Beijing
-
మనతో రోబో రన్!
ఎన్నో రంగాల్లో మనిషికి సవాల్ విసురుతున్న మరమనుషులను చైనా.. ప్రపంచంలోనే తొలిసారిగా చరిత్రాత్మక పోటీకి రంగంలోకి దింపుతోంది. అథ్లెట్లు, హ్యూమనాయిడ్ రోబోలకు కలిపి మొట్టమొదటిసారిగా హాఫ్ మారథాన్ (21 కి.మీ.) పరుగు పందెం నిర్వహించనుంది. ఏప్రిల్లో జరగనున్న ఈ పోటీకి చైనా రాజధాని బీజింగ్లోని డాక్సింగ్ జిల్లా వేదిక కానుంది. ఇందులో డజన్లకొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు సుమారు 12 వేల మంది అథ్లెట్లతో పోటీపడనున్నాయి. ఈ రేసులో టాప్–3లో నిలిచే రేసర్లకు (అథ్లెట్లు అయినా లేక హ్యూమనాయిడ్ రోబోలైనా) బహుమతులిస్తారని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’తెలిపింది. బీజింగ్ ఆర్థిక–సాంకేతికత అభివృద్ధి ప్రాంతం లేదా ఈ–టౌన్ పరిపాలనా సంఘం ఈ వినూత్న పోటీని నిర్వహించనుంది. 20కన్నా ఎక్కువ రోబో తయారీ సంస్థలు హాఫ్ మారథాన్లో పాల్గొననున్నాయి.స్పెషల్ ఎట్రాక్షన్గా ‘టియాంగోంగ్’ మారథాన్లో పాల్గొనే రోబోలలో చైనాకు చెందిన ఎంబాడీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ అభివృద్ధి చేసిన టియాంగోంగ్ హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ రోబోకు గంటకు సగటున 10 కి.మీ. వేగంతో పరిగెత్తే సామర్థ్యం ఉందని ‘ద డైలీ సీపీఈసీ’పేర్కొంది. గతేడాది బీజింగ్లో జరిగిన హాఫ్ మారథాన్లో రేసు మొదలైనప్పటి నుంచి చివరిదాకా ఈ రోబో మనుషులతో కలిసి పరుగెత్తింది.చైనాలో రోబోల అభివృద్ధి ఎందుకంటే.. చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో శ్రామికశక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్నా.. ఆర్ధికవృద్ధిని పెంచాలన్నా శ్రామికశక్తి అవసరం.దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. చైనా ఆగస్టులో హ్యూమనాయిడ్ రోబోలతో ఫుట్బాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ లాంటి పోటీలు నిర్వహించనుంది. – సాక్షి, సెంట్రల్డెస్క్కండిషన్స్ అప్లై..హాఫ్ మారథాన్లో పాల్గొనే రోబోలవిషయంలో చైనా కొన్ని షరతులు విధించింది. అవేమిటంటే.. » రోబోలన్నీ మనిషి ఆకృతిలో కనిపించాలి. » వాకింగ్ లేదా రన్నింగ్ లాంటి కదలికల లక్షణాలు కలిగి ఉండాలి. అంటే వాటికి చక్రాలు ఉండరాదన్నమాట. » రోబోల కనీస ఎత్తు 1.6 అడుగుల నుంచి గరిష్టంగా 6 అడుగుల మధ్య ఉండాలి. » హిప్–టు–ఫుట్ పొడవు అంటే నడుము నుంచి పాదం వరకు 1.47 అడుగుల ఎత్తు ఉండాలి. » రిమోట్ ద్వారా నియంత్రించే రోబోలు లేదా పూర్తిస్థాయిలో ఆటోమేటిక్ హ్యూమనాయిడ్లను పోటీలోకి దింపాలి. అయితే అవసరమైతే పోటీ మధ్య బ్యాటరీలను మార్చుకోవచ్చు.2,76,288ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం 2023లో చైనా సంస్థలు ఇన్స్టాల్ చేసిన రోబోల సంఖ్య. ఇది ఆ ఏడాది ప్రపంచంలోని మొత్తం రోబోల్లో 51 శాతం -
చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కలకలం
బీజింగ్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ (mpox) వైరస్లోని కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. గురువారం మంకీపాక్స్ కొత్త వేరియంట్ క్లాడ్ ఐబిని గుర్తించినట్లు చైనా (china) ఆరోగ్య అధికారులు వెల్లడించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర స్థితిని ప్రకటించింది. కాంగో నుంచి చైనాకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఎంపాక్స్ క్లేడ్ ఐబి అనే కొత్త వేరియంట్ వ్యాప్తిని కనుగొన్నట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. సదరు కాంగో ప్రయాణికుడితో సన్నిహితంగా ఉండడం వల్ల నలుగురికి ఎంపాక్స్ కొత్త వేరియంట్ సోకిందని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్ సోకిన రోగుల్లో చర్మంపై దద్దుర్లు,బొబ్బలు లక్షణాలు ఉన్నాయని గుర్తించింది. మంకీపాక్స్లోని కొత్త వేరియంట్ కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగు దేశాలకు వ్యాపించింది. దీంతో డబ్ల్యూహెచ్ఓ సైతం తాజాగా, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత ఆగస్ట్లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) నుంచి ఎంపాక్స్ ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇక చైనా గుర్తించిన మంకీపాక్స్లోని కొత్త వేరియంట్ క్లాడ్ ఐబీ లైంగికంగా కలవడం వల్ల వేంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఏమిటీ ఎంపాక్స్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకుతుండటంతో ఎంపాక్స్ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే.ఇలా సోకుతుంది→ అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. → తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.వ్యాధి లక్షణాలు ఏమిటీ?→ ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. → చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. → 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. → నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. → నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.వ్యాక్సిన్ ఉందా? స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్ (టీపీఓఎక్స్ ఎక్స్) యాంటీ వైరల్నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్) డ్రగ్స్నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది. -
కాలుష్యానికి కళ్లెం.. బీజింగ్ చెప్పిన పాఠం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలు తోడేస్తోంది. విషపూరితమైన గాలి పీలుస్తున్న జనం ఆసుపత్రులపాలవుతున్నారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వాయు కాలుష్యం కాటుకు ప్రాణాలు కోల్పోతున్నారు. లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ నివేదిక ప్రకారం.. కాలుష్యం కారణంగా ఢిల్లీలో ప్రతిఏటా దాదాపు 12,000 మంది మరణిస్తున్నారు. లక్షలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. నగరంలో ప్రతిఏటా నమోదవుతున్న మొత్తం మరణాల్లో 11.5 శాతం మరణాలకు కాలుష్యమే కారణం కావడం గమనార్హం. ఢిల్లీ ఒక గ్యాస్ చాంబర్గా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితులే 2013 దాకా చైనా రాజధాని బీజింగ్లోనూ కనిపించేవి. కానీ, ప్రస్తుతం బీజింగ్ సిటీ కాలుష్యం ముప్పు నుంచి చాలావరకు బయటపడింది. ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందన్నది ఆసక్తికరం. వాయు కాలుష్యంపై పోరాటం విషయంలో చైనా అనుభవాలు, సాధించిన విజయాల నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి. వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) మంగళవారం బీజింగ్లో 137 కాగా, ఢిల్లీలో 750గా నమోదైంది. ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. కాలుష్యం ఉత్పత్తి అయ్యే విషయంలో ఢిల్లీ, బీజింగ్లో ఒకేలాంటి పరిస్థితులు ఉన్నాయి. శిలాజ ఇంధనాల వాడకం, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాలు, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు రెండు నగరాల్లోనూ ఉన్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం ఢిల్లీకి ఉన్న అదనపు ముప్పు. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాల్లో చైనాది ప్రపంచంలోనే మొదటి స్థానం. మొత్తం ప్రపంచ ఉద్గారాల్లో డ్రాగన్ దేశం వాటా 30 శాతం. అయినప్పటికీ బీజింగ్ ప్రజలకు స్వచ్ఛమైన గాలి ఎలా అందుతోంది? ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? బీజింగ్లో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండడాన్ని చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ‘సోహో’ అధినేత, బిలియనీర్ పాన్ షియీ 2011లో తొలిసారిగా సోషల్ మీడియా పోస్టు ద్వారా బాహ్య ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.2013లో కాలుష్య వ్యతిరేక పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటంలో తొలుత యువత పాలుపంచుకున్నారు. క్రమంగా ఇదొక ప్రజా పోరాటంగా మారింది. వాయు కాలుష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజింగ్ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. తమ ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రెండు వారాలపాటు అవిశ్రాంతంగా ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం దిగివచ్చింది. కాలుష్యంపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు అప్పటి చైనా అత్యున్నత నాయకుడు లీ కెఖియాంగ్ స్పష్టంచేశారు. పేదరికంపై జరుగుతున్న యుద్ధం తరహాలో కాలుష్యంపైనా యుద్ధం సాగిస్తామని తేల్చిచెప్పారు. అంతేకాదు కాలుష్య నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించారు. అధికారులను పరుగులు పెట్టించారు. నేషనల్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ → కాలుష్యాన్ని కట్టడి చేయడానికి చైనా సర్కారు ‘నేషనల్ ఎయిర్ యాక్షన్ ప్లాన్’ విడుదల చేసింది. ఇందుకోసం 100 బిలియన్ డాలర్లు కేటా యించింది. → బీజింగ్లో మొట్టమొదటిసారిగా 2013లో వా యు నాణ్యత గణాంకాలను ప్రచురించారు. అప్పటిదాకా ఈ సమాచారం కోసం అమెరికా రాయబార కార్యాలయంపై ఆధారపడాల్సి వచ్చేది. → 2013 నుంచి సొంతంగానే సమాచారం సేకరించి, ప్రజలకు చేరవేయడం ప్రారంభించారు. → జాతీయ వాయు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కాలుష్యాన్ని 25 శాతం తగ్గించాలని ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సీరియస్గానే రంగంలోకి దిగారు. → తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న 100 ఫ్యాక్టరీలను మూసివేశారు. మరికొన్నింటిని ఆధునీకరించారు. → కాలుష్య ఉద్గారాల విషయంలో కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. కాలం చెల్లిన 2 కోట్ల పాత వాహనాలను రోడ్డెక్కనివ్వలేదు. వాటిని స్క్రాప్గా మార్చేశారు. → 2 లక్షల పారిశ్రామిక బాయిలర్లను ఉన్నతీకరించారు. పాత వాటి స్థానంలో ఆధునిక బాయిలర్లు అమర్చారు. → బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు మంగళం పాడేశారు. సహజ వాయువుతో కరెంటును ఉత్పత్తి చేసి, 60 లక్షల ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. → విద్యుత్తో నడిచే వాహనాలు బీజింగ్ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాలు అతి తక్కువగా కనిపిస్తుంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోంది. వాటికి పలు రాయితీలు అందిస్తోంది. → 2013లో చైనా ప్రభుత్వం ప్రారంభించిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. రాజధానిలో వాయు కాలుష్యం తగ్గడం మొదలైంది. గాలి నాణ్యత క్రమంగా మెరుగుపడింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించడంతో బీజింగ్ సిటీ ఇప్పుడు కాలుష్య రహిత నగరంగా మారింది. ఇండియా చేయాల్సిందేమిటి? ఇండియాలో కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా, ముంబై, పుణే, వారణాసి, పట్నా తదితర పెద్ద నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా కాలుష్యం ఊబిలో చిక్కుకున్నాయి. ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో ఇండియా సిటీల స్థానం భద్రంగా ఉంటోంది. కాలుష్యాన్ని తరిమికొట్టి స్వచ్ఛంగా మార్చడానికి బీజింగ్ మోడల్ను ఆదర్శంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలుష్యం నుంచి జనానికి విముక్తి కల్పించడానికి బలమైన రాజకీయ సంకల్పం కావాలని చెబుతున్నారు. నిపుణుల సూచనలు ఏమిటంటే..→ వాయు నాణ్యతను మెరుగుపర్చడానికి అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవాలి. → శిలాజ ఇంధనాల వాడకానికి కళ్లెం వేయాల్సిందే. → పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు పెరగాలి. అస్తవ్యస్తమైన పట్టణ ప్రణాళిక కాలుష్యానికి కారణమవు తోంది. ఈ పరిస్థితి మారాలి. → కాలుష్య నియంత్రణ చర్యల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. → వ్యాపారం, వాణిజ్యం, ఎగుమతులతోపాటు రాజకీయ పలుకుబడి సాధించే విషయంలో చైనాతో పోటీ పడుతున్న భారత్ కాలుష్య నియంత్రణ విషయంలో ఎందుకు పోటీపడడం లేదన్నదే నిపుణుల ప్రశ్న. → కాలుష్య నియంత్రణను కేవలం స్థానిక ప్రభుత్వాలకే వదిలివేయకూడదు. ఇందుకోసం జాతీయ స్థాయిలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరం. → చక్కటి ప్రణాళికాబద్ధమైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గిపోవాలి. ప్రజలు సొంత వాహనాలు కాకుండా ప్రజా రవాణా సాధనాలను ఉపయోగించుకుంటే కాలుష్యం చాలావరకు తగ్గిపోతుంంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా- జపాన్ సైనిక ఒప్పందం.. ఇక చైనాకు చుక్కలే?
చైనా నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు, ఆ దేశానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు జపాన్- అమెరికాలు ఒక సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ రెండు దేశాలు సంయుక్తంగా చైనా చర్యలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపధ్యంలో తాజాగా జపాన్, అమెరికా రక్షణ అధిపతులు, అగ్ర దౌత్యవేత్తలు టోక్యోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు యూఎస్ఏ సైనిక కమాండ్ను నవీకరించడం, జపాన్లో యూఎస్ఏ నుండి లైసెన్స్ పొందిన క్షిపణుల ఉత్పత్తిని పెంచడం తదితర అంశాలపై చర్చించారు.అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ జపాన్-అమెరికా సెక్యూరిటీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో జపాన్ ప్రతినిధులు యోకో కమికావా, మినోరు కిహారాతో భద్రతా చర్చలు జరిపారు. చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడంలో నిమగ్నమైందని, తూర్పు, దక్షిణ చైనా సముద్రంలో, తైవాన్ చుట్టూ యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆస్టిన్ ఆరోపించారు.ఉత్తర కొరియా చేపట్టిన అణు కార్యక్రమం, రష్యా నుంచి ఆ దేశానికి అందుతున్న సహకారం మొదలైనవి ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ముప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. యుఎస్ఏ బలగాల పెంపుతో సహా కమాండ్ అండ్ కంట్రోల్ నిర్మాణాలను ఆధునీకరించే విషయమై త్వరలో చర్చించనున్నట్లు ఆస్టిన్ తెలిపారు. -
చైనా–రష్యా కరచాలనం!
తాము చైనాను పీపుల్స్ రిపబ్లిక్గా గుర్తించి 75 యేళ్లు అవుతుండగా... ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో పట్టు సాధించిన ఛాయలు కనబడుతుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో ఇరు దేశాలమధ్యా వివిధ ఒప్పందాలు కుదరటంతోపాటు సంయుక్త ప్రకటన కూడా విడుదలైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి మనస్తత్వాన్ని విడనాడాలని రెండు దేశాలూ అమెరికాకు హితవు పలికాయి. ప్రాంతీయ భద్రత, రక్షణ బేఖాతరు చేస్తూ కొన్ని బృందాలకు మద్దతుగా నిలిచే వినాశకర విధానాలకు స్వస్తి పలకాలని సూచించాయి. పుతిన్ వరసగా ఆరోసారి ఎన్నికై దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిది రోజులవుతోంది. 2030 వరకూ ఆయనదే రాజ్యం. అయితే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం మునపట్లా లేదు. ఆంక్షల చక్రబంధంలో బిగించి రష్యాను పాదాక్రాంతం చేసుకోవాలని అమెరికా, దానికి మద్దతుగా నిలిచిన యూరొప్ దేశాలూ పట్టుదలగా వున్నాయి. పర్యవసానంగా రష్యా ఆర్థిక వ్యవస్థ బలహీనపడి వణుకుతోంది. ఆ దేశంతో ఎవరు లావాదేవీలు సాగించినా చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరిస్తోంది. రెండేళ్ల క్రితం రష్యా ఉక్రెయిన్పై దండెత్తటానికి కొన్ని రోజులముందు రష్యా–చైనాల మధ్య ‘హద్దుల్లేని వ్యూహాత్మక ఒప్పందం’ కుదిరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ రెండు దేశాలూ ఇప్పటికీ ‘హద్దులెరగని’ బంధాన్ని కొనసాగిస్తాయా... రష్యాపై అమలవుతున్న ఆంక్షలకూ, అమెరికా హెచ్చరికలకూ చైనా తలొగ్గుతుందా అనే ప్రశ్నలు గత కొన్ని రోజులుగా పాశ్చాత్య ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. పుతిన్కు బీజింగ్లో దక్కిన ఘనస్వాగతమూ, ఇరు దేశాల ఉమ్మడి ప్రకటనా, ఉభయ దేశాధినేతల ప్రసంగాలూ గమనించాక అమెరికా, యూరొప్ దేశాలకు అసంతృప్తే మిగిలివుంటుందన్నది వాస్తవం. అయితే 75 ఏళ్లక్రితం కొత్తగా ఆవిర్భవించిన చైనాను గుర్తించిననాటి సోవియెట్ యూనియన్కూ, ఇప్పటి రష్యాకూ పోలికే లేదు. అప్పట్లో అది అమెరికాతో ‘నువ్వా నేనా’ అన్నట్టు తలపడే తిరుగులేని శక్తి. అనంతర కాలంలో ఆ దేశం కుప్పకూలింది. చీలికలు పేలికలైంది. ఈ మూడు దశాబ్దాల్లో గత వైభవాన్ని సంతరించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఎంతో కొంత ఫలిస్తున్న వైనం కనబడుతుండగానే క్రిమియా ఆక్రమణ, ఆ తర్వాత ఉక్రెయిన్పై దురాక్రమణ యుద్ధం రష్యాను సంక్షోభంలోకి నెట్టాయి. చైనా మాదిరే భద్రతామండలిలో రష్యా శాశ్వతసభ్య దేశమే కావొచ్చు. కానీ ఇప్పుడది దాదాపు ఒంటరి. చెప్పాలంటే చైనాకు జూనియర్ భాగస్వామి.తమది కూటమి కాదని, తమ స్నేహం వెనకున్న ఉద్దేశం దశాబ్దాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటమేనని ఉభయ దేశాలూ చెబుతున్నాయి. కానీ ఆ రెండు దేశాల ఉమ్మడి ప్రత్యర్థి అమెరికాయేనని ప్రపంచానికంతకూ తెలుసు. డ్రోన్లు, క్షిపణి సాంకేతికత, ఉపగ్రహ నిఘా నివేదికలు, ఫైటర్ జెట్లకు పనికొచ్చే విడిభాగాలు, మైక్రోచిప్లు సరఫరా చేస్తూ దురాక్రమణ యుద్ధానికి చైనా ఆజ్యం పోస్తున్నదని అమెరికా అనుమానం. ఈ చైనా సంస్థలను నిషేధ జాబితాలో పెడతామని హెచ్చరిస్తోంది. ఇది ఎంతోకొంత పనిచేసింది. చైనా బ్యాంకులు రష్యా సంస్థలతో మొన్న మార్చినుంచి లావాదేవీలు బాగా తగ్గించాయి. పర్యవసానంగా ఇటీవల వాణిజ్యం మందగించింది. దీన్ని మళ్లీ యధాస్థితికి తీసుకెళ్లటం పుతిన్ ప్రాధాన్యాంశాల్లో ఒకటి. అందుకే ఆయన వెంట భారీ ప్రతినిధి బృందం బీజింగ్ వెళ్లింది. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలు గమనిస్తే చైనాతో రష్యా వాణిజ్యం రికార్డు స్థాయిలో 24,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యే నాటికున్న వాణిజ్యంతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. రష్యా ఎగుమతుల్లో చైనా వాటా 30శాతం కాగా,దాని దిగుమతుల్లో చైనా వాటా 40శాతం. ఆంక్షల బారిన పడకుండా వ్యాపార, వాణిజ్యాలను ఎలా కొనసాగించాలన్నదే ప్రస్తుతం రష్యా, చైనాల ముందున్న ప్రశ్న. ఇంధనం, పరిశ్రమలు, వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో తమకు సహకరించాలని పుతిన్ అర్థించారు. అలాగే ఆంక్షల తర్వాత ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి కార్ల వరకూ అన్ని మార్కెట్లనుంచీ పాశ్చాత్య దేశాలు తప్పుకున్నాయి. ఆ లోటును చైనా తీరుస్తోంది. దాన్ని మరింత పెంచాలని ఉభయ దేశాలూ నిర్ణయించాయి. డాలర్లలో కాక తమ తమ కరెన్సీల్లోనే లావాదేవీలు జరుపుకుంటున్నాయి. జార్ చక్రవర్తుల కాలం నుంచీ పాశ్చాత్య దేశాలతో రష్యాకున్న వాణిజ్యబంధం ఇప్పుడు పూర్తిగా స్తంభించిపోయింది. ఇన్నాళ్లూ యూరొప్ దేశాలకు వెళ్లిన సహజవాయు ఎగుమతుల్ని చైనాకు మళ్లించేందుకు పుతిన్ సిద్ధపడినా ప్రస్తుతానికైతే ఒప్పందం ఖరారు కాలేదు. వ్లాదిమిర్ సోరోకిన్ అనే రచయిత 2028 నాటికి రష్యా పోకడలెలా వుంటాయో చిత్రిస్తూ 2006లో ‘డే ఆఫ్ ఆప్రిష్నిక్’ అనే నవల రాశాడు. అప్పటికల్లా చైనా సాంకేతికతే అన్ని రంగాల్లోనూ వర్ధిల్లుతుందనీ, కానీ జార్ సామ్రాజ్యానికి ఆద్యుడిగా భావించే మధ్యయుగాలనాటి మాస్కో ప్రిన్స్ ఇవాన్ను తలపించే అత్యంత క్రూరమైన పాలన సాగుతుందనీ ఆ కాల్పనిక ఇతివృత్తం చెబుతుంది. పుతిన్ ఎలా పరిణమిస్తారన్న సంగతలావుంచి చైనా సాంకేతికతలు ఇప్పటికే రష్యాకు వచ్చాయి. చైనా కార్లు రష్యా రోడ్లపై పరుగులెడుతున్నాయి. ప్రపంచం గతంలో మాదిరి లేదని, ఎవరినీ ఎవరూ శాసించలేరని అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తించాలి. ఉద్రిక్తతలు ఉపశమింపజేసేందుకూ, శాంతి సాధనకూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించటం, రాజీకి సిద్ధపడటం అవసరమని ఇరు పక్షాలూ తెలుసుకోవాలి. అందుకు భిన్నమైన వినాశకర మార్గంలో పోతామంటే ప్రపంచ ప్రజానీకం క్షమించదు. -
బీజింగ్ ను దాటేసి ఆసియా లోనే నంబర్ వన్ గా ముంబై..!
-
బిలియనీర్ల నగరం ముంబై
ముంబై: బిలియనీర్ల విషయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై తాజాగా బీజింగ్ను అధిగమించింది. మంగళవారం విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్టు ప్రకారం ముంబైలో 92 మంది అత్యంత సంపన్నులు ఉండగా బీజింగ్లో ఈ సంఖ్య 91గా ఉంది. ఇక చైనాలో మొత్తం 814 మంది బిలియనీర్లు ఉండగా భారత్లో 271 మంది ఉన్నారు. దేశీయంగా కుబేరుల మొత్తం సంపద 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 115 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత ఏడాది వ్యవధిలో ఆయన సంపద మరో 40 శాతం (33 బిలియన్ డాలర్లు) పెరిగింది. ఇక హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికతో గణనీయంగా దెబ్బతిన్న గౌతమ్ అదానీ తిరిగి కోలుకున్నారు. ఆయన సంపద 62 శాతం వృద్ధి చెందింది. అంతర్జాతీయంగా అంబానీ పదో స్థానంలో ఉండగా, అదానీ 15వ స్థానంలో ఉన్నారు. 231 బిలియన్ డాలర్లతో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ నంబర్ వన్గా ఉన్నారు. కొత్త బిలియనీర్లయిన వారి విషయంలో చైనాను భారత్ అధిగమించింది. భారత్ నుంచి ఈ లిస్టులో 94 మంది చోటు దక్కించుకోగా, చైనా నుంచి 55 మందికి చోటు దక్కింది. గత ఏడాది వ్యవధిలో ముంబైలో 27 మంది బిలియనీర్లు కాగా, బీజింగ్లో ఆరుగురు మాత్రమే ఈ హోదా దక్కించుకున్నారు. -
Beijing Cold Wave: రికార్డులు బ్రేక్ !
బీజింగ్:చైనాను చలి గడ్డ కట్టిస్తోంది.1951లో ఉష్ణోగ్రతల నమోదు ప్రారంభించినప్పటి నుంచి బీజింగ్లో డిసెంబర్ నెలలో అతి ఎక్కువ రోజులు కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. దీంతో ఇక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి జీరో దాటి మైనస్లోకి వెళ్లిన ఉష్ణోగ్రతలు ఆదివారం జీరో డిగ్రీకి చేరుకున్నాయి. మొత్తం చైనాను ఈ నెలలో కోల్డ్ వేవ్ కమ్మేసింది. దేశవ్యాప్తంగా హీటర్లు పనిచేస్తుండడంతో పవర్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో పవర్ ప్లాంట్లు వాటి పూర్తి సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయి. సామర్థ్యానికి మించి పని చేస్తుండటంతో సెంట్రల్ ప్రావిన్స్ హెనాన్లో పలు పవర్ ప్లాంట్లు ఫెయిల్ అయ్యాయి. ఆస్పత్రులు, స్కూళ్లు, గృహాల్లో హీటర్లు పనిచేయడానికే మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కంపెనీల్లో హీటర్లు నిలిపివేశారు. తీవ్రమైన మంచు కురవడం వల్ల బీజింగ్లో ఈ నెల మొదటి వారంలో రెండు మెట్రో రైళ్లు ఢీ కొట్టుకున్నాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న డజన్ల కొద్ది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర చైనాలోని గన్సు ప్రావిన్సులో ఇటీవల సంభవించిన భూకంప రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతోంది. ఇదీచదవండి..ఆ విమానం ఎట్టకేలకు టేకాఫ్ ! -
చైనాలో భారీ భూకంపం.. వందకు పైగా మృతులు?
China Earthquake News: భారీ భూకంపం(Earthquake Today) మన పొరుగు దేశం చైనాను కుదిపేసింది. గత అర్ధరాత్రి సమయంలో సంభవించిన భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. భారీ సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు ఇప్పటిదాకా 110కిపైగా మృతదేహాల్ని వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక.. వాయువ్య గన్స్, కింగ్హై ప్రావిన్స్ల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం 5.9గా పేర్కొంది. భూకంపం వల్ల వందల మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నవాళ్లను బయటకు తీసే క్రమంలో మృతదేహాలు బయటపడుతున్నాయి. మొబైల్ టార్చ్ల వెలుతురులో రెస్క్యూ.. చైనాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. విపరీతంగా మంచు కురవడం, వాన కురుస్తుండడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అర్ధరాత్రి భూకంపం నేపథ్యంలో చేపట్టిన సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని తెలుస్తోంది. రెస్క్యూ టీం వాహనాలను రోడ్లపై పేరుకుపోయిన మంచు ముందుకు వెళ్లనివ్వడం లేదు. దీంతో సిబ్బందికి స్ట్రెచర్లను మోసుకుంటూ కొంతదూరం వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు అంధకారం నెలకొనడంతో.. సెల్ఫోన్ టార్చ్ల వెలుతురులోనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి బృందాలు. రెస్క్యూ బృందాలు తమ శక్తిమేర సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రకటించారు. మరోవైపు సోషల్మీడియాలో భూకంప తాలుకా దృశ్యాలు కనిపిస్తున్నాయి. Un terremoto de magnitud 6,2 se produjo en la provincia china de Gansu, informaron medios locales. pic.twitter.com/ZqmF31JB5e — Sarah Ilych♦️♥️🧸RIA Novosti (@Sarah83336937) December 18, 2023 #BreakingNews :--Death toll from earthquake in central China rises to 111, hundreds injured... #ChinaEarthquake #china #Earthquake #ChinaNews #Death #ChinaSuarez pic.twitter.com/nTy0YmePzX — Vikas Bailwal (@VikasBailwal4) December 19, 2023 SISMO DE MAGNITUD 6 EN #CHINA DEJA AL MENOS 86 MUERTOS Este lunes, un sismo de magnitud 6 se registró en la provincia china de #Linxa- #Gansu, según informó el Servicio Geológico de Estados Unidos (USGS). Este movimiento telúrico dejó al menos 86 muertos y varios… pic.twitter.com/5JeTjZpApn — El Dato Noticias Morelos (@eldatomx) December 19, 2023 గతంలో.. భూకంపాలు చైనాలోనూ సర్వసాధారణమే. ఈ ఏడాది ఆగష్టులో 5.4 తీవ్రతతో తూర్పు చైనాలోభూకంపం సంభవించి 23 మంది గాయపడ్డారు. కిందటి ఏడాది సెప్టెంబర్లో సిచువాన్ ప్రావిన్స్లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 100 మంది చనిపోయారు. అయితే.. 2008లో రిక్టర్ స్కేల్పై 7.9 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం మాత్రం 87 వేల మందిని కబళించింది. అందులో దాదాపు ఆరు వేల మంది చిన్నారులే ఉన్నారు. ఇదీ చదవండి: అక్కడ తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయంటే.. -
దూకుడు పెంచిన చైనా.. తైవాన్కు యుద్ధ విమానాలు
తైపే: ద్వీపదేశమైన తైవాన్పై చైనా మరోసారి దూకుడు ప్రదర్శించింది. తైవాన్ చుట్టూ చైనాకు చెందిన 20 యుద్ధ విమానాలు స్వైరవిహారం చేశాయి. ఎదో కుట్రపూరిత ఆలోచనతోనే అవి తైవాన్ జలసంధిలోని మధ్యస్థ రేఖను దాటినట్లు తైపీ అధికారులు తెలిపారు. కుట్రపూరితమైన ఆలోచనలతోనే.. స్వీయ పాలిత దేశం తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చైనాకు తమదేశానికి మధ్యలో ఉండే జలసంధిలో చానాకు చెందిన సుమారు 20 యుద్ధ విమానాలు రెండు దేశాలను వేరుచేసే మధ్యస్థ రేఖను దాటి దేశ ఆగ్నేయ నైరుతి వాయు రక్షణ జోన్లోకి ప్రవేశించాయన్నారు. చైనా దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగానే ఇటువంటి ట్రైనింగ్ మిషన్లను నిర్వహిస్తోందని దానికోసమే పెట్రోలింగ్ విమానాలతోనూ నౌకలతో ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. వారి జోక్యాన్ని సహించలేక.. ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతోనే బీజింగ్ డెమోక్రటిక్ తైవాన్ను తన స్వంత భూభాగంగా ప్రకటించుకుంటోందని వారు దీన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు కూడా సాహసిస్తుందని అందులో భాగంగానే సైనికపరమైన, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచిందన్నారు. ఇదే నెలలో అమెరికా, కెనడాకు చెందిన రెండు నౌకలు ఈ నెలలో తైవాన్ జలసంధి వద్ద విహరిస్తూ ద్వీపదేశానికి అండగా నిలిచే ప్రయత్నం చేయడంతో చైనా దళాలు అప్రమత్తమయ్యాయని తైపే రక్షణశాఖ తెలిపింది. ఇదేమీ కొత్త కాదు.. ఈ వారంలోనే ద్వీపం చుట్టూ విహరిస్తున్న 68 విమానాలను 10 యుద్ధ నౌకలను గుర్తించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో కొన్ని విమానాలు మరియు యుద్ధనౌకలు చైనా షాన్డాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ద్వారా కొన్ని యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు సముద్రంలోనూ గాలిలోనూ శిక్షణ పశ్చిమ పసిఫిక్ వైపుగా వెళ్లాయని తెలిపింది తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ. అయితే చైనా ఇంత వరకు ఈ చొరబాటు గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏప్రిల్ నెలలో బీజింగ్ ఇటువంటి మిలటరీ విన్యాసాలే చేయగా తైవాన్ అధ్యక్షుడు సై ఇంగ్ వెన్ విషయాన్ని కాలిఫోర్నియా వెళ్లి యూఎస్ హౌస్ సభాపతి కెవిన్ మెక్ కార్తీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో తైవాన్ కేవలం 24 గంటల్లో ఏకంగా 71 చైనాకు చెందిన యుద్ధ నౌకలను గుర్తించింది. #China is moving military equipment to ports near Taiwan, raising fears of an invasion. #Taiwan says it has detected 57 Chinese warplanes and 10 warships in the past 24 hours. Is this a drill or a threat? pic.twitter.com/2O7eFroJ2d — News Hrs (@newshrstweet) September 14, 2023 ఇది కూడా చదవండి: బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి -
జీ20 సదస్సుకు జిన్పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్
బీజింగ్: భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మంకంగా నిర్వహిస్తోన్న జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడి స్థానంలో ఆ దేశ ప్రీమియర్ హాజరు కానున్నట్లు తెలిపింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సుకు హాజరు కావడం లేదని మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించగా ఆయనను అనుసరిస్తూ చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ స్పోక్స్పర్సన్ మావో నింగ్ కీలక ప్రకటన చేశారు. మావో నింగ్ మాట్లాడుతో.. భారత్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న 18వ జీ20 సమావేశాలకు చైనా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతారని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల విషయమై ఏకాభిప్రాయాన్ని సాధించి అభివృద్ధికి దోహద పడతామని అన్నారు. రెండు దేశాల సంబంధాలకు చైనా ఎప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తూనే వచ్చిందని దీనికి సంబంధించి జరిగిన అనేక సమావేశాల్లో కూడా తాము చురుగ్గా పాల్గొన్నామని గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో సమాఖ్య దేశాల ఐక్యతను బలోపేతం చేసి ప్రపంచ ఆర్ధికాభివృద్ధికి మిగతా దేశాలతో కలిసి పనిచేసే విషయమై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ చైనా అభిప్రాయాలను వెల్లడిస్తారని తెలిపారు మావో నింగ్. స్థిరమైన ప్రపంచ ఆర్ధిక పునరుద్ధరణ, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మిగతా జీ20 భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని ఈ సమావేశాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం -
Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ
నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించడమంటే ఇదే. భారత్తో స్నేహసంబంధాలకు కట్టుబడి ఉన్నట్టు తీయటి కబుర్లు చెప్పే చైనా తన వక్రబుద్ధిని మరోసారి వెల్లడించుకుంది. సోమవారం నాడు సరికొత్త అధికారిక ‘ప్రామాణిక పటం’– 2023 విడుదల చేస్తూ, అందులో భారత్లోని పలు ప్రాంతాల్ని తమ దేశంలో భాగమన్నట్టు చూపింది. భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్చిన్లను తన భూభాగాలంటోంది. మొత్తం తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని కూడా ఈ కొత్త జాతీయ పటంలో తమ అంతర్భాగమనేందుకు చైనా తెగించింది. దాదాపు పొరుగు దేశాలన్నిటికీ కోపం తెప్పించడమే కాక, మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. పైపెచ్చు, అంతా సవ్యంగానే ఉన్నదన్నట్టు ‘‘జాతీయ సరిహద్దులను గీయడంలో చైనాతో పాటు వివిధ దేశాలు ఉపయోగించే పద్ధతి ఆధారంగా’’నే ఈ పటాన్ని రూపొందించినట్టు డ్రాగన్ ప్రకటించుకోవడం విచిత్రం. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ఖండిస్తుంటే, బీజింగ్ మాత్రం మ్యాప్ల విడుదల నిత్య కృత్యమేననీ, దీనిపై అతి చేయద్దనీ విషయతీవ్రతను తక్కువ చేసి చెబుతుండడం మరీ విడ్డూరం. చెప్పేదొకటి చేసేదొకటి జిత్తులమారి చైనా నిత్యకృత్యం. అందుకే, ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా తీసుకోక తప్పదు. వారం క్రితం జొహాన్నెస్బర్గ్లో ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడు భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు సమావేశమై సంభాషించుకున్నారు. సరిహద్దుల వద్ద పరిస్థితిని చక్కదిద్ది, సత్సంబంధాలకు కృషి చేయాలని చర్చించుకున్నారు. మరోపక్క ఈ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘జీ–20’ శిఖరాగ్ర సదస్సుకూ చైనా అధినేత హాజరు కావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఉరుము లేని పిడుగులా డ్రాగన్ దేశ సరిహద్దులు ఈ ‘వక్రీకరించిన’ పటంతో బాంబు పేల్చింది. గమనిస్తే మన ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతూ, మునుపటి పటంలోనూ చైనా ఇదే తెంపరితనం చూపింది. ఆ దేశ పశ్చిమ హద్దుల్లో ఉన్న ప్రాంతాలను తనవిగా చెప్పుకొంది. అక్సాయ్చిన్ 1950–60ల నుంచి మన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో భాగం. 1962 యుద్ధంలో చైనా దాన్ని ఆక్రమించుకుంది. అరుణాచల్నేమో దశాబ్దాలుగా తమ దక్షిణ టిబెట్లోది అంటోంది. ఆ రెండూ భారత అంతర్భాగాలని మన ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, తన మూర్ఖవాదన కొనసాగిస్తోంది. పటంలోని అంశాలు అంతర్జాతీయ అంగీకృత సరిహద్దులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ను ‘జంగ్నాన్’ (దక్షిణ టిబెట్) అని పిలుస్తూ, అది తమదేననడం బీజింగ్ సిగ్గు మాలినతనం. చరిత్ర చూస్తే టిబెట్కూ, బ్రిటీషు ఇండియాకు మధ్య 1914లో సిమ్లా సమావేశం జరిగింది. అప్పుడే సరిహద్దుగా మెక్మోహన్ రేఖను అంగీకరించాయి. చైనా చేస్తున్న ప్రకటనలు, చూపుతున్న పటం ఆ అంగీకరించిన సరిహద్దు రేఖ చట్టబద్ధతను ఉల్లంఘించడమే! అలాగే, ద్వీప దేశమైన తైవాన్ ఏడాదిపైగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా, పట్టువదలని బీజింగ్ ‘వన్ చైనా విధానం’ అంటూ దాన్ని తమ పటంలో చూపడం దురహంకారం. ఇక, పసిఫిక్, హిందూ మహాసముద్రాలకు ప్రధాన నౌకాయాన అనుసంధానమైన దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సైనిక, వాణిజ్యపరంగా అతి కీలకం. వివాదాస్పద ద్వీపాలతో సహా ఈ ప్రాంతమంతా చైనా తమ పటంలో కలిపేసుకుంటోంది. ఈ ప్రాంతంలో డ్రాగన్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరిని ఫిలిప్పీన్స్, వియత్నామ్, మలేసియా, జపాన్ తదితర దేశాలు పదే పదే ఎత్తిచూపుతున్నాయి. అయినా అది తన తీరు మార్చుకోలేదు. భౌతికంగా తన అధీనంలో లేకున్నా ఈ ప్రాంతాలు తనవేననడం చిరకాలంగా చైనా చూపుతున్న మొండివైఖరే. తాజా పటం జారీ వల్ల దానికి కొత్తగా కలిసొచ్చేదేమీ లేదు. పైగా, మిగతా ప్రపంచపు సహాయం, సానుభూతి కూడా దక్కవు. అయినా సరే, డ్రాగన్ తన దురహంకారాన్ని చాటుకోవడం గమనార్హం. ఒక్కమాటలో చైనా అధినేత షీ జిన్పింగ్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరికి ఈ కొత్త మ్యాప్ ప్రతీక. అధికారిక జాతీయ పటాల జారీ చైనాలో దాదాపు ఏటా జరిగే తంతు అయినా... భారత్ వరకు తీసుకుంటే చంద్రయాన్–3 విజయం, రానున్న జీ–20 సదస్సు నేపథ్యంలో ఇప్పుడీ పటాన్ని ఎందుకు విడుదల చేసినట్టు? ఇరుదేశాల మధ్య ఇలాంటి సరిహద్దు వివాదాలే గతంలోనూ సైనిక ప్రతిష్టంభనకు దారితీశాయి. 2017లో తలెత్తిన డోక్లామ్ సంక్షోభం, 2020లో గల్వాన్ లోయలో సైనిక ఘర్షణలే తాజా ఉదాహరణలు. దీంతో దౌత్య సంబంధాలూ దెబ్బతింటున్నాయి. బలగాల్ని వెనక్కి పిలిచి, ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించుకోవాల్సిన వేళ ఇలాంటి తప్పుడు పటం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఏ రకంగానూ దోహదపడదు. ఇప్పటికే లద్దాఖ్లోని కొంత భాగాన్ని చైనా ఆక్రమించేసుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. వివిధ విదేశీ సర్వేలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు సైతం భారత సరిహద్దులో చైనా వివాదాస్పద నిర్మాణాల్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుమానాలు పోగొట్టేలా మన పాలకులు వాస్తవాలను వెల్లడించాలి. నమ్మడానికి వీల్లేని పొరుగుదేశంతో నిక్కచ్చిగానే వ్యవహరించాలి. సార్వభౌమాధికారం, సమగ్రతల్లో రాజీ లేదని మాటల్లో కన్నా చేతల్లో చూపాలి. జీ–20 అధ్యక్షతతో విశ్వగురువులయ్యామని సంబరపడేకన్నా, అంతర్గత ఘర్షణలున్న అన్ని పక్షాలనూ అర్థవంతమైన సమగ్ర చర్చలతో ఒక తాటిపైకి తేవడమే అసలు విజయమని గ్రహించాలి. చైనాతో సంభాషణకు అన్ని మార్గాల్నీ అన్వేషిస్తూనే, మనకున్న ఆందోళనల్ని కుండబద్దలు కొట్టాలి. అవకాశాన్ని బట్టి అందుకు రానున్న జీ–20ను సైతం వేదికగా చేసుకోవాలి. దౌత్య, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు సరిహద్దుల్లో సామరస్య వాతావరణం కీలకమని మరోసారి అందరికీ తలకెక్కేలా చూడాలి. -
అది వారికున్న పాత అలవాటే.. జయశంకర్
న్యూఢిల్లీ: భారత భూభాగాలను తమ అధికారిక మ్యాప్లో కలువుకుని చైనా విడుదల చేసిన మ్యాప్పై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పందిస్తూ అది వారికున్న పాత ఆలవాటేనని అన్నారు. చైనా ఈరోజు విడుదల చేసిన 2023కు సంబంధించిన అధికారిక మ్యాప్లో కొన్ని పరాయి దేశాలకు సంబంధించిన భూభాగాలను కలిపేసుకుంది. ఈ మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయి చిన్ వంటి భూభాగాలతో పాటు తైవాన్, దక్షిణా చైనా సముద్రాన్ని కూడా తమ దేశంలో కలుపుకుంది. ఇదే విషయంపై భారత విదేశాంగ శాఖామంత్రి జయశంకర్ను ప్రశ్నించగా అయన మాట్లాడుతూ దీనివలన చైనాకు ఒరిగే ప్రయోజనమేమీ లేదని చెబుతూనే అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికీ ఎప్పటికీ భారత భూభాగమేనని అన్నారు. తమవి కాని ప్రాంతాలు తమవని చెప్పుకోవడం సరైన పధ్ధతి కాదు. మా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్పై పూర్తి స్పష్టతతో ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆర్టికల్-370 రద్దు మా ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా తొలగించడం వెనుక చాలా కారణాలున్నాయి.. దాని వలన ఆ ప్రాంతానికి కలిగిన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని దీనిని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశారన్నారు. ఈ ఐదేళ్ళలో మేము ఏమి సాధించామంటే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని చెబుతానని అన్నారు. ఇది కూడా చదవండి: వీడియో చెప్పిన కథ : రష్యాను భయపెడుతోన్న ఉక్రెయిన్ డ్రోన్లు -
World Robot Conference 2023: బీజింగ్లో ప్రపంచ రోబోట్ కాన్ఫరెన్స్ 2023 (ఫోటోలు)
-
చైనాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు..
బీజింగ్: చైనా తూర్పు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 5.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సంస్థ వెల్లడించింది. ప్రమాదంలో డజన్ల కొద్దీ భావనాలు నేలమట్టం కాగా 21 మంది మరణించినట్టు మీడియా వర్గాలు తెలిపాయి. 23 injured, buildings collapse as 5.4 earthquake hits east Chinahttps://t.co/JDhANJihBW pic.twitter.com/vnBgC3pOoa — Gulf Today (@gulftoday) August 6, 2023 దక్షిణ షెజోలోని శాండోంగ్ ప్రావిన్స్ లో ఆదివారం తెల్లవారుజాము 2.33 గంటలకు సంభవించిన ఈ భూకంపం ఉపరితలానికి 10కి.మీ. లోతున పుట్టిందని, సుమారు 26 కిలోమీటర్ల మేర ఇది ప్రభావం చూపిందని తెలిపింది యూఎస్ జియోలాజికల్ సంస్థ. భూకంపం తీవ్రతకు కనీసం 126 భవనాలు కుప్పకూలిపోయినట్లు తెలిపాయి శాండోంగ్ అధికారిక బృందాలు. Twenty-one injured in east #China magnitude 5.5 earthquake pic.twitter.com/JLF0pXXbo0 — DD India (@DDIndialive) August 6, 2023 కూలిన భవనాలు, గోడలతో రోడ్ల మీద ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న శిధిలాలే కనిపిస్తున్నాయి. ఈ విపత్తులో భూమి సుమారుగా 52 సార్లు కంపించడంతో సుమారుగా 21 మంది తీవ్రంగా గాయపడ్డారని, శిధిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చన్నారు అధికారులు. ఇంతవరకు ఎటువంటి ప్రాణ నష్టమైతే జరగలేదని వారు స్పష్టం చేశారు. 5.5 earthquake in eastern China pic.twitter.com/6xLHvQvYHK — Kim Green (@KimGree57363126) August 6, 2023 చాలా దశాబ్దాల తర్వాత చైనాలో ఈ స్థాయిలో భూకంపం చోటు చేసుకుందని దీని తీవ్రత కూడా జనాన్ని భయభ్రాంతులకి గురిచేసిందని స్థానికులు చెబుతున్నారు. భూకంపం సమయంలో తల తిరుగుతున్నట్లు అనిపించిందని ఒకరు సోషల్ మీడియాలో తెలపగా.. మరొకరు భూకంపం అదురుకు గుండె జారినట్లైందని వెంటనే భయంతో రోడ్ల మీదకు పరుగులు తీసినట్లు తెలిపారు. Earthquake hits eastern China, injuring 21 Follow us on Rumble: https://t.co/Nuc9nUzTc5 pic.twitter.com/g3vUynvjcA — RT (@RT_com) August 6, 2023 భూకంపం తాలూకు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు. ఈ వీడియోలు చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించి శాండోంగ్ కు సహాయాక బృందాలను పంపగా వారు సహాయక చర్యలకు ఉపక్రమించారు. అసలే భారీ వర్షాలతోనూ, వరదలతోనూ కొట్టుమిట్టాడుతున్న చైనాను ఈ భూకంపం మరింత కుదిపేసింది. ఇది కూడా చదవండి: పాకిస్తాన్ వధువు, భారత వరుడు.. మరో జంట కథ -
బీజింగ్లో అనూహ్య వరదలు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లో మునుపెన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో కనీసం 20 మంది చనిపోగా మరో 27 మంది గల్లంతయ్యారు. బీజింగ్ ఎండల తీవ్రత అంతగా ఉండదు. కానీ, ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో ఎండలతో జనం ఇబ్బందులు పడ్డారు. అదేవిథంగా, భారీ వర్షాలు కురియడం కూడా అరుదే. ఈసారి మాత్రం అసాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. జనావాసాలు నీట మునిగాయి. రహదారులు, వాహనాలు కొట్టుకుపోయాయి. వరదలకు సంబంధించిన ఘటనల్లో బీజింగ్ సిటీ సెంటర్లో 11 మంది చనిపోగా, 27 మంది జాడ తెలియకుండాపోయారు. నగర పరిధిలోని హుబే ప్రావిన్స్లో మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని అధికార మీడియా తెలిపింది. -
అమెరికా శత్రువులంతా ఒకేచోట.. ఎందుకంటే..
ప్యోంగ్ యాంగ్: శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడన్న మాటను నిజం చేస్తూ అమెరికాకు బద్ధ శత్రువులైన రష్యా, చైనా నార్త్ కొరియాతో చేతులు కలిపాయి. నార్త్ కొరియా విక్టరీ డే 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆహ్వానం మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రి షెర్గే షోయిగు, చైనా ప్రతినిధుల బృందంతో కలిసి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు లీ హాంగ్ జాంగ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన ఎగ్జిబిషన్ పెరేడ్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ నిషేధించబడిన క్షిపణులను ప్రతినిధి బృందానికి చూపించారు. ఈ సందర్భాంగా రష్యా, చైనా, నార్త్ కొరియా మధ్య ఏర్పడ్డ కొత్త స్నేహాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు కిమ్ జోంగ్. అమెరికాతో శత్రుత్వం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ నిషేధించిన ఈ క్షిపణులను ప్రదర్శించి బలప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేఖ రూపంలో కిమ్ జోంగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కిమ్ జోంగ్ కూడా తమ దేశానికి మిలటరీ ప్రతినిధులను పంపినందుకు రష్యా అధ్యక్షుడికి కృతఙ్ఞతలు తెలిపారు. కిమ్ జొంగ్ మాట్లాడుతూ.. మిలటరీ ప్రతినిధుల పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, సంప్రదాయ సంబంధాలు మరింత మెరుగయ్యాయని అన్నారు. ఒకే రకమైన ఆలోచనలతో రెండు దేశాల సార్వభౌమత్వం, అభివృద్ధి లక్ష్యంగా సామ్రాజ్యవాదుల కలయిక అంతర్జాతీయ శాంతి, సమన్యాయం నెలకొల్పే దిశగా ఫలప్రదంగా జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా ఆయన రష్యా సైన్యం పైనా, ప్రజలపైన అపార నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రష్యా రక్షణ శాఖ మంత్రి షెర్గే షోయిగు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు లీ హాంగ్ జాంగ్ కూడా తమ సంతోషసన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశం ద్వారా ఈ మూడు దేశాలు అమెరికాకు గట్టి సంకేతాలనే పంపాయి. కానీ ఎక్కడా ఉక్రెయిన్ ప్రస్తావన తీసుకురాకపోవడం విశేషం ఇది కూడా చదవండి: ఆ హోటల్లో తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే -
లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ
బీజింగ్: దక్షిణ చైనాలోని గువాంగ్ డాంగ్ ప్రావిన్స్ ఎయిర్ పోర్టులో ఒకామె తన లోదుస్తుల్లో ఐదు బ్రతికున్న పాములను అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది. ఆమె శరీరాకృతి విచిత్రంగా ఉండటంతో అనుమానం వచ్చి శెంజిన్ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. అదేంటో.. ప్రపంచంలో చిత్ర విచిత్రమైన సంఘటనలన్నీ చైనాలోనే చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్ పోర్టుల్లో ఈ విధంగా జీవులను తరలిస్తున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అత్యధిక స్మగ్లర్లు బ్యాగుల్లో, బాక్సుల్లో లేదా మరో విధంగా వాటిని తరలిస్తూ ఉంటారు. కానీ ప్రమాదకరంగా విషపూరితమైన సర్పాలను శరీరంలో దాచుకుని తరలించిన సంఘటనలు చాలా అరుదు. కస్టమ్స్ అధికారులు పేరు చెప్పడానికి నిరాకరించిన దక్షిణాఫ్రికాకు చెందిన సదరు మహిళ సజీవంగా ఉన్న ఒక్కో పాముని ఒక్కో స్టాకింగ్ లో పెట్టి ప్యాక్ చేసింది. ఆ ఐదు స్టాకింగ్ బ్యాగులను తన ఛాతీ వద్ద లోదుస్తుల్లో జాగ్రత్తగా పెట్టుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా యధాతధంగా పైన డ్రెస్ వేసుకుంది. ఆమె ఎయిర్ పోర్టులోకి అడుగుపెడుతూనే కస్టమ్స్ అధికారులకు ఆమె ఆకృతి చూసి అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను అడ్డగించి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఐదు పాములను జెర్రిపోతులుగా గుర్తించి వాటిని జంతు సంరక్షణ శాలకు తరలించారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్ లో హిందూ దేవాలయంపై దాడి.. పబ్జీ లవ్ స్టోరీనే కారణమా? -
అయిదేళ్ల తర్వాత బీజింగ్కు బ్లింకెన్
బీజింగ్: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం ఉదయం చైనా రాజధాని బీజింగ్కు చేరుకున్నారు. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్తో ఆయన భేటీ అయ్యారు. తైవాన్ అంశం, ఉక్రెయిన్ యుద్ధం తదితర కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు. అనంతరం అధికార విందులో పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్లింకెన్ అధ్యక్షుడు జిన్పింగ్ను కూడా కలుస్తారని సమాచారం. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో బ్లింకెన్ చేపట్టిన ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణ సంబంధాలపై ఇరుపక్షాలు ఆసక్తితో ఉన్నప్పటికీ, బ్లింకెన్ పర్యటనతో కీలక పరిణామాలకు అవకాశాలు తక్కువని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వ్యాఖ్యానించడం గమనార్హం. -
చైనాలో మెస్సీకి చేదు అనుభవం.. కారణం?
అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి చైనాలో చేదు అనుభవం ఎదురైంది. పాస్పోర్ట్ విషయంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా బీజింగ్ ఎయిర్పోర్ట్లో పోలీసులు మెస్సీని అడ్డుకోవడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. ఈ గురువారం(జూన్ 15న) బీజింగ్ వేదికగా ఆస్ట్రేలియాతో అర్జెంటీనా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం జూన్ 10న మెస్సీ చైనాలోని బీజింగ్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టాడు. అయితే పాస్పోర్ట్ చెక్ చేసిన పోలీసులు మెస్సీని అడ్డుకున్నారు. మెస్సీకి చైనా వీసా లేదని, అప్లై కూడా చేసుకోలేదని వివరించారు. అయితే తన దగ్గరున్న స్పానిష్, అర్జెంటీనా పాస్పోర్టును అందజేసిన మెస్సీ.. తైవాన్లాగే చైనాలో కూడా తనకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని భావించానని తెలిపాడు. కానీ చైనాలోకి రావాలంటే వీసా ఉండాల్సిందేనని, వెంటనే అప్లై చేసుకోవాలని.. తైవాన్ రూల్ వర్తించదని పోలీసులు వెల్లడించారు. అయితే అధికారులు చొరవ తీసుకొని అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కింద వీసా అందించి సమస్యను పరిష్కరించారు. దీంతో పోలీసులకు మెస్సీ కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా జూన్ 15న ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం జట్టుతో కలిసి ఇండోనేషియా వెళ్లనున్న మెస్సీ జూన్ 19న ఇండోనేషియాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. ఇక గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్తో గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్నాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనా మూడోసారి వరల్డ్కప్ గెలవడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. -
మొదటిసారిగా అంతరిక్షంలోకి పౌర వ్యోమగామిని పంపిన చైనా
బీజింగ్/జియుక్వాన్: చైనా మంగళవారం మొదటిసారిగా ఒక పౌర వ్యోమగామి సహా ముగ్గురు వ్యోమగాములను సొంత అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్కు పంపించింది. జియుక్వాన్ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములతో కూడిన షెంజౌ–16ను లాంగ్ మార్చ్–2ఎఫ్ రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. పది నిమిషాల తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన షెంజౌ–16 నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించిందని చైనా మానవసహిత అంతరిక్ష సంస్థ(సీఎంఎస్ఏ) తెలిపింది. ఈ మిషన్ పూర్తిగా విజయవంతంగా పూర్తయిందని పేర్కొంది. ‘షెంజౌ–16 అనంతరం టియాంగాంగ్ కోర్ మాడ్యూల్తో అనుసంధానమైంది. షెంజౌ–16లోని ముగ్గురు వ్యోమగాములు కోర్మాడ్యూల్ తియాన్హెలో ఉన్న ఇప్పటికే ఉన్న ముగ్గురు వ్యోమగాములను కలుసుకున్నారు. ఆ ముగ్గురు త్వరలోనే భూమికి తిరిగి వస్తారు’అని తెలిపింది. మంగళవారం పంపిన ముగ్గురిలో ఒకరు పేలోడ్ స్పెషలిస్ట్గా పేరున్న గుయి హయిచావో. ఈయన బీజింగ్లోని బీయిహంగ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. మిగతా ఇద్దరు పీపుల్స్ లిబరేషన్ ఆర్మికి చెందిన వారు. 2030కల్లా చంద్రునిపైకి మనుషులను పంపే మానవ సహిత యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎంఎస్ఏ సోమవారం ప్రకటించింది. -
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాలు
-
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం 21 మంది మృతి.. మరో ఘటనలో 11 మంది
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లోని ఓ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 21 మంది చనిపోయారు. ఈ ఘటనలో 71 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టామన్నారు. మరో ఘటనలో 11 మంది... ఝెజియాంగ్ ప్రావిన్స్ జిన్హువా నగరంలోని ఓ తలుపుల తయారీ ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. కలప, రసాయనాల కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. -
చైనా ఆకాశం నుంచి పురుగుల వాన.. వీడియో వైరల్..!
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లో పురుగుల వాన కురిసిందని ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇందులో రోడ్డుపై ఎటుచూసినా పురుగులే దర్శనమిస్తున్నాయి. ఆకాశం నుంచి కుప్పలుకుప్పలుగా వచ్చి పడుతున్నాయి. కార్లు, ఇతర వాహనాలపై మొత్తం ఇవే నిండిపోయాయి. పురుగులు తమపై పడకుండా చాలా మంది గొడుగులతో కన్పించారు. WATCH 🚨 China citizens told to find shelter after it looked like it started to rain worms pic.twitter.com/otVkuYDwlK — Insider Paper (@TheInsiderPaper) March 10, 2023 అమెరికాకు చెందిన న్యూయార్క్ పోస్టు ఇందుకు సంబంధించి వార్త ప్రచురించింది. వేలి పొడవు, బ్రౌన్ కలర్లో కన్పిస్తున్న ఈ పురుగులు విరక్తి కలిగించేలా ఉన్నాయి. అయితే పురుగుల వానకు కారణం ఏమై ఉంటుందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. బలమైన ఈదురుగాలుల ధాటికి ఈ పురుగులన్నీ సుడిగాలిలో కొట్టుకుపోయి ఒక్కసారిగా ఆకాశం నుంచి వర్షం రూపంలో పడి ఉంటాయని సైంటిఫిక్ జర్నల్ మదర్ నేచర్ నెట్వర్క్ తెలిపినట్లు న్యూయార్క్ పోస్టు పేర్కొంది. అయితే ఈ వీడియో ఫేక్ అని చైనా జర్నలిస్టు కొట్టిపారేశాడు. తాను చాలా రోజులుగా బీజింగ్లోనే ఉంటున్నానని, అసలు ఇక్కడ వర్షమే కురవలేదని చెప్పాడు. చదవండి: ఇంత బరువున్నావ్.. ఎక్కువ రోజులు బతకవ్.. దెబ్బకు 165 కిలోలు తగ్గాడు.. -
కేవలం ఉద్యోగం కోసం మొదలుపెట్టాడు.. విధిరాత మరోలా ఉంది! అందుకే ఇలా..
Achievers- Vijender Singh: బాక్సింగ్ను మన దేశంలో చాలా మంది ఒక ఆటగానే చూడరు. బాక్సర్లంటే గొడవలు చేసేవాళ్లనో లేదంటే పిచ్చివాళ్లుగానో ముద్ర వేస్తారు.. చాలా కాలంగా, చాలా మందిలో ఉన్న అభిప్రాయమది. ఆ కుర్రాడు కూడా మొదట్లో అలాగే అనుకున్నాడు. అందుకే ఆ ఆటకు దూరంగా ఉండటమే మేలనుకున్నాడు. కానీ తన ప్రమేయం లేకుండానే బాక్సింగ్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఒక ఉద్యోగం పొందడానికి ఆ ఆట ఉంటే సరిపోతుందని సాధన చేశాడు. ఏకంగా ఒలింపిక్స్లో పతకం సాధించి దేశం గర్వించదగిన బాక్సర్గా నిలిచాడు. అతడే విజేందర్ సింగ్ బేనివాల్... ఒలింపిక్స్లో మెడల్ గెలుచుకున్న తొలి భారత బాక్సర్. హరియాణాలోని భివానీ పట్టణం.. ఢిల్లీ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో దాదాపు 2 లక్షల జనాభాతో ఉంటుంది. ఆ రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులను అందించిన ఊరు. రాజకీయపరమైన విశేషాన్ని పక్కన పెడితే అది భారత బాక్సింగ్కు సంబంధించి ఒక పెద్ద అడ్డా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు చెందిన కోచింగ్ కేంద్రం అక్కడ ఉండటంతో ఎంతో మంది బాక్సర్లు అక్కడి నుంచి వెలుగులోకి వచ్చారు. రెండు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన హవా సింగ్ పట్టుబట్టి మరీ ‘సాయ్’ కేంద్రాన్ని అక్కడికి తీసుకొచ్చారు. అనంతరం అది అద్భుతమైన ఫలితాలను అందించింది. PC: Vijender Singh Instagram ఒకే ఒక్కడు.. విజేందర్ సింగ్ కూడా అక్కడి నుంచి వచ్చినవాడే. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో ఐదుగురు బాక్సర్లు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తే అందులో నలుగురు.. ‘మినీ క్యూబా’గా పిలిచే భివానీ సెంటర్కు చెందినవారు కావడంతో ఒక్కసారిగా దాని గుర్తింపు పెరిగిపోయింది. ఈ ఐదుగురిలో విజేందర్ సింగ్ ఒక్కడే సత్తా చాటి కాంస్య పతకంతో మెరిశాడు. భారత బాక్సింగ్లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అన్న స్ఫూర్తితో.. విజేందర్ తండ్రి హరియాణా ఆర్టీసీలో డ్రైవర్. మరీ పెద్ద సంపాదన కాదు. కానీ ఇద్దరు పిల్లల్ని బాగా చదివించాలనే తాపత్రయంతో సాధ్యమైనంతగా కష్టపడేవాడు. అయితే పెద్ద కొడుకు మనోజ్ సహజంగానే స్థానిక మిత్రుల సాన్నిహిత్యంతో బాక్సింగ్ వైపు వెళ్లాడు. గొప్ప విజయాలు సాధించకపోయినా.. స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో ఉద్యోగం దక్కించుకునేందుకు అది సరిపోయింది. విజేందర్కు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అన్నకు ఉద్యోగం వచ్చి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడింది. దాంతో అప్పటి వరకు బాగానే చదువుతున్న విజేందర్కు చదువుకంటే ఆటనే బాగుంటుందనిపించింది. చివరకు తండ్రి, అన్న కూడా అతడిని కాదనలేకపోయారు. దాంతో పూర్తి స్థాయిలో బాక్సింగ్ శిక్షణ వైపు మళ్లించారు. సహజ ప్రతిభ కనబర్చిన అతను ఆటలో వేగంగా మంచి ఫలితాలు సాధించాడు. భార్యాపిల్లలతో విజేందర్సింగ్ PC: Vijender Singh Instagram వరుస విజయాలు.. హరియాణా రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచిన తర్వాత 12 ఏళ్ల వయసులో జాతీయ సబ్ జూనియర్ చాంపియన్ కావడంతో తొలిసారి విజేందర్కు గుర్తింపు లభించింది. హైదరాబాద్లో 2003లో జరిగిన ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అతని కెరీర్కు కీలకంగా మారాయి. అప్పటికి జూనియర్ స్థాయిలోనే ఆడుతున్నా.. పట్టుదలగా పోటీ పడి సీనియర్ టీమ్లో చోటు దక్కించుకున్న విజేందర్ రజతంతో సత్తా చాటాడు. అయితే ఇదే ఊపులో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ కోసం సిద్ధమైన విజేందర్కు షాక్ తగిలింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా అతను తొలి రౌండ్లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. దాంతో తాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని విజేందర్కు అర్థమైంది. ఒలింపిక్ పతకం వైపు.. ఏథెన్స్ ముగిసిన రెండేళ్ల తర్వాత విజేందర్ కెరీర్ కీలక మలుపు తీసుకుంది. తన వెయిట్ కేటగిరీని మార్చుకోవాలని అతను తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను అందించింది. 75 కేజీల మిడిల్వెయిట్కు అతను మారాడు. అదే ఏడాది దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన విజేందర్.. ఆ ఏడాదే కామన్వెల్త్ క్రీడల్లోనూ రజత పతకం గెలుచుకున్నాడు. దాంతో అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. జర్మనీలో ప్రత్యేక శిక్షణ అనంతరం అది రెట్టింపైంది. ఒలింపిక్స్లోనూ రాణించగలననే నమ్మకంతోనే అతను బీజింగ్లో అడుగు పెట్టాడు. చివరకు దానిని సాధించడంలో విజేందర్ సఫలమయ్యాడు. 22 ఆగస్టు, 2008న కంచు పతకం సాధించి ఒలింపిక్స్లో ఈ ఘనత నమోదు చేసి తొలి భారత బాక్సర్గా వేదికపై సగర్వంగా నిలిచాడు. ఈ విజయంలో ఒక్కసారిగా విజేందర్ను కీర్తి, కనకాదులు వరించాయి. కానీ అతను ఏ దశలోనూ ఆటపై ఏకాగ్రత కోల్పోలేదు. ఒలింపిక్ పతకం తర్వాత కూడా వరల్డ్ చాంపియన్ షిప్లో, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్ షిప్లో వరుస పతకాలు గెలుచుకున్నాడు. వరల్డ్ నంబర్వన్ ర్యాంక్నూ సొంతం చేసుకున్నాడు. PC: Vijender Singh Instagram డ్రగ్స్ వివాదాన్ని దాటి.. ఆటగాడిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన తర్వాత ఒలింపిక్స్ మెడల్ గెలిచిన నాలుగేళ్లకు విజేందర్ కెరీర్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా స్పోర్ట్స్మన్ డ్రగ్స్ అంటే నిషేధిత ఉత్ప్రేరకాలే అని వినిపిస్తుంది. కానీ ఇది అలాంటిది కాదు. విజేందర్ హెరాయిన్ తదితర డ్రగ్స్ను తీసుకుంటూ పట్టుబడ్డాడని పోలీసులు ప్రకటించారు. ఒక డ్రగ్ డీలర్ ఇంటి ముందు విజేందర్ భార్య కారు ఉండటం కూడా పోలీసు విచారణంలో కీలకంగా మారింది. పోటీలు లేని సమయంలో తీసుకునే డ్రగ్స్కు సంబంధించి తాము పరీక్షలు చేయలేమంటూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రకటించడం విజేందర్కు ఊరటనిచ్చింది. అయితే యువ ఆటగాళ్లపై ఇలాంటి ఘటనలు ప్రభావితం చూపిస్తాయంటూ నేరుగా కేంద్రప్రభుత్వం ఆదేశించడంతో ‘నాడా’ పరీక్షలు నిర్వహించింది. దాదాపు 14 నెలలు వివాదం సాగిన తర్వాత విజేందర్కు ‘క్లీన్చిట్’ లభించింది. పురస్కారాలు ఆటగాడిగా అద్భుత ప్రదర్శనకు భారత ప్రభుత్వం అర్జున, ఖేల్రత్న, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న విజేందర్ సింగ్... పలు సంస్థలకు మాడలింగ్ చేయడంతో పాటు ‘పగ్లీ’ అనే బాలీవుడ్ సినిమాలోనూ నటించాడు. త్వరలో రాబోయే సల్మాన్ ఖాన్ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లోనూ అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు.. ఇతర భారత బాక్సర్లతో పోలిస్తే విజేందర్ సింగ్ కెరీర్ కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఒలింపిక్ పతకం అందించిన అమెచ్యూర్ బాక్సింగ్ను దాటి ఏ భారత బాక్సర్ ఆలోచించలేదు. కానీ విజేందర్ మాత్రం సాహసం ప్రదర్శించాడు. అమెచ్యూర్తో పోలిస్తే ఎంతో ప్రమాదకరంగా, రక్షణ ఉపకరణాలు వాడే అవకాశం లేని ప్రొఫెషనల్ బాక్సింగ్లోకి అడుగు పెట్టాడు. ‘సాధించిన పేరు ప్రతిష్ఠలు చాలు. ఇప్పుడు ఇదంతా అవసరమా? లేనిపోని ప్రమాదం కొనితెచ్చుకోవడమే’ అని సహచరులు వారించినా అతను వెనుకడుగు వేయలేదు. నేను బాక్సర్ను, ఎక్కడైనా పోరాడతాను అంటూ తన గురించి తాను చెప్పుకున్న విజేందర్, 2015 అక్టోబరులో తొలిసారి ఇందులోకి అడుగు పెట్టాడు. అంచనాలకు మించి రాణించిన అతను అక్కడా మంచి విజయాలు అందుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్లో 14 బౌట్లు ఆడిన అతను 13 గెలిచి ఒకసారి మాత్రమే ఓడాడు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే విజేందర్ సింగ్ 2011లో ఢిల్లీకి చెందిన అర్చనా సింగ్ను వివాహమాడాడు. వీరికి ఇద్దరు కుమారులు అబీర్ సింగ్, అమ్రిక్ సింగ్ సంతానం. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్ చేస్తే 99 శాతం లిఫ్ట్ చేయడు.. అలాంటిది.. వాళ్లకేం ఖర్మ? ఐపీఎల్కు ఏదీ సాటి రాదు.. బీసీసీఐని చూసి పీసీబీ నేర్చుకోవాలి: పాక్ మాజీ ప్లేయర్ -
యుద్ధాన్ని ఆపే దమ్ము చైనాకి ఉందా?
కీవ్/బీజింగ్: ఏడాది కాలంపాటు జరిగిన విధ్వంసకాండ.. నరమేధం తర్వాత ఉక్రెయిన్ యుద్దం ముగింపు దశకు చేరుకోబోతోందా?.. అదీ వీలైనంత తర్వలోనేనా?. దురాక్రమణను నిలిపేసి.. బలగాలను వెనక్కి రప్పించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరిస్తారా?.. ఒక బాధిత దేశంగా శాంతి చర్చలకు తామే తొలి అడుగు వేస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించిన వేళ.. చైనా చేస్తున్న ప్రయత్నాలపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను మొదటి నుంచి చైనా వ్యతిరేకించడం లేదు. అలాగని సమర్థించడమూ లేదు. కానీ, ఉన్నపళంగా శాంతి చర్చల రాగం అందుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు శుక్రవారం.. ఇరుదేశాలు సమన్వయం పాటించాలని సూచిస్తూ పొలిటికల్ సెటిల్మెంట్ పేరుతో 12 పాయింట్ల పేపర్ను విడుదల చేసింది చైనా ప్రభుత్వం. ఆ వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సైతం.. చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో భేటీకి సిద్ధమంటూ ప్రకటించారు. వెనువెంటనే.. రష్యా సైతం చైనా శాంతి చర్చల పిలుపును స్వాగతించింది కూడా!. చైనా శాంతి ప్రణాళిక నేపథ్యంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ను కలవనున్నట్లు ప్రకటించారు. జింగ్పిన్ను కలిసి చర్చించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపిన ఆయన.. ఇది ప్రపంచ భద్రతకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించాలంటే రష్యాకు చైనా నుంచి ఆయుధాలు సరఫరా కాకుండా చూస్కోవడమే ఇప్పుడు తన ముందున్న కర్తవ్యమని, చైనా కూడా ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారాయన. మరోవైపు.. జెలెన్స్కీ-జిన్పింగ్ భేటీ ఎప్పుడన్నదానిపై స్పష్టత లేకున్నా.. ఈ పరిణామంపై రష్యా కూడా స్పందించింది. రష్యా విదేశాంగ ఒక ప్రకటనలో.. చైనా శాంతి ప్రయత్నాలను అభినందించింది. బీజింగ్ అభిప్రాయాలను మేం గౌరవిస్తాం అంటూ అందులో స్పష్టం చేసింది రష్యా విదేశాంగ శాఖ. ఈ తరుణంలో శాంతి చర్చలకు బీజింగ్ వేదిక కాబోతోందని, త్వరలోనే యుద్ధానికి పుల్స్టాప్ పడొచ్చని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషణాత్మక ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి. పుతిన్ వార్నింగ్ను తప్పుబట్టిన చైనా! ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఫిబ్రవరి 24వ తేదీతో.. సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఒకవైపు ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. రష్యా సైతం భారీగా బలగాల్ని కోల్పోయింది. అయినప్పటికీ రష్యా మాత్రం ‘తగ్గేదేలే..’ అనుకుంటూ రెండో ఏడాదిలోకి అడుగుపెట్టేసింది. అసలు యుద్ధానికి ముగింపు ఎప్పుడు? అనేదానిపై ఎవరూ అంచనా వేయలేని స్థితి. ఈ తరుణంలో.. బుధవారం మాస్కోలోని చైనా దౌత్యవేత్త వాంగ్ యూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కలిశాడు. ఆ తర్వాత చైనా నుంచి శుక్రవారం శాంతి ప్రణాళిక బయటకు రావడం గమనార్హం. చైనా ఇరు దేశాలకు శుక్రవారం కీలక సూచన చేసింది. రెండు దేశాలు సంయమనం పాటించాలి. తక్షణ శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి అని చైనా తన శాంతి ప్రకటనలో సూచించింది. పొలిటికల్ సెటిల్మెంట్లో.. ఉక్రెయిన్-రష్యాలు ముఖాముఖి చర్చలకు ప్రయత్నించాలని చైనా, యావత్ ప్రపంచాన్ని కోరింది. పుతిన్ అణ్వాయుధాల ప్రయోగం హెచ్చరికల నేపథ్యంలో.. అణ్యాయుధాలను వాడడమే కాదు, వాటిని యుద్ధ క్షేత్రంలో మోహరించడం కూడా పెను విపత్తేనని పుతిన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. అంతర్జాతీయ మానవతా చట్టానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలని సూచించింది. పౌరులు/ పౌర సౌకర్యాలపై దాడులు చేయకూడదని చెప్పింది. అత్యవసరంగా శాంతి చర్చలకు ముందుకు రావాలని అందులో పేర్కొంది చైనా. చైనా వెరీ డేంజర్: వెస్ట్రన్ కంట్రీస్ ఇదిలా ఉంటే.. చైనా చేసిన శాంతి ప్రతిపాదలను ఉక్రెయిన్కు మద్ధతు ఇస్తున్న పాశ్చాత్య దేశాల్లో చాలావరకు తిరస్కరించాయి. పైగా మాస్కోతో బీజింగ్కు ఉండే సన్నిహిత సంబంధాల దృష్ట్యా.. జాగ్రత్తగా ఉండాలని ఉక్రెయిన్ను, జెలెన్స్కీని హెచ్చరించాయి. ‘‘రష్యా.. చైనాకు వ్యూహాత్మక మిత్రదేశం. అలాంటి దేశంలో సన్నిహితంగా ఉంటూనే.. దురాక్రమణ విషయంలో తటస్థంగా ఉంటూ వస్తోంది. ఇది ఉక్రెయిన్ గమనించాలి. ఇదేకాదు.. 12 పాయిట్ల పొలిటికల్ సెటిల్మెంట్లో.. ఎక్కడా కూడా రష్యా బలగాలు ఉక్రెయిన్ గడ్డ నుంచి వెనక్కి వెళ్లిపోవాలని చైనా చెప్పలేదు. పైగా రష్యాపై సానుకూల ధోరణి ప్రదర్శిస్తూ.. ‘‘ఏకపక్ష ఆంక్షల’’ను తీవ్రంగా ఖండించింది కూడా’’ అని పాశ్చాత్య దేశాలు చెప్తున్నాయి. ఇక చైనా శాంతి చర్చల పిలుపుపై నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ స్పందించారు. బీజింగ్ను నమ్మడానికి వీల్లేదని, ఎందుకంటే అది ఉక్రెయిన్పై దురాక్రమణను ఏనాడూ ఖండించలేదని తెలిపారు. మరోవైపు రష్యాకు బీజింగ్ నుంచి ఆయుధాల సరఫరా జరుగుతోందని అమెరికా ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బీజింగ్ ఆ ఆరోపణను ఖండించింది. -
అతిపెద్ద ప్రాసాదం ఎక్కడుందో తెలుసా?
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాసాదం. చైనా రాజధాని బీజింగ్లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ప్రాసాదం ‘ఫర్బిడెన్ సిటీ’గా పేరు పొందింది. చైనాలోని మింగ్ వంశీయులు చేపట్టిన దీని నిర్మాణం 1406లో మొదలుపెడితే, 1420లో పూర్తయింది. హోంగ్వు చక్రవర్తి కొడుకు ఝు డి నాన్జింగ్ నుంచి బీజింగ్కు తన రాజధానిని మార్చుకున్నాక, బీజింగ్లో ఈ నిర్మాణం చేపట్టాడు. దాదాపు ఐదు శతాబ్దాల కాలం ఇది చైనా చక్రవర్తులకు రాచప్రాసాదంగా వర్ధిల్లింది. కమ్యూనిస్టు పాలన మొదలయ్యాక ఇది మ్యూజియంగా మారింది. దాదాపు ఒక ఊరంత విస్తీర్ణంలో ఉన్న ఈ సువిశాల ప్రాసాదంలో 980 భవంతులు, 8,886 గదులు ఉన్నాయి. యునెస్కో దీనిని 1987లోనే ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. ఈ అద్భుత నిర్మాణాన్ని ఏటా సుమారు 15 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. -
బీజింగ్లో కోవిడ్ బీభత్సం
బీజింగ్: కరోనా చైనాను చిదిమేస్తోంది. బీజింగ్లో కోవిడ్ రోగులు వెల్లువలా ఆస్పత్రులకు తరలివస్తున్నారు. నగరంలోని చుయాంగ్లియూ ఆస్పత్రిలో పరిస్థితే అక్కడి ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దర్పణం పడుతోంది. ఆస్పత్రిలోని బెడ్లు అన్నీ కోవిడ్ వృద్ధ రోగులతో నిండిపోయాయి. అయినా రోగులు వస్తుండటంతో బంధువులు వేచి ఉండే గదుల్లో, కారిడార్లలో వైద్యం చేస్తున్నారు. ఉన్న అన్ని వీల్చైర్లలో రోగులు కూర్చొనే ఆక్సిజన్ వెంటెలేషన్తో శ్వాసిస్తున్నారు. మరింత అత్యవసర వైద్యసేవలు అవసరమైన రోగులకు చికిత్సచేయడంలో వైద్యులు, నర్సులు మునిగిపోయారు. జీరో కోవిడ్ పాలసీతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు శతథా ప్రయత్నించి చైనా చేతులెత్తేయడంతో దేశంలో వైద్యారోగ్య పరిస్థితి దయనీయంగా తయారైంది. అత్యవసరమైతే తప్ప సొంతూర్లకు రావొద్దని అక్కడి హునాన్ప్రావిన్స్లోని షావోయాంగ్ కౌంటీ, అన్హుయీ ప్రావిన్స్లోని షాయూగ్జియాన్ కౌంటీలతోపాటు గన్సు ప్రావిన్స్లోని క్వింగ్యాంగ్ తదితర నగర పాలనాయంత్రాంగాలు ప్రజలను హెచ్చరించాయి. చైనాలో వైద్య అత్యయక స్థితిపై వాస్తవిక సమాచారం అందితే ఇతర దేశాలు సరైన విధంగా సమాయత్తం అయ్యేందుకు వీలుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధ్యక్షుడు టెడ్రోస్ బుధవారం హితవుపలికారు. -
పసలేని చైనా టీకా.. ఏమాత్రమూ లొంగని కరోనా.. తమకొద్దంటున్న దేశాలు
కరోనా మహమ్మారి మరోసారి చైనాను కబళిస్తోంది. ప్రజాగ్రహానికి లొంగి కఠిన ఆంక్షలు సడలించి నెలైనా కాకముందే దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. 20 రోజుల్లోనే ఏకంగా 40 కోట్ల మంది కరోనా బారిన పడ్డట్టు అంచనా! వచ్చే ఏడాది కరోనా వల్ల చైనాలో కనీసం 20 లక్షల మరణాలు ఖాయమన్నది అంతర్జాతీయ వైద్య నిపుణుల అంచనా. ఆంక్షల సడలింపే ఇంతటి కల్లోలానికి దారి తీసిందని ప్రచారం జరుగుతున్నా చైనా కరోనా వ్యాక్సిన్లో పన లేకపోవడమే అసలు కారణంగా కనిస్తోంది. ఎందుకంటే దాదాపు 100 కోట్ల మందికి పైగా చైనీయులు ఇప్పటికే కరోనా టీకాలు వేయించుకున్నారు. అయినా కరోనా ఉధృతి తగ్గడం లేదు. సరికదా, రోజుకు కనీసం 10 లక్షల మందికి పైగా దాని బారిన పడుతూనే ఉన్నారు. టీకాలో రాజకీయం! కరోనా వ్యాప్తి మొదలవగానే దేశాలన్నీ వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యాయి. చైనాయే తొలి వ్యాక్సిన్ను రూపొందించింది. ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీ రూపొందించిన సినోఫార్మ్ వ్యాక్సిన్కు, ప్రైవేట్గా అభివృద్ధి చేసిన కరోనావాక్కు తొలుత ఆమోదం లభించింది. ఈ రెంటింటిని తమ పౌరులకు వేయడమే గాక పలు దేశాలకు చైనా సరఫరా చేసింది కూడా! వీటి కొనుగోలు నిమిత్తం ఆఫ్రికా దేశాలకు 200 కోట్ల డాలర్లు, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకు 100 కోట్ల డాలర్ల రుణం కూడా ఇచ్చింది. ఆసియాలోనూ 30 దేశాలకు చైనా టీకాలందాయి. సత్తా శూన్యం? చైనా కరోనా టీకాలు తీసుకున్న వాళ్లు పదేపదే కరోనా బారిన పడుతుండటంతో వాటి సామర్థ్యంపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. భారత టీకాలు అన్ని డోసులూ వేసుకున్న వారిలో అవి 99.3 శాతం సమర్థంగా పని చేయగా చైనా టీకాల సామర్థ్యం 79 శాతమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అది వాస్తవానికి 60 శాతం లోపేనని హాంకాంగ్ వర్సిటీ అధ్యయనం తేలి్చంది. జర్మనీ వ్యాక్సిన్ పైజర్–బయోఎన్టెక్తో పోలిస్తే చైనా టీకాలు వాడిన వారిలో మరణించే ఆస్కారం మూడు రెట్లు ఎక్కువని ఆసియాలైట్ పత్రిక పేర్కొంది! కరోనావాక్ వాడిన 40 రోజుల్లోనే వ్యాధి నిరోధక యాంటీ బాడీలు సగానికి సగం పడిపోయాయని థాయ్లాండ్ పరిశోధనల్లో తేలింది. చైనాలో ప్రస్తుతం విలయం తొలి దశ వ్యాప్తి మాత్రమేనని అంటువ్యాధుల నిపుణుడు వుజున్యాంగ్ను ఉటంకిస్తూ బీబీసీ పేర్కొంది. ‘‘జనవరి చివరి నాటికి చైనా న్యూ ఇయర్ వేడుకలు తదితరాల పూర్తయ్యాక రెండో వేవ్ వస్తుంది. సెలవులు ముగిసి కోట్లాది మంది చైనీయులు సొంతూళ్లకు మళ్లే క్రమంలో ఫిబ్రవరి చివరి నుంచి మూడో వేవ్ మొదలవుతుంది’’ అంటూ హెచ్చరించింది! మాకొద్దంటున్న దేశాలు చైనా టీకాలపై ఆధారపడ్డ దేశాల్లో ఇండొనేసియా, బ్రెజిల్, పాకిస్తాన్, టర్కీ, ఇరాన్, ఫిలిప్పీన్స్, మొరాకో, థాయ్లాండ్, అర్జెంటీనా, వెనెజువెలా, కాంబోడియా, శ్రీలంక, చిలీ, మెక్సికో, బంగ్లాదేశ్ తదితరాలున్నాయి. వాటిలో పస లేదని తేలడంతో అవన్నీ ఇతర టీకాల కోసం పరుగులు పెడుతున్నాయి. కరోనావాక్ తీసుకున్న తమ పౌరులకు ఆ్రస్టాజెనెకా వేయాలని థాయ్లాండ్ గత వారమే నిర్ణయించింది. ఇండొనేసియా కూడా కరోనావాక్ తీసుకున్న తమ వైద్య సిబ్బందికి బూస్టర్ డోస్గా మోడెర్నా వేస్తోంది. ఇంకా వాడని 40 లక్షల కరోనావాక్ డోసులను పక్కన పెట్టేస్తున్నట్టు నేపాల్ ప్రకటించింది. బ్రెజిల్, బహరైన్, యూఏఈ, ఈజిప్ట్ గతేడాదే చైనా టీకాలపై అనుమానాలు వెలిబుచ్చాయి. కరోనా రోగుల్లో మరణాలను ఆపడంలో వాటి సామర్థ్యం 45 శాతం లోపేనని తేలినట్టు వెల్లడించాయి. జర్మనీ అయితే చైనాలోని తమ దేశస్థులకు బయోఎన్టెక్ డోసులిస్తోంది! ఇతర దేశాలూ అదే బాటన నడుస్తున్నాయి. చదవండి: చైనాను కుదిపేస్తున్న కరోనా.. రోజుకు ఏకంగా 10 లక్షల కేసులు ఎవరేమన్నారు... చైనా వ్యాక్సిన్ల సామర్థ్యం పాశ్చాత్య దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటమే చైనాలో ప్రస్తుత విలయానికి కారణం. – అమెరికా అధ్యక్షుని ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫాసి భారత్లో సమర్థమైన టీకాల ద్వారా పరిస్థితిని దాదాపుగా అదుపులోకి తెచ్చి కరోనా ఆంక్షలను ఎత్తేశారు. చైనా మాత్రం నాసిరకం టీకాలతో సమస్యను జటిలం చేసుకుంది. – బ్రిటిష్ పత్రిక ఆసియాలైట్ ఇంటర్నేషనల్ ఒమిక్రాన్ వైరస్ రకాలను గుర్తించడంలో చైనా టీకాలు విఫలమయ్యాయి. – ది లాన్సెట్ జర్నల్ -
భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. చేతులెత్తేసిన చైనా ప్రభుత్వం..!
బీజింగ్: కరోనా విషయంలో చైనా ప్రభుత్వం చేతులెత్తేసింది. రోజుకు ఎన్ని కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయో ట్రాక్ చేయడం అసాధ్యమని ఆ దేశ ఆరోగ్య శాఖ తేల్చిచెప్పింది. దీంతో గత నెలలో అత్యధిక కేసులు నమోదైన చైనాలో ఇప్పుడు ఎంతమంది వైరస్ బారినపడుతున్నారో తెలుసుకోవడం కష్టతరంగా మారింది. కరోనా కఠిన ఆంక్షలపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో జీరో కోవిడ్ పాలసీని చైనా ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది. క్వారంటైన్, కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టుల విషయంలో నిబంధనలను సడలించింది. ఫలితంగా కరోనా కేసులను ట్రాక్ చేయడం అసాధ్యమైంది. సడలించిన నిబంధనలతో వైరస్ సోకి లక్షణాలు లేనివారు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. వీరంతా న్యూక్లిక్ యాసిడ్ టెస్టు కూడా చేయించుకోవడం లేదు. కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వాటి సంఖ్యను కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో కరోనా కేసులను ఇక ట్రాక్ చేయలేమని చైనా ఆరోగ్య కమిషన్ బుధవారం ప్రకటించింది. చైనాలో కరోనా వ్యాప్తి మొదలై మూడు సంవత్సరాలు కావస్తున్నా.. వైరస్ను పూర్తిగా కట్టడి చేయడంలో ఆ దేశం విఫలమవుతోంది. టీకాలు పంపిణీ చేసినప్పటికీ అవి అంతంత మాత్రమే ప్రభావం చూపుతున్నాయి. పైగా ఇంకా కొన్ని లక్షల మందికి టీకాలు వేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితిలో కొత్త కేసులు విపరీతంగా పెరగడం డ్రాగన్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. చదవండి: 165 ఏళ్లనాటి జీన్స్.. జస్ట్ రూ.94 లక్షలే -
చైనాలో ఉక్కుపాదం!
బీజింగ్: చైనాలో జీరో కొవిడ్ పాలసీపై దేశవ్యాప్తంగా తీవ్ర రూపు దాల్చిన ఆందోళనలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న తీరుతో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉలిక్కిపడింది. వాటిని తక్షణం కట్టడి చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగింది. నిరసనలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనకారులను పోలీసులు భారీ సంఖ్యలో అరెస్టు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని తక్షణం డిలీట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. లేదంటే నిర్బంధం తప్పదంటూ బెదిరిస్తున్నారు. ఆదివారం షాంఘైలో నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్టు ఎడ్ లారెన్స్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సందర్భంగా ఆయన్ను విచక్షణారహితంగా కొట్టడంతో పాటు తన్నారని బీబీసీ ఆరోపించింది. కొద్ది గంటల నిర్బంధం అనంతరం వదిలేశారు. ఆయన్ను పోలీసులు హింసించడం అవాస్తవమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లీ జియాన్ అన్నారు. తమ జీరో కోవిడ్ విధానం సరైందంటూ సమర్థించుకున్నారు. మీడియా చెబుతున్న స్థాయిలో నిరనసలు జరగడం లేదంటూనే, ‘‘జనాల్లో కాస్తంత వ్యతిరేకత ఉండొచ్చు. అందుకే క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్టుగా జీరో కొవిడ్ విధానంలో మార్పులు తెస్తున్నాం’’ అని అంగీకరించారు. మరోవైపు కరోనా ఆంక్షలపై దేశమంతటా జనాగ్రహం కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్, దేశంలో అతి పెద్ద నగరం షాంఘైతో పాటు పలు నగరాల్లో ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ వీధుల్లోకి వచ్చి ఆంక్షలపై గళమెత్తుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై అణచివేత చర్యలకు దిగొద్దని చైనాకు ఐక్యరాజ్యసమితి హితవు పలికింది. వారి హక్కులను గౌరవించాలని సూచించింది. మళ్లీ 40 వేల కేసులు మరోవైపు సోమవారం చైనాలో 39,452 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. బీజింగ్లో వరుసగా ఐదో రోజూ 4,000 కేసులొచ్చాయి. లాక్డౌన్లు, సరకు రవాణా ఆంక్షల కారణంగా ప్రస్తుతం 41.2 కోట్ల మంది ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నట్లు బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనావేసింది. వైట్ పేపర్ రివల్యూషన్ దేశంలో తమకు ఏ మాత్రమూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవని చెప్పేందుకు చైనా యువత, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు ప్రతీకాత్మకంగా తెల్ల కాగితాలను ప్రదర్శిస్తున్నారు. ‘వైట్ పేపర్ రివల్యూషన్’ పేరుతో ఇది దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది. అలెక్స్ డిమినార్ను ఓడించి 122 ఏళ్ల డేవిస్కప్ చరిత్రలో కెనడాకు తొలిసారి టైటిల్ అందించాడు. 2019లో కెనడా ఫైనల్కు చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. -
ఆరు నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం
బీజింగ్: చైనాలో దాదాపు ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం సంభవించింది. ఆ దేశ ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించింది. వైరస్ను కట్టడి చేసేందుకు 'జీరో కోవిడ్ పాలసీ' పేరిట కఠిన ఆంక్షలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది డ్రాగన్ దేశం. ఇప్పుడు మరణించిన వ్యక్తి బీజింగ్కు చెందిన వృద్ధుడు అని అధికారులు తెలిపారు. వయసు 87 ఏళ్లు అని పేర్కొన్నారు. ఈయన మృతితో చైనాలో కోవిడ్ మరణాల సంఖ్య 5,227కు చేరింది. చివరిసారిగా మే 26న షాంగైలో కరోనా మరణం నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే మరో వ్యక్తి వైరస్ కారణంగా చనిపోయాడు. చైనాలో దాదాపు 92 శాతం మంది కనీసం ఒక్కడోసు కరోనా టీకా తీసుకున్నారు. అయితే వృద్ధులకు టీకాలు సరిగా పంపిణీ చేయలేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరణించిన వ్యక్తి కూడా టీకా తీసుకున్నాడా? లేదా? అనే విషయంపై ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వలేదు. కరోనా కట్టడికి ప్రపంచంలో ఏ దేశమూ అమలు చేయని విధంగా జీరో కోవిడ్ పాలసీని అమలు చేస్తోంది చైనా. కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్డౌన్ సహా కఠిన ఆంక్షలు విధిస్తోంది. వ్యాపారం, ఆర్థికవ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతున్నప్పటికీ ఆంక్షల విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. చైనాలో ఇప్పటివరకు 2,86,197 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో 2,60,141 మంది కోలుకున్నారు. చదవండి: ఉక్రెయిన్కి సాయం అందిస్తాం: రిషి సునాక్ -
చైనా కొత్త పొలిట్బ్యూరోలో మహిళలే లేరు
బీజింగ్: ముచ్చటగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదల చేసిన కొత్త పొలిట్ బ్యూరోలో ఒక్క మహిళా సభ్యురాలు కూడా లేదు. 25 ఏళ్లలో చైనా కమ్యునిస్ట్ పార్టీలో ఇలా జరగడం తొలిసారి. మునుపటి పొలిట్బ్యూరోలో కూర్చున్న ఏకైక మహిళ సన్ చున్లాన్ పదవీ విరమణ చేశారు. తదనంతరం ఇంతవరకు ఏ ఇతర మహిళలను నియమించ లేదు. జిన్పింగ్ ఏడుగురు సభ్యుల పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీని నలుగురు మిత్ర దేశాలతో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇద్దరు మాజీ కార్యదర్శులు ఉన్నారు. అలాగే వచ్చే ఏడాది పదవి విరమణ చేయనున్న లీ కియాంగ్ కొత్త ప్రీమియర్గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ మేరకు సింగపూర్ నేషనల్ యూనవర్సిటీలో చైనీస్ రాజకీయ నిపుణుడు ఆల్పెడ్ ములువాన్ మాట్లాడుతూ...చైనా ప్రజలే ఆయనను మూడోవసారి పాలించాలని కోరుకున్నారని చెప్పారు. అంతేగాదు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ దశాబ్దానికి రెండు సార్లు పగ్గాలు చేపట్టిన పాలనను ముగించిన కొద్దిసేపటికే నాయకత్వ పునర్వ్యవస్థీకరణ జరగడం విశేషం. (చదవండి: ‘ప్రపంచానికి చైనా అవసరం’.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్పింగ్ వ్యాఖ్యలు) -
బీజింగ్లో జిన్పింగ్ వ్యతిరేక బ్యానర్లు
బీజింగ్: చైనాలో మునుపెన్నడూ కనిపించని దృశ్యాలు.. సోషల్ మీడియా సాక్షిగా వైరల్ అవుతున్నాయి. కరోనా కఠిన ఆంక్షలతో జనాలు తీవ్ర అసంతృప్తి.. అసహనంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడు జీ జిన్పింగ్పై వ్యతిరేకత తారాస్థాయికి చేరుతోంది. తాజాగా ఏకంగా రాజధాని బీజింగ్ మహానగరంలో జిన్పింగ్ వ్యతిరేక బ్యానర్లు వెలిశాయి. అయితే.. అప్రమత్తమైన అధికారులు తొలగించినప్పటికీ అప్పటికే వాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. జిన్పింగ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, కొవిడ్-19 కఠిన ఆంక్షల్ని తొలగించాలని ఆ బ్యానర్లను ఓ ఫ్లై ఓవర్పై, మరికొన్ని కూడళ్లలో ఉంచారు. పైగా ఫ్లై ఓవర్పై వేలాడదీసిన బ్యానర్లకు కాస్త దూరంలో ఆకర్షణ కోసం మంటలు రాజేశారు. ‘‘కరోనా పరీక్షలు మాకొద్దు. మా ఆకలి తీరితే చాలు. లాక్డౌన్లు అక్కర్లేదు.. స్వేచ్ఛ కావాలి.. అందుకు జిన్పింగ్కు ఉద్వాసన పలకాలి’’ అంటూ బ్యానర్లను కట్టారు. జిన్పింగ్ వ్యతిరేక బ్యానర్లు తొలగిస్తున్న సిబ్బంది బీజింగ్తో పాటు హయిదియాన్లో, మరికొన్ని చోట్ల ఆ బ్యానర్లు వెలిశాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులను సైతం ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ పోతున్నారు అధికారులు. వీటిని ఏర్పాటు చేసిన వాళ్లను సాహసవీరులుగా పొగుడుతూ చైనా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ వెబ్లో పోస్టులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని ఏర్పాటు చేసిన వాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు అక్కడి అధికారులు. కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తైన దరిమిలా, జింగ్పిన్ మూడో దఫా అధ్యక్ష పగ్గాలు చేపడతాడనే ఊహాగానాల నడుమ.. ఈ వ్యతిరేక పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీసింది. తాజాగా కొత్త వేరియెంట్ల కేసులతో మరోసారి లాక్డౌన్ విధిస్తోంది చైనా. ఇదీ చదవండి: అప్పుడే అయిపోలేదు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక -
చైనాలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తాపడి 27మంది దుర్మరణం
బీజింగ్: చైనాలో ఆదివారం ఉదయం ఘోరో ప్రమాదం జరిగింది. గిజావ్ రాష్ట్రం సాండు కౌంటీలో హైవేపై బస్సు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన 20 మందిని హుటాహూటిన ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగినట్లు సమాచారం అందిన వంటేనే సహాయక బృందాలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతం ఎత్తైన పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ సంప్రదాయ తెగలవారు జీవిస్తుంటారు. అయితే బస్సులో ఉన్నవారంతా కొవిడ్ బాధితులు అయి ఉంటారని ప్రచారం జరుగుతోంది. గిజావ్ ప్రభుత్వ అధికారులు కూడా వీరందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తుండగానే ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో బస్సులోని ప్రయాణికులంతా కోవిడ్ సూట్లు ధరించి ఉన్నట్లు సమాచారం. కానీ వీరు కోవిడ్ బాధితులా? లేకా అనుమానితులా? అనే విషయంపై స్పషత లేదు. గిజావ్ రాష్ట్రంలో గత రెండు రోజుల్లో 900కుపైగా కొత్త కేసులు వెలుగుచేశాయి. సెప్టెంబర్ మొదట్లోనే ఇక్కడ లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. కోవిడ్ బాధితులను, వారిని కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తోంది. చదవండి: కింగ్ చార్లెస్ కారుని ఢీ కొట్టబోయాడు..! వీడియో వైరల్ -
ఆసియాలో టాప్ టెక్నాలజీ హబ్గా హైదరాబాద్
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బీజింగ్ తర్వాత అగ్రస్థాయి టెక్నాలజీ కేంద్రాలుగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నిలిచాయి. నైపుణ్యాలు, రియల్ ఎస్టేట్ మార్కెట్, వ్యాపార అనుకూల వాతావరణం ఇత్యాది 14 అంశాల ఆధారంగా టాప్ టెక్నాలజీ హబ్లను కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ నివేదికను సోమవారం విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సంలో బెంగళూరు 2,30,813 టెక్నాలజీ ఉద్యోగాలను కల్పించింది. ఆ తర్వాత చెన్నైలో 1,12,781, హైదరాబాద్లో 1,03,032 మందికి, ఢిల్లీలో 89,996 మందికి కొత్తగా ఐటీ రంగంలో ఉద్యోగాలు లభించాయి. ఐటీ, టెక్నాలజీ ఆధారిత రంగాలు భారత ఆర్థిక వ్యవస్థను నడిపించే కీలక చోదకాలుగా కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ భారత ఎండీ అన్షుల్ జైన్ పేర్కొన్నారు. ‘‘మార్కెట్ మూలాలు బలంగా ఉన్నాయి. దీంతో ప్రపంచ ఐటీ సంస్థలకు భారత్ అనుకూల కేంద్రంగా అవతరించింది. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలకు సైతం కేంద్రంగా ఉంది’’అని జైన్ వివరించారు. కార్యాలయ స్థలాల లీజులో (ఆఫీస్ స్పేస్) బెంగళూరు సగటున 38–40 శాతం వాటాను కలిగి ఉందని.. అలాగే, బెంగళూరులో వార్షిక ఆఫీసు లీజు పరిమాణంలో టెక్నాలజీ రంగాలకు సంబంధించి 38–40 శాతంగా ఉందని ఈ నివేదిక తెలిపింది. -
తైవాన్ ద్వీపాన్ని దిగ్బంధించిన చైనా సైన్యం
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యాటనతో మండిపడుతోంది చైనా. తైవాన్పై ఇప్పటికే ప్రతీకార చర్యలు చేపట్టింది. తైపీ దిగుమతులపై ఆంక్షలు విధించిన డ్రాగన్.. ఆ దేశానికి అతి సమీపంలో మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది. గత మంగళవారం నుంచి ఈ సైనిక ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా గురువారం మరింత దూకుడు పెంచింది. ఆరు వైపుల నుంచి తైవాన్ను చుట్టుముట్టాయి చైనా బలగాలు. తైపీ సమీపంలోని సముద్ర జలాల్లోకి బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి. మిసైల్స్కు సంబంధించిన దృశ్యాలు చైనా అధికారిక మీడియా సీసీటీవీలో ప్రసారమయ్యాయి. మిలిటరీ ప్రదర్శనలో భాగంగా తైవాన్ సమీపంలోని జలాల్లోకి మిసైల్స్ ప్రయోగించినట్లు పేర్కొంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. లాంగ్ రేంజ్ ఆయుధాలను ప్రయోగించినట్లు బీజీంగ్ మిలిటరీ సైతం ప్రకటించింది. చరిత్రలో ఇదే అతిపెద్ద మిలిటరీ డ్రిల్గా పేర్కొంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాంబుల మోతలు, ఆకాశంలో ఆయుధాల పొగ కనిపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదీ చదవండి: చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ కన్నెర్ర -
Asian Games: ఆసియా క్రీడల రీషెడ్యూల్.. తేదీలు ఖరారు!
Asian Games- కువైట్ / బీజింగ్: వాయిదా పడిన ఆసియా క్రీడల్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించేలా రీషెడ్యూల్ చేశారు. నిజానికి చైనా ఆతిథ్యమిచ్చే ఈ ఆసియా మెగా ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు జరగాల్సింది. కానీ ఆ దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదల, వైరస్లో కొత్త స్పైక్ కలకలంతో ఆసియా గేమ్స్ను వాయిదా వేస్తున్నట్లు మే 6న ప్రకటించారు. గత రెండు నెలలుగా పలు దఫా చర్చల అనంతరం తాజాగా రీషెడ్యూలును వెల్లడించారు. ‘ఆసియా క్రీడలు తిరిగి నిర్వహించేందుకు టాస్క్ఫోర్స్ రెండు నెలలుగా కృషిచేస్తోంది. చైనీస్ ఒలింపిక్ కమిటీ, హాంగ్జౌ ఆసియా గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ చర్చలు జరిపింది. మరో మేజర్ ఈవెంట్ నిర్వహణకు ఏ ఇబ్బంది లేకుండా తేదీల్ని ఖరారు చేయాలని నిర్ణయించింది’ అని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: Babar Azam: కోహ్లిని తలపిస్తున్న పాక్ కెప్టెన్.. ఖాతాలో మరో మైలురాయి -
ఒకరికి కరోనా పాజిటివ్.. లాక్డౌన్లోకి 3 లక్షల మంది!
బీజింగ్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మొదటి నుంచే కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. కోవిడ్ ప్రభావిత నగరాలపై లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తాజాగా.. ఓ చిన్న నగరంలో మంగళవారం ఒకరికి కోవిడ్ పాజిటివ్గా తేలటం వల్ల ఆ నగరం మొత్తం లాక్డౌన్ విధించింది జిన్పింగ్ ప్రభుత్వం. దీంతో 3 లక్షల మందికిపైగా లాక్డౌన్లోకి వెళ్లాల్సి వచ్చింది. హెనాన్ ప్రావిన్స్లోని వుగాంగ్ నగరంలో సోమవారం ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వ్యాధిని అరికట్టేందుకంటూ మూడు రోజుల లాక్డౌన్ విధించారు అధికారులు. నగరంలోని 3,20,000 మంది ఇళ్లకే పరిమితమయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలోని ఏ ఒక్కరు ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు అధికారులు. అయితే.. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను స్థానిక ప్రభుత్వ సంస్థలు అందిస్తాయని తెలిపారు. మరోవైపు.. అత్యవసర పరిస్థితిలో కారులో వెళ్లేందుకు స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆంక్షల చట్రంలో 25 కోట్ల మంది చైనాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రకాల ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 25 కోట్ల మంది ఏదో ఒక రకమైన ఆంక్షల చట్రంలో ఉన్నట్లు జపనీస్ బ్యాంక్ నోమురా వెల్లడించింది. గత వారంతో పోలిస్తే ఆ సంఖ్య రెండింతలైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా మంగళవారం 347 స్థానిక కేసులు నమోదయ్యాయి. అందులో 80 శాతానికిపైగా మందిలో ఎలాంటి లక్షణాలు లేవని జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఇదీ చూడండి: ప్రమాదకరంగా బీఏ5 వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్నా సోకుతోంది -
'ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. ప్రోత్సాహకాలు అందుకోండి'
బీజింగ్: జన సంఖ్య పరంగా ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉన్న చైనా.. ప్రస్తుతం జనాభా సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కొన్నేళ్లుగా చేపట్టిన కట్టడి చర్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా మంది యువత పెళ్లి, సంతానానికి దూరంగా ఉండిపోవటమే అందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ అంశం దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళన చెందుతోంది డ్రాగన్ దేశం. జనాభా వృద్ధి, శ్రామిక శక్తిని పెంచేందుకు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ.. భారీ ప్రోత్సాహకాలు ఇస్తోంది. అందులో పన్నుల రాయితీ, ఇంటి రుణాలు, విద్యా ప్రయోజనాలతో పాటు నగదు రూపంలోనూ ప్రోత్సాహకాలు ఉన్నాయి. చైనాలోని జనాభాపై 2022, జనవరిలో గ్లోబల్ టైమ్స్ విడుదల చేసిన ఓ నివేదిక విస్తుపోయే విషయాలను వెల్లడించింది. 2021 చివరి నాటికి చైనాలో 1.413 బిలియన్ల జనాభా ఉండగా.. జననాల సంఖ్య 10.62 మిలియన్లకు పడిపోయింది. అది మరణాల సంఖ్యకు సమానంగా ఉండటం గమనార్హం. ఈశాన్య నగరమైన వూహూలో జననాల రేటు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు పేర్కొంది. ఇలాగే జననాల రేటు పడిపోతే.. యువకుల సంఖ్య తగ్గిపోయి కొన్నేళ్లలోనే శ్రామిక శక్తి సైతం వేగంగా పడిపోనుంది. జనాభా సంక్షోభానికి కారణమిదే.. పెరుగుతున్న జనాభాను కట్టడి చేసేందుకంటూ.. గతంలో ఒకే బిడ్డ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది చైనా కమ్యూనిస్ట్ పార్టీ. దశాబ్దాలుగా బలవంతంగా అబార్షన్లు చేయించి మహిళల హక్కులను కాలరాసింది. దాంతో పిల్లల్ని కనేందుకు చాలా మంది వెనకడుగు వేయాల్సి వచ్చింది. కొన్నేళ్లలోనే అది జనాభా సంక్షోభానికి దారి తీసింది. ఈ సమస్యను గుర్తించిన చైనా.. ప్రస్తుతం ఇద్దరు, లేదా ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతిస్తోంది. అంతే కాదు మహిళలకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు మహిళలకు.. పన్ను రాయితీలు, ఇంటి రుణాలు, విద్యా ప్రయోజనాలు, నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే, ఈ ప్రోత్సాహకాలు వివాహం జరిగిన దంపతులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఒకే బిడ్డ ఉన్న తల్లిదండ్రులు ప్రస్తుతం సామాజిక ప్రయోజనాలైన ఆరోగ్య బీమా, విద్య వంటివి పొందలేకపోతున్నారని తెలిపింది. మరోవైపు.. ఇప్పటికీ మైనారిటీలు, ఒంటరి మహిళలపై చైనా వివక్ష చూపుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నాయి. కొత్త పాలసీపైనా వ్యతిరేకత.. ఆ దేశంలో మహిళలు విద్య, ఆర్థిక పరంగా అభివృద్ధి సాధిస్తున్నా.. వివాహం విషయంలో పురుషులతో పోలిస్తే వెనకబడే ఉన్నారు. గత ఏడాది కొత్త జనాభా, కుటుంబ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది బీజింగ్. దంపతులు ముగ్గురు పిల్లలను కలిగి ఉండేందుకు అనుమతించింది. అయితే.. ఆర్థిక భారం వల్ల ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటం పట్ల అక్కడి ప్రజలు విముఖత ప్రదర్శిస్తున్నారు. -
హమ్మయ్యా! అని రిలాక్స్ అవుతున్న చైనా!
Zero Covid Cases: చైనాలో కరోనా మహమ్మారి ఫోర్త్వేవ్ విరుచుకుపడింది. గత కొన్ని నెలలుగా అనుహ్యంగా పెరుగుతున్న కేసులు చూసి తలలు పట్టుకున్నారు చైనా అధికారులు. అందులోనూ కరోనా పుట్టినిల్లు అయిన చైనా ఆది నుంచి జీరో కోవిడ్ విధానం అంటూ ప్రగల్పాలు పలికి నిలబెట్టుకోనేందుకు నానాతంటాలు పడింది. కఠినమైన ఆంక్షలతో ప్రజలను నిర్బంధించి తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత తోపాటు ప్రపంచ దేశాల విమర్శలను ఎదుర్కొంది. ఏదీ ఏమైనా జీరో కోవిడ్ పాలసీని వదిలేదే లేదంటూ... ఆంక్షలు విధించి తన పంతం నెగ్గించుకుంది. ఒక్కపక్క దేశ ఆర్థికస్థితి ప్రమాదకరంలో ఉన్నా సరే అధికంగా డబ్బు ఖర్చుపెట్టి మరీ సామూహిక కరోనా పరీక్షలు నిర్వహించింది. గత ఏప్రిల్ నుంచి కేసులు తగ్గినట్లు తగ్గి అనుహ్యంగా కొన్ని నగరాల్లో వేగంగా పుంజుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. షాంఘై, బీజింగ్ వంటి పారిశ్రామిక నగరాల్లోనే కేసులు పెరగడంతో ఒకనోక దశలో ఏవిధంగా నియత్రించాలో తెలియక చేతులెత్తేసే స్థితికి చేరుకుంది. ప్రజలు కూడా వరుస లాక్డౌన్లతో విసిగిపోయి తీవ్ర అసహనస్థితికి లోనయ్యారు. అయినా చైనా వీటన్నింటిని లెక్క చేయకుండా ప్రజా ఆరోగ్య ప్రయోజాల కోసం జోరో కోవిడ్ పాలసీనే అవలంభిస్తానంటూ పట్టుపట్టి మరీ మరిన్ని ఆంక్షలను విధించింది. ఎట్టకేలకు విజయాన్ని సాధించింది చైనా. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు జీరో అని నివేదికలు పేర్కొన్నాయి. దీంతో చైనా ప్రస్తుతం కొన్ని ఆంక్షలను సడలించింది. గానీ బహిరంగ ప్రదేశాల్లో తిరగాలంటే మాత్రం... ఆరోగ్య స్థితిని ట్రాక్ చేసే మొబైల్ యాప్లో గ్రీన్ కోడ్ను చూపించాలి. ప్రతి మూడు రోజులోకోసారి కరోనా పరీక్షలు తప్పనసరి అని, పైగా మూడు సంవత్సరాలకు పైబడిన పిల్లలు సైతం పరీక్షలు చేయించుకోవాల్సిందేనని చైనా నొక్కి చెప్పింది. (చదవండి: జీరో కోవిడ్ వ్యూహం తెచ్చిన తంటా...) -
యుద్ధానికి సై అంటున్న చైనా!... అమెరికాకు వార్నింగ్
Taiwan is China's Taiwan: తైవాన్ స్వయం పాలన, ప్రజాస్వామ్య దేశం. ఐతే చైనా ఈ తైవాన్ని తన భూభాగంగా భావించడమే కాకుండా ఏదో ఒక రోజు స్వాధీనం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది కూడా. ఈ మేరకు సింగపూర్లో జరిగిన మూఖముఖి సమావేశంలోయూఎస్ రక్షణాధికారి లాస్టిన్తో చైనా రక్షణమంత్రి వీ ఫెంఘే చైనాను తైవాన్ నుంచి విడదీస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఎవరైన విడదీయడానికి ధైర్యం చేస్తే ఖర్చుతో నిమిత్తం లేకుండా యుద్ధం ప్రారంభించడానికీ చైనా వెనుకాడదని హెచ్చరించారు. అంతేకాదు తైవాన్ స్వాతంత్ర్యం కావాలని ప్రకటిస్తే బీజింగ్ తప్పక యుద్ధం ప్రారంభించడానికి వెనుకాడదు అని కూడా తేల్చి చెప్పారు. తైవాన్ చైనాకి సంబంధించినదేనని నొక్కి చెప్పారు. చైనాను నియంత్రించడానికి తైవాన్ని ఉపయోగించుకోవాలని చూడొద్దంటూ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఐతే ఆ సమావేశంలో అమెరికా రక్షణాధికారి ఆస్టిన్ తైవాన్ని ఇబ్బంది పెట్టే చర్యలకు చైనా చాలా దూరంగా ఉండాలంటూ ఆ దేశ రక్షణ మంత్రికి గట్టి కౌంటరిచ్చారు. (చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం!) -
చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం..
బీజింగ్: ప్రధాన విభాగాల్లో విదేశీ సాంకేతికతలను పక్కనబెట్టే దిశగా చైనా ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. విదేశీ బ్రాండ్ పర్సనల్ కంప్యూటర్ల వాడకం మానేసి దేశీయ సంస్థలవే కొనాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లలో ఈ ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలవుతాయని బ్లూమ్బర్గ్ వార్తాసంస్థ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ముందుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని సుమారు 5 కోట్ల కంప్యూటర్లను పక్కనపడేయనున్నారు. వీటి స్థానంలో స్థానికంగా డిజైన్ చేసిన సాఫ్ట్వేర్తో కూడిన కంప్యూటర్ల వాడకం మొదలుకానుంది. చిప్స్, సర్వర్లు, ఫోన్లు మొదలుకొని ప్రతిదానిపై అమెరికా వంటి ప్రత్యర్థి దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలనే దశాబ్ద కాలంనాటి నిర్ణయం తాజా ఆదేశాలతో కార్యరూపం దాల్చనుంది. రెండేళ్ల కార్యాచరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలతో మొదలై ప్రొవిన్షియల్ ప్రభుత్వ విభాగాల్లోనూ స్థానిక సంస్థల తయారీ కంప్యూటర్ల వాడకం మొదలుకానుంది. ప్రస్తుతం చైనాలో దేశీయ సంస్థ లెనోవో తర్వాత హెచ్పీ, డెల్ కంపెనీల పర్సనల్ కంప్యూటర్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. నూతన విధానంతో అమెరికాకు చెందిన హెచ్పీ, డెల్ తదితర సంస్థలపై మరింత ఒత్తిడి పెరగనుంది. అయితే, పీసీ బ్రాండ్లు, సాఫ్ట్వేర్కే తప్ప ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్ల మార్పిడిపై ఎలాంటి ఆదేశాలు లేవని బ్లూమ్బర్గ్ పేర్కొంది. (భయపెట్టేలా రంగు మారిన ఆకాశం.. స్థానికుల్లో టెన్షన్) -
కరోనా వైరస్ ఉధృతి: షాంఘైలో ఒక్క రోజే 51 మంది మృతి
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. బీజింగ్లో ప్రముఖులుండే చయోయంగ్ ప్రాంతంలో కరోనా కేసులు పదుల్లో వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఇక్కడి 35 లక్షల మందికి మూడు విడతల్లో నిర్థారణ పరీక్షలు ప్రారంభించింది. బీజింగ్లో ఆదివారం బయటపడిన 14 కేసుల్లో 11 చయోయంగ్ జిల్లాలోనివేనని అధికారులు తెలిపారు. షాంఘైలో ఒక్క రోజు వ్యవధిలో అత్యధికంగా మరో 51 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో, ఇక్కడ కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 138కి చేరుకుంది. షాంఘైలో కొత్తగా 2,472 కేసులు నిర్థారణయ్యాయి. చైనా ప్రధాన భూభాగంలో ఆదివారం ఒక్క రోజే మరో 20,190 కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. -
'నరకంలా అనిపిస్తుంది.. పెట్టిందే పెట్టి మమ్మల్ని చంపుతున్నారు'
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ క్రీడాకారుల పాలిట శాపంగా మారాయి. జీరో కరోనా కేసులు ఉండాలనే ఉద్దేశంతో ఆ దేశ ప్రభుత్వం క్రీడాకారులపై చూపిస్తున్న పైశాచికం తారాస్థాయికి చేరింది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు పొరపాటున కరోనా సోకిందే ఇక అంతే సంగతులు. ఐసోలేషన్ పేరుతో చైనా అధికారులు క్రీడాకారులకు చుక్కలు చూపిస్తున్నారు. అది ఎంత దారుణంగా ఉందో ఒక క్రీడాకారిణి తన మాటల్లో వర్ణించింది. రష్యాకు చెందిన వలేరియా వాస్నేత్సోవా అనే అథ్లెట్ తమ దయనీయ పరిస్థితిని ట్విటర్ ద్వారా చెప్పుకొచ్చింది. చదవండి: Beijing Winter Olympics 2022: వింటర్ ఒలింపిక్స్పై కరోనా పంజా ''జీరో కరోనా కేసులు ఉండాలనే లక్ష్యంతో బీజింగ్ ఒలింపిక్స్కు వచ్చిన ఆటగాళ్లకు రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పొరపాటున పాజిటివ్ వస్తే ఐసోలేషన్కు వెళ్లాల్సిందే. ఆ బాధితుల్లో నేను ఒకదానిని. కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్లో ఉంచారు. మాములుగా ఐసోలేషన్లో ఉన్న వ్యక్తులకు మంచి ఆహారం అందించడం చూస్తాం. కానీ మాకు మాత్రం మూడు పుటలా(బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్) ఒకే రకమైన ఆహారం.. ఐదు రోజుల పాటు ఇచ్చారు. ఆ ఆహారం తినాలంటేనే విసుగు పుట్టేది. దెబ్బకు నా ఎముకలన్ని బయటకు పొడుచుకొచ్చేలాగా అనిపించేది. ఒక రకంగా నరకంలా కనిపించే ఆ ఐసోలేషన్తో మమ్నల్ని చంపుతున్నారు'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ''బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కు వస్తే.. ఇక్కడి అధికారులు మాకు చుక్కలు చూపిస్తున్నారు. సరైన వసతి కల్పించలేదు.. ఐసోలేషన్ పేరుతో మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. చిన్నవిగా ఉండే ఐసోలేషన్ గదులు.. నాణ్యత లేని ఆహారం.. పీసీఆర్ టెస్టులు చేస్తున్నప్పటికి వాటి ఫలితాలు క్రీడాకారులకు అందించకపోవడం లాంటివి చేసి క్రీడాకారులను జైళ్లో బంధించినట్లుగా చేశారని'' జర్మనీ జట్టు హెడ్ డిర్క్ స్కిమ్మిలెప్ఫెన్నింగ్ పేర్కొన్నారు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు Russian biathlete Valeria Vasnetsova posted a photo of one of the unappetizing meals at Beijing Games on Instagram, showing plain pasta, some potatoes, charred meat, and no vegetables. She claims the same meal was served for “breakfast, lunch and dinner for five days already.” pic.twitter.com/T9rCF7tUbM — Byron Wan (@Byron_Wan) February 6, 2022 -
చైనాతో వివాదం: మా మద్దతు భారత్కే.. స్పష్టం చేసిన అమెరికా
వాషింగ్టన్: గాల్వాన్ ఘర్షణలో పాల్గొన్న సైనికాధికారిని బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్బేరర్గా ఎంపిక చేయడంపై చైనాతో ఏర్పడ్డ వివాదంలో తమ మద్దతు భారత్కేనని అమెరికా పేర్కొంది. పొరుగు దేశాలను బెదిరించే, ఇబ్బంది పెట్టే చైనా చర్యలను గతంలో కూడా తప్పుబట్టామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ప్రైస్ అన్నారు. ఇలాంటి విషయాల్లో భారత్ వంటి మిత్ర దేశాలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని చెప్పారు. భారత్, చైనా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సీనియర్ యూఎస్ సెనేటర్లు మార్కో రూబియో, జిమ్ రిచ్ కూడా చైనా చర్యను దుయ్యబట్టారు. వింటర్ ఒలింపిక్స్కు చైనా రాజకీయ రంగు పూస్తున్న తీరుకు ఇది మరో నిదర్శనమని రూబియో విమర్శించారు. భారత దళాలపై దొంగచాటున దాడికి దిగిన సైనిక బృందంలోని అధికారిని టార్చ్బేరర్గా ఎంపిక చేయడం కచ్చితంగా రెచ్చగొట్టే ప్రయత్నమేనని ట్వీట్ చేశారు. ఈ విషయంలో చైనా తీరు సిగ్గుచేటని రిచ్ ట్వీట్ చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలకూ అమెరికా మద్దతుంటుందన్నారు. 2020 జూన్లో లడఖ్లోని గాల్వాన్ లోయ వద్ద మన దళాలపై చైనా జరిపిన దొంగచాటు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారిని శుక్రవారం నాటి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల టార్చిబేరర్ల బృందంలోకి చైనా ఎంపిక చేయడంపై దుమారం రేగింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించింది. దూరదర్శన్ కూడా ప్రారంభ, ముగింపు వేడుకలను ప్రత్యక్షప్రసారం చేయబోదని ప్రసారభారతి వెల్లడించింది. -
ఒలింపిక్స్ వింటర్ గేమ్స్ కోసం చైనా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్.. స్పీడ్ అదిరిపోలే?
బీజింగ్: ఫిబ్రవరిలో జరగబోయే బీజింగ్ ఒలింపిక్స్ వింటర్ గేమ్స్ కోసం చైనా ప్రత్యేక బుల్లెట్ రైలును ప్రారంభించింది. ఈ బుల్లెట్ రైలు ముఖ్య ప్రత్యేకత ఇందులో డ్రైవర్ లేకపోవడమే. కేవలం ఈ ఒలింపిక్స్ కోసం కొత్త బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. డ్రైవర్ లెస్ ఫ్యూక్సింగ్ బుల్లెట్ రైలు గంటకు 217 మైళ్ల(350 కిమీ) వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి ఉన్న ఎనిమిది క్యారేజీలలో 564 మంది ప్రయాణీకుల వెళ్లగలరు. చైనా రాజధాని బీజింగ్ - జాంగ్జియాకౌ నగరాల మధ్య ప్రయాణీకులను తీసుకెళ్లడానికి దీనిని ప్రారంభించింది. ఇందులో 5జీ సౌకర్యం గల లింక్డ్ బ్రాడ్ కాస్ట్ స్టూడియో ఉంది. దీని ద్వారా పాత్రికేయులు ప్రసారం చేయవచ్చు. బీజింగ్ డౌన్ టౌన్ జిల్లా నుంచి జాంగ్జియాకౌలోని ఒలింపిక్స్ గేమ్స్ జరిగే వేదికలకు ప్రయాణీకులను తరలించడానికి కేవలం 50 నిమిషాలు పడుతుందని ఆ దేశ క్సిన్హువా పత్రిక నివేదించింది. 2018లో ఈ రైల్వే నిర్మాణం ప్రారంభమైంది. కేవలం ఏడాది కాలంలోనే 2019లో ఈ మార్గాన్ని(బీజింగ్-జాంగ్జియాకౌ) పూర్తిచేసింది. The first train custom-made for the Beijing Winter Olympics set off on Thursday on the high-speed railway linking Beijing and Zhangjiakou, the co-host cities of the upcoming 2022 Winter Games. #GLOBALink pic.twitter.com/GYdzzdpwvG — China Xinhua News (@XHNews) January 6, 2022 (చదవండి: అదిరిపోయిన తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. రేంజ్, ధర ఎంతో తెలుసా?) -
30 ఏళ్ల క్రితం కిడ్నాప్.. ఇల్లు, కొలను, కొండలు అవి మాత్రమే తెలుసు.. ఆ ఒక్క ఫొటోతో
బీజింగ్: లీ జింగ్వీకి తన అసలు పేరు ఏమిటో తెలీదు. ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో కూడా తెలీదు. చిన్నప్పుడే కిడ్నాప్ అయిన లీకి తెలిసిందల్లా తాను ఆడుకున్న ఇల్లు, చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలే. వాటినే 30 ఏళ్ల పాటు గీస్తూ ఉండడంతో చివరికి లీ తన కన్నతల్లి దగ్గరకి చేరాడు. చైనాలో జరిగిన ఈ ఉద్వేగ భరితమైన కలయిక పతాక శీర్షికలకెక్కింది. 1989లో లీకి నాలుగేళ్ల వయసున్నప్పుడు పొరుగింట్లోని వ్యక్తి కల్లబొల్లి కబుర్లు చెప్పి తనతో తీసుకువెళ్లి కిడ్నాపర్లకి అప్పగించాడు. కిడ్నాపర్లు నాలుగేళ్ల ఆ బాలుడిని రైల్లో హెనాన్ ప్రావిన్స్కి తీసుకువెళ్లి ఒక కుటుంబానికి అమ్మేశారు. అప్పట్నుంచి లీ తన కన్న తల్లిదండ్రుల కోసం పరితపిస్తూనే ఉన్నాడు. పసిబాలుడు కావడంతో వారి పేర్లు, ఊరి పేరు గుర్తు లేదు. కానీ తన ఇల్లు, దాని పక్కనే ఉన్న కొలను, చుట్టుపక్కల ఉండే కొండలు, అటవీ ప్రాంతం గుర్తుకు ఉండడంతో వాటిని గీస్తూనే ఉండేవాడు. చిన్నతనం నుంచి కొన్ని వందల, వేలసార్లు ఆ ఇంటి పరిసరాలను గీయడంతో అతను ఏదీ మర్చిపోలేదు. పెరిగి పెద్దయ్యాక తన తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. చివరికి గత ఏడాది సోషల్ మీడియాలో తాను 30 ఏళ్లుగా గీస్తున్న చిత్రాన్ని పోస్టు చేయడంతో అది విస్తృతంగా షేర్ అయింది. దీంతో పోలీసులకి ఆ ఊరుని, లీ కుటుంబాన్ని కనిపెట్టడం సులభంగా మారింది. చివరికి ఈ ఏడాది కొత్త సంవత్సరం రోజు తన ఇద్దరు పిల్లల్ని వెంట పెట్టుకొని లీ తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత కన్నతల్లిని చూడగానే భావోద్వేగం పట్టలేక కిందపడిపోయాడు. తన తండ్రి మరణించాడన్న విషయం తెలుసుకొని తెగ బాధపడ్డాడు. తోడబుట్టిన వారిని చూసి పట్టలేని ఆనందంతో కన్నీళ్లు కార్చాడు. వచ్చే నెల లూనార్ మాసం కావడంతో బంధు మిత్రులందరితో కలిసి తన తండ్రి సమాధిని సందర్శిస్తానని లీ చెప్పాడు. ఆ సమాధి దగ్గర నేను గొంతెత్తి చెప్పాలనుకుంటున్న మాట ‘‘సన్ ఈజ్ బ్యాక్’’ అంటూ లీ ఉద్వేగంతో చెప్పాడు. Li Jingwei was abducted from his village when he was 4-years-old and trafficked across China. After over three decades of being apart, he drew the sketch of his home village from memory and finally traced his mother. #China #Reunion #EmotionalVideo #HeartTouchingVideo #NewsMo pic.twitter.com/5wM0KS6vKz — IndiaToday (@IndiaToday) January 3, 2022 -
Winter Olympics 2022: చైనాకు షాకివ్వనున్న మరో రెండు దేశాలు..
UK And Canada Boycotts China Winter Olympics: చైనా రాజధాని బీజింగ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్ను దౌత్యపరంగా బహిష్కరించాలని బ్రిటన్, కెనడా దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బుధవారం ప్రకటించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరగుతుందన్న కారణంగా ఈ దేశాలు శీతాకాల విశ్వక్రీడలను బహిష్కరించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఒలింపిక్స్ను బాయ్కాట్ చేస్తున్నట్లు ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు ఇదివరకే ప్రకటించాయి. అయితే, వరుసగా ఒక్కో దేశం ఒలింపిక్స్ను బహిష్కరించడంపై చైనా అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఒలింపిక్స్ను బహిష్కరించాలని నిర్ణయించుకున్న దేశాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. కాగా, జపాన్, న్యూజిలాండ్ కూడా చైనా ఒలింపిక్స్ను దౌత్యపరంగా బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి కోవిడ్ ఉద్భవించిందన్న కారణంగా ఆయా దేశాలు ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజింగ్ ఒలింపిక్స్ 2022 ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరగనున్నాయి. చదవండి: IND A Tour Of SA: టీమిండియాలో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి పాజిటివ్..! -
చైనా నుంచి తొలి ఫార్ములావన్ డ్రైవర్...
బీజింగ్: ఇన్నాళ్లూ లోటుగా ఉన్న ఫార్ములావన్ (ఎఫ్1) క్రీడలోనూ చైనా దేశం క్రీడాకారుడు తొలిసారి కనిపించనున్నాడు. వచ్చే ఏడాది ఎఫ్1 సీజన్లో చైనాకు చెందిన గ్వాన్యూ జౌ అరంగేట్రం చేయనున్నాడు. ప్రస్తుతం ఫార్ములా-2 విభాగంలో పోటీపడుతున్న 22 ఏళ్ల గ్వాన్యూ జౌతో ఆల్ఫా రొయెయో జట్టు ఒప్పందం చేసుకుంది. గత మూడేళ్లుగా ఆల్ఫా రొమెయోకు డ్రైవర్గా ఉన్న జియోవినాజి కాంట్రాక్ట్ ఈ సీజన్తో ముగుస్తుంది. వచ్చే సీజన్లో అతడి స్థానాన్ని గ్వాన్యూ జౌతో భర్తీ చేస్తారు. చదవండి: Football World Cup 2022: ఫుట్బాల్ ప్రపంచకప్కు ఇంగ్లండ్.. 16వసారి... -
నిప్పుతో చెలగాటలొద్దు! మరోసారి నోరు పారేసుకున్న జిన్పింగ్
బీజింగ్: చైనా అధినేత జిన్ పింగ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు వార్నింగ్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తైవాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతివ్వడమంటే నిప్పుతో చెలగాటమాడినట్లే అని జిన్ పింగ్ నోరు వ్యాఖ్యానించినట్టు చైనా మీడియా అధికారికంగా వెల్లడించింది. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య మంగళవారం వర్చువల్ సమావేశం జరిగింది. దాదాపు మూడున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో రెండు అగ్ర రాజ్యాల మధ్య దెబ్బతిన్న ధ్వైపాక్షిక సంబంధాలతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. చదవండి: అమెరికాకు షాక్ ఇచ్చిన చైనా..ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా అవిర్భావం ఈ సందర్భంగా తైవాన్ విషయం చర్చలోకి రావడంతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తైవాన్ను తమ భూభాగమని వాదిస్తోన్న చైనా.. అమెరికాను జోక్యం చేసుకోవద్దని పరోక్షంగా హెచ్చరించింది. ‘స్వాతంత్ర్యం కోసం తైవాన్ అధికారులు అమెరికాపై అధారపడుతున్నారు. అంతేగాక యూఎస్లోని కొంతమంది తైవాన్ను ఉపయోగించి చైనాను నియంత్రించాలని చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. నిప్పుతో ఆడుకోవడం లాంటిది. నిప్పుతో చెలగాటమాడితే కాలిపోతారు" అని చైనా అధ్యక్షుడు వ్యాఖ్యానించినట్టు కథనాలు వెలువడ్డాయి. రెండు అగ్ర దేశాల మధ్య నెలకొన్న వైరుధ్యాలను తొలగించేందుకు, ధ్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరిచేందుకు ఈ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. వైట్హౌజ్ నుంచి జో బైడెన్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ఉన్న పోటీ ఉద్ధేశపూర్వకంగా అనాలోచితంగా విభేదాలుగా మారకుండా చూసుకోవాలని అన్నారు. దీనికి బదులుగా బీజింగ్ నుంచి జిన్పింగ్ మాట్లాడుతూ.. ‘బైడెన్ నా పాత మిత్రుడే కానీ ప్రత్యర్థులు మరింత సన్నిహితంగా పనిచేయాలి’ అని ఆకాంక్షించారు. చైనా-యూఎస్ మధ్య కమ్యూనికేషన్ను, సహకారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. -
ఒక్క కేసు.. లాక్డౌన్లో 6 మిలియన్ల మంది ప్రజలు
City Heihe in Heilongjiang Province Under Lockdown: కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పలు నగరాల్లో లాక్డౌన్ విధించిన చైనా.. ఇప్పుడు మరో పెద్ద నగరమైన హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని హీహెలో లాక్డౌన్ విధించింది. ఒక్క కేసు కారణంగా.. 6 మిలియన్ల మంది ప్రజలు లాక్డౌన్ అయ్యారు. వీరందరిని ఇంటి వద్దనే ఉండాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. వింటర్ ఒలింపిక్స్ నాటికి బీజింగ్లో జీరో కరోనా కేసులు సాధించాలనే లక్ష్యంతో ఉంది చైనా. 2019లో తొలి కరోనా కేసు వెలువడిన నాటి నుంచి చైనాలో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మహమ్మారి కట్టడి కోసం సరిహద్దులను మూసేసింది.. విదేశాల నుంచి ప్రయాణిలకు అనుమతించలేదు. కఠిన క్వారంటైన్, లాక్డౌన్ నియమాలు పాటిస్తూ.. జీరో కేసులు సాధించింది. (చదవండి: చైనాలో డెల్టా వేరియెంట్ భయం) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుండగా.. చైనాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచలోనే అత్యధిక జనాభా గల చైనాలో ప్రస్తుతం కనీసం పదకొండు ప్రావిన్సులలో కరోనా వ్యాప్తి వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వైరస్ కట్టడి కోసం ఈ వారంలో నాలుగు మిలియన్లకు పైగా జనాభా ఉన్న లాన్జౌ నగరం, ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని ఎజిన్లో లాక్డౌన్ విధించింది డ్రాగన్ ప్రభుత్వం. తాజాగా గురువారం ఒక్క కొత్త కేసు నమోదవడంతో 6 మిలియన్ల జనాభా గల హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని హీహెలో అధికారులు లాక్డౌన్ విధించారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని జనాలను హెచ్చిరించారు. ఈ క్రమంలో బస్సు, టాక్సీ సేవలను నిలిపివేసినట్లు రాష్ట్ర మీడియా తెలిపింది. వాహనాలు నగరం దాటి బయటకు వెళ్లడానికి అనుమతిలేదని పేర్కొంది. (చదవండి: మరో డ్రామాకు తెరతీసిన చైనా.. కొత్తగా సరిహద్దు చట్టం) రష్యాకు ఉత్తరాన సరిహద్దుగా ఉన్న నగరంలోని 1.6 మిలియన్ల మంది నివాసితులను పరీక్షించడంక కోసం కరోనా సోకిన వ్యక్తి సన్నిహిత పరిచయాలను గుర్తించడం ప్రారంభించినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు చైనా ఆరోగ్య శాఖ అధికారులు. ఇక చైనాలో గురువారం 23 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోల్చితే.. కొత్త కేసులు సంఖ్య సగం తగ్గినప్పటికి దేశంలో కఠిన నియమాలు అమలు చేస్తున్నారు. చదవండి: థర్డ్ వేవ్ ముప్పు: 5 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ -
ఆకాశమే విరిగిపడిందా అన్నట్టు ఇసుక తుపాను, క్షణాల్లో..
ప్రకృతి కోపిస్తే.. దాన్ని తట్టుకోడం కష్టం. ఎన్నడూలేని విధంగా చైనాలో ఆకాశానికి చిల్లు పడినట్లు కురిసే వర్షం. ఉధృతంగా ప్రవహించే వరద. అనుకోకుండా విరుచుకుపడే ఇసుక తుఫాన్లు. ఏం జరుగుతుందో.. తెలియని ప్రజల పరిస్థితి. ఏ దేవుడైనా కాపాడకపోతాడా.. అని ఎదురు చూసే జనం. కళ్ల ముందే కన్న వారు, అయిన వారు కొట్టుకుపోవడం. ఇలా ఒకటా.. రెండా.. చెప్పలేనిని కష్టాలు. ఊహకందని విపత్తులు చైనాను వెంటాడుతున్నాయి. బీజింగ్: చైనాలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. ఓ విపత్తు నుంచి మరో విపత్తు వచ్చి పడుతూ అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చైనాలోని వాయువ్య ప్రాంతంలో 100 మీటర్ల పొడవున ఎత్తైన ఇసుక తుపాను డున్హువాంగ్ నగరాన్ని ముచ్చెత్తింది. ఆకాశమే విరిగిపడిందా అన్నట్టు అంతెత్తున ఇసుక తుపాన్ నగరాన్ని కమ్మేసింది. క్షణాల్లో నివాస సముదాయాలు, దుకాణాలు, ఆఫీసులు, రోడ్లు మొత్తం ఇసుక, దుమ్ముతో నిండిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇసుక ప్రభావంతో స్థానికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనేక మంది పౌరులకు, ముఖ్యంగా వృద్ధులకు శ్వాసకోశ సమస్య ఉన్న రోగులకు కష్టకాలంగా దాపురించింది. గోబీ ఎడారి అంచున ఉన్న ఈ నగరం తరచుగా ఇలాంటి విపత్కర పరిస్థితులకు గురవుతూనే ఉంది. Sandstorm today, #Dunhuang #沙尘暴 #敦煌 pic.twitter.com/XDpyhlW0PV — Neil Schmid 史瀚文 (@DNeilSchmid) July 25, 2021 -
చైనాలో మరో వైరస్, ఒకరు మృతి
బీజింగ్: చైనాలోని వూహాన్ ల్యాబ్లోనే కరోనా మహమ్మారి పుట్టిందన్న విమర్శల మధ్య చైనాలో మనుషుల్లో మరో వైరస్ ఉనికి కలకలం రేపుతోంది. మంకీ బీ వైరస్ సోకి తొలిసారిగా బీజింగ్కు చెందిన పశువుల వైద్యుడు (53) కన్నుమూశాడు. ఈ మంకీ బీవైరస్ (బీవీ) సోకిన తొలి మానవ కేసుగా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శనివారం వెల్లడించింది. అయితే అతనితో సన్నిహితంగా మెలిగిన వారు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్టు తెలిపింది. నాన్-హ్యూమన్ ప్రైమేట్లపై పరిశోధన చేస్తున్న సంస్థలో పనిచేసే పశువైద్యుడు మంకీ బీవీ వైరస్ బారినపడ్డాడు. మొదట వికారం వాంతులు లాంటి లక్షణాలతో బాధపడ్డాడు. అనేక ఆసుపత్రులలో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో చివరికి మే 27న మరణించాడు. మార్చి ప్రారంభంలో చనిపోయిన రెండు కోతులను విడదీసిన ఒక నెల తరువాత అతను వైరస్ బాడిన పడ్డారని సీడీసీ వెల్లడించింది. ఏప్రిల్లో అతని సెరెబ్రోస్పానియల్ ద్రవాన్ని సేకరించిన పరిశోధకులు అతన్ని మంకీ బీవీకి పాజిటివ్గా గుర్తించారు, అయితే అతని దగ్గరి పరిచయాలున్నవారి నమూనాల పరీక్షలు నెగిటివ్ వచ్చాయి. 1932 లో గుర్తించిన ఇది మకాకా జాతికి చెందిన మకాక్లలో ఆల్ఫాహెర్పెస్వైరస్ ఎంజూటిక్. డైరెక్ట్ లేదా శారీరక స్రావాల ద్వారా సోకుతుంది. మరణాల రేటు 70 శాతం నుండి 80 శాతం వరకు ఉంది. -
చైనా అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములు
బీజింగ్/జియుక్వాన్: అగ్రరాజ్యాలకు దీటుగా అంతరిక్షంలో పాగా వేయడమే లక్ష్యంగా చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చైనా ముగ్గురు వ్యోమగాములను నిర్మాణంలో ఉన్న తమ స్పేస్ స్టేషన్లోని కోర్ మాడ్యూల్ ‘తియాన్హే’లోకి విజయవంతంగా పంపించింది. గోబీ ఎడారిలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9.22 గంటలకు షెన్జౌ–12 అంతరిక్ష నౌక ముగ్గురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. 6.50 గంటల పాటు నిరాటంకంగా ప్రయాణించి, మధ్యాహ్నం 3.54 గంటలకు కోర్ మాడ్యూల్ను చేరుకుంది. ముగ్గురు వ్యోమగాములు మూడు నెలలపాటు అక్కడే ఉంటారు. స్పేస్స్టేషన్ నిర్మాణంలో పాలుపంచుకుంటారు. భూగోళంపై తమ నిఘా నేత్రంగా భావిస్తున్న సొంత స్పేస్స్టేషన్ను వచ్చే ఏడాదికల్లా సిద్ధం చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. కోర్ మాడ్యూల్ తియాన్హేను ఈ ఏడాది ఏప్రిల్ 29న చైనా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చైనాలో ఆర్బిట్ స్పేస్స్టేషన్ను నిర్మిస్తోంది. -
NATO: చైనాతో ప్రపంచ దేశాలకు ప్రమాదం
బ్రస్సెల్స్/బీజింగ్: డ్రాగన్ దేశం చైనా అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) దేశాల అధినేతలు విమర్శించారు. వ్యాపార, వాణిజ్యం, సైనిక శక్తి, మానవ హక్కుల విషయంలో చైనా వైఖరిని ఖండించారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో తాజాగా నాటో సమావేశంలో 30 దేశాల అధినేతలు పాల్గొన్నారు. ప్రపంచ భద్రతకు చైనా ఒక సవాలుగా పరిణమించిందని ఒక ఉమ్మడి ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. చైనాను ప్రత్యర్థి దేశంగా పరిగణించేందుకు నాటో అధినేతలు ఇష్టపడనప్పటికీ ఆ దేశ నిరంకుశ విధానాలను మాత్రం తప్పుపట్టారు. ‘నాటో’లో యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు సభ్యత్వం ఉంది. అమెరికా అధ్యక్షుడి హోదాలో జో బైడెన్ పాల్గొన్న తొలి నాటో సమావేశం ఇదే. ఇటీవల జీ7 శిఖరాగ్ర సదస్సులో చైనాకు వ్యతిరేకంగా గళమెత్తిన బైడెన్..‘నాటో’ భేటీలోనూ అదే స్వరం వినిపించారు. కాగా, నాటో’ విడుదల చేసిన ప్రకటనను డ్రాగన్ దేశం ఖండించింది. తాము ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటామని గుర్తుచేసింది. ముప్పు ఎదురైతే మాత్రం తమను తాము రక్షించుకుంటామని తేల్చిచెప్పింది. చదవండి: దారుణం: కొడుకులపై తండ్రి కాల్పులు.. ఒకరి మృతి -
సినోవాక్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర అనుమతి
బీజింగ్/జెనీవా: చైనాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ సినోవాక్ తయారుచేసిన సినోవాక్ కరోనా వ్యాక్సిన్ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మంగళవారం అత్యవసర అనుమతులిచ్చింది. చైనా నుంచి ఇప్పటికే సైనోఫార్మ్ వ్యాక్సిన్ డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. సినోవాక్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నందునే అనుమతులు ఇచ్చినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సిన్ల లోటు ఏర్పడిన తరుణంలో మరిన్ని వ్యాక్సిన్లు ఉండటం అత్యవసరమని డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య ఉత్పత్తుల అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మరియాంజెలా సిమానో తెలిపారు. కోవ్యాక్స్ ఫెసిలిటీ ద్వారా ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్లను అందించాల్సిందిగా వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలను ఆమె కోరారు. ప్రపంచంలోని పేద దేశాలకు కోవ్యాక్స్ ద్వారా ఉచిత వ్యాక్సిన్లను అందిస్తోన్న సంగతి తెలిసిందే. మే 7న చైనాకు చెందిన సైనోఫార్మ్ కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: వైరల్: 12 ఏళ్ల నాటి సీసీటీవీ ఫుటేజీ.. కలవరపడుతున్న నెటిజన్లు) -
కొత్త చట్టం.. విడాకులు మరింత ఖరీదు
బీజింగ్ : చైనా కోర్టు వెల్లడించిన ఓ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆన్లైన్ చర్చకు దారి తీసింది. విడాకులు ఇవ్వాలని భావించే వ్యక్తి.. గతంలో తన భార్య చేసిన ఇంటి పనికి కూడా డబ్బులు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. మహిళల పని పట్ల మీకు ఇంత చిన్న చూపా అంటు ఎక్కువ మంది విమర్శలు చేస్తుండగా.. కనీసం ఇప్పటికైనా గుర్తించారు అంటూ కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అమల్లోకి వచ్చిన చైనా కొత్త సివిల్ కోడ్ ప్రకారం, విడాకులు తీసుకునే జంటల్లో.. వారు కలిసి ఉన్న రోజుల్లో భార్యలు ఇంట్లో ఎక్కువ బాధ్యతలు తీసుకుంటే అందుకు గాను వారు పరిహారం కోరవచ్చు. భరణం కాక ఇది అదనం. ఈ ఏడాదే చట్టం అమల్లోకి వచ్చింది. ఆ వివరాలు.. చెన్-వాంగ్ దంపతులకు ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో కోర్టు ఆమెకు భర్త నుంచి భరణం ఇప్పించింది. ఇదిలా ఉండగా ఈ నెల 4 నుంచి కొత్త సివిల్ లా అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో వాంగ్ కొత్త చట్టం ప్రకారం తామిద్దరు కలిసి ఉన్న ఐదేళ్లలో ఇంటి పనులు చేసినందుకు గాను తనకు ఎక్స్ట్రా డబ్బులు చెల్లించాల్సిందిగా కోరుతూ బీజింగ్ కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా వాంగ్ ‘‘గడిచిన ఐదేళ్లలో ఇంటి పని, పిల్లల బాగోగులు అన్ని నేను చూసుకున్నాను. చెన్ కొంచెం కూడా నాకు హెల్ప్ చేసేవాడు కాదు. ఆఫీస్ బాధ్యతలు మాత్రమే నిర్వహించేవాడు. రోజంతా పిల్లలు, ఇంటి పనితో సరిపోయేది. ఈ మేరకు నాకు మరి కాస్త ఎక్కువ పరిహారం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను’’ అన్నది. వాంగ్ వాదనలు విన్న కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఐదు సంవత్సరాలు పాటు వాంగ్ చేసిన ఇంటి పనికి గాను 7,700 డాలర్లు(5,56,937.15 రూపాయలు) చెల్లించాల్సిందిగా ఆదేశిస్తూ.. తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై చైనీస్ ట్విట్టర్ వీబోలో వాడివేడి చర్చ నడుస్తోంది. ‘‘ఇంట్లోనే ఉండే భార్యలు తాము చేసే పనికి 50 వేల యువాన్ల పరిహారాన్ని పొందవచ్చు’’ అనే హాష్ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ తీర్పు పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మహిళలు ఎవరు ఇంటి పట్టున ఉండకూడదు. ఒకవేళ భవిష్యత్తులో మీరు విడాకులు పొందాలనుకుంటే.. మీకు ఎలాంటి పరిహారం లభించదు. ఇంటి పని చేస్తున్నందుకు గాను మీకు కేవలం 50 వేల పై చిలుకు యువాన్లు మాత్రమే లభిస్తుంది. ఏంటి ఈ ఖర్మ’’ అని కామెంట్ చేస్తుండగా.. ‘‘మరి కొందరు ఫుల్ టైం పిల్లలను చూసుకునే ఓ బామ్మ ఆరు నెలలకు గాను ఇంతకంటే ఎక్కువ ఫీజే తీసుకుంటుది. భార్యలు చేసే పని మీకు ఇంత చీప్గా కనిపిస్తుందా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తీర్పుపై ఓ న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘‘జంట ఎన్ని సంవత్సరాలు వైవాహిక జీవితం గడిపారు.. వాంగ్ ఇంటి పని, చెన్ ఆదాయం, స్థానిక జీవన వ్యయం ఆధారంగా ఈ మొత్తాన్ని నిర్ణయించినట్లు’’ స్థానిక మీడియాలో పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా ప్రకారం, చైనా మహిళలు రోజూ దాదాపు నాలుగు గంటలు వేతనం లేని ఇంటి పనులు చేయడంలో గడుపుతారు. పురుషుల కంటే 2.5 రెట్లు మరియు సగటు కంటే ఎక్కువ. చదవండి: తాగుబోతు భర్తకు ఝలక్ ఇచ్చిన భార్య, దాంతో కన్నీళ్లు తుడిచి.. కష్టాలు కడతేర్చి! -
బంగారు గనిలో పేలుడు: 10 మంది దుర్మరణం
బీజింగ్/ జినాన్: చైనాలోని షాంగ్డాంగ్ ప్రావిన్స్లో ఉన్న బంగారు గనిలో పేలుడు సంభవించిన రెండు వారాలకు ప్రమాదంలో చిక్కుకున్న వారి వద్దకు చేరుకున్నారు. రెండువారాల పాటు గనిలో చిక్కుకున్న వారిలో 10 మంది మృత్యువాత పడగా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. జనవరి 10వ తేదీన బంగారు గనిలో ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదం జరిగిన విషయం మాత్రం 30 గంటల తర్వాత అధికారులకు తెలిసింది. దీంతో బాధితులను కాపాడే ప్రయత్నాలు ఆలస్యమయ్యాయి. విషయం తెలిసిన అనంతరం హుటాహుటిన నిపుణులను తరలించి వారిని వెలికితీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే భూగర్భంలో నీటి తాకిడి భారీగా ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. గని ముఖద్వారంపై వెయ్యి అడుగుల లోతున 70 టన్నుల మట్టి కూరుకుపోవడంతో మరింత కష్టమైంది. వారిని బయటకు తీసేందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. లోపల ఉన్నవారి పరిస్థితిపై ఆందోళన చెందిన అధికారులు వీలైనంత త్వరగా బయటకు తీసుకొద్దామని ప్రయత్నించారు. రెండు వారాల పాటు తీవ్రంగా శ్రమించి ప్రమాదంలో చిక్కుకున్న వారిని 25వ తేదీన బయటకు తీసుకొచ్చారు. అయితే అధికారులు చేరుకునేలోపు 10 మంది మరణించగా, మరో 11 మంది ప్రాణాలతో ఉన్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. మరొక వ్యక్తి ఆచూకీ లభించలేదు. అతడి కోసం అధికారులు వెతుకున్నారు. అయితే గనిలో పేలుడుకు కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. చైనాలో మైనింగ్ పరిశ్రమలో ప్రమాదాలు తరచూ సంభవిస్తుంటాయి. ఏటా దాదాపు 5 వేల మంది మరణిస్తుంటారని ఆ దేశ మీడియా తెలిపింది. -
సరికొత్త రికార్డు నెలకొల్పనున్న చైనా..!
బీజింగ్: కరోనా వైరస్ పుట్టిల్లుగా భావిస్తోన్న చైనా సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఐదు రోజుల్లో ఏకంగా 9 మిలియన్ల కోవిడ్ టెస్టులు చేయనున్నట్లు తెలిపింది. వివరాలు.. పోర్ట్ సిటీగా ప్రసిద్ధి చెందిన కింగ్డావో నగరంలో తాజాగా ఆదివారం 6 కరోనా కేసులు వెలుగు చూశాయి. దాంతో ఆ నగరంలోని సుమారు 9.4 మిలయన్ల పై చిలుకు జనాభాకు కరోనా టెస్టులు జరపనున్నట్లు వైద్య అధికారులు సోమవారం వెల్లడించారు. ఐదు జిల్లాల్లో మూడు రోజులు పరీక్షలు జరపనుండగా.. ఐదు రోజుల్లో మొత్తం నగర జనాభాకు టెస్టులు చేయనున్నట్లు తెలిపారు. చైనా విస్తృతమైన, వేగవంతమైన పరీక్ష సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ క్రమంలో కొత్త కేసులు వెలుగు చూసిన వెంటనే వైద్య సిబ్బంది కింగ్డావో నగరంలో దాదాపు 1,40,000 పరీక్షలు చేశారు. ఇక జూన్లో బీజింగ్లో ఏకంగా 20 మిలియన్ల మందికి పైగా కరోనా టెస్టులు చేశారు. రాజధానికి సమీపంలోని ఓ ఫుడ్ మార్కెట్లో కోవిడ్ కేసులు వెలుగు చూడటంతో ఇంత భారీ మొత్తంలో టెస్టులు చేశారు. (చదవండి: కరోనాని అంతం చేస్తాం) కరోనా వైరస్ చైనాలో ఉద్భవించినప్పటికి ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే.. ఇక్కడ కేసులు, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వైరస్ కట్టడి కోసం చైనా దేశవ్యాప్త లాక్డౌన్ని విధించింది. దాంతో ప్రపంచ రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. ఇక ‘గోల్డెన్ వీక్’ సెలవు దినం సందర్భంగా గత వారం చైనాలో మిలియన్ల మంది ప్రయాణాలు చేశారు. దాంతో దేశంలో వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో చైనా యంత్రాంగం తక్కువ సమయంలో ఎక్కువ టెస్టులు చేయడమే కాక అవసరమైతే మరోసారి లాక్డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ప్రపంచ దేశాల కంటే ముందు తానే కరోనా వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చైన విశ్వప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రయోగాలు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇప్పటికే నిరూపించబడని వ్యాక్సిన్ని ముఖ్య కార్మికులు, సైనికులపై ప్రయోగించింది. -
చైనా కరోనా స్వదేశీ వ్యాక్సిన్ల ప్రదర్శన
బీజింగ్: కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి వివిధ దేశాలు పోటీ పడుతున్న సమయంలో, చైనా తన తొలి వ్యాక్సిన్లను ప్రదర్శనకు పెట్టింది. బీజింగ్ లో నిర్వహిస్తున్న ట్రేడ్ ఫెయిర్లో సోమవారం స్వదేశీ వ్యాక్సిన్లను తొలిసారి ప్రదర్శించింది. దశ-3 ట్రయల్స్లో ప్రవేశించిన ప్రపంచవ్యాప్తంగా దాదాపు10 వ్యాక్సిన్లలో ఇవి కూడా ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి ఇవి మార్కెట్లో రానున్నాయని తయారీదారుల అంచనా. చైనా కంపెనీలైన సినోవాక్ బయోటెక్, సినోఫార్మా ఈ టీకాని అభివృద్ధి చేస్తున్నాయి. టీకా ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని నిర్మించామనీ, ఏడాదికి 300 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని సినోవాక్ ప్రతినిధి వెల్లడించారు. సంస్థకు చెందిన 90 శాతం మంది ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు ఈ వ్యాక్సిన్ను అత్యవసర వినియోగం కింద అందజేసినట్టు సినోవాక్ సీఈఓ వీడాంగ్ మీడియాకు వెల్లడించారు. టీకా తీసుకున్న వారిలో తన భార్య, తల్లిదండ్రులు కూడా ఉన్నారని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దుష్ప్రభావాల రేటు చాలా తక్కువగా ఉందన్నారు. మరోవైపు 1957లో అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా ప్రయోగించిన సోవియట్ ఉపగ్రహం ‘స్పుత్నిక్ వి’ పేరుతో తమ తొలి కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్లు రష్యా గత నెలలో పేర్కొంది. కాగా క్లినికల్ ట్రయల్స్లో వ్యాక్సిన్లు సురక్షితమైనవని, సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు నిరూపితమైనా ప్రపంచంలో ఇప్పటి వరకూ ఏ టీకాకు తుది ఆమోదం లభించని సంగతి తెలిసిందే. -
చైనా సంచలన నిర్ణయం..
బీజింగ్: చైనా ఆరోగ్య శాఖ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి మాస్క్ ధరించడం తప్పనిసరి అంటుండగా.. డ్రాగన్ దేశం మాత్రం ఇక మాస్క్ ధరించాల్సిన అవసరం లేదంటుంది. ఈ మేరకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక మీదట బీజింగ్ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని తెలిపారు. వరుసగా 13 రోజులుగా ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం మాస్క్ ధరించి తిరగడం గమనార్హం. సామాజిక ఒత్తిడి, సురక్షితను దృష్టిలో పెట్టుకుని మాస్క్ ధరిచండానికే ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ మాట్లాడుతూ.. మాస్క్ తీసేయ్యాలని అనుకుంటాను. కానీ ఇతరులు దీన్ని అంగీకరిస్తారో లేదో తెలియదు. నేను మాస్క్ తీసేసి తిరిగితే నా పక్క వారు భయాందోళనలకు గురవుతారు. అందుకే మాస్క్ తీసేయడం లేదు’ అన్నారు. బీజింగ్ మున్సిపల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఏప్రిల్ చివర్లో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా వెళ్ళవచ్చని చెప్పింది. కానీ నగరంలోని అతిపెద్ద మార్కెట్లో కొత్త కేసులు వెలుగు చూడటంతో జూన్లో నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. (ఈ మాస్క్ ధర, యజమాని గురించి తెలిస్తే...) రాజధాని, జిన్జియాంగ్, ఇతర ప్రాంతాలలో కేసులను విజయవంతంగా నియంత్రించిన తరువాత గత ఐదు రోజులుగా ఇక్కడ కొత్తగా కేసులు నమోదు కాలేదు. మాస్క్ ధరించడం, హోం క్వారంటైన్, టెస్టింగ్లో పాల్గొనడం వంటి నియమాలను కఠినంగా అమలు చేయడం వల్లనే ఈ వ్యాధిని నియంత్రించడంలో చైనా విజయవంతం అయ్యిందంటున్నారు నిపుణులు. -
చైనా మూలాలను చెరిపేస్తున్న టిక్టాక్
బీజింగ్: టిక్టాక్ చైనా మూలాలపై అమెరికాలో రోజురోజుకీ ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ టిక్టాక్ సమూలమైన సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన యాజమాన్య బోర్డు, చైనా వెలుపల ప్రత్యేక ప్రధాన కార్యాలయం లాంటి మార్పులను టిక్టాక్ ప్రతినిధులు సన్నద్ధమైనట్లు సమాచారం. టిక్టాక్ ప్రధాన కార్యాలయ వ్యవహారాలను చైనా రాజధాని బీజింగ్ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టిక్టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్కి చైనాలో తప్ప విడిగా ప్రధాన కార్యాలయం లేదు. అంతర్జాతీయ కార్యాలయం కోసం టిక్టాక్ అనేక ప్రదేశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే లాస్ ఏంజెలిస్, న్యూయార్క్, లండన్, డబ్లిన్, సింగపూర్లలో టిక్టాక్ ఐదు అతిపెద్ద కార్యాలయాలు ఉన్నాయి. తమ దేశంలో టిక్టాక్ యాప్ను నిషేధించే యోచనలో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ ఈ యాప్ని నిషేధించిన విషయం తెలిసిందే. చైనా కఠిన ఆంక్షలు విధించడంతో, టిక్టాక్ హాంకాంగ్లో కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. అంతేకాకుండా, అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చైనాకు చెందిన టిక్టాక్ మాజీ చీఫ్ అలెక్స్ జూ, లాస్ఏంజెల్స్ కేంద్రంగా పనిచేసే కొత్త సీఈఓ కెవిన్ మేయర్కి బాధ్యతలను అప్పగించారు. -
ఒక్క ఫోన్కాల్: ప్రకంపనలు సృష్టించింది..
బీజింగ్: మందు లేని మాయరోగం వచ్చిందంటే ఎవరు మాత్రం భయపడిపోరు? పైగా అది భయంకర అంటువ్యాధి అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? కళ్ల ముందు అందరూ కనబడుతున్నా ఏ ఒక్కరూ ధైర్యం చేసి ముందడుగు వేయలేరు. అందరూ ఉన్న అనాథలా వారికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అందులోనూ ప్రాణాంతక కరోనా మహమ్మారి సోకిందంటే కళ్ల ముందు ప్రపంచం కూలిపోతున్నట్లు, కాళ్ల కింద భూమి చీలిపోతునట్లు అనిపించక మానదు ఇదిగో ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి కూడా ఇలాంటి అనుభవాన్ని చవిచూడక తప్పలేదు. చైనాకు చెందిన ఓ యువతి బీజింగ్లోని షిజింగ్షాన్ వాండా ప్లాజాకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అటువైపు నుంచి వచ్చిన సమాధానం విని ఆమె గుండె పగిలేలా రోదించింది. (‘దెయ్యాల పనే అంటారా?!’) కారణం.. ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడమే! ఈ విషయం తెలియగానే ఆ యువతి ఉన్నచోటునే కుప్పకూలి హృదయ విదారకంగా ఏడ్చింది. తన దరిదాపుల్లోకి కూడా ఎవరూ రావద్దంటూ అరుస్తూ, పిచ్చిపట్టినదానిలా గుక్కపెట్టి ఏడ్చింది. దీంతో విషయం అర్థమై అక్కడున్న వాళ్లు ఆమె నుంచి దూరంగా పరుగెత్తారు. కాసేపటి తర్వాత గుండె రాయి చేసుకుని, దుఃఖాన్ని దిగమింగుకుని పీపీఈ కిట్లు ధరించి ఉన్న వైద్యాధికారుల దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది. అనంతరం కాసేపటికే అంబులెన్స్ రావడంతో ఆస్పత్రికి వెళ్లింది. మరోవైపు వాండా ప్లాజాను అధికారులు మూసివేశారు. కాగా బీజింగ్లో జూన్ నెలలోనే 300 కొత్త కేసులు వెలుగు చూశాయి. (బతుకు.. బొమ్మలాట) -
అక్కడ కరోనా 20 ఏళ్లపాటు జీవించి ఉండగలదు!
బీజింగ్: మహమ్మారి కరోనా పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనాలో మరోసారి వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆ దేశ వైద్య నిపుణురాలు లీ ల్యాన్జువాన్ పలు కీలక విషయాలు వెల్లడించారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కరోనా దశాబ్దాల పాటు జీవించి ఉండగలదని పేర్కొన్నారు. మైనస్ 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద కొన్ని నెలల పాటు ఉనికి చాటుకోగల మహమ్మారి.. మైనస్ 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద 20 ఏళ్లకు పైగా బతికి ఉండే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. చైనా కోవిడ్-19 నిపుణుల బృందంలో ఒకరైన లీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. శీతల పరిస్థితులను తట్టుకోగల కరోనాకు ఉన్న అసాధారణ సామర్థ్యాల వల్ల అది దేశాల మధ్య సులభంగా వ్యాప్తి చెందుతోందని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాపించిన తొలినాటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను లోతుగా పరిశీలిస్తే.. అత్యంత శీతల ప్రదేశాల్లో వైరస్ ఎక్కువకాలం మనుగడ సాధించగలదనే విషయం స్పష్టమతోందన్నారు. మాంసాన్ని దీర్ఘకాలం పాటు నిల్వ చేసే సీ ఫుడ్ మార్కెట్లలో వైరస్ ఆనవాళ్లు బయటపడినందున ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. (ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 1,87,000 కొత్త కేసులు) పచ్చి మాంసానికి దూరంగా ఉండండి ఇక నిల్వ చేసిన ఆహార పదార్థాలు, మాంసం మార్కెట్ల నుంచి కరోనా వ్యాపిస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో కొన్నాళ్లపాటు పచ్చి మాంసం, చేపలు తినకుండా ఉంటే మంచిదని చైనా నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి సీ ఫుడ్ కారణంగా కోవిడ్ సోకినందనడానికి ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో చైనా సీడీసీ పరిశోధకులు ఫెంగ్ జావోలూ మాట్లాడుతూ.. ‘‘కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. వేడి వేడి ఆహార పదార్థాలు తినాలి. అదే విధంగా పండ్ల తొక్కలు తీయకుండానే తినేయాలి. తరచుగా ఉపయోగించే టేబుల్వేర్ను డిస్ఇన్ఫెక్ట్ చేయాలిమాంసం వండుకున్నపుడు.. దానిని కట్ చేసుకునే క్రమంలో ఉపయోగించిన చాపింగ్ బోర్డును ముట్టుకోవడానికి ముందు, ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ’’అని సూచించారు. ('కరోనా నివారణకు ప్రత్యేక వ్యాక్సిన్ను కనుగొన్నాం') యూరప్ నుంచి వైరస్.. కరోనా తాజా విజృంభణ నేపథ్యంలో డ్రాగన్ ప్రభుత్వం ఆదివారం కరోనా జెనోమ్ డేటా(జన్యు సమాచారం)ను విడుదల చేసింది. ప్రస్తుతం చైనాలో విస్తరిస్తున్న వైరస్ యూరప్ నుంచి వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆదివారం చైనాలో కొత్తగా 18 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. ఇక రాజధాని బీజింగ్లో కొత్తగా తొమ్మిది మందికి కరోనా సోకినట్లు తెలిపింది. దీంతో ఇతర ప్రాంతాలకు కరోనా విస్తరించకుండా స్థానిక అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక బీజింగ్లోని అతిపెద్ద హోల్సేల్ ఫుడ్ మార్కెట్ షిన్ఫాడిలో మరోసారి కరోనా ఆనవాళ్లు బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. పట్టణవ్యాప్తంగా ఉన్న అన్ని ఫుడ్ మార్కెట్లలోని దుకాణాల యజమానులు, రెస్టారెంట్ మేనేజర్లు, ప్రభుత్వ క్యాంటీన్లలో పనిచేసే వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఫుడ్మార్కెట్లలో పనిచేసే వాళ్లంతా తప్పనిసరిగా ఫేస్మాస్కులు, గ్లోవ్స్ ధరించాలని నిబంధనలు విధించారు.(బ్రెజిల్ బేజార్) -
కుటుంబాలలో కరోనా వ్యాప్తి ఎక్కువ
బీజింగ్/ న్యూఢిల్లీ : కరోనా సోకిన వ్యక్తిలో లక్షణాలు కనిపిస్తున్నా, లేకపోయినా అతడితో కలిసి ఉండే వారికి వైరస్ తొందరగా వ్యాప్తి చెందుతుందని ‘ది లాన్సెట్ ఇన్ఫెక్షస్ డిసీస్ జర్నల్’ పేర్కొంది. కుటుంబాలలో లక్షణాలు లేకుండానే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువని తెలిపింది. ఇంట్లో వారు లక్షణాలు లేకుండానే వ్యాధి బారిన పడిపోతారని, ఆ తర్వాత అనారోగ్యంపాలవుతారని వెల్లడించింది. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడినవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువని తెలిపింది. చైనా, గాంగ్ఝౌ నగరంలోని 13మిలియన్ల జనాభాలోని 349 మంది కరోనా వైరస్ రోగులు, వారితో చనువుగా మెలిగిన 1,964 మందిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. కేవలం కుటుంబసభ్యుల్నే కాకుండా పనివాళ్లను, స్నేహితులను కలిసి ప్రయాణం చేసేవారిపై పరిశోధనలు చేశారు. కుటుంబాలలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సరైన సమయంలో వైరస్ బాధితులను గుర్తించి, వారితో సన్నిహితంగా మెలిగినవారిని కూడా క్వారంటైన్ చేయటం ఒక్కటే మర్గామని వారు పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే ఇంక్యూబేషన్ సమయంలో లక్షణాలు కలిగిన వారిని క్వారంటైన్ చేయటం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దీనిపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హైదరాబాద్.. ప్రొఫెసర్ డా. వీ రమణ ధార మాట్లాడుతూ.. ‘‘ వైరస్ వ్యాప్తి చెందడానికి కుటుంబాలలో ఎక్కువ అవకాశం ఉంటుందని మనకు ముందే తెలుసు. ఎక్కువ మంది కలిసి ఉండే కుటుంబాలలోని వ్యక్తులు తొందరగా వైరస్ బారినపడతారు. ( కరోనా అలెర్ట్.. 6 లక్షల పరీక్షలు ) నోటి తుంపరల ద్వారా గాల్లో చేరే వైరస్ ఇతరులకు తొందరగా వ్యాప్తి చెందుతుంది. ఇంక్యూబేషన్ పీరియడ్లో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ఎల్లవేళలా ధరించాలి. చాలా మంది ఇంటికి రాగానే మాస్కులు తీసేస్తుంటారు. ఎందుకంటే ఇంట్లో ఉంటే రక్షణగా ఉన్నామని అనుకుంటారు. కానీ, భారతదేశంలోని ఇళ్లలో రోగాలు సోకే అవకాశం ఎక్కువ’’ అని అన్నారు. -
'జిన్పింగ్ ఓకే అంటేనే లెక్కను వివరిస్తాం'
బీజింగ్ : లద్దాఖ్లోని గాల్వన్ లోయలో సరిహద్దుకు సంబంధించి భారత్- చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో చైనా సైనికులు ఎంతమంది చనిపోయారన్న విషయంపై ఆ దేశం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. సరిహద్దు ఘర్షణలో భారత్ నుంచి ఒక కల్నల్ అధికారి సహా 20 మంది జవాన్లు ప్రాణత్యాగం చేసినట్లు మంగళవారం ఉదయం భారత ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు తీవ్రంగా గాయపడ్డారని, మృతి చెందిన సైనికుల్లో 40 మంది చైనా సైనికులు ఉన్నారని భారత ఆర్మీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దీనిపై చైనా విదేశాంగా శాఖ స్పందిస్తూ భారత సైనికులతో ఘర్షణ జరిగిన మాట నిజమేనని చెప్పింది కానీ తమ సైనికులు ఎంతమంది చనిపోయారన్నది మాత్రం పేర్కొనలేదు. అయితే ఘర్షణలో ఎంతమంది సైనికులు చనిపోయారనే దానిపై ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ ఓకే అంటేనే అధికారికంగా లెక్కలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్కడి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించిన కథనంలో పేర్కొంది. (చైనా అధ్యక్షుడి సాయం కోరిన ట్రంప్) ఆ రిపోర్టులో.. 'చైనాలో సెంట్రల్ మిలటరీ కమిషన్ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ చేతిలో ఉంటుంది. ఘర్షణలో మృతి చెందిన చైనా సైనికుల జాబితా విడుదల చేయడానికి ముందు జిన్పింగ్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంతేగాక 1962లో చైనా- ఇండియా మధ్య తలెత్తిన యుద్దంలో దాదాపు 2వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు గాల్వన్ లోయలో తలెత్తిన ఘర్షణలో ఎంతమంది చనిపోయారనే విషయం వెల్లడిస్తే మరోసారి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సంఖ్య వెల్లడించలేదని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ప్రకటించింది. అమెరికాతో కీలక సమావేశం ఉన్నందున ఈ విషయాన్ని తక్కువ చేసి చూడాలని చైనా భావించి ఉంటుంది. ఇదిలా ఉంటే గల్వాన్ నది లోయలో జరిగిన ఘర్షణలో రెండు వైపులా ప్రాణనష్టానికి దారితీసిందని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ షుయిలీ మంగళవారం పేర్కొన్నారని, అయితే ఆయన కూడా చైనా ప్రాణనష్టం గురించి వివరించలేదని అని రిపోర్టులో తెలిపింది.(అదే చైనా వ్యూహం: జిజి ద్వివేదీ) మరోవైపు చైనా ప్రభుత్వ అధికార పత్రికగా ఉన్న గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ హు జిజిన్ స్పందిస్తూ..' నాకు తెలిసినంత వరకు ఈ ఘర్షణలో చైనా కూడా నష్టపోయింది. చైనా సంయమనాన్ని భారత్ తప్పుడు దృష్టితో చూడొద్దు. దీనిని అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. చైనా భారత్తో యుద్దం చేసేందుకు సిద్ధంగా లేదు. సామరస్య పద్దతిలో సమస్యను పరిష్కరించుకుందాం' అంటూ ట్వీట్ చేశారు. (స్వస్థలాలకు చేరిన వీర జవాన్ల మృతదేహాలు) -
అక్కడ మళ్లీ వైరస్.. దీంతో 1255 విమానాలు..
బీజింగ్ : చైనాలోని బీజింగ్లో మరలా కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ వస్తుంది. బీజింగ్ నగరంలో బుధవారం కొత్తగా 31 కరోనా కేసులు వెలుగుచూడడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా సుమారు 1255 విమానాలను రద్దు చేస్తున్నట్లు నగరంలోని రెండు విమానాశ్రయాలు ప్రకటించాయి. దీంతో బీజింగ్లో దాదాపు 70 శాతం విమాన రాకపోకలు నిలిచిపోనున్నాయి. బీజింగ్లో తాజాగా ఓ మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు ద్రువీకరించారు. దీంతో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని మూడవ స్థాయి నుంచి రెండవ స్థాయికి ప్రకటించారు.(అమరులైన భారత సైనికులకు అమెరికా సంతాపం) గత 5 రోజుల్లోనే బీజింగ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటింది. ఒకవేళ అత్యవసం అనుకుంటే తప్ప, బీజింగ్ ప్రజలు ఎవరూ తమ ఇండ్లు దాటి బయటకు వెళ్లకూడదని ఆ నగర మున్సిపల్ అధికారి చెన్ బీయి తెలిపారు. ఫెంగ్టాయి జిల్లాలో ఉన్న జిన్ఫాడి మార్కెట్ నుంచి అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ప్రైమరీ, హైయర్ స్కూళ్ల విద్యార్థులు క్యాంపస్కు రావద్దు అని ఆదేశించింది. కాలేజీ విద్యార్థులు కూడా క్యాంపస్కు రావాల్సిన అవసరం లేదన్నారు. నగరంలోని ప్రజలంతా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది.(వైరల్ : భలే గమ్మత్తుగా పోలీస్ ట్రైనింగ్) -
బీజింగ్లో మరోసారి కరోనా విజృంభణ
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లో ప్రాణాంతక కరోనా వైరస్ మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 27 మందికి మహమ్మారి సోకిందని.. దీంతో ఐదురోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 106కు చేరిందని స్థానిక ప్రభుత్వాధికారి వెల్లడించారు. వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోందని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదరు అధికారి మాట్లాడుతూ.. రాజధానిలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చిందన్నారు. ఈ నేపథ్యంలో టాక్సీ ప్రయాణాలపై రవాణా కమిషన్ నిషేధం విధించినట్లు వెల్లడించారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో 276 వ్యవసాయ మార్కెట్లు, 33 వేల ఫుడ్, బేవరేజ్ సంస్థలను డిస్ఇన్ఫెక్ట్ చేశామని తెలిపారు. వైరస్ ఆనవాళ్లు గుర్తించిన మార్కెట్కి దగ్గర్లో ఉన్న 11 నివాస సముదాయాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధించామని.. తాజాగా మరో ఏడింటిని కూడా లాక్డౌన్ చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా పట్టణవ్యాప్తంగా ఉన్న అన్ని ఫుడ్ మార్కెట్లలోని దుకాణాల యజమానులు, రెస్టారెంట్ మేనేజర్లు, ప్రభుత్వ క్యాంటీన్లలో పనిచేసే వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. (బీజింగ్లో మళ్లీ కరోనా కాటు) కాగా బీజింగ్లోని అతిపెద్ద హోల్సేల్ ఫుడ్ మార్కెట్ షిన్ఫాడిలో మరోసారి కరోనా ఆనవాళ్లు బయడపడటంతో అధికారులు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బీజింగ్లో రోజుకు 90,000 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు నగర ఆరోగ్య కమిషన్ అధికార ప్రతినిధి గువా షియాజన్ సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. లక్షణాలు కనిపించకున్నా కరోనా పాజిటివ్గా నమోదైన వారిని క్వారంటైన్లో ఉంచినట్టు తెలిపారు. -
బీజింగ్లో మళ్లీ కరోనా కాటు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లో మళ్లీ కరోనా గుబులు మొదలైంది. మూడు రోజుల్లో 46 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు నియంత్రణ చర్యల్లో నిమగ్నమయ్యారు. కొత్తగా కేసులు ప్రబలుతున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. నగరంలోని ఆరు మార్కెట్లను శనివారం మూసివేశారు. ఓ మార్కెట్లో సాల్మన్ చేపలను కోసే చెక్కమీద కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. దీంతో నగరంలో పలుచోట్ల చేపల విక్రయాలను నిలిపివేశారు. బీజింగ్లో తాజాగా 46 మందికి కరోనా సోకిందని గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఈ 46 మంది స్థానిక మార్కెట్కి వెళ్లారని, వీరిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చినవారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని వెల్లడించారు. రెండు నెలలుగా సురక్షితంగా ఉన్న బీజింగ్లో కొత్తగా కోవిడ్ కేసులు బయటపడటంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. కరోనా ఆనవాళ్లు గుర్తించిన మార్కెట్కి దగ్గర్లో ఉన్న 11 నివాస సముదాయాలను లాక్డౌన్ చేశారు. మూడు పాఠశాలలు, కిండర్గార్టెన్లలో తరగతులను రద్దు చేశారు. మే 30 వ తేదీ నుంచి ఈ మార్కెట్ని సందర్శించిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం బీజింగ్లోని 98 న్యూక్లియిక్ యాసిడ్ టెస్టింగ్ కేంద్రాల్లో రోజుకి 90,000 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు నగర ఆరోగ్య కమిషన్ అధికార ప్రతినిధి గువా షియాజన్ చెప్పారు. లక్షణాలు కనిపించకున్నా కరోనా పాజిటివ్గా నమోదైన వారిని క్వారంటైన్లో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 74 మందితో సహా చైనాలో ఇప్పటి వరకు 83,075 మందికి కరోనా సోకింది. -
మరోసారి లాక్డౌన్ దిశగా చైనా..!
బీజింగ్ : ప్రాణాంతక కరోనా వైరస్ పురిటిగడ్డ చైనా మరోసారి లాక్డౌన్ దిశగా పయనిస్తోంది. వైరస్ను పూర్తిగా కట్టడి చేసి కరోనా ఫ్రీ దేశంగా ప్రకటిద్దామని సిద్ధమవుతున్న తరుణంలో కొత్త కేసులు వెలుగు చూడటం ఆ దేశంలో కలకలం రేపుతోంది. చైనా ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం ప్రకారం.. శుక్రవారం నాలుగు పాజిటివ్ కేసులు, శనివారం మరో ఏడు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవ్వన్నీ కూడా రాజధాని నగరం బీజింగ్లోనే నమోదు కావడం గమనార్హం. పాజిటివ్గా సోకిన వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారందరినీ కోవిడ్ కేంద్రాలకు తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా గడిచిన 55 రోజుల్లో కనీసం ఒక్క కరోనా కేసు కూడా ఆ దేశంలో నమోదు కాలేదు. అయితే ఊహించని విధంగా ఒక్కసారే పాజిటివ్ కేసులు వెలుగుచూడటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. (2 నెలల తర్వాత బీజింగ్లో మళ్లీ కరోనా) మరోరెండు రోజులపాటు ఇలానే కొత్త కేసులు బయటపడితే.. మరోసారి లాక్డౌన్ విధించాలని అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. మొదటిసారి దేశంలో కరోనా వెలుగుచూసిన సమయంలో కట్టుదిట్టమైన లాక్డౌన్ను పాటించడం మూలంగానే వైరస్ వ్యాప్తిని పూర్తిగా కట్టడి చేయగలింది. దీంతో రెండో విడత కరోనా వ్యాప్తి చెందితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని చైనా వైద్య అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83,086కు చేరింది. వీరిలో 78,367 మంది కరోనాను జయించగా.. 4634 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆ దేశంలో 85 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రెండోదశ వైరస్ వ్యాప్తి చెందకముందే లాక్డౌన్ ప్రకటించడం మేలని అధికారులు భావిస్తున్నారు. (రాజకీయ నేతలకు కరోనా భయం) -
2 నెలల తర్వాత బీజింగ్లో మళ్లీ కరోనా
బీజింగ్: చైనాలో గత కొద్ది రోజులుగా కరోనా తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా ఆ దేశ రాజధాని బీజింగ్లో రెండు నెలలుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో బీజింగ్ను కరోనా ఫ్రీగా భావిస్తోన్న తరుణంలో మరోసారి వైరస్ దాడి చేయడం కలకలం రేపుతోంది. అక్కడ గురువారం తొలి వైరస్ కేసు నమోదవగా శుక్రవారం మరో రెండు కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం బీజింగ్ వైద్య అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో బీజింగ్లో రెండు కేసులు వెలుగు చూశాయి. (లదాఖ్లో చైనా దొంగ దెబ్బ) దీంతో ఈ వారంలో కేసుల సంఖ్య మూడుకు చేరింది. వీరిలో చైనా మీట్ ఫుడ్ కాంప్రహెన్సివ్ రీసెర్చ్ సెంటర్లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకినట్లు తేలింది. మరోవైపు ఓ స్కూలు విద్యార్థి తండ్రికి పాజిటివ్ రాగా సదరు పాఠశాలలోని సుమారు 50 మంది విద్యార్థులు, టీచర్లను క్వారంటైన్కు ఆదేశించారు. అనంతరం పాఠశాల మొత్తాన్ని శానిటైజేషన్ చేశారు. ఇదిలా వుండగా చైనాలో కొత్తగా ఆరు కేసులు బయటపడ్డాయి. (ఈ డెలివరీ బాయ్ నిజంగా దేవుడు!) -
పొరపాటున చేప మీద కూర్చున్నాడంతే!
బీజింగ్ : పొరపాటున ఓ వ్యక్తి చేప మీద కూర్చోవటంతో అది కాస్తా అతడి పురీషనాళం(మలద్వారం)లోకి చొరబడింది. ఈ సంఘటన దక్షిణ చైనాలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. దక్షిణ చైనా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్కు చెందిన ఓ 30 ఏళ్ల వ్యక్తి పొరపాటున చేపమీద కూర్చున్నాడు. దీంతో అది అతడి పురీషనాళంలోకి చొరబడింది. అయితే దాన్ని బయటకు లాగే ప్రయత్నంలో అతడు విఫలమయ్యాడు. ఆ తర్వాతి నుంచి అతడి కడుపులో నొప్పి ప్రారంభమవ్వటంతో దగ్గరలోని పీపుల్స్ ఆసుపత్రికి వెళ్లాడు. ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడి పురీషనాళంలో ఏదో అడ్డం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఎక్స్రే తీయగా అది ఓ చేప అని తేలింది. కొన్ని గంటల పాటు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఓ పెద్ద చేపను బయటకు తీశారు. చదవండి : చైనా వాల్ యుద్ధం కోసం కాదట..! -
పిల్లాడి ప్రాణాలు కాపాడిన డెలివరీ బాయ్
-
ఈ డెలివరీ బాయ్ నిజంగా దేవుడు!
బీజింగ్ : భవనం రెండవ అంతస్తుపై నుంచి కిందకు వేలాడుతున్న పిల్లాడిని రక్షించటానికి ఓ డెలివరీ బాయ్ తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ఎలాంటి రక్షణ లేకుండా రెండు అంతస్తులను చకచకా ఎక్కి పిల్లాడిని కాపాడాడు. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం చైనా, గాంగ్ఝౌ ప్రాంతంలోని ఓ భవనం రెండవ అంతస్తులో ఆడుకుంటున్న పిల్లాడు పొరపాటున రక్షణ చువ్వలను దాటుకుని కిందకు వేలాడాడు. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు బాలుడ్ని పైకి లాగటానికి ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. చివరకు పట్టుతప్పిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటుగా వెళుతున్న లి జియాజున్ అనే డెలివరీ బాయ్ వెంటనే రెండు అంతస్తులపైకి ఎగబాకాడు. ( సింహాలు కూడా ఉహించని ట్విస్ట్! ) పిల్లాడిని పట్టుకుని పైకి తోసాడు. కుటుంబసభ్యులు చిన్నారిని పైకి లాక్కోవడంతో గండం తప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో నెటిజన్లు.. ‘‘రియల్ హీరో.. డెలివరీ బాయ్ నిజంగా దేవుడు’’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం‘‘ చైనా కరోనాను వ్యాప్తి చేసిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మమ్మల్ని డైవర్ట్ చేయటానికి మంచి ప్రయత్నమే చేశారు’’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ( ‘ఎవ్వడంట... ఎవ్వడంట’ మాటల్లేవ్ బాస్) -
చైనా పార్లమెంట్ కీలక నిర్ణయం
బీజింగ్ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్తో పోరాడుతున్న క్లిష్ట సమయంలోనూ చైనా తన సామ్రాజాన్ని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తోంది. హాంకాంగ్పై ఆధిపత్యానికి వడివడిగా అడుగులు వేస్తున్న డ్రాగన్ దేశం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్ వాసుల స్వేచ్ఛకు సంకెళ్లు వేసే జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలతో జాతీయ భద్రతా చట్టంపై చర్చించేందుకు గురువారం ప్రత్యేకంగా సమావేశమైన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. మొత్తం 2800 మంది ఎన్పీసీ సభ్యులు నూతన చట్టానికి అనుకూలంగా ఓట్లు వేశారని సమాచారం. తాజా నిర్ణయంతో చైనా ఇంటెలిజెన్స్ సంస్థలు హాంకాంగ్లో తిష్ట వేసే అవకాశం ఉంది. హాంకాంగ్లో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అణిచేయడానికి, విదేశీ జోక్యాన్ని నిరోధించడానికి ఈ చట్టం ఎంతో అవసరమని చైనా ప్రభుత్వం చెబుతోంది. ఒక దేశం రెండు వ్యవస్థల విధానాన్ని మరింత మెరుగుపరచి.. దానిని పటిష్టం చేయాలని భావిస్తోంది. కాగా చైనా చట్టాలను, జాతీయ గీతాన్ని అవమానిస్తే నేరంగా పరిగణించే బిల్లుకు గత నెలలోనే ముసాయిదాను తయారు చేసిన విషయం తెలిసిందే. (ఆమెను విడుదల చేయండి : చైనా వార్నింగ్!) -
షాకింగ్: ఇయర్ ఫోన్స్ వల్ల అతడి చెవిలో..
బీజింగ్: ఇయర్ ఫోన్స్ ఎక్కువ సేపు చెవిలో పెట్టుకోకూడదన్నది నిపుణుల మాట. వీటిని అధికంగా వాడటం వల్ల వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇక వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వల్ల రేడియేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇయర్ ఫోన్స్ శరీరంలో ఒక భాగంగా మారిపోయాయి. అంతలా దానికి బానిసలయ్యారు. తాజాగా ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడినందుకు ఓ బాలుడు ఆస్పత్రిపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బీజింగ్కు చెందిన పదేళ్ల బాలుడు చెవిలో నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతను ఆస్పత్రికి వెళ్లగా, అతడిని పరీక్షించిన వైద్యులు షాక్కు గురయ్యారు. (ఇడ్లీ, దోసె, మజ్జిగ కూడా మందులే!) చెవిలో దట్టంగా పెద్ద సమూహంలో శిలీంధ్రాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. దీన్ని 'బ్లాక్ ఫారెస్ట్ ఆఫ్ ఫంగస్'గా తెలిపారు. సుదీర్ఘంగా అందిస్తున్న చికిత్స వల్ల ప్రస్తుతం అతడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను డా.వు యుహువా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇయర్ ఫోన్స్ విచ్చలవిడిగా వాడటం వల్లే ఇంత ఘోరం జరిగిందని చెప్పుకొచ్చాడు. కాబట్టి వైర్లెస్ ఇయర్ఫోన్స్, హెడ్ఫోన్స్ వాడకందారులు దాని పర్యవసానాలను తెలుసుకుని పరిమితంగా వినియోగించాలని హెచ్చరించారు. ఇయర్ ఫోన్స్ వినియోగదారులు ఎల్లప్పుడూ చెవిని పొడిగా ఉంచడమే కాక, దాన్ని వాడే గంటలను తగ్గించాలని సూచించారు. (పిల్లలూ... పెద్దలూ... బ్రష్ చేసుకోండిలా!) -
అక్కడ మాస్క్లు అవసరం లేదు : చైనా
బీజింగ్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా నియంత్రణలో భాగంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అలాగే చాలా దేశాలు లాక్డౌన్ విధించి.. కరోనా కట్టడికి కృషి చేస్తున్నాయి. అయితే ప్రపంచమంతా కరోనా ధాటికి వణికిపోతున్న ఈ సమయంలో.. వైరస్ తొలి కేసు నమోదైన చైనాలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కరోనా కేసులు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో చైనాలో ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేస్తున్నారు. తాజాగా చైనా రాజధాని బీజింగ్లో బయటకు వెళ్లేవారు మాస్క్ల ధరించే అవసరం లేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ ఆదివారం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. అయితే ప్రతి ఒక్కరు ఇతరులకు దగ్గరికి వెళ్లకుండా.. కనీస దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపింది. వాతావరణం బాగున్నప్పుడు ప్రజలు బయటిప్రాంతంలో వ్యాయామం చేసుకోవడాన్ని ఇది ప్రోత్సహిస్తుందని.. తద్వారా మెరుగైన ఆరోగ్యం సమకూరుతుందని పేర్కొంది. (చదవండి : రెస్టారెంట్ వెలుపల వేచిచూసిన ప్రధాని) -
తరచూ తలనొప్పి: యువతి మెదడులో..
బీజింగ్ : 23 ఏళ్ల యువతి మెదడులో 10 సెంటీమీటర్ల పొడవైన నులిపురుగు బయటపడింది. ఈ సంఘటన చైనాలోని నింజియాంగ్లో చోటుచేసుకుంది. వివరాలు.. నింజియాంగ్కు చెందిన క్షియావో ఇ అనే యువతి గత కొద్దిరోజులుగా తలనొప్పితో బాధపడుతోంది. ఈ మధ్య ఎపిలిప్సీ( న్యూరలాజికల్ డిజార్డర్) అటాక్ చేసింది. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరింది. క్షియావోకు పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె మెదడులో ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. ఆ వెంటనే శస్త్ర చికిత్స మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె మెదడులో ఉంటున్న 10 సెంటీమీటర్ల నులిపురుగు వారు గుర్తించి, దాన్ని బయటకు తీశారు. సరిగా ఉడకని మాంసం తిన్నందు వల్లే నులిపురుగు ఆమెలోకి చేరిందని వైద్యులు తెలిపారు. ( చైనా: స్కూళ్లకు పిల్లలు.. వాళ్ల తలపై..) ప్రస్తుతం క్షియావో పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. గత సంవత్సరం గాంఝౌకు చెందిన వాంగ్ అనే వ్యక్తి మెదడులోనూ 11 సెంటీమీటర్ల నులిపురుగు బయటపడింది. నత్తలు ఇష్టంగా తినటం వల్ల పురుగు అతడి మెదడులో చేరింది. 15 సంవత్సరాల పాటు అతడి మెదడును తింటూ బ్రతికింది. తల నొప్పితో ఆసుపత్రిలో చేరటంలో వైద్యులు నులి పురుగును గుర్తించి, శస్త్ర చికిత్స ద్వారా బయటకు తీశారు. ( బెస్ట్ ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడిన శునకం ) -
బంగారు కల నెరవేరిన వేళ...
ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ఎనిమిది బంగారు పతకాల స్వర్ణయుగం 1980తోనే ముగిసింది. తర్వాతి మూడు ఒలింపిక్స్లలోనూ మన దేశం రిక్తహస్తాలతోనే వెనుదిరిగింది. ఆ తర్వాత లియాండర్ పేస్, కరణం మల్లేశ్వరి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ల ప్రదర్శనతో రెండు కాంస్యాలు, ఒక రజతం మాత్రం వచ్చాయి. కానీ వ్యక్తిగత స్వర్ణం... ఇన్నేళ్లయినా అది భారత్కు స్వప్నంగా మారిపోయింది. ఎట్టకేలకు 2008లో ఆ రాత మారింది. పాతికేళ్ల కుర్రాడి తుపాకీ నుంచి దూసుకొచ్చిన ఒక బుల్లెట్ సరిగ్గా పసిడి లక్ష్యాన్ని తాకింది. దాంతో విశ్వ క్రీడల్లో మన దేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని అందించిన అభినవ్ బింద్రా చరిత్రకెక్కాడు. అతని ప్రదర్శన కారణంగా ఆ క్షణాన పోడియంపై వినిపించిన జనగణమన ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేసింది. ‘నా జీవితంలో ఇది ఎప్పటికీ మరిచిపోలేని చీకటి రోజు’... 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో ప్రదర్శన తర్వాత అభినవ్ బింద్రా తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్య ఇది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 7వ స్థానంలో నిలిచిన తర్వాత అతను ఈ మాట అన్నాడు. మరి ఇలా అయితే తర్వాతి లక్ష్యం ఏమిటి... వెంటనే మిత్రులు అడిగారు. ఏముంది, మరో నాలుగేళ్లు శ్రమించడమే అంటూ బింద్రా చిరునవ్వుతో జవాబిచ్చాడు. అంతకుముందు నాలుగేళ్ల క్రితమే 2000 సిడ్నీ ఒలింపిక్స్లో కూడా అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా బింద్రా పాల్గొన్నాడు. అయితే అప్పుడు క్వాలిఫయింగ్లో 11వ స్థానంలో నిలిచి ఫైనల్స్కు కూడా అర్హత సాధించలేకపోయాడు. ఇలాంటి స్థితిలో మరో నాలుగేళ్లు కష్టపడాలంటే ఎంతో ఓపిక, పట్టుదల, పోరాటతత్వం ఉండాలి. కానీ బింద్రా అన్నింటికీ సిద్ధపడ్డాడు. ఒకే లక్ష్యంతో... బింద్రా కలవారి బిడ్డ. డబ్బుకు ఎలాంటి లోటు లేదు. ప్రాక్టీస్కు సమస్య రాకుండా ఇంట్లోనే తండ్రి సొంతంగా షూటింగ్ రేంజ్ కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఇంకా బయటకు కనిపించని, తనకు మాత్రమే తెలిసిన ఇతర లోపాలున్నాయనేది బింద్రా గుర్తించాడు. అన్నింటికి మించి తన ఫిట్నెస్ స్థాయికి తగినట్లుగా లేదని అతనికి అర్థమైంది. 4 కిలోల షూటింగ్ సూట్, 5 కిలోల గన్తో గురి కుదరడం లేదని తెలిసింది. అంతే... ఆరు నెలలు రైఫిల్కు విరామం ఇచ్చి పూర్తిగా ఫిట్గా మారడంపై దృష్టి పెట్టాడు. శరీరాన్ని దృఢంగా మార్చుకున్నాడు. బింద్రాకు కోచ్ గాబ్రియేలా అభినందన ఒక దశలో విరామం లేకుండా పది నిమిషాలు పరుగెత్తడమే కష్టంగా కనిపించిన అతను కనీసం గంటన్నర పాటు ఆగకుండా పరుగెత్తసాగాడు. కీలక సమయంలో బింద్రా లోపాలను సరిదిద్ది అతని షూటింగ్ను తీర్చి దిద్దడంలో స్విట్జర్లాండ్ మహిళా కోచ్ గాబ్రియేలా బుల్మన్ పాత్ర కీలకమైంది. 1988 నుంచి 2004 వరుసగా ఐదు ఒలింపిక్స్లలో పాల్గొన్న గాబ్రియేలా... ముఖ్యంగా బింద్రా వెన్నుపై భారం పడకుండా సరైన పొజిషనింగ్తో షూటింగ్ చేయడంలో అతడిని తీర్చిదిద్దింది. ఇక బీజింగ్కు అతను ఏమాత్రం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వెళ్లాడు. ఈసారి ఫలితం గురించి ఆలోచించను, నేను షూటింగ్ చేసేందుకు మాత్రమే వెళుతున్నా అని ముందే చెప్పేశాడు. అలా సాధించాడు... విజయానికి, పరాజయానికి మధ్య వెంట్రుకవాసి తేడా మాత్రమే ఉండే షూటింగ్లో మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు అభినవ్ సిద్ధమయ్యాడు. క్వాలిఫయింగ్లో 596 పాయింట్లు సాధించిన భారత షూటర్ నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్స్కు అర్హత సాధించాడు. ఫైనల్లో బింద్రా అత్యుత్తమ ప్రదర్శన ముందు మిగతా షూటర్లు వెనుకబడ్డారు. మొత్తం పది రౌండ్లలోనూ ఒక్కసారి కూడా 10 పాయింట్లకు తగ్గకుండా బింద్రా మాత్రమే షూట్ చేయగలిగాడు. ఓవరాల్గా 700.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచిన బింద్రా భారత జాతి గర్వపడే ఘనతను సృష్టించాడు. 9వ రౌండ్ ముగిసేసరికి హెన్రీ హకినెన్ (ఫిన్లాండ్), బింద్రా సమాన పాయింట్లతో ఉన్నారు. చివరి రౌండ్లో బింద్రా 10.8 పాయింట్లు స్కోరు చేయగా... తీవ్ర ఒత్తిడిలో హకినెన్ 9.7 పాయింట్లు మాత్రమే స్కోరు చేసి మూడో స్థానానికి పడిపోయాడు. ఆగస్టు 11, 2008న బింద్రా సాధించిన ఘనతతో భారత్ యావత్తూ పులకించింది. 28 ఏళ్ల తర్వాత సాంకేతికంగా భారత్ ఖాతాలో స్వర్ణపతకం చేరినా... వ్యక్తిగత విభాగంలో బంగారం గెలిచిన ఏకైక అథ్లెట్గా అతను చరిత్రలో నిలిచిపోయాడు. ఆ తర్వాత అభినవ్ 2012 లండన్ ఒలింపిక్స్లో క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరగ్గా, 2016 రియో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో రెండో పతకాన్ని చేజార్చుకున్నాడు. అయితే బీజింగ్లో అతను స్వర్ణపతకాన్ని అందుకున్న క్షణం మన క్రీడాభిమానుల మదిలో ఎప్పటికీ చిరస్మరణీయం. సాక్షి క్రీడా విభాగం