Cadre
-
పుంగనూరులో టీడీపీ.. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుని
సాక్షి,చిత్తూరు జిల్లా: ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో మొదలైన టీడీపీ నేతల అరాచకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కమ్మపల్లిలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు సుబ్రమణ్యరెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు గ్రామం నుంచి వెలివేశారు. ఆయన పండించుకున్న టమాటా పంటను అమ్ముకోకుండా అడ్డుకున్నారు. దీంతో టమాటాలన్నీ కుళ్లిపోయి భారీ నష్టం వాటిల్లింది. కనీసం ఆవులకు మేత వేయకుండా అడ్డుకుని అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసులకు చెబితే గ్రామం వదిలి వెళ్లిపోవాలంటున్నారని సుబ్రమణ్యరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
‘లోక్సభ’ ఓటమితో బీఆర్ఎస్ దిష్టి పోయింది: కేసీఆర్
సాక్షి,గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం బీఆర్ఎస్కు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం(జులై3) ఎర్రవెల్లి ఫాంహౌజ్లో తనను కలిసిన మేడ్చల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.‘బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఇటీవల లోక్సభ ఎన్నికల ఓటమితో దిష్టి తీసినట్టయింది. తిరిగి పునరుత్తేజంతో ప్రజాదరణను కూడగట్టాలి. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటోంది.కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు ఓటేసి పొరపాటు చేశామని నాలిక కరుసుకుంటున్నరు. బీఆర్ఎస్ను మళ్లీ తెలంగాణసమాజాం కోరుకుంటోంది. కేసీఆర్ మీద ద్వేషంతో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ మీద ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది’అని కేసీఆర్ అన్నారు. -
తెలంగాణ బీజేపీకి కొత్త సమస్య..!
ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకుని తెలంగాణ బీజేపీ మాంచి జోష్ మీదుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు కూడా ఎంపీలయ్యారు. ఓట్ల శాతం కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే పెరిగింది. ఇంత జోష్లో ఉన్న బీజేపీ నేతలు, క్యాడర్కు ఓ ఇబ్బంది ఎదురవుతోంది. కొత్త ఎంపీలు, కేంద్ర మంత్రుల వల్ల రాష్ట్ర నేతలు పడుతున్న ఇబ్బంది ఏంటి? శ్రేణులకు నాయకులు ఇచ్చిన భరోసా ఏంటి?తెలంగాణలో బీజేపీ ఫేస్గా చెప్పుకునే నేతలంతా ఎంపీలుగా గెలిచారు. మోదీ రెండో కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిషన్రెడ్డికి ఇప్పుడు కూడా మంత్రి పదవి దక్కింది. కాగా కరీంనగర్ నుంచి రెండోసారి గెలిచిన బండి సంజయ్కు కూడా కేంద్ర కేబినెట్లో పదవి దక్కింది.ఇప్పుడు బీజేపీకి రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఉన్నారు. వీళ్ళతో పాటుగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ నేతగా ఉన్నప్పటికీ రాష్ట్ర బీజేపీలో కూడా కీలకంగా ఉన్నారు. ప్రజా ప్రతినిధుల సంఖ్యను భారీగా పెంచుకున్న తెలంగాణ బీజేపీకి అసలు సమస్యే ఇక్కడే మొదలైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవర్ సెంటర్స్ పెరగడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు.కేంద్రంలోను, రాష్ట్రంలోను కమలం పార్టీ నుంచి ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగడంతో ఆటోమెటిక్గా పార్టీలో పవర్ సెంటర్స్ కూడా పెరిగాయి. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బీజేపీ రాష్ట్ర సారథిగా కూడా కొనసాగుతున్నారు. త్వరలోనే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.గెలిచిన ఎంపీల్లో ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ వీళ్లంతా ఎవరికి వారు పార్టీలో పవర్ సెంటర్స్ అనే చెప్పుకోవచ్చు. గెలిచిన ఎంపీలను సన్మానించడానికి వెళ్లిన నేతలు.. ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి భయపడుతున్నారు. కిషన్ రెడ్డి మనిషిగా బండి సంజయ్ మనిషిగా ఈటల రాజేందర్ మనిషిగా ముద్ర పడితే భవిష్యత్లో పొలిటికల్ కేరీర్కు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని జంకుతున్నారు. ఫలానా నేత మనిషి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు దక్కవేమోననే భయం క్యాడర్ను పట్టి పీడిస్తోంది.కాషాయ సేనకు రాష్ట్రంలో ఉన్న కీలక నేతలంతా పైకి బాగానే ఉంటారు. తామంతా ఒక్కటే అన్నట్లుగానే కనిపిస్తారు. కాని ఒకరి కంటే ఒకరు ముందుండాలని, పార్టీలో పట్టు సాధించాలని తపన పడుతుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇప్పుడు కీలక నాయకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ముఖ్య నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి మనిషిగా గుర్తింపు వస్తే..మరో నేతతో ఇబ్బంది వస్తుందనే భయం క్యాడర్ను, దిగువ స్థాయి నేతల్ని ఆవహించింది. అందుకే తమకు నమ్మకం ఉన్న, సత్సంబంధాలున్న నాయకులను చాటు మాటుగానే కలుస్తూ స్థానిక నేతలు, క్యాడర్ తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. -
పోలింగ్ రోజు తరహాలో మరోసారి విధ్వంసానికి బాబు పథకం
-
‘రంగారెడ్డి’ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పార్టీ క్యాడర్లో ఇంకా అయోమయం కొనసాగుతోంది. హస్తం శ్రేణుల్లో ఈ ఆందోళనకు కారణమేంటి? పాత, కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా ? గ్రూపు తగాదాలు పార్టీ క్యాడర్కు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు పెద్ద ఎత్తున చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ?ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ...గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ అవుతారనే ప్రచారంతో పార్టీ క్యాడర్కు కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ వివిధ కారణాలతో కాంగ్రెస్లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ... పార్టీ నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామా అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్ లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండోసారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు. తాండూరు కాంగ్రెస్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు.అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. -
వసంతకు ఉమా క్యాడర్ వార్నింగ్
-
వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని మోదీ అన్నారు. వచ్చే వంద రోజులు ఎంతో కీలకమని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్సభ ఎన్నికలకు ఓటు వేయబోతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని మోదీ తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాసే బీజేపీ లక్ష్యమని ఆయన గుర్తుచేశారు. పార్టీ శ్రేణలు ప్రతి ఇంటికి, ప్రతి ఓటరు వద్దకు చేరుకోవాలని సూచించారు. నవ భారత్ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని పీఎం మోదీ అన్నారు. గత పదేళ్లలో దేశ రూపరేఖలు మారాయని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ భారీ మేజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలిపారు. ఈ పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించాని.. ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉందన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని.. దేశమే ముఖ్యమని మోదీ అన్నారు. విపక్ష నేత కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 స్థానాలు వస్తాయని అంటున్నారని తెలిపారు. దేశంలో ప్రభుత్వాలు మారుతుంటాయి.. కానీ వ్యవస్థలు అలాగే ఉంటాయని అన్నారు. అందుకే తమ పాలనలో పలు వ్యవస్థలను ప్రక్షాళన చేశామని తెలిపారు. ప్రతిపక్షాలవి అబద్ధపు వాగ్ధానాలని.. తాము ఎన్నికల కోసం అబద్ధపు హామీలు ఇవ్వమని మోదీ స్పష్టం చేశారు. తాము తప్ప వికాస్ భారత్కు ఎవరూ హామీ ఇవ్వరని అన్నారు. అదే విధంగా 2029లో దేశంలో ఒలింపిక్స్ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇంకా... ‘400సీట్లు గెలిచేందుకు పార్టీ నేతలంతా కష్టపడి పని చేయాలి. మోడీ గ్యారెంటీ వికసిత్ భారత్. ఎన్డీఏ వల్లే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. మోడీ 3.0లో దేశాన్ని ప్రపంచంలో మూడు ఆర్థిక వ్యవస్థగా పైకి తీసుకొస్తాం. ఈ పదేళ్ల కాలంలో 11వ నెంబర్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఐదో నెంబర్కి తీసుకొచ్చా. 25 కోట్ల ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. పదేళ్లపాటు అవినీతి రహిత పాలన అందించాం. ... లోక్ సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలవడమే లక్ష్యం. దేశ భవిష్యత్తుపై కాంగ్రెస్కు విజన్ లేదు. దేశ అస్థిరతకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. అవినీతి, వారసత్వ రాజకీయాలకు జనని కాంగ్రెస్. కులాల ఆధారంగా ప్రజలను విభజించాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోంది. రానున్న రోజుల్లో ప్రతి లబ్ధిదారుని కలవాలి. నేను పంపే ఉత్తరాన్ని లబ్ధిదారులకు ఇవ్వాలి. పదేళ్ల పాలన, రానున్న ఐదేళ్ల మన విజన్ వారి చేతికి ఇవ్వాలి’ అని ప్రధాని మోదీ తెలిపారు. -
గ్రామాలపై బీజేపీ ఫోకస్.. ప్రచారానికి కొత్త కార్యక్రమం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకం కావాలని బీజేపీ ఓ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు ‘గ్రామాలకు వెల్లండి’(గావో చలో అభియాన్)అని శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఈ ప్రచారం జరగనుంది. ప్రతి బీజేపీ కార్యకర్త గ్రామాలకు వెళ్లి బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, పేద ప్రజలకు కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకోవాలని జేపీ నడ్డా కార్యకర్తలకు సూచించారు. బూత్ స్థాయిలో మరింత ఎక్కువగా కార్యకర్తలు ప్రచారం చేయాలని అన్నారు. సుమారు 7 లక్షల గ్రామాల్లో బూత్స్థాయిలో బీజేపీ కార్యకర్తలు.. కేంద్ర ప్రభుత్వ విధానాల వివరిస్తూ ప్రజలతో మమేకం కావాలని అన్నారు. అర్బన్ పార్టీగా పేరున్న బీజేపీని గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలోపేతం చేయటం కోసం పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఈసారి జరగబోయే లోక్సభ ఎన్నికల్లో 51 శాతం ఓట్లను సాధించాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పలు స్థానాల్లో భారీ మేజార్టీలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: కులమతాల చిచ్చు పెడుతున్నారు -
తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
కాకినాడ: టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కాకినాడ జిల్లాలోని తునిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. సాయి వేదిక ఫంక్షన్ హల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం చేశారు. అయితే ఈ వివాదం ముదరడంతో ఇరువర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు. చదవండి: రెచ్చిపోయిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి -
ఓం ప్రథమం... ఎదురైంది దుశ్శకునం
మనకున్నది బలం కాదు వాపని తేల్చేసిన నాయకులు కాకినాడ సమీక్షలో పవన్ కు షాకిచ్చిన క్యాడర్ టీడీపీతో కలిసి పని చేయలేమని స్పష్టీకరణ మాకు బాగా పట్టున్న జిల్లాలివి.. ఇక్కడ ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకుడిని అయినా ఓడిస్తాం.. మేము దిగనంతవరకే.. దిగితే ఆట మారిపోతుందన్న భ్రమల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితి అవగతం అవుతోంది. వెక్కిరించేవాళ్ల ముందరే కాలు జారిపడిపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభంజనం.. తుపాను రాబోతోంది.. మొత్తం ఈస్ట్.. వెస్ట్.. పవన్ ఈజ్ బెస్ట్ అన్నట్లుగా ఊదరగొట్టిన జనసైనికులు జనసేన ప్రధాన నాయకులుగా చెప్పుకున్నవాళ్లకు గత రెండు రోజులుగా వాస్తవాలు అర్థం అవుతున్నాయి. జనాన్ని పోగేసి సభలు.. మీటింగులు పెట్టడం వేరు.. జనాన్ని తనవెంట నడిపించి వాళ్లతో ఓట్లు వేయించడం వేరు అన్నది అర్థం అర్థం అవుతోంది. కాకినాడ జిల్లాతో నియోజకవర్గం రివ్యూలు మొదలు పెట్టిన పవన్కు మొదట్లోనే గొంతులో అడ్డం పడిపోయింది. క్యాడర్ నుంచి.. ఓ మోస్తరు నాయకులవరకూ చెబుతున్న ఫీడ్ బ్యాక్ చూసి దిమ్మెత్తిపోయింది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ను చెడ్డీ మీద కొట్టుకుంటూ నడిపిస్తాను అని అప్పట్లో వార్ణింగ్ ఇవ్వడం ఐతే ఇచ్చారు కానీ అక్కడ జనసేనకు అభ్యర్థే లేరు. కాపులు మొత్తం చంద్రశేఖర్ వెంట ఉండడంతో పవన్ తరఫున పోటీ చేసి చేతులు కాల్చుకునేందుకు అభ్యర్థి కరువయ్యారు. రెండు జిల్లాల్లోని మొత్తం 34 స్థానాల్లో జనసేన దాదాపు పాతికపైగా సీట్లు గెలుస్తుంది అని భ్రమల్లో ఉంటూవచ్చిన వారికి ఇప్పుడు పట్టుమని పదిమంది అభ్యర్థులు కనిపించడం లేదు. ఎదురులేదని చెప్పుకున్న ఈస్ట్, వెస్ట్ గోదావరిలోనే ఇలా ఉంటె మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏమిటన్నది పార్టీ పెద్దలకు అంతుపట్టడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ రాదని తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా జనసేనలో చేరారు. ఈ క్రమంలోనే పవన్తో సమీక్షకు హాజరయ్యారు. అయన కూడా గ్రామ స్థాయిలో పార్టీకి ఏమీ బలం లేదని.. ఉన్నదంతా వాపేనని తేల్చి చెప్పారు. దీంతోబాటు తెలుగుదేశం కోసం సీట్లు త్యాగం చేసే పరిస్థితి లేదని, అలాగని టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆ పొత్తు కలవదని, నిలవదని ఓట్ల బదలాయింపు జరగదని తేల్చి చెప్పేసారు. రెండు పార్టీల పొత్తు పొసగదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జిల్లా.. మండల కార్యవర్గాలను ఎందుకు వేయలేదని పవన్ ప్రశ్నించగా.. మీరెళ్ళి చంద్రబాబుకు ఊడిగం చేస్తుంటే మేము పార్టీని ఎలా మోస్తాం.. మేమెలా నిర్ణయాలు తీసుకుంటాం అని ఎదురు ప్రశ్నించడంతో పవన్ నోట మాట రాలేదని తెలిసింది. చిత్తూరులో నాయకుల చిటపట ఇదిలాఉంటే శనివారం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు జనసేన జిల్లా సమావేశానికి హయారయ్యారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అందరం కష్టపడాలి అని పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ చేసిన ప్రసంగం అక్కడ గలాటా రేపింది. కాసేపు ఉండి సమావేశం నుంచి చంద్రబాబు బయటకు వెళ్ళిపోగానే జనసైనికులు హరిప్రసాద్ మీద ప్రశ్నల దాడి చేశారు. చంద్రబాబుకు మనం ఎందుకు ఊడిగం చేయాలి.. మనం పవన్ కోసం కదా పని చేస్తున్నాం. మీరు అలా మాట్లాడితే ఎలా అంటూ కుప్పం జనసైనికులు ప్రశ్నించేసరికి హరిప్రసాద్ నిరుత్తరుడయ్యారు. అధికారంలో సైతం జనసేనకు వాటా ఇవ్వాల్సిందేనని, ఆలాగైతేనే పొత్తు ఉంటుందని జనసైనికులు తేల్చి చెప్పేసారు. - సిమ్మాదిరప్పన్న -
కులం పేరిట బాబు విష రాజకీయం
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాంట్లో భాగంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై కొన్ని శక్తులు వ్యూహాత్మకంగా విష ప్రచారం చేస్తున్నాయి. నిజం గుమ్మం దాటి బయటకు వచ్చేలోగా అబద్దం ఊరంతా తిరిగివచ్చిందన్న సామెత గుర్తు చేస్తున్నాయి. కులం.. ఓ అస్త్రం ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి ప్రజలను కులాల పేరిట విడగొట్టడంలో తెలుగుదేశం పార్టీ మొదట్లో సక్సెస్ అయింది. కొన్ని కులాలను దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ ఎంతకైనా దిగజారిందన్న ఆరోపణలున్నాయి. అందులో భాగంగా చంద్రబాబునాయుడు మూడు దశాబ్దాల నుంచి ఓ పకడ్బందీ వ్యూహరచనను అమలు చేస్తున్నాడన్న విమర్శలున్నాయి. ఏపీలో.. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు కొంత సఫలీకృతుడయ్యాడని చెబుతారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు మరో అసత్య ప్రచారానికి చంద్రబాబు తెరలేపుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో కాపులు ఏ రకంగానయితే పెద్ధ సంఖ్యలో ఉన్నారో.. అలాగే కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బలిజలున్నారు. పవన్తో పొత్తు.. దేనికి సంకేతం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సినిమాల్లో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్కు రాజకీయాలతో సంబంధం లేకుండా కొంత యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం, ఆ సమయంలో పవన్ పార్టీ కోసం పని చేయడం.. ఆ తర్వాత కాలంలో అది కాస్తా కాంగ్రెస్లో కలిసిపోవడం.. ఇదంతా సగటు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయం. ఈ ఎపిసోడ్ను జాగ్రత్తగా ఫాలో అయిన చంద్రబాబు.. ఈ మొత్తం అధ్యాయం నుంచి పవన్ కళ్యాణ్ అనే చాప్టర్ను బయటకు తీశాడు. తనకు అనుకూలమైన రాజకీయ పరిస్థితులను సృష్టించడానికి పవన్కళ్యాణ్ను ఓ పావుగా వాడుకోవడం మొదలుపెట్టాడు. 2014లో అసలు పోటీ చేయకుండానే.. పొత్తులోకి రావడం, 2019లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఓటు చీల్చేందుకు జనసేన విడిగా పోటీచేసేలా చూడడం, ఆ తర్వాత మళ్లీ పవన్తో జైల్లో పొత్తు పెట్టుకోవడం.. ఇవన్నీ హఠాత్తుగా జరిగిన రాజకీయ పరిణామాలు కాదు. అతి జాగ్రత్తగా చంద్రబాబు తెరవెనక రచించిన మంత్రాంగానికి ఇవి విజువల్ రూపం మాత్రమే. పవన్ వెనక ఉన్న వారెవరు? పవన్ కళ్యాణ్ను కాపుల ప్రతినిధిగా ఎవరైనా చెప్పుకుంటే అంతకు మించిన తప్పు ఇంకొకటి ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అత్యధిక సంఖ్యలో ఉండే భీమవరం నియోజకవర్గాన్ని ఎంచుకుని మరీ పోటీ చేస్తే.. 8వేలకు పైగా తేడాతో ఓడిపోయారు పవన్కళ్యాణ్. నిజంగా పవన్ కాపుల ప్రతినిధే అని జనం నమ్మితే ఓడించబోరు కదా. ఇక చంద్రబాబు చేతిలో ఉన్న ఎల్లో మీడియా ఓ అడుగు ముందుకేసి కాపులతో పాటు, బలిజ కూడా జనసేన, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయన్న ఓ అబద్ద ప్రచారాన్ని సోషల్ మీడియాలో నడుపుతున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గంగా తెలగ/కాపులు, బలిజలు ఉన్నారు. బలిజలు రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలో విస్తరించి ఉన్నారు. మరి బలిజలకు చంద్రబాబు చేసిందేంటీ? సీఎం జగన్ చేసిందేంటీ? చంద్రబాబు ఏం చేయకపోగా.. బలిజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాడు. మా నమ్మకం నువ్వే జగన్ : బలిజలు రాయలసీమ జిల్లా బలిజల్లో ఎందరికో మంచి పదవులను ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. అవకాశం వచ్చిన ప్రతీ సారి బలిజలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు సీఎం జగన్. YSR జిల్లానే చూసుకుంటే.. కడపకు చెందిన సి.రామచంద్రయ్యను ఎమ్మెల్సీగా నియమించారు. గురుమోహన్ ను అన్నమయ్య జిల్లా అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించారు. మర్రి రవికుమార్ ను రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంచుకున్నారు. పోరుమామిళ్లకు చెందిన డా. కళ్యాణ్ చక్రవర్తిని ఆప్కోస్ డైరెక్టర్ గా నియమించారు. బలిజలపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో 10 మంది కాపు నేతలకు మంత్రి పదవులివ్వడమే కాకుండా కీలక శాఖలు ఇచ్చారు సీఎం జగన్. ఇక అనంతపురం జిల్లాలో హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా మహాలక్ష్మి శ్రీనివాస్ను, అగ్రోస్ ఛైర్మన్గా నవీన్ నిశ్చల్ను, నియమించారు. అలాగే చిత్తూరు జిల్లాలో చిత్తూరు ఎమ్మెల్యేగా జంగాలపల్లె శ్రీనివాసులు (అరణి శ్రీనివాసులు)ను 2019లో గెలిపించుకున్నారు. నగరికి చెందిన కేజీ శాంతికుమారిని ఈడిగ కార్పోరేషన్ ఛైర్మన్గా ఎంపిక చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా పోకల అశోక్కుమార్ను ఎంపిక చేశారు. ఫారెస్ట్ బోర్డు మెంబర్గా నయనార్ శ్రీనివాసులును నియమించారు. పదవులకు తోడు.. యావత్తు బలిజలకు అండగా ఉండేలా ఇప్పుడు మరో అడుగు ముందుకేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. బలిజ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. మంత్రివర్గం మొదటిసారి ఏర్పాటు చేసినప్పుడు అయిదుగురికి, రెండో సారి పునర్వ్యవస్థీకరించినప్పుడు అయిదుగురికి కాపు/బలిజలనుంచి తీసుకున్నారు సీఎం జగన్. బలిజలంతా వైఎస్ఆర్సీపీ వైపే : రత్నాకర్ వరుసగా నాలుగో సారి ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రత్నాకర్ పండుగాయల తాజా రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. "మాటల్లో కాదు, చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తన లాంటి ఓ సామాన్యుడిని కేబినెట్ పదవిలో కూర్చోబెట్టగలిగిన చిత్తశుద్ధి, సత్తా ఒక్క వైయస్ఆర్ సీపీకే ఉంది. కాపు, బలిజ సామాజికవర్గానికి మరింత రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేందుకు సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. త్వరలోనే బలిజలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కాబోతోంది, ఆర్ధికంగా వెనుకబడిన బలిజల అభ్యున్నతికి ఈ కార్పొరేషన్ ద్వారా చేయూతనివ్వాలన్నది సీఎం జగన్ ఆలోచన." అని అన్నారు. పవన్తో చంద్రబాబు పొత్తు పేరిట కాపు, బలిజల ఓటు బ్యాంకును కొట్టేయాలన్న చంద్రబాబు ప్రయత్నం కచ్చితంగా విఫలమవుతుందని, బలిజల ముసుగులో టీడీపీ చేస్తున్న దిగజారుడు రాజకీయాలను బలిజలు ఈసడించుకుంటున్నారంటున్నారు. బలిజలకు టీడీపీలో పదవులే కాదు, కనీస గౌరవం కూడా లేదంటున్నారు. -
జనసేన కేడర్కు, పవన్కు వార్
పాలకొల్లు సెంట్రల్: ప్రస్తుతం జనసేన కేడర్కు, పవన్కళ్యాణ్కు మధ్య వార్ జరుగుతోందని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పవన్ ఓట్లు కావాలంటారు.. జనసేన నాయకులు అధికారం కావాలంటారు. ఏది ముందు ఏది వెనుక అని విశ్లేషిస్తే జేజేలు, చప్పట్లు కాదు కావాల్సింది ఓట్లు అని పవన్కళ్యాణ్ అంటున్నారు.. ఓట్లు సరే అధికారం సంగతేంటి అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఓట్లు వేసి జనసేనను గెలిపిస్తే అధికారం అదే వస్తుందని పవన్ అంటుంటే.. అధికారం వస్తుందని నమ్మిస్తే ఓట్లు అవే వస్తాయని జనసేన నేతలు అంటున్నారు. తాను కోరుకుంటున్నది అధికారం కాదని, రాష్ట్ర శ్రేయస్సు, ప్రజాశ్రేయస్సు అని పవన్ అంటుంటే.. అధికారం చేజిక్కకుండా ప్రజాశ్రేయస్సు ఎలా సాధిస్తారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు..’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం జనసేన కేడర్, పవన్కు మధ్య జరుగుతున్న వార్ ఇదని తెలిపారు. తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టడంలో ఆఖరి వరుసలో ఉందని సర్వేలు చెబుతున్నా తన సత్తా చూపించాలనే ఆతృతతో బీజేపీతో కలిసి పవన్ ఎన్నికల రంగంలోకి దిగడం సాహసోపేతమని పేర్కొన్నారు. తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టలేదని తెలిసీ ఓటర్లు తమ ఓట్లను జనసేన–బీజేపీ కూటమికి వేసి ఎందుకు చేతులు కాల్చుకుంటారని ప్రశ్నించారు. ఏపీలో పరిస్థితి మాత్రం వేరని తెలిపారు. పవన్ 60 శాసనసభ సీట్లకు తక్కువ కాకుండా పోటీచేయవచ్చని పేర్కొన్నారు. అధికారం దక్కించుకోవడం పవన్ వంతు అయితే.. జనసేన–టీడీపీ కూటమికి ఓట్లు వేసి నెగ్గించుకోవడం తమ వంతు అని జనసేన కేడర్ దృఢ సంకల్పంతో ఉందని తెలిపారు. జనసేన టీడీపీని కలుపుకొని వైఎస్సార్సీపీని ఓడించి రాజ్యాధికారం దక్కించుకోవడానికి, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దగ్గరలో ఉందని తెలిపారు. టీడీపీ వెనుక జనసేన అని కాకుండా.. జనసేన వెంట టీడీపీ ఉందని చెప్పి మూడునెలల్లో అధికారంలోకి రావడం తథ్యమని ప్రజలను నమ్మించగలగాలని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్? -
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. కల్లంలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు ఎక్కడా జాప్యం లేకుండా రైతుకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రోడ్ మ్యాప్ను సిద్ధంచేస్తోంది. రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు దాదాపు 30వేలకు పైగా వాహనాలను అందుబాటులో ఉంచనుంది. ప్రైవేటు కాంట్రాక్టు వాహనాలతో పాటు రైతుల సొంత వాహనాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల్లో వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. నిజానికి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్లో పంట ఆలస్యంగా సాగైంది. ఫలితంగా నవంబర్ రెండో వారం తర్వాత కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో పది వాహనాలు.. రాష్ట్రవ్యాప్తంగా 3,500కు పైగా ఆర్బీకే క్లస్టర్లలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. సీజన్లో ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో దాదాపు 10 వాహనాలను కేటాయించనుంది. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన అనంతరం వారికి ధాన్యం తరలింపు కాంట్రాక్టును ఇస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నిర్దేశించిన మిల్లుకు మాత్రమే అవి చేరేలా ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పర్యవేక్షించనుంది. ఆ తర్వాత బఫర్ గోడౌన్లకు తరలిస్తారు. ఆర్బీకేల వారీగా వివరాల సేకరణ.. ధాన్యం సేకరణలో ఎటువంటి టార్గెట్లు లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ ఆర్బీకేల వారీగా పంట ఎంత ఉంది? రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోగా ఎంతమేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుంది? అన్నదానిపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధంచేస్తోంది. దీని ఆధారంగా ముందస్తుగానే గోతాలు, రవాణా, హమాలీలను సమకూర్చనుంది. అలాగే, 10వేల మందికిపైగా టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను తాత్కాలిక ప్రాతిపదికపైన నియమిస్తోంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి సుమారు 4–5 నెలల పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆయా జిల్లాల వారీగా జేసీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనుంది. ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం ఇక గతంలో పంట దిగుబడి అంచనా ఆధారంగా ఒక ఎకరాకు ఎన్ని ధాన్యం బస్తాలు వస్తాయో లెక్కించేవారు. అనంతరం..ఈ–క్రాప్లో రైతు నమోదు చేసిన పంట విస్తీర్ణ వివరాలను, దిగుబడి అంచనాను బేరీజు వేసుకుని పౌరసరఫరాల సంస్థ రైతు నుంచి నిర్దేశించిన సంఖ్యలో ధాన్యం బస్తాలను సేకరించేది. దీంతో కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరౖమెన గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరిగేది. ప్రస్తుతం పంట దిగుబడి అంచనాతో సంబంధంలేకుండా గడిచిన ఐదేళ్లలో ఏ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందో ఆ సంఖ్యను ప్రస్తుత సీజన్కు అన్వయించుకుని కొనుగోళ్లకు ముందస్తుగానే ఏర్పాట్లుచేస్తోంది. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చులను సైతం అందిస్తోంది. టన్నుకు గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలి రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ (గన్నీ లేబర్ ట్రాన్స్పోర్టు) కింద టన్నుకు రూ.2,523 లబ్ధిచేకూరుస్తోంది. రైతులు మిల్లుకు వెళ్లొద్దు.. రైతులు ఆర్బీకేలో ధాన్యం అప్పగించిన అనంతరం ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) అందిస్తాం. అందులో రైతు కొనుగోలు కేంద్రానికి ఇచ్చిన ధాన్యం బరువు, ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధర మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఎఫ్టీఓ ఇచ్చిన తర్వాత రైతుకు ధాన్యం బాధ్యత ఉండదు. మిల్లుకు ఆర్బీకే సిబ్బందే తరలిస్తారు. ఏదైనా సమస్య వస్తే మిల్లు వద్ద డెప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని కస్టోడియన్ ఆఫీసర్గా నియమించి పరిష్కరిస్తాం. ఆర్బీకేలో పరీక్షించిన తేమ శాతాన్ని ఫైనల్ చేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందిస్తున్నాం. – హెచ్. అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ మిల్లర్లు గోనె సంచులు ఇవ్వాల్సిందే.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌకదుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులు సేకరిస్తున్నాం. వీటిని ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టిసారించారు. మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ -
పార్టీ ధిక్కారానికి పాల్పడితే వేటే..
సాక్షి, హైదరాబాద్: ముందు నుంచీ చెప్తున్నట్టుగానే సిట్టింగ్లకే పార్టీ టికెట్లు కేటాయించామని.. పార్టీ ధిక్కార చర్యలకు ఎవరు పాల్పడినా వేటు తప్పదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ధిక్కారానికి పాల్పడేవారు ఏ స్థాయిలో ఉన్నా క్రమశిక్షణ చర్యలు సాదాసీదాగా ఉండవని, పార్టీ నుంచి పంపించేస్తామని స్పష్టం చేశారు. ఒకట్రెండు చోట్ల అసంతృప్తులుంటే.. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అధ్యక్షతన త్రిసభ్య కమిటీని నియమిస్తామని, ఆ కమిటీ సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకెవరూ పోటీయే కాదని.. 95 నుంచి 105 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్ లో 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులతో జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్టీలో పూర్తి స్థాయి అవగాహన, సర్దు బాట్లతోనే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నామన్నారు. పార్టీ నిర్ణయం మేరకు తాను రెండు చోట్ల పోటీ చేస్తున్నట్టు తెలిపారు. శ్రావణమాసం మంచి ముహుర్తం ధనుర్లగ్నంలో అభ్యర్థులను ప్రకటించామని.. వీరిని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా ఆశీర్వదించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 16న వరంగల్లో సింహ గర్జన బహిరంగ సభ నిర్వహిస్తామని, అదే రోజున బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మార్పులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏడుగురు సిట్టింగ్లను మార్చామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎవరినైనా వదులుకోవాలంటే తమకు కూడా బాధగానే ఉంటుందన్నారు. అవకాశం రానివారు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని.. ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్పర్సన్లుగా పార్టీ అవకాశాలు కలి్పస్తుందని హామీ ఇచ్చారు. పార్టీలోనే ఉండి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. మిగిలిపోయిన 4 సీట్లలో అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ఖరారు చేస్తామని చెప్పారు. వేములవాడ అభ్యర్థి మంచివాడే అయినా ఆయన పౌరసత్వం సమస్య కోర్టుల్లో ఉందని చెప్పారు. భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డికి పోటీచేసే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినందున మధుసూదనాచారి సహకారంతో టికెట్ కేటాయించామన్నారు. తాండూరు నుంచి మహేందర్రెడ్డి కూడా యువకుడికి అవకాశం ఇవ్వడానికి పూర్తిగా సహకరించి ఆశీర్వదించారని చెప్పారు. వామపక్షాలతో పొత్తు మాటే రాదు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాక వామపక్షాలతో పొత్తు మాటే ఉత్పన్నం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 34 సీట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, బీఆర్ఎస్ బీసీలకు తక్కువ సీట్లు కేటాయించిందేమని మీడియా ప్రశ్నించగా.. ‘చూద్దాం.. ఎవరెన్ని సీట్లు కేటాయిస్తారో?’అని బదులిచ్చారు. మహిళలకు తక్కువ సీట్లపై స్పందిస్తూ.. పార్లమెంటు చట్టం చేస్తే ప్రతీపార్టీ కూడా మహిళలకే అవకాశాలు ఇస్తాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ ఆలోచించి టికెట్లు కేటాయించామని వివరించారు. కర్ణాటకకు, తెలంగాణకు పోలికే లేదు ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఫలితాలకు, తెలంగాణకు పోలికే లేదని కేసీఆర్ పేర్కొన్నారు. అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తోందని విమర్శించారు. బెంగళూరుకు విద్యుత్ సరఫరా చేయలేక లోడ్ షెడ్డింగ్ చేస్తున్నారన్నారు. తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నా.. బీఆర్ఎస్ లక్ష రూపాయలే, అదీ విడతల వారీగా మాఫీ చేస్తామని, ప్రజలు తమనే నమ్మి గెలిపించారని చెప్పారు. జవదేకర్ ఓ పాగల్..! సీఎం కేసీఆర్ను ఉద్దేశించి బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ చేసిన విమర్శలను ప్రస్తావించగా.. ‘‘జవదేకర్ మాట్లాడేది ఏంది? కాళేశ్వరం గురించి తొండం తెల్వదు.. తోక తెల్వదు. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తారు. ఆయనో ఓ పాగల్. బీఆర్ఎస్ను ఒకరికొకరు ఏ టీమ్, బీ టీమ్ అంటున్న కాంగ్రెస్, బీజేపీలు కూడా పాగల్ పార్టీలు..’’అని కేసీఆర్ మండిపడ్డారు. వ్యతిరేకులకు ఇళ్ల స్థలాలివ్వం: కేసీఆర్ ‘‘రాష్ట్రానికి వ్యతిరేకంగా, అభివృద్ధికి విఘాతం కలిగించేలా కథనాలు ప్రచురించే పత్రికల్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వం. వాళ్లను పాలు పోసి పోషించాల్సిన అవసరమేముంది? ఎవరికి ఇవ్వా లన్నది ప్రభుత్వ విచక్షణ. కీలుబోమ్మలాంటి వారు జర్నలిస్టులు ఎలా అవుతారు? వాళ్లకు ఐడియా ఉండాలి కదా.. దేశంలో ఎవరూ మాతో పోల్చుకోవడానికి కూడా సాహసం చేయని పరిస్థితులు ఉంటే.. ఇక్కడ వేతనాలు ఇవ్వడానికి డబ్బుల్లేవంటూ కథనాలు రాస్తున్నారు. ఒకే దెబ్బకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఆ పత్రిక తల ఎక్కడ పెట్టుకుంటుంది? ఆర్బీఐ రాష్ట్రాన్ని బెస్ట్ స్టేట్ అంటోంది. కేంద్రం, కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధిని చెబుతూ అవార్డులిస్తుంటే.. అవేవీ పట్టించుకోకుండా పనికి మాలిన రాతలు రాస్తున్నారు. ఇదేం జర్నలిజం? ఉద్యమ సమయంలోనే చెప్పా.. కొన్ని కుల పత్రికలు, గుల పత్రికలు ఉన్నాయని.. న్యూస్పేపర్ కాదు వ్యూస్ పేపర్, చానెల్స్ ఉన్నాయి..’’అని సీఎం ఘాటుగా స్పందించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై మీడియా ప్రశ్నించగా ఇలా స్పందించారు. -
ఐపీఎస్ను పెళ్లాడిన టీనా దాబి సోదరి.. ఐఏఎస్ భార్య కోసం కేడర్ మార్పు..
ఐఏఎస్ అధికారి, యూపీఎస్సీ టాపర్ టీనా దాబి సోదరి ఐఏఎస్ రియా దాబి పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఐపీఎస్ అధికారి మనీష్ కుమార్తో ఏడడుగులు వేశారు. కాగా మనిష్ కుమార్, రియా దాబిలు కుటుంబ సభ్యుల అనుమతితో ఏప్రిల్ నెలలోనే కోర్టు వివాహం చేసుకున్నారు. అంటే వీరి పెళ్లి జరిగి రెండు నెలలు కావొస్తుంది. అయితే మనీష్ కుమార్ కేడర్ను మహారాష్ట్ర నుంచి రాజస్థాన్కు మారుస్తూ హోం మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇక రియా దాబి ఆమె భర్త ఐపీఎస్ మనీష్ కుమార్ ఇద్దరూ 2020 యూపీఎస్సీ బ్యాచ్కు చెందిన వారే. యూపీఎస్సీ పరీక్షల్లో ఆమె 15వ ర్యాంకర్గా నిలిచారు. ప్రస్తుతం ఆమె రాజస్థాన్లోని అల్వార్కు కలెక్టర్గా ఉన్నారు. వీరిద్దరికి ముస్సోరీలోని శిక్షణా అకాడమీలో పరిచయం ఏర్పడగా.. అనంతరం స్నేహం ప్రేమగా మారింది. అయితే రియా రాజస్థాన్ కేడర్ కాగా మనీష్ మహారాష్ట్ర కేడర్కు చెందిన ఐపీఎస్. వివాహామనంతరం మనీష్ తన కేడర్ మార్పు కోసం దరఖాస్తు చేసుకొని..మహారాష్ట్ర నుంచి రాజస్థాన్కు మార్చుకున్నారు. చదవండి: బిల్లు కట్టకుండా ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు.. తర్వాత ఏమైందంటే! కాగా మనీష్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. బీటెక్ చదివిన తర్వాత సివిల్ సర్వీసెస్లో చేరారు. 2020 పరీక్షలో 581 ర్యాంకు సాధించాడు. మహారాష్ట్రలోని ఒసామాబాద్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇప్పుడు రాజస్థాన్కు బదిలీ కానున్నారు. త్వరలోనే వీరు జైపూర్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకోనున్నారు. కాగా రియా సోదరి టీనా దాబి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 2015 టాపర్గా నిలిచారు. అంతేగాక సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి దళితురాలిగా రికార్డు సృష్టించింది. సెకండ్ ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత రెండేళ్లకే 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. గతేడాది ఐఏఎస్ ప్రదీప్ గావండేను రెండో పెళ్లి చేసుకున్నారు.. ప్రస్తుతం జైసల్మేర్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. -
అచంచలమైన నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేలో 1.45 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్సీపీ చేరువైంది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని భారీ మెగా పీపుల్స్ సర్వేగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ నిలిచింది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్సీపీ క్యాడర్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సుపరిపాలన, ప్రభుత్వ విధానాలపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి మద్దతు తెలిపిన 1.16 కోట్ల కుటుంబాలకు, పార్టీ క్యాడర్కు ధన్యవాదాలు’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. ‘‘ప్రజలకు మరింత సేవ చేసేందుకు దేవుని దయ, మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. మన పాలన పట్ల మన ప్రభుత్వ విధానాల పట్ల అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి నాకు మద్దతు తెలిపిన 1.16కోట్ల కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన @YSRCParty క్యాడర్ కు ధన్యవాదాలు. మీకు మరింత సేవ చేసేందుకు, దేవుని దయ మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా… pic.twitter.com/92DSw9eFFX — YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2023 కాగా, వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కలిసి సీఎం జగనన్న పాలనపై వారి అభిప్రాయాలను సేకరించింది. సీఎం జగన్ పాలనకు 1.1 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్ ద్వారా మద్దతు ప్రకటించారు. చదవండి: ఇంటింటా ‘నమ్మకం’.. జగనన్నే మా భవిష్యత్తు..1.1 కోట్ల మిస్డ్ కాల్స్ -
ఆ పోస్టర్ల వెనుక మాజీ మంత్రి గంటా హస్తం ఉందా?.. ఇంతకీ ఆమె కథేంటి?
పార్టీ ఏదైనా..తమ నేతను గెలిపిస్తాం అని కేడర్ చెబుతుంది. కానీ ఒక చోట టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు మాత్రం ఆ అభ్యర్థి అయితే ఓడించడం ఖాయం అంటున్నారట. తమ అభ్యంతరాలు కాదని ఆమెకే సీటిస్తే ఓటమి తథ్యమని ముందే ప్రకటించేశారట. ఇంతకీ ఆ కథేంటో మీరే చదవండి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ పాయకరావుపేట నియోజకవర్గంలోని నేతలతో ఆమెకు ఉన్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎమ్మెల్యే కావడంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదించేశారని ఆమెపై తీవ్ర ఆరోపణలున్నాయి. అనిత అవినీతిని వ్యతిరేకించిన నాయకులుపై కక్ష సాధింపు చర్యలకు దిగారని స్థానిక పార్టీ నేతలే చెబుతారు. తనను గెలిపించిన నియోజకవర్గంలో నచ్చని నేతలపై తప్పుడు కేసులు పెట్టించారట. అనిత తప్పుడు కేసులతో విసిగిపోయిన టీడీపీ నేతలు గతంలోనే ఆమెపై తిరుగుబాటు చేశారు. 2019 ఎన్నికలకు ముందు అనిత వద్దు.. టీడీపీ ముద్దు అంటూ నియోజకవర్గం మొత్తం ప్రచారం చేశారు. పాయకరావుపేటలో అనితకు సీటు ఇస్తే ఓడిస్తామని పార్టీ అధినేతకే నేరుగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీలోనే తనకున్న వ్యతిరేకతను తట్టుకోలేక అనిత పాయకరావుపేటని వదిలి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేశారు. అక్కడ పరాజయం పాలవడంతో మళ్లీ పాయకరావుపేటకు మకాం మార్చారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పరాయిచోటుకు వెళ్ళి ఓడిపోయి.. తిరిగి సొంత నియోజకవర్గం పాయకరావుపేటకు చేరుకున్న అనిత తన పాత లక్షణాలను ఏమాత్రం వదులుకోలేదు. స్థానిక టీడీపీ నేతలపై వేధింపులు పర్వం కొనసాగిస్తున్నారు. గతంలో తనపై వ్యతిరేక గళం వినిపించిన నాయకులను ఒక్కొక్కరిని పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తున్నారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలో కొంతమంది నేతలు పోస్టర్స్ వేయించారు. ఆ పోస్టర్స్ లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫొటోలు మినహా ఎక్కడా అనిత ఫోటోలు లేవు. ఈ పోస్టర్ల వెనక మాజీ మంత్రి గంటా హస్తం ఉందని అనిత అనుమానిస్తున్నారు. తన నియోజకవర్గంలో కొంతమంది కాపు నేతలను గంటా ప్రోత్సహిస్తున్నారని ఆమె భావిస్తున్నారు. దీంతో గంటాతో సన్నిహితంగా మెలిగే కాపు నాయకులను గుర్తించిన ఆమె వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. గతంలో అనిత వద్దు.. టీడీపీ ముద్దు అని ఎవరైతే తనకి వ్యతిరేకంగా ప్రచారం చేశారో ఇప్పుడు ఈ పోస్టర్ల వెనక వారే ఉన్నారని అనిత భావిస్తున్నారు. ఈ పోస్టర్ల వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి అనిత తీసుకెళ్ళారు. తన వ్యతిరేకులుగా భావించిన ఇద్దరిని పార్టీ నుంచి అనిత సస్పెండ్ చేయించారు. అనిత సస్పెండ్ చేయించిన ఆ ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఇప్పుడు పాయకరావుపేట టీడీపీ రాజకీయం మరింత వేడెక్కింది. పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడ్ అయినప్పటికీ అక్కడ చక్రం తిప్పేది కాపు సామాజిక వర్గ నాయకులే. ఇప్పుడు ఇద్దరిని సస్పెండ్ చేయించడంతో అనిత మీద ఆగ్రహంతో ఉన్న కాపు సామాజిక వర్గ టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. అనితను ఓడించడమే కాకుండా మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామని సెటైర్లు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ అనితకు ఇస్తే ఊరూరు తిరిగి ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తామంటూ సవాళ్ళు విసురుతున్నారు. స్థానిక పార్టీ నేతల హెచ్చరికల నేపథ్యంలో అనితకు పాయకరావుపేటలో మళ్లీ సీటు ఇస్తారో లేక గతంలో మాదిరిగా మరో చోటకు మార్చుతారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: ఎస్.. వైనాట్ 175.. ఏపీలో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ -
తెలంగాణ రాష్ట్ర కేడర్కు ఆరుగురు ఐఏఎస్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేడర్కు ఆరుగురు 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. శ్రద్ధ శుక్ల (ఛత్తీస్గఢ్), కిరణ్మయి కోపిశెట్టి (తెలంగాణ), నారాయణ్ అమిత్ మాలెపాటి (తెలంగాణ), వికాస్ మహతో (ఝార్ఖండ్), ఉమాశంకర్ ప్రసాద్ (బిహార్), మాయంక్ సింగ్ (మధ్యప్రదేశ్) త్వరలో రాష్ట్ర కేడర్లో చేరనున్నారు. కేంద్ర సర్వీసులకు రజత్షైనీ రాష్ట్ర రెవెన్యూ శాఖ లో సీసీఎల్ఏ డైరెక్టర్గా పనిచేస్తున్న 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ షైనీ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఆయనను కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండస్ట్రీ ప్రమోషన్, ఇంటర్నల్ ట్రేడ్ విభాగానికి డైరెక్టర్గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: రైతే జెండా.. ఎజెండా! బీఆర్ఎస్ కార్యచరణపై కేసీఆర్ కసరత్తు -
పొలిటికల్ కారిడార్: దేవినేని ఉమాను మర్చిపోయిన క్యాడర్, ప్రజలు
-
రాహుల్ సభ సక్సెస్.. కాంగ్రెస్లో సమరోత్సాహం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముందస్తు ఎన్నిక లు వస్తాయా అనే వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా రాజకీయాలు హాట్హాట్గా మారాయి. ఈ క్రమంలో రేవంత్రెడ్డి పీసీసీ అధ్య క్షుడు అయ్యాక జిల్లా నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తొమ్మి ది నెలలుగా వరుసగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రె స్ అగ్రనేత రాహుల్గాంధీ ఆధ్వర్యంలో వరంగల్లో రైతు సంఘర్షణ సభ భారీ విజయంతో జి ల్లా పార్టీ నాయకులతో పాటు, కార్యకర్తల్లో ఉత్సా హం రెట్టింపైంది. నిజామాబాద్ జిల్లా వ్యవసా య పరంగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో రైతు సంఘర్షణ సభ ఇంత స్థాయిలో విజయవంతం కావడంపై మరింతగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను రూపొందించుకునేందుకు జిల్లా నాయకులు ప్రణాళికలు సిద్ధం చే సుకుంటున్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ లో పార్టీ ప్రకటించిన డిక్లరేషన్ జిల్లా రైతాంగానికి తిరుగులేని మేలు చేస్తుందని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 1.50 లక్షల సభ్యత్వాలు.. ఇప్పటికే జిల్లాలో డిజిటల్ విధానంలో పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు 1.50 లక్షల సభ్యత్వాలు చేశారు. ఇక క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సి ద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా రాహుల్ సభ మరింత జోష్ తెచ్చిందని జిల్లా కాంగ్రెస్ నాయ కులు చెబుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహే ష్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటికే జాతీయ నాయకురాలు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సక్సెస్ చేశారు. తాజాగా వరంగల్ డిక్లరేషన్ అంశాలను జిల్లాలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేందుకు జిల్లా నేతలు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. రెండుమూడు రోజుల్లో షెడ్యూల్ నిర్ణయించుకుని నెలరోజుల పాటు ఇంటింటికీ తిరిగి రైతుల డిక్లరేషన్ను వివరించనున్నారు. దీ నికి సంబంధించి హైదరాబాద్లో శనివారం రా హుల్ ఆధ్వర్యంలో ఎక్స్టెండెట్ ఎగ్జిక్యూటివ్ స మావేశం జరిగింది. ఇక పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇకపై మ రిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి పేర్కొన్నారు. డిక్లరేషన్ కాదు.. గ్యారంటీ ఇందులో ముఖ్యంగా జిల్లాలో అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన 1937లో నిర్మించిన బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని పేర్కొన్నారు. ఇక జిల్లాలో పసుపు పంట రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా రైతులు పండిస్తున్నారు. దీంతో జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, పసుపునకు మద్దతు ధర రూ.12 వేలు ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో ఎక్కువగా పండించే ఎర్రజొన్నలకు మద్దతు ధర ఇస్తామని, ఇతర అన్ని పంటలకు మద్దతు ధరలు ఇస్తామని ప్రకటించారు. ఇక రుణమాఫీని ఏకమొత్తంలో రూ.2లక్షల మాఫీ చేస్తామని డిక్లరేషన్లో పేర్కొనడంతో పాటు ధరణి రద్దు చేసి మెరుగైన విధానం తెస్తామన్నారు. ఇవి కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో పాటు ఇంకా అనేక అంశాలు పొందుపర్చారు. ఇది డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీ అని రాహుల్ చెప్పడంతో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. -
అభిషేక్ను రెండు వారాల్లో తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్ర కేడర్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సోమేశ్కుమార్ను ముందుగా ఏపీకి కేటాయించగా తామిచ్చిన ఆదేశాలతో తెలంగాణ కేడర్లో కొనసాగుతున్నారని గుర్తుచేసింది. అభిషేక్ మొహంతి కేసులో తమ ఆదేశాలను అమలు చేయకపోతే గతంలో తామిచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించి సోమేశ్ను తిరిగి ఏపీ కేడర్కు పంపుతామని హెచ్చరించింది. ఈ మేరకు క్యాట్ సభ్యులు ఆశిష్కాలియా, బీవీ సుధాకర్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ అభిషేక్ మొహంతి దాఖలు చేసిన పిటిషన్ను గతంలో విచారించిన క్యాట్.. తెలంగాణ కేడర్లోకి తీసుకోవాలంటూ 8 నెలల క్రితం ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో అభిషేక్ కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా సీఎస్ సోమేశ్కుమార్ను వ్యక్తిగతంగా హాజరుకావాలని గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. కోర్టుధిక్కరణ పిటిషన్ మరోసారి విచారణకు రాగా.. సీఎస్ తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించారు. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో సీఎస్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని, గంట సమయం ఇస్తున్నామని, ఈలోగా హాజరుకాకపోతే సీఎస్కు అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం హె చ్చరించింది. దీంతో కొద్దిసేపటి తర్వాత సీఎస్ ఆన్లైన్లో ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేడర్ కేటాయింపులు చేసే అధికారం కేంద్రానికి ఉందని, ఈ నేపథ్యంలో క్యాట్ ఆదేశాలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రా నికి నివేదించామని సోమేశ్కుమార్ పేర్కొన్నారు. రెండు వారాల్లోగా అభిషేక్ను తెలంగాణ కేడర్లోకి తీసుకోవాలని సీఎస్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 వారాల తర్వాతకు వాయిదా వేసింది. కాగా, సోమేశ్తోపాటు ఇతర అధికారులను తెలంగాణకు కేడర్కు కేటాయించాలంటూ క్యాట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం ఇప్పటికే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. -
పరస్పర బదిలీలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఒక లోకల్ కేడర్ నుంచి మరో సమాన లోకల్ కేడర్కు పరస్పర బదిలీకి అనుమతిచ్చింది. ఒకే శాఖలో సమాన హోదా పోస్టులు కలిగిన ఇద్దరు వ్యక్తులు, వేర్వేరు సమాన లోకల్ కేడర్లో పనిచేస్తుంటేనే పరస్పర బదిలీకి అర్హులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు (జీవో నం.21) జారీ చేశారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు–2018 ప్రకారం కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ పూర్తైన తర్వాత ఉద్యోగవర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరస్పర బదిలీల కోసం ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా మార్చి 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పరిపాలన అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఏ దరఖాస్తునైనా తిరస్కరించేందుకు చాన్స్ ఉంది. ఇద్దరిలో ఒక్కరు బదిలీ అయి ఉండాలి ► పరస్పర బదిలీ కోరుకునే ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరైనా, కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపుల్లో స్థాన చలనం పొంది ఉండాలి. ► ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు సమాన మేనేజ్మెంట్(ప్రభుత్వ/జెడ్పీ), సమాన హోదా, సమాన సబ్జెక్టు, సమాన మాధ్యమానికి లోబడి పరస్పర బదిలీకిఅర్హులు. జిల్లా పరిషత్, మండల పరిషత్, ఇతర స్థానిక సంస్థల పరిధిలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని అలాంటి ఇతర జిల్లా పరిషత్, మండల పరిషత్, ఇతర స్థానిక సంస్థలకు మాత్రమే బదిలీ చేస్తారు. సీనియారిటీ వదులుకోవాల్సిందే.. ► పాత లోకల్ కేడర్లలోని సీనియారిటీ హక్కులను వదులుకోవడంతో పాటు కొత్త లోకల్ కేడర్లలో చివరి ర్యాంకును పొందేందుకు అంగీకారం తెలుపుతూ పరస్పర బదిలీ కోరే ఇద్దరు వ్యక్తులూ నిర్దేశిత నమూనాలో రాతపూర్వక హామీ ఇవ్వాలి. కొత్త లోకల్ కేడర్లలోని చివరి రెగ్యులర్ ఉద్యోగి తర్వాత చివరి ర్యాంక్ను పరస్పర బదిలీపై వెళ్లే ఉద్యోగులకు కేటాయించనున్నారు. ► విజ్ఞప్తి మేరకు బదిలీ చేస్తున్న నేపథ్యంలో ఉద్యో గులు ఎలాంటి టీఏ, డీఏలకు అర్హులు కారు. ► కోర్టు ఆదేశాల మేరకు పాత కేడర్లలో కొనసాగుతున్న ఉద్యోగులు, సస్పెన్షన్లో ఉన్నవారు, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారు, పాత కేడర్లలో అనధికారికంగా గైర్హాజరవుతున్న వారు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఒక్కరికే సమ్మతి ఇవ్వాలి ► ఒక ఉద్యోగి ఇతర సమాన లోకల్ కేడర్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి మాత్రమే పరస్పర బదిలీకి సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది. ► ఆన్లైన్ ద్వారా పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకుని హార్డ్ కాపీని సంబంధిత శాఖకు జిల్లా/జోనల్ అధిపతి ద్వారా పంపించాలి. ఒకసారి దరఖాస్తు చేసుకుంటే మరో దరఖాస్తుకు అవకాశం ఉండదు. సరైన సమాచారం ఇచ్చే విషయంలో పూర్తి బాధ్యత ఉద్యోగులదే. ► సంబంధిత విభాగాధిపతి దరఖాస్తులను పరిశీలించి సమగ్ర ప్రతిపాదనలను శాఖ కార్యదర్శికి సమర్పించాలి. సాధారణ పరిపాలన శాఖ అనుమతితో శాఖ కార్యదర్శి పరస్పర బదిలీలకు ఉత్తర్వులు జారీ చేస్తారు. దరఖాస్తు ఎలా చేయొచ్చు.. ఎలా చేయకూడదు ► స్కూల్ అసిస్టెంట్ (గణితం) ఆంగ్ల మాధ్యమం పోస్టులో ఉన్న ఉపాధ్యాయుడు సమాన స్కూల్ అసిస్టెంట్ (గణితం) ఆంగ్ల మాధ్యమం పోస్టులో ఉన్న మరో ఉపాధ్యాయుడి పోస్టు కోసమే దరఖాస్తు చేసుకోవాలి. ► స్కూల్ అసిస్టెంట్ (గణితం) తెలుగు మాధ్యమం పోస్టులోని ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ (గణితం) ఆంగ్ల మాధ్యమం పోస్టులోని మరో ఉపాధ్యాయుడి పోస్టుకు దరఖాస్తు చేసుకోరాదు. ► రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులోని ఉద్యోగి అదే శాఖలోని మరో ఉద్యోగికి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోరాదు. ► వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్ పోస్టులో ఉన్న ఉద్యోగి పంచాయతీరాజ్ శాఖలోని సూపరింటెండెంట్ పోస్టులోని మరో ఉద్యోగి పోస్టు కోసం దరఖాస్తు చేసుకోరాదు. -
ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’ విహీనమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షు డు కళా వెంకటరావు నాయకత్వాన్ని అక్కడి టీడీ పీ శ్రేణులు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి. తన మాట మాత్రమే వినాలనే కళా వైఖరిని ఎండగడుతున్నాయి. తనతో కలిసి పనిచేయకపోతే లోకేష్ను తీసుకువచ్చి పోటీ చేయిస్తానని కళా బెదిరిస్తుంటే.. మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు ఇక్కడేం చేయగలరని బాహాటంగానే బదులిస్తున్నాయి. దీంతో కళా వెంకటరావు పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. ఇప్పటికే ఆయనను కాదని బయటకు వచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు స్వతంత్రంగా పనులు చేయడం మొదలుపెట్టారు. ఆ నియోజకవర్గంలో కళాకు ప్రత్యామ్నాయంగా మారుతున్నారు. అసంతృప్త నేతలు, కార్యకర్తలంతా ఇప్పుడు కలిశెట్టితో కలుస్తున్నారు. కలిశెట్టి నాయకత్వ పటిమను పక్కన పెడితే.. కళా కంటే మేలేనని కా ర్యకర్తలు భావిస్తున్నారు. కలిశెట్టిని పార్టీ నుంచి రెండుసార్లు సస్పెండ్ చేయిస్తే డోంట్కేర్ అంటూ పార్టీ జెండాతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు. బుజ్జగింపు.. బెదిరింపు పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతుండడంతో కళా అండ్కో పార్టీ శ్రేణులను దారికి తెచ్చుకు నే ప్రయత్నం చేస్తోంది. కలిశెట్టి వెనుక తిరుగుతున్న వారిని బుజ్జగించే పనిలో ఉంది. కలిశెట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ రాదని తమతోనే పనిచేయాలని కళా కోరుతున్నారు. అయితే ఈ రా య‘బేరాలకు’ ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణు లు తలొగ్గడం లేదు. కళా నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఫోన్ లోనే నేరుగా చెప్పేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న స్పందనతో అవాక్కవుతు న్న కళా అండ్కో చివరికి బెదిరింపులకు దిగుతున్నారు. కళా పోటీలో లేకుంటే ఆయన కుమారు డు పోటీ చేస్తాడని, కాదూ కూడదంటే లోకేష్ను తీసుకువచ్చి పోటీ చేయిస్తారని కేడర్కు బెదిరింపుల సంకేతాలు పంపిస్తున్నారు. కానీ ఆ బెదిరింపులకు కూడా ఎవరూ లొంగడం లేదు. లోకేష్ ఇ క్కడికొస్తే అవమానం తప్ప ఏమీ ఉండదని, స్థా నికుడే నాయకుడిగా ఉండాలని «ధీటుగా జవాబు ఇచ్చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఎచ్చెర్లలో బయట నుంచి ఏ నాయకుడొచ్చి నాయకత్వం వహించినా టీడీపీ శ్రేణులు తరిమికొట్టేలా ఉన్నాయి. ఇవీ చదవండి: ‘రోడ్డు’ మ్యాప్ రెడీ కోటి రూపాయలను తలదన్నే కథ -
అంతా పార్టీ గుప్పిట్లోనే..!
సాక్షి, హైదరాబాద్: ‘పార్టీని చూసే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు.. పార్టీలోకి నేతలు వస్తూ పోతూ ఉంటారు.. పార్టీయే సుప్రీమ్’అని రెండు రోజుల క్రితం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించిన దానికి అనుగుణంగా పార్టీ కమిటీలను పటిష్టం చేసే కసరత్తు మొదలైంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ కొలిక్కి రావడంతో రాబోయే రోజుల్లో పార్టీ కేంద్రంగానే నేతలు, కార్యకర్తల యంత్రాంగం పనిచేసేలా సంస్థాగత కమిటీలకు జవసత్వాలు కల్పించాలని అధినేత నిర్ణయించారు. గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల నిర్మాణంలో సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ పాత, కొత్త తేడా లేకుండా చురుకైనవారు, యువతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. కమిటీల నిర్మాణంలో పాటించాల్సిన మార్గదర్శకాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నేతృత్వంలో ఒకటి, రెండు రోజుల్లో జరిగే భేటీలో ఖరారు చేస్తారు. గ్రామ, మండల స్థాయి సంస్థాగత కమిటీలు పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఏర్పాటవుతుండగా, ఈసారి మాత్రం పార్టీ ఇన్చార్జీల పర్యవేక్షణలో గ్రూపులు, వర్గాలకు అతీతంగా కమిటీలను నియమించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. విజయదశమికి అటూ ఇటూగా పార్టీ జిల్లా కార్యాలయాలు ప్రారంభించిన తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే కమిటీలకు శిక్షణ ఇచ్చేలా పార్టీ రాష్ట్ర కార్యాలయం షెడ్యూల్ను సిద్ధం చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పార్టీ, ప్రభుత్వంపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టేందుకు అన్ని స్థాయిల కమిటీల్లో యువతకు చోటు కల్పించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేల తీరుతో పార్టీకి తలనొప్పి.. ఉపఎన్నిక జరగాల్సిన హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మినహాయిస్తే ప్రస్తుతం టీఆర్ఎస్కు 103 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 68 మంది వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఎన్నికైనవారే ఉన్నారు. పార్టీకి చెందిన సీనియర్లు పి.మహేందర్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, మధుసూదనాచారి, జలగం వెంకట్రావు వంటి నేతలు మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లే ఓటమి పాలైనట్లు కేసీఆర్ ఇటీవలి రాష్ట్ర కమిటీ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా ఇటీవల ఓడిపోయిన నియోజకవర్గంలో దివంగతులైన ఎమ్మెల్యే.. ఆయన ఉన్న సమయంలోనే పార్టీని భ్రష్టుపట్టించారని, ఆయన కుటుంబంపై అంత వ్యతిరేకత ఉన్నట్లు తన దృష్టికి రాలేదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మరోవైపు దశాబ్దాల తరబడి వేర్వేరు పార్టీల్లో పనిచేసిన వారు రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. వీరి నడుమ ఉన్న రాజకీయ విభేదాలు కూడా పార్టీకి నష్టం కలిగిస్తాయని అధినేత అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేలపైనే పూర్తిగా ఆధారపడటం ద్వారా వారి పనితీరు బాగాలేని చోట పార్టీకి నష్టం కలుగుతుందనే విషయాన్ని కేసీఆర్ గుర్తించినట్లు పార్టీనేతలు చెప్తున్నారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను సమన్వయం చేసే బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులకు, పార్టీ ప్రధానకార్యదర్శులకు అప్పగించినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. దీంతో గతంలో రద్దు చేసిన జిల్లా కమిటీలను పునరుద్ధరించి, జిల్లా అధ్యక్షులను నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. కొత్తగా నియమితులయ్యే జిల్లా అధ్యక్షులు అధినేత లేదా వర్కింగ్ ప్రెసిడెంట్తో నేరుగా సంబంధాలు కలిగి క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించాల్సి ఉంటుంది. పార్టీకి కొత్త రక్తం.. యువతకు ప్రాధాన్యత పార్టీ యంత్రాంగం నుంచే కొత్త నాయకత్వం పుడుతుందని, భవిష్యత్తు రాజకీయ అవకాశాలు వారికే వస్తాయని ప్రకటించి కేసీఆర్ ఆ దిశగా కమిటీల నిర్మాణం ద్వారా అడుగులు వేయాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల్లోనూ సీనియర్ నాయకులు క్రమంగా తెరమరుగవుతున్న క్రమంలో అన్నిపార్టీలు కొత్తతరం నాయకత్వంపై దృష్టి పెడుతున్నాయి. మరో 20 ఏళ్లపాటు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పార్టీలోనూ కొత్త నాయకత్వాన్ని గుర్తించేందుకు పార్టీ సంస్థాగత కమిటీలు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలో యువకులకు పార్టీ అభ్యర్థులుగా అవకాశమివ్వగా, ఎస్సీ కార్పొరేషన్, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి వంటి వాటిలోనూ కొత్తవారికే అవకాశమిచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీలోనూ యువతకు ప్రాధాన్యత ఇస్తూ మార్గదర్శకాలు సిద్ధం చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. అనుబంధ కమిటీల్లోనూ యువతకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్న గుండు సుధారాణి ప్రస్తుతం వరంగల్ మేయర్గా ఎన్నిక కావడంతో ఆమె స్థానంలో యువతకు ప్రాతినిధ్యం కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
కమలం పార్టీలో లుకలుకలు.. బహిరంగంగానే విమర్శలు
బీజేపీ కేడర్లో జోష్ తగ్గింది.. జిల్లా నేతల తీరుపై పలువురు నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా విమర్శలు చేయడం శ్రేణుల మధ్య విభేదాలను ఎత్తిచూపుతోంది. పార్టీ కార్యక్రమాలకు నేతలంతా పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం కమలం పార్టీలో లుకలుకలను బహిర్గతం చేస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీకి నష్టం తప్పదు. ఇప్పటికైనా జిల్లా బాధ్యులు స్పందించి అందరినీ ఒకేతాటిపైకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వికారాబాద్: బీజేపీలో గ్రూపు రాజకీయాలకు తెర లేసింది. జిల్లా నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ పార్టీ నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధ్యక్షుడిగా సదానందరెడ్డి జిల్లా బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ కేడర్పై పట్టు సాధించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వికారాబాద్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఇదిలా ఉండగా తాజాగా పరిగిలో సైతం విభేదాలు బయటపడ్డాయి. పలువురు నాయకులు ఏకంగా విలేకరుల సమావేశంలోనే జిల్లా అధ్యక్షుడి తీరును ప్రశ్నించారు. పార్టీ సమావేశాలకు హాజరు కాకుండా సీల్డ్ కవర్ ద్వారా పదవులు కట్టబెట్టడం ఏమిటని నిలదీశారు. ఇది బీజేపీ సంప్రదాయానికి విరుద్ధమని మండిపడ్డారు. పరిగి నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గనాపూర్ వెంకటయ్య పార్టీ బాధ్యులను నియమించాల్సి ఉండగా.. ఈ స్థానంలో తాండూరుకు చెందిన రమేశ్కు బాధ్య తలు అప్పగించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొహం చాటేస్తున్న నేతలు... ఇటీవల జరిగిన పలు పార్టీ సమావేశాలకు జిల్లా ముఖ్య నేతలు మొహం చాటేయటం విమర్శలకు తావిస్తోంది. బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ జనార్దన్రెడ్డి సైతం కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈయనకు జిల్లాకు చెందిన మరో ముఖ్య నేతతో పొసగకపోవడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి సైతం పరిగిలో జరిగిన కార్యకర్తల సమావేశాలు, పార్టీ పదవులకు నేతల ఎంపిక కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సదానందరెడ్డి కేడర్ విషయంలో వివక్ష చూపుతున్నారని, ఈ విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని పలువురు నాయకులు పేర్కొనడం గమనార్హం. కనిపించని ఏసీఆర్ మార్క్.. దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్పై గెలుపు.. ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభైకి పైగా కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ మంచి ఊపు మీద కనిపించింది. ఈ సమయంలోనే మాజీ మంత్రి, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఏ.చంద్రశేఖర్ ఆ పార్టీలో చేరడంతో శ్రేణుల్లో కొత్త జవసత్వాలను నింపింది. జిల్లాలో ఏసీఆర్ పార్టీకి పెద్దదిక్కుగా మారతారని అందరూ ఊహించారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరుతారని భావించారు. కానీ ఆయన పార్టీలో చేరింది మొదలు జిల్లా కమలం గూటిలో ఎలాంటి ఊపు కనిపించడంలేదు. కనీసం ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత జిల్లాలో ఏ ఒక్క కార్యక్రమానికి, పార్టీ సమావేశాలకు హాజరు కాకపోవటం విమర్శలకు తావిస్తోంది. -
Etela Rajender: సరైన సమయంలో సరైన నిర్ణయం
సాక్షి, కరీంనగర్: రాజకీయ భవిష్యత్తుపై సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మూడు రోజులుగా వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడానన్నారు. ఉమ్మడి కరీంనగర్ నుంచే కాకుండా ఖమ్మం సహా 9 పాత జిల్లాల నుంచి కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. బుధవారం హుజూరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనను కలవడానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ సంఘాల వారితో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నా నిర్ణయానికి సంబంధించి నియోజకవర్గంలోని ప్రజలు రెండు రకాలుగా అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని బేరీజు వేసుకుంటున్నా. ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కరోనాను నివారించడంతోపాటు, కరోనా బారిన పడ్డ వారిని కాపాడుకోవడం ముఖ్యమైన అంశం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో హుజూరాబాద్ కీలకంగా వ్యవహరించింది. 20 ఏళ్లుగా ఇక్కడి ప్రజలకు తెలంగాణ ఉద్యమ అనుబంధం ఉంది. నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలోని ఉప్పల్లో రైల్రోకో చేసి అప్పటి ఢిల్లీ సర్కారుకు తెలంగాణ చైతన్యాన్ని చాటి చెప్పాం. అప్పుడు ఉప్పల్ రైల్వేస్టేషన్లో పోలీసులు ఫైరింగ్కు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఈ ప్రాంత ప్రజలు లెక్కచేయలేదు. ఉద్యమాన్ని ధైర్యంతో ముందుకు తీసుకెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇస్తే నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఇక్కడి ప్రజలు, నాయకుల కమిట్మెంట్ ఎంతో గొప్పది. నాకు జరిగిన అన్యా యాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. నేను తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి పనిచేస్తామంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి మీకు జరిగిన అన్యాయం, దుర్మార్గం సహించరానిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నారైలు కూడా వారి సలహాలు, సూచనలు ఇచ్చారు’అని ఈటల వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఏం కోరుకున్నారో అది నేడు జరగడం లేదన్నారు. ఇప్పుడు ఆత్మ గౌరవం ప్రధాన సమస్యగా మారిందని, హైదరాబాద్లో ఉన్న తన ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని ఈటల చెప్పారు. రాజీనామాపై భిన్నాభిప్రాయాలు మూడు రోజులపాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ పర్యటన పూర్తి చేసుకున్నమాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం తిరిగి శామీర్పేటలోని తన నివాసానికి చేరుకున్నారు. మూడు రోజులపాటు హుజూరాబాద్ క్యాంపు కార్యాలయంలో స్థానిక నేతలు, కార్యకర్తలతో పాటు పార్టీకి చెందిన అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నేతలతో ఈటల భేటీ అయ్యారు. శాసనసభ్యత్వంతో పాటు పారీ్టకి రాజీనామా చేసే విషయంలో ఈటల అనుచరులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీలో కొనసాగాలని కొందరు కోరగా, రాజీనామా చేసి బయటకు వస్తే వెంట నడుస్తామని మరికొందరు ప్రకటించారు. దీంతో వివిధ రంగాలకు చెందిన వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలనే యోచనకు ఈటల వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ జిల్లా అచ్చంపేట, హకీంపేట అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కిన ఈటల, దేవరయాంజాల్ భూముల విషయంలోనూ న్యాయ నిపుణులతో చర్చించనున్నట్లు సమాచారం. ( చదవండి: ఈటల రాజేందర్ బర్తరఫ్పై నిరసన ) -
ఐఏఎస్.. ఐపీఎస్.. ఇప్పుడు ఐఎంఎస్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో వైద్యరంగం ప్రాధాన్యం అందరికీ తెలిసివచ్చింది. ఈ రంగానికి విలువ, గౌరవం కూడా పెరిగాయి. యావత్ ప్రపంచానికి సవాల్ విసిరిన ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు, కనీసం కాపాడుకు నేందుకు ఇంకా ఎలాంటి ఔషధాలు, సాధనాలు లేకపోవడం సమస్య తీవ్రతను తెలియ జేస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు మన దేశంలో, దాని పరిధిలోని రాష్ట్రాల్లో మరింత మెరుగైన, సమర్థవంతమైన ప్రజారోగ్య వ్యవస్థ ఆవశ్యకత ఏర్పడింది. ఇలాంటి ప్రతికూల, అతిపెద్ద సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ కరోనా కాటును కాచుకుంటూనే డాక్టర్లు, వైద్యసిబ్బంది బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సంక్షోభాన్ని భారత్ బాగానే ఎదుర్కోగలిగినా భవిష్యత్ సవాళ్లను మరింత దృఢంగా ఎదుర్కొనేందుకు, మంచి ఫలితాల సాధనకు అడుగులు పడాలనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. దేశ సరిహద్దుల రక్షణ ప్రణాళికల విషయంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో అలాగే ప్రజారోగ్య రంగాన్ని కూడా పూర్తిగా సంస్కరించి ఒక వ్యవస్థను నిర్మించాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. (24 గంటల్లో 14,821 కొత్త కేసులు) గతంలో రద్దయిన ‘కేడర్’ ఐఏఎస్/ఐఆర్ఎస్/ఐపీఎస్ అంటి అఖిల భారత సర్వీసుల మాదిరిగానే ఆల్ ఇండియా మెడికల్ సర్వీసెస్ కేడర్ను పునఃప్రవేశపెట్టాలనే అంశం కరోనా నేపథ్యంలో చర్చనీయాంశమైంది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి కొన్నేళ్ల ముందే ఇండియన్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్) సెంట్రల్ కేడర్ ఉండేది. దేశంలోని కీలకమైన పరిపాలన బాధ్యతలు, ప్రత్యేక పోస్టులను ఐఎంఎస్లే నిర్వహించే వారు. కొన్ని అంశాల్లో కేంద్ర–రాష్ట్రాల మధ్య వీరే సమన్వయం చేసేవారు. అయితే 1947 ఆగస్టులో దీనిని రద్దుచేశారు. మొదలియార్ కమిటీగా ప్రసిద్ధిచెందిన ‘ద హెల్త్ సర్వే అండ్ ప్లానింగ్ కమిటీ’ 1961లో సమర్పించిన నివేదికలో.. కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖల్లో సీనియర్ పోస్టులతో ‘సెంట్రల్ హెల్త్ కేడర్’ను ఏర్పాటు చేయాలని సూచించింది. 2005 నాటి ‘నేషనల్ కమిషన్ ఆన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ హెల్త్’ నివేదికలోనూ ఐఏఎస్/ఐపీఎస్ల మాదిరిగా ఆల్ ఇండియా కేడర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ కేడర్ ఏర్పాటుపై గట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మూడేళ్ల క్రితం ఎన్డీఏ ప్రభుత్వం కూడా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో వైద్యరంగ నిర్వహణ, సాంకేతిక అంశాల్లో నైపుణ్యాల మెరుగు వంటి అంశాల్లో ప్రస్తుతం నెలకొన్న అంతరాలను దూరం చేసేందుకు ‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్’ కల్పన ఆవశ్యకత ఏర్పడిందని, దీనిపై తమ అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిసీకే మిశ్రా లేఖ రాశారు. దీనిపై 2018 డిసెంబర్ కల్లా కేవలం ఆరు రాష్ట్రాలే అభిప్రాయాలను తెలిపాయి. ప్రధానంగా వైద్య, ఆరోగ్యరంగమనేది రాష్ట్రాల జాబితాలో ఉండడం వల్ల ఈ విషయంలో కేంద్రం పెత్తనం లేదా ఆజమాయిషీకి అవకాశం లేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐఎంఎస్ ఏర్పాటు ఆవశ్యకతపై వైద్య ప్రముఖులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. (టాప్లో బ్రెజిల్.. మూడో స్థానంలో భారత్) వైద్య విద్య మారాలి ప్రపంచంలో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. కానీ, వైద్యవిద్యలో మేం చదువుకున్నపుడు ఉన్న సిలబస్, కరిక్యులమే ఇప్పటికీ ఉన్నాయి. వైద్యరంగం లేదా ఆసుపత్రుల అడ్మినిస్ట్రేషన్, నిర్వహణ, బృందానికి నాయకత్వం వహించడం వంటి వాటిలో వైద్యవర్గాలకు తగిన శిక్షణ, అవగాహన అవసరం. వైద్యసేవల రంగంలో ఇప్పుడు ‘టీం వర్క్’కు ప్రాధాన్యత ఏర్పడింది. ఏ విషయంలోనైనా మెరుగైన ఫలితాలకు ప్రజా భాగస్వామ్యంతో పాటు సమష్టి భాగస్వామ్యం అవసరం. –డాక్టర్ సోమరాజు, వైద్య ప్రముఖుడు ఉమ్మడి జాబితాలోకి మార్చాలి దేశంలోని వైద్య, ఆరోగ్యరంగంలో రాష్ట్రాల మధ్య అంతరాలున్నాయి. భారతీయ వైద్యం ఇండియనైజ్ కావాలి. నీట్ పరీక్షను జాతీయస్థాయిలో నిర్వహించడం ద్వారా తొలి అడుగుపడింది. ఐఎంఎస్ కేడర్ ఏర్పాటైతే అది మలి అడుగవుతుంది. వైద్య, ఆరోగ్య రంగాన్ని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోకి తెస్తేనే ఐఎంఎస్ పునః ప్రారంభానికి, వైద్యరంగంలో కీలక మార్పునకు బీజం పడుతుంది. – డాక్టర్ కిరణ్ మాదల, గవర్నమెంట్ మెడికల్ కళాశాల, నిజామాబాద్ ‘వైద్యా’నికి గౌరవం ఈ ప్రతిపాదన ఆసక్తి కలిగిస్తోంది. ఐఏఎస్/ఐపీఎస్ మాదిరి ఐఎంఎస్ ఏర్పాటు చేస్తే వైద్య రంగంలో మంచి ఫలితాలొస్తాయి. కేంద్ర కేడర్ కావడం వల్ల ఈ రంగానికి గౌరవం, హోదా, హుందాతనం పెరగడంతో పాటు ఒక వ్యవస్థ నిర్మితమవుతుంది. అయితే వైద్యమనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి రాష్ట్రాలు ఏ మేరకు దీనిపై సానుకూలంగా స్పందిస్తాయో చూడాలి. – డాక్టర్ ఏవీ గురవారెడ్డి, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు కేడర్ ఉంటే మంచిదే.. ఆల్ ఇండియా మెడికల్ సర్వీసెస్తో వైద్యరంగానికి ఎంతో ప్రయోజనం. ఈ రంగంలోని సమస్యలపై అవగాహన ఉండడం వల్ల ఎక్కడెక్కడ ఏయే చర్యలు తీసుకుంటే మంచిదనే దానిపై ఈ కేడర్ అధికారులు నిర్ణయించగలుగుతారు. వైద్యవిద్య నిర్వహణ, పర్యవేక్షణ విషయం లోనూ ఆయా స్థాయిలు, పరిధుల్లో వైద్యరంగం నుంచి వచ్చిన వారికే సారథ్య బాధ్యతలు అప్పగించాలి. – డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, ప్రముఖ కార్డియో థోరసిక్ వైద్యుడు -
టీడీపీకి మరోసారి షాక్
సాక్షి, నెల్లూరు: టీడీపీకి మరోసారి షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా టీడీపీ అధికార ప్రధానిధి సీ.ఎచ్. హరిబాబు యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో మంతనాలు జరిపారు. దీంతో హరిబాబు త్వరలో వైఎస్సార్సీపీ పార్టీలోకి చేరనున్నట్లు సమాచారం. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం, సర్వేపల్లికి చెందిన 70 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. పెదకాకానికి చెందిన 40 కుటుంబాల టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య వారికి పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. పశ్చిమగోదావరి: ఉండి మండలం చిలుకూరులో టీడీపీ ఖాళీ అయింది. మాజీ ఏఎంసీ చైర్మన్ చిలుకూరి నరసింహరాజు, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ముదునూరి సోమరాజు, రెండువందల మంది టీడీపీ కార్యకర్తలు ఉండి వైఎస్సార్సీపీ ఇంచార్జి పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కృష్ణా: గంపలగూడెం మండలం దుందిరాలపాడులో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వంద మంది వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి మండల పార్టీ కన్వీనర్ చావా వెంకటేశ్వరరావు సాదరంగా ఆహ్వానించారు. -
పోలీసులపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాంనగర్లో టీడీపీ కార్యకర్తలు శనివారం రాత్రి బీభత్సం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ టీడీపీ కార్యకర్తలు క్రాంతి, విజయ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండ.. తమనే ఆపుతారా అంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇంతటితో ఊరుకోకుండా.. ఫోర్త్ టౌన్ ఎస్సై శాంతిలాల్పై కాంత్రి, విజయ్లు దాడికి యత్నించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు టీడీపీ కార్యర్తలుగా పోలీసులు గుర్తించారు. క్రాంతి, విజయ్లపై 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘హస్తం’.. ముసలం !
సాక్షి, మహబూబ్నగర్: మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పటికే అసెంబీ, పంచాయతీ, లోక్సభ, ప్రాదేశిక ఎన్నికల్లో వరుస వైఫల్యాలు చవిచూసిన ఆ పార్టీలో తాజాగా సీనియర్–ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ముసలం మొదలైంది. కొందరు సీనియర్ల పనితీరు బాగోలేదని, వారి వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని మండిపడుతున్నారు. లేనిపక్షంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ ఇలాంటి ఫలితాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ద్వితీయ శ్రేణి నేతలు వ్యవహరించిన తీరుతో సీనియర్లందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వారికి ఏ సమాధానం చెప్పాలో తెలియక కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఇప్పటికే పార్టీలో సీనియర్లు డీకే అరుణ, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో పాటు పలువురు సీనియర్లు పార్టీని వీడడంతో ప్రాభావం కోల్పోయి.. పట్టుకోసం పాకులాడుతోన్న కాంగ్రెస్కు కొత్త సమస్య వచ్చి పడింది. ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ తమపై ఉన్న వ్యతిరేకతను ఎలా దూరం చేసుకోవాలో తెలియక సీనియర్లు సతమతమవుతున్నారు. కేడర్లో నైరాశ్యం..! వరుస వైఫల్యాలతో ఇటు కార్యకర్తల్లోనూ తీవ్ర నైరాశ్యం నెలకొంది. కాంగ్రెస్ నుండి బీజేపీ, టీఆర్ఎస్కు సీనియర్ల వలసలు.. అసెంబ్లీ, సర్పంచ్, పార్లమెంట్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం.. ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలనే నమ్ముకుని పని చేస్తోన్న కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులను ఆందోళనలో పడేశాయి. ఫలితంగా పట్టు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలా? లేక ప్రత్యామ్నాయం చూసుకోవాలా? అని ఆలోచనలో ఆ పార్టీ శ్రేణులు పడ్డారు. ఇప్పటికే తమ రాజకీయ భవిష్యత్పై బెంగపట్టుకున్న సదరు నాయకులు ‘పుర’ ఎన్నికల వరకు వేచి ఉండి తర్వాత నిర్ణయం తీసుకుందామనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రాదేశిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జిల్లా నాయకత్వం పలు చోట్ల సీనియర్లను విస్మరించి కొత్త వారికి అవకాశం కల్పించడాన్ని తప్పుబడుతున్న సీనియర్లు కనీసం మున్సిపాలిటీ ఎన్నికల్లోనైనా పని చేసేవారికి టికెట్లు ఇస్తారా? లేదా కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 19 మున్సిపాలిటీలు ఉండగా.. దాదాపు సగం పురపాలికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చే స్థాయిలో ఉంది. దీంతో ప్రస్తుతం బలమైన శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ను ఢీ కొట్టాలంటే పార్టీ నేతలందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పార్టీ కేడర్లో వ్యక్తమవుతోంది. కానీ అనేక చోట్ల చెప్పుకోదగ్గ బలమైన నాయకులు లేకపోవడంతో పురపాలిక ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి? పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుంది? ఎన్ని ‘పుర’ పీఠాలు కైవసం చేసుకుంటుందో అనే చర్చ జరుగుతోంది. -
ఎన్నికల... దౌర్జన్యకాండ
ఓటమి ఖాయమని నిర్థారణకు వచ్చేశారేమో... ఎక్కడికక్కడే అల్లర్లకు తెరతీశారు. ఐదేళ్లపాటు సాగించిన దౌర్జన్యకాండ సరిపోలేదనుకున్నారేమో... ఎన్నికల వేళ తెగ రెచ్చిపోయారు. కవ్వింపు చర్యలకు పాల్పడి అనేకచోట్ల పోలింగ్ కేంద్రాల్లో గొడవలకు దిగారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. పలుచోట్ల అన్యాయంగా రిగ్గింగ్కు పాల్పడ్డారు. అంతేనా... రిగ్గింగ్ను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా ఎమ్మెల్యేపైనే ఏకంగా దాడికి తెగబడ్డారు. ఆమె భర్తపైనా దాడికి పాల్పడి వారి అనుచరులతో సహా ఓ గదిలో నిర్బంధించారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని ఓటర్లు తమ ఓటుద్వారా గురువారం చూపించారు. టీడీపీ పూర్తిగా ఓటమి అంచుకు చేరిందని ఓటర్ల ఓటింగ్ సరళిని బట్టి ఆ పార్టీ వారికి సైతం అర్థమయ్యింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలన్న కాంక్షతో అలజడులు సృష్టించేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక పోలింగ్ బూత్లలో రిగ్గింగ్కు పాల్పడ్డారు. దొంగ ఓట్లు కూడా వేయించారు. అక్కడికీ శాంతించక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. పోలింగ్కు వచ్చిన వారిని సైతం భయపెట్టి సెల్ఫోన్లు లాక్కుని వెనక్కి పంపించారు. ఇంత చేస్తున్నా తాము ఓటమి పాలౌతున్నామనే బాధనుంచి బయటపడలేకపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు హత్యారాజకీయాలకు తెర తీశారు. రిగ్గింగ్ను అడ్డుకోబోతే... పోలింగ్ బూత్ నంబర్ 152లో టీడీపీ రిగ్గింగ్కు పాల్పడుతుందన్న సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శతృచర్ల పరీక్షిత్రాజు గురువారం మధ్యాహ్నం పరిశీలనకు వెళ్లారు. బూత్ వద్దకు చేరుకున్న ఆయన్ను స్థానిక టీడీపీ నేతలు అడ్డుకుని భౌతిక దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని గమనించిన పరీక్షిత్రాజు అక్కడినుంచి వెనక్కి వచ్చేశారు. ఈ విషయాన్ని సాక్షి ప్రతినిధి బోణం గణేష్కు పరీక్షిత్రాజు సమాచారం అందించారు. ఆ సమాచారాన్ని జిల్లా ఎస్సీ ఎ.ఆర్.దామోదర్కు తెలియజేశారు. అక్కడ రిగ్గింగ్ జరిగినందున పోలింగ్ నిలిపేసి రీపోలింగ్ జరపాలని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిని కోరేందుకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి తన భర్త పరీక్షిత్తో కలసి పోలింగ్ స్టేషన్కు మధ్యాహ్నం వెళ్లారు. ఆమె రాకను గమనించిన టీడీపీ నాయకులు, స్థానిక జెడ్పీటీసి భర్త డొంకాడ రామకృష్ణ వారిపై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి హతాశురాలైన ఎమ్మెల్యే దంపతులు అక్కడినుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వీలు పడలేదు. పథకం ప్రకారం అక్కడకు చేరుకున్న స్థానికులు, మహిళలు వారిపై దాడులకు తెగబడ్డారు. ఎమ్మెల్యేను గాయపరిచారు. ఎమ్మెల్యే అనుచరులు, అక్కడున్న కొంతమంది పోలీసులు ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్రయత్నించి పరిస్థితి చేయిదాటిపోతుండడంతో తిరిగి పోలింగ్ బూత్లోకే పంపించేశారు. కేంద్రాన్ని వందలాది జనం చుట్టుముట్టి లోపలికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అదే సమయానికి అక్కడకు చేరుకున్న సాక్షి ప్రతినిధి కూడా పోలింగ్ కేంద్రంలో చిక్కుకున్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు మొత్తం 25 మంది వరకు పోలింగ్ కేంద్రంలో ప్రాణభయంతో తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్సీ శతృచర్ల విజయరామరాజు తన సొంత తమ్ముడి కుమారుడు, కోడలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిసి కూడా ఏమాత్రం వారిని రక్షించే ప్రయత్నం చేయకపోగా వారిపై దాడి చేసేలా టీడీపీ కార్యకర్తలను పురిగొల్పారు. ఇదే అదనుగా కార్యకర్తలు గొడ్డళ్లు, కర్రలు, కత్తులు పట్టుకుని పోలింగ్ కేంద్రంపై దాడికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ కొంతమంది పోలీసు బలగాలను సంఘటనా ప్రాంతానికి పంపించారు. కాని ఎమ్మెల్యే దంపతులను హతమార్చాలనే ప్రణాళికతో ఉన్న టీడీపీ నేతలు ఇతర గ్రామాల నుంచి మరికొందరిని పోలింగ్ కేంద్రం వద్దకు హుటాహుటిన తరలించి ఆ ప్రాంతమంతా భయానక వాతావరణాన్ని సృష్టించారు. పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న విశాఖ రేంజ్ డీఐజీ జి.పాలరాజు మరిన్ని బలగాలను పంపించాలని జిల్లా ఎస్పీ దామోదర్ను ఆదేశించారు. మరోవైపు విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు వెంటనే స్పందించి పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. అంతే గాకుండా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లారు. పార్టీ పెద్దలు రాష్ట్ర డీజీపీకి విషయం తెలియజేసి ఎమ్మెల్యే దంపతులకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. పార్వతీపురం ఏఎస్పీ సుమిత్ గార్గ్ హుటాహుటిన మరిన్ని బలగాలను తీసుకుని సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ లోగానే ఎమ్మెల్యే దంపతులను, వారితో పాటు ఉన్నవారిని హతమార్చేందుకు టీడీపీ నాయకులు పురిగొల్పిన వారి వర్గీయులు పోలింగ్ కేంద్రం తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గాలి, వెలుతురు లేని ఆ గదిలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు కూడా ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అవకాశం ఏర్పడలేదు. చాలా సమయం తరువాత ఏఎస్సీ రాకతో స్థానిక మీడియా, వైద్యులు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు ప్రాదమిక చికిత్స అందించిన అనంతరం పోలీసు బలగాల భద్రత నడుమ వారిని, వారితో ఉన్న అనుచరులను రక్షించి క్షేమంగా ఇంటికి తరలించారు. సంయమనం పాటించాలి: ఎమ్మెల్యే చినమేరంగిలోని తమ ఇంటికి చేరిన ఎమ్మెల్యే దంపతులకు భారీ సంఖ్యలో వారి కార్యకర్తలు, అభిమానులు ఎదురొచ్చి తమ మద్దతు తెలిపారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వవద్దని తమపై ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా సంయమనం పాటించాలని ఎమ్మెల్యే దంపతులు తమ కార్యకర్తలు, అభిమానులకు సూచించారు. పోలీసు, మీడియా ప్రతినిధులు అండగా ఉండబట్టే తాము ప్రాణాలతో బయటపడ్డామని ఈ సందర్భంగా వారు అన్నారు. తమపై హత్యాయత్నానికి జనాన్ని ఉసిగొల్పిన వారెవరినీ వదిలిపెట్టేది లేదని, చట్టపరంగా వారిని శిక్షించేలా పోరాడతామని స్పష్టం చేశారు. -
టీడీపీలో .. మిగిలింది ఒక్కరే..
మోర్తాడ్(బాల్కొండ): టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మండవ వెంకటేశ్వర్రావు పార్టీకి గుడ్బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ఒక్కరే టీడీపీలో మిగిలిపోయారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి గతంలో రెండు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నపూర్ణమ్మ కొడుకు డాక్టర్ మల్లికార్జున్రెడ్డి కోసం క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఆమె మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇప్పటికే బోధన్ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జిగా కొనసాగిన అమర్నాథ్ బాబు ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. అంతకు ముందుగానే టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఆయన కూడా ఇటీవలే టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. దీంతో టీడీపీకి సంబంధించి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మలు మాత్రమే టీడీపీలో కొనసాగారు. ముందస్తు ఎన్నికల సమయంలో అన్నపూర్ణమ్మ కూడా పార్టీ మారుతారని ప్రచారం సాగింది. కానీ ఆమె ఏ పార్టీలో చేరకుండా టీడీపీలోనే ఉండిపోయారు. టీడీపీలో మిగిలిన ముఖ్యనాయకుల్లో ఇద్దరే ఉండగా మండవ వెంకటేశ్వర్రావు ఆ పార్టీకి గుడ్బై చెప్పడంతో అన్నపూర్ణమ్మ ఒక్కరే టీడీపీలో మిగిలిపోయారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒక వేళ ఆమె కూడా ఏదో ఒక పార్టీలో చేరితే ఉమ్మడి జిల్లాలో టీడీపీ దుకాణం పూర్తిగా ఖాళీ అవుతుంది. ఇప్పటికే ముందస్తు శాసనసభ ఎన్నికల్లోను, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీడీపీకి సంబంధించిన సైకిల్ గుర్తు మాయమైంది. దీనికి తోడు ఆ పార్టీ ముఖ్య నాయకులు ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడంతో టీడీపీ కథ ముగిసిపోయినట్లే అని చెప్పవచ్చు. -
అభ్యర్థి ఎవరైనా కార్యకర్తలు వారే..
ఆర్మూర్: టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీ అయినా సరే ర్యాలీ నిర్వహించినా.. ప్రచారం చేసిన అధిక సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు, కుల సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు హాజరై ఆ ర్యాలీలను విజయవంతం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ, అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్న లేకుండా అన్ని పార్టీల ప్రచార కార్యక్రమాల్లో వీరే పాల్గొంటుండడంతో ఓటరు నాడి అర్థం కాక రాజకీయ పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ ఏదైనా ఆయా పార్టీల నాయకులు ఇస్తున్న డబ్బుల కోసం మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తమ బలనిరూపణ చేసుకోవడం కోసం ప్రచార కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళలు, యువజన సంఘాల సభ్యులను తరలిస్తున్నారు. రాజకీయ పార్టీ ఏది, తమకు సేవ చేస్తున్న నాయకుడా, కాదా అనే అంశాలను పట్టించుకోకుండా కేవలం వారిచ్చే డబ్బుల కోసం వీరు తరలి రావడం అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యే మహిళలకు రోజుకు రూ. రెండు వందల నుంచి రూ. మూడు వందల వరకు చెల్లిస్తున్నట్లు డబ్బులు పంపిణీ చేస్తున్న నాయకులే బహిరంగంగా సమాచారం ఇస్తున్నారు. ఇక మోటార్ సైకిల్ ర్యాలీల్లో పాల్గొనడానికి వస్తున్న యువతకు ఒక్కో మోటార్ సైకిల్కు ఐదు వందల రూపాయలు, కారుకు 15 వందల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు, యువకులు, కుల సంఘాల సభ్యులు ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారో లేదో అర్థం కాని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున జన సమీకరణతో ప్రత్యర్థులకు దడ పుట్టించాలని తద్వారా తాము గెలుస్తున్నామన్న టాక్ను సృష్టించాలని వివిధ పార్టీల ఎంపీ అభ్యర్థులు పోటీ పడి మరీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారానికి ఈ జన సమీకరణ చేసే విధానం కేవలం ఆర్మూర్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. అయితే అన్ని పార్టీల ప్రచారానికి వారే రావడాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తమ పార్టీల మేనిఫెస్టోలతో పాటు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి చేయాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తే సరిపోయేదానికి ఇలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ర్యాలీల ద్వారా ప్రచారం నిర్వహించడం వల్ల అభాసుపాలు కావడం తప్ప ఒరిగేదేమీ లేదని ప్రజలు, ఓటర్లు చర్చించుకుంటున్నారు. -
‘అంతు తేలుస్తా.. లోపలేయిస్తా’
పొదలకూరు: ‘మీకు ఎంత దమ్ము, ధైర్యం ఉంటే మా సీఎంకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడతారు. ఒక మంత్రి వస్తున్నాడన్న మర్యాద, భయం లేకుండా ప్రవర్తిస్తారా? మీ అంతు తేలుస్తా, ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి, లేదంటే లోపలేయిస్తా. మీ ఎమ్మెల్యే రౌడీషీటర్లను వెంటేసుకుని తిరుగుతున్నాడు.’ వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మండల పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై శివాలెత్తి చేసిన వ్యాఖ్యలివి. అంతటితో ఆగకుండా బిరదవోలు పంచాయతీ కల్యాణపురంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసుల ద్వారా గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎప్పుడో ఏర్పాటుచేసిన ‘నిన్ను నమ్మం బాబు’ ఫ్లెక్సీలను తొలగించారు. ఎన్నికల నిబంధనలు త్వరలో అమలవుతున్న తరుణంలో మంత్రి మండలంలో బుధవారం సుడిగాలి పర్యటనలు చేసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మరుపూరు, చాటగొట్ల, పొదలకూరు, అంకుపల్లి, పార్లపల్లి, బిరదవోలు, కల్యాణపురం, విరువూరు, సూరాయపాళెం గ్రామాల్లో సిమెంట్రోడ్లు, మంచినీటి పథకాలను ప్రారంభించారు. అయితే మంత్రి పర్యటనలో గ్రామాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని చూశారని నాయకులు తెలిపారు. కల్యాణపురంలో అనుచిత వ్యాఖ్యలు కల్యాణపురం వైఎస్సార్సీపీకి కంచుకోటగా తయారైంది. ఇక్కడ టీడీపీలో పాతికేళ్లపాటు ఉన్న అక్కెం బుజ్జిరెడ్డి గతేడాది వైఎస్సార్సీపీలో చేరి ఎమ్మెల్యే కాకాణితో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గ్రామానికి వెళ్లి పరోక్షంగా బుజ్జిరెడ్డిని ఉద్ధేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసులను దగ్గర పెట్టుకుని ఫ్లెక్సీలను తొలగించడంతోపాటు, ఎమ్మెల్యే రౌడీలను వెనకేసుకుని తిరుగుతున్నాడన్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే విధంగా ప్రసంగించి వెళ్లారని గ్రామస్తులు వెల్లడించారు. తమ గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేయకున్నా ఎప్పుడో నీరు – చెట్టు పథకంలో చేసిన పనికి శిలాఫలం వేసుకుని వెళ్లారని తెలిపారు. సగం పూర్తయిన పనులకు శంకుస్థాపనలు పొదలకూరులో అన్న క్యాంటీన్ భవనం బేస్మట్టం పూర్తై పిల్లర్లు నిర్మాణంలో ఉండగా దానికి మంత్రి శంకుస్థాపన చేశారు. చాటగొట్లలో నాలుగేళ్ల క్రితం పూర్తయిన విద్యుత్ సబ్స్టేషన్ను తిరిగి ప్రారంభించారు. గతంలో సీఈ సబ్స్టేషన్ను ప్రారంభించినప్పటికీ. మంత్రి మళ్లీ ప్రారంభించడాన్ని చూసి అధికారులు, ప్రజలు ఆశ్చర్యపోయారు. అంకుపల్లి హరిజనవాడలో 60 శాతం పనులు పూర్తైన వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేశారు. బిరదవోలులో సీసీ రోడ్లకు శిలాఫలం నిర్మించకుండానే దిమ్మెకు ఆనించి ప్రారంభించడం విశేషం. ఎన్నికల కోడ్ వస్తుందని మంత్రి హైరానా పడుతూ శిలాఫలాలు వేసుకుంటూ వెళుతున్నారని ఆయా గ్రామాల్లో ప్రజలు చర్చించుకున్నారు. -
అభ్యర్థి ఎవరైనా కార్యకర్తలు వారే..
సాక్షి,ఆర్మూర్: టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ అయినా సరే ర్యాలీ నిర్వహించినా.. ప్రచారం చేసిన అధిక సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు, కుల సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు హాజరై ఆ ర్యాలీలను విజయవంతం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ, అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్న లేకుండా అన్ని పార్టీల ప్రచార కార్యక్రమాల్లో వీరే పాల్గొంటుండడంతో ఓటరు నాడి అర్థం కాక రాజకీయ పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ ఏదైనా ఆయా పార్టీల నాయకులు ఇస్తున్న డబ్బుల కోసం మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తమ బలనిరూపణ చేసుకోవడం కోసం ప్రచార కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళలు, యువజన సంఘాల సభ్యులను తరలిస్తున్నారు. రాజకీయ పార్టీ ఏది, తమకు సేవ చేస్తున్న నాయకుడా, కాదా అనే అంశాలను పట్టించుకోకుండా కేవలం వారిచ్చే డబ్బుల కోసం వీరు తరలి రావడం అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యే మహిళలకు రోజుకు రూ. రెండు వందల నుంచి రూ. మూడు వందల వరకు చెల్లిస్తున్నట్లు డబ్బులు పంపిణీ చేస్తున్న నాయకులే బహిరంగంగా సమాచారం ఇస్తున్నారు. ఇక మోటార్ సైకిల్ ర్యాలీల్లో పాల్గొనడానికి వస్తున్న యువతకు ఒక్కో మోటార్ సైకిల్కు ఐదు వందల రూపాయలు, కారుకు 15 వందల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు, యువకులు, కుల సంఘాల సభ్యులు ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారో లేదో అర్థం కాని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున జన సమీకరణతో ప్రత్యర్థులకు దడ పుట్టించాలని తద్వారా తాము గెలుస్తున్నామన్న టాక్ను సృష్టించాలని వివిధ పార్టీల అసెంబ్లీ అభ్యర్థులు పోటీ పడి మరీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారానికి ఈ జన సమీకరణ చేసే విధానం కేవలం ఆర్మూర్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. అయితే అన్ని పార్టీల ప్రచారానికి వారే రావడాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తమ పార్టీల మేనిఫెస్టోలతో పాటు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి చేయాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తే సరిపోయేదానికి ఇలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ర్యాలీల ద్వారా ప్రచారం నిర్వహించడం వల్ల అభాసుపాలు కావడం తప్ప ఒరిగేదేమీ లేదని ప్రజలు, ఓటర్లు చర్చించుకుంటున్నారు. -
ఆయనో ఏజెంట్
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఓ ఏజెంట్ అని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ, రాష్ట్ర ప్రయోజనాల్ని తుంగలో తొక్కే రీతిలో వ్యవహరిస్తున్న ఆయన్ను తప్పించాల్సిందేనని నినదించారు. సాక్షి, చెన్నై : బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సమీక్షలు, సమావేశాలు, అధికారిక కార్యక్రమాలంటూ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ జిల్లాల పర్యటనల్ని సాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. రాజ్భవన్ మరో సచివాలయంగా మారిందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా, నల్ల జెండాలతో వ్యతిరేకత, నిరసన వ్యక్తంచేసినా గవర్నర్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, ఆందోళనల్ని ఖాతరు చేయకుండా తన దారిలో తాను ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం గవర్నర్ నామక్కల్ పర్యటన సందర్భంగా డీఎంకే నల్ల జెండాల ప్రదర్శన వివాదానికి దారితీసింది. నల్ల జెండాల్ని ప్రదర్శించిన డీఎంకే వర్గాలను బలవంతంగా పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ, ఛలో రాజ్ భవన్ నిర్ణయాన్ని హఠాత్తుగా డీఎంకే తీసుకుంది. శనివారం ఉదయాన్నే స్టాలిన్ ఇచ్చిన పిలుపుతో డీఎంకే ఎమ్మెల్యేలు అన్భళగన్, ఎం.సుబ్రమణియన్, శేఖర్ బాబు, మాధవరం సుదర్శనం, రంగనాథన్, వాగై చంద్రశేఖర్, మోహన్, రవిచంద్రన్, అరవింద్ రమేష్లతో పాటు కేంద్రమాజీ మంత్రి రాజ తదితర నేతలు ఉదయాన్నే పెద్దఎత్తున కేడర్తో సైదాపేట కోర్టు వద్దకు చేరుకున్నారు. దూసుకొచ్చిన నేతలు పది గంటల సమయంలో అక్కడికి స్టాలిన్ చేరుకున్నారు. ఆయన రాకతో ఒక్క సారిగా వాతావరణం అక్కడ మారింది. గవర్నర్ తీరును, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, నామక్కల్లో తమ వాళ్లతో పోలీసులు వ్యవహరించిన విధానాన్ని ఖండిస్తూ, నిరసిస్తూ నినాదాల్ని హోరెత్తించారు. ఓ వైపు నినాదాలు మిన్నంటుతుంటే, మరో వైపు ఎమ్మెల్యేలతో కలిసి డీఎంకే జెండాను చేతబట్టి రాజ్ భవన్వైపు స్టాలిన్ కదిలారు. పెద్ద ఎత్తున డీఎంకే కేడర్ దూసుకురావడంతో ఉత్కంఠ నెలకొంది. రాజ్ భవన్కు అతి సమీపంలో రోడ్డును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్యారికేడ్లను ఏర్పాటుచేసి, ఎవరూ అటు వైపు రాకుండా అడ్డుకున్నారు. అయినా, డీఎంకే వర్గాలు పోలీసుల వలయాన్ని ఛేదించే రీతిలో ముందుకు దూసుకురావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజ్ భవన్వైపుగా డీఎంకే వర్గాలు చొచ్చుకు రాని రీతిలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. దీంతో రోడ్డు మీద డీఎంకే వర్గాలు బైఠాయించి రాస్తారోకోకు దిగారు. ఈ ఆందోళన కారణంగా సైదా పేట నుంచి గిండి మార్గం, అడయార్ వైపుగా మార్గాల్లో ఎక్కడికక్కడ వాహనాలు ఆగాయి. ట్రాఫిక్ను క్రమ బద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు స్టాలిన్ సహా ఎమ్మెలేల్ని అడ్డుకుని బలవంతంగా అరెస్టుచేశారు. వీరందర్నీ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఉంచారు. స్టాలిన్ ఫైర్ స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్ర హక్కుల్ని గవర్నర్ కాలరాస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, మంత్రులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. గవర్నర్ కేంద్రానికి ఏజెంట్గా ఇక్కడ అడుగు పెట్టి ఉన్న దృష్ట్యా, ఎక్కడ తమ అవినీతి బండారాలు బయట పడుతాయోనన్న భయంతో ఈ పాలకులు గవర్నర్ విషయంలో మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ఆది నుంచి గవర్నర్ చర్యల్ని డీఎంకే అడ్డుకుంటూ వస్తోందని, ఆయన ఎక్కడికి వెళ్లినా వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తప్పును సరిదిద్దుకోవాల్సిన గవర్నర్, ఇష్టానుసారంగా ముందుకు సాగడాన్ని ఖండిస్తున్నామన్నారు. అందుకే నల్ల జెండాలను ప్రదర్శిస్తున్నామని పేర్కొంటూ, ఈ సమయంలో నామక్కల్లో తమవాళ్ల మీద బల ప్రయోగాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఇన్నాళ్లు తాము శాంతియుత మార్గంలో పయనించామని, అయితే, నామక్కల్ ఘటనతో తమను గవర్నర్ రెచ్చగొడుతున్నట్టుందని ధ్వజమెత్తారు. ఇలాంటి గవర్నర్ను తప్పించాలని, లేదా తన పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ది చెక్కు చెదరని కేడర్
♦ ప్రజా సమస్యలపై పోరాడింది కాంగ్రెస్సే ♦ వాగ్దానాలను అమలు చేయని టీఆర్ఎస్ ♦ డీసీసీ అనుబంధ సంఘాల సమావేశంలో భట్టి, శ్రీధర్బాబు ఖమ్మం : ‘కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఒకరిద్దరు నాయకులు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన కేడర్ చెక్కు చెదరలేదు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు తరలిరావడం దీనికి నిదర్శనం. కార్యకర్తలకు భరోసా ఇస్తూ.. ప్రజా సమస్యల కోసం పాటుపడిన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి దుద్దిళ్ల శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ తొమ్మిది అనుబంధ సంఘాలతో పార్టీ బలోపేతం, తీరుతెన్నులు, ప్రజా సమస్యలపై స్పందన తదితర అంశాలపై గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. పార్టీ పరిస్థితులు, కేడర్ పెంపొందించేందుకు ఎలా పనిచేయాలనే అంశంపై పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పలు సూచనలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తేనే.. కేడర్ వెంట ఉంటుందని సూచించారు. తొలుత గ్రామస్థాయి నుంచి మండల, బ్లాక్, నియోజకవర్గం, జిల్లాస్థాయి వరకు పార్టీ బాధ్యుల నియామకంతోపాటు అనుబంధ సంఘాల కమిటీలను కూడా వేయాలని, అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. జిల్లా ఇన్చార్జి శ్రీధర్బాబు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్దీన్ మాట్లాడుతూ.. తొమ్మిది అనుబంధ సంఘాలకు.. ఒక్కో సంఘంలో 15వేల మంది చొప్పున నాయకులను తయారు చేసి 1.50లక్షల మంది నాయకులతో బలమైన కేడర్గా ఆవిర్భవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బండి మణి, కార్పొరేటర్లు వడ్డెబోయిన నర్సింహారావు, యర్రం బాలగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ కార్యకర్తలకు బీమా అండ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది టీఆర్ఎస్ క్రియాశీలక కార్యకర్తలకు బీమా పాలసీ రెన్యువల్ కింద రూ.5.43కోట్ల ప్రీమియం మొత్తాన్ని నేషనల్ ఇన్సూరెన్సు కంపెనీకి చెల్లించినట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. తెలంగాణ భవన్లో సోమవారం ఎంపీ కవిత, ఎమ్మెల్సీ శంభీర్పూర్ రాజుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది రూ.4.87కోట్ల ప్రీమియం చెల్లించగా, రూ.10కోట్ల మేర క్లెయిములు పొందామని వివరించారు. గత ఏడాది 487 మంది కార్యాకర్తలు చనిపోగా, 274 మందికి బీమా పరిహారం చెక్కులు అందాయని చెప్పారు. బీమా సౌకర్యానికి సంబంధించిన పార్టీ మానిటరింగ్ కమిటీ నిత్యం వివరాలు సేకరించి చనిపోయిన కార్యకర్తల ప్రతీ కుటుంబానికి రూ.2లక్షల బీమా మొత్తం అందేలా చూసిందని చెప్పారు. -
'ఇబ్బందులున్నా మిత్రధర్మం పాటించండి'
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్నా మిత్ర ధర్మాన్ని పాటించాలని కేంద్ర మంత్రి సుజనాచౌదరి టీడీపీ శ్రేణులకు హితవు పలికారు. అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేయాలని కోరారు. ఆయన శనివారం తాడేపల్లిగూడెం మాగంటి కల్యాణమండపంలో జరిగిన జిల్లా పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సమస్యలు ఉంటే నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని అంతేకానీ.. మిత్రపక్షమైన బీజేపీపై విమర్శలు చేయవద్దని సూచించారు. అంతకుముందు తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు తిరుమల దర్శనం సిఫారసు లేఖలు కూడా పొందలేని దుస్థితిలో ఉన్నారన్నారు. చివరకు గ్యాస్ కనెక్షన్ల కేటాయింపులోనూ బీజేపీ నేతల హవాయే నడుస్తోందని చెప్పారు. ఇలాగైతే తిరుగుబాటు తప్పదని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, జడ్పీ చైర్మన్ బాలరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
కారెక్కుతున్న క్యాడర్
- జిల్లాలో కనుమరుగవుతున్న ‘దేశం’ - కాంగ్రెస్ నేతలు సైతం వలసబాట.. - టీఆర్ఎస్ బలోపేతంపై మంత్రుల దృష్టి సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అక్కడక్కడ మిగిలి న ద్వితీయశ్రేణి నేతలూ ఇప్పుడు కారెక్కేస్తున్నారు. కనుచూపు మేరలో రాజకీయ భవిష్యత్ కనిపించకపోవడంతో ఉన్న ఒకరిద్దరూ టీడీపీని వీడుతున్నారు. తాజాగా ఆ పార్టీ తూర్పు జిల్లా అధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వర్రావు ‘దేశం’కు గుడ్బై చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లో సీఎం కార్యాలయంలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ మండల అధ్యక్షులు, మండల స్థాయి నేతలు కూడా టీఆర్ఎస్లో చేరారు. టీడీపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడులో లం శ్యాంసుందర్ కూడా ఆ పా ర్టీని వీడనున్నట్లు ప్రచా రం జరుగుతోంది. కొద్ది రోజు ల్లో ఆ ముహూర్తం కూడా ఖరారవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కాం గ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడడం గమనార్హం. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సుల్తాన్ అహ్మద్ శుక్రవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కుమారుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జుల్ఫేఖార్ అహ్మద్, తన అనుచరులు గులాబీ కండువా కప్పుకున్నారు. గత వరుస ఎన్నికల్లో జిల్లాలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ దూకుడుగా వెళ్తోంది. ముగ్గురు ఎమ్మెల్యేలను సైతం తమ పార్టీలో చేర్చుకుని జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే వారే లేకుండా పావులు కదిపింది. తాజాగా టీడీపీ, కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వంపైనా టీఆర్ఎస్ దృష్టి సారించింది. జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్రెడ్డిలు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. అరిగెల టీడీపీని వీడడంతో జిల్లా పరిషత్లో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకంగా తయారైంది. ప్రాదేశిక ఎన్నికల్లో కేవలం రెండు జెడ్పీటీసీ స్థానాలకే పరిమితమైన ‘దేశం’ ఇప్పుడు అరిగెల పార్టీని వీడడంతో ఒకే ఒక జెడ్పీటీసీ సభ్యుడు అబ్దుల్ కలాం(కెరమెరి) టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి రానుంది. అబ్దుల్ కలాం కూడా టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రేంసాగర్రావు చేరికపై చర్చ.. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. సీఎం కిరణ్కుమార్రెడ్డి హయాంలో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరాలనే కేసీఆర్ ఆహ్వానాన్ని ఆయన అప్పట్లో తిరస్కరించారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నా.. ఆయన్ను చేర్చుకోవడానికి టీఆర్ఎస్ జిల్లా ముఖ్యనేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్సీ చెన్నూర్/కోటపల్లి : చెన్నూర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సుల్తాన్ అహ్మద్, ఆయన కుమారుడు మార్కెట్ కమిటీ చైర్మన్ జుల్ఫికర్ అహ్మద్, వైస్ చైర్మన్ మోతిలాల్దేవుడాతోపాటు పలువురు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్లో టీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు టీఆర్ఎస్లో చేరిన వారిలో కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, రామన్న, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, పార్లమెంటరీ సెక్రెటరీ కోవ లక్ష్మి, టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి ఉన్నారు. కాగా, సుల్తాన్ అహ్మద్ సుమారు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఏఐసీసీ సభ్యులుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. అధికార పార్టీలోకి ‘అరిగెల’ ఆసిఫాబాద్ : టీడీపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు, వాంకిడి జెడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వర్రావు శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం ఆసిఫాబాద్, వాంకిడి, తూర్పు జిల్లాలోని ఆయన అనుచరగణం ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్ తరలి వెళ్లారు. ఆసిఫాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు అరిగెల మల్లికార్జున్యాదవ్, వాంకిడి ఎంపీపీ దుర్గం ఆర్తిక, మండల పార్టీ అధ్యక్షుడు వనపర్తి సదాశివ్, ఉపాధ్యక్షుడు గొల్ల, సుమారు వంద మంది టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్కు తరలిన నాయకులు బాసర : బాసర గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరిలో సీనియర్ నాయకులు నర్సురీ సుదర్శన్రావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు లక్ష్మణ్రావు, బాలారాజ్ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు గెంటేల శ్యాం, లాల్మియా, వార్డు సభ్యులు కృష్ణ, మోహిన్, నాయకులు జ్ఞానీ పటేల్, గోవింద్,నర్సింగ్ రావు, సంతోష్ తదితరులున్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా
: సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు: ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శులుగా నియమితులైన మండలానికి చెందిన చేవూరు ఓసూరయ్య యాదవ్, చెందులూరు శ్రీనివాసులు యాదవ్ గురువారం కాకాణిని నెల్లూరులోని ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. కాకాణి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ఎంతోమంది కార్యకర్తలు ఎంతో శ్రమిస్తేనే ప్రస్తుతం పార్టీ ఈస్థాయిలో ఉందన్నారు. అలాంటి కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలబడతానన్నారు. పార్టీకోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించి వారికి ఒక క్రమపద్ధతిలో పదవుల్లో నియమించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జగన్మోహన్రెడ్డి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. వైఎస్సార్ మరణానంతరం రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రభుత్వం కనీసం రైతులకు సక్రమంగా ఎరువులను కూడా సరఫరా చేయలేకుందన్నారు. అధికార పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఓవైపు స్మార్ట్ విలేజిలంటూ గ్రామాల్లో కనీస వసతులు కూడా కల్పించలేకుందన్నారు. పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కడివేటి చంద్రశేఖర్రెడ్డి, మన్నెమాల సుధీర్రెడ్డి, శ్రీహరిరెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, ఆవుల వెంకటరమణయ్య పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్లు Vs మాజీ తమ్ముళ్లు
-
YSRCP కార్యకర్తల పై TDP దాడి
-
బాబు మారలేదు
కార్యకర్తలు, నేతల అసంతృప్తి, ఆగ్రహం ఆయన్ను కలవాలంటే పోలీసులు అడ్డుకుంటారా ? కుప్పం సర్పంచ్ ఆధ్వర్యంలో ధర్నా వరస్ట్ అంటూ తమ్ముళ్లపై చంద్రబాబు మండిపాటు మెజారిటీ ఎందుకు తగ్గిందని చిర్రుబుర్రులు మీరు పనిచేయకున్నా నన్ను చూసి ఓట్లేశారని వ్యాఖ్య సొంత నియోజకవర్గం కుప్పం లో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు రెండు రోజుల సుడిగాలి పర్యటన కార్యకర్తలు, స్థానిక నేతలను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. పదే ళ్ల తరువాత అధికారంలోకి వచ్చినప్పటికీ తమ నేత లో ఎలాంటి మార్పు లేదని వారు ఆందోళన చెందుతున్నారు. అండగా ఉంటానన్న నాయకుడే అధికారుల ముందు తిట్ల పర్వం ఎత్తుకోవడంతో నిర్ఘాంతపోయారు. ఈ విధంగా వ్యవహరిస్తే అధికారులు తమకు విలువెందుకు ఇస్తారం టూ వాపోతున్నారు. సోమ, మంగళవారాలు రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించా రు. నిర్ణీత సమయానికి నాలుగు గంట లు ఆలస్యంగా సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన బాబు పర్యటన ఆ రోజు రాత్రి 2.30 గంటలకు నియోజకవర్గ సమన్వయకమిటీ సమావేశంతో ముగించారు. మంగళవారం ఉద యం తొమ్మిది గంటల నుంచి ప్రజలను కలుసుకుని వినతిపత్రాలు స్వీకరించారు. రెండు గంటలపాటు ప్రజలను కలుసుకున్న ఆయన 11 గంటలకు బయలుదేరి వెళ్లారు. మెజారిటీ తగ్గినందుకు మీరే కారణమంటూ నేతలపై అసంతృప్తి కుప్పం నియోజకవర్గాన్ని తాను ఎంత అభివృద్ధి చేసినా కార్యకర్తలు, నాయకులు ప్రజలకు సరిగా వివరించలేకపోయారంటూ చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 70 వేల మెజారిటీ ఆశిస్తే 47 వేలకు పరిమితం కావడం ఏంటని సోమవారం రాత్రి జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయ న కుప్పం నేతలను ప్రశ్నించారు. పోలింగ్ రోజున కుల సమీకరణలు పనిచేశాయని, నాయకులు కష్టపడి పనిచేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని నెపం వారిపై నెట్టేశారు. అంతేకాకుండా ప్రజలు అభిమానంతో తనను చూసి ఆ ఓట్లైనా వేశారంటూ వ్యాఖ్యానించారు. మీరు పనిచేసినా చేయకున్నా నాకు ఓటర్లు ఉన్నారంటూ చురకలు అంటించారు. చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు సమన్వయకమిటీ సమావేశానికి హాజరైన నాయకులు మౌనం వహించారు. కాగా మంగళవారం ఉదయం చంద్రబాబు బస చేసిన ఆర్ అండ్ బీ అతిథి గృహంలోకి స్థాని క సర్పంచ్ వెంకటేష్ సహా స్థానిక నేతలను పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు అతిథిగృహం ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు బయటకు వచ్చారు. ధర్నా చేస్తున్న నేతలు, కార్యకర్తలను ఉద్ధేశించి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ‘ఏయ్, నోర్మూసుకో ..మీరు ఓవర్ చేస్తున్నారు. చదువుకున్నారా? లేదా? వ రస్ట్గా తయారయ్యారు. మీ లాంటి వాళ్లు నాకు అవసరం లేదు. నేనొక మార్గంలో వెళ్తుంటే, మీరొక మార్గంలో వెళ్తారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన కార్యకర్తలు ధర్నా విరమించి అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసుల ఓవరాక్షన్ కారణంగానే ధర్నా చేయాల్సిన పరిస్థితి కలిగినా కార్యకర్తలను నిందించడం జీర్ణించుకోలేకపోయారు. అధికారుల పడిగాపులు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలిసారి కుప్పం రావడంతో జిల్లా అధికార యంత్రాంగమంతా అక్కడే తిష్ట వేసింది. జిల్లా అధికారులతో సమావేశం కూడా ఉండటంతో బాబు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు జరగాల్సిన అధికారుల సమీక్ష సమావేశం రాత్రి 10.30 గంటలకు ప్రారంభించారు. దీంతో అధికారులు అప్పటివరకు ఆర్ అండ్ బీ అతిథిగృహం ఎదుట పడిగాపులు కాయాల్సి వచ్చింది. కడా పునురుద్ధరణ విషయం పరిశీలిస్తానని హామీ కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కడా)ని పునరుద్ధరించే విషయం పరిశీలిస్తానని చంద్రబాబు ప్రకటించారు. గతంలో తాను కడా ఏర్పాటు చేసినప్పటికీ, ఆ తరువాత ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని, ఇప్పటికిప్పుడు దాన్ని పునరుద్ధరించే అవకాశాలు లేనప్పటికీ పరిశీలించి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. -
సిగ్గులేకుండా ఎందుకొచ్చారు?
మీ వల్లే పార్టీ నాశనమైంది.. మా నోట్లో మట్టికొట్టారు పొన్నాల, దామోదర్, ఉత్తమ్పై కార్యకర్తల ఫైర్ తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోండి టీపీసీసీ నేతలను తూర్పారబట్టిన పార్టీ వర్గాలు కార్యకర్తల తిట్ల ధాటికి తలవంచుకుని జారుకున్న నేతలు హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి గాంధీభవన్కు వచ్చిన టీ-కాంగ్రెస్ నేతలకు ఘోర పరాభవం ఎదురైంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పరాజయం పాలవడానికి టీపీసీసీ పెద్దలే కారణమంటూ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీవల్లే పార్టీ సర్వనాశనమైంది. పాతికేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న మాలాంటి వాళ్ల నోట్లో మన్నుకొట్టారు. అయినా సిగ్గులేకుండా ఎందుకొచ్చారు? తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోండి’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహలను గాంధీభవన్లో నిలదీశారు. కార్యకర్తల ఆగ్రహానికి విస్తుపోయిన సదరు నేతలు చేసేదేమీ లేక తలదించుకుని వెళ్లిపోయారు. అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ తీర్మానం చేసేందుకు పొన్నాల ఆధ్వర్యంలో గాంధీభవన్లో మంగళవారం అందుబాటులో ఉన్న టీపీసీసీ ముఖ్య నేతలు సమావేశ మయ్యారు. ఉత్తమ్, దామోదరతో పాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీలు రేణుకా చౌదరి, గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్రెడ్డి, ఆమోస్, జగదీశ్వర్రెడ్డి తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. టీపీసీసీ తీర్మానాన్ని దామోదర రాజనర్సింహ చదివి విన్పించగా.. మిగిలిన వారు దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శులు బొల్లు కిషన్, బొట్టు వెంకన్న, జ్ఞానసుందర్ తదితరులు లేచి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే వేదికపైనున్న నేతలు మైకు ఇవ్వకుండా సమావేశం ముగిసినట్లు ప్రకటించి వేదిక దిగబోయారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు నాయకులు, కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకొచ్చారు. ‘‘మీవల్లే కాంగ్రెస్ నాశనమైంది. ముమ్మాటికీ నాయకత్వ లోపమే. ఈ వాస్తవాన్ని మీరేందుకు ఒప్పుకోవడం లేదు? పాతికేళ్లుగా పార్టీని నమ్ముకుని రక్తం ధారపోసిన మా నోట్లో మన్నుకొట్టారు. తెలంగాణ ఇచ్చినా జనంలోకి వెళ్లలేక పార్టీని సర్వనాశనం చేశారు. అయినా సిగ్గులేకుండా ఎందుకొచ్చారు? టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ఘోరంగా ఓడిపోయిన పొన్నాల ఆ పదవిలో ఉండటానికి వీల్లేదు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉంటూ సొంత జిల్లాకే పరిమితమైన దామోదర రాజనర్సిహ... తనకు, తన భార్యకే టికెట్లు తెచ్చుకున్న ఉత్తమ్కుమార్రెడ్డి తక్షణమే పార్టీకి రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. దీంతో ఖిన్నులైన టీపీసీసీ పెద్దలు మౌనంగా ఉండిపోయారు. వారిని చుట్టుముట్టిన కార్యకర్తలు.. పొన్నాల, దామోదర, ఉత్తమ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేణుకాచౌదరి, పొంగులేటి తదితరులు వారిని బుజ్జగించేందుకు య త్నించినా ఫలితం లేకపోయింది. ఒకదశలో ఆ ముగ్గురు నేతలను ఉద్దేశించి పత్రికలో రాయలేని పదాలతో తిట్ల దండకం చదివారు. అయినప్పటికీ చేసేదేమీ లేక పొన్నాల, దామోదర సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చి వాహనం ఎక్కారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం వారి వెంట బయటకు వచ్చి తీవ్ర పద జాలాన్ని ఉపయోగిస్తూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఒక దశలో సహనం కోల్పోయిన దామోదర అక్కడి వారిపై రుసరుసలాడారు. ‘ఏం కిషన్.. మీడియా ముందు హీరో కావాలనుకుంటున్నావా? నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో పో..’ అని వ్యాఖ్యానించారు. ‘అవసరం తీరాక ఇట్లనే ఉంటుంది. నువ్వు దళితుడివై ఉండి సాటి దళితుల గురించి ఏనాడైనా పట్టించుకున్నావా? మేం టికెట్ అడిగితే మమ్మల్ని కాదని పార్టీకి సంబంధం లేని అద్దంకి దయాకర్కు టికెట్ ఇప్పించుకున్నవ్. నీలాంటోడివల్లే పార్టీ నాశనమైంది’ అని అక్కడి నేతలు కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. అదే సమయంలో కొందరు నగర కార్యకర్తలు మాజీ మంత్రి దానం నాగేందర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న దానం అనుకూలవర్గం వారిపై దాడికి దిగింది. పరిస్థితి ఉద్రిక్తమవుతుందని గ్రహించిన టీపీసీసీ ముఖ్యులంతా అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం కిషన్, జ్ఞాన సుందర్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ.. పొన్నాల, దామోదర, ఉత్తమ్ తమ పదవులకు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు.. పార్టీ కార్యకర్తలకు ఎలా మనోధైర్యాన్నిస్తారని ప్రశ్నించారు. కార్యకర్తల ఆవేదనకు అర్థముంది: పొంగులేటి కార్యకర్తల ఆవేదనలో అర్థముందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. పదేళ్లుగా కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే పార్టీ ఓడిపోయిందన్నారు. ఓటమికి తామంతా సమష్టి బాధ్యత వహించడంతోపాటు కార్యకర్తలకు క్షమాపణ చెబుతున్నామన్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యకర్తల ఆవేదనను అర్ధం చేసుకున్నామని, ఫలితాలపై ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రేణుకా చౌదరి అన్నారు. నోరు మెదపని పొన్నాల గాంధీభవన్లో జరిగిన ఘటనపై మాట్లాడేందుకు పొన్నాల లక్ష్మయ్య నిరాకరించారు. ఎన్నికల ఫలితాలపై జూన్ మొదటి వారం నుంచి జిల్లాలవారీగా సమీక్షించాలని నిర్ణయించినట్లు చెప్పారు. హంగ్ నెలకొన్న మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లను కైవసం చేసుకునేందుకు తగిన వ్యూహాన్ని రూపొందించామన్నారు. డీకే అరుణకు మహబూబ్నగర్, రాజనర్సింహకు మెదక్, సబితా ఇంద్రారెడ్డికి మెదక్ జెడ్పీ చైర్మన్ ఎన్నికల బాధ్యతను అప్పగించినట్లు చెప్పారు. ఓటమికి టీపీసీసీదే ఉమ్మడి బాధ్యత సోనియా, రాహుల్ నాయకత్వంలోనే పనిచేస్తాం టీపీసీసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి ఉమ్మడిగా బాధ్యత వహిస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పేర్కొంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సోనియాగాంధీ, రాహుల్గాంధీ చేసిన రాజీనామాలను తిరస్కరిస్తూ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. సోని యా, రాహుల్ నాయకత్వంలోనే పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని తీర్మానించింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో మంగళవారం గాంధీభవన్లో అందుబాటులో ఉన్న టీపీసీసీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి కె.జానారెడ్డి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు జగదీశ్వర్రెడ్డి, అమోస్, ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డితోపాటు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆకుల లలిత తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. ఎన్నికల్లో పార్టీ ఓటమి బాధాకరమైనప్పటికీ నిరాశపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం రాజనర్సింహ టీపీసీసీ రూపొందించిన తీర్మానాన్ని చదివి విన్పించగా నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానం సారాంశమిదే... ‘‘2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సోనియాగాంధీ, రాహుల్గాంధీ రాజీనామాకు సిద్ధపడటాన్ని మన్మోహన్సింగ్ సహా సీడబ్ల్యూసీ తిరస్కరిస్తూ తీర్మానించింది. ఓటమికి ప్రభుత్వపరంగా బాధ్యత తీసుకుంటానని మన్మోహన్సింగ్ చెప్పడాన్ని, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆమోదిస్తూ టీపీసీసీ తీర్మానించింది. సోనియా, రాహుల్ నాయకత్వంలో పార్టీని తిరిగి బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని తీర్మానించింది. రాజకీయ ప్రయోజనాలకు తావు లేకుండా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. తెలంగాణలో పార్టీ ఓటమికి తనదే బాధ్యతగా పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. అయితే దేశంలో ఏర్పడిన రాజకీయ కారణాల వల్లే పార్టీ ఓటమి పాలైందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రాథమికంగా అంచనా వేస్తూ అందుకు ఉమ్మడి బాధ్యత స్వీకరిస్తుంది. భవిష్యత్తులో సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, రాహుల్గాంధీ ప్రతిపక్ష హోదాలో ప్రజాపక్షాన నిలబడాలని టీపీసీసీ తీర్మానించింది’’