CLP Meeting
-
గీత దాటితే ఊరుకునేది లేదు
-
Telangana: గీత దాటితే వేటే..!
సాక్షి, హైదరాబాద్: ‘‘ఏ స్థాయి నాయకుడైనా పార్టీ లైన్లో ఉండాల్సిందే. గీత దాటితే కఠిన చర్యలు తప్పవు. డిన్నర్ మీటింగ్ల పేరుతో ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవద్దు. గతంలో గులాం నబీ ఆజాద్ వంటి 23 మంది కీలక నేతలు జీ–23 పేరుతో ప్రత్యేకంగా సమావేశమైతే పార్టీ క్షమించలేదన్న విషయాన్ని మర్చిపోవద్దు..’’అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఏదైనా ఉంటే తనను, పార్టీ సీనియర్ నేతలను కలవాలని.. అవసరమైతే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్లాలని, డిన్నర్ మీటింగ్ల వంటివాటికి కాదని పేర్కొన్నట్టు సమాచారం. గురువారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. సుమారు ఐదుగంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో సీఎంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు తదితర అంశాలపై చర్చించారు. నేను ఫ్రెండ్లీ సీఎంను..! పార్టీ కోసం అందరం కలసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ‘‘నేను ఫ్రెండ్లీ సీఎంను.. నా దగ్గరకు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా రావచ్చు. సాధ్యమైనంత వరకు చేసి పెడతా. సాధ్యం కాని పనులు చేయలేం. కొందరు మా దగ్గరకు వచ్చి పనులు కాకపోతే.. మళ్లీ మీతో కలసి వస్తున్నారు. అలాంటప్పుడు పనులు చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు క్యారెక్టర్ కాపాడుకోవాలి. పైరవీలు చేసి ప్రజల్లో, అధికారుల్లో చులకన కావద్దు. తొలిసారి గెలిచినవారు రెండోసారి గెలవడం చాలా కష్టం. మన పనితీరే రెండోసారి గెలిపిస్తుంది. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి..’’ అని పేర్కొన్నట్టు తెలిసింది. డిన్నర్ మీటింగ్లు వద్దు.. ఎమ్మెల్యేలు మామూలుగానే భోజనం చేయాలని డిన్నర్కు కలిసి ఉండవచ్చని, కానీ ప్రత్యర్థులు ఈ విషయాన్ని చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నట్టు సమాచారం. ‘‘మన గురించి మాట్లాడుకునే ఆస్కారం ఎదుటివారికి ఇవ్వొద్దు. జీ–23 పేరుతో గులాం నబీ ఆజాద్ వంటి వారు మీటింగ్లు పెడితేనే పార్టీ సహించలేదు. ఇంకోసారి ఇలాంటి డిన్నర్ మీటింగులు పెట్టుకోకపోవడమే మంచిది. నేను పని చేయలేదని ఎవరైనా సీరియస్గా భావిస్తే నేరుగా ఏఐసీసీ దగ్గరికి వెళ్లొచ్చు, చెప్పొచ్చు. అవసరమైతే ఖర్గే అపాయింట్మెంట్ నేనే ఇప్పిస్తా..’’ అని సూచించినట్టు తెలిసింది. ఎన్ని చేసినా ప్రజల్లోకి వెళ్లలేకపోయాం మహిళలకు ఉచిత ప్రయాణం నుంచి ఉద్యోగాల భర్తీ వరకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని, కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టామని.. అయినా ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లలేకపోయామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఈ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందరం ఒక లైన్ మీద ఉండి పనిచేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు పది, పదిహేను రోజుల్లోనే నోటిఫికేషన్ రావచ్చని, కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని.. అప్పటివరకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయనిగానీ, షెడ్యూల్ గురించిగానీ ఎవరూ మాట్లాడవద్దని సూచించినట్టు తెలిసింది. అందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, వీలైనంత వరకు ఏకగ్రీవాలకు ప్రయత్నం చేయాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యేంతవరకు స్థానికంగానే ఉండాలని సీఎం సూచించినట్టు తెలిసింది. పథకాల విషయంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు! సీఎల్పీ భేటీలో మాట్లాడిన ఎమ్మెల్యేలు పలు అంశాలను ప్రస్తావించారు. రైతు భరోసాను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సూచించినట్టు సమాచారం. రుణమాఫీ అనుకున్న స్థాయిలో జరగలేదని, క్షేత్రస్థాయిలో ఇబ్బందిగా ఉందని.. రుణమాఫీ కారణంగా మిగతా పథకాలను వంద శాతం అమలు చేయలేకపోతున్నామని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఇక పథకాలను హడావుడిగా ప్రారంభిస్తున్నామని.. ఏదీ వంద శాతం రీచ్ కావడం లేదని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుండటంతో గందరగోళం నెలకొంటోందని, ఇకపై గాం«దీభవన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు మెటీరియల్ వచ్చేలా చూడాలని కోరినట్టు తెలిసింది. ఇక మాజీ మంత్రి కేటీఆర్ అనుచరులు అమీన్పూర్లో భూములు ఆక్రమించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి పేర్కొన్నట్టు తెలిసింది. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం తాను ఏ మంత్రి వద్దకూ వెళ్లలేదని ఆయన కుటుంబసభ్యుల మీద ఒట్టుపెట్టినట్టు సమాచారం. చివరగా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయినా నిధులు రాకపోతే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఎలాగని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా.. త్వరలో విడుదల చేస్తామని సీఎం రేవంత్ చెప్పినట్టు తెలిసింది. హాజరుకాని ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు తాజాగా సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేదు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ సమావేశానికి వెళితే లేనిపోని ఇబ్బందులు వస్తాయని భావించే దూరంగా ఉన్నట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్ సమావేశాలకు హాజరైనవారు కూడా గురువారం సమావేశానికి రాలేదు. కాంగ్రెస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా పలు కారణాలతో గైర్హాజరైనట్టు తెలిసింది. టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి ఇదే సమయంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే.. త్వరలోనే ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నిర్వహించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సూర్యాపేట, మెదక్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. సూర్యాపేటలో కులగణన సభకు రాహుల్ గాందీని, మెదక్ ఎస్సీ వర్గీకరణ సభకు ఖర్గేను ఆహ్వానిస్తామని తెలిపారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా వ్యయం చేస్తున్న అంశాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నెన్ని నిధులిచ్చారనే అంశాన్ని కూడా భట్టి ఇందులో వివరించినట్టు సమాచారం. హెచ్చరికలు, సూచనల మధ్య..! సీఎల్పీ సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తూనే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు పరోక్ష హెచ్చరికలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య.. ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం కొరవడిందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే.. ఈ సమావేశంలో ప్రసంగించిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా పలు అంశాలపై ఘాటుగానే స్పందించినట్టు తెలిసింది. -
సీఎల్పీ సమావేశం.. రెండు సభలకు ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చ జరిగింది.సీఎల్పీ సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు, తీన్మార్ మల్లన్న హాజరుకాలేదు. గత వారం పలువురు ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాజరయ్యారు. సీఎల్పీ సమావేశానికి పలు డాక్యుమెంట్లతో అనిరుధ్ రెడ్డి వచ్చారు. ఓ మంత్రిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ బయలుదేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై అధిష్టానానికి వివరించనున్నారు. అలాగే, త్వరలో రెండు భారీ బహిరంగ సభలకు టీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీసీ జనసభ, ఎస్సీ జనసభ పేరుతో రెండు సభలు పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఖర్గేను సభలకు ఆహ్వానించనున్నట్టు సమాచారం. -
సీఎల్పీ భేటీకి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పీఏసీ చైర్మన్గాంధీ, వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డితో పాటు మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే లు ,ఎమ్మెల్సీలు ,ఎంపీలు హోటల్కు వచ్చారు.సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగుతోంది.లోకల్ బాడీ ఎన్నికలు,పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం,పార్టీ సభ్యత్వం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదీ చదవండి.. జమిలి ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర -
అధికారులు మాట వినడం లేదట!.. టీపీసీసీ చీఫ్కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అధికారులు తమ మాట వినడం లేదంటూ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్కు ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్నామో.. ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారుల వ్యవహారాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు మహేష్గౌడ్ అప్పగించారు. కాగా, రేపు సాయంత్రం 4 గంటలకు రేవంత్రెడ్డి అధ్యక్షతన మాదాపూర్ రాడియంట్ హోటల్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.మరోవైపు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేపడుతోంది. పీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేశ్కుమార్గౌడ్ నేతృత్వంలో శనివారం నుంచి జిల్లా స్థాయి సమీక్షలు ప్రారంభమయ్యాయి.ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలుజిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల స్థితిగతులు, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తీరు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ అంశాల ప్రాతిపదికగా ఈ సమీక్షలు జరుగుతాయని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో పార్టీ అన్ని స్థాయిల నాయకులు పాల్గొననున్నారు. -
TG: సీఎల్పీ సమావేశం.. రేపు రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యకతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని సీఎం రేవంత్ పరిచయం చేశారు.కాగా, తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ రేపు(సోమవారం) తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి హాజరయ్యారు. అభిషేక్ సింఘ్వీ నామినేషన్ ప్రక్రియ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. -
సీఎం రేవంత్ రెడ్డి తొలి భేటీ..
-
ఓవర్ టు ఢిల్లీ..!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించినా.. ముఖ్యమంత్రిని ఎంపిక అంశం కొలిక్కి రాలేదు. సోమవారం పొద్దంతా భేటీలు, సమావేశాలు, చర్చలు, ఇంకాసేపట్లోనే ప్రమాణ స్వీకారమనే ప్రచారాల మధ్య ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. పార్టీ శాసనసభాపక్షం (సీఎల్పీ) నాయకుడిని నిర్ణయించేందుకు సోమవారం హైదరాబాద్లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కొత్త ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు మాత్రమే పరిమితమయ్యారు. వారి అభిప్రాయాలను ఢిల్లీకి పంపి, అధిష్టానం స్పందన కోసం ఎదురుచూసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని పరిశీలకుల బృందం.. ఎలాంటి తుది నిర్ణయాన్ని ప్రకటించకుండానే హస్తిన బాట పట్టింది. మంగళవారం పార్టీ అధిష్టానం పెద్దలతో డీకే బృందం భేటీ కానుంది. అనంతరం సీఎం, మంత్రి పదవులు, ఇతర కీలక అంశాలపై తుది నిర్ణయం వెలువడనుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే తుది నిర్ణయాన్ని వెలువరించే ముందు అధిష్టానం పెద్దలు మరోసారి టీపీసీసీ ముఖ్యులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నాయి. ఈ ప్రక్రియ ముగిసేందుకు రెండు రోజుల సమయం పడుతుందని పేర్కొంటున్నాయి. సీఎంతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రివర్గ బెర్తులు ఖరారైన తర్వాతే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించాలన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం కొలువు దీరనుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఏకవాక్య తీర్మానానికి ఆమోదం సోమవారం ఉదయం 11.30 గంటలకు ఎల్లా హోటల్ వేదికగా కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశమైంది. కాంగ్రెస్ నుంచి తాజాగా గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. డీకే శివకుమార్ పర్యవేక్షణలో ఏఐసీసీ పరిశీలకులు కేజీ జార్జి, దీపాదాస్మున్షీ, అజయ్కుమార్, ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. తొలుత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి డీకే శివకుమార్ మాట్లాడారు. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపి.. సీఎం ఎంపిక వ్యవహారంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. తర్వాత సీఎం అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఎల్పీ నేత భట్టి తీర్మానాన్ని సమరి్థంచగా.. మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. సీఎం ఎవరైతే బాగుంటుంది? ఏఐసీసీ పరిశీలకులు సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలందరితో విడివిడిగా సమావేశమై.. సీఎం ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పేరు చెప్పగా, మరికొందరు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డిల పేర్లు చెప్పారని, ఇంకొందరు మాత్రం ఏఐసీసీ ఎవరిని ఎంపిక చేసినా తమకు సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం. డీకే బృందం ఈ అభిప్రాయాలను వెంటనే ఢిల్లీకి చేరవేసింది. వాటిని హైకమాండ్ పరిశీలించి ఏం చెప్తుందోనని సాయంత్రం వరకు ఎదురుచూసింది. కానీ డీకే బృందాన్ని ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. దీంతో డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం తెలంగాణ సీఎం ఎంపిక వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు. సీఎం క్యాండిడేట్పై స్పష్టతకు వచ్చాక రాష్ట్రంలోని ముఖ్య నేతలతో చర్చించి, అవసరమైతే వారిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడనున్నట్టు సమాచారం. తర్వాత సీల్డ్ కవర్లో సీఎం అభ్యర్థి పేరును హైదరాబాద్కు పంపి, సీఎల్పీ సమావేశంలో సదరు నేతను ఎన్నుకుంటారని తెలిసింది. గెలిచిన వారికి అభినందనలు ఢిల్లీలోని సోనియా నివాసంలో సోమవారం జరిగిన పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అభినందించింది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక వ్యవహారంపై ఎలాంటి చర్చ జరగలేదని ఏఐసీసీ నేతలు జైరాం రమేశ్, మాణిక్యం ఠాగూర్ తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి వస్తున్న ఏఐసీసీ పరిశీలకులతో మాట్లాడాక హైకమాండ్ తుదినిర్ణయం తీసుకుంటుందన్నారు. సోమవారమే ప్రమాణమంటూ హడావుడి! సోమవారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం ముగియకముందే కాంగ్రెస్ పక్షాన సీఎం ఎంపిక పూర్తయిందని, సాయంత్రమే రాజ్భవన్లో సీఎం, ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు రాజ్భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కొన్ని వీడియోలు కూడా బయటికి వచ్చాయి. గాం«దీభవన్ వర్గాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. కానీ ఏఐసీసీ పెద్దలు డీకే టీమ్ను ఢిల్లీకి పిలిపించాక ఈ హడావుడి ఆగిపోయింది. హడావుడి వద్దు... ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి సీఎల్పీ సమావేశానికి ముందు హోటల్ పార్క్ హయత్లో కీలక సమావేశం జరిగింది. భట్టి, ఉత్తమ్, శ్రీధర్బాబు, ప్రేమ్సాగర్రావు, దామోదర రాజనర్సింహ, రాజగోపాల్రెడ్డి తదితరులు డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న హడావుడి పార్టీకి నష్టం చేస్తుందని వారు డీకేతో పేర్కొన్నట్టు సమాచారం. ‘‘ఫలానా వారికి సీఎం పదవి ఇవ్వవద్దని మేమేమీ అనడం లేదు. కానీ అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ అభిప్రాయాలపై నిర్ణయం తీసుకునేందుకు అనంతరం జరిగే పరిణామాల గురించి ఆలోచించాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మనం ఇప్పుడు ప్రజల్లోకి పంపాల్సింది ‘స్ట్రాంగ్’ మెసేజ్ కాదు.. ‘స్మార్ట్’ మెసేజ్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసి ఫలితాలు సాధించాల్సిన బాధ్యతను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని వారు డీకేకు స్పష్టం చేసినట్టు సమాచారం. పార్టీ భవిష్యత్తును, పార్టీ పట్ల విధేయత, అనుభవాలను ఆచితూచి అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని.. ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యేలకు వచ్చే ఇబ్బందేమీ ఉండదని వారు పేర్కొన్నట్టు తెలిసింది. -
కాంగ్రెస్ ప్రభుత్వం.. కేబినెట్లో వీరే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. సోమవారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశంలో కొనసాగుతోంది. ఈ మీటింగ్లో గెలుపొందిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎన్నిక, సీఎం అభ్యర్థిని ఎంపికపై నిర్ణయం తీసుకొనున్నుట్లు తెలుస్తోంది. అదే విధంగా కేబినెట్ స్థానాల గురించి కూడా సీఎల్సీ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కేబినెట్లో స్థానం దక్కే అవకాశం ఉన్నవారు.. అదిలాబాద్ జిల్లా : ► వివేక్ వెంకట్ స్వామీ (చెన్నూర్) ►ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల) ►వెడ్మ బోజ్జు ( ఖానాపూర్) కరీంనగర్ : ►పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్) ►శ్రీధర్ బాబు (మంథని) ►అది శ్రీనివాస్ (వేములవాడ) మహబూబ్ నగర్ : ►రేవంత్ రెడ్డి..(కొడంగల్ ) ►జూపల్లి కృష్ణ రావు (కొల్లాపూర్) ►వంశీ కృష్ణ (అచ్చంపేట) ►వీర్లపల్లి శంకర్ (షాద్ నగర్ ) వరంగల్: ►సీతక్క (ములుగు) ►కొండ సురేఖ (వరంగల్ ఈస్ట్) ఖమ్మం: ►భట్టి విక్రమార్క (మధిర) ►తుమ్మల నాగేశ్వర రావు (ఖమ్మం) ►పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( పాలేరు) ► కునమనేని సాంబశివ రావు (కొత్తగూడెం) - పొత్తులో భాగంగా క్యాబినెట్ లోకి తీసుకుంటే నల్గొండ: ►ఉత్తమ్ లేదా పద్మావతి ►కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ) మెదక్ : ►దామోదర్ రాజనర్సింహ (అందోల్ ) నిజామాబాద్ : ►సుదర్శన్ రెడ్డి ( బోధన్) ►షబ్బీర్ అలీ (ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి) రంగారెడ్డి : ►మల్ రెడ్డి రంగారెడ్డి ( ఇబ్రహీంపట్నం ) ►గడ్డం ప్రసాద్ (వికారాబాద్) ►రామ్ మోహన్ రెడ్డి (పరిగి) వారితో పాటు అవసరం అయితే కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు (ఫొటోలు)
-
తెలంగాణ సీఎం ఎవరు?.. వెయిటింగ్!
Live Updates ఏఐసీసీ నిర్ణయం కోసం వెయిటింగ్ ►సీఎల్పీ భేటీ అనంతరం.. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ చేపట్టిన డీకే శివకుమార్ ►ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా మాట్లాడిన డీకేఎస్ ►ముగిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ ►ఎమ్మెల్యేల అభిప్రాయలను ఏఐసీసీకి పంపిన డీకేఎస్ ►ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత ఎంపిక సమాచారం కోసం వెయిటింగ్ ►కాంగ్రెస్ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ ముగిసిన సీఎల్పీ సమావేశం.. ►మరో రెండు గంటల్లో సీఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశం ►తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానం. ►సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్న డీకే శివకుమార్. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరితో మాట్లాడుతున్న డీకే, దీపాదాస్ మున్షి. ►సీఎల్పీ సమావేశం అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. సీఎల్పీ నేత ఎంపికను అధిష్టానానికి అప్పగించారు. సీఎల్పీ తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సీఎల్పీ నిర్మానాన్ని భట్టి విక్రమార్క, తుమ్మల బలపరిచారు. తీర్మానాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తున్నాం. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. ►హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం ఎంపికపై పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నారు. సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేశారు. ►ఏకవాఖ్య తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి.. తీర్మానాన్ని బలపరిచిన తుమ్మల నాగేశ్వర రావు ►సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్లో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరు. #WATCH | Telangana: Congress Legislature Party (CLP) meeting begins in Hyderabad. Karnataka Deputy CM DK Shivakumar, State Congress chief Revanth Reddy and other Congress MLAs are present in the meeting. pic.twitter.com/xsQ2AayKQW — ANI (@ANI) December 4, 2023 ►కాంగ్రెస్ సీఎల్పీ నేతల సమావేశం ప్రారంభమైంది. నగరంలోని హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపిక, మంత్రులు ఎవరు? అనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ►సీఎం పదవి కోసం ముగ్గురు సీనియర్ నేతల లాబీయింగ్. ►ఢిల్లీ పెద్దలతో భట్టి విక్రమార్క్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఏకాభిప్రాయం కుదుర్చుకునేందకు అధిష్టానం ప్రయత్నాలు. ►సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. నా గెలుపు ములుగు ప్రజల విజయం, న్యాయం గెలిచింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాను. ►మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజా పాలన కోసమే కాంగ్రెస్ను ప్రజలు ఎన్నుకున్నారు. అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యం. బీఆర్ఎస్ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కేబినెట్లో ఎవరు? ►వివేక్ వెంకటస్వామి, ప్రేమ్సాగర్ రావు, వెడ్మ బోజ్జు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ఆది శ్రీనివాస్, రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, సీతక్క, కొండా సురేఖ, భట్టి విక్రమార్క్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్, కూనంనేని సాంబశివరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా పద్మావతి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహ, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్, రామ్ మోహన్ రెడ్డి. సీఎం ఎంపిక అధిష్టానం నిర్ణయం: భట్టి విక్రమార్క ►అంతకుముందు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. సీఎల్పీ సమావేశంలో అందరి నిర్ణయం తీసుకుని పార్టీ అధిష్టానం సీఎంను ఎంపిక చేస్తుంది. నేను సీఎల్పీ నేతగా ఉన్నాను. పార్టీ అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర చేశాను. ఉచిత కరెంట్ అనగానే దేశంలో గుర్తుకు వచ్చేది వైఎస్సార్. ఎన్నికల ముందే చెప్పారు ఉచిత కరెంట్ ఇస్తానని.. చెప్పడమే కాదు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టారు. అది చేసి చూపించిన పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ అంటే కరెంట్.. కరెంట్ అంటే కాంగ్రెస్. కరెంట్ను ముట్టుకుంటే ఎలా మాడిపోతారో ఇప్పుడు ఫలితాలు చూశారు కదా. 70 స్థానాల్లో గెలవబోతున్నామని ముందే చెప్పాను. గెలిచి చూపించాం. మా అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ చూస్తే తెలుస్తుంది. ఎంత బలంగా జనం ప్రజా ప్రభుత్వం తెచ్చుకోవాలని సిద్ధమయ్యారో. ప్రజాస్వామితంగా పాలన ఉండాలని కోరుకున్నారు. దొరల తెలంగాణ కాదు.. ప్రజల తెలంగాణ గెలవాలని కోరుకున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ అడవుల్లో ఎవరూ తిరగని ప్రాంతాల్లోకి వెళ్లాను.. అక్కడే పడుకున్నాను. సింగరేణి ప్రాంతాల్లో కూడా తిరిగాను. మా పార్టీ అధికారంలోకి రాగానే ఏమీ చేస్తామన్నది క్లారిటీ ఇచ్చాం. ►పార్క్ హయత్లో డీకే శివకుమార్తో ఉత్తమ్, భట్టి, రాజగోపాల్ రెడ్డి భేటీ. సీఎల్పీ సమావేశం కంటే ముందే నేతల సమావేశంతో ఉత్కంఠ. ఈ సమావేశం తర్వాత హెటల్ ఎల్లాకు బయలుదేరనున్న నేతలు ►ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. ►మరోవైపు.. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను రాజ్భవన్కు తీసుకువెళ్లేందుకు హెటల్ ఎల్లా వద్ద టీపీసీసీ బస్సులను సిద్ధం చేసింది. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. ►పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ►ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్ను కలసి రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్లోని ఎల్లా హోటల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షణలో, ఇతర ఏఐసీసీ ముఖ్యుల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికోసం కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే హైదరాబాద్కు చేరుకున్నారు. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్ను కలసి రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల పేరిట లేఖ ఫేక్ సీఎంగా రేవంత్రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం తగిన భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారుల పేరిట ఓ లేఖ వైరల్గా మారింది. అయితే అది ఫేక్ అని టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. గవర్నర్ను కలసిన కాంగ్రెస్ నేతలు ఫలితాల అనంతరం హైదరాబాద్లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. రాత్రి 9 గంటల సమయంలో రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ తమిళిసైను కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్మున్షీ, కేజీ జార్జ్ తదితరులు రాజ్భవన్కు వెళ్లిన బృందంలో ఉన్నారు. తమకు 65 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ వారు గవర్నర్కు లేఖ అందజేశారు. తర్వాత రాజ్భవన్ ఎదుట డీకే శివకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సీఎంపై సోమవారమే స్పష్టత: ఉత్తమ్ గవర్నర్ను కలవడానికి ముందు ఎల్లా హోటల్ వద్ద ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి మీడియాతో మా ట్లాడారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరగనుందని, సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని సమావేశంలోనే వెల్లడిస్తానని, బయ ట చెప్పనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమని అభివర్ణించారు. -
కర్ణాటక కొత్త కేబినెట్కు ముహూర్తం ఖరారు..
బెంగళూరు: కర్ణాటక కొత్త కేబినెట్కు ముహూర్తం ఖరారైంది. మే 18న కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. అదే విధంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా అన్ని భావసారూప్యత కలిగిన పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. కాగా కర్ణాటకలో హంగ్ తప్పదనుకున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఏకంగా 136 స్థానాలను హస్తం పార్టీ గెలుచుకుంది. గత ఎన్నికల కంటే 55 స్థానాలు ఎక్కువగా విజయం సాధించింది. 43 శాతం ఓట్ షేర్ రాబట్టింది. 2018 ఎన్నికల్లో 104 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి కేవలం 65 సీట్లకే పరిమితమైంది. 14 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. ఈ ఓటమితో దక్షిణాదిన ఏకైక రాష్టం కూడా బీజేపీ చేజారింది. ఇక జేడీఎస్ కేవలం 19 సీట్లతో కుదేలైంది. చదవండి: కర్ణాటక సీఎం రేసు.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు సీఎల్పీ భేటీ బెంగుళూరులో సీఎల్పీ సమావేశమైంది. షంగ్రిల్లా హోటల్కు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణకు పార్టీ హైకమాండ్ దూతలను పంపింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్లను కర్ణాటక సీఎల్పీ సమావేశ పరిశీలకులుగా నియమించింది. సీఎల్పీ నేతల ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్న షిండే బృందం.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంది. అధిష్టానమే సీఎంను ప్రకటించాలని తీర్మానంలో నిర్ణయించారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇళ్ల వద్ద హైడ్రామా బెంగళూరులో డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇళ్ల వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. సిద్ధరామయ్య ఇంటి ముందు ‘కర్ణాటక తదుపరి సీఎం’ అంటూ ప్లెక్సీలు వెలిశాయి. ఇటు డీకే శివకుమార్ ఇంటి ముందు ‘కర్ణాటక కొత్త ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షాలు’ అంటూ ఆయన మద్దతుదారులు పోస్టర్లు అంటించారు. ఇరు నేతల మద్దతుదారుల తమ నేతను సీఎం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 137కు చేరింది. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. చదవండి: సీబీఐ నూతన డైరెక్టర్గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ -
సీఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్స్
-
రాజస్థాన్ సీఎం పదవికి అశోక్ గహ్లోత్ రాజీనామా!
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి ముందే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జైపూర్లోని అశోక్ గహ్లోత్ నివాసంలో ఆదివారం రాత్రి 7గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. సీఎం మార్పు తథ్యమని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ భేటీ కీలకంగా మారింది. రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభాపక్షానికి కొత్త సారథిని నిర్ణయించే అధికారం అధ్యక్షురాలు సోనియా గాంధీకే వదిలేస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సచిన్ పైలట్ను నూతన సీఎం చేయడం గహ్లోత్కు ఇష్టం లేదు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సచిన్ పైలట్కు గాంధీల నుంచి హామీ వచ్చిందని, ఆయనే తదపరి సీఎం అని పార్టీ వర్గాలు చెప్పాయి. అంతేగాక తాను నామినేషన్ సమర్పించిన తర్వాతే రాజస్థాన్ కొత్త సీఎంపై నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నాయి. జైపూర్లో జరిగే ఈ సమావేశానికి పరిశీలకుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ఇన్ఛార్జ్గా అజయ్ మాకెన్ హాజరుకానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఖర్గేను పరిశీలకుడిగా సోనియా గాంధీ నియమించారు. అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 24న మొదలై 30వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు గడువుంది. ఎన్నికలు జరిగిన రెండో రోజు అంటే అక్టోబర్ 19న ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: ‘70 ఏళ్లలో ఏ నాడూ దేశం ఇలా కాలేదు’ -
తెలంగాణ కాంగ్రెస్లో పంచపాండవులు మిగిలారు: జీవన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో పంచపాండవులు మిగిలారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌరవుల పక్షాన చేరిన కర్ణుడని ఆయన అభివర్ణించారు. పాండవుల వెంట ఉంటే రాజ్యం ఇస్తామని చెప్పినా అనాడు కర్ణుడు విననట్లు.. ఇప్పుడు రాజగోపాల్ కూడా అలాగే చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడమంటే చేతకానీతనమేనని జీవన్ రెడ్డి విమర్శించారు. రాజీనామాతో అభివృద్ధి అనేది సరైన వ్యూహం కాదని తెలిపారు. హుజురాబాద్కు, మునుగోడుకు సంబంధమే లేదని, రాజగోపాల్రెడ్డి ఇకపై అసెంబ్లీలో అడుగు పెట్టడని జోస్యం చెప్పారు. మునుగోడులో గెలిచేది తామేనని స్పష్టం చేశారు. పోరాడే అవకాశం ఇచ్చినా రాజగోపాల్ రెడ్డి ఉపయోగించుకోలేదని మండిపడ్డారు. గత మూడేళ్లలో రాజగోపాల్రెడ్డి ప్రజల కోసం చేసిన ఉద్యమం ఏదైనా ఉందా అని జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి ఫైట్ చేస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడిందా అని నిలదీశారు. చదవండి: కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం.. మనుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం రాజగోపాల్రెడ్డి రాజీనామాను ప్రజలు ఎలా చూస్తారనేది చూడాలన్నారు. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచే అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో టీ కాంగ్రెస్లో పంచపాండవులు మిగిలారని జీవన్ రెడ్డి వెల్లడించారు. సీఎల్పీనేత భట్టివిక్రమార్క.. ధర్మరాజు అయితే, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని భీముడని, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబును అర్జునుడిగా పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డిని కర్ణుడితో పోల్చారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ అత్యవసర సమావేశమైంది. ఎమ్మెల్యేలు అందుబాటులో లేని కారణంగా జూమ్లో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ మీటింగ్లో రాజగోపాల్ రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. చదవండి: జాతిని చీల్చే కుట్రను అడ్డుకుందాం: సీఎం కేసీఆర్ -
ప్రజాసమస్యలే ‘ఎజెండా’
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైన అధికార టీఆర్ఎస్ను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల వాగ్దానాల విస్మరణ, బడ్జెట్ అసమానతలు, అవినీతి, కరెంటు చార్జీల పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగభృతి, రైతు రుణమాఫీ, నకిలీ విత్తనాలతో రైతులకు నష్టం, అభయహస్తం, మహి ళలకు వడ్డీలేని రుణాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల మళ్లింపు, దళితబంధు వంటి అంశాలపై ప్రభుతాన్ని ప్రశ్నించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిర్ణయించారు. ఆదివారం హైదరాబాద్లోని తాజ్దక్కన్లో సీఎల్పీనేత భట్టి అధ్యక్షతన దాదాపు ఆరున్నర గంటలపాటు సీఎల్పీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు. నీళ్లు, నిధులు, నియా మకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నెరవేరని ప్రజల ఆకాంక్షల గురించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోతే ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు ఎలా తెలుస్తుందని, ఇది సభ్యుల హక్కులను హరించడమేనని అన్నారు. కొత్త రాజ్యాంగం రాయాలంటున్న కేసీఆర్ ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం లేకుండా రాజ్యాంగాన్ని చట్టవిరుద్ధంగా అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్: రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడు తూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం రద్దవుతుందని, మరో 12 నెలల్లో రాష్ట్రంలో సోనియా గాంధీ రాజ్యం వస్తుందని చెప్పారు. ప్రభు త్వ లోటుపాట్లను కాంగ్రెస్ నిలదీస్తుందనే దుర్మార్గపు ఆలోచనతోనే గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారని ఆరోపించారు. అసెంబ్లీ లో తమ పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడకుం డా అడ్డుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల వంటివి దేశంలో ఎక్కడ అమలవుతున్నాయో చూపిస్తారా.. అని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నానని, ఆయనకు 30 రోజుల సమయం ఇస్తున్నానని రేవంత్ చెప్పారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసం గం లేకపోవడంపై పార్లమెంటులోనూ ప్రస్తావిస్తానని చెప్పారు. సమన్వయం ఏదీ : సంపత్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ మాట్లాడు తూ పార్టీనేతల్లో సమన్వయం ఎక్కడుంద ని ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశం పెట్టుకు ని పీసీసీ అధ్యక్షుడు వేరే జిల్లాలకు వెళ్లడమేంటని ప్రశ్నించిన సంపత్ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్పై హత్యాయత్నం ఘటనను పార్టీ పరంగా ఉపయోగించుకోలేకపోయా మని అభిప్రాయపడ్డారు. సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి హాజ రు కాలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన నియోజకవర్గానికి వెళ్లి కూడా తనకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశంలోంచి వెళ్లిపోయారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మె ల్యే ఈరవత్రి అనిల్ కూడా పార్టీ నేతల ఐక్యతపై మాట్లాడినట్టు సమాచారం. సమావేశానికి ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, సీతక్క, పొదెం వీరయ్యలతో పాటు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్, మాజీ మంత్రి షబ్బీర్అలీ, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, నాగం జనార్దనరెడ్డి, అంజన్కుమార్యాదవ్, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు హాజరయ్యారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు: ఉత్తమ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంతో పాటు మనకు కూడా ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలందరూ హైదరాబాద్ను వదిలేసి నియోజకవర్గాలకు వెళ్లాలని, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. అయితే, రానున్న ఎన్నికల్లో తాను ఎక్కడ పోటీ చేసేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని, తాను ఎక్కడ పోటీ చేయాలన్న విషయాన్ని సోనియాగాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్ అన్నారు. -
Jagga Reddy: కాంగ్రెస్లో సింగిల్ హీరో కుదరదు..
హైదరాబాద్: కాంగ్రెస్లో సింగిల్ హీరో కుదరదు.. ఒక్కడి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది పార్టీనా లేదా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో చర్చించకుండా ముందే ప్రోగ్రాంలు ఫిక్స్ చేయడమేంటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్లో అందరూ ఒకటే.. ఒక్కరే స్టార్ అనుకుంటే కుదరదని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డికి పీసీసీ వస్తే .. నాకు సమాచారం ఇవ్వరా.. ఈ మాత్రం ప్రోటోకాల్ కూడా తెల్వదా అని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డికి , రేవంత్ రెడ్డికి విభేదాలు ఉన్నట్లు రేవంత్ పరోక్షంగా చెబుతున్నారా.. అని విమర్షించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందు.. తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాగా, సీఎల్పీ కార్యాలయంలో మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ సభాపక్షం సమావేశంకానున్న నేపథ్యంలో ప్రస్తుత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీఏల్పీ నేత భట్టి విక్రమార్క ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఇప్పటికే సీఎప్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మీడియా పాయింట్ వద్ద.. రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు.. పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా నాపై అసత్యప్రచారాలు చేస్తారా.. అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేను.. తనకు మాట్లాడటానికి అవకాశం ఎందుకు ఇవ్వలేదని గీతారెడ్డిని ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడి మేరకు ఇలా ప్రవర్తించారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ మారాలంటే నాకు అడ్డు చెప్పేవారు ఎవరని అన్నారు. కాగా, ఎథిక్స్కి కట్టుబడి.. తాను కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల నాయకత్వంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు సరైన గౌరవంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే గ్రామస్థాయిలో వెళ్లి పనిచేయాలని అన్నారు. ఈ రాష్ట్రంలో నాకు అభిమానులున్నారు. కావాలంటే పార్టీ సపోర్ట్ లేకుండా 2 లక్షల మందితో సభ పెట్టి చూపిస్తానని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. తప్పని పరిస్థితిలో మీడియా ముందు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. చదవండి: రెండోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ -
ప్రభుత్వ భూములు ఎవరూ కొనొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమ్మేందుకు తలపెట్టిన ప్రభుత్వ భూములను కొనేందుకు ఎవరూ ముందుకు రావొద్దని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఒకవేళ ఎవరైనా కొన్నా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాధీనం చేసుకుని పేదలకు ఇస్తామని చెప్పారు. ఓ వైపు ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు గత ప్రభుత్వాలు ఆస్తులుగా ఇచ్చిన ప్రభుత్వ భూములను కూడా అమ్మి రాష్ట్రాన్ని దివాళా తీయించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ భూముల అమ్మకాలపై చర్చించేందుకు ఆదివారం సీఎల్పీ అత్యవసరంగా సమావేశమైంది. జూమ్ ద్వారా వర్చువల్గా జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు డి. శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ టి. జీవన్రెడ్డి పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా ఎమ్మెల్యే పొడెం వీరయ్య హాజరు కాలేదు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, భూముల అమ్మకాలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ భూములను అమ్మి నిధులను సమీకరించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన సీఎల్పీ.. ఈ వ్యవహారంపై జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. ముందుగా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయాలని, ఆ తర్వాత అమ్మాలని తలపెట్టిన భూములను సందర్శించి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించింది. అయినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే వేలాన్ని అడ్డుకోవాలని నిర్ణయించింది. మనమే కాపాడుకోవాలి సీఎల్పీ సమావేశం అనంతరం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ ‘ఆస్తులు మనవి. రాష్ట్రం మనది. ఇక్కడి వనరులు ఇక్కడి ప్రజలకు ఉపయోగపడాలి కానీ అడ్డగోలుగా తెగనమ్ముకుంటుంటే చూస్తూ కూర్చోం. ఇక్కడి వనరులు ఇక్కడి ప్రజలకే చెందాలనే ఉద్దేశంతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల అమ్మకాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు భూములను అమ్మేందుకు యత్నిస్తున్నారు. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఒక ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం’అని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లను అప్పుగా తెచ్చిందని, ఈ భారాన్ని భరించలేని స్థితిలో ఉండగా మళ్లీ ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. అమ్మకానికి పెట్టిన భూములు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మియాపూర్ భూములు, నయీం అక్రమ భూములు ఎంత సురక్షితంగా ఉన్నాయో ప్రజలకు వివరించాలని కోరారు. నాది చిన్న పాత్ర టీపీసీసీ అధ్యక్ష ఎంపిక వ్యవహారంలో తనది చిన్న పాత్ర అని భట్టి అన్నారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. సీఎల్పీ నాయకుడిగా తన పనితీరుపై సీనియర్ నేత వీహెచ్కు సొంత అభిప్రాయం ఉండడంలో తప్పేం లేదన్నారు. ఏదిఏమైనా అందరూ కాంగ్రెస్ జెండా కింద సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయాల్సిందేనని స్పష్టంచేశారు. చదవండి: 290 కోట్ల భారీ కుంభకోణం.. 9 మంది అరెస్ట్ -
సీఎం అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు
-
‘అవసరమైతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా’
జైపూర్: రాజస్తాన్లో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. బల పరీక్ష నిరూపణ కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందిగా ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తన మద్దతుదారులతో కలిసి రాజ్భవన్ బయట ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే సమావేశాల నిర్వహణపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం సీఎం నివాసంలో మరోసారి రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. అసెంబ్లీనిర్వహణకు సంబంధించిన అజెండాపై మంత్రులు చర్చించారు. శాసనసభ సమావేశాలు జరపాలని గవర్నర్కు కేబినెట్ విజ్ఞప్తి చేసింది. అంతకుముందు జైపూర్ ఫైర్మౌంట్ హోటల్లో సీఎల్పీ భేటీ నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉండాలని గహ్లోత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అవసరమైతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నాకు సిద్ధమన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడంలో బీజేపీ సక్సెస్ అయితే.. తాము ప్రధాని కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని.. ధైర్యంగా ఉండాలని శాసనసభ్యులకు తెలిపారు. 3 వారాలపాటు క్యాంప్లో ఉండాల్సి రావచ్చని అన్నారు. గవర్నర్తో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ భేటీ రెండోసారి వాయిదాపడింది. (రాజస్తాన్ సంక్షోభం : గెహ్లాత్కు చుక్కెదురు) -
‘మీ పోరాటాన్ని యావత్ భారత్ గమనిస్తోంది’
జైపూర్/ఢిల్లీ: ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేలు పోరాడుతున్న తీరును యావత్ భారత్ గమనిస్తోందని చెప్పారు. తన ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మంగళవారం మరోసారి కాంగ్రెస్ శాసన సభా పక్ష (సీఎల్పీ) భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సత్యమే దైవం, దైవమే సత్యం. సత్యం మనతో ఉంది. అసమ్మతి వాదుల కుట్రల నుంచి ప్రభుత్వాన్ని, దాంతోపాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మీరు చేస్తున్న పోరాటాన్ని దేశ ప్రజలందరూ గౌరవిస్తున్నారు. మనమంతా సర్వశక్తిమంతంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. ‘మీపై ఉన్నగౌరవం ఎన్నో రెట్లు పెరిగింది. ఇది సాదారణ విషయం కాదు. అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ కోరుకోలేదు. కొందరి కుట్రల వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయి. అయినప్పటికీ పోరాడి విజయం సాధిద్దాం’ అని అన్నారు. ఇదిలాఉండగా.. హోటల్లో తమను నిర్బంధిచారని భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యే ఒకరు వారం క్రితం చెప్పడంతో గహ్లోత్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, బీటీపీ తర్వాత గహ్లోత్ ప్రభుత్వానికి స్పష్టమైన మద్దతు ప్రకటించడంతో ఆ విషయం అంతటితో ముగిసిపోయింది. ఈనేపథ్యంలోనే గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు అంత్యాక్షరీ ఆడినవి, యోగా ఫొటోలు, వంటలు నేర్చుకుంటున్న వీడియోలను విడుదల చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలు కరోనా వైరస్తో పోరాడుతుంటే సీఎం, ఎమ్మెల్యేలు పార్టీలు చేసుకుంటున్నారని బీజేపీ విమర్శలు చేస్తోంది. ఇక అసమ్మతి ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్ స్పీకర్ను నేడు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వచ్చే శుక్రవారం (జులై 24) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. (చదవండి: రాజస్తాన్: సచిన్ పైలట్కు హైకోర్టులో ఊరట) (అసమర్థుడు.. పనికిరాని వాడు! ) -
వీడని ఉత్కంఠ..
-
రాజస్తాన్: సచిన్ పైలట్ కీలక డిమాండ్
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్లో రాజకీయ ఉత్కంఠ వీడటం లేదు. అధిష్టానం విశ్వప్రయత్నాలు చేసినా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ పంతం వదలడం లేదు. మంగళవారం ఉదయం జరిగిన రెండో దఫా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) భేటీకీ సచిన్ పైలట్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలో పనిచేయలేమని, సీఎం పదవి మార్పు జరగాల్సిందేనని సచిన్ పైలట్ కీలక డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇక సీఎం అశోక్ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు బస చేస్తున్న జైపూర్లోని ఫైర్మంట్ హోటల్లోనే నేడు మరోసారి సీఎల్పీ సమావేశం జరిగింది. (చదవండి: ఎమ్మెల్యేల బలం చూపిస్తూ సచిన్ వీడియో!) అయితే, సీఎం క్యాంపులో 109 మంది ఎమ్మెల్యేలు లేరని, వారిలో 22 మంది మిస్సింగ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే అశోక్ గహ్లోత్ వెంట 87 మంది మాత్రమే ఉన్నారని పైలట్ వర్గం నేతలు చెప్తున్నారు. గహ్లోత్ ప్రభుత్వంలో మైనారిటీలో ఉందని అంటున్నారు. అశోక్ గహ్లోత్కు బానిసత్వం చేయలేమని, సీఎంగా ఆయన తప్ప వేరేవరైనా సరేనని సచిన్ పైలట్ వర్గం నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇక ఆదివారం నాటి వాట్సాప్ మెసేజ్లో 30 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని చెప్పిన పైలట్ సోమవారం రాత్రి ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. గురుగ్రామ్లోని మానెసర్ హోటల్లో ఉన్న పైలట్ టీమ్లో దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు కనిపించారు. (గహ్లోత్ గట్టెక్కినట్టే!) -
ఎమ్మెల్యేల బలం చూపిస్తూ సచిన్ వీడియో!
-
ఎమ్మెల్యేల బలం చూపిస్తూ సచిన్ వీడియో!
జైపూర్/ఢిల్లీ: అగ్రనేతల బుజ్జగింపులతో సచిన్ పైలట్ మెత్తబడ్డాడనే వార్తల్లో నిజమెంతో గానీ, అతని వెంట మాత్రం 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈమేరకు సచిన్ పైలట్ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి విడుదలైన వీడియో ద్వారా స్పష్టమవుతోంది. సోమవారం రాత్రి ఉన్న పైలట్ వర్గం గురుగ్రామ్లోని మానెసర్ హోటల్లో తమ క్యాంపు వీడియోను ట్విటర్లో పోస్టు చేసింది. 10 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో 16 మంది ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేల్లో ఇంద్రా గుర్జార్, ముఖేష్ భాకర్, హరీష్ మీనా, పీఆర్ మీనాను గుర్తించొచ్చు. అయితే, సచిన్ వీడియోలో కనిపించలేదు. టూరిజం మినిస్టర్ విశ్వేంద్ర సింగ్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఫ్యామిలీ అని క్యాప్షన్ పెట్టారు. లాదూన్ ఎమ్మెల్యే ముఖేష్ భాకర్ ట్వీట్ చేస్తూ.. ‘కాంగ్రెస్లో విధేయత అంటే అశోక్ గహ్లోత్ బానిసత్వంఅన్ని అన్నారు. అది మాకు ఆమోదయోగ్యం కాదు’అని పేర్కొన్నారు. ఇక సోమవారం మధ్యాహ్నం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) భేటీకి సచిన్ పైలట్ వర్గం హాజరుకాని సంగతి తెలిసిందే. మరోవైపు సీఎల్పీ భేటీలో 106 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని కాంగ్రెస్ ప్రకటించగా.. దానిని పైలట్ వర్గం నేతలు తప్పుబట్టారు. మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకోవాలని, ఇంట్లో కాదని వ్యాఖ్యానించారు. అలాగే, పైలట్ బీజేపీలో చేరబోవడం లేదని వారు స్పష్టం చేశారు. 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే.. ఎమ్మెల్యేలను గవర్నర్ వద్దకు తీసుకువెళ్లాలి కానీ, రిసార్ట్కు కాదని పైలట్ వర్గం నేతలు ఎద్దేవా చేశారు. (చదవండి: గహ్లోత్ గట్టెక్కినట్టే!) నేడు మళ్లీ సీఎల్పీ.. సచిన్కు ఆహ్వానం కాంగ్రెస్ శాసనసభాపక్షం నేడు మరోసారి భేటీ కానుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్లోనే ఆ సమావేశం జరుగుతుందని సీనియర్నేత సూర్జెవాలా వెల్లడించారు. ఆ భేటీకి రావాలని, అన్ని అంశాలపై అక్కడ స్వేచ్ఛగా చర్చించుకోవచ్చని తిరుగుబాటు నేత సచిన్ పైలట్కు సూచించారు. భేటీకి ఆహ్వానిస్తూ పైలట్కు, అసంతృప్త ఎమ్మెల్యేలకు లేఖలు పంపించామన్నారు. -
గహ్లోత్ గట్టెక్కినట్టే!
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజకీయ సంక్షోభాన్ని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తట్టుకుని నిలిచినట్లే కనిపిస్తోంది. సోమవారం వేగంగా జరిగిన పరిణామాల్లో... గహ్లోత్ వెనక చాలినంత మంది ఎమ్మెల్యేలుండటం... సచిన్ పైలట్కు బాసటనిచ్చిన వారి సంఖ్య పలచనైపోవటం వంటివి కనిపించాయి. దీంతో అశోక్ గహ్లోత్ కాసింత కులాసాగా కనిపించారు. సీఎల్పీ సమావేశానంతరం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలిస్తూ విజయ చిహ్నాన్ని కూడా చూపించారు. మరోవంక.. తిరుగుబాటు బావుటా ఎగరేసిన పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా మెత్తబడ్డారని సమాచారం. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పైలట్తో చర్చించారని... గహ్లోత్పై ఫిర్యాదులేమైనా ఉంటే.. సానుకూలంగా పరిష్కరిస్తామని ఆయనకు హామీ ఇచ్చారని సమాచారం. సీనియర్ నేతలు చిదంబరం, అహ్మద్ పటేల్, కేసీ వేణు గోపాల్ కూడా పైలట్తో మాట్లాడటంతో ఆయన కాస్త మెత్తబడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎల్పీ భేటీకి 106 మంది? రాజస్తాన్లో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించి స్టేట్మెంట్ కావాలంటూ రాజస్తాన్ పోలీస్ విభాగం తనకు నోటీసులివ్వటంతో పైలట్ ఆగ్రహం చెంది సీఎం గహ్లోత్పై తిరుగుబాటు చేయడం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో తన వెంట 30 మంది ఎమ్మెల్యేలున్నారని కూడా ప్రకటించారాయన. ఈ నేపథ్యంలో ఉదయం జైపూర్లో కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) భేటీ అయింది. దీనికి ఎందరు హాజరయ్యారన్నది స్పష్టంగా తెలియకపోయినా... 106 మంది వరకూ వచ్చినట్లు సీఎల్పీ ప్రకటించింది. అంటే ఒక్క సచిన్ పైలట్ మినహా అందరూ తమతోనే ఉన్నారనే సంకేతాలిచ్చే ప్రయత్నం చేసింది. అయితే దీనికి హాజరైన వారిలో కాంగ్రెస్ సభ్యులే కాక సర్కారుకు మద్దతిస్తున్న ఇతర పార్టీల వారూ ఉన్నట్లు సీఎల్పీ వర్గాలు చెప్పాయి. మొత్తానికి ఈ భేటీకి హాజరైన ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి గహ్లోత్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక ప్రభుత్వాన్ని, పార్టీని బలహీన పర్చేందుకు ప్రయత్నించే సీఎల్పీ సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. పైలట్ పేరును ప్రస్తావించకుండా.. ఓ తీర్మానాన్ని సైతం ఆమోదించారు. ‘సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై సీఎల్పీ సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తోంది. ముఖ్యమంత్రిగా గహ్లోత్ నాయకత్వాన్ని ఏకగ్రీవంగా సమర్ధిస్తోంది’అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ బీజేపీపై ఆ తీర్మానంలో ధ్వజమెత్తారు. అనంతరం, ఎమ్మెల్యేలను అక్కడి నుంచి నేరుగా జైపూర్ దగ్గర్లోని ఫెయిర్మాంట్ రిసార్ట్కు తరలించారు. వారితో పాటు సీఎం గహ్లోత్ కూడా అక్కడికి వెళ్లారు. తన ప్రభుత్వానికి ఢోకా లేదని, మెజారిటీ ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నారని ఈ సందర్భంగా గహ్లోత్ చెప్పారు. విశ్వాసం కోల్పోయింది రాజస్తాన్లో అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని, ఆ పార్టీ ఇక అధికారంలో కొనసాగకూడదని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సచిన్ పైలట్కు బయటి నుంచి మద్దతు ఇస్తారా? అని రాజస్తాన్ బీజేపీ చీఫ్ సతీశ్ పూనియాను ప్రశ్నించగా.. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని, స్థానిక పరిస్థితులను బేరీజు వేస్తూ.. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్లో సమర్ధులైన యువ నాయకులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తుంటారని వ్యాఖ్యానించారు. మెజారిటీని చూపాల్సింది అసెంబ్లీలో.. ఇంట్లో కాదు! సీఎల్పీ భేటీ నిర్వహించి, మెజారిటీ సభ్యుల మద్దతుందని సీఎం గహ్లోత్ పేర్కొనడంపై పైలట్ వర్గం స్పందించింది. మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకోవాలని, ఇంట్లో కాదని వ్యాఖ్యానించింది. అలాగే, పైలట్ బీజేపీలో చేరబోవడం లేదని స్పష్టం చేసింది. 106 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్ వర్గ నేతలు చెప్పడాన్ని పైలట్కు సన్నిహితులైన పార్టీ నేతలు తప్పుబట్టారు. మెజారిటీ ఉంటే.. ఎమ్మెల్యేలను గవర్నర్ వద్దకు తీసుకువెళ్లాలి కానీ, రిసార్ట్కు కాదని ఎద్దేవా చేశారు. నేడు మళ్లీ సీఎల్పీ కాంగ్రెస్ శాసనసభాపక్షం నేడు మరోసారి భేటీ కానుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్లోనే ఆ సమావేశం జరుగుతుందని సీనియర్నేత సూర్జెవాలా వెల్లడించారు. ఆ భేటీకి రావాలని, అన్ని అంశాలపై అక్కడ స్వేచ్ఛగా చర్చించుకోవచ్చని తిరుగుబాటు నేత సచిన్ పైలట్కు సూచించారు. భేటీకి ఆహ్వానిస్తూ పైలట్కు, అసంతృప్త ఎమ్మెల్యేలకు లేఖలు పంపించామన్నారు. పైలట్ వెనుక ఎందరు? 200 మంది సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సొంత బలం 107. స్వతంత్రులు 13 మంది, సీపీఎం–2 కలిపితే ఇప్పటిదాకా 122 మంది మద్దతుంది. 72 మంది సభ్యులున్న బీజేపీకి ఆరెల్పీ, ఆరెల్డీ నుంచి నలుగురి మద్దతుంది. ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నారు. సోమవారం నాటి సమావేశానికి సచిన్ పైలట్తో పాటు ఆయనకు సన్నిహితులైన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. అయితే వీరి సంఖ్య 10 కూడా ఉండదని, కాబట్టి గహ్లోత్ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని సీఎల్పీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు జైపూర్లో సీఎల్పీ భేటీకి కొన్ని గంటల ముందు కాంగ్రెస్ నేతలు రాజీవ్ అరోరా, ధర్మేంద్ర రాథోడ్లకు సంబంధమున్న పలు వాణిజ్య సంస్థలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. జైపూర్, ఢిల్లీ, ముంబై, కోట నగరాల్లోని ఆయా సంస్థల కార్యాలయాల్లో పన్ను ఎగవేత కేసులకు సంబంధించి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జైపూర్లోని ఆమ్రపాలి జ్యువెలర్స్ షోరూమ్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సంస్థ రాజస్తాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజీవ్ అరోరాకు చెందినదిగా తెలుస్తోంది. ఇదంతా బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ ఆరోపించింది. ఐటీ, ఈడీ, సీబీఐ బీజేపీ అనుబంధ విభాగాలుగా మారాయని రణ్దీప్ సూర్జేవాలా విమర్శించారు. -
రాజస్తాన్: సీఎల్పీ భేటీకి ఎమ్మెల్యేలు
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్లో రాజకీయం రసకందాయంలో పడింది. జైపూర్లో జరిగే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) భేటీలో పాల్గొనేది లేదని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మాటలు అబద్ధమని అన్నారు. తన వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. గహ్లోత్కు 102 ఎమ్మెల్యేల మద్దతు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గహ్లోత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని సచిన్ వెల్లడించారు. అంతకుముందు సీఎల్పీ భేటీలో పాల్గొనేందుకు 102 మంది ఎమ్మెల్యేలు సీఎం అశోక్ గహ్లోత్ నివాసానికి చేరుకున్నారని కాంగ్రెస్ తెలిపింది. రాజస్తాన్లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి కాలం పాలన సాగిస్తుందని ఆకాక్షించారు. కాషాయదళం ఎత్తులు సాగనీయమని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో విభేదాలు తలెత్తితో అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాలని సుర్జేవాలా సూచించారు. సచిన్ పైలట్కు కాంగ్రెస్లో ఇప్పటికీ ద్వారాలు తెరిచే ఉన్నాయని, ఆయన వెనక్కి తిరిగి రావాలని కోరారు. కాగా, తొలుత సోమవారం ఉదయం 10.30 గంటలకు అనుకున్న సీఎల్పీ భేటీని మధ్యాహ్నానానికి వాయిదా వేశారు. కాగా, 200 మంది సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు మద్దతిస్తున్నారు. అయితే, సీఎల్పీ భేటీ అనంతరం రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. (చదవండి: ‘సచిన్ పైలట్ కార్యాలయం మూసివేత) -
దిశ వంటి ఘటనలకు ప్రధాన కారణం అదే
సాక్షి, హైదరాబాద్: రోజుకు ఇద్దరు అమ్మాయిల చొప్పున అదృశ్యమవుతున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హైదరాబాద్లో రెండేళ్లలో 4 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, ఆర్టీసీ టికెట్ల పెంపు తదితర అంశాలపై భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ గురువారం ప్రత్యేకంగా సమావేశమయింది. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘దిశ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితులకు ఉరిశిక్ష పడాలి. అసిఫాబాద్, వరంగల్ ఘటనలు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ప్రధాన కారణం అదే.. ‘వీటికి ప్రధాన కారణం మద్యం. వీటిని విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులు, హైవేలపై మద్యం అమ్మకాలు నేరస్థులకు తోడ్పడుతున్నాయి. నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వం ఆదాయం వస్తే చాలు అన్న రీతిలో నడుచుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు నియంత్రణలో ఉండాలి. బెల్ట్షాపులు, పర్మిట్ రూమ్లను మూసేయాలి. ఏదైనా స్టేషన్లో ఎవరైనా కేసు పెట్టాలన్నా, ఎత్తివేయాలన్నా టీఆర్ఎస్ నాయకుల నుంచే ఆదేశాలు వస్తున్నాయి. పోలీసు యంత్రాంగం ఉన్నది టీఆర్ఎస్ నాయకుల కోసం కాదు.. ప్రజల కోసం’ అని విక్రమార్క మండిపడ్డారు. ఆర్టీసీ టికెట్ల చార్జీల పెంపుపైనా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలపై రూ. 1000 కోట్ల భారం వేయడం చూస్తుంటే ఆయన చెప్పేదాంట్లో ఏది నిజమో అర్థం కావడం లేదని ఎద్దేవా భట్టి విక్రమార్క చేశారు. -
‘విద్యుత్ వినియోగానికి భయపడే కాళేశ్వరం..’
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఆర్భాటాలు చేయడం తప్ప అక్కడ జరుగుతున్నది ఏమీ లేదని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై టీఆర్ఎస్ పార్టీ తీరును విమర్శించారు. కాళేశ్వరం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందని టీఆర్ఎస్ చెబుతుండటం హాస్యాస్పదమని, విద్యుత్ వినియోగానికి భయపడే ప్రభుత్వం నీటిని ఎత్తివేయలోక పోతుందని అన్నారు. ఇప్పటి వరకు 45 టీఎమ్సీల నీటిని ఎగువకు పంపే అవకాశం ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘కాళేశ్వరం నుంచి బొట్టు నీరు కూడా వినియోగంలోకి రాలేదు. ఎగువకు తరలించేందుకు నీరు అందుబాటులో ఉన్నా నీరంతా వృధాగా కిందకు వదులుతున్నారు. ఇది ఎవరి అవగాహనా రాహిత్యం. ఎంత నీరు అందుబాటులో ఉందో అంత నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వ శ్రద్ధ కొరవడినందువల్లే ఉపయోగించుకోలేకపోతున్నారు. పైనుంచి ఆదేశాలు లేకనే తాము ఏమీ చేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నీటిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని’ జీవన్రెడ్డి సూచించారు. (చదవండి : ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేదు) -
ఎంఐఎంను ప్రతిపక్షంగా ఎలా గుర్తిస్తారు ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వార్షిక బడ్జెట్పై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని సీఎల్పీ నిర్ణయించింది. సోమవారం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. బడ్జెట్, యురియ, ప్రజారోగ్యం, ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్, నిరుద్యోగ భృతి, ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వ తీరును పలువురు నేతలు ప్రస్తావించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం, ఎరువుల కొరతపై రాష్ట్ర్ర ప్రభుత్వాన్నిఎండగట్టాలని సీఎల్పీ నిర్ణయించింది. అనంతరం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎంఐఎంను ప్రతిపక్ష పార్టీగా ఎలా గుర్తిస్తారంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీలు అని చెప్పారు కదా..ప్రెండ్లీ పార్టీలు అధికార, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయా అని ప్రశ్నలు సంధించారు. ఈ అంశంపై స్పీకర్కు లేఖ రాయాలని సీఎల్పీ నిర్ణయించింది. -
‘కేసీఆర్ క్రీడ జుగుప్సాకరంగా ఉంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సీఎం కేసీఆర్ రాజకీయ క్రీడా జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోని తీసుకోవడాన్ని నిరశిస్తూ అసెంబ్లీ ముందు చేపట్టిన ధర్నా ముగింపు సందర్భంగా భట్టి మాట్లాడారు. డబ్బులు చెల్లించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం టీఆర్ఎస్ వికృత చర్యగా ఆయన వర్ణించారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని గిరిజనులను, ఆదివాసీలను మళ్లీ టీఆర్ఎస్ రాక్షస పాలనకు గురిచేస్తున్నారని భట్టి విమర్శించారు. -
సీఎల్పీ భేటీకి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా..
సాక్షి, హైదరాబాద్ : సీఎల్పీ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతున్న ఈ సమావేశానికి 15మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కాగా, ఉపేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి గైర్హాజరు అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భేటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, గండ్ర వెంకట రమణారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, జగ్గారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, సురేందర్, పొడెం వీరయ్య, హరిప్రియ నాయక్, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు హాజరు అయ్యారు. చదవండి...(కాంగ్రెస్కు ఝలక్.. టీఆర్ఎస్లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు) ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రేగా కాంతారావు (పినపాక) టీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో వీరిద్దరూ ఆదివారం గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు రేగా, ఆత్రం బాటలోనే మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరనున్నారని టీఆర్ఎస్ వర్గాల వ్యాఖ్యల నేపథ్యంలో ఉపేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సీఎల్పీ సమావేశానికి రాకపోవడంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఉపేందర్ రెడ్డి అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నా... ఇక రోహిత్ రెడ్డి గైర్హాజరుపై సమాచారం లేదు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకునే దిశగా టీఆర్ఎస్ దూకుడు పెంచిన విషయం విదితమే. విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. ఐదు ఎమ్మెల్సీ సీట్లు, 16 లోక్సభ స్థానాలు దక్కించుకునే ద్విముఖ వ్యూహాన్ని అమలుపరుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు, తెలంగాణ టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ’కారు’ ఎక్కుతున్నారు. దీంతో.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోని వలసలు భారీగానే ఉన్నాయనే చర్చ మొదలైంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి కాంగ్రెస్ శాసనసభపక్షం మొత్తం టీఆర్ఎస్లో విలీనమైనా ఆశ్చర్యపోవద్దని అధికార పార్టీ ముఖ్యనేతలు అంటున్నారు. -
కర్ణాటక హైడ్రామా : రిసార్ట్స్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-
రసవత్తరంగా కర్ణాటక రాజకీయాలు
-
రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్లో మరో సారి రిసార్టు రాజకీయాలకు తెరలేచింది. ‘ఆపరేషన్ కమల’ వార్తల నేపథ్యంలో బీజేపీ ప్రలోభాల నుంచి తప్పించుకునేందుకు శుక్రవారం తమ ఎమ్మెల్యేల్ని బెంగళూరు దగ్గర్లోని ఈగల్టన్ రిసార్టుకు తరలించింది. గత మేలో అసెంబ్లీ ఎన్నికలయ్యాక తమ సభ్యుల్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఇదే రిసార్టులో ఉంచింది. తాజాగా శుక్రవారం బెంగళూరులో సీఎల్పీ భేటీ ముగిసిన వెంటనే విధానసౌధ నుంచి రెండు బస్సుల్లో వారిని మళ్లీ అదే రిసార్టుకు తరలించింది. ఎమ్మెల్యేలు రిసార్టులో ఉన్నంత కాలం రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితి, లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తారని కాంగ్రెస్ పక్ష నేత సిద్దరామయ్య తెలిపారు. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం నేడో రేపో కూలిపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు వస్తాయేమోనన్న భయంతోనే మోదీ, అమిత్ షా కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్–జేడీఎస్ల ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని పునరుద్ఘాటించారు. తమ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల నుంచి రూ .70 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కోల్కతాలో ప్రధాని మోదీని ప్రశ్నించారు. మరోవైపు, వారం రోజులుగా గురుగ్రామ్లోని రిసార్టులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం బెంగళూరు రానున్నారు. సీఎల్పీ భేటీకి నలుగురు డుమ్మా.. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. తమ ఎమ్మెల్యేలు తమ వద్దే ఉన్నారని చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి నలుగురు సభ్యులు రాలేదు. 80 మంది ఎమ్మెల్యేల్లో 76 మంది వచ్చారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు వ్యక్తిగత కారణాల రీత్యా సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు ముందస్తుగానే పార్టీ పెద్దలకు సమాచారమిచ్చారు. అనారోగ్య కారణాలతో గైర్హాజరవుతున్నట్లు చించోలి ఎమ్మెల్యే ఉమేశ్జాధవ్..సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్యకు ఫ్యాక్స్ చేశారు. కోర్టు పని వల్ల సీఎల్పీ భేటీకి హాజరు కాలేకపోతున్నట్లు బళ్లారి(గ్రామీణ) ఎమ్మెల్యే నాగేంద్ర.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్కు తెలియజేశారు. అయితే గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జారకిహోళి, అథని ఎమ్మెల్యే మహేశ్ కుమటెళ్లి గురించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు. రమేశ్ జారకిహోళి తమ పార్టీకి మద్దతిస్తున్నట్లు బీజేపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ప్రస్తుతం బీజేపీకి 106 సభ్యుల మద్దతుండగా, ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నాక కాంగ్రెస్–జేడీఎస్ కూటమి సంఖ్యాబలం 116కు తగ్గిపోయింది. -
కర్ణాటక హైడ్రామా : రిసార్ట్స్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక రాజకీయ పరిణామాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ శుక్రవారం నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి నలుగురు ఎమ్మల్యేలు గైర్హాజరు కావడంతో ఎమ్మెల్యేలందరినీ బెంగళూర్లోని రిసార్ట్స్కు తరలించారు. సీఎల్పీ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు రమేష్ జర్కోలి, బీ నాగేంద్ర, మహేష్ కే, ఉమేష్ జాదవ్లు హాజరు కాలేదు. తాను అనారోగ్య కారణాలతో సమావేశానికి హాజరు కాలేనని జాదవ్ పార్టీ నేత సిద్ధరామయ్యకు లేఖ రాశారు. సీఎల్పీ భేటీకి 80 మంది ఎమ్మెల్యేలకు గాను 76 మంది హాజరయ్యారని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. గైర్హాజరైన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి హైకమాండ్ సూచలనకు అనుగుణంగా చర్యలు చేపడతామని చెప్పారు. సీఎల్పీ భేటీ అనంతరం సమావేశానికి హాజరైన 76 మందిని ప్రత్యేక బస్సుల్లో నగర శివార్లలోని ఈగల్టన్ గోల్ఫ్ రిసార్ట్స్కు తరలించారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ను అస్ధిరపరిచేందుకు బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తోందని సిద్ధరామయ్య ఆరోపించారు. -
కర్ణాటకలో తప్పనున్న రాజకీయ సంక్షోభం
-
సీఎల్పీ లీడర్ను రాహుల్ నిర్ణయిస్తారా..?!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత (సీఎల్పీ) ఎన్నిక సమావేశం గాంధీభవన్లో హాట్హాట్ మొదలైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశమయ్యింది. శాసనసభ పక్ష నేతగా ఎవరిని నియమించాలనే నిర్ణయాధికారాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ ప్రక్రియకు అధిష్టానం తరఫున పరిశీలకుడిగా నియమితుడైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు చేరుకుని.. సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియపై కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని ఏఐసీసీకి అందించారు. వాటి ఆధారంగా సీఎల్పీ నేతను అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఇవాళే పూర్తవుతుందని, సాయంత్రానికల్లా సీఎల్పీ నేతను ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలతో పాటు టీకాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియా సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, సీఎల్పీ నేతగా భట్టివిక్రమార్క పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు కూడా రేసులో ఉన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పేరును పార్టీలోని కొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. సీఎల్పీ లీడర్ పదవి తనకే కావాలంటూ పలువురు పట్టుబట్టడంతో గురువారం ఉదయం ప్రారంభమైన సీఎల్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది. పాత నాయకత్వాన్ని పూర్తిగా బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి అవకాశమివ్వాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. సీఎల్పీ నేతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించాలని అన్నారు. అయితే, సీనియర్ నాయకుడిని అయినందున సీఎల్పీ లీడర్గా తనకే అవకాశమివ్వాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి డిమాండ్ చేశారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని అన్నారు. గత డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
‘కేసీఆర్ వైఖరిపై మళ్లీ కోర్టు కెళతాం’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసినా, వారి సభ్యత్వాలు పునరుద్ధరించడం లేదని ఆయన మండిపడ్డారు. సీఎల్పీ నాయకుడు, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి నివాసంలో శుక్రవారం జరిగిన సీఎల్పీ భేటీ అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్పై కోర్టు ధిక్కరణ కింద మళ్లీ కోర్టుకు వెళతామని ప్రకటించారు. కోర్టు తీర్పుని గౌరవించని కేసీఆర్కు సీఎం పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. ప్రభుత్వ నియంతృత్వ వైఖరిపై మొదటగా గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ నెల 11న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలుస్తామని వెల్లడించారు. రాష్ట్రపతిని కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను వివరిస్తామని తెలిపారు. -
కేసీఆర్ రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నారు
-
అది కోమటిరెడ్డి, సంపత్ల ప్రచారం: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కమార్ శానససభా సభ్యత్వాల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ సరిగా స్పందించలేదన్న వాదనను సీఎల్పీ నేత కె. జానారెరెడ్డి తోసిపుచ్చారు. ఈ అంశంలో చేయాల్సిందంతా చేశామని చెప్పుకొచ్చారు. తన నివాసంలో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష అత్యవసర సమావేశంలో రాష్ట్రంలో సంభవించిన అకాల వర్షాలు, పంట నష్టం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సమావేశానంతరం జానారెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో తాజా పరిణామాలు, అకాల వర్షాలపై సమావేశంలో చర్చించాం. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్లను మేము పట్టించుకోవటం లేదన్నది అసత్యం. వారి కోసం అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేశాం. అదే సమయంలో ప్లీనరీకి వెళ్ళాం. ఆ ఇద్దరు కూడా ప్లీనరీకి వచ్చారు కదా. ఇంకా ఏంచేయాల్సి ఉందో చెప్పండి. అభిషేక్ సింఘ్విని హైకోర్టుకి పిలిచింది పార్టీనే. ఆయనతో మాట్లాడింది కూడా నేనే. ప్లీనరీ కంటే ముందే రాహుల్ గాంధీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాం. లా కమిటీ సభ్యుడితో కూడా మాట్లాడి సలహాలు తీసుకున్నాం. అభిషేక్ సింఘ్వితో మాట్లాడిన అంశాన్ని సంపత్, కోమటిరెడ్డికి కూడా వివరించా. రాహుల్ గాంధీ కూడా సింఘ్విని పిలిచి ఎమ్మెల్యేల కేసును చూడమని చెప్పారు. పార్టీ పట్టించుకోవటం లేదని సంపత్, కోమటిరెడ్డిలు చేసుకునే ప్రచారం మాత్రమే. వాళ్ళ వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకుంటాం.. అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం. ఫిరాయింపుదారులు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటేశారని సుప్రీంకోర్టులో సాక్ష్యంగా ఇస్తాం. కాంగ్రెస్కు 10 ఓట్లే ఉన్నాయని మాకు తెలుసు. గెలుస్తామని పోటీ పెట్టలేదు. పార్టీలో మార్పులు, చేర్పులు గురించి నాకు తెలియదు. తెలంగాణలో ఎన్నికలకు ఏడాది సమయం ఉంది.. పార్టీ కార్యాచరణ మరింత వేగం పెరుగుతుంది. ఎన్నికల నాటికి పార్టీ కార్యక్రమాలు ఉదృతం అవుతాయని నమ్ముతున్నా. తెలంగాణ రాష్ట్రం ఆరు నెలల ముందే ఇచ్చి ఎన్నికలకు పోతే బాగుండేది అని భావన ఉంది. కానీ కేంద్రంలో 25 మంది ఎంపీలు బయటకు పోతే.. ప్రభుత్వమే పడిపోయేది. అపుడు తెలంగాణ రాకుండా పోయేదన్న చర్చ కూడా ఉంది. రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ చేసింది కరెక్టు. పార్టీ అధికారంలోకి రావాలని అందరం ప్రయత్నం చేస్తున్నాం. కొన్నిసార్లు టీమ్ లీడర్ సెంచరీ కొట్టినా మ్యాచ్ గెలవరు. కానీ లీడర్ 10 పరుగులు చేసినా ఒక్కొక్కసారి టీమ్ గెలుస్తుంది. మా స్పిరిట్ కూడా అంతే. ఎవరి స్థాయిలో వారు పని చేస్తున్నారు. జానారెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనే వారున్నారు. నా కంటే ఎక్కువ అర్హత ఉంది అని ఎవరన్నా అనుకుంటే అందరూ ఒప్పుకోరు. మా అబ్బాయి ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలు సీరియస్గా కాంగ్రెస్ గురించి ఆలోచించాలి. కర్ణాటకలో మళ్లీ మా పార్టీయే గెలుస్తుంద’ని జానారెడ్డి పేర్కొన్నారు. -
ప్రజల్లో తిరుగలేకపోతున్నా: సంపత్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో శనివారం సీఎల్పీ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టివిక్రమార్క, సంపత్కుమార్, జీవన్రెడ్డి, పద్మావతి, వంశీచంద్రెడ్డి, ఆకుల లలిత తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు ఎమ్యెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాలో ఉన్నందున ఈ సమావేశానికి హాజరుకాలేదు. సంపత్ అసహనం ఈరోజు జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా శాసనసభాపక్షం సరిగా స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని సంపత్ ఆవేదన చెందారని సమాచారం. సీఎల్పీ తీరు వల్ల ప్రజల్లో తిరుగలేక పోతున్నట్లు సహచర సభ్యుల వద్ద ఆయన వాపోయారని చెబుతున్నారు. కనీసం గన్మెన్ల పునరుద్ధరణపై డీజీపీని కూడా కలవలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో స్పీకర్, డీజీపీ, చీఫ్ సెక్రటరీలను కలిసి కోర్టు తీర్పు కాపీని త్వరలో అందజేయాలని సీఎల్పీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎల్పీ సమావేశం ఇంతవరకూ ఇళ్లలో జరగలేదంటూ కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ దాటరని విమర్శించే తాము ఇంట్లో సీఎల్పీ సమావేశాలు జరపడమేంటని కొందరు నేతలు ప్రశ్నించారట. ఇదే అంశాన్ని పలువురు జానారెడ్డితో నేరుగా చెప్పినట్టు తెలుస్తోంది. -
గౌరవ పెద్దలే నష్టం చేస్తే ఎలా?
• సీఎల్పీ భేటీలో జానారెడ్డిని నిలదీసిన ఎమ్మెల్యేలు, నేతలు • ఆ మాటలే తమపై ఆయుధాలవుతున్నాయని ఆవేదన • ఆఫ్ ద రికార్డుగా చెప్పిన అంశాలను మీడియా వక్రీకరించిందన్న జానా • భవిష్యత్తులో ఒకేమాటపై ఉందామని సూచన • టీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా పోరాడాలని భేటీలో నిర్ణయం • సభను కనీసం 15 రోజులు నడపాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి వ్యవహారశైలి పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్యాంగ్స్టర్ నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదనడం, తమ్మిడిహెట్టి ఎత్తు విషయంలో మహారాష్ట్రతో గతంలో ఒప్పందం జరగలేదనడం వంటి వ్యాఖ్యలు చేయడంపై సీఎల్పీ భేటీలో ఆయనను నిల దీశారు. శాసనసభ సమావేశాల్లో అనుసరిం చాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం సీఎల్పీ సమావేశమైంది. శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీ ర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే.. సీనియర్ ఎమ్మెల్యేలు జి.చిన్నారెడ్డి, టి.జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు పి.సుధాకర్రెడ్డి, ఎం.రంగారెడ్డి తదితరులు సమావేశం మొదలుకావడంతోనే జానారెడ్డిని నిలదీశారు. ‘‘సీనియర్గా మీరంటే మా అందరికీ గౌరవమే. కష్టకాలంలో పార్టీని ఐక్యంగా నడిపించాల్సిన బాధ్యత మీపై ఉంది. మహారాష్ట్రతో ఒప్పందం జరగలేదని, నయీమ్ ఎన్కౌంటర్ విషయంలో సీబీఐ విచారణ అవసరం లేదంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నామని మరిచిపోయినట్టుగా, అధికార పక్షానికి అనుకూలంగా మాట్లాడారు. ప్రభుత్వంపై, టీఆర్ఎస్పై పోరాడుతున్నవారికి మీ తీరు వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. మీరు (జానారెడ్డి) మాట్లాడిన మాటలనే ఆయుధంగా చేసుకుని.. టీఆర్ఎస్ నేతలు మాపై దాడికి దిగుతున్నారు. పార్టీ నేతలే పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది..’’ అని పేర్కొన్నారు. దీనిపై జానారెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. నయీం వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలని పార్టీ నిర్ణయించినట్టుగా తనకు తెలియదని ఆయన చెప్పారు. హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా సిట్పై అనుమానాలను వ్యక్తం చేయలేకపోయాననే తప్ప పార్టీకి నష్టం చేయాలనే ఉద్దేశం లేదన్నారు. ఆఫ్ ది రికార్డుగా మాట్లాడిన వాటిని, వక్రీకరించి మీడియాలో వచ్చిందని వివరించారు. భవిష్యత్తులో ముఖ్యమైన అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని, స్పష్టమైన వైఖరితో ఉందామని... అంతా ఒకేమాటపై ఉందామని జానారెడ్డి సూచించారు. ప్రభుత్వంపై పోరాడదాం నయీమ్ కేసులో వివిధ రాష్ట్రాలకు, రాజకీయ నేతలు, పెద్ద తలకాయల పాత్ర ఉండటం వల్లే సీబీఐ విచారణ కోరినట్టుగా సీనియర్ నేతలు భేటీలో వివరించారు. నయీమ్ కేసులో ఏదేదో రాస్తున్నారని, ఇందులో ప్రమేయమున్న రాజకీయ నేతలను మాత్రం అరెస్టుచేయడం లేదని ఎమ్మెల్సీ రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన పువ్వాడ అజయ్కు 11 వేల గజాల ప్రభుత్వ భూమిని బహుమతిగా ఇచ్చారని పొంగులేటి సుధాకర్రెడ్డి చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలను సీఎల్పీ సమావేశంలో పెట్టారు. దీంతో ఈ అంశంపై ప్రభుత్వంతో చట్టపరంగా పోరాటం చేయాలని నేతలు నిర్ణయించారు. మహారాష్ట్రతో ఒప్పందం, నయీమ్ కేసు, టీఆర్ఎస్ అవినీతి వంటివాటిపై లోతుగా అధ్యయనం చేయాలని.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ భేటీకి ఎమ్మెల్యేలు గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పద్మావతీరెడ్డి, దొంతి మాధవరెడ్డి గైర్హాజరయ్యారు. కేసీఆర్పై సభాహక్కుల నోటీసు.. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్పై సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదంటూ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని సీఎల్పీ నిర్ణయించింది. మూడో విడత రుణమాఫీకి ఇచ్చిన తేదీ, ఎఫ్ఆర్బీఎం పెంపునకు కేం ద్రం అంగీకరిస్తే మొత్తంగా ఒకేసారి రుణమాఫీ చేస్తామని కేసీఆర్ సభలో ఇచ్చిన హామీకి సంబంధించిన వివరాలతో నోటీసు ఇవ్వనున్నారు. ఇక శాసనసభలో చర్చ సం దర్భంగా జీఎస్టీ బిల్లుపై జి.చిన్నారెడ్డి, జిల్లా ల విభజనపై మల్లు భట్టివిక్రమార్క, డి.కె.అరుణ, మహారాష్ట్రతో ఒప్పందం, ప్రాజెక్టుల రీడిజైన్పై టి.జీవన్రెడ్డి మాట్లాడాలని సమావేశంలో నిర్ణయించా రు. సభ్యులంతా సమయానికి హాజరుకావాలని సీనియర్ నేతలు సూచించారు. శాసనసభను కనీసం 15 రోజులపాటు నడపాలని కాంగ్రెస్ పార్టీ విప్లు సంపత్కుమార్, రామ్మోహన్రెడ్డి, ఆకుల లలిత డిమాండ్ చేశారు. -
'అసెంబ్లీని 15 రోజులపాటు నిర్వహించాలి'
హైదరాబాద్: ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో చర్చించాల్సిన సమస్యలు ఎక్కువగా ఉన్నందున సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కోరారు. సోమవారం హైదరాబాద్లో మూడున్నర గంటల పాటు తెలంగాణ సీఎల్పీ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు సమస్యలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా గ్యాంగ్స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని సంపత్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు కూడా చర్చకు రానున్న సందర్భంగా.. అసెంబ్లీ కేవలం జీఎస్టీ బిల్లు కోసమే అంటే సరికాదన్నారు. సభను ఎక్కువ రోజులు నిర్వహించే అంశంపై అధికారపక్షాన్ని ప్రశ్నిస్తామని ఎమ్మెల్యే సంపత్ తెలిపారు. -
‘ఫిరాయింపు’పై జానా వర్సెస్ ఉత్తమ్
సీఎల్పీ సమావేశంలో వాడీవేడి చర్చలు * గాంధీభవన్ నుంచి లీకులు వస్తున్నాయి: జానారెడ్డి * పీసీసీ చీఫ్ ఎందుకు ఖండించరంటూ ఆగ్రహం * నాకేం సంబంధం అని ప్రశ్నించిన ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. అసెంబ్లీలోని పార్టీ కార్యాలయంలో జానారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఫిరాయింపుల అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగినట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపులు, దానికి కారణాలు, వలసలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, నాయకత్వం బాధ్యత, పార్టీలో అంతర్గత విభేదాలు, పార్టీ పటిష్టత, పాలేరు ఉప ఎన్నికపై ఈ సమావేశంలో చర్చించారు. భేటీలో సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ... తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్టుగా వార్తలు రావడం బాధాకరమన్నారు. ఇలాంటి వార్తలు గాంధీభవన్ నుంచి, పీసీసీ ఆఫీసు బేరర్ల నుంచి వస్తున్నాయన్నారు. గాంధీభవన్ నుంచి ఇలాంటి తప్పుడు లీకులు ఇస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఎందుకు ఖండించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉత్తమ్ స్పందిస్తూ.. ‘‘ఆఫీసు బేరర్లు ఎవరు లీక్ చేశారో నాకెలా తెలుస్తుంది? ఎవరైనా పార్టీ ఫిరాయిస్తున్నారని వార్తలు వస్తే ఇతరులెలా ఖండిస్తారు..’’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వాగం జరిగింది. పార్టీ సీనియర్ నేతలు జీవన్రెడ్డి, డీకే అరుణ తదితరులు జోక్యం చేసుకుని వారిని సముదాయించారు. అనంతరం జానా మాట్లాడుతూ... సీఎల్పీ నేతగా తాను కొనసాగడం ఇష్టం లేకుంటే తప్పుకుంటానని, ఈ బాధ్యతలను ఎవరైనా తీసుకోవచ్చన్నారు. దాంతో ఇప్పుడు నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగడం, మార్పుపై చర్చ అనవసరమని సీనియర్లు అభిప్రాయపడ్డారు. సొంత ప్రయోజనాల కోసమే వీడుతున్నారు కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు ఫిరాయింపులకు దిగుతున్నారనే అంశంపై భేటీలో తీవ్ర చర్చ జరిగింది. సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి కాంగ్రెస్ను వదిలి అధికార పార్టీలోకి వెళ్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్లోకి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వం సరిగా లేదని నోటికొచ్చినట్టుగా మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. నాయకత్వం అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలని కూడా పలువురు ప్రశ్నించారు. పార్టీ టికెట్ ఇచ్చి, గెలవడానికి వనరులను సమీకరించిన తర్వాత కూడా పార్టీ మారితే ఇక ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. పార్టీ మారుతామంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లాలని జానారెడ్డి అన్నారు. పార్టీలో నేతలపై పరస్పరం నమ్మకం ఉండాలన్నారు. ఈ మధ్య పార్టీ మారిన పువ్వాడ అజయ్కు కాంగ్రెస్తో అనుబంధం లేదన్నారు. పాలేరు ఉప ఎన్నికలో అంతా ఏకమై పనిచేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. పాలేరు ఎన్నిక వ్యయం కోసం పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకనెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలకు నో ఎంట్రీ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం అంటూ విప్ సంపత్ కుమార్ నుంచి, సీఎల్పీ కార్యాలయ సిబ్బంది నుంచి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు సమాచారం అందింది. అయితే సమావేశం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ సమావేశం పరిమితమని సిబ్బంది చెప్పారు. దీంతో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల సమావేశమే అయితే ఎమ్మెల్సీలను ఎందుకు ఆహ్వానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జానా, ఉత్తమ్ బయటకు వచ్చి షబ్బీర్ అలీని, పొంగులేటి సుధాకర్ రెడ్డిని విశ్రాంతి గదిలోకి తీసుకువెళ్లారు. కాగా, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి నియామకం, అయోమయ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు. -
జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే అధికార పార్టీలో చేరతారని సొంత పార్టీ శ్రేణులే కామెంట్లు చేస్తుండటంపై సీఎల్పీ నేత జనారెడ్డి ఘాటుగా స్పందించారు. తాను టీఆర్ఎస్ లోకి వెళుతున్నాననే వార్తలు పీసీసీ ఆఫీస్ బేరర్లే రాయించారని మండిపడ్డారు. తనపై నమ్మకం లేకుంటే సీఎల్పీ పదవి నుంచి తప్పుకుంటానన్నారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన సీఎల్పీ భేటీలో జానారెడ్డి ప్రసంగం.. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలను కలవరపాటుకు గురిచేసింది. 'పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎవరైనా ఆరోపణలు చేస్తే సీఎల్పీ నేతగా నేను వెంటనే ఖండిస్తా. అలాంటిది చాలా రోజులుగా నాపై సాగుతోన్న దుష్ప్రచారాన్ని ఎవ్వరూ ఖండించలేదు. నేను టీఆర్ఎస్ లో చేరుతానంటూ వచ్చిన వార్తలను ఉత్తమ్ కుమార్ ఖండించి ఉండాల్సింది. నిజానికి పీసీసీ ఆఫీస్ బేరర్లే ఆ వార్తలు రాయించారు. నా నాయకత్వంపై నమ్మకం లేకుంటే చెప్పండి.. సీఎల్పీ పదవి నుంచి తక్షణమే తప్పుకుంటా' అని జానారెడ్డి ఎమ్మెల్యేలతో అన్నారు. ఒక్కసారిగా సీఎల్పీ నేత అలా మాట్లాడటంతో విస్తుపోయిన ఎమ్మెల్యేలు.. క్షణాలపాటు బిత్తరపోయి, వెంటనే తేరుకున్నారు. 'మీరే మా నాయకుడిగా ఉండాలి' అని మూకుమ్మడిగా జనారెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత సాగునీటి ప్రాజెక్టులపై ఇవ్వాలనుకున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆలస్యం అవుతుండటంపై సీఎల్పీ చర్చించింది. వీలైనంత తొందరగా ప్రెజెంటేషన్ కు ఏర్పాట్లు పూర్తిచేయాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సమావేశానికి హాజరైనవారిలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి, పద్మావతి, జీవన్ రెడ్డి, భాస్కర్ రావు, సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు. -
‘అన్నదాత ఆర్తనాదం’ విన్పించదా?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం, రైతులపై ప్రభుత్వం చిన్నచూపు వల్లనే అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. అన్నదాత ఆర్తనాదం (తెలంగాణ వచ్చినా.. రైతులకు ఎండమావేనా) అనే పుస్తకాన్ని కిసాన్ ఖేత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిసాన్సెల్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వకపోగా, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను కనీసం పరామర్శించడం లేదని విమర్శించారు. ఆత్మహత్యలపై అసత్య ప్రచారంతో రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మంత్రులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రావిర్భావంత ర్వాత 409 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టుగా ప్రభుత్వం లెక్కలు చెబుతున్నదని, వారిలోని నలుగురి కుటుంబాలనైనా పాలకులు పరామర్శించారా? అని ప్రశ్నించారు. రుణమాఫీపై స్పష్టత ఉండాలని, బ్యాంకుల నుంచి రైతులకు ఒకేసారి రుణాన్ని అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం సంక్షోభం, రైతుల సమస్యలు, పరిష్కారాలపై అవగాహన కల్పించడానికి టీపీసీసీ మరింత శ్రమించాలని సూచించారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు. వ్యవసాయం సంక్షోభాన్ని అధిగమించడానికి, రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చేలా అసెంబ్లీలో వ్యవహరిస్తామన్నారు. సమావేశంలో వివిధ జిల్లాల కిసాన్సెల్ అధ్యక్షులు, నేతలు పాల్గొన్నారు. హిందీ భాషాభివృద్ధికి కృషి దేశంలో ఎక్కువమంది మాట్లాడుతున్న హిందీ భాషను అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని ఉత్తమ్ చెప్పారు. హిందీ భాషాదినోత్సవాన్ని గాంధీభవన్లో సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి టీపీసీసీ లింగ్విస్టిక్ మైనారిటీ సెల్ చైర్పర్సన్ ప్రేమలతా అగర్వాల్ అధ్యక్షత వహించగా ప్రేమ్లాల్, సంతోష్సింగ్ పాల్గొన్నారు. హిందీ భాషాభివృద్ధికి కృషిచేసిన వారిని ఈ సందర్భంగా సన్మానించారు. నేడు సీఎల్పీ సమావేశం ఈ నెల 23 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం మంగళవారం సమావేశం కా నుంది. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎల్పీనేత కె. జానారెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రైతు ఆత్మహత్యలపై సమరం చేయాలని సీఎల్పీ యోచిస్తోంది. రైతుల ఆత్మహత్యలు, కరువు, కరువు మండలాల ప్రకటనలో జాప్యం, ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానంలో నిర్లక్ష్యం వంటివాటిపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఎత్తుగడలు, పార్టీ సీనియర్ల మధ్య సమన్వయం వంటివాటిపై సమావేశంలో చర్చించనున్నారు. -
చల్లారని అసమ్మతి
= సీఎల్పీ సమావేశంలో భగ్గుమన్న ఎమ్మెల్యేలు = మంత్రుల పనితీరుపై అసంతృప్తి = ముఖ్యమంత్రి తీరుపై కూడా ధ్వజం = పథకాల్లోని లోపాలపై విమర్శలు = పథకాలను ప్రకటించడానికి ముందు తమను సంప్రదించాలంటూ హితవు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాంలో జరుగుతున్న శాసన సభ శీతాకాల సమావేశాల సందర్భంగా బుధవారం రెండో రోజు కూడా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో అసమ్మతి భగ్గుమంది. సుమారు. 30 మంది ఎమ్మెల్యేలు మంత్రుల పని తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావాన్ని అడ్డుకోవడానికి మంత్రులేమీ చేయలేక పోతున్నారని అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైందని, మరో ఆరు నెలల్లో లోక్సభ సమావేశాలు ముంచుకొస్తున్నాయని చెబుతూ, మంత్రులు ఇంకా బద్ధకాన్ని వీడలేక పోతున్నారని విమర్శించారు. దీనిపై అధిష్టానానికి లేఖ రాస్తామని హెచ్చరించారు. మరో వైపు షాదీ భాగ్య, ప్రతిపాదిత మూఢాచారాల నిరోధక బిల్లు, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు విహార యాత్ర... లాంటి అంశాలపై కూడా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి తీరును ఎండగట్టారు. కోస్తా, మలెనాడు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు మూఢాచారాల ముసాయిదా బిల్లును ఎండగట్టారు. బీజేపీకి గట్టి పట్టున్న ఈ ప్రాంతాల్లో ఈ బిల్లు వల్ల పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్కు నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండిందని అభిప్రాయపడ్డారు. మరో వైపు షాదీ భాగ్య పథకంపై ముస్లిం ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేశారు. రోషన్ బేగ్, తన్వీర్ సేఠ్, రఫిక్ అహ్మద్లు మాట్లాడుతూ ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందు ప్రభుత్వం తమ మత పెద్దలను సంప్రదించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ పథకానికి కేవలం రూ.5 కోట్లు కేటాయించిందని, ఒక్కో పెళ్లికి రూ.50 వేల వంతున వెయ్యి మంది మాత్రమే లబ్ధి పొందుతారని వివరించారు. స్థూలంగా చెప్పాలంటే, నియోజక వర్గానికి నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి కలుగుతుందని, తద్వారా ఈ మొత్తం అందని వారిలో కలిగే అసంతృప్తిని పరిగణనలోకి తీసుకోలేదని నిష్టూరమాడారు. ప్రధాన పథకాలను ప్రకటించడానికి ముందు తమను సంప్రదించాలని, లేనట్లయితే నియోజక వర్గాల్లో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేమని వారు వాపోయారు. వెనుకబడిన వర్గాల విద్యార్థులను మాత్రమే విహార యాత్రలకు పంపడం వల్ల ఇతర వర్గాల విద్యార్థుల్లో అసూయ, ద్వేషాలు ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు ఎమ్మెల్యేలు హెచ్చరించారు.