badrachalam
-
Bhadrachalam: ఉగ్ర ‘గోదావరి’.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, తూర్పుగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం 48 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి ఉధృతి నేపథ్యంలో ఏపీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు.. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇక, ఏజెన్సీలోని పలు గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. ఇప్పటికే చర్ల మండలంలోని మూడు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశించారు.ఇక ధవళేశ్వేరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇక, వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఐదు ఎస్డీఆర్ఎఫ్, నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విధుల్లో ఉన్నాయి. కాగా, ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46.7 అడుగులకు చేరుకుంది. మరోవైపు, పోలవరం వద్ద గోదావరి నీటి ప్రవాహం 12.5 మీటర్లకు చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. గోదావరి నుంచి ప్రస్తుతం 10 లక్షల 28 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల అవుతోంది. ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజలు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక, ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ స్కూల్స్కు సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. -
అందంగా ముస్తాబైన భద్రాద్రి రామాలయం
-
పొంగులేటికి హ్యాండిస్తూ.. తిరిగి బీఆర్ఎస్లోకి తెల్లం
-
పొంగులేటికి భారీ ఝలక్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి పెద్ద ఝలకే తగిలింది. గత నెలలో ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సమక్షంలో తనతో పాటే కాంగ్రెస్లో చేరిన పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు మనసు మర్చాకున్నాడు. తిరిగి బీఆర్ఎస్లోకే వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చకపోవడం, అదే సమయంలో తనను నమ్ముకున్న కార్యకర్తల నమ్మకం వమ్ము చేయడం ఇష్టం లేకనే తిరిగి బీఆర్ఎస్ వెళ్తున్నట్లు ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారాయన. భద్రాచలం అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతుందని తాను నమ్ముతున్నట్లు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేపు(గురువారం) ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లం వెంకటరావు మొదటి నుంచి పొంగులేటికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ వచ్చారు. 2018లో టీ(బీ)ఆర్ఎస్ తరపున తెల్లం పోటీ చేసి ఓడిపోయారు(32 శాతం ఓటింగ్.. దాదాపు 36వేల ఓట్లు పోలయ్యాయి). అయితే రాబోయే ఎన్నికల్లో భద్రాచలం టికెట్ ఆశించి మరీ ఆయన పొంగులేటితో కాంగ్రెస్లో చేరారు. అయితే ఇక్కడే ఆయనకు ఆటంకాలు ఎదురయ్యాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పొదెం వీరయ్యకే కేటాయించే అవకాశం ఉండడంతో.. వెంకటరావు నిరాశకు లోనయ్యారు. అదే సమయంలో మరోపక్క నుంచి బీఆర్ఎస్ ముఖ్యనేతలు వెంకటరావుతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే టికెట్ హామీ ఇస్తేనే బీఆర్ఎస్లోకి వస్తానని ఆయన కరాకండిగా చెప్పినట్లు ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. చివరకు ఏమైందో తెలియదుగానీ.. ఆయన బీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటన చేసేశారు. ఇదీ చదవండి: జెండా వందనంలో కొట్టుకున్న బీజేపీ నేతలు -
భద్రాచలంలో మళ్లీ పెరుగుతోన్న నీటిమట్టం..!
-
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
-
మరో మిథాలీగా ఎదగాలని ఆ తండ్రి ఆశ.. ‘దంగల్’లో అమీర్ఖాన్లా రామిరెడ్డి!
U19 Women T20 World Cup- Gongadi Trisha- సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్పోర్ట్స్ నేపథ్యంలో వెండితెర మీద విజయఢంకా మోగించిన సినిమాలు ఎన్నో. అందులో ప్రథమ స్థానం రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన దంగల్కు దక్కుతుంది. జాతీయ స్థాయిలో ఆడలేకపోయిన మల్లయోధుడు మహవీర్ తన ఇద్దరు కూతళ్లను మల్లయోధులుగా తీర్చిదిద్ది దేశానికి అనేక పతకాలు సాధించేలా ఎంతో శ్రమించాడు. ఆ కష్టాన్ని అమీర్ఖాన్, ఫాతిమా సనా, మల్హోత్రాలు వెండితెర మీద కళ్లకు కట్టారు. అచ్చంగా అలాంటి స్ఫూర్తిదాయక జీవితాలు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తారసపడతాయి. గోదావరి తీరాన శ్రీరాముడి పాదల చెంతన త్రిష – రామిరెడ్డిలు మన దంగల్ కథకు ప్రతిరూపాలుగా నిలిచారు. 22 గజాల క్రికెట్ పిచ్లో రాణించేందుకు త్రిష సాగించిన, సాగిస్తోన్న గురించి ప్రయాణం ఆమె తండ్రి రామిరెడ్డి మాటల్లో.... నేను హాకీ ప్లేయర్ని స్వతహాగా నేను హాకీ ప్లేయర్ని. ఆటల్లో నా వారసులు నన్ను మించేలా ఎదగాలని కోరుకున్నాను. ఒక క్రీడాకారుడిగా నా జీవితంలో ఎదురైన అనుభవాల ఆధారంగా నా పిల్లలకు క్రీడల్లో ఎదురయ్యే ఆటంకాలు రాకుండా చూసుకోవాలని వాళ్లు పుట్టకముందే డిసైడ్ అయ్యాను. క్రికెటర్ను చేయాలని అప్పటి వరకు ఉన్న ఆటలను పరిశీలిస్తే షటిల్, టెన్నిస్ తదితర గేమ్స్ హైట్ అడ్వాంటేజ్ గేమ్స్. ప్లేయర్లో ఎంత ప్రతిభ ఉన్నా హైట్ సరిగా లేకపోతే ఈ ఆటల్లో రాణించడం కష్టం. అయితే ఎత్తుతో సంబంధం లేని గేమ్స్ ఏంటా అని పరిశీలిస్తే ఫుట్బాల్, క్రికెట్లు కనిపించాయి. భద్రాచలంలో ఫుట్బాల్ ఆడేందుకు, కోచింగ్ ఇచ్చేందుకు అనుకూలమైన పరిస్థితి లేదు. అదే క్రికెట్ అయితే గల్లీ క్రికెట్ మొదలు భద్రాద్రి కప్ వరకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నట్టు అనిపించింది. మిథాలీలా ఎదగాలని.. రెండేళ్ల వయసు నుంచే దీంతో నాకు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా భవిష్యత్తులో క్రికెట్లో గొప్ప స్థాయికి వెళ్లేలా అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. సాధారణంగా పిల్లలకు ఏడేళ్ల నుంచి ఏదైనా ఆటలో ప్రొఫెషనల్ కోచింగ్ ఇప్పించడం మొదలవుతుంది. కానీ నేను త్రిషాకు నేరు రెండేళ్ల వయస్సు నుంచే ప్రారంభించాను, త్రిష పుట్టిన సమయానికి విమెన్ క్రికెట్లో మిథాలిరాజ్ డబుల్ సెంచరీలతో సంచలనాలు నమోదు చేస్తోంది. వరల్డ్కప్ ఆడుతుందని నమ్మాను లేడీ సచిన్గా పేరు తెచ్చుకుంటోంది. దీంతో మిథాలీ స్ఫూర్తితో కేవలం రెండేళ్ల వయస్సులో తనకు ఏమీ తెలియనప్పటి నుంచే క్రికెటింగ్ షాట్లు ఆడటం నేర్పిస్తూ వచ్చాను. తనకు తెలియకుండానే అది మజిల్ మెమోరీలో ఇమిడి పోయింది. ఆ మజిల్ మెమొరీ తనకు ఎంతగానో ఉపయోగపడింది. తను ఎదుగుతున్న కొద్దీ ఆటలో ఆ తేడాను బయటి వాళ్లు కనిపెట్టలేకపోయినా నేను పసిపగడుతూ వచ్చాను. దీంతో తనకు ఏదో ఒక రోజు ఇండియా తరఫున విమెన్ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించడమే కాదు, కచ్చితంగా వరల్డ్ కప్ కూడా ఆగుతుందనే విశ్వాసం ఉండేది. ఏడేళ్ల వయస్సులో హైదరాబాద్కు అడ్వాన్స్, సైంటిఫిక్ కోచింగ్ కోసం త్రిషకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు హైదరాబాద్కు షిప్ట్ అయ్యాం. అక్కడ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీకి వచ్చాం. వాళ్లిద్దరి ప్రత్యేక శిక్షణలో ఇక్కడ, జాన్ మనోజ్ సార్ త్రిష వీడియోను పరిశీలించారు. అప్పుడే వారు తను ఏదో ఒకరోజు ఇండియాకు ఆడుతుందని చెప్పారు. ఆర్ శ్రీధర్, ఇక్బాల్లు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రోజకు ఎనిమిది గంటల పాటు సాధన చేసేది. వారి అంచనాలను నిజం చేస్తూ 16లో దేశానికి ఎంపికైంది. 12 ఇయర్స్కి ఛాలెంజర్స్ సిరీస్కు సెలక్ట్ అయ్యింది. దీంతో మా నమ్మకం వమ్ము కాదనే నమ్మకం కలిగింది. హ్యపీగా ఉంది నా అంచనాలకు మించి ఏకంగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్లో మెంబర్గా ఉండటమే కాదు ఫైనల్లో విలువైన పరుగులు చేసింది త్రిష. మా కుటుంబం, బంధువులు, కోచ్లు, భద్రాచలం పట్టణం అంతా సంతోషంగా ఉన్నాం. త్రిష విజయాన్ని భద్రాచలం పట్టణం అంతా కేక్లు కట్ చేసుకుని తమ ఇంటి పండగలా చేసుకోవడం చూస్తే పట్టరాని సంతోషం కలుగుతోంది. తదుపరి లక్ష్యం అదే ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో ఉన్న త్రిష ప్రస్తుతం భావనాస్ కాలేజీలో ఇంటర్మీడియ్ సెకండియర్ (సీఈసీ) చదువుతోంది. రాబోయే రోజుల్లో ఇండియన్ సీనియర్స్ జట్టుకు ఎంపిక కావాలనేది తదుపరి లక్ష్యం. అంతేకాదు విమెన్ వరల్డ్ కప్ జట్టులో తాను ఉండాలి, కప్ కొట్టాలనేది మా కుటుంబం లక్ష్యం. చదవండి: Ind Vs Aus: సెలక్షన్ కమిటీ డోర్లు బాదడం మాత్రమే కాదు.. ఏకంగా! అయినా పాపం IND vs NZ: న్యూజిలాండ్తో మూడో టీ20.. టీమిండియాకు గ్రాండ్ వెలకమ్! వీడియో వైరల్ -
మరింత ముదురుతున్న భద్రాద్రి లడ్డూ వివాదం
-
భద్రాద్రి: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. భక్తుల కౌంటర్ నిరసన
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మరోసారి బూజు పట్టిన లడ్డూల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం కొనుగోలు చేసిన కొందరు భక్తులకు షాక్ తగిలింది. లడ్డూలు వాసన వస్తుండడంతో సిబ్బందిని నిలదీశారు భక్తులు. బూజు పట్టిన లడ్డూలు ఎలా విక్రయిస్తారని కౌంటర్ సిబ్బందిని నిలదీశారు భక్తులు.ఈ క్రమంలో.. ‘ఇచ్చట బూజు పట్టిన ప్రసాదం లడ్డూలు ఇస్తారు’’ అని పేపర్ మీద రాసి లడ్డూ కౌంటర్కి అతికించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో లడ్డూలు మాయం కావడంపై తీవ్ర దుమారం రేగి.. చర్చ నడిచి దర్యాప్తు దాకా వెళ్లింది. తాజా ఘటనతో.. లడ్డూల నాణ్యత వ్యవహారంపై చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై సిబ్బంది స్పందించాల్సి ఉంది. -
భద్రాద్రిలో రాష్ట్రపతి పర్యటన.. 144 సెక్షన్ విధింపు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి జిల్లాలో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(బుధవారం) ఆమె భద్రాచలం ఆలయానికి రానున్నారు. బుధవారం భద్రాచలం శ్రీసీతారాముడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. భద్రాచలంలో 144 సెక్షన్ విధించారు. ఉదయం ఏడు గంటల నుంచి 144 సెక్షన్ అమలులోకి రానుంది. రాకపోకల నిలిపివేత ఉంటుంది. సుమారు 2 వేల మంది పోలీసులతో, 350 అధికారులు రాష్ట్రపతి భద్రతను పర్యవేక్షించనున్నారు. అలాగే.. రాష్ట్రపతి రాక నేపథ్యంలో సారపాక బీపీఎల్ స్కూల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు అధికారులు. హెలిప్యాడ్ నుంచి ఆలయం చుట్టూ ప్రోటోకాల్ కాన్వాయ్ ట్రయల్ నిర్వహించారు. ఉదయం పది గంటల ప్రాంతంలో సీతారాములను దర్శించుకుంటారు. దేశ ప్రథమ పౌరురాలి రాక సందర్భంగా.. ఉదయం 8 గంటల నుంచి 11.30గం. దాకా అన్ని దర్శనాలు బంద్ కానున్నాయి. ఇక తెలంగాణలో మూడు రోజులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారు. ఈ నెల 28న అంటే బుధవారం భద్రాచలం సీతారాములను దర్శించుకుంటారు. ఈ నెల 29న ముచ్చింతల్ సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ నెల 30న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. -
గోదావరిలో కొనసాగుతున్నవరద ఉద్ధృతి
సాక్షి, అమరావతి/చింతూరు/కూనవరం/పోలవరం రూరల్/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది. బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మరోపక్క కృష్ణానదిలో వరద తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాత్రి ఏడుగంటలకు ప్రకాశం బ్యారేజి నుంచి 3,17,250 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. గోదావరి, శబరి నదుల్లో వరద ఉద్ధృతి పెరగడంతో విలీన మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినా విలీన మండలాల్లోకి నీరు చేరుతోంది. బుధవారం ఉదయం భద్రాచలం వద్ద 54.6 అడుగులున్న గోదావరి నీటిమట్టం రాత్రి ఏడుగంటలకు 54.4 అడుగులకు తగ్గింది. ఎటపాక, కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాల్లో బుధవారం రాత్రి వరకు వరద పెరుగుతూనే ఉంది. ఎటపాక మండలంలో ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరడంతో భద్రాచలంతో పాటు ఇతర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలో కూనవరం, టేకులబోరు, శబరి కొత్తగూడెం, చినార్కూరు, కొండ్రాజుపేట, పూసుగూడెం, ముల్లూరు, తాళ్లగూడెం గ్రామాల్లోకి నీరు చేరింది. వీఆర్పురం మండలంలో పలు గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. గోదావరి ఎగపోటు కారణంగా శబరినది కూడా క్రమేపీ పెరుగుతోంది. చింతూరు వంతెన వద్ద శబరినది బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. దీంతో వరదనీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. చింతూరులోని శబరిఒడ్డు, సంతపాకలు, టోల్గేట్, లారీ ఆఫీస్, పంచాయతీ రహదారి, వీఆర్పురం రహదారి ప్రాంతాలతో పాటు ఏజీకొడేరులో ఇళ్లల్లోకి వరదనీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం 34.200 మీటర్లకు చేరింది. స్పిల్వే 48 గేట్ల నుంచి 12,36,429 క్యూసెక్కుల వరద నీరు కిందికి వెళుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కాటన్ బ్యారేజి వద్ద బుధవారం రాత్రి ఏడుగంటలకు నీటిమట్టం 15.20 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల విడుదల కృష్ణానదిపై ఆల్మట్టి జలాశయంలోకి 2.15 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 1.32 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్లోకి 1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 1.28 లక్షల క్యూసెక్కులు, జూరాలకు 2.47 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 2.46 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,96,431 క్యూసెక్కుల వరద వస్తోంది. రిజర్వాయర్ 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగులు ఎత్తి నీరు విడుదల చేస్తున్న అధికారులు గేట్లను బుధవారం ఉదయం ఆరుగంటలకు 12 అడుగులకు, మధ్యాహ్నం 12 గంటలకు 10 అడుగులకు దించారు. జలాశయం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్కు విడుదల అవుతోంది. రెండు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన చేస్తూ 62,570 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 209.5948 టీఎంసీల నీరు ఉంది. నీటిమట్టం 883.90 అడుగులకు చేరుకుంది. తుంగభద్రకు 51 వేల కూస్కెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. మొత్తం సాగర్ జలాశయానికి 3,39,214 క్యూసెక్కుల నీరు చేరుతోంది. సాగర్ ఆరుగేట్లను ఐదడుగులు, 18 గేట్లను పదడుగులు ఎత్తి 2,98,596 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదనతో 32,927 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్ నీటిమట్టం 585.30 అడుగులు ఉంది. జలాశయంలో 298.3005 టీఎంసీల నీరు ఉంది. పులిచింతలలోకి 3.56 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి బుధవారం రాత్రి ఏడుగంటలకు 3,32,636 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. కృష్ణాడెల్టా కాలువలకు 15,386 క్యూసెక్కులు వదిలారు. బ్యారేజి 30 గేట్లను ఎనిమిదడుగులు, 40 గేట్లను ఏడడుగులు ఎత్తి 3,17,250 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరద నీటిలో మునిగి రైతు మృతి కూనవరం మండలం కరకగూడెంలో కరక జోగయ్య(48) ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి మృతిచెందాడు. తన దుక్కిటెద్దులు కనిపించకపోవడంతో వెదుక్కుంటూ వెళ్లిన ఆయన తిరిగివచ్చే సమయంలో కొండాయిగూడెం–కరకాయిగూడెం మధ్యలో కాజ్వేపైన గోదావరి వరద నీటిని దాటుతూ మునిగిపోయాడు. ఇదీ చదవండి: పొంగుతున్న గోదావరి, శబరి నదులు -
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి
-
ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి
ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రాలోని ఎటపాక మండలం పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు ఆంధ్రాలోనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో విలీనం చేయాలని తీర్మానాలు చేసినట్టు వస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. పురుషోత్తపట్నంలో శుక్రవారం కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు. ఎంపీటీసీ సభ్యులు వర్సా బాలకృష్ణ, గొంగడి వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ బుద్దా ఆదినారాయణ, పార్టీ నేతలు మంత్రిప్రగడ నర్సింహరావులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికీ అందుతున్నాయని తెలిపారు. జిల్లాల పునర్విభజన సమయంలో పాడేరు దూరాభారం దృష్ట్యా విలీన మండలాలకు పాలన సౌలభ్యం కోరుతూ ఆ సమయంలో కొందరు తీర్మానాలు చేశారని, అయితే ఆ నాటి తీర్మానాల్లో కొందరి సంతకాలు ఫోర్జరీ చేసి ఇప్పుడు వాటిని వక్రీకరించి చూపిస్తూ తెలంగాణ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. భద్రాచలంలోని కొందరు వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలనే వాదనను తెరపైకి తెస్తున్నారని చెప్పారు. భద్రాచలాన్ని తిరిగి ఆంధ్రాలో కలపాలని డిమాండ్ చేశారు. (క్లిక్: పవన్ కళ్యాణ్ తీరుపై మత్స్యకారుల మండిపాటు) -
దూరదృష్టితో గట్టెక్కించారు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పది రోజులపాటు మహోగ్రంగా పోటెత్తిన గోదావరి లంక గ్రామాలకు కంటిపై కునుకు లేకుండా చేసింది. ఎగువన భద్రాచలం వద్ద 71 అడుగులు, దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 21 అడుగులతో క్షణక్షణం వణికించింది. మూడు రోజుల పాటు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికతో ప్రమాద ఘంటికలు మోగించింది. అయితే ఈ స్థాయిలో వరద వచ్చినా గోదావరి తీరాన ఉన్న నాలుగు జిల్లాల్లో ఎక్కడా గండ్లు పడ్డ దాఖలాలు లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపే దీనికి కారణమని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో దూరదృష్టితో రూ.600 కోట్లతో 535 కిలోమీటర్లు మేర గోదావరి గట్లను ఆధునికీకరించడం, ఎత్తు పెంచడం వల్లే వరద ఉగ్రరూపం దాల్చినా ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగినట్లు పేర్కొంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు... వైఎస్సార్ సీఎంగా ఉండగా 2006 ఆగస్టు 7న గోదావరికి వరదలు వచ్చాయి. నాడు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 22.80 అడుగుల నీటిమట్టంతో 28,50,664 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. నాటి వరదల ఉధృతికి వశిష్ట ఎడమ గట్టుకు పి.గన్నవరం మండలం మొండెపులంక, గౌతమి కుడిగట్టుకు అయినవిల్లి మండలం శానపల్లిలంక వద్ద భారీగా గండ్లు పడ్డాయి. ఏటిగట్లకు పడ్డ గండ్లతో పలు మండలాల్లో పంటలు ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో చలించిపోయిన వైఎస్సార్ యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. నాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఒక బృందాన్ని గోదావరి జిల్లాలకు పంపి వాస్తవ పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయించారు. ఎటు చూసినా 8 మీటర్ల ఎత్తుతో.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 535 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్ల పటిష్టం కోసం వైఎస్సార్ రూ.548 కోట్లు మంజూరు చేశారు. పనులు పూర్తయ్యేసరికి అంచనాలు రూ.600 కోట్లు దాటిపోయాయి. 1986 నాటి వరదల సమయంలో ఏటిగట్లు ఆరు మీటర్ల ఎత్తు ఉండగా మరో రెండు అడుగులు పెంచి ఆధునీకరించారు. గోదావరి బండ్ ఎత్తు ఎక్కడ చూసినా ఎనిమిది మీటర్లు ఉండేలా పెంచారు. నాలుగు మీటర్లు వెడల్పున్న ఏటిగట్లను ఆరున్నర మీటర్లకు పెంచి విస్తరించారు. ఏటిగట్లు కోతకు గురికాకుండా మరో రూ.112 కోట్లతో నదీ పరీవాహకం వెంట గ్రోయిన్స్ కూడా నిర్మించారు. పటిష్టమైన చర్యల ద్వారా 1986 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించారు. తద్వారా గోదావరి జిల్లాల ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికుడిగా నిలిచారు. ముందుచూపు ఫలితమే.. 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 20.10 అడుగులతో రికార్డు స్థాయిలో 35,06,380 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అత్యధికంగా నమోదైన 1986 వరదలనే ప్రామాణికంగా తీసుకుని ఏటిగట్లు పటిష్టం చేయాలని వైఎస్సార్ నిర్ణయించారు. దూరదృష్టితో ఎత్తు పెంపు, వెడల్పు, పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవడంతో తాజా వరదల్లో ఏటిగట్లకు ఎక్కడా చిన్న గండి కూడా పడలేదు. ఆనాడు ముందుచూపుతో ఆయన తీసుకున్న నిర్ణయాలే గోదావరి ప్రజల ప్రాణాలకు భరోసాగా నిలిచాయి. గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు వైఎస్సార్ హయాంలో చేపట్టిన రక్షణ చర్యల్లో కొన్ని ప్యాకేజీలను ఆయన హఠాన్మరణం తరువాత చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసింది. వశిష్ట కుడి గట్టు నరసాపురం, వశిష్ట ఎడమగట్టు పరిధిలో 48వ కిలోమీటరు నుంచి 90వ కిలోమీటరు వరకు మూడు ప్యాకేజీలు నిలిచిపోయాయి. అప్పట్లో పనులు నిలిచిపోయిన ప్రాంతాల్లోనే తాజాగా అధికార యంత్రాంగం, స్థానికులు నిద్రాహారాలు మాని గట్లకు కాపలా కాయాల్సి వచ్చింది. రాజోలు పరిధిలోని తాటిపాక మఠం నుంచి అంతర్వేది, రాజోలు నుంచి అంతర్వేది వరకు మానేపల్లి వద్ద గోదావరి వరద ఉధృతి భయపెట్టింది. సఖినేటిపల్లి లంక, టేకిశెట్టిపాలెం, దిండి, రామరాజులంక, ఎల్ గన్నవరం, మానేపల్లి ప్రాంతాల్లో వరద భీతిగొల్పింది. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ఈ పనులను తరువాత ప్రభుత్వాలు పూర్తి చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు. ఆ నిర్ణయమే కాపాడింది.. ఈరోజు గోదావరి జిల్లాలు సురక్షితంగా బయటపడ్డాయంటే ఆ రోజు వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలే కారణం. ఆయన దూరదృష్టితో కరకట్ట పటిష్టం చేయకుంటే ఈ వరదలకు ఏం జరిగేదో ఊహించలేం. ఎప్పుడూ లేనిది జూలైలో ఇంత ఉధృతంగా రావడం ప్రమాదకరమే. 2006లో వైఎస్సార్ సీఎంగా ఉండగా ధవళేశ్వరం హెడ్వర్క్స్ ఈఈగా ఏటిగట్ల అంచనాలు రూపొందించే ప్రక్రియలో భాగస్వామి కావడం నాకెంతో సంతృప్తినిచ్చింది. – విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఎస్ఈ, జలవనరులశాఖ, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి -
TS: భద్రాచలం వద్ద తగ్గిన నీటిమట్టం.. మిగతా చోట్ల వరద ఉధృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఎగువ నుంచి గోదావరిలోకి వస్తున్న 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పుడిప్పుడే ముంపునకు గురైన కాలనీలలో సాధారణ పరిస్థితిలు కనిపిస్తున్నాయి. దీంతో శానిటేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వరదలతో సర్వం కోల్పోయిన భద్రాచలం స్థానికులు.. భరించలేని దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఒక పక్క సిబ్బంది.. మరోవైపు ప్రజలూ మాస్కులు ధరించి రంగంలోకి దిగారు. ఇంకోపక్క గోదావరి వరద లతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. భద్రాచలం, పినపాక నియోజక వర్గాల్లోని ఏడు మండలాల్లో 630కి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. వారం రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయింది పర్ణశాల సబ్స్టేషన్. సమారు 16 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా వేస్తున్నారు. అలాగే 143 గ్రామాల్లో 5,620 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. సహాయక చర్యలు.. భద్రాచలం వరదలు తగ్గుముఖం పట్టాక వేగంగా వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇతర జిల్లాలో నుంచి వచ్చి విధుల్లో చేరిన 4,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేస్తున్నారు. శిల్పినగర్, విస్తా కాంప్లెక్స్తోపాటు ఆలయ ఉత్తర ద్వారం వైపునకు వస్తున్న భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న స్లూయిస్ల ద్వారా నీరు లీకవుతోంది. దీంతో.. ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన ఐదు మోటార్లకు అదనంగా మరో 15 మోటర్లు తెప్పించించింది సింగరేణి. మొత్తం 20 మోటార్ల ద్వారా వరదనీటిని తోడి తిరిగి గోదావరిలోకి ఎత్తిపోసే ప్రక్రియ నడుస్తోంది. ఉన్నతాధికారిపై వేటు భద్రాచలం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డా. కె. రాజ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. గోదావరి వరదల సమయంలో హెడ్ క్వార్టర్లో లేకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోవడం సర్కార్ దృష్టికి వెళ్లింది. దీంతో రాజ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరదనీరు పొటెత్తింది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం 402.40 అడుగులు చేరింది. ఇన్ ఫ్లో 4వేల క్యూసెక్కులు కాగా 4 గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లోస్ 59 వేల క్యూసెక్కులుగా ఉంది. పద్దెనిమిది గేట్లెత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మొత్తం 90 టీఎంసీలకుగాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 77 టీఎంసీలు.. 1091 అడుగులకుగాను.. నీటిమట్టం 1088 అడుగులుగా ఉంది. భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం వద్ద 12.600 మీటర్ల ఎత్తులో క్రమంగా పెరుగుతూ ప్రవహిస్తోంది గోదావరి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 10,71,720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 10,71,720 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు. అన్నారం సరస్వతీ బ్యారేజ్ సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 1,46,,353 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 1,46,353 క్యూసెక్కులు గా ఉంది. సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసిలు.. ప్రస్తుత నీటి సామర్ధ్యం 0.33 టిఎంసిలుగా ఉంది. నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 29,365 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో: 4,138 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టిఎంసీ లు, ప్రస్తుత నీటి నిలువ: 173.6640 టిఎంసి లు. పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం: 532.80 అడుగులు, -
అనుమతుల ప్రకారమే పోలవరం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనుమతుల ప్రకారమే జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొత్తగా ఎత్తు పెంపు అంశం ఎక్కడిదని ప్రశ్నించారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలీన గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ‘అసలు పోలవరం ఎత్తు ఎప్పుడు పెంచారు? సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏదీ జరగదు కదా? విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ప్రకారమే పోలవరం పనులు చేస్తున్నాం. భద్రాచలం ముంపు అనేది ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే చాలాకాలం తర్వాత భారీ వరదలు వచ్చాయి. సాంకేతికంగా ఇబ్బందులొస్తే దానిని ఎలా అధిగమించాలి.. ఏ రకంగా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలి. అక్కడా.. ఇక్కడా ఉన్నది ప్రజలే. సమస్య ఎక్కడైనా ఒక్కటే. దాని పరిష్కారానికి మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా నడుచుకోవాలి. ముంపు వచ్చింది.. ఇవే కారణాలంటే ఎలా కుదురుతుంది? సమస్యపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు’ అని పువ్వాడ అజయ్కు హితవు పలికారు. హైదరాబాద్ను కలిపేస్తారా? విలీన గ్రామాలను తిరిగి కలిపేస్తామంటున్న తెలంగాణ నాయకులు ఏపీలో హైదరాబాద్ను కూడా కలిపేస్తామంటే ఒప్పుకుంటారా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ‘రాష్ట్ర విభజన వల్ల ఏపీకి హైదరాబాద్ ద్వారా రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ను ఆంధ్రాలో కలిపేసి ఉమ్మడిగా ఉంచాలని అడిగితే బాగుంటుందా? అలా అయితే చేసేయమనండి తప్పు లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ఒకటిగా ఉంచమనండి. అభ్యంతరం లేదు’ అని బొత్స వ్యాఖ్యానించారు. ఏపీలో విలీనమైన మండలాలు, అందులోని ప్రజలు తమ ప్రభుత్వ కుటుంబసభ్యులేనన్నారు. వారి పూర్తి బాధ్యత తమదేనని చెప్పారు. పువ్వాడ పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం తగదన్నారు. బాధ్యత గల ప్రభుత్వంగా.. వరదలను సమర్థంగా ఎదుర్కొన్నామని.. బాధితులకు అండగా నిలిచామన్నారు. పార్లమెంట్లో విలీన మండలాల అంశాన్ని తెలంగాణ తీసుకొస్తే.. తాము కూడా తెలుగు రాష్ట్రాలను కలిపేయాలని డిమాండ్ చేస్తామంటూ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బొత్స బదులిచ్చారు. అక్షరాస్యతలో ప్రథమ స్థానమే లక్ష్యం విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మునిసిపల్ హైస్కూల్లో నిర్మించిన తరగతి గదులను మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.33.49 కోట్ల నిధులతో 28 ప్రభుత్వ పాఠశాలల్లో 168 అదనపు తరగతి గదుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తున్నామన్నారు. అక్షరాస్యతలో ప్రథమ స్థానమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి.గౌతమ్రెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం ఎత్తుకు భద్రాచలం ముంపునకు సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలం ముంపునకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గోదావరి నదికి భారీగా వచ్చిన వరదల వల్లనే తెలంగాణ, ఆంధ్రలోని నదీ పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని లేక్వ్యూ గెస్ట్హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలోనూ గోదావరికి వచ్చిన వరదల వల్ల తెలంగాణ, ఆంధ్రల్లోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, 1986లో గోదావరి వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురయిందని అంబటి గుర్తు చేశారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని ప్రాంతాలు మునిగి పోతున్నాయని, భద్రాచలం మునగడానికి కూడా ఇదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. పూర్తిగా నిండినా నష్టం ఉండదన్న సీడబ్ల్యూపీఆర్ఎస్ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతు లు ఇచ్చిందని అంబటి గుర్తు చేశారు. ఈ ఎత్తులో రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండినా (ఎఫ్ఆర్ఎల్) నష్టం ఉండదని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) పరిశోధించి తేల్చిందని చెప్పారు. అందుకే పోలవరం నిర్మాణం వల్ల ముం పునకు గురయ్యే ఏడు మండలాలను విభజన సమ యంలో ఏపీకి కేటాయించారన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం వల్ల ముంపునకు గురయ్యే ఏడు మండలాల వారికి పునరావాసం కల్పించే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కొత్త వివాదాలు సృష్టించవద్దు ‘రెండు రాష్ట్రాల్లో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వాళ్లం. వివాదాలన్నీ సెటిల్ అయ్యాయి. ఇప్పుడు మనకేం వివాదాలు లేవు. కొత్త వివాదాలను సృష్టించుకోవద్దు’అని అంబటి సూచించారు. జల వివాదాలకు సంబంధించి సెంట్ర ల్ వాటర్ కమిటీ , కృష్ణా, గోదావరి రివర్ బోర్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. విడిపోయి కలిసుందాం అన్న మాటలకు కట్టుబడి రెండు రాష్ట్రాల ప్రతినిధులు సోదరభావంతో ఉండాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు దశలవారీగా పూర్తవుతుందని,. వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామన్నారు. భద్రాచలం ఇవ్వమంటే ఇచ్చేస్తారా? భద్రాచలం సమీపంలో ఉన్న ఏపీ పరిధిలోని ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయాలంటూ మంత్రి పువ్వాడ అడిగిన విషయాన్ని ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘ఇచ్చేయమనగానే ఇస్తారా? అలా అంటే భద్రాచలం మాదే కదా.. ఏపీకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా?’అని అంబటి ప్రశ్నించారు. వరదలపై ఈనాడు వక్రబుద్ధి గోదావరి వరదల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలోను ఈనాడు తన కుటిలబుద్ధిని వద లడం లేదని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అనూహ్యంగా జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదలను ఆరు జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు సమర్థంగా ఎదుర్కొని సహాయ కార్య క్రమాలు చేపడితే.. ఈనాడు పత్రిక.. ‘పిల్లలకు పా లు లేవు.. పెద్దలకు తిండిలేదు..’ అని దుర్మార్గంగా తప్పుడు వార్త రాసిందని చెప్పారు. దీనిపై తాను మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించింద న్నారు. అనూహ్యంగా జూలై నెలలో ఈ వరదలు వచ్చాయని చెబితే.. ప్రకృతి వైపరీత్యాలు– మన మేం చేయలేం అని వారి తప్పుడు వార్తను తాను ఒప్పుకొన్నట్లు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీరావుకు వయసొచ్చిందిగానీ బుద్ధి రాలేద న్నారు. చంద్రబాబును అర్జెంటుగా సీఎంను చేయాలని, భుజాన పెట్టుకుని వెళ్లాలనుకుంటున్న రామోజీరావు తన వక్రమార్గాన్ని వీడాలని హితవు పలికారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతిలో ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేయమని అధికారులను ఆదేశించాడు. తిత్లీ తుపాన్ను అధికారులు కంట్రోల్ చేస్తున్నారని చెప్పాడు. అలాంటి మాటలను రాయని రామోజీరావు నేను అనని మాటలను అన్నట్లు రాస్తున్నాడు..’ అని అన్నారు. -
భద్రాచలంలో వరద నష్టం.. బాధితుల కష్టం (ఫొటోలు)
-
భద్రాద్రిలో వైభవంగా ధ్వజారోహణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ధ్వజారోహణం కనుల పండువగా జరిగిం ది. నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్టాపన చేయ డమే కాక ఇతర పూజలు నిర్వహించారు. తొ లుత ప్రధానాలయం నుంచి వేద పండితు లు సమస్త లాంఛనాలతో తిరుకల్యాణ ఉత్స వమూర్తులైన శ్రీ సీతారామలక్ష్మణ స్వామి వారిని ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చే స్తూ ధ్వజస్తంభం వద్దకు తోడ్కొని వచ్చా రు. అనంతరం గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ జరిపి.. బ్రహ్మోత్సవ ర క్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆ హ్వానిం చి ఆరాధన చేశారు. అనంతరం శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రు డైన గరుత్మం తుడి పటాన్ని మంగళ వాయిద్య ఘోష మధ్య ధ్వజస్తంభంపై ఎగుర వేశారు. ఆ తర్వాత సంతానం లేనివారికి గరుడ ముద్దలను అం దజేశారు. ఈ ముద్ద తీసుకున్న వారికి సం తానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. -
శ్రీరామ నీ నామమెంతో రుచిరా..
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం భక్త రామదాసు 389వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం, చక్ర సిమెంట్స్, నేండ్రగంటి అలివేలు మంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో వివిధ నగరాల నుంచి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు రామయ్యతో పాటు భక్తరామదాసుకు నవరత్న ఘోష్టితో ‘స్వరార్చన’ జరిపారు. తొలుత రామదాసు ప్రతిమతో భద్రగిరి ప్రదక్షిణ, నగర సంకీర్తన, రామదాసుకు అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే రామదాసు జయంతి ఉత్సవాలను కరోనా ఆంక్షల నేపథ్యాన ఈసారి ఒకేరోజుకు పరిమితం చేశారు. -
ఊహించని అద్భుతం: తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్ చేద్దామనుకున్నారు..
కూనవరం (తూర్పుగోదావరి): తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్ చేద్దామంటూ ముందుకు వచ్చిన వైద్య బృందానికి ఊహించని అద్భుతం తారసపడంతో వారి ఆనందానికి అవధులు లేవు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం జరిగిన అరుదైన ఈ ఘటన ఆస్పత్రి చరిత్రలోనే లిఖించదగినదిగా పలువురు ప్రసంశిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే కూనవరం మండలం టేకులబోరు గ్రామానికి చెందిన జోడె నాగమణి నిండు గర్భిణి. వచ్చే నెల 4వ తేదీన ఆమెకు కాన్పు కావలసి ఉంది. ప్రస్తుతం బీపీకి మందులు వాడుతోంది. దానికితోడు ఆయాసం ఎక్కువైంది. నొప్పులు రావడంతో కూనవరం మండలం కోతులగుట్ట సీహెచ్సీకి వెళ్లింది. చదవండి: (అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి) అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి చాలా సీరియస్గా ఉందని గ్రహించి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేస్తూ ఆ విషయాన్ని కోతులగుట్ట సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డికి సమాచారం ఇచ్చారు. డాక్టర్ కోటిరెడ్డి ఈ విషయాన్ని చింతూరు ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణకు, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ పుల్లయ్యకు చేరవేశారు. అప్పటికే నాగమణి కోమాలోకి వెళ్లింది. భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెలో చలనం కనిపించలేదు. మృత్యువు ఒడిలోకి జారుకున్న ఆ మహిళను చూసి మదనపడుతున్న వైద్యుల వద్దకు డాక్టర్ కోటిరెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ పుల్లయ్య వెళ్లి కనీసం కడుపులో ఉన్న బిడ్డనైనా సేవ్ చేయాలని భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరిం టెండెంట్ రామకృష్ణను కోరారు. చదవండి: (ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం) గర్భిణి సోదరుడు జోడె నాగేశ్వరరావు, భర్త సత్యనారాయణకు పరిస్థితి వివరించి అంగీకరింపజేశారు. డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో గైనకాలజిస్ట్ నరసయ్య, ఎనస్తీషియన్ కిషన్, ఐసీయూ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది బృందంగా ఏర్పడి ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. అనంతరం కొద్దిసేపటికి తల్లిలో కూడా కదలికలు గమనించిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ అద్భుతం చూసిన వైద్యులు ఆమెకు వెంటనే వైద్య సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమం. ప్రస్తుతం భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోనే ఇది అరుదైన సంఘటన అని అక్కడి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ అన్నారు. వైద్యబృందం కృషిని ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణ మెచ్చుకున్నారు. -
నిరాడంబరంగా తెప్పోత్సవం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించే తెప్పోత్సవాన్ని బుధవారం నిరాడంబరంగా ఆంతరంగికంగానే జరిపించారు. స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీ సేవగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా హంసవాహనంతో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి వారిని వేంచేపు చేశారు. గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర తీర్థంతో సంప్రోక్షణ చేసిన తర్వాత ప్రత్యేక పూజలు, ఆరాధన, ఏకాంత తిరుమంజనం, నివేదన, దర్బారు సేవలను జరిపించారు. ఇక గురువారం తెల్లవారుజామున నిర్వహించే ఉత్తర ద్వార దర్శనాన్ని సైతం నిరాడంబరంగానే జరపనున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా విద్యుత్ లైట్ల అలంకరణలో భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం -
సీఎం గారూ.. రామయ్య పెళ్లికి రండి
భద్రాచలం: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల 21న జరిగే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఆలయ ఈవో బి.శివాజీ, వేదపండితులు కలిసి ఆహ్వాన పత్రిక, జ్ఞాపిక, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీలు సంతోష్కుమార్, మాలోత్ కవిత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కూడా ఆహ్వాన పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు స్థలశాయి, ఏఈవో శ్రవణ్కుమార్, సీసీ అనిల్, అర్చకులు పాల్గొన్నారు. చదవండి: ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు -
అమ్మో పులి.. జంకుతున్న జనం
తెల్లవారకముందే నిద్ర లేచే పల్లె.. ఇప్పుడు సూరీడు నడినెత్తికొచ్చినా గడప దాటట్లేదు. పొద్దుగూకే వరకు పంట చేలల్లోనే గడిపే శ్రమజీవులు.. ఇప్పుడు పెందళాడే ఇంటికి చేరుకుంటున్నారు. పులి భయం పల్లెల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఇద్దరిని పొట్టన పెట్టుకుని.. రోజుకోచోట బయటపడుతున్న పులి జాడ అలజడి రేపుతోంది. ఏ క్షణంలో ఏ మూల నుంచి పంజా విసురుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. రైతులు, రైతుకూలీలు బయటకు అడుగుపెట్టలేని పరిస్థితుల్లో చేతికందిన పత్తి పంట ఇంటికి చేరనంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని అటవీ సమీప గ్రామాల్లో పులిదెబ్బకు ప్రజలదినచర్య, రోజువారీ కార్యకలాపాలు మారిపోయాయి. గుంపులుగా వెళ్లడం, పొలంలో పనిచేసే చోట డప్పు చప్పుళ్లు చేయడం, పులి బారిన పడకుండా ‘ముఖం మాస్కు’లు ధరించడం.. ఇంకా మరెన్నో జాగ్రత్తలతో బయట అడుగుపెడుతున్నారు. ఈ పరిస్థితులపై‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్’.. చేలల్లో పత్తి విచ్చుకున్నవేళ.. రైతుల్లో ఆనందం అలముకోవాలి. కానీ, వారిలో భయాందోళన నెలకొంది.. చేతికొచ్చిన పంట ఇంటికి చేరాలి. కానీ, చేలల్లోనే రైతుల కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. అడవిలో సంచరించాల్సిన పులి చేనుచెలకల్లో తిరుగుతోంది. కనబడినవారినల్లా పొట్టనపెట్టుకుంటోంది. కూలీలు వేకువజామునే బయలుదేరి ఉదయం ఆరుగంటలకల్లా పొద్దుతో పోటీపడి పత్తి చేలల్లో కనిపించేవారు. కానీ, పులి సంచారానికి భయపడి ఉదయం 10 గంటల తర్వాతే ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. చీకటి పడిందంటే.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని అటవీ సమీప ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పులి సంచరించిన ప్రాంతాల్లో ‘సాక్షి’ పర్యటించింది. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు స్థానికులతో మాట్లాడింది. సమయం ఉదయం పది గంటలు.. ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామంలో దిగాం. ఇక్కడే నవంబర్ 11న పులి దాడి చేసి సిడాం విగ్నేష్(21)ను పొట్టనబెట్టుకుంది. గ్రామ శివారులో కూలీలు గుంపులు, గుంపులుగా దారిలో మాకు ఎదురొస్తూ కనిపించారు. ఇంకొందరి చేతుల్లో ఉన్న డప్పులు అదేపనిగా మోగుతున్నాయి. మరికొందరు ప్లాస్టిక్ డబ్బాలతో చప్పుళ్లు చేస్తున్నారు. అసలు విషయమేమిటో కనుక్కుందామని.. అక్కడే ఉన్న కనక సాంబయ్య అనే కూలీని పలకరించగా... ‘పత్తి ఏరడానికి చేన్లకు పోతున్నాం. కా>నీ, పులి ఏడ నుంచి వచ్చి మీదపడ్తదో తెల్వక హడలిపోతున్నాం. సిడాం విగ్నేష్ని పొట్టనబెట్టుకుంది. అందుకే పులిని బెదరగొట్టడానికి డప్పుచప్పుళ్లు చేసుకుంటూ పొలాలకు పోతున్నం. మామూలుగానైతే వేకువజామున పత్తిచేలకు పోతం ’అని భయాందోళనతో చెప్పాడు. అక్కడ వారితో కొద్దిసేపు ముచ్చటించి మరో ఊరికి వెళ్లగా ఒక వ్యక్తి ఓ కుక్కను వెంటబెట్టుకొని వెళ్తూ కనిపించాడు. మరిచోట కొందరు యువకులు చేను చుట్టూ కాపాలా కాస్తుండగా కూలీలు పత్తి తీస్తున్న దృశ్యాన్ని ‘సాక్షి’గమనించింది. మాస్క్తో మస్కా.. మిట్ట మధ్యాహ్నం.. సూరీడు నెత్తిమీదికొచ్చా డు. ఎండ చురుక్కుమంటోంది. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లికి ‘సాక్షి’ చేరుకుంది. నవంబర్ 29న ఈ ఊరుకు చెందిన పసుల నిర్మల పత్తి చేనులో ఉండగా పులి దాడి చేసి చంపేసింది. గ్రామానికి దూరంగా ఉన్న పత్తి చేనులో ఓ చోట గుమిగూడి పత్తి తీస్తున్న కూలీలు కనిపించా రు. కొందరి తలలకు వెనుకభాగంలో మాస్కులు కనిపించాయి. ఎందుకలా అని అడిగితే, ‘రెండుకాళ్ల జీవాల మీద పులి సాధారణంగా దాడి చేయదు. నాలుగు కాళ్ల జంతువుల మీదే ఎక్కువగా పంజా విసురుతుంది. అయితే, మేం చేలల్లో వంగి పనిచేస్తున్నప్పుడు నాలుగు కాళ్ల జంతువని భ్రమించి దాడిచేసే ప్రమాదం ఉంది. తలలకు వెనుక వైపు మాస్కు ధరించి కనిపిస్తే.. అక్కడున్నది మనిషి అనుకొని దాడి చేయదు’ అని ఓ కూలీ చెప్పాడు. పులి.. కెమెరా ‘కంట’బడేనా? మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కళ్లంపల్లిలో పత్తి చేనులో ప్లాస్టిక్ డబ్బాతో శబ్దం చేస్తూ ఓ యువకుడు కనిపించాడు. పులి జాడలను కనిపెట్టేందుకు కాటేపల్లి, ముక్కిడిగూడెం, బుడుగుఒర్రె, సుంపుటం, పాసినీళ్ల రోడ్ల వెంట ఏర్పాటు చేసిన కెమెరాలు కనిపించాయి. తాంసి(కె) శివా రు ప్రాంతాల్లో ఐదుచోట్ల అమర్చిన కెమెరాలను కనిపించాయి. ఈ పల్లె పెన్గంగా నదికి ఆనుకు ని ఉంటుంది. నదికి అవ తలి వైపు మహారాష్ట్ర భూ భాగం. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం(టైగర్ జోన్) నుంచి తరచూ ఇటువైపు పులులు వస్తున్నాయని గ్రామస్తులు భయంభయంగా చెప్పారు. నెలకు ఒకటి రెండుసార్లు పులి కన్పిస్తోందని చెప్పారు. మంచె మీద మొనగాడు మామూలుగానైతే కూలీలు కాలినడకన పొలం పనులకు వెళ్తుంటారు. కానీ, కొత్తగూడం జిల్లా గుండాల మండలం జగ్గయ్యగూడెంలో మాత్రం అందరూ కట్టకట్టుకుని ఒకే ట్రాక్టర్లో పొలం పనులకు వెళ్తుండటాన్ని ’సాక్షి‘గమనించింది. పాల్వంచ మండలం పాండురంగాపురంలో రైతులు ఊరేగింపు తీస్తున్నట్టుగా వెళ్తున్నారు. అందరి చేతుల్లోనూ కర్రలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్లగా దారిలో పెంపుడు కుక్కను వెంటపెట్టుకుని పొలం వద్దకు వెళ్తున్న ఓ రైతు కనిపించాడు. మరోచోట చేనులో మంచె మీద ఒక యువకుడు చురుకుగా అటు, ఇటు చూస్తున్నాడు. పులి రాకను గమనించి కూలీలను అప్రమత్తం చేయడానికి ఇలా మంచె మీద ఉన్నట్టు ఆ యువకుడు ‘సాక్షి’కి వివరించాడు. గుండెలో దడను కళ్లల్లో కనిపించకుండా ఎంతో దైర్యంగా ఉన్నాడతడు. అదిగో పులి.. పోదాం ఇంటికి సాయంత్రం నాలుగు గంటల వేళ.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి(కె) శివారులో కొందరు కూలీలు పత్తి చేలను వీడి అరుపులు, కేకలు వేస్తూ ఇళ్లకు వెళ్తుండటం ‘సాక్షి’కి గమనించింది. ప్రజ్వల్ అనే యుకుడిని పలకరించగా.. ‘ఒకసారి మా పశువుల మందపై పులిదాడి చేసి ఆవును చంపేసింది. అప్పటి నుంచి మందను అటవీలోకి తీసుకువెళ్లడం లేదు. పంట చేల సమీపంలోకే పశువులను మేత కోసం తీసుకెళ్తున్నాం’అని చెప్పాడు. చెబుతున్నప్పుడు అతడి కళ్లల్లో భయం స్పష్టంగా కనిపించింది. సీతాయిగూడెంలో తాజాగా.. చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతాయిగూడెం సమీపంలో గురువారం మిషన్ భగీ రథ వాటర్ ట్యాంక్ వద్ద పులి పాదముద్రలు కనిపించాయి. పులి అన్నపురెడ్డిపల్లి వెళ్లే రోడ్డు వరకు వచ్చి, తిరిగి అటవీ ప్రాంతం లోకి వెళ్లినట్లు భావిస్తున్నారు. పులుల సంఖ్య అధికం కావడం వల్లే... ఒక్కసారిగా పులుల సంచారంతో కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం అభయారణ్యాన్ని టైగర్ రిజర్వ్గా చేస్తారంటూ ఆయా జిల్లాల్లో చర్చలు జరుగుతున్నాయి. సహజంగా పులి దట్టమైన అడవి దాటి బయటకు రాదు. పులుల సంఖ్య పెరగడంతోనే అవి తమకు అనువైన ప్రాంతా న్ని వెతుక్కునేందుకు కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి, మహారాష్ట్రలో ని చంద్రపూర్, తాడోబా, ఇంద్రావతి టైగర్ రిజర్వ్ల నుంచి మం చిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల మీదుగా ఈ పులులు కిన్నెరసాని అభయారణ్యానికి వచ్చినట్లు తెలుస్తోంది. భయం గుప్పిట ఉన్న ప్రాంతాలివే ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసి(కె), గొల్లఘాట్, పిప్పల్కోఠి గ్రామాలు ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ, లోహా, కర్జి, రాంపూర్ పరిసర ప్రాంతాలు.. పెంచికల్పేట్ మండలం కొండపల్లి, గుండెపల్లి, అగర్గూడ, మెరెగూడ, లోడుపల్లి, కొండపల్లి, దరోగపల్లి, బొంబాయిగూడ పరిసర ప్రాంతాలు.. బెజ్జూర్ మండలం చిన్నసిద్దాపూర్, పెద్దసిద్దాపూర్, పాపన్నపేట, ఏటిగూడ, గబ్బాయి గ్రామాలు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముక్కిడిగూడెం, కల్లెంపల్లి, సుంపుటం, రాజారాం, నాగారం, కాటేపల్లి, నీల్వాయి సమీప అటవీ ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో అటవీ ప్రాంతాలకు ఆనుకుని వందల గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కిన్నెరసాని అభయారణ్యంలో ప్రవేశించాక మొదట గుండాల, ఆళ్లపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, మణుగూరు, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి మండలాల్లో పులి సంచారం అధికంగా ఉంది. రోజుకో చోట పులి సంచారం వెలుగుచూస్తోంది. -
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో భట్టి పర్యటన
సాక్షి, భద్రాచలం: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. బాధితులకు వైద్య సేవలు అందించే విషయంలో సీఎం కేసీఆర్ చేతులెత్తేశారని అన్నారు. సీఎల్పీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన కార్యక్రమాన్ని బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రి నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీపీఈ కిట్లు ధరించి, కరోనా నిబంధనలు పాటిస్తూ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డును పరిశీలించి, అందిస్తున్న వైద్య సేవల గురించి సూపరింటెండెంట్ చావా యుగంధర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన వారు ఉంటే ఉంటారు.. పోతే పోతారు అన్న చందంగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో తాము పలు సూచనలు చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా వైద్య పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మూడు రాష్ట్రాలకు తలమానికంగా ఉన్న భద్రాద్రి ఏరియా ఆస్పత్రిలో కనీసం 1/3 వంతు మంది సిబ్బంది కూడా లేరని అన్నారు. ఇక్కడ మొత్తం 205 మంది పని చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 61 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇదే ఆస్పత్రిలో పనిచేసే డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, అలాంటి వారికే దిక్కు లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఈ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత గురించి గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, అయినా సర్కారు పెడచెవిన పెట్టిందని విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య, ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఆ రెండు ప్రాంతాల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ!
సాక్షి, రాజమండ్రి: గోదావరికి అంతకంతకూ వరద ఉధృతి పెరుగురతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 19 లక్షల 21 వేల క్యూసెక్కులు గా ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 17.50 అడుగులకు చేరుకుంది. దీంతో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 68 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 6వేల మందిని తరలించారు. దేవీపట్నం, వీరవరం, తొయ్యేరు గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలకు సహకరించాలని గ్రామస్తులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయికి.. అదేవిధంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అక్కడ కూడా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 2014 తర్వాత మళ్లీ ఆరేళ్లకు అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. భద్రాచలం వద్ద ఇప్పటికే నీటి మట్టం 61.5 అడుగులకు చేరుకుంది. మరో అడుగు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మండలంలోని రేపాకగొమ్ము, రుద్రమ్మకోట, టేకురు, వసంతవాడ, టుకురు గొమ్ము, కోయిదా, నార్లవరం, తిర్లాపురం, చీరవల్లి, చిగురుమామిడిగూడెం సహా మొత్తం14 గ్రామాలు ముంపునకు గురికానున్నాయని అధికారులు తెలిపారు. ఈ గ్రామ ప్రజలను ఖాళీ చేయించి లాంచీలలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారి కోసం నిత్యావసరాలు, పాలు, కిరోసిన్, కూరగాయలతో సహా అధికారులు సర్వం సిద్ధం చేశారు. కోవిడ్-19 కారణంగా వైద్య శాఖ అప్రమత్తమైంది. ఎమ్మెల్యే బాలరాజు, కలెక్టర్ ఎంవీ రెడ్డి దగ్గరుండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. చదవండి: చంద్రబాబు తీరుపై బీజేపీ నేత ఆగ్రహం -
కరోనా: మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి
-
మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి
కొత్తగూడెం: భద్రాచలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) కోవిడ్ నిబంధనల మేరకు ఆయన స్వగ్రామం సున్నంవారి గూడెంలో మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు జరగనున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన ఆయన నిరాడంబరమైన జీవితం గడిపారు. అసెంబ్లీకి ఆటోలో, బస్సుల్లో వెళ్లారు. భాగ్యనగర వీధుల్లో అన్న క్యాంటీన్ల వద్ద భోజనం చేసి కడుపు నింపుకునేవారు. ఆయన విలువలకు మారు పేరు: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సున్నం రాజయ్య మృతికి సంతాపం తెలియజేశారు. 'సీపీఐ నేత, విలువలకు మారు పేరు అయిన సున్నం రాజయ్య గారి అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. గిరిపుత్రుల హక్కుల కోసం ఆయన ఎంతగానో కృషి చేసారు. అయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నాను. ఆయన కుటుంబ సభ్యలకు నా ప్రగాడ సానుభూతి' అంటూ ట్వీట్ చేశారు. ఆదర్శ నాయకుడు: మంత్రి హరీశ్రావు ‘నేను అత్యంత గౌరవించే, సున్నం రాజయ్య గారి మరణం తీవ్రదుఃఖాన్ని కలిగించింది. పేదప్రజలు,ఆదివాసీలు, గిరిజనులు,దళితుల గొంతుగా జీవితాంతం వారి సమస్యల పరిష్కారం కోసమే బతికిన అసామాన్యుడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల, రాజకీయాల పట్ల జనసామాన్యంలో విశ్వాసం కలిగించిన ఆదర్శ నాయకుడు’ అంటూ మంత్రి తన్నీరు హరీశ్రావు ట్వీట్ చేశారు. -
తేమ గాలులతో అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమ గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో అనేకచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర భారతం నుంచి చలి గాలులు ఇంకా మొదలు కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో రామగుండంలో సాధారణం కంటే 5.7 డిగ్రీలు ఎక్కువగా 20.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్లో సాధారణం కంటే 5.3 డిగ్రీలు ఎక్కువగా 19.4 డిగ్రీలు, హైదరాబాద్లో 4 డిగ్రీలు అధికంగా 19.2 డిగ్రీలు, మెదక్లోనూ 4 డిగ్రీలు అధికంగా 17.8 డిగ్రీలు, భద్రాచలంలో 3.1 డిగ్రీలు ఎక్కువగా 20.5 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుంటే ఖమ్మంలో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.1 డిగ్రీలు అధికంగా 31.6 డిగ్రీలు రికార్డయింది. ఆదిలాబాద్లో రాత్రి ఉష్ణోగ్రత 19.2 డిగ్రీలు కాగా, పగటి ఉష్ణోగ్రత 33.3 డిగ్రీలుగా నమోదైంది. కాగా, రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. -
గోదారే.. సాగరమైనట్టు
గలగల సవ్వడితో.. ఎంతో నిర్మలంగా ప్రవహించే పావన గోదావరి.. వరుణుడు తోడవడంతో.. ప్రళయ స్వరూపిణిగా రూపుదాల్చింది. మార్గం మధ్యలో ఉన్న ఉప నదులను, వాగులను కలుపుకొని, శక్తిని పెంచుకొని.. నడకలే పరుగులై.. పరుగులే ఉరకలై.. వడి పెంచి.. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకూ ఒరుసుకుంటూ పారుతూ.. తీరంలోని పల్లెలను, తనలోని లంకలను చుట్టుముట్టి.. ముంచెత్తుతూ.. సాగర సంగమం దిశగా ఉధృత వేగంతో పరుగులు తీస్తోంది. వారం రోజులుగా గోదావరికి పోటెత్తుతున్న వరద ఆదివారం మరింత ఉధృతమైంది. దీంతో ఎగువన విలీన మండలాలు మొదలు, దేవీపట్నం, కోనసీమలోని లంక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. వరద బాధితులను ఆదుకొనేందుకు ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం) : నాలుగైదు రోజులుగా ఉగ్రరూపమెత్తిన గోదావరి ఆదివారం ప్రళయస్వరూపిణిగా మారింది. ఎగువన స్వల్పంగా తగ్గుతున్న గోదావరి వరద దిగువన కోనసీమ లంక గ్రామాలను చుట్టుముట్టింది. అక్కడ నిలకడగా ఉండగా ఇక్కడ ఉగ్రరూపం దాల్చింది. గడచిన 24 గంటల్లో ఏజెన్సీలో వరద అడుగు మేర తగ్గగా, కోనసీమలో రెండు మూడడుగులు పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 14.20 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. బ్యారేజి నుంచి 13,50,363 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తెలంగాణలోని దుమ్ముగుడెం, భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పడుతూండడంతో సోమవారం ఉదయం రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి వరద ఏజెన్సీలో నిలకడగా ఉంది. అయితే కాఫర్ డ్యామ్ కారణంగా వరద నీరు తీయడానికి మరింత సమయం పట్టనుంది. దీంతో దేవీపట్నం మండలంలోని గ్రామాలు మరో రెండు మూడు రోజులు ముంపులోనే ఉండే అవకాశముంది. ఈ మండలానికి చెందిన సుమారు 3,800 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఐదు వేల మందికి పైగా భోజనాలు చేస్తున్నారు. గండిపోచమ్మ అమ్మవారు ఇంకా ముంపునీటిలోనే ఉన్నారు. లంకలను ముంచెత్తుతూ.. ఏజెన్సీలో వరద తగ్గుతూండగా కోనసీమలో దీని ప్రభావం పెరుగుతోంది. గంటగంటకూ గోదావరి నీటిమట్టం పెరగడంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకువస్తోంది. పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి నది మధ్య ఉన్న గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మామిడికుదురు, ముక్తేశ్వరం, కనకాయలంక, గంటిపెదపూడి కాజ్వేలు మునిగిపోవడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్వేల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పడవల ద్వారా లంక వాసులను, రైతులను, వ్యవసాయ ఉత్పత్తులను అధికారులు దాటిస్తున్నారు. ముందస్తుగా సహాయ పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అయితే వరద తగ్గుతున్న సూచనలు ఉండడంతో వీటి అవసరం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. వరద ప్రభావిత గ్రామాలకు ఇప్పటికే నిత్యావసర వస్తువులను చేరవేసిన అధికారులు.. వాటిని స్థానికులకు అందజేస్తున్నారు. వరద తీవ్రతకు గోదావరి నదీ కోత ఉధృతమవుతోంది. ముఖ్యంగా ముమ్మిడివరం మండలం కమిని, సలాదివారిపాలెం, లంకాఫ్ ఠాణేలంక, కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, కొండుకుదురులంక, పి.గన్నవరం మండలం గంటి పెదపూడి వంటిచోట్ల నదీ కోత ఎక్కువగా ఉంది. 10,354 ఎకరాల్లో నీట మునిగిన వరి జిల్లాలోని సుమారు 10,354 ఎకరాల్లో వరి చేలు నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా అంతకంటే అధికంగానే చేలు ముంపులో ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం రామరాజులంక వంటి ప్రాంతాల్లో వరిసాగు చేస్తూంటారు. వీటితో పాటు డెల్టాలో చేలు సహితం ముంపు బారిన పడ్డాయి. గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండడంతో తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని ప్రధాన డ్రెయిన్ల నుంచి ముంపు నీరు దిగడం లేదు. పైగా రెండు రోజుల నుంచి నదుల నుంచి వస్తున్న నీరు డ్రెయిన్ల ద్వారా చేలల్లోకి చొచ్చుకువస్తోంది. దీనివల్ల ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, తూర్పు డెల్టాలోని రామచంద్రపురం, కరప, కాకినాడ సబ్ డివిజన్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో వరిచేలు ముంపు బారిన పడ్డాయి. ఈ ప్రాంతాల్లోని తుల్యభాగ, బండారులంక కౌశిక, గొరగనమూడి, ఓల్డ్ అయినాపురం, నార్త్ అడ్డాల్. పెరుమళ్లరాజుకోడు, గొంది నోవా, శంకరగుప్తం, వేపచెట్టు, అంతర్వేది రాళ్ల కాలువల నుంచి కూడా ముంపు నీరు నదుల్లోకి దిగడం లేదు. దీనికితోడు ఆదివారం వరద ఉధృతి పెరగడంతో ముంపు మరింత పెరిగింది. పరిస్థితి చూస్తే మరో రెండు మూడు రోజులు చేలు ముంపులోనే ఉండనున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే చేలు కుళ్లిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోపక్క వరదల వల్ల సుమారు 2,061 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపు బారిన పడ్డాయి. లంక గ్రామాల్లోని అరటి, తమలపాకు, కూరగాయల పంటలకు సహితం ముప్పు వాటిల్లనుంది. ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి పర్యటించారు. కోనసీమలోని మలికిపురం, అల్లవరం మండలాల్లో ముంపు తీవ్రతను పరిశీలించిన ఆయన స్థానిక అధికారులతో వరద పరిస్థితిపై సమీక్ష జరిపారు. -
భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం
-
ఇకపై ఇసుక ఉచితమే..
సాక్షి, భద్రాచలంటౌన్: పట్టణంలో ఇళ్లు నిర్మించుకునే వారు ఇక నుంచి ఇసుకను ఉచితంగా తెచ్చుకోవచ్చని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భద్రాచలంలో ఇసుక అక్రమ రవాణా ఎక్కువైందని, ఇళ్లు నిర్మించుకునే వారు ట్రాక్టర్కూ రూ. 3వేల నుంచి 4వేల వరకు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయంపై పట్టణ ప్రజలు తనను సంప్రదించడంతో ఈ విషయాన్ని కలెక్టర్ రజత్కుమార్ శైనీతో చర్చించినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన కలెక్టర్ పట్టణ వాసుల వరకు ఇసుకను తెచ్చుకొనే విధంగా హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు రెవిన్యూ శాఖలకు ఆదేశాలు త్వరలోనే జారీ చేయనున్నట్లు వివరించారు. భద్రాచలం పట్టణం దాటి ఇసుక రవాణా జరిగినట్లయితే పీడీ యాక్టు నమోదు చేయిస్తామని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు, మాజీ గ్రంథాలయం చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి, సరేళ్ల నరేష్, హనుమంతు, డేగల నాగేశ్వరరావు, దుద్దుకూరి సాయిబాబు, కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
రామయ్యకు పట్టాభిషేకం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం కనుల పండువగా జరిగింది. రామాలయం సమీపంలోని మిథిలా స్టేడియంలో గల శిల్ప కళాశోభితమైన కల్యాణ మండపంలో మంగళవారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ఈ వేడుక చూసిన భక్తులు పులకించిపోయారు. రామాలయ ప్రాంగణంలోని యాగశాలలో ఉదయం చుతాస్థానార్చన హోమం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారిని సుందరంగా అలంకరించిన పల్లకీలో ఆలయం నుంచి గిరి ప్రదక్షిణగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. స్వామి, అమ్మవార్లను కల్యాణ మండపంపై వేంచేయింపజేసి, ముందుగా విష్వక్సేన పూజ చేశారు. అనంతరం శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో పట్టాభిషేక మహోత్సవ క్రతువును నిర్వహించారు. వేడుకలో వినియోగించే ద్రవ్యాలకు దేవస్థానం అర్చకులు పుణ్యాహవచనం గావించారు. ఆ తర్వాత కలశాలలో పోసిన చతుస్సముద్రాలు, పంచ నదుల తీర్థ జలాలకు ప్రోక్షణ చేసి భక్తులతో పాటు ప్రాంగణంలోని నలు దిక్కులా చల్లారు. అభిషేకానికి వీలుగా కలశ స్థాపన చేశారు. రామదాసు కాలం నాటి ఆభరణాలైన బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, క్షత్రం సమర్పించి, కిరీట ధారణ చేశారు. తర్వాత ప్రధాన కలశంతో ప్రోక్షణ చేసి రామయ్యను పట్టాభిషిక్తుడిని చేశారు. భద్రాచలంలో జరిగే ఈ వేడుక విశిష్టతను వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు భక్తులకు వివరించారు. రాముడన్నా.. నారాయణుడన్నా ఒక్కరే పూజల వివాదంపై చినజీయర్ స్వామి శ్రీరాముడి పాలనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు భద్రాచలంలో నిర్వహించే పూజలపై కొంతమంది వివాదం చేయటం తగదని చినజీయర్ స్వామి అన్నారు. మంగళవారం భద్రాచలంలో శ్రీసీతారాముల వారికి నిర్వహించిన పట్టాభిషేక వేడుకలో పాల్గొన్న ఆయన.. భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. శ్రీరాముడు లోకకల్యాణం కోసం చేసిన త్యాగం గురించి వర్ణించారు. రాముడన్నా.. నారాయణుడన్నా ఒక్కరేనని, అనాదిగా వస్తున్న నియమాలను అనుసరించటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. భద్రాచలంలో కొంతమంది ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేయటం తగదన్నారు. ఏ నియమాన్ని ఏర్పరుచుకున్నామో, దాన్నే అనుసరించాలని, ఈ విషయంలో గందరగోళం సృష్టించవద్దని సూచించారు. ఇలాంటి నియమాల ప్రకారమే భద్రాచలంలో పూజలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. నియమాల పరిరక్షణకు భక్తరామదాసు వారసులమై స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. ఇదే విషయాన్ని భక్తులందరితోనూ చెప్పించారు. ఆలయ వ్యవస్థకు మూలమైన రామానుజుల వారు కూడా ఇదే చెప్పారని జీయర్ గుర్తు చేశారు. శ్రీరాముడి పాలన నేటి తరాలకు ఆదర్శం కావాలని ఆయన చెప్పారు. రాముడు అవతరించిన విళంబి నామ సంవత్సరంలో ఈ ఏడాది పట్టాభిషేకం నిర్వహించడం ఎంతో విశేషమన్నారు. -
భద్రాచలం ఏరియా ఆసుపత్రికి మావోయిస్టు మృతదేహాలు
-
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్
-
వేస్ట్ టు క్రాఫ్ట్..
భద్రాచలంటౌన్ : పర్యావరణానికి ప్రమాదకారిగా మారిన వ్యర్థాలతో స్థానిక క్రాంతి విద్యాలయం విద్యార్థులు ‘వేస్ట్ టూ క్రాఫ్ట్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం పాఠశాలలో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమలోని సృజనాత్మకతతో వ్యర్థాలతో అందమైన వస్తువులను తయారు చేశారు. ఖాళీ కప్పులతో తయారు చేసిన టవర్, గిఫ్ట్ పేపర్స్తో చేసిన రోజాపూలు, అట్టముక్కలతో తయారు చేసిన నగలపెట్టె, చిత్తు కాగితాలతో చేసిన ఇంటి నమూనా, వాల్ హ్యంగ్స్, వివిధ రకాల వస్తువులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సమతా శ్రీనివాస్, హెచ్ఎం అనురాధలు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యం వెలికి తీసేందుకు 5ఏళ్లుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండే విధంగా వారిని తీర్చిదిద్ధటమే లక్ష్యంగా సాగుతున్నాట్లు వారు పేర్కొన్నారు. -
భద్రాచలంలో కార్డన్ సెర్చ్
భద్రాచలం: భద్రాచలంలోని అశోక్నగర్ కాలనీలో పోలీసులు సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ అశోక్కుమార్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, సుమారు 50మంది సిబ్బంది కాలనీని చుట్టుముట్టి ప్రతీ ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 50 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రామయ్యా... ప్రసాదమేదయ్యా?!
భద్రాచలం : అది, భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. సెలవు రోజవడంతో భక్తులు పెద్ద సంఖ్యలోనే వచ్చారు. రామయ్య దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులకు అర్చకులు ప్రసాదం ఇవ్వలేదు! ఎందుకు ఇవ్వలేదో వెంటనే అర్థమవలేదు. కొన్ని నిముషాల తరువాత...‘‘ప్రసాదం అయిపోయింది. కొద్దిసేపు ఆగితే వస్తుంది’’ అని అక్కడి అర్చకులు చెప్పారు. కొద్దిసేపు కాదు.. దాదాపుగా పావుగంట తరువాత తీరిగ్గా ప్రసాదాన్ని తీసుకొచ్చి పంపిణీ చేశారు. అంతసేపు క్యూలైన్లో నిలబడలేక వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, చిన్న పిల్లలు ఇబ్బందిపడ్డారు. ప్రసాదం కోసం భక్తులను ఇలా క్యూలైన్లో ఇంతసేపు నిలబెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ కొన్నిసార్లు ఇలాగే జరిగింది. ‘ఆలయంలో పాలన గాడి తప్పిందనడానికి, పర్యవేక్షణ కొరవడిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?’– ఈ ఆలయంలోని ఇటీవలి పరిణామాలు తెలిసిన (క్యూ లైన్లోని) ఒకరిద్దరు భక్తుల వ్యాఖ్యానమిది. దేవస్థానానికి పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారి(ఈఓ) లేకపోవడంతో ఆలయ పాలన గాడి తప్పిందని భక్తులు బాహాటంగానే అంటున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం గర్భగుడి నుంచి బయటకు వచ్చే భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఆదివారం ప్రసాదం అందుబాటులో లేకపోవటంతో భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. ప్రసాదం అయిపోయిందనే విషయాన్ని అర్చకుడు చెబుదామంటే.. దగ్గరలో ఆలయ ఉద్యోగులెవ్వరూ లేరు. ప్రసాదాల తయారీశాలలోని సిబ్బందికి చెప్పిన తరువాత పావు గంటకు ప్రసాదాన్ని తీసుకొచ్చారు. ఆ తరువాత దానిని భక్తులకు పంపిణీ చేశారు. ప్రసాదాల పంపిణీ కౌంటర్ వద్ద భక్తులకు అందజేసే ప్రసాదం సరిపడా ఉందా లేదా, అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రసాదం అయిపోతుందని ముందుగానే గుర్తించి, భక్తులకు అసౌకర్యం కలగకుండా సిద్ధం చేయాలి. ఆలయంలో పర్యవేక్షణ లేకపోవటంతో అంతా గందరగోళంగా తయారవుతోంది.ఇటీవలి పరిణమాలతోనైనా దేవస్థానం అధికారులు కళ్లు తెరవకపోవటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో జరిగే విషయాలను మీడియాకు చెప్పవద్దని ఉద్యోగులతో ప్రమాణాలు చేయించి, మరో అపఖ్యాతి మూటగట్టుకున్న ఆలయ అధికారులు.. తమ లోపాలను సరిచేసేందుకు మాత్రం శ్రద్ధ చూపడం లేదని భక్తులు విమర్శిస్తున్నారు. -
విద్య, వైద్యమే కీలకం
వ్యాధుల నివారణకు ప్రణాళిక పీహెచ్సీ స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు కార్పొరేట్కు ధీటుగా ఆశ్రమాల్లో విద్య ‘సాక్షి’తో ఐటీడీఏ పీఓ రాజీవ్ భద్రాచలం : ఏజెన్సీలో విద్య, వైద్య రంగాలే కీలకమని, వీటిలో పురోగతి సాధిస్తేనే గిరిజనులందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏజెన్సీ పరిధిలో 658 గ్రామాలను మలేరియా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి దోమల నివారణకు అల్ఫా సైఫర్ మిథిన్(ఏసీఎం) స్ప్రే చేయించామని తెలిపారు. మరో 3 వందల గ్రామాల్లో ఈ నెల 19 నుంచి రెండో విడత దోమల మందు పిచికారీ చేయిస్తామన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ర్యాఫిడ్ ఫీవర్ సర్వే పకడ్బంధీగా అమలు చేస్తున్నామన్నారు. పీహెచ్సీ స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ప్రత్యేక వైద్య నిపుణులతో శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మందుల కొరత లేదని, త్వరలోనే దోమ తెరలను కూడా తెప్పిస్తామని చెప్పారు. ప్రతి పీహెచ్సీలో ఒక వైద్యుడు తప్పని సరిగా అందుబాటులో ఉండేలా సర్దుబాటు చేశామన్నారు. 28 ఆర్బీఎస్కే టీమ్లను వైద్య శిబిరాల నిర్వహణకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. విద్యపై దృష్టి ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. 26 వేల మంది విద్యార్థులకు తొలిసారిగా టై, ఐడీ కార్డు, బెల్టు అందజేస్తామన్నారు. ఇప్పటికే పాదరక్షలు పంపిణీ చేశామన్నారు. ఆశ్రమాలు, వసతి గృహాలకు గ్యాస్ స్టౌలు, సిలిండర్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, రెండు వారాల్లోగా వీటిని పంపిణీ చేస్తామన్నారు. వాట్సాప్తో సమగ్ర సమాచారం వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, మెనూ అమలుపై ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలిపారు. తాను స్వయంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై నేరుగా ఏడీఎంహెచ్ఓకు సమాచారం ఇచ్చేలా మరో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశామన్నారు. హరితమిత్ర అవార్డు స్ఫూర్తితో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఐటీడీఏకు అవార్డు లభించడం గర్వంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది 35 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గరిమెళ్లపాడు నర్సరీలో పూలు, పండ్ల మొక్కలు పెంచి వచ్చే ఏడాది పంపిణీ చేస్తామని తెలిపారు. -
భద్రాదిలో ప్రధాని సోదరుడు
భద్రాచలం(ఖమ్మం): భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామి వారిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు సోమాభాయి ఆనంద్ మోదీ బుధవారం దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇక్కడికి చేరుకున్న ఆయన ఎటువంటి హంగూఆర్భాటం లేకుండా తోటి మిత్రులతో కలసి అంతరాలయంలో ఉన్న స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ సోదరుడు అని తెలియటంతో ఆలయ మర్యాదలు ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు ప్రయత్నించగా, ఆయన వాటిని తిరస్కరించారు. సామాన్య భక్తుడి మాదిరే దర్శనం చేసుకున్నారు. ఎటువంటి ప్రొటోకాల్, బందోబస్తు లేకుండానే ఆయన భద్రాచలం పర్యటనకు రావటం గమనార్హం. -
టెంపుల్ సిటీగా భద్రాచలం
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం: సీఎం కేసీఆర్ గోదావరి ఒడ్డున ప్రధాన ఆలయాలన్నీ అభివృద్ధి చేస్తాం ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: భద్రాచలం ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదేశించారు. భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని, విశాలమైన ఉద్యానవనాలు, అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజీలు నిర్మించాలని చెప్పారు. ఆలయ గర్భగుడిని యథాతథంగా ఉంచుతూనే భక్తుల సౌకర్యం కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రాచలం రాములవారి ఆలయ అభివృద్ధిపై బుధవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, స్థపతి వల్లి నాయగం, దేవాదాయ శాఖ సీఈ కె.వెంకటేశ్వర్లు, ఆలయ నిర్మాణ రూపకర్తలు ఆనంద్సాయి, రవి, మధుసూదన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి తదితరులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆలయం ప్రస్తుత స్థితి, కల్యాణ మండపం, మాడ వీధులు, ప్రాకారం, పరిసర ప్రాంతాలపై అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం వారికి పలు సూచనలు చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి ఒడ్డున ఉన్న ప్రముఖ ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ప్రముఖ యాత్రా స్థలాలుగా పేరున్న ఈ దేవాలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ముఖ్యమైన ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువుగా కల్యాణ మంటపం, ఇతర ప్రాంగణాలను సిద్ధం చేయాలని సూచించారు. గోదావరి ఒడ్డున నిర్మించిన కరకట్ట, దేవాలయం మధ్య ఉన్న ప్రాంతాన్నంతటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న ప్రాకారం సరిపోతుందా, లేక మరోటి నిర్మించాలా అన్న అంశంపైనా అధ్యయనం చేయాలని ఆదేశించారు. దేవాలయం చుట్టూ ఉన్న రహదారులను మాడ వీధులుగా తీర్చిదిద్దే అంశాన్ని పరిశీలించాలన్నారు. మహాలక్ష్మి, ఆండాళ్ అమ్మవార్ల దేవాలయాన్ని, పర్ణశాల, చిత్రకూట మంటపం, జటాయువు మంటపం తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. స్థపతి, ఆలయ నిర్మాణ రూపకర్తలు, ఆగమ శాస్త్ర పండితులు కలసి పనిచేసి చినజీయర్ స్వామి సూచనలతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. శ్రీరామనవమి ఉత్సవాల తరువాత తాను భద్రాచలం వెళ్లి అక్కడ చేయాల్సిన మార్పులు, చేర్పులపై క్షేత్రస్థాయి పరిశీలన జరపనున్నట్లు చెప్పారు. -
భద్రాచలంలో ముగిసిన పోలింగ్
హైదరాబాద్: తెలంగాణ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో పోలింగ్ వంద శాతం నమోదైంది. మొత్తం 59 మంది ఓటర్లు తమ ఎటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 38 మహిళా ఓటర్లు ఉండగా, 21 మంది పురుష ఓటర్లు ఉన్నారు. పాల్వంచలో 11 గంటల సమయానికి 68 శాతం పోలింగ్ నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ లో 88 శాతం పోలింగ్ నమోదైంది. 212 ఓట్లకు ఇప్పటి వరకు 183 ఓట్లు పోలయ్యాయి. మహబూబ్ నగర్ డివిజన్ లో 12 గంటల వరకు 78 శాతం పోలింగ్ నమోదైంది. తమ ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా రాజకీయ పార్టీలు క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడి నుండి నేరుగా బస్సుల ద్వారా మూకుమ్మడిగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తరలిస్తున్నాయి. -
భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
-
భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారు ఆదివారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో హంసవాహనంపై విహరించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారిని ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా గోదావరి నదీ తీరానికి తీసుకువచ్చారు. నదిలో హంసవాహనంపై స్వామి వారిని ఉంచి ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. హంసవాహనుడైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారు బాణసంచా వెలుగుల నడుమ గోదావరిలో ఐదుసార్లు తిరిగారు. స్వామివారు హంస వాహనంపై విహరిస్తున్నంత సేపు గోదావరి తీరాన భక్తులు శ్రీరామ నామ జయ జయ ధ్వానాలు చేశారు. కాగా, గతేడాది కన్నా భక్తులు ఈసారి బాగా తగ్గారు. గోదావరి నదిలో తగినంత స్థాయిలో నీరు లేకపోవటంతో హంసవాహనం(లాంచీ) తిరగడానికి కొంత ఇబ్బంది కలిగింది. ఒక చోట ఇసుకలో కూరుకుపోగా, కర్రలతో నెట్టాల్సి వచ్చింది. సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారు భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే జరిగే ఈ అరుదైన వేడుకను తిలకించేందుకు భ క్తులు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. - భద్రాచలం -
'వాళ్లవి పసలేని విమర్శలు'
భద్రాచలం(ఖమ్మం): రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పసలేనివని తెలంగాణ రహదారులు, పర్యాటక శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిప్పికొట్టారు. ఆయన శనివారం ఖమ్మం జిల్లా భద్రాచలంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల తదితర పథకాలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన తాజా మార్పులతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన చెప్పారు. గతంలో పాలకులు స్వప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన తాజా మార్పులపై కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్నదంతా విషపూరిత ప్రచారమని విమర్శించారు. -
భక్తుల సేవల్లో నాలుగో సింహం..
పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అయినా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కర స్నానాలు పూర్తి చేసుకుని, గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఇందులో పోలీసులది కీలకపాత్ర. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం, పుష్కర ఘాట్ల వద్ద ఇబ్బందులు కలగకుండా రక్షకభటులు అనుక్షణం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తిస్తుండడంతో భక్తులు సాఫీగా పుష్కర యూత్ర పూర్తి చేసుకుంటున్నారు. పుష్కర ఘాట్ల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల అభిప్రాయూలు.. నాడు విద్యార్థిగా.. డిగ్రీ ఫస్టియర్లో కాళేశ్వరంలో పుష్కరాలకు ఎన్సీసీ వలంటీర్గా సేవలందించాను. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఎస్సైగా పనిచేస్తున్నాను. భద్రాచలంలో ఎస్సైగా పుష్కర విధుల్లో పాల్గొంటున్నాను. భక్తులకు దారి చూపడం సంతృప్తికరంగా ఉంది. - ఎం శ్రీనివాస్, ఎస్సై, భద్రాచలం కష్టంగా ఉన్నా.. జనగామలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. పుష్కర విధులు నిర్వహించడం ఎంతో కష్టంగా ఉంది. అరుునా.. పుష్కరాల్లో సేవలందించే భాగ్యం దక్కినందుకు సంతోషంగా ఉంది. పుష్కరాలకు వస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. -లావణ్య, కానిస్టేబుల్, మంగపేట పుష్కరఘాట్ కునుకు లేకుండా.. పుష్కరాలకు లక్షలాది మంది వస్తున్నారు. ట్రాఫిక్ను నియంత్రించడంలో తీవ్ర ఒత్తిడి కలుగుతోంది. శని, ఆదివారాల్లో అరుుతే కంటిమీద కునుకు లేకుండా పనిచేశాం. ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా పుష్కరాలు సజావుగా సాగేలా చూస్తున్నాం. -కిశోర్కుమార్, సీఐ ఏటూరు నాగారం ఆనందంగా ఉంది పుష్కరాల్లో సేవ చేసే భాగ్యం దక్కినందుకు ఆనందంగా ఉంది. పుష్క ర స్నానాలకు రోజూ లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేం విధులు నిర్వహిస్తున్నాం. - నాగమణి, కానిస్టేబుల్, ఎస్సారెస్పీ పుష్కరఘాట్ -
రామయ్యా.. లడ్డూ దక్కదేమయ్యా..!
భద్రాచలం : గోదావరి పుష్కర స్నానం చేసేందుకు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వచ్చిన భక్తులకు రాముడి ప్రసాదం కరువైంది. రాములోరి దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదాల కోసం ఆలయం చుట్టూ తిరిగినా విక్రయశాలలు కన్పించడం లేదు. తానీషా కల్యాణ మండపం వద్ద ఒకే ఒక్క కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మంగళవారం లడ్డూల కోసం తోపులాట జరిగింది. పుష్కరాల 12 రోజుల్లో భద్రాచలాన్ని 50లక్షల మంది భక్తులు సందర్శిస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ భక్తులు పోగవుతున్నారనే కారణంతో పోలీసుల ఒత్తిడితో ఎనిమిది లడ్డూ కౌంటర్లను ఎత్తేశారు. ఆర్జిత సేవలు నిలిపివే యడం, లడ్డూలు అమ్ముకోనివ్వకపోవడంతో ఆదాయం బాగా తగ్గుతోంది. -
గత పుష్కర రికార్డు బద్దలైంది..
భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి మహాపుష్కరాల సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఎనిమిది రోజుల్లో పుణ్యస్నానమాచరించిన భక్తుల సంఖ్య 30.18 లక్షలకు చేరింది. 2003 పుష్కరాలకు హాజరైన భక్తుల సంఖ్య(30లక్షలు)ను వారంలోనే దాటేసింది. ఇప్పటివరకు భద్రాచలంలో పుణ్యస్నానమాచరించిన భక్తుల సంఖ్య 22 లక్షలకు చేరింది. శని, ఆది, సోమవారాల్లో 13 లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు చేయడం గమనార్హం. మిగతా ఏడు ఘాట్లకు భక్తుల తాకిడి ఉంది. మిగిలిన నాలుగు రోజుల్లో 20 లక్షల మంది వరకు భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. మంగళవారం 4.62 లక్షల మంది పుష్కరస్నానమాచరిస్తే భద్రాచలంలోనే 2.5 లక్షలకుపైగా పుణ్యస్నానం చేశారు. మధ్యాహ్నం నుంచి రామయ్య ఆలయంలో ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. డీజీపీ అనురాగ్శర్మ, ఇంటిలిజెన్స్ ఐజీ శివధర్రెడ్డి, ఐజీ నవీన్చంద్ పర్ణశాలలో పర్యటించారు. కరీంనగర్ 11.32 లక్షలు జిల్లాలో సోమవారం 11.32 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. కాళేశ్వరంలో 4.25 లక్షల మంది, ధర్మపురిలో 3.75 లక్షల మంది, మంథని, కోటిలింగాల ఘాట్ల వద్ద 90 వేల మంది చొప్పున భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. గోదావరిఖనిలో పుష్కర స్నానానికి వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా ఇందారం గ్రామానికి చెందిన సుంకె ప్రసాద్ (26) అనే యువకుడు గల్లంతయ్యాడు. ధర్మపురిలో జనసందోహం కాస్త తగ్గింది. గంటలోపే లక్ష్మీనరసింహస్వామి దర్శనం లభించింది. నిజామాబాద్ 6.96 లక్షలు నిజామాబాద్ జిల్లాలోనూ భక్తుల రద్దీ తగ్గింది. అరుుతే హైదరాబాద్-నిజామాబాద్ రహదారి వెంట భక్తుల సందడి కన్పించింది. జిల్లాలో సోమవారం 6.96 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. కందకుర్తిలో 2.18 లక్షలు, పోచంపాడ్ ఘాట్ వద్ద 2.08 లక్షలు, తడపాకల్ ఘాట్ వద్ద 98 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఆదిలాబాద్ 6.19 లక్షలు ఆదిలాబాద్ జిల్లాలో పుష్కర భక్తుల సందడి కాస్త తగ్గింది. జిల్లాలో సోమవారం 6.19 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. బాసర క్షేత్రంలోని ఘాట్ వద్ద 1.5 లక్షల మంది, సోన్ వద్ద 1.4 లక్షల మంది, మంచిర్యాలలో 76 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. అనంతరం ఆలయూల్లో పూజలు చేశారు. 2 గంటల్లో బాసర సరస్వతి అమ్మవారి దర్శనం లభించింది. -
రామయ్యా.. నీ దర్శన భాగ్యమేది..
భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి పుష్కరాలకు ఖమ్మం జిల్లా భద్రాచలానికి భక్త జనం పోటెత్తుతున్నారు. పుష్కర స్నానం అనంతరం శ్రీసీతారాముల వారి దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కానీ ఆలయ అధికారులు, పోలీసులు పెడుతున్న ఆంక్షలతో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగడం లేదు. ఆర్జిత సేవల కోసం ఆన్లైన్లో టెక్కెట్లు తీసుకున్న భక్తులకు నిరాశే ఎదురవుతోంది. పుష్కరాల్లో మొదటి మూడు రోజలు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినప్పటికీ శనివారం నుంచి సీన్ రివర్స్ అయ్యింది. పుష్కర స్నానం అనంతరం స్వామివారిని దర్శించుకోకుండానే భక్తులు వెనుదిరుగుతున్నారు. కాగా శనివారం నుంచి టిక్కెట్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో కల్యాణోత్సవం మినహా, భక్తుల పేరిట ఆర్జిత సేవలన్నీ నిలిచిపోయాయి. ఫలితంగా దేవస్థానానికి ఆదాయం బాగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ విషయాన్ని దేవస్థానం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటకీ, గోదావరి పుష్కరాలు పూర్తయ్యేంత వరకూ టిక్కెట్ల విక్రయాలు చేపట్టడానికి వీల్లేదని తెగేసి చెబుతున్నారు. -
పుష్కరాల్లో సాధువులకు ప్రత్యేక ఘాట్
భద్రాచలం : గోదావరి పుష్కరాలకు వచ్చే దిగంబర సాధువుల కోసం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలోని మోతే పుష్కర ఘాట్ను ప్రత్యేకంగా కేటాయించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. శనివారం ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఐటీడీఐ కార్యాలయంలో పుష్కర పనులపై సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, తాటి వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ ఇలంబరితి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జూన్ 15 నాటికి పుష్కరాలకు సంబంధించిన పనులన్నీ పూర్తి కావాలని మంత్రి ఇందకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. సమన్వయంతో అందరూ కలసి పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలసి పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను పరిశీలించారు. -
భద్రాద్రి రామయ్యకు కేసీఆర్ పట్టువస్త్రాలు
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీరామనామ స్మరణతో మార్మోగిపోతుంది. ఎటు చూసినా భక్తజనమే దర్శనమిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న రాములోరి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణ వేడుక శనివారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైంది. అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారు సీతమ్మ మెడలో మాంగల్యధారణ చేస్తారు. ఈ కమనీయ ఘట్టాన్ని భక్తులు కూర్చొని తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా భద్రాద్రి చేరుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన రాములువారికి అందచేశారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు నవమి వేడుకల్లో పాల్గొన్నారు. -
రామయ్య పెళ్లికి గోటి తలంబ్రాలు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఈ నెల 28న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి గోటితో వలిచిన తలంబ్రాలు తీసుకురానున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలోని కోరుకొండకు చెందిన కల్యాణం అప్పారావు తెలిపారు. దీనిలో భాగంగా మూడు కలశాల తలంబ్రాలను ఆలయ అధికారులకు శనివారం అందజేశారు. కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో స్వయంగా గోటితో ధాన్యం గింజలను ఒలిచి కోటి తలంబ్రాలను సిద్ధం చేశామన్నారు. సంఘం వారు తీసుకొచ్చిన మూడు కలశాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో శ్రావణ్కుమార్, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఆలయ పర్యవేక్షకులు నర్సింహారాజు, వెంకటప్పయ్య, పీఆర్వో సాయిబాబా, ప్రసాదవధాని పాల్గొన్నారు. -
హోరెత్తిన రోడ్ షో..
కదం తొక్కిన వైఎస్సార్సీపీ, సీపీఎం శ్రేణులు చిందేసిన తెల్లం వెంకట్రావ్, సున్నం రాజయ్య భద్రాద్రిలో అడుగడుగునా అపూర్వ స్వాగతం అందుబాటులో ఉంటాం..ఆశీర్వదించండి : డాక్టర్ వెంకట్రావు, సున్నం రాజయ్య భద్రాచలం, న్యూస్లైన్: వైఎస్సార్సీపీ, సీపీఎం శ్రేణులు సోమవారం భద్రాచలం పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్షో విజయోత్సవాన్ని తలదన్నేలా సాగింది. వైఎస్సార్సీపీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు, సీపీఎం భద్రాచలం అసెంబ్లీ అభ్యర్థి సున్నం రాజయ్యలు ఈ రోడ్షోలో ఓపెన్ టాప్ వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. సీపీఎం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రచార రోడ్షోలో గిరిజనుల కొమ్ము నృత్య కళాకారులు ఆటపాటలతో ముందు నడువగా, డప్పు వాయిద్యాలు, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ పాల్గొన్నారు. భద్రాచలం పట్టణంలోని అన్ని వీధుల్లో సాగిన ఈ ర్యాలీకి వివిధ వ ర్గాల ప్రజలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. బుధవారం జరుగనున్న ఎన్నికల్లో వీరిద్దరికే ఓట్లు వేస్తామన్న రీతిలో భరోసా ఇచ్చేలా పట్టణ ప్రజానీకం పలికిన స్వాగతం ఆ పార్టీల శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపిం ది. ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన ఇరువురు నేతలు కూడా వాహనం దిగి కార్యకర్తలతో పాటు చిందేసి వారికి మరింత ఉత్సాహాన్ని నింపారు. నిజాయితీకి పట్టం కట్టండి ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావ్ మాట్లాడు తూ అభ్యర్థుల గుణగణాలతో పాటు నిజాయితీని చూసిఓటు వేసి గెలిపించాలని కోరారు. సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, రోగి నాడి తెలిసిన డాక్టర్గా వైద్యం చేస్తున్న తాను ప్రజా సమస్యలు కూడా తెలుసుకుని ఓ మంచి నాయకుడిగా పని చేస్తానని అన్నారు. తనను గెలిపిస్తే భద్రాచలం నియోజకవర్గ ప్రజానీకానికి ఏది అవసరం గుర్తించి పనిచేస్తానన్నారు. నీతి నిజాయితీగా ఉండే తనను గెలిపించేందుకు ప్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ, సీపీఎం గెలుపు అవసరం భద్రాచలంలో నియోజకవర్గంలో సీపీఎం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో వైఎస్సార్సీపీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి సున్నం రాజయ్య అన్నారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజానీకం భవిష్యత్కు దశ, దిశ నిర్ధేశం చేసే ఈ ఎన్నికల్లో మంచి వ్యక్తులకు పట్టం కట్టాలన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను నిస్వార్ధంగా, నిరాడంబరంగా పనిచేశానని గుర్తు చేశారు. కానీ ఒక్క సారి గెలిచిన వారు కూడా కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న విషయాన్ని ఈ ప్రాంత ప్రజానీకం గుర్తుంచుకోవాలన్నారు. అదే విధం గా కేవలం ఎన్నికలప్పుడు కనిపించే టీడీపీ వంటి పార్టీలకు ఓటు వేసినా ప్రజల కష్టాలు తీరవవన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు కడియం రామాచారి, సీనియర్ నాయకులు గంటా కృష్ణ, కొవ్వూరి రాంబాబు, దామెర్ల రేవతి, లక్ష్మీబాయి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బీ వెంకట్, పీ సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఏజే రమేష్, బ్రహ్మచారి, బీబీజీ తిలక్, గిరిప్రసాద్, జీఎస్ శంకర్రావు, ఎంబీ నర్సారెడ్డి, ముదిగొండ నాగేశ్వరరావు, బండారు శరత్బాబు, వైఎస్సార్సీపీ నాయకులు బానోతు రాముడు, రాయిని రమేష్, లక్ష్మీబాయి, నీరజ, రాజు, ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు. -
తిట్టుకున్నారు.. కొట్టుకున్నారు...
భద్రాచలం, న్యూస్లైన్: ఇంతకాలం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వర్గపోరుసాగిస్తున్న భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. తిట్లపురాణం సాగిస్తూ ఒకరిపై ఒకరు దాడులకు దిగి ఎన్నికల తరుణంలో పార్టీపరువును రచ్చకీడ్చారు. కేంద్రమంత్రి, మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరామ్నాయక్ సమక్షంలో సాగిన ఈ యుద్ధకాండను చూసి పార్టీ శ్రేణులు నివ్వెరపోయాయి. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో గెలుపుకోసం ఏ రీతిన ముందుకెళ్లాలనే దానిపై కేంద్రమంత్రి బలరామ్నాయక్ భద్రాచలం నియోజకవర్గం నాయకులతో ఐటీసీ గెస్ట్హౌస్లో శనివారం నిర్వహించిన సమావేశం కాంగ్రెస్ వర్గపోరుకు వేదిక అయింది. ఎమ్మెల్యే కుంజా సత్యవతి వర్గీయులు, ఆమె వ్యతిరేక వర్గీయులు రెచ్చిపోయారు....ముష్టియుద్ధానికి దిగారు. భద్రాచలం జడ్పీటీసీ టిక్కెట్టు విషయమై చింతిర్యాల రవికుమార్ ప్రస్తావించి, తనకు రాకుండా చేశారని వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే సత్యవతి తన వ్యతిరేక వర్గీయులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొంతమంది నాయకులు మహిళా ఎమ్మెల్యేనని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అసభ్య పదజాలంతో తిట్ల పురాణం అందుకున్నారు. దీనికి పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు నక్కా ప్రసాద్ అభ్యంతరం తెలపడంతో ఆయనపై సత్యవతి ఆగ్రహించారు. తన కాలికున్న చెప్పును తీసి నక్కా ప్రసాద్పై లేపారు. అంతే ఇరువర్గాల మధ్య తీవ్రపెనుగులాట జరిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈఘటనలో నక్కా ప్రసాద్ చొక్కాచిరిగిపోయి... ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. ఎమ్మెల్యే అనుచరుడికి కూడా మెడపై గాయాలయ్యాయి. ఇరువర్గాల వారిని సముదాయించే క్రమంలో కేంద్రమంత్రి బలరామ్నాయక్ కింద పడిపోయారు. ఈ గొడవ అంతా పార్టీ ముఖ్య నాయకులు ఎడమకంటి రోశిరెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కురిచేటి రామచంద్రమూర్తి, ఎమ్మెల్యే భర్త కుంజా ధర్మా, డివిజన్ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, రమేష్గౌడ్, దొంతుమంగేశ్వరరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి దాదాపు డివిజన్ నాయకత్వ మంతా చూస్తుండగానే జరిగింది. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న తరుణంలో తమతో పనిచేయించుకోవాల్సిన ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఇలా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ బలప్రయోగం చేయడమేంటని వ్యతిరేకవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఆమె తరఫున పనిచేసేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. నక్కా ప్రసాద్ను అరెస్ట్చేయకపోతే ఆందోళన చేస్తా : సత్యవతి అనేకసార్లు తనను తీవ్రంగా అవమానించిన నక్కా ప్రసాద్ను వెంటనే అరెస్ట్ చేయకపోతే ఆందోళన చేస్తానని ఎమ్మెల్యే కుంజా సత్యవతి అన్నారు. సంఘటన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దొంగనోట్ల చెలామణి, దందాలు చేస్తున్న నక్కా ప్రసాద్ను భద్రాచలంలో లేకుండా చేస్తానన్నారు. అతనిపై ఇక సహించేదే లేదని, కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇడ్లీ అమ్ముకునే వ్యక్తికి లక్షలు ఎలా వచ్చాయని, అతని ఆస్తులపై విచారణ చేయాలన్నారు. అటువంటి వ్యక్తిని ఇక ఉపేక్షించేదే లేదని తీవ్రమైన పదజాలాన్నే ఉపయోగించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన భద్రాచలం ఎస్సై మురళికి ఆమె జరిగిన సంఘటనపై వివరించారు. వెంటనే నక్కా ప్రసాద్పై రౌడీ షీటు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దంపతులు భూ కబ్జాదారులు : ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని కుంజా సత్యవతి, ఆమె భర్త ధర్మా భద్రాచలంలో భూ దందాలు చేశారని నక్కా ప్రసాద్ ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు సెంట్ల భూమి కనిపిస్తే దాన్ని కబ్జా చేయటమే ధర్మా పని అన్నారు. పదవిని అడ్డుపెట్టుకొని ఖాళీ స్థలాలను ఆక్రమించటం, ఆనక ఇరువర్గాల మధ్య సెటిల్ మెంట్లు చేసి డబ్బులు గుంజుతారని, తమ దుకాణ సముదాయ వివాదాన్ని పరిష్కరిస్తామంటూ రూ.11 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇటువంటి వారిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఫలితం అనుభవించాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కగదిలోనే ఎన్నికల అబ్జర్వర్ : కాంగ్రెస్ నాయకుల కుమ్ములాటలు జరిగిన పక్కగదిలోనే ఎన్నికల అబ్జర్వర్ యశ్వీర్ మహాజన్ బసచేసి ఉన్నారు. వీరి ఘర్షణపై సదరు అధికారి ఎప్పటికప్పుడు వాకబు చేసినట్లుగా తెలిసింది. అయితే దీనిపై ఎవ్వరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు కఠినంగానే ఉండే అవకాశం ఉందని ఓ పోలీస్ అధికారి ‘న్యూస్లైన్’కు తెలిపారు. ఇదిలా ఉండగా సంఘటన ప్రదేశం బూర్గంపాడు స్టేషన్ పరిధిలోకి వస్తుందని, అక్కడ కేసు నమోదైనట్లైతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడికి బదలాయించి తగిన చర్యలు తీసుకుంటామని పట్టణ ఎస్సై మురళి తెలిపారు. -
సీతారాముల కళ్యాణానికి మండ పేట కొబ్బరి బోండాలు
-
భద్రాచలం.. మాదంటే మాది
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఆ పార్టీ వారినే అయోమయానికి గురిచేస్తోంది. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలకు తోడు తాజాగా వీరి దృష్టి శ్రీరాముడు కొలువైన పుణ్యక్షేత్రం భద్రాచలంపై పడింది. భద్రాచలం తమదంటే తమదంటూ ఇరు ప్రాంతాల నేతలు లాబీయింగ్ మొదలెట్టారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క చాంబర్ లో ఖమ్మం నేతలు సమావేశయ్యారు. భద్రాచలం తెలంగాణకు వచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి ఈ మేరకు కోరారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాల్సిన అవసరం ఉండబోదని ప్రతిపాదించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కేంద్ర మంత్రుల బృందానికి లేఖ రాశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సమైక్య నినాదం వినిపిస్తుండగా, ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం హైదరాబాద్ యూటీ ప్రతిపాదన, సీమాంధ్రలో భద్రాచలం కలపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలపాలంటూ కేంద్ర మంత్రి జేడీ శీలం జీవోఎంను కోరారు. తెలంగాణ బిల్లుకు 10 సవరణలు ప్రతిపాదించామని, వాటిని ఒప్పుకుంటే తెలంగాణపై తమ కెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. -
‘రియల్’ దందా...
భద్రాచలం, న్యూస్లైన్: ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం పట్టణంలో రియల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ జోరుగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ‘అధికార’ అండ చూసుకుని అక్రమార్కులు చెలరేగిపోతుండడంతో...భవిష్యత్తులో తలనొప్పులు వస్తాయని ఓ రెవెన్యూ అధికారి ఏకంగా సెలవుపై వెళ్లిపోయారంటే ఏమేరకు దందా సాగుతోందో అర్థం చేసుకోవచ్చనే చర్చ ఇక్కడ నడుస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచలం వ్యాపారపరంగా కూడా దినాదినాభివృద్ధి చెందుతోంది. ఐటీడీఏ కార్యాలయంతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. దీంతో వివిధ మండలాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారస్తులు పట్టణంలో సిర్థ నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా భద్రాచలం జిల్లా కేంద్రమవుతుందనే ప్రచారం కూడా ఇక్కడ జరుగుతోంది. సందర్శకుల తాకిడి అధికంగా ఉండడం, పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందటంతో భద్రాచలంపై రియల్వ్యాపారుల కన్నుపడింది. దీంతో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. శివారు ప్రాంతాల్లో సెంటు భూమి రూ.2 లక్షలు ఉండగా, భద్రాచలం నడిబొడ్డున సెంటు భూమి రూ.30 లక్షల వరకూ పలుకుతోంది. సామాన్యుడు చిన్నపాటి ఇంటి జాగా కొనుక్కోలేని పరిస్థితి ఉంది. 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజనేతరుల మధ్య ఎటువంటి భూ లావాదేవీలు జరగడానికి వీల్లేదు. కానీ ప్రస్తుతం యథేచ్ఛగా గిరిజన చట్టాల ఉల్లంఘన జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూనవరం రోడ్డులో కరకట్టకు ఆనుకొని, అదేవిధంగా గుండాల కాలనీ సమీపంలో ప్లాట్ల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. భద్రాచలం శివారు ప్రాంతంలో ప్లాట్లు చేసి విక్రయాలు చేపడుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది. చెలరేగుతున్న మాఫియా : ఓ రాజకీయ పార్టీ అండతో భద్రాచలంలో మాఫియా చెలరేగుతోంది. జిల్లా ఎస్పీ రంగనాథ్ గతంలో ఇదే విషయమై ప్రస్తావించారు. సెటిల్మెంట్లకు అడ్డగా మారుతున్న భద్రాచలంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కూడా ప్రకటించారు. కానీ కొంతమంది రె వెన్యూ అధికారుల అండతో ఈ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందనే విమర్శలు ఉన్నాయి. పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వీరు దర్జాగా ఆక్రమిస్తున్నారు. చర్ల రోడ్డులో గల పాలకేంద్రం, దానికి ఎదురుగా ఉన్న భూములు కూడా ప్రస్తుతం వివాదంగా మారుతున్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించి గుడిసెలు వేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు దృష్టి సారించకపోవటంతో ఆ స్థలాల్లో కొద్ది రోజులకే భవనాలు లేస్తున్నాయి. వాటికి విద్యుత్ మీటర్లు కూడా మంజూరవుతున్నాయి. గిరిజన చట్టాలు ఇక్కడి కొన్ని శాఖల అధికారులకు కాసుల వర్షం కురుపిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకునే సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వారికి ఎక్కడ లేని నిబంధనలు వల్లెవేసే విద్యుత్ శాఖ అధికారులకు రూ.20 వేలు చెల్లిస్తే మీటరు మంజూరు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పాలకేంద్రం వద్ద ప్రభుత్వ భూముల్లో వేసిన ఇళ్లకు ఏ ప్రాతిపదికన విద్యుత్ మీటర్లు ఇచ్చారనే దానిపై విచారణ జరిపిస్తే అవినీతి అధికారులు బాగోతం బట్టబయలు అయ్యే అవకాశం ఉందని పట్టణవాసులు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం ‘అధికార’ అండ కలిగిన కొంతమంది వ్యక్తుల కనుసన్నుల్లోనే సాగుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రియల్ దందాలు, ఆక్రమణలు జోరుగా సాగుతున్న తరుణంలోనే భద్రాచలం తహశీల్దార్గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లిపోవటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న భూ లావాదేవీల్లో ఇరుక్కోవటం ఇష్టం లేకనే తహశీల్దార్ సెలవుపై వెళ్లిపోయినట్లు పట్టణంలో ప్రచారం సాగుతోంది. ఆ శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుండటం గమనార్హం. అధికారుల హడావిడి వెనుక ఆంతర్యమేమిటో..? భద్రాచలం డివిజన్కు కొత్తగా రెవెన్యూ అధికారులు వచ్చినప్పడల్లా 1/70 చట్టాన్ని వెలికితీస్తుండం ఆనవాయితీగా మారుతోంది. గతంలో ఓ సబ్కలెక్టర్ విధులు చేపట్టిన కొత్తలో చట్టాల పరిరక్షణ పేరుతో నిర్మాణంలో ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి సామాన్లు కూడా సీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరువాత ఆయన కార్యాలయం ముందరే బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నా మౌనం దాల్చారు. ఇలా అధికారి వచ్చినప్పడల్లా చట్టాలు గుర్తొస్తుండటం, ఆనక వీటి గురించి పూర్తిగా మరిచిపోవటంపై గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గత రెండు రోజులుగా పట్టణంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించి సర్వేలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పట్టణంలోని చర్ల రోడ్లో గల పాలకేంద్రం భూములు, అదే విధంగా దానికి ఎదురుగా ఉన్న భూములను పరిశీలించారు. ఇన్చార్జి తహశీల్దార్ కనకదుర్గ, ఆర్ఐ మోహన్రావు ఆధ్వర్యంలో పలువురు వీఆర్వోలు ఆ స్థలాలను సర్వే చేశారు. దీంతో ఆ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేద వర్గాల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్డీవో ఆదేశాల మేరకు తాము సర్వే చేస్తున్నామని తహశీల్దార్ ‘న్యూస్లైన్’కు తెలిపారు. హడావిడి సర్వేలు కాకుండా గిరిజన చట్టాలను పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే బాగుంటుందని గిరిజన సంఘాల వారు కోరుతున్నారు. -
భద్రాద్రి మాదే
ఖమ్మం/భద్రాచలం, న్యూస్లైన్: ‘భద్రాచలం డివిజన్ ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమే.... భద్రాద్రి రాముడికి, తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది... దీనిని ఈ ప్రాంతం నుంచి వేరు చేయడం సరికాదు’ అని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా కొద్దిరోజులుగా జరుగుతున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. భద్రాద్రి మాదే అంటూ నిరసనలు, ఆందోళనలు, దీక్షలు సోమవారం కూడా కొనసాగాయి. టీఆర్ఎస్ నేతలు హరీష్రావు, కేశవరావు జిల్లాలో పర్యటించి ఆందోళనలకు సంఘీభావం ప్రకటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భద్రాచలంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ముందు టీఎన్జీవో ఆధ్వర్యంలో దీక్షలు సోమవారం కొనసాగాయి. పంచాయతీరాజ్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతోపాటు, టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. అదేవిధంగా జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు నిమ్మరసం ఇచ్చి ఈదీక్షలను విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌగోళికంగా, చారిత్రకంగా, రాజకీయ, విద్య, వైద్యం ఏ ప్రాతిపదికన చూసినా భద్రాచలం తెలంగాణాలో అంతర్భాగమే అని అన్నారు. తెలంగాణ నుంచి భద్రాచలం డివిజన్ను విడదీస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, భద్రాచలం ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉంచాలని జిల్లా జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. దీక్ష చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. మంగళవారం జిల్లా బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ అనుబంధ మహిళా సంఘం పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. భద్రాచలంలో తొమ్మిదోరోజుకు దీక్షలు టీజేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు తొమ్మిదో రోజుకు చే రాయి. సోమవారం నాటి దీక్షల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కురిచేటి రా మచంద్రమూర్తి, డివిజన్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, నల్లపు దుర్గాప్రసాద్, ముత్యాల వీరభద్రం, నక్కా ప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి, భూక్యా రంగా, తాండ్ర నర్సింహారావు, సరెళ్ల నరేష్, కేతినేని లలిత, రాజేష్, రాంబాబు తదితరులు కూర్చొన్నారు. డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు దీక్షాశిబిరాన్ని సంద ర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న భద్రాచలాన్ని వేరు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలన్నా రు. భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనన్నారు. కాంగ్రెస్పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ బుడగం శ్రీనివాస్ నిమ్మరసం ఇచ్చి తొమ్మిదో రోజు దీక్షలను విరమింపజేశారు. తెలంగాణలో ఉంటేనే అభివృద్ధి : భద్రాచలం ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉంటేనే అభివృద్ధి చెందుతుందని జిల్లా ప్రైవేటు పాఠశాల కరస్పాడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాగంటి సూర్యం అన్నారు. భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో చేపట్టిన దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన, గిరిజనేతరులకు ఉన్నత విద్యావకాశాలు తెలంగాణ రాష్ట్రంలోనే అందుబాటులో ఉంటాయన్నారు. భద్రాచలం ను తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్తో చేపట్టబోయే కార్యక్ర మాలకు ప్రైవేటు పాఠశాలల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. న్యాయవాదుల జలదీక్ష : భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే డి మాండ్తో భద్రాచలం న్యాయవాదుల జాయిం ట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గోదావరి నదిలో జలదీక్ష చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చారిత్రాత్మకమైన భద్రాచలం ప్రాంతాన్ని జలసమాధి చేయాలనే కుట్రలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. సుమారు గంటపాటు జలదీక్షను చేపట్టారు. కార్యక్రమంలో న్యాయవాదులు పీ కృష్ణమోహన్, ఎంవీ రమణారావు, కొడాలి శ్రీనివాసన్, సాల్మాన్రాజు, వసంతరావు, దాగం ఆదినారాయణ, శ్రీనివాస్, పడవల శ్రీనివాస్, తిరుమలరావు, మహిళా న్యాయవాదులు లలిత, నర్మద, కిరణ్మయి, శుభశ్రీ, కవిత, తరుణి తదితరులు పాల్గొన్నారు. మంగళవారం నిర్విహ ంచే అఖిల పక్షాల బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలి : గుమ్మడి నర్సయ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రాచలంను ముంచాలనే సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. భద్రాచలం టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. తెలంగాణలో అంతర్భాగమైన భద్రాచలంను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదన్నారు. ఇందుకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దమేనన్నారు. ఇందుకోసం భద్రాచలం డివిజన్లోని ప్రజానీకమంతా పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి గౌసుద్ధీన్, సోమశేఖర్, వెక్కిరాల, ఈశ్వర్, కుంజా సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
భద్రాద్రిని విడదీయొద్దని.. రిలే దీక్షలు ప్రారంభం
భద్రాచలం, న్యూస్లైన్ : భద్రాచలం ప్రాంతాన్ని తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ టీజేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు సమయంలో భద్రాచలంపై కిరికిరి పెట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణవాదుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు వెలువడినా అంగీకరించబోమని చెప్పారు. జైరామ్మ్రేష్, ఆంటోనీ కమిటీల నివేదికలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఏసీ గదుల్లో కూర్చొని నివేదికలు పొందుపరిస్తే ఇక్కడి సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. భద్రాచలం డివిజన్ను తెలంగాణలోనే ఉంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్న సహించేది లేదని హెచ్చరించారు. భద్రాచలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని, అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. దీక్షలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కుంజా సత్యవతి మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్ను సీమాంధ్రుల అడగటం అవివేకమన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసమే భద్రాచలం డివిజన్ను ఆంధ్రలో విలీనం చేయాలని చూస్తున్నార ని, ఇదే జరిగితే ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీజేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య దీక్షలను సందర్శించి మద్దతు తెలిపారు. తొలిరోజు దీక్షలో టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి ఎస్కే గౌసుద్ధీన్, రేగలగడ్డ ముత్తయ్య, వెక్కిరాల శ్రీనివాస్, కిశోర్, సోమశేఖర్, హనుమాన్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు కుంజా సీతారాములు తదితరులు కూర్చొన్నారు. ఆదివారం నాటి దీక్షలను భద్రాచలం సర్పంచ్ భూక్యా శ్వేత నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. దీక్ష శిబిరాన్ని వివిధ పార్టీల నాయకులు బొలిశెట్టి రంగారావు, రమేష్గౌడ్, తాండ్ర నర్సింహారావు, రాజేష్, నక్కా ప్రసాద్, కుంచాల రాజారామ్, టీవీ, కల్లూరి వెంకటేశ్వరరావు, ఆవుల సుబ్బారావు, కెచ్చెల కల్పన, సోందె వీరయ్య, మడివి నె హ్రూ, పడిసిరి శ్రీనివాస్, వర్తక సంఘం నాయకులు వాసిరెడ్డి అజేయ్కుమార్ సందర్శించి మద్దతు పలికారు. -
కాంగ్రెస్లో పదవుల చిచ్చు
భద్రాచలం, న్యూస్లైన్: జిల్లా కాంగ్రెస్లో పార్టీ పదవుల పందేరం చిచ్చు మొదలైంది. కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడి నియామకం విషయంలో చెలరేగిన వివాదం.. చివరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికే అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసేంత వరకు వచ్చింది. ఇది ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వనమాకు ఆయన వర్గమంతా వెన్నుదన్నుగా నిలిచింది. అవసరమైతే పీసీసీ పెద్దలను కలిసి, జరిగిన పరిణామాలను వివరించేందుకు వనమా వర్గీయులు సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడి నియామకంపై తలెత్తిన వివాదం రాజధానికి చేరింది. పార్టీకి ఎంతోకాలంగా నిస్వార్థంగా సేవ చేస్తున్న తనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా ఏకంగా షోకాజ్ నోటీస్ జారీ చేయడాన్ని డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నోటీసును ఆయన ‘పరాభవం’గా భావిస్తున్నారని, ఇదే విషయాన్ని ఆయన పార్టీ పెద్దల వద్ద చెప్పుకుని వాపోయారని తెలిసింది. తెలంగాణపై మంత్రుల బృందాన్ని కలిసేందుకని సోమవారం ఢిల్లీకి బయలుదేరుతున్న జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు.. అక్కడ పార్టీ పెద్దలతో భద్రాద్రి పంచాయితీపై కూడా చర్చించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ‘ఎమ్మెల్యే సత్యవతి రాద్ధాంతం సరికాదు..’ కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే సత్యవతి (కాంగ్రెస్) రాద్ధాంతం చేయడం సరికాదని ఆ పార్టీ డివిజన్ నాయకులు కొందరు అన్నారు. వారు ఆదివారం భద్రాచలంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆమె (సత్యవతి) ఏకపక్ష ధోరణి కారణంగానే సమస్య ఇంతవరకూ వచ్చిందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పార్టీ డివిజన్ కన్వీనర్ మైథిలిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన నక్కా ప్రసాద్ వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేశారని చెప్పారు. ఆ స్థానంలో తాండ్ర నర్సింహారావును వనమా నియమించారని చెప్పారు. ‘ఈ నియామకంపై డివిజన్లోని పార్టీ నాయకులతో కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ చర్చించారు. ఆ తరువాతనే, తాండ్ర నర్సింహారావును నియమించాలంటూ డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావుకు సిఫారసు లేఖ ఇచ్చారు. దాని ఆధారంగానే, పార్టీ పట్టణ అధ్యక్షుడిగా తాండ్ర నర్సింహారావును వనమా నియమించారు. అది కూడా.. పార్టీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా పేర్కొంటూ ఉత్తర్వు ఇచ్చారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సత్యవతి ఇంత రాద్ధాంతం చేయటం సరికాదు’ అన్నారు. ‘పార్టీ పట్టణ అధ్యక్షుడిగా బొలిశెట్టి రంగారావును నియమించేప్పుడు డీసీసీ అధ్యక్షుడు వనమాతోగానీ, పార్టీ డివిజన్ బాధ్యతలు చూస్తున్న మాతోగానీ ఆమె చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించిన విషయం వాస్తవం కాదా..?’ అని వారు ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, ఎమ్మెల్యే కుంజా సత్యవతి మధ్యనున్న ఆధిపత్య పోరులో వనమాను ఇరికించటం సరికాదని మైథిలిరెడ్డి అన్నారు. ‘వనమాకు ఇచ్చిన షోకాజ్ నోటీసును పార్టీ పెద్దలు వెంటనే ఉపసంహరించుకోకపోతే డివిజన్వ్యాప్తంగా ఉన్న పార్టీ కేడరంతా రాజీనామా చేస్తుంది’ అని ఆయన హెచ్చరించారు. -
గ్రామసభ రసాభాస
భద్రాచలం టౌన్, న్యూస్లైన్: గ్రామ అభివృద్ధి పనులపై చర్చించేందుకు భద్రాచలంలోని రాజుపేట కాలనీలో శనివారం ఏర్పాటుచేసిన గ్రామసభ రసాభాసగా మారింది. ఉదయం పది గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రామసభ మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైంది. సభ ప్రారంభమవగానే గ్రామస్తులు లేచి నిలబడి, ఎవరికీ చెప్పకుండా... తగిన ప్రచారం చేయకుండా, దండోరా వేయకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. గ్రామసభ ఏర్పాట్లపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాచలం ఇసుక క్వారీ సభ్యులు, డ్రైవర్లు తమ సమస్యలను వివరించేందుకు యత్నించారు. దీనికి గ్రామసభ అధ్యక్షుడు గుండు శరత్ అడ్డుతగిలారు. కేవలం అభివృద్ధి పనులపై చర్చించేందుకే మాత్రమే ఈ సభ ఏర్పాటుచేసినట్టు చెప్పారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎజెండా ప్రకటించకుండా సభను నిర్వహించడం, సమస్యలను చెప్పొద్దనడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇసుక ర్యాంపు నిధులతో పాఠశాల భవనాన్ని ఆధునీకరించామని అధ్యక్షుడు చెప్పారు. దీనికి గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. భవన నిర్మాణంలో అన్నీ అక్రమాలే చోటుచేసుకున్నాయని చెప్పారు. ఈదురుగాలులతో భారీ వర్షం రావడంతో గ్రామసభను వాయిదా వేస్తున్నట్టు అధ్యక్షుడు గుండు శరత్ ప్రకటించారు. ఈ సభలో ఉపాధ్యక్షురాలు మిడియం భారతి, గ్రామ కార్యదర్శి పూనెం కృష్ణ, ఆదివాసీ సంఘాల నాయకులు నాగేశ్వరరావు, ముర్ల రమేష్, మడివి నెహ్రు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం సర్పంచ్ నోటీసు రాజుపేట కాలనీలో నిర్వహించిన భద్రాచలం గ్రామసభ సమాచారాన్ని తనకు కనీసంగా కూడా తెలపకపోవడంపై అభ్యంతరం తెలుపుతూ భద్రాచలం సర్పంచ్ భూక్యా శ్వేత, వార్డు మెంబర్లు గ్రామసభ నిర్వాహకులకు శనివారం నోటీసు ఇచ్చారు. గ్రామసభ సమాచారాన్ని పత్రికల ద్వారానే తెలిసిందని పేర్కొన్నారు. గ్రామసభను నిర్వహణ, ఊరిలో టాంటాం వేయించాల్సిన భాద్యత తనపై ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు, వివిధ వర్గాల ప్రజలకు గ్రామసభ సమాచారం ఎందుకు తెలపలేదని సర్పంచ్, వార్డు సభ్యులు ఆ నోటీసులో ప్రశ్నించారు. గ్రామసభను వాయిదా వేసి, అందరికీ ఆమోదయోగ్యమైన తేదీలో నిర్వహించేలా గ్రామసభ కమిటీ తీర్మానం చేయాలని కోరారు.