Book fair
-
పుస్తకాలతో పెంచుదాం
‘కౌమార వయసులో ఉండే పిల్లలు చదవడానికి పుస్తకాలు లేవు. వారి కోసం ప్రపంచ దేశాలు పుస్తకాలు అచ్చు వేసే పనిలో పడ్డాయి’ అన్నారు ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్ఫెయిర్’కు హాజరైన ప్రసిద్ధ పబ్లిషర్లు. ప్రతి సంవత్సరం ఇటలీలో, షాంఘైలో ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ఫెయిర్’లు భారీగా జరుగుతాయి. కాని మన దేశంలో కోట్ల మంది బాలలున్నా బాల సాహిత్యం ఊసే ఉండదు. బాల సాహిత్యమే కేంద్రంగా సాగిన చెన్నై ఇంటర్నేషనల్ బుక్ఫెయిర్ నుంచి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి.‘కాలేజీ చదువుల తర్వాత కూడా అందరూ అవే క్లాసు పుస్తకాలు చదవక తప్పని పరిస్థితి ఉంటే బతుకు ఎంత నరకంగా ఉంటుందో... స్కూలు పుస్తకాలు మాత్రమే చదవమంటే పిల్లలకూ అంతే నరకంగా ఉంటుంది. విద్య అనేది అందరికీ దొరికే అవకాశం. కాని వినోదం, ఆహ్లాదం, విజ్ఞానం కలిగించే బాలల సాహిత్యం చదవడమే పిల్లలకు జీవితం అంటే ఏమిటో తెలియచేస్తాయి. మనం మాత్రం కాల్పనిక సాహిత్యం చదువుతూ పిల్లలను స్కూలు పుస్తకాలకు వదిలిపెట్టడంలో ఔచిత్యం ఏమిటో మీరే ఆలోచించండి’ అన్నారు సైమన్ జాకస్. కెనడాలో పిల్లల పుస్తకాల పబ్లిషర్గా ప్రసిద్ధి పొందిన జాకస్ ప్రస్తుతం ఆ దేశంలో బాలల వికాసం కోసం పుస్తకాలు అందుబాటులోకి తేవడానికి చేస్తున్న ప్రయత్నాలను చెప్పారు– ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్’ (సి.ఐ.బి.ఎఫ్)లో. ఈ ఉత్సవం జనవరి 16–18 తేదీల్లో జరిగింది. తమిళ సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి, ఇతర భాషల సాహిత్యాన్ని తమిళంలోకి తీసుకురావడానికి పబ్లిషర్ల మధ్య ఒడంబడికలు చేసే ప్రత్యేక పుస్తక ఉత్సవం ఇది. ‘కెనడాలో ఇప్పుడు ప్రతి క్లాస్లో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నారు. స్కూలు పుస్తకాలు కాకుండా పిల్లలు ఈ సాహిత్య పుస్తకాలను ఖాళీ ఉన్నప్పుడు చదువుకోవచ్చు. బాల సాహిత్యం కోసం వారికి తెలియాల్సిన అన్ని విషయాలను కథలుగా రాయించి అందుబాటులోకి తెస్తున్నాం. ఉదాహరణకు ఊహ తెలిశాక దత్తతకు వచ్చిన పిల్లవాడు తన అంతర్మథనాన్ని అర్థం చేసుకునే పుస్తకం కూడా సాహిత్యరూపంలో పెడుతున్నాం’ అన్నారాయన.అంతర్జాతీయ ఉత్సవాలు‘భారతదేశంలో కోట్లమంది బాలలు ఉన్నారు. కాని బాల సాహిత్యం తగినంత అందుబాటులో లేదు. పిల్లలను సినిమాకు తీసుకెళతారుగాని వారికి పుస్తకాలు కొనివ్వరు తల్లిదండ్రులు. కాని ప్రపంచ దేశాలు ఇప్పుడు కేవలం పిల్లలకు సాహిత్యం అందించే ప్రయత్నంలో ఉన్నాయ’ని అన్నారు సి.ఐ.బి.ఎఫ్లోపాల్గొన్న పబ్లిషర్లు. ఇటలీలోని బొలొనియా నగరంలో రాబోయే మార్చిలో ‘బొలొనియా అంతర్జాతీయ పిల్లల పుస్తక ప్రదర్శన’ జరుగుతుంది. దీని నిర్వాహకురాలు జాక్స్ థామస్ కూడా ఈ వేదిక మీదపాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ‘బొలొనియా చిల్డ్రన్స్ బుక్ఫెయిర్లో ప్రపంచ దేశాల బాలల రచయితలు, పబ్లిషర్లు, చిత్రకారులుపాల్గొంటారు. ఒక దేశ రచయితలు మరో దేశ పబ్లిషర్లతో ఒడంబడికలు చేసుకుంటారు.ఇటలీ రచయిత, జపాన్ పబ్లిషర్, రష్యన్ చిత్రకారుడు కలిసి ఒక పుస్తకం తయారు చేసే ఆలోచన చేయడం ఇక్కడ కనిపిస్తుంది. అదొక పిల్లల ప్రపంచం. తమిళనాడు ప్రభుత్వం ఇక్కడ తమ పుస్తకాలు ప్రదర్శనకు పెడుతోంది. ఇలా ప్రతి భారతీయ భాష నుంచి జరగాలి’ అని అన్నారు. బొలొనియా బాలల బుక్ ఫెయిర్ జరిగినంత ఘనంగా షాంఘైలో ప్రతి నవంబర్లో పిల్లల బుక్ఫెయిర్ జరుగుతుంది. ఎక్కడ చూసినా బాల సాహిత్యమే కనపడుతుంది అక్కడ. కాని మన దేశంలో ‘అడవిలో దూరంగా పులి గాండ్రింపు వినిపించింది’ అనే వాక్యం చదివి దానికి తగ్గ బొమ్మను చూస్తే పిల్లల్లో కలిగే ఊహను మనవాళ్లు ఏమాత్రం అనుమతించడం లేదు. మార్కులు కావాలి మన తల్లిదండ్రులకు.లైంగిక చైతన్యం‘నేనొక కథ రాశాను. ఆ కథను చాలా స్కూళ్లలో లైంగిక చైతన్యంలో భాగంగా చదివి వినిపిస్తున్నారు. స్కూల్లో ఆపాఠం విన్న ఒక పిల్లవాడు నాకు ఫోన్ చేశాడు. అంకుల్... నన్ను ఒకతను అబ్యూజ్ చేశాడు. ఆ రోజు నుంచి ఆ తప్పు చేసింది నేనే అనే భావనతో నలిగిపోతున్నాను. కాని మీ కథ చదివాక తప్పు చేసింది ఆ వ్యక్తి అని, నేను బాధితుణ్ణి అని తెలుసుకున్నాను. నా బాధపోయింది. నన్ను బాధ పెట్టినవాడి గురించి ఇప్పుడు మా ఇంట్లో చెప్పగలను– అని చెప్పాడు. నాకు చాలా సంతోషం వేసింది. బాల సాహిత్యం ఏం చేస్తుందంటే ఇదంతా చేస్తుంది’ అన్నారు మరో రచయిత బాల భారతి.టీనేజ్ పిల్లలకు పుస్తకాలు లేవుచెన్నై బుక్ ఫెయిర్లో ప్రసిద్ధ బాలసాహిత్య ప్రచురణ సంస్థ ‘తులిక బుక్స్’ ఎడిటర్ ప్రియ కృష్ణన్పాల్గొన్నారు. ‘పది పన్నెండేళ్ల వయసున్న పిల్లలు చదవదగ్గ పుస్తకాలు ఇప్పుడు లేవు. ఈ విషయంలో చాలా కొరత ఉంది. పిల్లలు పుస్తకాలు చదవడానికి సిద్ధంగా ఉన్నారు. కాని మనకు బాలల రచయితలు, ప్రచురణ కర్తలు, బాల సాహిత్యానికి బొమ్మలు వేసే చిత్రకారులు చాలా తక్కువగా ఉన్నారు. అందరం పూనుకొని శ్రద్ధపెట్టకపోతే పిల్లలు సెల్ఫోన్లలో కనిపించే డిజిటల్ ప్రపంచంలో తప్పిపోతారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.పిల్లలకు మనోవికాసం, సమాజాన్ని ఎదుర్కొనే దిలాసా కలగాలంటే సాహిత్యం వల్ల కలుగుతుంది. చిన్న విషయాలకే పిల్లలు ఎందుకు కలత పడుతున్నారో అర్థం చేసుకుంటే ప్రతి తల్లిదండ్రులు వారి చేతుల్లో ఇవాళే పుస్తకాలు పెట్టగలరు. – సాక్షి ప్రతినిధితల్లిదండ్రులతో వెళ్లొద్దు‘మన దేశంలో కొన్ని నగరాల్లో బుక్ఫెయిర్లు జరుగుతుంటాయి. పిల్లల్ని తల్లిదండ్రులు ఆ బుక్ఫెయిర్లకు తీసుకువెళతారు. కాని పిల్లలు ఇలాంటి వాటికి తల్లిదండ్రులతో వెళ్లకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు నేరుగా వారిని తీసుకెళ్లి కలెక్టర్ కావడం ఎలా వంటి పుస్తకాలు కొనిపెడతారు. దయచేసి వాళ్లకు డబ్బు ఇచ్చి వదిలిపెట్టండి. ఏం కావాలో అది కొనుక్కోనివ్వండి. అదొక్కటే కాదు... పిల్లల పుస్తకాలు అత్యంత తక్కువ ధరకు దొరికే ఏర్పాటు చేయాలి. ఆ పుస్తకాన్ని ఆశించిన ఏ ఒక్క పిల్లవాడు కూడా అది దక్కలేదని నిరాశపడకూడదు’ అన్నారు రచయిత నటరాజన్. ఆయన బాలల కోసం 120కి పైగా పుస్తకాలు రాశారు. -
విజయవాడలో పుస్తకాల పండుగ ప్రారంభం (ఫొటోలు)
-
హైదరాబాద్ : ముగిసిన బుక్ఫెయిర్.. ఆదివారం సందర్శకుల కిటకిట (ఫొటోలు)
-
యువ 'కలం'..! ట్రెండ్ సెట్టర్స్గా యంగ్ రైటర్స్
రచన, సాహిత్యాన్ని అభిరుచిగా మలుచుకుంటే చాలు.. మన భవిష్యత్ ప్రయాణ మార్గాన్ని, అత్యుత్తమ లక్ష్యాలకు అదే చేర్చుతుందని ప్రముఖ సాహిత్యకారులు చెప్పే మాట. ఆనాటి తరం యువ రచయితలకు సాహిత్యాభిలాష ఎంత వరకూ తోడ్పాటునందించిందో అటుంచితే.. ఈ తరం యువ రచయితలకు మాత్రం గౌరవ ప్రస్తానాన్ని ప్రసాదిస్తోంది. ఈ తరం యువత సాహిత్యంలో విశేషంగా రాణించడమే దీనికి నిదర్శనం. అధునాతన పంథాతో, వినూత్న ఆలోచనలతో, సామాజిక అంశాలను ప్రస్తుత భాషా అనుకరణ పరిమితుల్లో రచిస్తూ.. తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. యువ రచనలకు ఈ దశాబ్ద కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాదీ యువ రచయితల కొత్త పుస్తకాలు, నవలలు, కథానికలు, కవిత్వ సంపుటిలు విరివిగా ప్రచురితమవుతున్నాయి. ఇందులోనూ వినూతనత్వం ఏంటంటే.. ఈ అభిరుచి ఉన్న యువ ఔత్సాహికులకు అటు సినిమా రంగంలో, ఇటు కంటెంట్ డెవలప్మెంట్ వేదికల్లో ప్రధాన్యత పెరగడం. ఈ సందర్భంగా వీరంతా సోషల్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. హైదరాబాద్ నగరం వేదికగా కొనసాగుతున్న నేషనల్ బుక్ ఫెయిర్(National Book Fair) నేపథ్యంలో అటువంటి యువ సాహిత్య కారులను ‘సాక్షి’ ప్రత్యేకంగా పలకరించింది. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రశ్నించే గొంతుకగా ఉండాలని..ర చన, సాహిత్యం అనేది నా ఆలోచనలను ప్రతిబింబించే సామాజిక వేదికలుగా భావిస్తాను. రాసే కథ అయినా, నవల అయినా సమాజహితమై, అసమానతలను ప్రశ్నించే గొంతుకగా ఉండాలని భావిస్తాను. అందులో భాగంగానే ఎర్రమల్లెలు అనే పుస్తకం రాశాను. మ్యారిటల్ రేప్ల పై ఈ రచన రాశాను. సాధారణంగా మల్లెలు తెల్లగా ఉంటాయి. కానీ అవి ఎందకు ఎర్రగా మారాయనే నిజజీవిత సామాజిక అంశాన్ని ప్రస్తావించాను. సాధారణంగా పెళ్లి జరిగిన తరువాత అందరి ఆడవారి జీవితాలూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్పై అవగాహన లేకపోవడం దీనికి కారణం. నా పుస్తకానికి అన్ని వయసుల ఆడవారు, ముఖ్యంగా మగవారి నుంచి స్పందన లభిస్తోంది. నిజ జీవితంలో భార్యల విషయంలో భర్తలు ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశంలో చాలా మంది రియలైజ్ అయ్యామని స్పందించడం చాలా సంతోషాన్నిచ్చింది. నేను సినిమాలకు రచనా సహకారం అందిస్తున్నాను. ఆల్ ఇండియా రేడియోలో డ్రామాలు రాస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని కథలు, నవలలు రాయనున్నాను. – రోజా రాణి దాసరి స్క్రీన్ రైటర్ అవ్వాలనే లక్ష్యంతో..మనుషుల్లోని సున్నితమైన భావోద్వేగాలైన ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత వంటి అంశాల్ని స్పృశిస్తూ రచనలు చేయడం నాకు ఇష్టం. ప్రస్తుతం ఈ ప్రపంచానికి వీటి అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. ఇందులో భాగంగానే ‘సరిజోడి’ అనే స్వచ్ఛమైన అచ్చ తెలుగులో ఒక నవల రాశాను. సిటీలో కొనసాగుతున్న బుక్ ఫెయిర్లో ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది పాకిస్తానీ ముస్లిం అమ్మాయికి, హైదరాబాదీ వ్యాపారవేత్తకి మధ్య జరిగిన హృద్యమైన ప్రేమ కావ్యం. ఇది నా మొదటి నవల. భవిష్యత్తులో స్క్రీన్ రైటర్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్నాను. ప్రస్తుతం నగరంలోని ఇఫ్లూ యూనివర్సిటీలో ఫిల్మ్ స్టడీస్ పై పీహెచ్డీ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో యువ రచయితల పుస్తకాలు పెరగడం సంతోషాన్ని ఇవ్వడంతో పాటు, పోటీతత్వాన్ని పెంచుతోంది. ఇందులో బాధ్యతాయుతమైన రచనలు, భాషను, సామాజిక, మానసిక విలువలను స్పృశించే రచనలు కూడా ఉండటం శుభపరిణామం. – దిలీప్. స్నేహితుల సహకారంతో..రచనల పరంగా 2012లో మొదలైన నా ప్రయాణం కేంద్ర యువ సాహిత్య అకాడమీ అవార్డు పొందే వరకూ సాగింది. మొదట్లో ఈ రచనా రంగంలోని స్నేహితుల సహకారంతో మొదటి పుస్తకాన్ని ప్రచురించాను. ఆ తరువాత ఆ కష్టాలను దాటుకుని అస్థిత్వం, కుల వృత్తులను, సామాజిక అంశాలను ప్రతిబింబించే కవిత్యం, కథలు రాశాను. నా రచనలు హిందీ, తమిళం, అస్సామీ, బంగ్లా వంటి భాషలతో పాటు ఫ్రెంచ్, స్పేయిన్ వంటి భాషల్లోకి తర్జుమా చేయడం గొప్ప గౌరవంగా భావిస్తాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల కోసం సిలబస్ చేర్చడం కూడా మరింత సంతృప్తినిచ్చింది. ఈ ప్రయాణంలో వివిధ రాష్ట్రాల్లో దాదాపు 13 లిటరరీ ఫెస్టివల్స్లో వేదిక పంచుకోవడం, ఈ వేదికల పైన జాతీయ, అంతర్జాతీయ సాహిత్యకారులను కలుసుకోవడం, వారి అనుభవాలను ఆలోచనలను పంచుకోవడం నా విజయాలుగా భావిస్తాను. మరి కొద్ది రోజుల్లో ఇంగ్లిష్ కవిత్వం, కవిత్వ అనువాదం, మరో సంపాదకత్వంతో రానున్నాను. – రమేష్ కార్తీక్ మహిళా సాధికారత దిశగా..నా వృత్తి ప్రభుత్వ రంగ సంస్థలో మహిళా సాధికారత కోసం కృషి చేయడం. నా వృత్తిలో ఎదురైన అనుభవాలను ప్రవృత్తి అయినటువంటి రచనల ద్వారా సమాజానికి చేరువ చేస్తున్నాను. మొదటి సామాజిక సమస్యలపై కథలు రాస్తున్నాను. నా మొదటి పుస్తకం ఇసుక అద్దం. ఇది నా ప్రయాణానికి మంచి బాట వేసింది. ఈ మధ్యనే విడుదల చేసిన 2వ కథల పుస్తకం బల్కావ్ కూడా నా సామాజిక బాధ్యతను అక్షరాలుగా, పదాలుగా వివరిస్తుంది. ఒక సామాజిక అంశంపై లోతుగా పరిశోధించాకే, అందులోని నిజాలను నిక్కచ్చిగా చెప్పడానికే నా కలాన్ని వాడతాను. నా రచనలు నాకు సంతృప్తితో పాటు గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చాయి. యండమూరి వీరేంద్రనాథ్ ఉగాది పురస్కారంతో పాటు, వాయిస్ ఆఫ్ తెలంగాణ వంటి అవార్డులు సైతం లభించాయి. ముఖ్యంగా 50 ఇన్స్పైరింగ్ ఉమెన్స్లో నాకు అవార్డు రావడం, దీని కోసం ప్రత్యేకంగా ప్రచురించిన పుస్తకంలో నా గురించి ప్రచురించారు. మరికొన్ని అద్భుతమైన కథలతో రానున్నాను. – శ్రీ ఊహ(చదవండి: వామ్మో..! అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా..? వింటే వెన్నులో వణుకురావాల్సిందే..!) -
Hyderabad Book Fair: పుస్తకం పిలిచింది!
సాక్షి, హైదరబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం సందర్శకులతో పోటెత్తింది.సెలవురోజు కావడంతో పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. యువత, విద్యార్థులు, పిల్లలతో స్టాళ్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా చిన్నారులు తమకిష్టమైన ఆంగ్ల కథలు, క్లాసిక్స్ పుస్తకాలను విరివిగా కొనుగోలు చేశారు. ఒకవైపు పుస్తక ఆవిష్కరణలు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు, అమ్మకాలతో సందడి నెలకొంది. పుస్తక ప్రదర్శన కేవలం పుస్తకాల అమ్మకాలకు మాత్రమే పరిమితం కాకుండా రచయితలను, పాఠకులను ఒకచోట చేర్చే వేదికగా మారింది. ప్రదర్శన ప్రారంభమై నాలుగు రోజులైంది. రెండు రోజులుగా పుస్తక ప్రియుల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోందని నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘కొత్త సంవత్సరం పుస్తక పఠనంతో ప్రారంభం కావాలనే ఆకాంక్షతో ఎక్కువ మంది తమకు నచి్చన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా వయోధికులే ఎక్కువగా పుస్తకాల పట్ల ఆసక్తి, అభిరుచి కలిగి ఉంటారనే అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ యువత పెద్ద సంఖ్యలో కనిపించడం విశేషం. రాజ్యాంగం 5 రకాలుగా.. భూమిపుత్ర, బహుజన పుస్తక ప్రచురణ సంస్థలకు చెందిన స్టాల్ నంబర్లు 203, 204లలో భారత రాజ్యాంగం గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పిల్లలు, పెద్దలు నచ్చేలా 5 రకాలుగా ముద్రించి ప్రదర్శనలో ఉంచారు. నేడు పుస్తక నడక.. పుస్తక పఠనంపై ప్రజల్లో ఆసక్తిని, అభిరుచిని, అవగాహనను పెంపొందించే లక్ష్యంతో సొమవారం పుస్తక నడక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ నిర్వాహకులు తెలిపారు. లోయర్ ట్యాంక్బండ్ నుంచి ఎనీ్టఆర్ స్టేడియం వరకు జరగనున్న ప్రదర్శనలో పాఠకులు, రచయితలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. -
నవ కవనం!.. కొత్త రెక్కలు విచ్చుకుంటున్న సృజన ప్రపంచం
సాక్షి, హైదరాబాద్: పుస్తకం కొత్త పుంతలు తొక్కుతోంది. యువతరం సృజనాత్మకతకు పట్టం కడుతోంది. కథ, నవల, చరిత్ర, ప్రక్రియ ఏదైనా సరే కొత్త తరం ఆలోచనలకు, భావజాలానికి ఊపిరిలూదుతోంది. సామాజిక మాధ్యమాల ఉద్ధృతిలో.. పుస్తక పఠనం ప్రమాదంలో పడిపోయిందనే ఆందోళన వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలోనూ ఠీవీగా దర్శనమిస్తోంది. వైవిధ్యభరితమైన సాహిత్యంతో పాఠకులను ఆకట్టుకొంటోంది. సామాజిక జీవనంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త ఇతివృత్తాలతో పాఠక ప్రపంచాన్ని తట్టి లేపుతోంది. పుస్తకానికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒక్కో వందలు, వేల సంఖ్యలో అమ్ముడవుతోంది. ఈ క్రమంలోనే నవ తరం పాఠకుల అభిరుచికి ప్రాతినిధ్యం వహించే కొత్తతరం రచయితలు ముందుకు వస్తున్నారు. తమదైన ప్రాపంచిక దృక్పథంతో, భావజాలంతో అద్భుతమైన రచనలు చేస్తున్నారు. హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో యువ రచయితల పుస్తకాలు, స్టాళ్లు పాఠకులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ రచయితల కోసం స్వయంగా 7 స్టాళ్లను ఏర్పాటు చేసింది. మరోవైపు పలు ప్రచురణ సంస్థలు సైతం యువ రచయితలకు సముచితమైన ప్రోత్సాహాన్ని అందజేస్తున్నాయి. ఇంచుమించు అన్ని స్టాళ్లలోనూ కొత్త తరం రచయితల పుస్తకాలు కనిపిస్తున్నాయి. రెండో రోజు శుక్రవారం పుస్తక ప్రదర్శన సందర్శకులతో కళకళలాడింది. కొత్తగా.. పొత్తమొచ్చెనా.. హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రతి సంవత్సరం కొత్త రచయితలను పరిచయం చేస్తోంది. ఏటా లక్షలాది మంది పాఠకులు పుస్తక ప్రదర్శనకు తరలి వస్తున్నారు. వేలాది పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. సమస్త ప్రపంచం మొబైల్ ఫోన్లోనే ఇమిడి ఉందని భావిస్తున్న పరిస్థితుల్లోనూ పుస్తకమే సమస్తమై పాఠకులకు చేరువవుతోంది. కొత్తగా రాయాలనుకొనే ఎంతోమందికి ఇది స్ఫూర్తినిస్తోంది. ‘ప్రతి సంవత్సరం బుక్ఫెయిర్కు వస్తాను. మొదట్లో పెద్దగా పుస్తకాలు చదివే అభిరుచి కూడా లేదు.. కానీ క్రమంగా అలవాటైంది. ఓ 20 పుస్తకాలు చదివిన తర్వాత నేను కూడా రాయగలననే ఆత్మస్థైర్యం వచ్చింది. ఇప్పుడు రాస్తున్నాను’ అని ఓ యువ రచయిత అభిప్రాయపడ్డారు. సామాజిక దృక్పథంతో రాస్తున్నవాళ్లు కూడా వినూత్నంగా తమ ఆలోచనలను ఆవిష్కరిస్తున్నారు. ‘తాము సైతం’ అంటూ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో భాగస్వాములవుతున్న పలువురు యువ రచయితలు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను, ఆలోచనలను ఇలా పంచుకున్నారు.రచయితగా మారిన పాఠకుడిని: సురేంద్ర శీలం నేను రచయితను కాదు. పాఠకుడిని. నిజానికి 2019 వరకు పుస్తకాలు పెద్దగా చదవలేదు. ప్రతి సంవత్సరం పుస్తక ప్రదర్శనకు మాత్రం వచ్చాను. మొదట పాఠకుడిగా మారాను. ఆ తర్వాత రాయడం అలవడింది. 2022లో రాసిన ‘పాల్వెట్ట’కు రావిశాస్త్రి సాహితీ పురస్కారం లభించింది. యండమూరి అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ‘నడూరి మిద్దె’ నవలతో పాఠకుల ముందుకు వచ్చాను.చిన్నప్పటి నుంచి రాస్తున్నాను కడలి, రచయిత్రి మా నాన్న పేరు రవి. ఆయన రచయిత. ఆ స్ఫూర్తితో చిన్నప్పటి నుంచి రాస్తున్నాను. ప్రేమ, స్నేహం, మానవీయ విలువలను ప్రధాన అంశాలుగా చేసుకొని రాశాను. చిక్లిట్ కొత్తగా రాసిన నవల. వెయ్యి కాపీలు ప్రింట్ వేశాం. ఇప్పటికే 500 కాపీలు అమ్ముడయ్యాయి. స్త్రీలకు గొంతుకనివ్వడమే నా రచనల ప్రధాన లక్ష్యం. కొన్ని సినిమాలకు స్క్రీన్ప్లేలు కూడా రాశాను. గతంలో రాసిన ‘లెటర్స్ లవ్’ కథల పుస్తకం బాగా అమ్ముడైంది.ఇప్పటి వరకు మూడు, నాలుగు పుస్తకాలు రాశాను.తాతి్వక దృక్పథంతో రాయడం ఇష్టం మహి బెజవాడ మొదటిసారి 2013లో ‘ఊదారంగు చినుకులు’ కథ రాశాను.‘సాక్షి’ పత్రికలో అచ్చయింది. అంతకుముందు బ్లాగ్స్కు ఎక్కువగా రాసేవాడిని. సాక్షిలో ప్రచురించడంతో ఉత్సాహం వచ్చింది. ఏదైనా సరే కొత్తగా చూడడం ఇష్టం. జీవితం, ప్రేమ వంటి విలువల పట్ల నాదైన తాతి్వక దృక్పథంతో రాస్తున్నాను. ఇప్పుడు గన్స్అండ్ మాన్సూన్స్తో పాఠకుల వద్దకు వచ్చాను.కష్టాల నుంచి ‘అన్విక్షికి’ ఆవిర్భావం: వెంకట్ శిద్ధారెడ్డి మొదట్లో నేను రాసిన కథలు, నవలలు అచ్చువేయడం చాలా కష్టంగా ఉండేది. ప్రచురణ సంస్థలు ముప్పుతిప్పలు పెట్టేవి. ఒక పుస్తకాన్ని ప్రచురించి విక్రయించేందుకు రచయితలే డబ్బులు ఇవ్వాలి. చివరకు వాళ్లకు మిగిలేదేం ఉండదు. ఈ అనుభవాలే ‘అనీ్వక్షికి’ ప్రచురణ సంస్థను ఏర్పాటు చేసేందుకు దారితీశాయి. ఇప్పటి వరకు మా సంస్థ నుంచి 200 మంది కొత్త రచయితలు వెలుగులోకి వచ్చారు. ఈ ఏడాది 65 కొత్త పుస్తకాలను ప్రచురించాం. ఒక్కో పుస్తకం ఒక్క రోజులోనే వెయ్యి కాపీలు అమ్ముడైన సందర్భాలు ఉన్నాయి. -
హైదరాబాద్ : 37 వ జాతీయ బుక్ఫెయిర్ ప్రారంభం ..భారీ సంఖ్యలో సందర్శకులు (ఫొటోలు)
-
మంచినీళ్ల కుండ
‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ జదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల జదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుకుకు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతకకర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తల మీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్ లిటరసీ ట్రస్ట్’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతిరోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దారులు మూస్తున్నట్టే!ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్ ఫెయిర్. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం– రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి. -
డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
కవాడిగూడ : నగరంలో 37వ జాతీయ పుస్తక ప్రదర్శనను డిసెంబరు 19 నుంచి 29 వరకూ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ బుక్ఫెయిర్ కార్యదర్శి ఆర్ వాసు వెల్లడించారు. ఈ సందర్భంగా సాక్షితో పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బుక్ఫేయిర్ ప్రారం¿ోత్సవానికి ఎవరు వస్తున్నారు..? అని ప్రశ్నించగా.. 37వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభానికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్లు హాజరవుతారని, పుస్తక ప్రదర్శనను ప్రారంభిస్తారని వాసు తెలిపారు. మొత్తం ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు..? అనేదానికి ఈ పుస్తక ప్రదర్శనలో మొత్తం 347 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో తెలుగు 171, ఇంగ్లి‹Ù, ఇతర భాషలు 135, స్టేషనరీ 10, ప్రభుత్వ స్టాల్స్ 14 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓపెనింగ్స్కి రెండు వేదికలు.. అయితే గతంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, బుక్రిలీజ్ ఫంక్షన్లకు ఒకే వేధిక ఉండేదని, ఈ సంవత్సరం ఒకటి బోయి విజయభారతి పేరుతో, మరొకటి తోపుడు బండి సాదిక్ పేరుతో మొత్తం రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాగా ఈ సారి బుక్ఫెయిర్ ప్రాంగణానికి దాశరథి శతజయంతి సందర్భంగా దాశరథి కృష్ణమాచార్య పేరుతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా.. ప్రతిరోజూ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, రెండు వేదికలపైనా పలువురు కళాకారులు ప్రదర్శనలు ఇస్తారని వివరించారు. దీంతో పాటు స్టాల్స్ నిర్వాహకుల ఇబ్బంది లేకుండా పలు చర్యలు తీసుకుంటున్నామని, ఇందు కోసం హైదరాబాద్ బుక్ఫెయిర్కు 15 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పడిందని, మొత్తం 7 టీములుగా ఏర్పడి, గత రెండు నెలలుగా స్టాల్స్ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, ఏ విధంగా సహాయపడాలో ప్లాన్ వేసుకున్నామని తెలిపారు. మెరుగ్గా.. ఫుడ్ స్టాల్స్.. గతంలో కంటే ఈ సారి కాస్త మెరుగ్గా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ప్రత్యేకమైన వంటకాలకు సంబందించిన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఇరానీ చాయ్, హైదరాబాద్ బిర్యానీ, కబాబ్స్, తెలంగాణ పిండివంటలు, చాట్ ఐటమ్స్ వంటివి ఈ సారి ఆహార ప్రియులకు రుచికరమైన విందును అందించనున్నాయి. పారిశుధ్యానికీ ప్రాధాన్యం..పుస్తక ప్రియులకు గతంలో నిర్వహించిన బుక్ ఫెయిర్లో టాయిలెట్లకు కొంతమేర ఇబ్బందులు కలిగిన మాట వాస్తవమే. ఈ సారి వాటిని అధిగమించడానికి మొబైల్ టాయిలెట్స్తోపాటు ప్రత్యేక టాయిలెట్స్నూ ఏర్పాటు చేశాం. అయితే టైమింగ్స్ విషయంలోనూ కొద్దిగా మార్పులు చేశాం.. గతంలో మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ ఉండేది. ప్రస్తుతం సాహితీ అభిమానుల విజ్ఞప్తి మేరకు మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ బుక్ఫెయిర్ అందుబాటులో ఉంటుంది. -
ఉద్యమ వాస్తవ చరిత్ర..
ప్రపంచీకరణ అనంతరం వ్యక్తివాదం పెరిగి పోయి ఉద్యమాలు ఉండవు అనే ప్రచారం బలంగా నడుస్తున్న కాలంలో ప్రాంతీయ అస్తిత్వ వేదనలోంచి ఎగిసిన విముక్తి పోరాటం తెలంగాణ ఉద్యమం. పల్లెల నుండి పట్టణాల దాకా తెలంగాణ అనని మనిషి లేడు. కులాలు, మతాలకతీతంగా అందరూ ఒక్క గొంతుకగా నినదించిన నినాదం ‘జై తెలంగాణ’. అందులో ముఖ్య భూమిక విద్యార్థులది. మంటలై మండింది, రైళ్ళకు ఎదురెళ్లి ముక్కలైంది, ఉరిపోసుకున్నది, పురుగుల మందు తాగింది. ఏది చేసినా తెలంగాణ అనే ఉద్యమ కాగడను ఆరిపోకుండా చమురు పోసి మండించేందుకే. పాలకులు, ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు ఉద్యమానికి ద్రోహం చేసినప్పుడు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది విద్యార్థులే.విద్యార్థులు ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం వెనుక స్వాతంత్య్ర ఉద్యమం, రైతాంగ సాయుధ పోరాటం, తొలిదశ తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ పోరాటాల స్పూర్తి, ప్రభా వాలు ఉన్నాయి. ఆ చైతన్యమే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. అట్లా ఎగిసిన విద్యార్థి ఉద్యమం రాజకీయ పార్టీల కనుసన్నల్లోకి ఎలా పోయింది? దానికి పని చేసిన శక్తులేవి? తెలంగాణ ఉద్యమం ఏకశిలా సదృశ్యం అనుకుంటున్న చోట నిలబడిన, కలబడిన, వెనక్కి తగ్గిన శక్తులను బహిర్గత పరచిన పరిశోధన ఈ పుస్తకం. ఒక్కమాటలో, కళ్ళముందే వక్రీకరణలకు గురవుతున్న తెలంగాణ ఉద్యమ వాస్తవ చరిత్ర ఇది. ఈ పరిశోధన తెలంగాణ ఉద్యమకారుడే (నలమాస కృష్ణ) పరిశోధకుడిగా చేసిన ప్రయత్నం.ఇది అకడమిక్ పరిశోధన కాబట్టి దీనికి పరిమితులు ఉన్నా... ఇది ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని సమగ్రంగా నమోదు చేసిందని మాత్రం చెప్పవచ్చు. అలా భవిష్యత్తు పరిశోధనకు దారులు వేసిందన్నమాట. ఉద్యమం నడుస్తుండగానే తీరికలేని కార్యాచరణలో దాని తీరూ తెన్నులపై చేసిన ఓ విశ్లేషణ ఇది. ఆ పరిమితుల్లో దీన్ని అర్థం చేసుకుంటూ అధ్యయం చేయాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో జరుగనున్న ఈ పుస్తకావిష్కరణకు అందరూ ఆహ్వానితులే. – అరుణాంక్, డేవిడ్ (నేడు హైదరాబాద్లో ‘ఉస్మానియా వెలుగులో తెలంగాణ విద్యార్థి ఉద్యమం’ పుస్తకావిష్కరణ) -
‘చదువరి చెంతకు పుస్తకం’.. ప్రారంభం కానున్న జాతియ పుస్తక ప్రదర్శన!
సాక్షి, సిటీబ్యూరో: పుస్తక ప్రియులకు పండగే. చదువరులకు ఇక వరమే. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన వచ్చేసింది. ఏటా డిసెంబర్ చివరి 10 రోజుల పాటు నిర్వహించే ప్రదర్శన ఈసారి ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో రెండు నెలలు ఆలస్యమైంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ నెల 19 తేదీ వరకు కొనసాగనుంది. ‘చదువరి చెంతకు పుస్తకం’అనే లక్ష్యంతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ గత ఏడేళ్లుగా ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఏటా 6 నుంచి 7 లక్షల మందికి పైగా పుస్తకప్రియులు ప్రదర్శనలో పాల్గొంటున్నారు. నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలతో పాటు చరిత్ర, సామాజిక, తత్వ శాస్త్రాలు, విజ్ఞాన గ్రంథాలకు పాఠకాదరణ పెరిగింది. మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం కొన్ని ప్రచురణ సంస్థలు ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తెస్తున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలకు ఆదరణ పెరిగిందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. కోల్కతాలో గత జనవరిలో నిర్వహించిన పుస్తక ప్రదర్శనలో సుమారు 29 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు సైతం ప్రతి సంవత్సరం పాఠకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఏటా లక్షలాది పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. డిజిటల్ మీడియా వెల్లువలోనూ.. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వెల్లువలోనూ పుస్తకానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ‘సామాజిక చింతనకు, ప్రాపంచిక దృక్పథాన్ని అలవర్చుకొనేందుకు సాహిత్య అధ్యయనం ఒకటే మార్గం. సాహిత్యాన్ని జీవితంలో భాగంగా చేసుకున్నవాళ్లే గొప్ప విజేతలుగా నిలుస్తారు. అలాంటి అభిరుచి కలిగిన పాఠకులు కోట్లాది మంది ఉన్నారు’ అని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాలు ఉద్ధృతంగా వెల్లువెత్తినా గత ఏడేళ్లుగా పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా కొనసాగడం, లక్షలాది పుస్తకాలు అమ్ముడు కావడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మరోవైపు ప్రతి సంవత్సరం వందల కొద్దీ కొత్త పుస్తకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. పుస్తక ప్రదర్శన స్ఫూర్తితో ఎంతోమంది రచయితలు తమ సృజనాత్మకతకు పదును పెట్టుకుంటున్నారు. ఈసారి పుస్తక ప్రదర్శనలో సదస్సులు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కవులు, రచయితలు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సంవత్సరం 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వందలాది పుస్తక ప్రచురణ సంస్థలు ప్రదర్శనలో పాల్గొననున్నాయి. పిల్లలకు ప్రత్యేక పోటీలు.. బాల వికాస్ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోటీలు ఉంటాయి. జానపద నృత్యాలు, ఫ్యాన్సీడ్రెస్ పోటీలు, క్విజ్, మాట్లాడే బొమ్మ, పిల్లల గ్రంథాలయాల ఆవశ్యకతపై చర్చ, హస్తకళల వర్క్షాపు, గ్రూప్డ్యాన్స్, సోలోడ్యాన్స్, పాటలు, పద్యాలు, పెయింటింగ్, స్టోరీ టెల్టింగ్ తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రవేశం ఉచితం. ఇతరులకు ప్రవేశ రుసుము రూ.10. పుస్తక మహోత్సవంలో భాగంగా సాంస్కృతిక, కళా రూపాలను ప్రదర్శించనున్నారు. పుస్తక ప్రదర్శన ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. -
సాహిత్య ఒడంబడికలు
59 ఏళ్ల ఆ వ్యాపారవేత్తకు నయంకాని చర్మవ్యాధి వస్తుంది. కాళ్లకు ఎప్పుడూ పట్టీలు కట్టాల్సిన పరిస్థితి. భార్య ఇష్టపడదు. అతణ్ణి తాకనివ్వదు. అసహనం కమ్ముకున్న వ్యాపారవేత్త విసిగిపోయి తన గోడౌన్ లో నివసించడం ప్రారంభిస్తాడు. ఒక్కగానొక్క కొడుక్కి తండ్రి గురించి బెంగ. అతను తండ్రి బాగోగుల కోసం ఒక మహిళను తెచ్చి పెడతాడు. ఆ మహిళ ఆ వ్యాపారవేత్త పట్ల కారుణ్యమూర్తి అవుతుందా? మానవ స్వభావాలు ఎట్టి పరిస్థితుల్లో ఏమేమిగా మారుతుంటాయి? తమిళ సాహిత్యంలో నిన్న మొన్న పూచిన కలం ముతురాస కుమార్ రాసిన ఇలాంటి కథలున్న సంకలనాన్ని ‘మీ భాషలోకి అనువదిస్తారా... మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయు) సైన్ చేస్తారా’ అని కన్నడ, మలయాళ పబ్లిషర్లతో సూటూ బూటూ వేసుకుని చర్చిస్తున్న లిటరరీ ఏజెంట్ అక్కడ కనిపించింది. ‘ఇమయం’ కలం పేరుతో పాతికేళ్లుగా రాస్తున్న స్కూల్ టీచర్ వి.అన్నామలై కిడ్నీ బాధితుల జీవితాన్ని నవలగా రాయడానికి ఏకంగా సైంటిస్ట్ అంతటి పరిశోధన చేశాడు. కిడ్నీ ఎలా పని చేస్తుంది, ఎందుకు పాడవుతుంది, పాడయ్యాక ఎలా ఎదుర్కొనాలి, ఇందులో మందుల, ఆస్పత్రుల గూడుపుఠానీ ఏమిటనేవి వివరిస్తూ ‘ఇప్పోదు ఉయిరోడు ఇరిక్కిరేన్ ’ పేరుతో నవల రాస్తే వెంటనే ‘ఐయామ్ ఎలైవ్.. ఫర్ నౌ’ పేరుతో ఇంగ్లిష్లోకి అనువాదమైంది. అది సరిపోతుందా? స్పానిష్, టర్కిష్, నేపాలీ, లేదంటే తెలుగు భాషల్లోకి అనువాదమైతేనే కదా తమిళ నవల గొప్పదనం తెలిసేది! ‘అనువాదం చేయించి పబ్లిష్ చేస్తారా మరి’ అని మరో లిటరరీ ఏజెంట్ అక్కడ విదేశీ పబ్లిషర్ల డెస్క్ల దగ్గర తిరుగాడుతూ కనిపించాడు. ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్ఫెయిర్ 2024’ పేరుతో చెన్నపట్టణంలో జనవరి 16–18 తేదీల్లో మూడురోజులు సాగిన పుస్తక ప్రదర్శన నిజానికి ‘రైట్స్ హబ్’. ఇది తమిళనాడు ప్రభుత్వ పూనికతో, తమిళ సాహిత్యాన్ని ప్రపంచానికి అనువాదం చేసి అందించడానికి హక్కుల క్రయవిక్రయాలకు నియోగించిన వేదిక. మిగిలిన భారతీయ భాషల్లో రచయితలు తాము రాసిన పుస్తకాలను ఇతర భాషల్లో అనువదించుకోవడానికి పాట్లు పడాలి. కాని తమిళనాడు ప్రభుత్వం తన భాషా సాహిత్యాన్ని అనువాదం చేయించడానికి గత రెండేళ్లుగా ఈ రైట్స్ హబ్ నిర్వహించడమే కాదు అందుకు ‘తమిళనాడు ట్రాన్ ్సలేషన్ గ్రాంట్’ పేరుతో ఆర్థిక అండ కూడా అందిస్తోంది. అంటే మీరొక పబ్లిషరై ఒక తమిళ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయించి ప్రచురిస్తానంటే ఒక్కో పుస్తకానికి పేజీల సంఖ్యను బట్టి గరిష్ఠంగా రెండున్నర లక్షలు మంజూరు చేస్తుంది! రెండున్నర లక్షలు!! దానికి బదులుగా మీరు 500 కాపీలు ప్రచురిస్తే 50 కాపీలు, 1000 కాపీలు ప్రచురిస్తే 100 కాపీలు ప్రభుత్వానికి దఖలు పరచాలి. గ్రాంటు డబ్బుల్లో అనువాద ఖర్చులు, బుక్మేకింగ్ ఖర్చులు, ప్రింటింగ్ ఖర్చులు బాగానే సరిపోతాయి. కాపీలు అమ్ముకోగా వచ్చిన డబ్బులు పబ్లిషర్లవే! ‘తమిళంలో గత వందేళ్లలో గొప్ప సాహిత్యం వచ్చింది. ప్రపంచ సాహిత్యానికి ఇది ఏ మాత్రం తక్కువ కాదు. మేము ఇప్పటి వరకు రష్యన్, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ నుంచి అనువాదాలు బోలెడు చేసుకున్నాం. బయట దేశాల, భారతీయ భాషల సాహిత్యం తమిళ అనువాదాల ద్వారా చదివాం. ఇప్పుడు మీ వంతు. మా సాహిత్యాన్ని చదవండి. అనువాదం చేసుకోండి. మా సాహిత్యాన్ని మీకు చేరువ కానీయండి’ అని బుక్ ఫెయిర్ అనుసంధానకర్త, రచయిత మనుష్యపుత్రన్ ప్రారంభ కార్యక్రమంలో అన్నారు. గత సంవత్సరం నుంచి మొదలైన ఈ గొప్ప సంకల్పం సత్ఫలితాలను ఇస్తోంది. 2023లో జరిగిన చెన్నై ఇంటర్నేషనల్ బుక్ఫెయిర్లో దేశీయంగా, విదేశీయంగా 100కు పైగా తమిళ పుస్తకాల అనువాదాలకు ఎంఓయులు జరిగితే ఇప్పటికి 52 పుస్తకాలు వెలువడ్డాయి. వీటిలో చైనీస్, అరబిక్, మలయా, కొరియన్, కన్నడ, మలయాళ భాషల్లో వెలువడ్డ తమిళ పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు తమిళ కథారచయిత సుజాత కథలు తమిళం ద్వారా పాఠకులకు తెలుసు. ఇప్పుడు చైనీస్ ద్వారా మొత్తం చైనాకు తెలుసు. చెన్నై ఇంటర్నేషనల్ బుక్ఫెయిర్ 2024లో పాల్గొన్న 40 దేశాల పబ్లిషర్లు, భారతీయ భాషల పబ్లిషర్లు ఫెయిర్ ముగిసే సమయానికి 750 ఎంఓయులు చేసుకున్నారు. ఇవన్నీ తమిళం నుంచి ఇతర భాషలకు మాత్రమే కాదు... ఇతర భాషల నుంచి తమిళ లేదా ఏ భాషలోకైనా గానీ! అయితే తమిళనాడు ప్రభుత్వ ట్రాన్ ్సలేషన్ గ్రాంట్ మాత్రం తమిళం నుంచి ఇతర భాషల్లోకి అనువాదమయ్యే పుస్తకాలకే! తమిళ ప్రభుత్వం ఈ ఒడంబడికల కోసం ఎంత శ్రద్ధ పెట్టిందంటే ఇంగ్లిష్ రాని రచయితల, పబ్లిషర్ల తరఫున చర్చలు చేయడానికి 20 మంది లిటరరీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి మరీ రంగంలో దింపింది. ఎంత బాగుంది ఇది! ఏ ప్రభుత్వానికైనా తన సాహిత్య సంపద పట్ల ఉండవలసిన కనీస అనురక్తి ఇది!! మరి మన సంగతి? తెలుగు సాహిత్యం నుంచి ఇలాంటి ప్రయత్నం చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు అనాసక్తి లేకపోవచ్చు. తమ సాహిత్యాన్ని కాపాడుకోవాలనుకునే తపన ఆ రెండు ప్రభుత్వాలకు తప్పక ఉండి ఉండొచ్చు. కాకుంటే సాహిత్య ప్రపంచం నుంచి, శాసనాధీశుల నుంచి, పాలనా వ్యవస్థలోని చదువరులైన ఐ.ఏ.ఎస్ అధికారుల నుంచి తగిన చొరవ, ఒత్తిడి కావాలంతే! ‘చలం రాసిన ‘మైదానం’ను కొరియన్ లోకి అనువదిస్తారా?’ అని ఒక లిటరరీ ఏజెంట్, ‘గుఱ -
హైదరాబాద్ లో 35వ నేషనల్ బుక్ ఫెయిర్
-
Hyderabad Book Fair : ఎన్టీఆర్ స్టేడియంలో పుసక్త ప్రియుల సందడి (ఫొటోలు)
-
Hyderabad National Book Fair: బుక్ఫెయిర్కు 10 లక్షల మంది!
పంజగుట్ట: రాబోయే తరానికి దార్శనికతను అందించేందుకు బుక్ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. అక్షరాస్యత పెరుగుతున్న విధంగానే పుస్తకపఠనం కూడా పెరుగుతుందని, అది డిజిటల్, నెట్ ఏవిధంగా చదివినా అన్నింటికీ తల్లి మాత్రం పుస్తకమే అని ఆయన పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్ఫెయిర్ విశేషాలను ఆయన వెల్లడించారు. ఒగ్గు కథలకు ప్రాణం పోసిన మిద్దె రాములు ప్రాంగణంగా, కవి, రచయిత అలిశెట్టి ప్రభాకర్ వేదికగా ఈ యేడు నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి 2023 జనవరి 1వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు, శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శన కొనసాగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుక్ఫెయిర్కు ఎన్టీఆర్ స్టేడియంను ఉచితంగా ఇవ్వడమే కాకుండా, నిర్వహణకు కూడా సాంస్కృతిక శాఖ ద్వారా నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది 340 స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు, పబ్లిషర్స్ వస్తారని చెప్పారు. మొదటి రోజు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, సబితతోపాటు పత్రికల సంపాదకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరవుతారని జూలూరి వెల్లడించారు. కాగా, సీఎం కేసీఆర్పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. -
Hyderabad Book Fair 2022: హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎప్పటి నుంచి అంటే?
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రకాల సాహిత్యాన్ని ఏటా ఒక్కచోటకు తెచ్చే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన మరోసారి పుస్తకప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. కోవిడ్ దృష్ట్యా సందర్శకుల ఆదరణ పెద్దగా ఉండదన్న ఉద్దేశంతో నిర్వాహకులు గతేడాది 260 స్టాళ్లనే ఏర్పాటు చేసినప్పటికీ పుస్తకప్రియులు భారీగా తరలిరావడంతో ప్రదర్శన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఈసారి 320 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తెలిపారు. అంచెలంచెలుగా... నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతోపాటు తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ ఇంగ్లిష్ పుస్తకాలు చదివే ప్రజలు మొదటి నుంచీ ఇక్కడ ఉన్నారు. పాఠకుల అభిరుచికి తగిన విధంగానే పుస్తక ప్రచురణ సంస్థలు ఆవిర్భవించాయి. కోఠిలోని బడీచౌడీ పుస్తక బజార్గా వెలుగొందింది. అక్కడి పుస్తక విక్రేతలే హైదరాబాద్ బుక్ ఫెయిర్కు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పుస్తక పఠనాన్ని పెంచే లక్ష్యంతో ఆవిర్భవించిన నేషనల్ బుక్ ట్రస్ట్ నగరంలోని పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థలతో కలసి 1986లో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ను తొలిసారి కేశవ మెమోరియల్ స్కూల్ మెదానంలో ఏర్పాటు చేసింది. ఆ తరువాత నిజాం కళాశాల మైదానం, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, నెక్లెస్రోడ్ తదితర ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. కథలు, నవలలు, గల్పికలు, చరిత్ర గ్రంథాలదే పుస్తక ప్రదర్శనల తొలినాళ్లలో అగ్రస్థానం. సోవియెట్ సాహిత్యం కూడా పాఠకులను బాగా ప్రభావితం చేసింది. క్రమంగా ప్రముఖుల జీవిత చరిత్రలు, పంచతంత్ర వంటి పిల్లల పుస్తకాలు ఆదరణ పొందాయి. అలాగే యోగా, ఆయుర్వేద, హోమియో వైద్య పుస్తకాలు సైతం బాగా అమ్ముడవుతున్నాయి. ఇటీవల కాలంలో పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్కు డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఏడాది కూడా విభిన్న రంగాలకు చెందిన పుస్తకాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తదితరులు మంగళవారం మంత్రిని కలిశారు. పుస్తక ప్రదర్శనకు తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్) స్టేడియంలో అనుమతివ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు మంత్రి ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ 35 ఏళ్లుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని భాషల పుస్తకాలతో పాటు తెలుగు భాషా సంస్కృతి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, దేశవ్యాప్తంగా 300 లకుపైగా పబ్లిషర్స్ రావడంతో ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా మారిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ‘తానా’ అంతర్జాతీయ కార్టూన్ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు) -
పర్స్లు కొట్టేస్తూ పోలీసులకు చిక్కిన నటి, విచారణలో షాకింగ్ విషయాలు
Actress Rupa Dutta Arrested For Theft Wallets: ప్రముఖ టీవీ నటి దొంగతనానికి పాల్పడిన సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. బెంగాలీ టీవీ నటి రూపా దత్త ఓ బుక్ఫేయిర్లో చోరీ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. దీంతో కలకత్తా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త బెంగాలీ సినీ పరిశ్రమలో హాట్టాపిక్గా మారింది. వివరాలు.. బెంగాలీ సీరియల్స్తో రూపా దత్తా నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో కలకత్తాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ బుక్ఫేయిర్లో ఖాళీ పర్సు చెత్త బుట్టలో పడేస్తూ పోలీసులకు చిక్కింది. చదవండి: Poonam Kaur: ప్రభాస్ అలాంటి వాడు, పూనమ్ ఆసక్తికర వ్యాఖ్యలు దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను చెక్ చేయగా.. బ్యాగ్లో ఎన్నో వ్యాలెట్లు భయపడ్డాయి. అందులో రూ. 70వేలకు పైగా నగదు ఉంది. దీంతో ఆ నగదుతో పాటు ఓ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకుని రూపాను విచారించారు. ఈ క్రమంలో ఆమె అసలు విషయం చెప్పిందని, తానే దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు కలకత్తా పోలీసులు తెలిపారు. డబ్బుతో బయటపడిన డైరీ పలు సంచలన విషయాలు వెలుగు చూశాయని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. పోస్టర్ రిలీజ్ రూపా దత్తాకు చోరీ చేయడం కొత్తేమి కాదని, అంతకుముందు చాలా సార్లు చోరీలు చేసిందని, వాటికి సంబధించిన వివరాలన్నీ డైరీలో రాసుకుందని తెలిపారు. ఈ విషయాన్ని రూపా కూడా అంగీకరించింది. కోల్కతాలోని రద్దీ ప్రదేశాలలో పిక్ ప్యాకెట్స్ చేసేదాన్ని అని, డబ్బు కోసం ఇలా చేయాల్సివచ్చిందని తెలిపింది. దీంతో ఆమెపై పలు కేసులు నమోదు చేసి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్పై ఇటీవల రూపా దత్తా లైంగిక ఆరోపణలు చేసి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. -
పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడు
సాక్షి, అమరావతి/వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 32వ పుస్తక మహోత్సవాన్ని శనివారం వెబినార్ విధానంలో గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ భాషల నుంచి ఎంపిక చేసిన రచనలను తెలుగులోకి అనువదించడం ద్వారా ఇక్కడి పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలన్నారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రపై జ్ఞానం సుసంపన్నం అవుతుందన్నారు. దక్షిణ భారతదేశంలో ఏటా జరిగే అతిపెద్ద పుస్తక మహోత్సవాల్లో ఒకటిగా విజయవాడ పుస్తక మహోత్సవం గుర్తింపు పొందటం ముదావహమన్నారు. పుస్తకం మనల్ని విజ్ఞానం, వినోదం, కొత్త ఆలోచనా ప్రక్రియల ప్రపంచంలోకి తీసుకువెళుతుందని, ఒక పుస్తకం నిజమైన స్నేహితుడిగా ఉంటూ పాఠకుడి నుంచి ఏవిధమైన ప్రతిఫలం ఆశించదన్నారు. ఒక రచయితగా, పుస్తక ప్రేమికుడిగా తనకున్న అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని, చిన్న వయసులోనే పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు చేయాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమెస్కో అధ్యక్షుడు విజయ్కుమార్, పుస్తక మహోత్సవ కో–ఆర్డినేటర్ మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుక ఏపీ రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలను శనివారం నిరాడంబరంగా నిర్వహించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్ రూపొందించిన 2022 క్యాలండర్ను ప్రత్యేక ప్రధాన కా>ర్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర అధికారుల సమక్షంలో గవర్నర్ ఆవిష్కరించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ విజయానంద్ సిబ్బందితో వచ్చి గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. దేవదాయ శాఖ కార్యదర్శి వాణీమోహన్ నేతృత్వంలో టీటీడీ పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, డీజీపీ డి.గౌతం సవాంగ్, నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా, ముఖ్య సమాచార కమిషనర్ రమేష్కుమార్, కమిషనర్లు రవికుమార్, రమణకుమార్, జనార్ధనరావు, ఐలాపురం రాజా, శ్రీనివాసరావు, హరిప్రసాదరెడ్డి, చెన్నారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ సంచాలకుడు అర్జునరావు తదితరులు గవర్నర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాజ్భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. -
హైదరాబాద్: బుక్ ఫెయిర్కు పోటెత్తిన పాఠకులు
-
పుస్తకాలు చదివే కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు
కవాడిగూడ (హైదరాబాద్): పుస్తకాలు చదవడంతోనే ప్రజలకు మంచి పరిపాలన అందించడం సాధ్యమవుతుందని, అందుకుని దర్శనమే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పాలన అని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల వేలాది పుస్తకాలు చదివి తెలంగాణను సాధించారని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సాధనకోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజలను చైతన్య పరిచి రాష్ట్రానికి తన జీవితాన్ని అర్పించారని మంత్రి వివరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్కు బోనాలతో స్వాగతం పలికారు. చిందు ఎల్లమ్మ వేదికపై జరిగిన సమావేశంలో బుక్ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ బుక్ఫెయిర్కు ఎల్లప్పుడు పూర్తి సహకారం ఉంటుందని హామీనిచ్చారు. గోల్కొండ పత్రికతో కవులు, రచయిత సంఖ్య తెలియజెప్పారు నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతంలో కవులు రచయితలు లేరన్న సందర్భంలో సు రవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక నిర్వహిస్తూ తెలంగాణలో కవులు రచయితల సంఖ్యను చెప్పిన మహోన్నత వ్యక్తి అని మంత్రి గుర్తు చేశారు. నిరంతరం బుక్ఫెయిర్ నిర్వహించేందుకు రవీంద్రభారతిలో స్థలం కేటాయిస్తామని బుక్ఫెయిర్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. గౌ రీశంకర్ మాట్లాడుతూ బుక్ఫెయిర్ను పుస్త క ప్రేమికులు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సాంస్కృతిశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మదర్ ఫెయిర్
‘మనసు ఉంటే మార్గమూ ఉంటుంది’. చెన్నై బుక్ ఫెయిర్ ఈ నానుడిని నిజం చేస్తోంది. కోవిడ్ కారణంగా ఇల్లు కదలని వాళ్లు కూడా బుక్ ఫెయిర్కు వస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ మొదలైన ఈ బుక్ ఫెయిర్ మార్చి తొమ్మిది వరకు కొనసాగుతుంది. చెన్నైలోని నందనం, వైఎమ్సీఏలో ఏడు వందల స్టాళ్లతో మొదలైన ఈ బుక్ ఫెయిర్లో వేలాది పుస్తకాలున్నాయి. సాధారణంగా బుక్ ఫెయిర్లో పుస్తకప్రియులతోపాటు రచయిత లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ దఫా కూడా రచయితలు తమ పుస్తకాల పట్ల పాఠకుల రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం రోజూ బుక్ ఫెయిర్ కు వస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రత్యేకం ఏమిటంటే... పేరెంట్స్ తమ పిల్లలను బుక్ ఫెయిర్కు తీసుకురావడం. పేరెంట్స్లో కూడా తల్లులే అధికంగా కనిపిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఏడాది నుంచి గడపదాటలేదు. ఆన్లైన్ క్లాసుల్లో పాఠాలతో పిల్లలు విసిగిపోతున్నారు. వాళ్లకు నచ్చే పుస్తకాలు కొనిద్దామని తీసుకువచ్చామని చెబుతున్నారు బుక్ ఫెయిర్కి పిల్లలతో వచ్చిన తల్లులు. ‘ఈ కోవిడ్ విరామం పిల్లలకు ఇష్టమైన పుస్తకాలు చదువుకోవడానికి బాగా ఉపకరిస్తుంది. మనకు నచ్చినవి కొనుక్కుని వెళ్లి వీటిని చదవండి అంటే పిల్లలకు చదవాలనే ఆసక్తి కలగదు. వాళ్లనే తీసుకు వచ్చి చూపించినట్లయితే తమకు ఇష్టమైన వాటినే ఎంచుకుంటారు, ఇష్టంగా చదువుతారు కూడా’ అన్నారు తన ఇద్దరు పిల్లలతో బుక్ ఫెయిర్ కొచ్చిన రాజి. బుక్ ఫెయిర్లో జనసమ్మర్ధం విపరీతంగా ఉంటుందేమోనని రావడానికి కొంచెం భయపడ్డాం. కానీ ఇక్కడ ఎప్పుడూ ఉండే రష్ లేదు. మాస్కు లేకుండా వచ్చిన వాళ్లను వెనక్కి పంపించకుండా ఇక్కడ మాస్కు ఇస్తున్నారు. శానిటైజర్ కూడా అందుబాటులో ఉంచారు. నిర్వహకులు కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటిస్తున్నారు. దాంతో ధైర్యంగా ఎక్కువ సమయం ఉండగలుగుతున్నాం. కొత్త పుస్తకాలను కూడా డిస్కౌంట్లో ఇస్తున్నారు. దాంతో నాలుగు కొనాలనుకున్న వాళ్లు కూడా మరో రెండు ఎక్కువగా తీసుకుంటున్నాం’ అన్నారామె. చెన్నై బుక్ ఫెయిర్లో షాపింగ్ -
ఈచ్ వన్–టీచ్ వన్కు పుస్తకం పనిముట్టు
33వ జాతీయ పుస్తకప్రదర్శన హైదరాబాద్ మహానగరంపై చెరిగిపోని సంతకం చేసింది. మాకు కొండంత అండగా ఉన్న రాష్ట్రముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావుకు హైదరాబాద్ బుక్ఫెయిర్ అభినందనలు తెలియజే స్తుంది. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు సాగిన ఈ పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా ముగిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ‘ఈచ్ వన్–టీచ్ వన్’ పిలుపునందుకుని ఈ పుస్తక ప్రదర్శనలను ఒక ఉద్యమంగా గ్రామగ్రామానికి తీసుకుపోతామని బుక్ఫెయిర్ నిర్వాహక కమిటీ ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలు, గ్రామ పంచాయ తీలు, పోలీస్స్టేషన్లు, మున్సిపాల్టీలు, పట్టణాల లోని అపార్ట్మెంట్ల దాకా పుస్తక ప్రదర్శనలను తీసుకుపోయేందుకు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకుంది. మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పలు హోదాలలో వున్న ప్రతినిధులు, పాలనారంగానికి చెందిన ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అన్ని కార్యక్రమాలకు పూలదండలు, శాలువాలు, బోకేలకు బదులుగా పుస్తకాలను బహుమతులుగా ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని పుస్తక ప్రదర్శన కోరుతుంది. బహుమతులుగా ఇచ్చిన పుస్తకాలను తిరిగి పేద విద్యార్థులకు, విద్యాసంస్థలకు బహూకరిస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. హైదరాబాద్ మహానగరం నుంచి 33 జిల్లాల వరకు పుస్తక ప్రదర్శనలను తీసుకుపోవడమే కాకుండా ఇకపై చేయబోయే పుస్తక ప్రదర్శనలను ‘‘టీచ్ వన్–ఈచ్ వన్’’ నినాదంగా ముందుకు తీసుకుపోవాలి. జ్ఞాన తెలంగాణ కోసం 2020 సంవత్సరం పొడుగుతా పుస్తక ప్రదర్శనలను కొనసాగించి ‘అక్షర తెలంగాణ’గా రూపొందించేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కేజీ టు పీజీ విద్యను పటిష్టం చేసేందుకు పుస్తక ప్రదర్శనలను ఒక పని ముట్టుగా అందించాలన్న దీక్షతో కృషి చేయాల్సి ఉంది. పుస్తక ప్రదర్శనలంటే అమ్మకాలు, కొనుగోలు కార్యక్రమాలు అన్న దృక్పథాన్ని మార్చి పుస్తక ప్రదర్శనలను కూడా నాలెడ్జ్ సెంటర్లుగా మార్చేం దుకు ప్రయత్నించడం ఒక పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో ఆరేళ్లుగా పుస్తక ప్రదర్శనల సందర్భంగా వందల కాలేజీల్లో, స్కూళ్లలో సెమినార్లు నిర్వహించడం జరిగింది. పిల్లలతో వక్తృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహించి పుస్తకంపై ప్రచారం కొనసాగించారు. మాతృభాషను సంరక్షించుకునే పనిని, తెలుగు భాషపై ప్రేమను, మమకారాన్ని పెంచేం దుకు, కొత్త తరానికి తెలంగాణ సంస్కృతిని, చరిత్రను, సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని అందించే విధంగా పుస్తక ప్రదర్శనలను తీర్చిదిద్దాలన్న తలంపుతో బుక్ఫెయిర్ కమిటీ ముందుకు సాగడం మొత్తం సమాజం ఆహ్వానించదగింది. పుస్తకాలు చదవటంపై అభిలాషను పెంచటం పుస్తక ప్రదర్శన లక్ష్యం. గ్రంథాలయాలు చేసే పనిని బుక్ఫెయిర్ కూడా తమ శక్తి మేరకు చేయా లని తలంచటం రాష్ట్ర గ్రంథాలయాల పునర్నిర్మాణ ఉద్యమానికి దోహదపడుతుంది. ఆసక్తిగల పాఠకులతో బుక్లవర్స్ గ్రూప్స్ ఏర్పాటు చేసి సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాల్సి ఉంది. సంపూర్ణ అక్షరాస్యతకు కావాల్సిన సాహిత్యాన్ని శక్తికొద్దీ బుక్ఫెయిర్ ద్వారా కూడా అందించే ప్రయత్నం ముమ్మరంగా జరగాలి. ఇప్పటికే వయోజన విద్యాకేంద్రాల ద్వారా సాహిత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. బుక్ఫెయిర్ నిర్వహణదారులు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు సంపూర్ణ అక్షరాస్యతకు ప్రోత్సాహం కల్గించే విధంగా సాహిత్యాన్ని తయారుచేసి అందించే పనిని శక్తికొద్దీ చేయాలని నిర్ణయం తీసుకోవడం శుభసూచకం. ఈ స్ఫూర్తితో 2020 సంవత్సరానికి 2020 పుస్తక ప్రదర్శనలు జరపాలని బుక్ఫెయిర్ తీసుకున్న నిర్ణయం విజయవంతమైతే అది ‘ఈచ్ వన్–టీచ్ వన్’ నినాదానికి అండగా మారుతుంది. వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్, అధ్యక్షులు, హైదరాబాద్ బుక్ఫెయిర్ -
విజేత ఉంటే విజయం మీ వెంటే!
-
బుక్ఫెయిర్లో ఆ స్టాల్స్ ఎంతో ప్రత్యేకం!
-
‘ఫోన్లు కాదు పిల్లలకు పుస్తకాలు ఇవ్వాలి’
-
‘ప్రేమ ఎప్పుడు ఒంటరిగా ఉండదు’
-
బుక్ ఫెయిర్
కలల వరద ప్రపంచంతో సంభాషించడా నికి అరుణాంక్ లత ఒక స్వప్న మార్గాన్ని ఎన్నుకున్నాడు. కలలో తొణికిన ప్రేమను అంతే జాగ్రత్తగా లేఖలుగా మలిచి పాఠకుల ముందుకు తెచ్చాడు. ‘యే తొలి సంధ్య వేళ సూర్యోదయమో, మలి సంధ్య వేళ చంద్రోదయమో చూసినప్పుడు తెరలు తెరలుగా చుట్టుము’ట్టే జ్ఞాపకాల పునాదులు ‘ఖ్వాబ్’లో ఉన్నాయి. ‘హృదయం బద్దలయ్యాక బతికి ఇంకా చేసేదేముందని. అయినా, పగిలిన హృదయంతోనూ ప్రేమించాను కదూ’ అని కలవరిస్తాడు. ఇందులో గుండె ఉక్కబోతలు, వాన పలకరింపులే కాదు, ఒక విధ్వంసం కోసం మరో విధ్వంసానికి బలవుతున్న నల్లమల వ్యథ, అసు వులు బాస్తున్న అఖ్లాక్ల కథ, వాఘా యుద్ధోన్మాద ప్రకటనలపై విసుర్లు కూడా ఉంటాయి. అందుకే ఇది ప్రేమ, విప్లవాల మేలుకలయిక. మరోవైపు తలత్, సైగల్ గొంతుల పలవరింత మైమరపిస్తుంది. మీరూ వినండి. (ఖ్వాబ్ –అరుణాంక్ లత, వెల: రూ. 120) బస్తర్ తిరుగుబాటు స్వాతంత్య్ర పోరాటంతో సహా ఆదివాసీలు ఎన్నో అసమాన పోరాటాలు చేసినా అవి ఎందుకో సరైన రీతిలో సమగ్రంగా చరిత్రకు ఎక్కలేదు. అలా విస్మృతికి గురైన మరో పోరాటం భూంకాల్ విప్లవ పోరాటం. ఆ పోరాటం నుంచి ఆవిర్భవించినవాడే గుండాధూర్. రాజకీయ నేతలెవరూ ఇంకా స్వాతంత్య్రం కోసం ఎలుగెత్తక ముందే ఆదివాసీ సమాజం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించి, తన జీవిత కాలంలోనే పురాణ పురుషుడిగా ఖ్యాతినొందాడు గుండాధూర్. 1910లో 30 గోండు రాజ్యాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భూంకాల్ తిరుగుబాటు అనివార్యమైంది. గుండాధూర్ చేసిన పోరాటాలు బస్తర్ ప్రాంతంలోని ఆదివాసీలను ఉత్తేజితులను చేస్తూనే ఉంటాయి. (భూంకాల్– బస్తర్లో ఆదివాసీల తిరుగుబాటు–హెచ్.ఎల్.శుక్లా, వెల: రూ. 130) నమ్మకమిచ్చే కథలు కథలన్నీ సంకలనంగా రాకముందే, రచయితగా పాఠకులను మెప్పించినవారు అరుదుగా ఉంటారు. అలాంటివారిలో అక్కిరాజు భట్టిప్రోలు ఒకరు. వస్తువును స్వీకరించడంలో, దాన్ని నడిపించడంలో, పాత్రలకు సహజత్వాన్ని అద్దడంలో.. వెరసి పాఠకుడిని కథలోకి ఆవాహన చేయడంలో ఆయన చేయి తిరిగినవాడని ‘మూడు బీర్ల తర్వాత’ సంపుటం నిరూపిస్తుంది. తాను చూసిన జీవితంలోంచే కథా వస్తువులను స్వీకరించాడు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలోని మహిళ అంతరంగాన్ని ఆవిష్కరించడంలో, అనుభూతి ప్రకంపనలు కోల్పో కుండా కొన్నిసార్లు కథను తర్కబద్ధంగా నడిపించడంలో, ఎవరినీ తప్పుబట్టకుండా జీవన వైరుధ్యాలను ఆవిష్కరించడంలో రచయిత ప్రతిభ పాఠకుడిని ఆకట్టుకుంటుంది. తన జీవన ప్రయాణంలోని అనుభవాలకు ఇచ్చిన ఈ కథలు కొన్నిసార్లు మనకూ తారసపడతాయి. – దేశరాజు (మూడు బీర్ల తర్వాత –అక్కిరాజు భట్టిప్రోలు, వెల: రూ. 170) నిలువెత్తు హింస అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు కార్పొరేటర్లకు దోచిపెట్టడానికి చేపట్టే భూసేకరణలో అంతు లేని హింస చోటుచేసుకుంటోంది. అందుకు దక్షిణ ఛత్తీస్ గఢ్ నిదర్శనం. అక్కడ ఏం జరిగిందనే వివరాలతో అక్కడి లైంగిక హింసపై ‘నిలువెత్తు సాక్ష్యం’ కార్యాచరణ బృందం వెలువరించిన పుస్తకాన్ని మలుపు ప్రచురణలు తెలుగులోకి తీసుకొచ్చింది. గనుల తవ్వకాల కోసం, ఉక్కు కర్మాగార నిర్మాణం కోసం స్థల సేకరణ, వారి సామగ్రి రక్షణకు సీఆర్పీఎఫ్ బలగాలను ప్రభుత్వం మోహరిస్తే, ప్రైవేట్ కంపెనీల అవసరాల కోసం సొంత సైన్యాలు రంగంలోకి దిగాయని సమాచారం. వీరంతా కలిసి రెండున్నర లక్షల మంది ఆదివాసీలను అడవి నుండి వెళ్లగొట్టారు. వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి, అవమానించి తరిమేయడానికి లైంగిక హింసను ఆయుధంగా వాడుకున్నారు. (నిలువెత్తు సాక్ష్యం–దక్షిణ ఛత్తీస్గఢ్లో లైంగిక హింస, వెల: రూ.130) కవిత్వపు గింజలు పల్లెను ప్రేమించడానికి అక్కడివారే కానక్కర్లేదు. పంటను కళ్లకద్దుకోవడానికి వ్యవసాయదారుడే అవ్వక్కర్లేదు. పచ్చదనాన్ని కలగనడానికి పర్యావరణవేత్తే కానక్కర్లేదు. ‘అతనికి అందరూ తెలియక పోవచ్చు/కానీ అన్నం తెలిసిన ప్రతివాడికీ/అతను తెలుసు, ఆకలి తెలిసినట్లే–’ అని రైతు గురించి రాయగలిగిన కవి దర్భశయనం శ్రీనివాసాచార్య గురించి కూడా కవిత్వం తెలిసినవారందరికీ తెలుసు. పంటను తగలబెట్టకు తండ్రీ, పంట కాల్వ, ధాన్య మానవునికి, మట్టి బిడ్డా, వరిపొలానికి కృతజ్ఞతల్తో, మళ్లీ నా వ్యవసాయ కళాశాలకు వంటి కవితలతో అన్నంపెట్టే రైతుపట్ల, వ్యవసాయంపట్ల తనకు గల అపార అభిమానాన్ని మరో సారి ఆయన చాటుకున్నారు. ‘వాళ్లు/ నేలతో నీటితో నింగితో నిప్పుతో/కలిసి బతికేవాళ్లు/అందుకే వాళ్లకు ప్రేమా దయా కృతజ్ఞతా/చల్లని చూపూ తెలుసు’అంటూ ప్రజల్ని అభిమానించే కవి కాబట్టే ‘కళ్లకు కాసిన్ని/చూపు ఉత్సవాల్ని ఇవ్వకుండా’ ఇంతగా పరుగెత్తాలా అని నిలదీస్తాడు.(ధాన్యం గింజలు–దర్భశయనం శ్రీనివాసాచార్య, వెల: రూ. రూ.80) పల్లె చెప్పిన పాఠం పల్లెటూరినుంచి మద్రాస్ వలసపోయిన విద్యాధిక కుటుంబంలో పుట్టి పెరిగిన పట్నవాసం అమ్మాయి.. పెళ్లయి పల్లె జీవితంలోకి వచ్చి పడితే ఎన్ని వైరుధ్యాలమధ్య నలగవలసి వస్తుందో చెప్పిన అనుభవాల పరంపరే ‘పాలంగి కథలు’. మద్రాసులో గొప్ప గొప్ప విద్వాంసుల రాకపోకలతో ఇల్లంతా సందడిగా పెరిగిన రచయిత్రి.. తణుకు పక్కన పాలంగి పల్లెటూరులో వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఆధునికత దరిచేరని సమాజంలో, భిన్నమైన వాతావరణంలో ఎలా ఒదిగి పోయిందీ ‘పాలంగి కథలు’లో ఆత్మకథనాత్మక రీతిలో పాఠకుల ముందుపెట్టారు. ఇది ఆమె జీవితం మాత్రమే కాదు. అలనాటి సంప్రదాయ కుటుంబాల స్త్రీల జీవితాల ప్రతిబింబమీ కథలు. ఒక్క మాటలో చెప్పాలంటే ’ఈతరం వారు ఎప్పటికీ చూడలేని, అనుభవించలేని ఒక సహజ సుందరమైన గ్రామీణ జీవితంలోకి మనల్ని తీసుకుపోయే’ అరుదైన రచన. దీన్ని చదివే అనుభవాన్ని కోల్పోవద్దు. – కె. రాజశేఖరరాజు వెల: 100, ప్రతులకు స్టాల్ నంబర్ 275 -
అందుకే స్ర్తీవాద రచనలు చేస్తాను!
-
‘మాటల మడుగు’ మెర్సీ.. ‘లవ్ లెటర్స్’ కడలి..
-
పుస్తకం రాయడానికి అంతకు మించి ఇంకేం కావాలి!
-
ఈ ఏడాది ఆ పుస్తకాలే ఎక్కువగా అమ్ముడయ్యాయి!
-
పుస్తకాల జాతర చూసొద్దాం రండి
-
పుస్తకాల జాతర చూసొద్దాం రండి
వేలకొలది పుస్తకాలు.. లక్షలాది మంది పాఠకులు, వీక్షకులు.. కవులు, రచయితలు, పబ్లిషర్స్, ప్రముఖులు.. ఇలా హైదరాబాద్ బుక్ఫెయిర్ ప్రారంభమైన నాటినుంచి అత్యంత అట్టహాసంగా కొనసాగుతోంది. నగరం నడిబొడ్డున తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) వేదికగా ఒక జాతరలా, ఒక ఉత్సవంలా, ఒక వేడుకలా జరుగుతున్న హైదరాబాద్ నేషనల్ బుక్ఫెయిర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు, ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
వంశీ కథలు ఎంతో ఇష్టం
‘పుస్తకాలు చాలా తక్కువగానే చదువుతాను. కానీ నచ్చిన పుస్తకాలు మాత్రం తప్పనిసరిగా చదివి తీరుతా’ అన్నారు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను గురువారం ఆయన సందర్శించారు. పలు స్టాళ్లలో ఆయన తనకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. వంశీ సాహిత్యం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆ పుస్తకాల కోసం ప్రదర్శనకు వచ్చినట్లు పేర్కొన్నారు. వంశీ రాసిన ‘నల్లమిల్లోరి పాలెం’ కథల పుస్తకంతో పాటు, ‘కచ్చితంగా నాకుతెలుసు’.. ‘తెలుగాంధ్ర మిశ్రమ నిఘంటువు’ తదితర పుస్తకాలను ఆయన కొనుగోలు చేశారు. అన్వేషిక స్టాల్లోని పలు సినీ రచయితల పుస్తకాలను కీరవాణి ఆసక్తిగాతిలకించారు. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ బుక్ఫెయిర్కు నాలుగో రోజు గురువారం పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్రిస్మస్ సెలవులతో సందర్శకుల రద్దీ కనిపించింది. సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో బుక్ఫెయిర్లో సందడిగా మారింది. సాహిత్యం, చరిత్ర, ఆర్థిక అంశాలకు సంబంధించిన అనేక అంశాలపైన పాఠకులు తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. మరోవైపు బాలమేళా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల మేజిక్ వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సుమారు 90 మంది రచయితలతో ఏర్పాటు చేసిన రైటర్స్ స్టాల్, హైదరాబాద్ బుక్ ట్రస్టు, నవతెలంగాణ, స్కోలాస్టిక్, అన్వేషిక, ఎమెస్కో, పెంగ్విన్ తదితర స్టాళ్ల వద్ద పాఠకులు నచ్చిన పుస్తకాల కోసం అన్వేషించారు. ఇటీవల విడుదలైన జార్జిరెడ్డి సినిమా పెద్ద ఎత్తున ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఆయన జీవితంపై ప్రముఖ రచయిత్రి కాత్యాయని రాసిన ‘జీనా హైతో మర్నా సీఖో’ పుస్తకానికి డిమాండ్ బాగా కనిపించింది. ప్రతి రోజు భారీ సంఖ్యలో పాఠకులు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేస్తున్నారు. బొగోమ లోవ్ రాసిన ప్లాటో–అరిస్టాటిల్, కేవీ గోపాలచారి రచన ‘జింక సైన్స్ అను మన గురించి మనం’ వంటి పుస్తకాలతో పాటు జ్యోతిబాపూలే రచనలు, ఓ కుక్క ఆత్మకథ నవల, చేగువేరా, గౌరీ లంకేష్ కొలిమి రవ్వలు, బాలగోపాల్ రాసిన అణచివేత– అణచివేత చట్టాలు పుస్తకాలపై పాఠకులు అమిత ఆసక్తి చూపుతున్నారు. వర్ధమాన రచయిత్రి కడలి సత్యనారాయణ రాసిన ‘లెటర్స్ టు లవ్’, పలువురు యువ రచయితల తొలిప్రేమ కథలు, ఇన్ ది మూడ్ ఫర్ లవ్, రష్యన్ క్లాసిక్స్ వంటి సరికొత్త రచనలకు సైతం డిమాండ్ బాగా ఉంది. పిల్లల కోసంప్రత్యేకంగా పుస్తకాలు ముద్రించి విక్రయించే స్కొలాస్టిక్స్ (స్టాల్ నంబర్ 23)లో ఫిక్షన్ సాహిత్యం కోసం చిన్నారులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. టార్గెట్స్, బ్యాడ్బాయ్స్, జెర్నిమోస్టిల్టన్, డాగ్మ్యాన్, 2020 ఇయర్ బుక్, రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్, అబ్దుల్ కలాం రచనలను విద్యార్థులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. -
బుక్ ఫెయిర్ కు పోటెత్తిన జనం
-
బుక్ ఫెయిర్కు తరలివచ్చిన పిల్లలు,పెద్దలు
-
బుక్ ఫెయిర్ను ప్రారంభించిన గవర్నర్
-
23 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
పంజగుట్ట: ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్)ను ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) లో నిర్వహించనున్నటు హెచ్బీఎఫ్ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుక్ ఫెయిర్ వివరాలను ఆయన వెల్లడించారు. ఈసారి ప్రదర్శనలో 330 స్టాళ్లు ఉంటాయని, దేశ విదేశాలకు చెందిన పబ్లిషర్స్ పాల్గొంటారన్నారు. సెలవు దినాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు, పనిదినాల్లో మధ్యాహ్నం 2:30 నుంచి 8:30 వరకు ఫెయిర్ జరుగుతుందని తెలిపారు. ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, జర్నలిస్టులకు ప్రవేశం ఉచితమన్నారు. పిల్లలకు బాలమేళ కార్యక్రమంలో భాగంగా ఫ్యాన్సీ డ్రెస్, మిమిక్రీ, చిత్రలేఖనం, ఒక్క నిమిషం తెలుగు, బాల కవి సమ్మెళనం, మ్యూజిక్ మసాల, బృంద నృత్య పోటీలు, పాటల పోటీలు (సోలో), వ్యాసరచన, కథలు చెప్పడం, రాయడం, వినూత్న కళాప్రదర్శన, సైన్స్తో మనం, మాట్లాడే బొమ్మ వర్క్షాప్ ఇలా ప్రతిరోజు పోటీలు నిర్వహిస్తామన్నారు. -
మాలిన్యం తొలగించే దీపాలు
పుస్తకపఠనం, పుస్తకప్రచురణ, కాపీరై ట్లను ప్రోత్సహించే లక్ష్యంగా ప్రపంచ ప్రసిద్ధ స్పానిష్ రచయిత మైఖెల్ సెర్వాంటిస్ వర్ధంతిని (ఏప్రిల్ 23) దృష్టిలో ఉంచుకొని 1995 నుండి యునెస్కో ప్రపంచ పుస్తకదినోత్సవాన్ని జరిపేందుకు నిర్ణయించింది. ప్రపంచ ప్రసిద్ధ స్పానిష్ రచయిత మైఖెల్ కెర్విం టిస్ పేద కుటుంబంలో జన్మించాడు. తొలిరోజుల్లో స్పానిష్ రాణి ఎలిజిబెత్ వెలోయిస్ స్మృతి కవితల సంకలనాన్ని 1569లో ప్రచురించాడు. ఆర్థిక సమ స్యల వల్ల ఇటలీలో స్పానిస్ మిలటరి దళంలో సైనికుడిగా చేరాడు. «ధైర్య సాహసాలతో లెపాంటో యుద్ధంలో (1571) పాల్గొని తీవ్రంగా గాయప డ్డాడు. తిరిగి వచ్చిన తరువాత ‘లాగ లాటి’ అనే నవలను గ్రామీణ శృంగార జీవితం ఇతివృత్తంగా రాశాడు. తర్వాత సాహసవీరుల గాథలు ఇతివృత్తంగా ‘డాన్క్విక్సోటి’ నవల మొదటి భాగాన్ని 1605లో ప్రచురించాడు. రెండోభాగాన్ని 1615లో ప్రచురించాడు. ఆ నవలను ప్రపంచవ్యాప్తంగా 60 భాషల్లోకి అను వదించారు. ప్రపంచంలో అత్యధిక ప్రతులు అమ్ముడుపోయిన నవలగా ప్రసిద్ధి పొందింది. అప్పట్లో రచయితకు కాపీరైట్ హక్కు, రాయల్టీ సదుపాయం లేనందున ఆర్థికంగా సంపన్నుడు కాలేక పోయాడు. ఈ విషయాలన్ని దృష్టిలో ఉంచుకొని యునెస్కో ప్రచురణ, కాపీ రైట్లను ప్రోత్సహించేందుకు ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రకటించింది. ‘పుస్తకాలు మనో మాలిన్యాన్ని తొలగించే దీపాలు’ అని భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర,్త కందుకూరి వీరేశలింగం ‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో... మంచి పుస్తకం కొనుక్కో’ అన్న సూక్తిని ప్రచారం చేశారు. కానీ నేటి యువత పుస్తక పఠ నానికి దూరమైంది. రకరకాల చానళ్ల, మీడియా ప్రభావమే దీనికి కారణం. పుస్త్తకపఠనాసక్తితో విలువైన గ్రం«ధపఠ నంలో నిమగ్నమైన వారిని ఒకప్పుడు పుస్తకాల పురుగులు అనేవారు. నేడు పుస్తకాలు తొలిచే పురుగులే కాని, పుస్తక ప్రియులు లేరు. ప్రతిభావంతమైన రచ యితల మంచి పుస్తకాలను తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమి వంటి సంస్థలు ప్రచురించాలి. గ్రంథా లయాలకు పంపిణి చేసి పాఠకులకు అందుబాటులో ఉంచాలి. అప్పుడే ప్రపంచ పుస్తక దినోత్సవ పరమార్థం నెరవేరుతుంది. ( ప్రపంచ పుస్తక దినోత్సవానికి నేటితో పాతికేళ్లు) డాక్టర్ పీవీ సుబ్బారావు, విశ్రాంత ఆచార్యులు మొబైల్: 98491 77594 -
కొలువుదీరిన పుస్తక ప్రపంచం
-
పుస్తకం..ప్రపంచాన్ని మార్చే ఆయుధం
సాక్షి, హైదరాబాద్ : సమాజ స్వరూపం మారడానికి అక్షరమే పునాదని మంత్రి జగదీశ్వర్రెడ్డి అన్నారు. గురువారం ఎన్టీఆర్ స్టేడియంలోని భాగ్యరెడ్డి వర్మ ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ కనులపండువగా ప్రారంభమైంది. జగదీశ్వర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. అక్షరం పుట్టిన తర్వాతే అనూహ్యమైన మార్పులు వచ్చాయని, పుస్తకమే ప్రపంచ గమనాన్ని మార్చే ఆయుధమని ఈ సందర్భంగా జగదీశ్వర్రెడ్డి అన్నారు. ప్రపంచంలో వస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని ఏ వైరస్ అయినా చిటికెలో మాయం చేస్తుందని, పుస్తకంలోని అక్షరాలను ఏ వైరస్ కూడా అడ్డుకోలేదన్నారు. పుస్తకం లేని జీవితానికి పరిపూర్ణత రాదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. పుస్తకంతోనే ప్రపంచంలో గొప్ప పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. పుస్తకం మంచి స్నేహితుడని, పుస్తక పఠనం మనిషిని తలెత్తుకొని బతికేలా చేస్తుందని సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. పుస్తకం మనిషికి విలువలతో కూడిన జీవితాన్ని అందిస్తుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ నెల 28 వరకు జరిగే బుక్ ఫెయిర్ విజయవంతం కావాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆకాంక్షించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
గొప్ప చరిత్రల సృష్టికి అక్షరమే పునాది
ఆర్థిక మంత్రి ఈటల వ్యాఖ్య ప్రారంభమైన 30వ హైదరాబాద్ బుక్ఫెయిర్ హైదరాబాద్: ‘కదిలేది.. కదిలించేది... పెను తుపాను సృష్టించేది అక్షరమే’అన్న చెరబండ రాజు మాటలు నిత్య సత్యమేనని, ప్రపంచంలో ఎన్నో గొప్ప చరిత్రల సృష్టికి పునాది అక్షరమేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. గురువారం తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో హైదరాబాద్ బుక్ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన 30వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ నేడు ప్రపంచంలో డిజిటల్ పరిజ్ఞానం వేగవంతంగా ముందుకు వస్తున్నప్ప టికీ పుస్తకాల ప్రాధాన్యం మాత్రం తగ్గలేదన్నారు. ప్రపంచానికి గొప్ప సాహితీవేత్తలను అందించిన ఘనత తెలంగాణాదే అన్నారు. భవిష్యత్ తరాలకు చరిత్రలను అందించేది పుస్తకమే అన్నారు. పుస్తకాలే తెలంగాణ పునాదులుగా పనిచేశాయన్నారు. పుస్తకాలే జ్ఞాన దేవాలయాలు: రాములు సమాజంలో పుస్తకాలే జ్ఞాన దేవాలయాలని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసానికి ప్రధానంగా దోహదపడేది పుస్తకమే అన్నారు. పుస్తకం అనేది జ్ఞాన నిధి.. రేపటి భవిష్యత్ నిర్మాణానికి పునాది వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఏడీజీ హెడ్ ఆఫ్ పబ్లికేషన్ డాక్టర్ సాధన గౌడ్, ఎమ్మెల్యే పుట్ట మధు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రాజు, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, హైదరాబాద్ బుక్ఫెయిర్ కార్యదర్శి కె.చంద్రమోహన్, కన్వీనర్ ఎస్.మధు తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ అక్షరాస్యతతోనే.. బంగారు తెలంగాణ: లక్ష్మణ్ సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే బంగారు తెలంగాణ ఆచరణలో సాధ్యమవు తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. పుస్తకాలే మనిషి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు దోహద పడుతాయన్నారు. అనేక సంచార జాతుల బతుకులను, జీవన విధానాలను పుస్తక రూపంలో అందించాలని కోరారు. ఎన్టీఆర్ స్టేడియం మైదానాన్ని ఇతర నిర్మాణాలకు తావివ్వకుండా క్రీడా మైదానంగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. -
5 నుంచి నవ్యాంధ్ర ప్రస్తక సంబరాలు
తొలిసారిగా నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్లో ఏర్పాటు నెల్లూరు(అర్బన్): గత 50 ఏళ్ల చరిత్రలో లేని విధంగా తొలిసారిగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన నవ్యాంధ్ర పుస్తక సంబరాలు స్థానిక వీఆర్సీ గ్రౌండ్లో వచ్చే నెల 5 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ప్రముఖ ఎమెస్కో పుస్తక పబ్లిషర్స్ అధినేత విజయకుమార్ అన్నారు. స్థానిక దర్గామిట్టలోని హోటల్ మినర్వాలో గురువారం పుస్తక ప్రదర్శనకు చెందిన వాల్పోస్టర్లు, బ్రోచర్లను ఆవిష్కరించారు. విజయవాడ బుక్స్ సొసైటీ, ఎన్టీఆర్ ట్రస్ట్, ఏపీ సాంస్కృతిక శాఖ లాంటి సంస్థల సహకారంతో సంబరాలు 9 రోజుల పాటు నిర్వహించనున్నామన్నారు. విద్యార్థులకు ప్రతి రోజూ వక్తృత్వ, పద్యాలు, క్విజ్పై పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున బహుమతులు అందచేస్తామన్నారు. నెల్లూరు, ఒంగోలు ప్రాంత కవులు రాసిన పుస్తకాలను తమకు డిపాజిట్ చేస్తే వారి కోసం ప్రత్యేకంగా కేటాయించిన రెండు స్టాల్స్లో ప్రజలకు విక్రయించి ఆడబ్బును కవులకు అందచేస్తామన్నారు. ఉచితంగానే స్టాల్స్ నిర్వహిస్తామన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలుంటాయన్నారు. దువ్వూరి రామిరెడ్డి, పొణకా కనకమ్మ లాంటి వారిని స్మరణకు తెచ్చుకుంటూ వర్దమాన కవులకు స్ఫూర్తినిస్తామన్నారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సాహిత్య, సాంస్కృతిక వారసత్వ సంపదకు నిలయమన్నారు. సంబరాల విజయవంతానికి జనవిజ్ఞాన వేదిక, యుటీఎఫ్, విద్యావికాస సంస్థలు పూర్తిస్థాయిలో పాల్గొనేవిధంగా కృషి చేస్తామన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ప్రతినిధి రామకృష్ణ మాట్లాడుతూ సాహిత్య కార్యక్రమాలతో పాటు ట్రస్ట్ తరుపున ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. వచ్చే నెల 8న బుక్స్ ఫర్ వాక్ పేరుతో వైవీఎం గ్రౌండ్ నుంచి ట్రంçకురోడ్డు, ఎసీ బొమ్మ, ఎబీఎం కాంపౌండ్, గాంధీబొమ్మ మీదుగా వీఆర్సీ గ్రౌండ్లో పుస్తక సంబరాలు జరిగే ప్రదేశం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సంబరాలను మేథావులు జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రముఖ కవి పెరుగు రామకృష్ణ ప్రసంగించారు. -
స్టాళ్లే ఆలయాలు.. పుస్తకాలే దేవుళ్లు
స్టాల్ నంబరు 224 విజయవాడవాసులకు ఏటా జనవరిలో రెండు పండుగలు వస్తాయి. ఒకటి సంక్రాంతి, మరోటి పుస్తకాల పండుగ. విజయవాడ పుస్తక ప్రదర్శనకు ఒక ప్రత్యేకత ఉంది. మన దేశంలో ఒకప్పుడు కోల్కతాలో నిర్వహించే పుస్తక ప్రదర్శన అత్యంత ఆదరణ పొందేది. ప్రస్తుతం ఈ ఘనతను విజయవాడ దక్కించుకుంది. విద్యా పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు... ఒకటేమిటి .. అన్ని అంశాల పుస్తకాలను విజయవాడ వాస్తవ్యులు ప్రేమగా అక్కున చేర్చుకుంటున్నారు. తమ ఆత్మీయులను ఇళ్లకు తీసుకువెళ్తున్నామన్న భావన వారిలో కనిపిస్తోంది. పుస్తక దేవుళ్లు కొలువైన ఈ ఆలయానికి పాఠక భక్తులు భక్తిశ్రద్ధలతో వచ్చి తమ దైవాలను ఇంటికి తీసుకువెళ్తున్నారు. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ విశ్వస్ఫూర్తి ఆధ్యాత్మిక రచనలు విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఆధ్యాత్మిక సంస్థ ‘విశ్వస్ఫూర్తి ధ్యానజ్ఞాన మార్గం’ కూడా పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటుచేసింది. మీడియా విధానం ద్వారా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న సంస్థ ఇది. ఏటా పుస్తక ప్రదర్శనలో ఈ స్టాల్ తప్పనిసరిగా ఉంటోంది. ఇందులో శ్రీశ్రీశ్రీ గురువిశ్వస్ఫూర్తి రచనలు మాత్రమే అమ్మకానికి ఉంటాయి. మనోప్రస్థానం, స్ఫూర్తి సంక్షిప్తాలు, ప్రజా రాజ్యం... వంటి అనేక పుస్తకాలు లభ్యమవుతున్నాయి. ప్రతి అంశాన్నీ సైంటిఫిక్గా తమ పుస్తకాల ద్వారా వివరించారు. ‘మనసు అంటే...’ అనే అంశంపై గీసిన రేఖాచిత్రం విజ్ఞానాత్మకంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రతి స్టాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. మనోవికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు ఎంతో దోహదం చేస్తాయి. భారతజాతి మహేతిహాసాలు రామాయణభారతాలు. ఇవి ఇంటింటా ఉండాల్సిన, ప్రతి ఒక్కరూ చదవాల్సిన గ్రంథాలు. సహజకవి బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీమద్భాగవతం కూడా ప్రతి ఇంట్లోనూ తప్పక ఉండాల్సిన గ్రంథం. ఈ గ్రంథంలోని... పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాథ పలుకగనేల... పద్యాన్ని ప్రతి తెలుగువారు నేర్చుకుని తీరాలి. మొత్తం భాగవత గ్రంథం చదవలేని వారికోసం, కొన్ని పద్యాలను ఎంపిక చేసి తాత్పర్య సహితంగా లభిస్తున్న పుస్తకాన్నయినా తప్పక కొనితీరాలి. పుస్తక ప్రదర్శనలోని అన్ని స్టాల్స్లోనూ ఇటువంటి గ్రంథాలు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా పురిపండా అప్పలస్వామి రచనలు, శ్రీనివాస శిరోమణి రామాయణం, ఉషశ్రీ రామాయణభారతభాగవత పుస్తకాలతో కూడిన గిఫ్ట్ ప్యాక్, అష్టాదశ పురాణాల సెట్, చాగంటి కోటేశ్వరరావు రచనలు... ఇవేకాకుండా, స్త్రీలవ్రత కథలు, వేదాలకు సంబంధించిన భాష్యాలు, అనేకులు రచించిన సుందరకాండ వంటి పుస్తకాలతో బుక్ ఫెస్టివల్ ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. మరీ ముఖ్యంగా గొల్లపూడి వీరాస్వామి సన్స్- రాజమండ్రి వారి స్టాల్లో కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలే పుష్కలంగా లభిస్తున్నాయి. -
నిత్యానంద.. 28 భాషల్లో 200 పుస్తకాలు!
వివాదాస్పద స్వామి నిత్యానంద పుస్తకాలు ఢిల్లీలోని వరల్డ్ బుక్ ఫెయిర్లో దర్శనమిస్తున్నాయి. ఆధ్యాత్మికపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ఆయన 28 భాషల్లో రాసిన 200 పుస్తకాలు ఇందులో పుస్తక ప్రియులకు కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఆడియో, వీడియో సీడీలు కూడా ఉన్నాయి. అలాగే భారత జాతిపిత మహాత్మగాంధీని హత్య చేసిన నాధురాం గాడ్సే పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తక ప్రదర్శనలోని పలు స్టాళ్లలో అతి తక్కువ ధరకే వీటిని విక్రయిస్తున్నారు. భగవద్గీత, ఖురాన్ వంటి పవిత్ర గ్రంధాలను కేవలం 10 రూపాయలకే అందిస్తున్నారు. చాలామంది అహింస, వెజిటేరియనిజం వంటి అంశాలపట్ల అవగాహన తెలియజేసే పత్రాలను ఉచితంగా పంచిపెడుతున్నారు. ఇక నిత్యానంద రాసిన పుస్తకాలు ప్రధానంగా ఆంగ్లం, హిందీ, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్, చైనా భాషల్లో అధికంగా ఉన్నాయి. దీంతోపాటు ఆర్యసమాజ్కు చెందిన పుస్తకాలు, భౌద్ధమతానికి చెందినవి, విశ్వ జైన సంఘటన సంస్థవి, ముస్లిం మతానికి చెందిన పుస్తకాలు కూడా ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ బుక్ ఫెయిర్లో దాదాపు 30 దేశాలకు చెందిన ఆధ్మాత్మిక సంస్థలు తమ పుస్తకాలను ప్రదర్శిస్తుండగా ఇది ఫిబ్రవరి 22న ముగియనుంది. -
విజయవాడ బుక్ ఫెయిర్ విశేషాలు!
-
పుస్తక ప్రియుల కిటకిట
బుక్ ఫెయిర్కు పుస్తక ప్రియులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో ఎన్టీయార్ స్టేడియంలో జరుగుతున్న ఈ ప్రదర్శనకు జంట నగరాల నుంచి సందర్శకులుతరలివచ్చారు. స్టాల్స్ అన్నీ కిటకిటలాడాయి. చిన్నా పెద్దా అందరూ సందడి చేశారు. కవాడిగూడ: పుస్తకాలు లేని ఇల్లు.. కిటికీలు లేని గదులతో సమానం. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు మన పెద్దలు. కొనాల్సిన పుస్తకాలు అపరిమితం. డబ్బులు మాత్రం పరిమితం. అయితే ఓ ప్లాన్ ప్రకారం బుక్ఫెయిర్లో షాపింగ్ చేస్తే మంచి పుస్తకాలు కొనుక్కోవడంతోపాటు మనం అనుకున్న దానికన్నా ఒకటి రెండు ఎక్కువ కొనుక్కునే ఛాన్స్ కూడా ఉంది. హైదరాబాద్ మహానగరంలో గత మూడు దశాబ్దాలుగా జరుగుతున్న బుక్ ఫెయిర్కు ఈసారీ పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నగరం నలు మూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడం, సందర్శన వేళలు ఎక్కువగా ఉండడంతో పలు ప్రాంతాలనుంచి పుస్తకప్రియులు తరలివచ్చారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద భారీ క్యూ కన్పించింది. కొంతమంది కుటుంబ సమేతంగా వచ్చి వారికికావాల్సిన పుస్తకాలు కొనుగోలు చేశారు. పుస్తక ప్రదర్శనను తిలకించేవారు, పుస్తకాలను కొనుగోలు చేసుకునే వారు, చాలా కాలంగా ఫలానా పుస్తకాన్నే కొనాలనుకునే వారు ప్రదర్శనకు విశేషంగా విచ్చేస్తున్నారు. ‘ప్లానింగ్’ ఉంటే మంచి పుస్తకాలు కొనొచ్చు... ప్రదర్శనలో కళ్లముందు దర్శనమిచ్చే ప్రతి పుస్తకంలో మనకు ఉపయోగపడే జ్ఞానం ఉంటుంది. మనం నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన పరిజ్ఞానం ఉంటుంది. మనలోని మానసిక పరిణితి స్థాయిని పెంచే విషయాలూ ఉంటాయి. వీటన్నింటినీ కొనుగోలు చేయాలంటే జేబు నిండా ఆర్థిక వనరు ఉండాలి. మన వద్ద జేబులో ఉన్న డబ్బులతో మనకు కన్పించే మంచి పుస్తకాలే ఖశ్చితంగా కొంటాము. కానీ, కొంచెం ముందుకెళ్లాక.. ఇంకా మంచి పుస్తకాలు, మన మనసుకు నచ్చిన, మనం ఎప్పటి నుంచో కొనాలని ఎదురు చూస్తున్న పుస్తకాలూ తారసపడొచ్చు. అప్పుడు కొంత బాధనిపిస్తుంది. ఇదంతా పుస్తకాల కొనుగోలు పట్ల సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వల్లే అని చెప్పవచ్చు. ఇందుకు కొన్ని సూత్రాలు పాటిస్తే ముందుగా మనం అనుకున్న బడ్జెట్లోనే మనకు ప్రీతిపాత్రమైన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. బుక్ఫెయిర్లో మొత్తం 317 స్టాల్స్ ఉన్నాయి. ముందుగా స్టాల్స్ మొత్తాన్నీ ఒక రౌండ్ వేయాలి స్టాల్స్ను రౌండ్ వేస్తున్నప్పుడే మనకు నచ్చిన పుస్తకాలను, వాటి ధరలను, ఆ స్టాల్ నంబర్ ఒక కాగితంపై నోట్ చేసుకోవాలి. -
పుస్తకం... ప్రియనేస్తం
చదువరి చెంతకు పుస్తకరాజం బహుభాషల భాగ్యనగరిలో బుక్ఫెయిర్కు అపూర్వ ఆదరణ పాఠకుడి వద్దకు పయనమైన ‘వట్టికోట’ మూడుపదులకు చేరువైన పుస్తక ప్రదర్శన హైదరాబాద్ బుక్ఫెయిర్...మూడు దశాబ్దాలుగా చదువరి చెంతకే సాగుతున్న పుస్తక లోకమిది. విభిన్న సంస్కృతులు, బహుభాషలకు నిలయమైన భాగ్యనగరంలో ఏటేటా పుస్తకం వేడుక చేసుకుంటూనే ఉంది. లక్షలాదిగా తరలి వచ్చే పాఠక మహాశయుల జ్ఞానదాహార్తిని తీరుస్తూనే ఉంది. ఎనిమిదో దశాబ్దంలో మొదలై 28 ఏళ్లుగా అప్రతిహాతంగా కొనసాగుతున్న పుస్తకప్రదర్శనకు మొదటి నుంచి పాఠకులు బ్రహ్మరథం పడుతున్నారు. వైవిధ్యభరితమైన భాగ్యనగర సంస్కృతిని, విభిన్న జీవన శైలులను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్లు, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి రోజు వేలాది మంది పుస్తక ప్రియులు తమకు నచ్చిన పుస్తకం కోసం తరలి రావడమే ఇందుకు నిదర్శనం. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం వంటి వివిధ రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంథాలపై పాఠకులు మక్కువ చూపుతున్నారు. బుక్ఫెయిర్ సందర్భంగా నగరంలో పుస్తక ప్రదర్శన చారిత్రక నేపథ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సిటీబ్యూరో : హైదరాబాద్ నగరంలో 1980లలో పుస్తక ప్రదర్శన ప్రారంభమైనప్పటికీ అంతకుముందే పుస్తకాన్ని పాఠకుడి దగ్గరకు తీసుకొని వెళ్లే సంప్రదాయానికి రచయిత, ప్రచురణకర్త వట్టికోట ఆళ్వారుస్వామి శ్రీకారం చుట్టారు. పుస్తకాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి ప్రదర్శించాలనే ఆలోచనకు తావులేని రోజుల్లో ఆయన తాను ముద్రించిన పుస్తకాలను నెత్తిన పెట్టుకొని పాఠకుల ద గ్గరకు వెళ్లారు. ఇదంతా 1938 నాటి సంగతి. ఆ సంవత్సరం సికింద్రాబాద్లో ‘దేశోద్ధారక గ్రంథమాలను’ ప్రారంభించిన వట్టికోట ఆ సంస్థ నుంచి 100 పుస్తకాలను ప్రచురించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1948 నాటికి సుమారు 50 పుస్తకాలను ముద్రించారు. 1948లో అరెస్టై ఐదేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. బయటకు వచ్చాక తాను చనిపోయే(1961) వరకు పలు పుస్తకాలను ముద్రించారు. నిజానికి నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్ధూతో పాటు తెలుగు, మరాఠా, కన్నడం భాషలకు చెందిన ప్రజలతో పాటు హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు బాగా చదివే ప్రజలు కూడా మొదటి నుంచీ ఉన్నారు. పాఠకుల అభిరుచికి తగిన విధంగానే పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థలు ఆవిర్భవించాయి. కోఠీలోని బడీచౌడీ ఒక పుస్తక బజార్గా వెలుగొందింది. ఈ బడిచౌడీ బుక్ సెల్లర్సే హైదరాబాద్ బుక్ ఫెయిర్కు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, మిళింద ప్రకాశన్, ఎమెస్కో, నవోదయ సంస్థలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతోధిక కృషి కొనసాగిస్తూనే ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్టు కృషి... నగరంలోని పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థల ఆకాంక్షలను నేషనల్ బుక్ట్రస్టు పరిపూర్తి చేసింది. నేషనల్ బుక్ ట్రస్టు ఇక్కడి సంస్థలతో కలిసి 986 ప్రాంతంలో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ను కేశవ మొమోరియల్ స్కూల్ మైదానంలో మొదటిసారి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. కథలు, నవలలు, గుల్ఫికలు, చరిత్ర గ్రంథాలదే ఇక్కడ అగ్రస్థానం. చలం, బుచ్చిబాబు, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, వట్టికోట, విశ్వనాథ సత్యనారాయణ, షేక్స్పియర్, సోమర్సెట్ మామ్, యద్ధనపూడి, మాదిరెడ్డి, కొమ్మూరి వేణుగోపాల్రావు వంటి ప్రముఖుల గ్రంథాలను పాఠకులు ఎక్కువగా ఇష్టపడ్డారు. సోవియెట్ సాహిత్యం కూడా బాగా ప్రభావితం చేసింది. క్రమంగా ప్రముఖుల జీవిత చరిత్రలు, పంచతంత్ర వంటి పిల్లల పుస్తకాలు ఆదరణ పొందాయి. ‘మహాత్మాగాంధీ ఆత్మకథ’ వంటి గ్రంథాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది పాఠకులను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు... ఈ నెల 21న ఎమెస్కో పుస్తక ఆవిష్కరణ 22న రాజకీయ పార్టీల నేతలతో చర్చా కార్యక్రమం 23న పత్రికా సంపాదకుల సమావేశం 24న పుస్తకావిష్కరణ, జయరాజ్ పాటల కార్యక్రమం 25న సైన్స్ డ్రామా 26న ముగింపు, స్పీకర్ మధుసూధనాచారి హాజరు. పిల్లలను చదివించండి ప్రపంచీకరణ తరువాత జీవన వేగం బాగా పెరిగింది. నవలలు,కథలు వంటి పుస్తకాలకు కొద్దిగా ఆదరణ తగ్గినప్పుటికీ మిగతా వాటికి బాగానే ఉంది. అయితే ఇప్పటి పిల్లలు ఫేస్బుక్లు, స్మార్ట్ఫోన్లకు పరిమితమైపోవడమే బాధగా ఉంది. పిల్లల్ని చదివించాలి.తల్లిదండ్రులు బాధ్యతగా ఆ పని చేయాలి.సామాజిక చైతన్యాన్ని ఇచ్చేవి, జ్ఞానాన్ని కలిగించేవి, ఉన్నతమైన విలువలను బోధించే పుస్తకాలను తప్పనిసరిగా చదివించాలి. - లలితా జోషి ( మొట్టమొదటి హైదరాబాద్ బుక్ఫెయిర్ కమిటీ సభ్యురాలు) -
బుక్ ఫెయిర్కు విశేష స్పందన
జన్మభూమి విజన్ డాక్యుమెంట్ కేసీఆర్ రాసిందే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు పుస్తక పఠనంతోనే కేసీఆర్కు అపారమైన విజ్ఞానం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తోన్న 28వ హైదరాబాద్ బుక్ ఫెయిర్కు పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మూడో రోజైన శుక్రవారం పుస్తక ప్రదర్శనలోని స్టాళ్లు సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. బాలసాహిత్యం, నవలలు, కమ్యూనిజం రచనలు, వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, గణితం, సామాజిక అంశాలతో కూడిన అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ మహనీయుల జీవిత చరిత్రల పుస్తకాలు ప్రతి ఒక్కరిన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల నోబుల్ బహుమతి అందుకున్న మలాల పుస్తకం ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచింది. కవాడిగూడ : పుస్తక పఠనం ద్వారానే ముఖ్యమంత్రి కేసీఆర్ అపారమైన విజ్ఞానాన్ని సముపార్జించారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు టి.హరీష్రావు అన్నారు. పుస్తక ప్రదర్శనలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల జీవిత అనుభవాలు పుస్తక రూపంలో చదువుకోవచ్చన్నారు. కొన్ని విలువైన పుస్తకాలు తిరిగి ముద్రణకు నోచుకోకపోవడంతో కనుమరుగు అవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ముఖ్యమైన పుస్తకాలను ముద్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి చెరువులపై ఓ పుస్తకాన్ని ముద్రించాల్సి ఉండగా, పని ఒత్తిడి కారణంగా జాప్యం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు పుస్తకాాలతో ఉన్న అనుబంధాన్ని హరీష్రావు వివరించారు. ఎమ్మెల్యే కాక మునుపు అన్నం తినగానే పుస్తకాలను పట్టుకొని ఊర్లో మంచి వాతావరణం కలిగిన చెరువు గట్టుకు వెళ్లి పుస్తకాలు చదవడం పూర్తయిన తర్వాతనే వచ్చేవారని తెలిపారు. ఎమ్మెల్యే అయిన తర్వాత నాలుగైదు రోజులు నాగర్జున సాగర్కు వెళ్లి సుమారు 20 పుస్తకాలు చదవడం పూర్తయాకే వచ్చేవారన్నారు. అంతటి పుస్తక పరిజ్ఞానంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషమైన, అపారమైన అనుభవాన్ని గడించారని తెలిపారు. ఉమ్మడి పాలనలో వచ్చిన జన్మభూమి విజన్ డాక్యుమెంట్ కేసీఆర్ రాసిందేనని వివరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా 800 ఏళ్ల చరిత్ర కలిగిన చెరువులను పునరుద్ధరించేందుకు, కాపాడుకునేందుకు చేస్తున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్, కార్యదర్శి చంద్రమోహన్, కవులు నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిక్రూటర్ను మెప్పించే రెజ్యుమె ఇలా!
జాబ్ స్కిల్స్: ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడగానే అభ్యర్థులు చేసే పని.. తమ వివరాలతో కూడిన రెజ్యుమెను రూపొందించుకొని, సంస్థకు పంపించడం. ఇంటర్వ్యూ పిలుపు కోసం ఎదురుచూడడం. రెజ్యుమె దశనుంచే వడపోత కొనసాగుతుంది. ఆకర్షణీయంగా లేని వాటిని రిక్రూటర్లు పక్కనపెడతారు. తమకు నచ్చిన రెజ్యుమెల అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. కొలువు వేటలో అత్యంత కీలకమైంది.. రెజ్యుమె. పర్ఫెక్ట్ రెజ్యుమె అనేదానిపై రిక్రూటర్ల అభిప్రాయాలు వేర్వేరుగా ఉండొచ్చు. వ్యక్తులను బట్టి దృష్టికోణం మారుతుంది. ఒక్కో రెజ్యుమెపై సంస్థ యాజమాన్యాలు వెచ్చించే సమయం సగటున కేవలం 6 సెకండ్లేనని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యవధిలోనే అభ్యర్థులు తగిన వారా? కాదా? అనే విషయం తేల్చేస్తారు. కాబట్టి తక్కువ సమయంలోనే రిక్రూటర్ను కట్టిపడేసే రెజ్యుమెను తయారు చేసుకుంటే ఇక తిరుగుండదు. ఇందులో ఎలాంటి పదాలు వాడాలి. ఎలాంటి పదాలు వాడకూడదు అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాడాల్సిన పదాలు కంపెనీ యాజమాన్యం దృష్టిని వెంటనే ఆకర్షించే పదాలు కొన్ని ఉంటాయి. వాటిని తెలుసుకొని, రెజ్యుమెలో ఉపయోగించాలి. ఎక్స్పీరియెన్స్, మేనేజ్మెంట్, ప్రాజెక్ట్, డెవలప్మెంట్, బిజినెస్, స్కిల్, ప్రొఫెషనల్, నాలెడ్జ్, టీమ్, లీడర్షిప్ వంటి పదాలతో కూడిన రెజ్యుమెలు మంచి ఫలితాలను ఇస్తున్నట్లు సర్వేలో స్పష్టమైంది. సాధారణ రెజ్యుమెల కంటే ఇవి రిక్రూటర్ను 70 శాతం అధికంగా ఆకట్టుకుంటున్నట్లు తేలింది. వాడకూడని పదాలు యాజమాన్యాలకు నచ్చని పదాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు వాటిని పరిహరించడమే మంచిది. మీ, మైసెల్ఫ్, నీడ్, ఛాన్స్, హార్డ్, ఫస్ట్, లెర్నింగ్ వంటి పదాలున్న రెజ్యుమెలను రిక్రూటర్లు పక్కనపడేస్తున్నారని సర్వేలో బయటపడింది. ఇలాంటి రెజ్యుమెలు 79 శాతం తక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని స్పష్టమైంది. ఉద్యోగాల సాధనలో ఇవి ఆశించినంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి. వేటిని చేర్చాలి? రెజ్యుమె నిర్మాణాత్మకంగా ఉండడానికి, ప్రొఫెషనల్గా కనిపించడానికి అందులో కొన్ని విభాగాలను తప్పనిసరిగా చేర్చాలి. ఆబ్జెక్టివ్, సమ్మరీ, వర్క్ హిస్టరీ, ట్రైనింగ్, అఛీవ్మెంట్స్ వంటి వాటిని పొందుపర్చాలి. దీనివల్ల అభ్యర్థులకు అవకాశాలు మెరుగవుతాయి. చేర్చకూడనివి పాతకాలం రెజ్యుమెల్లో కొన్ని విషయాలను తప్పనిసరిగా ప్రస్తావించేవారు. ఇప్పుడు ఇలాంటి వాటికి యాజమాన్యాలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తెలిసిన భాషలు, వ్యక్తిగత ఆసక్తులు, అభిరుచుల గురించి ప్రస్తావించకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని రెజ్యుమెలో చేర్చకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి వాటితో కూడిన రెజ్యుమెలో రిక్రూటర్ను 24 శాతం తక్కువగా మెప్పిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. -
అదే క్రేజ్
=హైటెక్ యుగంలోనూ పుస్తకాలకు డిమాండే.. =కొత్త విషయాల కోసం పుస్తక పఠనం చేసేవారు 68 శాతం =నెట్లో పుస్తకాలు సెర్చ్ చేసే వారి శాతం 48 =‘సాక్షి’ సర్వేలో వెల్లడి న్యూస్లైన్, ముషీరాబాద్: ఇంటర్నెట్లో సమస్త సమాచారం అందుబాటులోకి వచ్చినా... సిటీజనులకు పుస్తక పఠనంపై మక్కువ ఏమాత్రం తగ్గలేదు. ఇంటర్నెట్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నా.. పఠనాభిలాషులు ప్రత్యక్షంగా పుస్తకాలను చదివేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ జరుగుతున్న సందర్భంగా ‘సాక్షి’ పుస్తక ప్రియులను పలకరించింది. పఠనాభిలాషపై 100మందిని ప్రశ్నించింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన అనేక అంశాలు బయటపడ్డాయి. 68 శాతం మంది కొత్త విషయాలు తెలుసుకునేందుకే పుస్తకాలను చదువుతున్నట్లు తేలింది. అలాగే 8 శాతం మంది ఒత్తిడిని తగ్గించుకునేందుకు, 24 శాతం మంది అలవాటు ప్రకారం పుస్తకాలను చదువుతున్నారు. విజ్ఞానదాయకమైన అంశాల కోసం 48 శాతం మంది పుస్తకాలను ఆశ్రయిస్తున్నట్లు వివరించారు. ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేవారి సంఖ్య 12 శాతం మాత్రమే ఉంది. ఇంటర్నెట్లోనూ పుస్తకాల కోసం సెర్చ్ చేసేవారి సంఖ్య తక్కువేం లేదు. 48 శాతం మంది నెట్లో సెర్చ్ చేసి పుస్తకాలను చదువుతున్నట్లు వెల్లడైంది. ఇంటర్నెట్ వంటి ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ముద్రిత పుస్తకాలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారన్న ప్రశ్నకు.. ప్రత్యక్షంగా చదవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని 56 శాతం మంది పేర్కొనడం విశేషం. -
పుస్తక మేళా కిటకిట
కవాడిగూడ, న్యూస్లైన్: నేషనల్ బుక్ ట్రస్టు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక మేళాకు విశేష స్పందన వస్తోంది. ఆదివారం ఒక్క రోజే 20 వేల మందికి పైగా సందర్శించి నట్టు బుక్ఫెయిర్ ఇన్చార్జి పి.మోహన్ తెలిపా రు. ఎక్కువగా అకడమిక్, కథల పుస్తకాలు అమ్ముడుపోయాయన్నారు. వీటి తరువాత సామాజిక, రాజకీయ పుస్తకాలకు డిమాండ్ కని పించింది. అన్నిరకాల పుస్తకాలు ఒకే చోట లభించడంపై సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. డి.వెంకటేశ్వర్రావు రచించిన ‘హౌ చిల్డ్రన్ లెర్న్ అండ్ హౌ స్కూల్స్ షుడ్ టీచ్’ పుస్తకాన్ని విద్యావేత్త చుక్కా రామయ్య ఆవిష్కరించారు. పీకాక్ క్లాసిక్స్ ఆఫర్ ఈ ఎగ్జిబిషన్లోని స్టాల్స్లో వేటికవే సాటి. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక పబ్లిషర్లు స్టా ల్స్లో ప్రపంచ సాహిత్యాన్ని వివిధ భాషలలో అందజేస్తున్నారు. ‘పీకాక్ క్లాసిక్స్’ ప్రపంచ భాషల్లోని ఉత్తమ సాహిత్యాన్ని తేటతెలుగు లో అందిస్తోంది. తల్లిదండ్రులు, పాఠశాలల నుంచి గత ఏడాది లభించిన ఆదరణను దృష్టి లో ఉంచుకుని ఈసారి తమ స్టాల్ (ఎ84)లో తగ్గింపు ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నట్టు సంస్థ ఎడిటర్ ఎ.గాంధీ తెలిపారు. అన్నీ ఒకే చోట కావల్సిన పుస్తకాల కోసం ఒక్కో దుకాణం తిరగాలి. అయినా దొరుకుతాయన్న గ్యారెంటీ ఉండదు. ఈ ఫెయిర్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి. సమాజంలో ఇతర వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో తెలిపే పుస్తకాలు బాగా నచ్చాయి. అకడమిక్తో పాటు కొన్ని జనరల్ పుస్తకాలు నాకు ఇక్కడ లభించాయి. - వేదప్రియ, విద్యార్థిని ప్రపంచ స్థాయి పుస్తకాలు ఈ ఫెయిర్లో సాధారణ పుస్తకాలతో పాటు ప్రపంచ స్థాయి పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని వయసుల వారికీ అవసరమైన అన్ని రకాల బుక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫెయిర్ ఎంతో బాగుంది. - లక్ష్మీప్రసాద్, సందర్శకుడు -
సమీక్షణం: ప్రవాహ పదధ్వని విందాం...
పేజీలు: 202; వెల: 150 ప్రతులకు: లిఖిత ప్రెస్, కేరాఫ్ వై.నిర్మల, హెచ్ఐజి-2, బ్లాక్-12, ఫ్లాట్-1, బాగ్లింగంపల్లి, హైదరాబాద్-44; ఫోన్: 040-27660000 పుస్తకం : {పవాహం జానర్ : నాన్ఫిక్షన్/వ్యాసాలు రచన : సజయ విషయం : మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకపోతే?! ‘మౌనం’ అర్థంగీకారం కాదు. అనర్థదాయకం. ఈ పుస్తకంలో మనకు అలాంటి ‘మౌనం’ ఎక్కడా తారసపడదు. ఒక ప్రవాహ శబ్దం నలుదిశలా వినిపిస్తుంది. మనల్ని మనలోకి, లోకాన్ని మనలోకి తీసుకెళుతుంది. స్త్రీవాద ఉద్యమాల్లో పని చేస్తున్న సజయ వివిధ సందర్భాలలో సామాజిక విషయాలపై చేసిన చర్చలు, ఆలోచనలు, కార్యచరణ... ఈ పుస్తకానికి పునాది. పడికట్టు సైద్ధాంతిక పదాలు లేకుండా స్పష్టమైన వాక్యాలతో రాయడం బాగుంది. కొన్ని చోట్ల చిన్న చిన్న కథలు చదివిననట్లుగా ఉంటుంది. ఈ పుస్తకంలో ఆయా సందర్భాలకు చెందిన వ్యాసాలు ఉన్నాయి. అయితే ఆ సందర్భాలేవి గతం కాదు. వర్తమానంలోనూ వాటి ‘కాలం’ తీరిపోయేది కాదు. రచయిత్రి వ్యక్తిగత అనుభవాలు కూడా ఆసక్తి దాయకంగా ఉన్నాయి. ఉదా: ఏది ప్రధానం? ఏది అప్రధానం? (పే:7) నాటకాల దగ్గరి నుంచి చట్టాల వరకు ఎన్నో సామాజిక విషయాల వరకు చర్చించిన వ్యాసాలివి. రోజు వారి జీవితంలో మనకు కనిపించని చీకటిని ఈ అక్షరాల వెలుగులో చూడొచ్చు. - వై.పి. సందేశాత్మక కథాసుగంధం పేజీలు: 108; వెల: 60 ప్రతులకు: రచయిత, 9-59, రవినగర్, వేపగుంట పోస్ట్, విశాఖపట్నం-47ఫోన్: 9437581728 పుస్తకం : గంధం చెట్టు జానర్ : ఫిక్షన్/ కథలు రచన : గన్నవరపు నరసింహమూర్తి విషయం : సమకాలీన సమస్యల సందేశాత్మక 15 కథల సంపుటి ‘గంధం చెట్టు’. వీటిలో నక్సలైట్ ఉద్యమాల మూలాలు సామాజిక రుగ్మతల్లో ఉన్నాయని ‘మోదుగు పూలు’, ‘పులి చంపిన లేడి నెత్తురు’ల్లో చిత్రించాడు. పోలీస్ అధికారి తొందరపాటు వల్ల చనిపోయిన వ్యక్తి సోదరుడి చదువును బాధ్యతగా భావించడం చక్కని పరిష్కారంతో కూడిన ముగింపు. సాఫ్ట్వేర్ భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాల కథనం ‘మంచు గోడలు’. భార్య పదోన్నతి వల్ల దంపతుల్లో తారాస్థాయికి చేరిన మనస్పర్థలు, భర్త సంయమనంతో మంచు గోడల్లా కరిగిపోయాయన్న ముగింపు సందేశాత్మకంగా ఉంది. ‘ఊబి’ కథలో అమెరికా ఆర్థిక మాంద్యం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో వచ్చిన అభద్రతాభావాన్ని చిత్రించాడు. శీర్షిక కథ ‘గంధం చెట్టు’లో అయ్యర్ పాత్రను మానవతకు నిలువెత్తు నిదర్శనంగా చిత్రించాడు. కథలన్నింటా మానవ సంబంధాల గుణాత్మక మార్పులు గుబాళిస్తున్నాయి. - డా॥పి.వి.సుబ్బారావు నిత్యజీవితంలో భారతం పేజీలు: 136 వెల: 150 పుస్తకం : మనస్సాక్షి మహాభారతం జానర్ : నాన్ఫిక్షన్/వ్యాసాలు రచన : డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ విషయం : ‘మహాభారతంలో ఉన్నదే మానవలోకంలో ఉంది. మానవలోకంలో ఉన్నదే మహాభారతంలో ఉంది’ అంటూ నిత్యజీవితానికి పనికొచ్చే సందేశాలను మూడేళ్లపాటు సాక్షి పాఠకులకు అందించారు రచయిత. తానెంచుకున్న ఇతివృత్తాలన్నీ భారతంలోనుంచే కాబట్టి, ‘మనస్సాక్షి మహాభారతం’గా పుస్తక రూపమిచ్చారు. ‘జీవన భారతం’తో ఆరంభించిన ఈ పుస్తకంలో 90కి పైగా భారతేతర అంశాలున్నాయి. తొలేకాదశి, వినాయకచవితి, విజయదశమి లాంటి పర్వదినాల ఆసక్తికర విశేషాలు పొందుపరిచారు. - డి.వి.ఆర్. కొత్త పుస్తకాలు గుంటూరు జిల్లా కమ్యూనిస్టు వీరులు రచన, కూర్పు: సి.హెచ్.హరిబాబు పేజీలు: 642; వెల: 300 ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌజ్, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 040-27608107 అంతటి నరసింహం నవలలు - సంఘ సంస్కరణ దృక్పథం రచన: డా.పోతిరెడ్డి చెన్నకేశవులు పేజీలు: 132; వెల: 100 ప్రతులకు: సి.ఇందిర, 34/బి, పి.ఎస్.నగర్, హైదరాబాద్-57. ఫోన్: 040-23347433 1. అమ్మా నాన్న పిల్లలు (వ్యాసాలు) పేజీలు: 42; వెల: 50 2. నా మినీ కథలు పేజీలు: 50; వెల: 50 రచన: ఎనుగంటి వేణుగోపాల్ ప్రతులకు: ఎ.అంజలి, ఇం.నం. 1-3-168/1, కృష్ణానగర్, జగిత్యాల, కరీంనగర్-505327 శ్రీ సాధన కవిత్వం (1926-1947) సంకలనం: డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి పేజీలు: 112; వెల: 40 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు ప్రతులకు: శ్రీ లలితా త్రిపురసుందరీ ధార్మిక పరిషత్, 76-8/1-28, లలితానగర్, భవానీపురం, విజయవాడ-12. ఫోన్: 0866-2414322. -
సమీక్షణం: ప్రవాహ పదధ్వని విందాం...
పేజీలు: 202; వెల: 150 ప్రతులకు: లిఖిత ప్రెస్, కేరాఫ్ వై.నిర్మల, హెచ్ఐజి-2, బ్లాక్-12, ఫ్లాట్-1, బాగ్లింగంపల్లి, హైదరాబాద్-44; ఫోన్: 040-27660000 పుస్తకం : {పవాహం జానర్ : నాన్ఫిక్షన్/వ్యాసాలు రచన : సజయ విషయం : మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకపోతే?! ‘మౌనం’ అర్థంగీకారం కాదు. అనర్థదాయకం. ఈ పుస్తకంలో మనకు అలాంటి ‘మౌనం’ ఎక్కడా తారసపడదు. ఒక ప్రవాహ శబ్దం నలుదిశలా వినిపిస్తుంది. మనల్ని మనలోకి, లోకాన్ని మనలోకి తీసుకెళుతుంది. స్త్రీవాద ఉద్యమాల్లో పని చేస్తున్న సజయ వివిధ సందర్భాలలో సామాజిక విషయాలపై చేసిన చర్చలు, ఆలోచనలు, కార్యచరణ... ఈ పుస్తకానికి పునాది. పడికట్టు సైద్ధాంతిక పదాలు లేకుండా స్పష్టమైన వాక్యాలతో రాయడం బాగుంది. కొన్ని చోట్ల చిన్న చిన్న కథలు చదివిననట్లుగా ఉంటుంది. ఈ పుస్తకంలో ఆయా సందర్భాలకు చెందిన వ్యాసాలు ఉన్నాయి. అయితే ఆ సందర్భాలేవి గతం కాదు. వర్తమానంలోనూ వాటి ‘కాలం’ తీరిపోయేది కాదు. రచయిత్రి వ్యక్తిగత అనుభవాలు కూడా ఆసక్తి దాయకంగా ఉన్నాయి. ఉదా: ఏది ప్రధానం? ఏది అప్రధానం? (పే:7) నాటకాల దగ్గరి నుంచి చట్టాల వరకు ఎన్నో సామాజిక విషయాల వరకు చర్చించిన వ్యాసాలివి. రోజు వారి జీవితంలో మనకు కనిపించని చీకటిని ఈ అక్షరాల వెలుగులో చూడొచ్చు. - వై.పి. సందేశాత్మక కథాసుగంధం పేజీలు: 108; వెల: 60 ప్రతులకు: రచయిత, 9-59, రవినగర్, వేపగుంట పోస్ట్, విశాఖపట్నం-47ఫోన్: 9437581728 పుస్తకం : గంధం చెట్టు జానర్ : ఫిక్షన్/ కథలు రచన : గన్నవరపు నరసింహమూర్తి విషయం : సమకాలీన సమస్యల సందేశాత్మక 15 కథల సంపుటి ‘గంధం చెట్టు’. వీటిలో నక్సలైట్ ఉద్యమాల మూలాలు సామాజిక రుగ్మతల్లో ఉన్నాయని ‘మోదుగు పూలు’, ‘పులి చంపిన లేడి నెత్తురు’ల్లో చిత్రించాడు. పోలీస్ అధికారి తొందరపాటు వల్ల చనిపోయిన వ్యక్తి సోదరుడి చదువును బాధ్యతగా భావించడం చక్కని పరిష్కారంతో కూడిన ముగింపు. సాఫ్ట్వేర్ భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాల కథనం ‘మంచు గోడలు’. భార్య పదోన్నతి వల్ల దంపతుల్లో తారాస్థాయికి చేరిన మనస్పర్థలు, భర్త సంయమనంతో మంచు గోడల్లా కరిగిపోయాయన్న ముగింపు సందేశాత్మకంగా ఉంది. ‘ఊబి’ కథలో అమెరికా ఆర్థిక మాంద్యం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో వచ్చిన అభద్రతాభావాన్ని చిత్రించాడు. శీర్షిక కథ ‘గంధం చెట్టు’లో అయ్యర్ పాత్రను మానవతకు నిలువెత్తు నిదర్శనంగా చిత్రించాడు. కథలన్నింటా మానవ సంబంధాల గుణాత్మక మార్పులు గుబాళిస్తున్నాయి. - డా॥పి.వి.సుబ్బారావు నిత్యజీవితంలో భారతం పేజీలు: 136 వెల: 150 పుస్తకం : మనస్సాక్షి మహాభారతం జానర్ : నాన్ఫిక్షన్/వ్యాసాలు రచన : డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ విషయం : ‘మహాభారతంలో ఉన్నదే మానవలోకంలో ఉంది. మానవలోకంలో ఉన్నదే మహాభారతంలో ఉంది’ అంటూ నిత్యజీవితానికి పనికొచ్చే సందేశాలను మూడేళ్లపాటు సాక్షి పాఠకులకు అందించారు రచయిత. తానెంచుకున్న ఇతివృత్తాలన్నీ భారతంలోనుంచే కాబట్టి, ‘మనస్సాక్షి మహాభారతం’గా పుస్తక రూపమిచ్చారు. ‘జీవన భారతం’తో ఆరంభించిన ఈ పుస్తకంలో 90కి పైగా భారతేతర అంశాలున్నాయి. తొలేకాదశి, వినాయకచవితి, విజయదశమి లాంటి పర్వదినాల ఆసక్తికర విశేషాలు పొందుపరిచారు. - డి.వి.ఆర్. కొత్త పుస్తకాలు గుంటూరు జిల్లా కమ్యూనిస్టు వీరులు రచన, కూర్పు: సి.హెచ్.హరిబాబు పేజీలు: 642; వెల: 300 ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌజ్, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 040-27608107 అంతటి నరసింహం నవలలు - సంఘ సంస్కరణ దృక్పథం రచన: డా.పోతిరెడ్డి చెన్నకేశవులు పేజీలు: 132; వెల: 100 ప్రతులకు: సి.ఇందిర, 34/బి, పి.ఎస్.నగర్, హైదరాబాద్-57. ఫోన్: 040-23347433 1. అమ్మా నాన్న పిల్లలు (వ్యాసాలు) పేజీలు: 42; వెల: 50 2. నా మినీ కథలు పేజీలు: 50; వెల: 50 రచన: ఎనుగంటి వేణుగోపాల్ ప్రతులకు: ఎ.అంజలి, ఇం.నం. 1-3-168/1, కృష్ణానగర్, జగిత్యాల, కరీంనగర్-505327 శ్రీ సాధన కవిత్వం (1926-1947) సంకలనం: డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి పేజీలు: 112; వెల: 40 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు ప్రతులకు: శ్రీ లలితా త్రిపురసుందరీ ధార్మిక పరిషత్, 76-8/1-28, లలితానగర్, భవానీపురం, విజయవాడ-12. ఫోన్: 0866-2414322. -
మొదలైన పుస్తకాల పండుగ
ప్రగతిమైదాన్లో తొమ్మిది రోజుపాటు నిర్వహించే 19వ ఢిల్లీ పుస్తక ప్రదర్శన శుక్రవారం ఘనంగా ప్రారంభమయింది. దేశవిదేశాలకుచెందిన 250 మంది ప్రచురణకర్తలు దీనికి హాజరయ్యారు. ఈ నెల 31న ప్రదర్శన ముగుస్తుంది. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సామాన్య ప్రజలు ఈ ప్రదర్శనను వీక్షించవచ్చు. న్యూఢిల్లీ: దేశవిదేశాల పుస్తకాల ప్రదర్శన, విక్రయాలకు నెలవైన 19వ ఢిల్లీ పుస్తక ప్రదర్శన ప్రగతి మైదాన్లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయింది. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పుస్తకాలను కొనుక్కోలేని పేద చిన్నారుల్లో పఠనాభిలాషను పెంచాలంటే అన్ని చోట్లా మరిన్ని గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. ‘మనది ఇప్పటికీ పేదదేశమే కాబట్టి గ్రంథాలయాల ఏర్పాటు తప్పనిసరి. చాలా మంది పిల్లలు పుస్తకాలు కొనుక్కోలేరు. గ్రంథాయాలు, పఠన సంస్కృతి అభివృద్ధికి అంతా కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. భారతీయ ముద్రణాపకుల సమాఖ్య (ఎఫ్ఐపీ) భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీఓ) సహకారంతో 1995 నుంచి ఏటా ఢిల్లీ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఈసారి తొమ్మిది రోజులపాటు నిర్వహించే ప్రదర్శనకు దేశవిదేశాల నుంచి 250 మంది ప్రచురణకర్తలు హాజరయ్యారు. ఈ నెల 31న ప్రదర్శన ముగుస్తుంది. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సామాన్య ప్రజలు దీనిని వీక్షించవచ్చు. పఠనాభిలాష తగ్గుదలపై దృష్టిసారించడానికి ఈసారి దానినే ప్రధానాంశంగా చేశారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించేందుకు ‘లైబ్రరీస్ అండ్ రీడర్షిప్స్’ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ప్రదర్శనలకే పరిమితం కాకుండా సదస్సులు, చర్చాకార్యక్రమాలు, కవితా సమ్మేళనాలు, చిన్నపిల్లల కోసం కథల పఠనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. లైబ్రరీస్ అండ్ రీడర్షిప్స్ ప్రాధాన్యం గురించి ఎఫ్ఐపీ ప్రధాన కార్యదర్శి అశోక్గుప్తా స్పందిస్తూ ‘మంచి గ్రంథాలయాలను ఒకప్పుడు సమాజ సంపదగా భావించేవారు. అవి మనలో అంతర్భాగమయ్యాయి. అయితే ఈతరం ప్రజల్లో పఠనాభిలాష తగ్గుతోంది. ఈ అంశంపై దృష్టి సారించడం అత్యవసరం కాబట్టే లైబ్రరీస్ అండ్ రీడర్షిప్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం’ అని వివరించారు. ప్రతిచోటా కనీసం చిన్నస్థాయి గ్రంథాలయాలనైనా ఏర్పాటు చేసి చదువుపై ఆసక్తిని పెంచాలని అభిప్రాయపడ్డారు. ప్రగతిమైదాన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు ఢిల్లీతోపాటు అగర్తలా, ఆంధప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, అమెరికా, చైనాకు చెందిన ముద్రణసంస్థలు హాజరవుతున్నాయి. ఈసారి చిన్నారుల కోసం ‘లైబ్రరీ అండ్ ది రీడర్’ పేరుతో చర్చాకార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ‘సునె, జానే, ఖేలే కహానీ’ పేరుతో మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పలు కొత్తపుస్తకాల ఆవిష్కరణ సభలు కూడా జరుగనున్నాయి. ఇక పుస్తక ప్రదర్శనకు తొలిరోజే విశేష స్పందన కనిపించింది. కాలేజీ విద్యార్థులు యువత పెద్ద ఎత్తున ప్రదర్శనకు వచ్చారు. ప్రదర్శనకు ప్రవేశరుసుము రూ.20కాగా, విద్యార్థులకు 50 శాతం రాయితీ ఇస్తున్నారు. చిన్నారులు రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. ‘ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఢిల్లీవాసులు అమితంగా ఆసక్తి చూపుతారని అనుకుంటున్నాను. నిజంగా ఇది అద్భుత ప్రదర్శన. గ్రంథాలయాలను ఈసారి ప్రధానాంశంగా (థీమ్) చేశాం. దేశవ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధికి చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరాం’ అని ఐటీపీఓ చైర్మన్, మేనేజింగ్డెరైక్టర్ రీటా మీనన్ అన్నారు. రచయితలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా వారికి ఒక గదిని కేటాయించామని, అక్కడ పాఠకులతో చర్చలు జరుపవచ్చని చెప్పారు. చాలా మంది రచయితలు, ప్రచురణకర్తలతో మాట్లాడడానికి ఆసక్తి చూపారని తెలిపారు. భారీగా తరలివచ్చిన స్కూళ్ల విద్యార్థులు ఢిల్లీలోని పలు పాఠశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు తొలిరోజే పుస్తక ప్రదర్శనకు తరలివచ్చారు. దేశవిదేశాల ప్రచుకరణకర్తలు ఈ ప్రదర్శనకు వస్తుండడం, ప్రత్యేక రాయితీలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను ఇక్కడికి తీసుకువచ్చామని పాఠశాల యాజమాన్యాలు తెలిపాయి. ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలుగా ప్రగతి మైదాన్ వరకు రవాణా సదుపాయాలు కల్పించేందుకు చ ర్యలు తీసుకున్నామని రీటా తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం బోధన సామగ్రి దుకాణాలు, ఫలహారశాలలను కూడా ఏర్పాటు చేశామన్నారు. తొలి రోజు స్పందన తక్కువే న్యూఢిల్లీ: గత ఏడాదితో పోలిస్తే ఈసారి పుస్తక ప్రదర్శనకు స్పందన కాస్త తక్కువే కనిపించిందని చెప్పాలి. దీని నిర్వాహకులు ఈ ఏడాది వారాంతాలకు బదులు శుక్రవారం కార్యక్రమాన్ని ప్రారంభించడమే దీనికి కారణమని చెబుతున్నారు. ‘మామూలు రోజుల్లో ప్రజలు తీరిక లేకుండా ఉంటారు కాబట్టి శుక్రవారం ప్రారంభించడం సరైంది కాదు. అందుకే తొలిరోజు వీక్షకుల సంఖ్య తక్కువగా కనిపించింది’ అని ఓంబుక్స్ ఇంటర్నేషనల్ సంస్థ సీఈఓ సంజయ్ మాగో అన్నారు. ఇంత తక్కువ మంది వస్తే తమకు నష్టాలు ఖాయమన్నారు. ప్రతి ఏడు రెండు వారాంతాల్లో ప్రదర్శన ఉండేలా చూసేవారని, ఈసారి మాత్రం ఒక్క ఆదివారమే మిగులుతోందని నియోగి బుక్స్ సంస్థ ప్రతినిధి అన్నారు. ‘ఈసారి చివరి రోజు ఆదివారమే అయినా మేం అప్పుడు స్టాల్స్ను ఖాళీ చేసే పనిలో ఉంటాం కాబట్టి వ్యాపారం పెద్దగా జరగకపోవచ్చు’ అని ఆయన అన్నారు. దీనికి ఐటీపీఓ ప్రతినిధులు వివరణ ఇస్తూ తాము కావాలని ఇలా చేయలేదన్నారు. గత ఆదివారం నుంచే స్టాల్స్ కేటాయిస్తున్నామని చెప్పారు. వచ్చే శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవు కాబట్టి, సందర్శకులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మంచి పుస్తకాలు ప్రదర్శించగలిగే ఏ రోజైనా గిరాకీ బాగానే ఉంటుందని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రతినిధి ఎం.ఎల్.భాటియా అన్నారు. ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోవడం, పుస్తకాలు ధరలు పెరగడం వల్ల ఈసారి అమ్మకాలు తక్కువగా ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రదర్శన ముగియడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉంది కాబట్టి ఇప్పుడే నిరాశకు గురికావాల్సిన అవసరం లేదని ముంబై ప్రచురణ సంస్థ జైకో పబ్లికేషన్స్ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. -
సమీక్షణం : ప్రకృతి హిత పోరాటం
పేజీలు: 176 వెల: 80 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు పుస్తకం : ఆకుపచ్చ విధ్వంసం జానర్ : ఫిక్షన్/నవల రచన : శిరంశెట్టి కాంతారావు విషయం : శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, పలాస ప్రాంతాల్లోని పచ్చని బీల భూముల్ని విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణానికి ధారపోయడంతో, చుట్టుపక్కలున్న 18 గ్రామాల ప్రజానీకం ‘ప్రాకృతిక సమతౌల్యం కాపాడే, తమ జీవనాధార భూముల్ని రక్షించుకోవడం కోసం ఉద్యమం చేశారు. ఆ వాస్తవ సంఘటనకు కాల్పనిక రూపమే ‘ఆకుపచ్చ విధ్వసం’. కథకుడు కాంతారావు తొలి నవల ఇది. సామ్రాజ్యవాద దండయాత్రలో భాగంగా రాష్ట్రాలను, దేశాలను అప్పుల ఊబిలోకి నెడుతూ ప్రజలను రాజకీయ, ఆర్థిక, సైనిక అవసరాలు తీర్చే బంట్లుగా మార్చే గ్లోబల్ కుట్రలకు సజీవ సాక్ష్యం ఇది. చట్టబద్ధ వనరుల దోపిడీలో పాలకులే దళారులుగా మారే దౌర్భాగ్యాన్ని, పరిశ్రమల పేరు చెప్పి అమెరికన్ నిర్మాణ రంగ సంస్థల ఖజానాను నింపడానికి ప్రజల ప్రాణాల్ని పునాదులుగా చేయటాన్ని గుర్తించిన ప్రజల ధర్మాగ్రహ పోరాటం ఇది. ఎండమ్మ లాంటి సాధారణ స్త్రీ కూడా అపర కాళికలా తిరగబడి కన్నబిడ్డల్ని కోల్పోయినా చెక్కుచెదరని ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది. నవల ఆసాంతం చదివించేలా సాగి ప్రజాగ్రహంతో పాఠకుల్ని మమేకమయ్యేలా, వనరుల దోపిడీ పట్ల జాగరుకత కలిగించేలా సాగిన రచన ఇది. - మీరాసాహెబ్ ఆమె చుట్టూ తిరిగే కథలు పేజీలు: 154 వెల: 90 ప్రతులకు: రచయిత్రి, 8-3-168/20/16, సిద్ధార్థ నగర్ నార్త్, హైదరాబాద్-38; ఫోన్: 040-23713744 పుస్తకం : కొత్త కథ చెప్పవూ? రచన : స్వర్ణ ప్రభాతలక్ష్మి విషయం : ఇందులోని కథలన్నీ(21) చాలావరకు స్త్రీల కథలే కాని, స్త్రీవాద కథలు కాదు. స్త్రీ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అన్ని దశల్లోను ఎదుర్కొనే సమస్యలకు కథల రూపమిచ్చారు. కాసింత ప్రేమకే కరిగిపోయి ఆడది కాటికెళ్లేదాక, కనిపెట్టుకుంటుందన్న స్త్రీ ప్రేమతత్వాన్ని నిలువుటద్దంలో చూపిస్తుంది ‘ఇది ఇంతే’. ఇగోయిజం తప్ప మరో యిజంతో సంబంధం లేని వ్యక్తులతో వారి ఇజానికి దెబ్బతగలకుండా సహనంతో సంసారాన్ని నెట్టుకొచ్చే స్త్రీలకు ప్రతీకలుగా ‘అప్పుడప్పుడు’లో నళిని, ‘అద్దానికి అవతలి వైపు’లో సంఘమిత్ర దర్శనమిస్తారు. తనకు కాబోయే భర్త గుణగణాలను నేర్పుతో పరీక్షించే స్త్రీలుగా ‘అనుభవం’లో మోహనప్రియ, ‘శ్రుతి తప్పిన రాగం’లో సౌమ్య కనిపిస్తారు. నరమృగాలు తిరిగే ఈ జనారణ్యంలో స్త్రీల బాల్యం ఎలా నలిగిపోతుందో ‘కొత్త కథ చెప్పవూ?’లో కన్పిస్తుంది. - డా॥జి.పద్మప్రియ ఒక కోటమ్మ పోరాటం పేజీలు: 198 వెల: 120 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు పుస్తకం : ముద్ర జానర్ : ఫిక్షన్/నవల రచన : డా॥వి.ఆర్.రాసాని విషయం : రచయిత రాయలసీమ ప్రాంతంలో ఉన్న బసివినీ దురాచారాన్ని నిశితంగా పరిశీలించి, బాధితులైన స్త్రీల విదారక గాథలను విని చలించి రాసిన సంస్కరణాత్మక నవల ఇది. బుడ్డెమ్మ, కోటమ్మ వంటివారి విషాద గాథలు కంటతడి పెట్టిస్తాయి. ఆచారానికి తలొంచిన కోటమ్మ, తిరిగి అదే ఆచారానికి విరుద్ధంగా బిడ్డను కన్నది. ఆ ఊరి స్త్రీలలో చైతన్యాన్ని రగిలించి, బసివినీ వ్యవస్థను రూపుమాపే ప్రయత్నం చేసిన కోటమ్మ ఈ నవల్లో ధీర నాయిక. శైలి: కన్నడ, హిందీలోకి కూడా అనువాదమైన ఈ నవలను ప్రథమ పురుష కథనంతో, రాయలసీమ మాండలికంలో, సజీవ పాత్ర చిత్రణతో తీర్చిదిద్దాడు రచయిత. - డా॥పి.వి.సుబ్బారావు కొత్త పుస్తకాలు కోస్తాంధ్ర కవిత్వంలో ప్రాంతీయ చైతన్యం (2000-2010) రచన: ఆల్సి నాగేశ్వరరావు పేజీలు: 144; వెల: 80; ప్రతులకు: రమ్యభారతి, సాహిత్య త్రైమాస పత్రిక, 1-4/3-36, సంజయ్ గాంధీ కాలనీ, విద్యాధరపురం, విజయవాడ-12 డా.కోట్నీస్ ఆంగ్లం: జాంగ్ షెన్ తెలుగు: గుండా సత్యనారాయణ రెడ్డి పేజీలు: 154; వెల: 100; ప్రతులకు: పోరునేల, 201, వినమ్రత క్లాసిక్స్, అల్కాపురి, హైదరాబాద్-35. ఖడ్గం కన్నీరు కార్చదు (కవిత్వం) రచన: మాదిరాజు రంగారావు పేజీలు: 54; వెల: 50 ప్రతులకు: నవోదయా బుక్ హౌజ్, ఎక్స్ రోడ్స్, కాచిగూడ, హైదరాబాద్-27.