ స్కూల్ వ్యాన్ చెరువులో పడిపోయింది. ఆ ప్రమాదంలో 11 మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది చిన్నారులేనని ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు టీచర్లు, డ్రైవర్ కూడా మృతి చెందారని చెప్పారు.

 

ఆ ప్రమాదం గురువారం చోటు చేసుకుంది తెలిపారు. చెరువు నుంచి మృతదేహాలతోపాటు బస్సు వెలికి తీసినట్లు చెప్పారు. మినీ బస్సులో కేవలం 7 చిన్నారులకు కుర్చోవడానికి వీలు ఉంటుందని తెలిపారు. అలాంటిది 11 మందితో ప్రయాణిస్తున్న వాహనం అధిక లోడు కారణంగా అదుపు తప్పి నీటిలో పడిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement