death threat
-
షారుఖ్కి చంపేస్తామని బెదిరింపు కాల్.. నిందితుడి అరెస్ట్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ఖాన్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 50 లక్షలు ఇవ్వకపోతే షారుఖ్ని చంపేస్తానని ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నిందితుడు రాయఫూర్కి చెందిన ఫైజల్ ఖాన్గా తేలింది. మంగళవారం ఛతీస్గడ్కి వెళ్లిన పోలీసులు..అక్కడ ఫైజల్ని అదుపులోకి తీసుకున్నారు.నా పేరు హిందుస్తానీడబ్బుల కోసం నిందుతుడు ఈ పథకం వేసినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున డబ్బు కావాలని ఇలాంటి బ్లాక్ మెయిల్ కాల్స్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ‘నవంబర్ 7న ఓ కొత్త నెంబర్ నుంచి కాల్ చేసి ‘షారుఖ్ ఖాన్ నాకు రూ.50 ఇవ్వకపోతే చంపేస్తా అని ఓ వ్యక్తి చెప్పారు. మీ పేరు ఏంటని అడిగితే.. ‘అది అనవసరం. మీకు నా పేరే ముఖ్యమని అనిపిస్తే.. ‘హిందుస్తాని’ అని రాసుకోండి’అని చెప్పి కాల్ కట్ చేశాడు’ అని ముంబై పోలీసులు తెలిపారు.బిగ్ ట్విస్ట్షారుఖ్ని చంపేస్తామని కాల్ రావడంతో ముంబై పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ గురించి ఆరా తీయగా అది ఛత్తీస్గఢ్కి చెందిన ఫైజన్ ఖాన్ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. మంగళవారం ఓ బృందం ఛత్తీస్గఢ్కి వెళ్లి నిందితుడుని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు మాత్రం ఆ కాల్ చేసింది తాను కాదని చెబుతున్నాడు. \తన ఫోన్ ఎవరో దొంగిలించారని.. దీనిపై తాను పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని రాయ్ పూర్ ఎస్పీ అజయ్ కుమార్ కూడా దృవీకరించారు. ‘నవంబర్ 2న ఫైజన్ ఖాన్ పోలీసు స్టేషన్కి వచ్చిన తన ఫోన్ పోయిందని ఫిర్యాదు ఇచ్చాడు. ముంబై పోలీసులకు కూడా విషయాన్ని చెప్పారు. దానికి సంబంధించిన డ్యాక్యుమెంట్స్ కూడా ముంబై పోలీసులకు అందించాడు’అని రాయ్పూర్ ఎస్పీ మీడియాకు తెలిపారు.షారుఖ్కి భద్రత పెంపుషారుక్కి గతేడాదిలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం షారుక్కి Y+ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ షారుఖ్కి వై ప్లస్(Y+) సెక్యూరిటీనే కొనసాగుతుంది. కాగా, బాలీవుడ్ మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్కి కూడా వరుసగా ఇలాంటి బెదిరింపులే వస్తున్నాయి. సల్మాన్ని చంపేస్తామని గత కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్ చేస్తునే ఉంది. దీంతో సల్మాన్కి కూడా భద్రతను పెంచారు. ఇలా స్టార్ హీరోలందరికి బెదింపు కాల్స్ రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
సల్మాన్ ఖాన్కి మరోసారి బెదిరింపులు.. రూ.2 కోట్లు ఇవ్వకపోతే
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కి బెదిరింపు కాల్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగిన దగ్గర నుంచి బెదిరింపులు మరీ ఎక్కువైపోతున్నాయి. మొన్నటికి మొన్న రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని ఓ మెసేజ్ రాగా.. ఇప్పుడు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు మరో వాట్సాప్స్ మెసేజ్ వచ్చింది.(ఇదీ చదవండి: హత్య కేసులో స్టార్ హీరో దర్శన్కి మధ్యంతర బెయిల్)ఈ క్రమంలోనే వర్లీ పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాపు చేపట్టారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో హత్యమైన బాబా సిద్దిఖీ కొడుకు జీషన్ సిద్దిఖీని కూడా చంపేస్తామని బెదిరించాడు. ఇలా చేసిన 20 ఏళ్ల గుఫ్రన్ని అరెస్ట్ చేసిన కాసేపటికే సల్మాన్కి బెదిరింపులు రావడం హాట్ టాపిక్ అయిపోయింది.అప్పుడెప్పుడో కృష్ణజింకలని వేటాడిన కేసు ఇప్పటికీ సల్మాన్ఖాన్ వెంటాడుతూనే ఉంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. పలుమార్లు చంపుతామని బెదిరిస్తూనే ఉన్నారు. బిష్ణోయిల మందిరానికి వెళ్లి క్షమాపణలు చెబితే వదిలేస్తామని కూడా అన్నారు. కానీ భద్రత పెంచుకోవడం తప్పితే సల్మాన్ నుంచి క్షమాపణ గురించి స్పందన లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ సినిమా.. కండోమ్ కంపెనీపై కేసు పెడితే?) -
చంపేస్తామని బెదిరిస్తున్నారు: టీఎంసీ ఎంపీ
తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సౌగతా రాయ్ బుధవారం తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పేర్కొన్నారు. అరెస్టయిన పార్టీ నాయకుడు జయంత్ సింగ్ను త్వరగా విడుదల చేయకపోతే తనను చంపేస్తానని ఫోన్లో బెదిరించారని తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించడమే కాకుండా.. తనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడాడని సౌగతా రాయ్ పేర్కొన్నారు.కాగా పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని అరియాదాహా ప్రాంతానికి చెందిన టీఎంసీ నాయకుడు జయంత్ సింగ్ను జూన్ 30న జరిగిన ఓ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గత వారం అరెస్టు చేశారు. అరియాదాహ.. డమ్ డమ్ లోక్సభ నియోజకవర్గం కిందకు వస్తుంది. ఈ స్థానానికి సౌగతా రాయ్ గత నాలుగు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే గుర్తు తెలియని నెంబర్ నుంచి రెండు ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు రాయ్ పేర్కొన్నారు. అరియాదాహకు వెళితే చంపేస్తానని కూడా కాల్ చేసిన వ్యక్తి చెప్పాడని తెలిపారు. తర్వాత తాను బరాక్పూర్ పోలీస్ కమిషనర్ను సంప్రదించి నంబర్ను ట్రాక్ చేయమని కోరినట్లు చెప్పారు. అనంతరం తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.టీఎంసీ నేత జయంత్ సింగ్పై కేసు ఏంటి?జూన్ 30న కళాశాల విద్యార్థిని, అతని తల్లిపై దాడి చేసిన కేసులో జయంత్ సింగ్ను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఇందులో కొంతమంది వ్యక్తులు ఇద్దరు వ్యక్తులను కొట్టడం కనిపించింది.అరియాదాహాలో ఒక బాలికపై కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్లు చూపుతున్న పాత వీడియో ఆధారంగా పోలీసులు సింగ్పై సుమోటో కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ ఘటనకు సంబంధించి సింగ్ సన్నిహితుడు పట్టుబడ్డాడు. , ఈ కేసులో ఇప్పటి ముగ్గురిని అరెస్ట్ చేశారు.2023లో మరో కేసులో అరెస్టయి, ఇకపై ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా హామీ ఇచ్చి బాండ్తో బెయిల్పై బయటకు వచ్చాడు జయంత్. ఆ షరతును ఇప్పుడు ఉల్లంఘించినందుకు ఆయన తాజా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. -
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
జైపూర్: లోక్సభ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్కు చెందిన మంత్రి బాబులాల్ ఖరాడీను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. దీంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు.వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వంలో బాబులాల్ ఖరాడీ గిరిజన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా(ఇన్స్స్టాగ్రామ్) వేదికగా మంత్రి బాబులాల్కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ మేసేజ్లో బాబులాల్ను చంపేస్తానని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. Babulal Kharadi Receives Death Threat: बाबूलाल खराड़ी को सोशल मीडिया पर मिली धमकी | Udaipur | BJP#RajasthanWithFirstIndia #BabulalKharadi #BJP #Udaipur #RajasthanNews #RajasthanPolitics #DeathThreats pic.twitter.com/s7iL3WY7Gc— First India News (@1stIndiaNews) May 4, 2024 ఈ నేపథ్యంలో మంత్రి బాబులాల్ కుమారుడు.. ఈ మెసేజ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. మూడు రోజుల క్రితం ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు. అయితే, గిరిజనులను హిందూ మతంలోకి మారుస్తున్నారని ఆరోపిస్తూ మంత్రిని చంపేస్తానని గుర్తు తెలియని వ్యక్తి బెదిరించినట్లు చెప్పారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై ఉదయ్పూర్లోని కొద్దా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
ఫేక్ వీడియోకున్న విలువ.. సీఎం జగన్ ప్రాణానికి లేదా?
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు పబ్లిక్గా ఏపీ సీఎం జగన్ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్, YSRCP నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం ఉదయం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో రోజులుగా సీఎం జగన్ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ‘రేపే నిన్ను(సీఎం జగన్ను ఉద్దేశిస్తూ..) చంపితే ఏం చేస్తారు’ అని చంద్రబాబు అడుగుతున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో దాడి జరిగితే మీరే చేపించుకున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇది దుర్మార్గం కాదా?. దీనిపై ఎవరూ స్పందించరా?. ఒక ఫేక్ వీడియోకి ఉన్న విలువ సీఎం జగన్ ప్రాణానికి లేదా?.. సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఆర్థిక నేరస్తులు. ఈ విషయం అందరికీ తెలుసు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారారు? బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా? అక్రమాలు చేసిన వాళ్లు బీజేపీలో ఉంటే శిక్ష పడదా?. మోదీగారు మీరు నిజాయితీవంతమైన నాయకులు. ఇలాంటి వారిని ప్రొత్సహించి మీ ఇమేజ్ను దెబ్బ తీసుకోకండి’’ అని పోసాని అన్నారు. -
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ మరోసారి బెదిరింపులు
ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను ఈ రిపబ్లిక్ డే రోజు హత్య చేస్తానని బెదిరింపులు చేశాడు. జనవరి 26న భగవంత్ మాన్పై గ్యాంగ్స్టర్లు ఏకమై దాడికి దిగాలని పన్నూ కోరారు. గ్యాంగ్స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నదని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. పన్నూ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు పన్నూ గతంలో భారతీయ సంస్థలు, అధికారులపై అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. గత నెల, డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి చేస్తానని వీడియోను విడుదల చేశాడు. అదే క్రమంలో పార్లమెంట్పై డిసెంబర్ 13న ఆగంతకులు కలర్ బాంబు షెల్స్తో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ మరొక బెదిరింపు వీడియో ఇటీవల బయటపడింది. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో వెళ్లాలనుకుంటున్న ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బెదిరింపులు చేశాడు. ఎయిరిండియా బెదిరింపు వీడియోపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పన్నూపై కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే -
ఆ ఫోటోలు డిలీట్ చేయకపోతే చంపేస్తాం... ఉర్ఫికి బెదిరింపులు!
సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది బాలీవుడ్ భామ ఉర్ఫీ జావెద్. విచిత్రమైన వేషధారణతో ఫోటో షూట్ చేసి..వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అయితే కొన్నిసార్లు అవి వివాదానికి దారి తీస్తుంటాయి. తాజాగా ఈ బిగ్బాస్ భామకు హత్యా బెదరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసిన ఫోటోలు డిలీట్ చేయకపోతే.. చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఉర్ఫీనే ఎక్స్ వేదికగా చెప్పింది. అసలేం జరిగింది? విచిత్ర వేషధారణతో ట్రెండింగ్లో నిలిచే మోడల్, నటి ఉర్ఫీ జావేద్. నిత్యం ఏదో ఒక విచిత్రమైన డ్రెస్తో ఫోటోషూట్ చేసి వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం ఆమెకు అలవాటు. అలా తాజాగా భూల్ భులయ్యలోని ఛోటా పండిత్ క్యారెక్టర్ డ్రెస్ ధరించి.. ఫోటోషూట్ చేసింది. అంతేకాదు అదే గెటప్లో ఓ పార్టీకి కూడా హాజరైంది. దీంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. చంపేస్తామని బెదరింపులు వింత ఫ్యాషన్తో విమర్శలకు కేంద్రబిందువుగా మారే ఉర్పీకి ఛోటా పండిత్ గెటప్ లేనిపోని తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఛోటా పండిత్ గెటప్లో పార్టీకి హాజరవ్వడం పట్ల ఓ వర్గం ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ మతాన్ని కించపరిచేలా చేస్తున్నావని, ఇలాగే కంటిన్యూ చేస్తే చంపేస్తామని కొంతమంది ఆమెను బెదరిస్తున్నారట. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయలని, లేదంటే చంపడం తమకు పెద్ద పనే కాదంటూ బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఉర్ఫీనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ఉర్ఫీకి ఇలాంటి బెదిరింపులు రావడం పరిపాటే. గతంలో కూడా అనేకసార్లు ఉర్ఫీకి ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. I’m just shocked and appalled by this country mahn , I’m getting death threats in recreating a character from a movie where as that character didn’t get any backlash :/ pic.twitter.com/pOl9FvTYzT — Uorfi (@uorfi_) October 30, 2023 -
శరద్ పవార్ కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు
ముంబై: ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు విషయమై ఆయన కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ చేపట్టిన ముంబై పోలీసులు ఈ చర్యకు పాల్పడింది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సాగర్ బర్వేగా గుర్తించి సోమవారం అతడిని అరెస్టు చేశారు. అదే గతి పడుతుంది.. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపేస్తామంటూ ఒక వార్నింగ్ ప్రత్యక్షమైంది. ఆ బెదిరింపులో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్ కు ఎదురైన పరిస్థితి అతి త్వరలో శరద్ పవార్ కు కూడా ఎదురవుతుందని, 2013లో నరేంద్ర దభోల్కర్ ను ఇద్దరు ఆగంతకులు బైక్ మీద వచ్చి కాల్చి చంపినట్టే ఈయనను కూడా చంపుతామని పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ పోస్ట్ చేసిన వ్యక్తిని కనుగొనేందుకు విచారణ చేపట్టారు. ఆమెతో పాటు ఎన్సీపీ కార్యకర్త ఒకరు లోకమాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఎలా పట్టుకున్నారంటే.. ఈ వార్నింగ్ ఏ ఐపీ అడ్రస్ నుండి వచ్చిందన్న కోణంలో ఎంక్వైరీ చేయగా ఆ ఐపీ అడ్రస్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సాగర్ బర్వేకు చెందినదని గుర్తించారు పోలీసులు. సాగర్ ఓ ప్రయివేటు కంపెనీలో డేటా ఫీడింగ్ అండ్ అనలిటిక్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. నిందితుడి వివరాలు తెలిసిందే తడవు వెంటనే సాగర్ బర్వేను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి రిమాండుకు తరలించారు పోలీసులు. శరద్ పవార్ ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆయన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను ప్రకటించిన విషయం తెలిసిందే. నాయకత్వం చేతులు మారి పార్టీ కార్యాచరణ ముమ్మరం చేస్తున్న ఇదే సమయంలో ఆయనను చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఆందోళనలో ఉన్నాయి పార్టీ వర్గాలు. ఎట్టకేలకు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి అరెస్టుతో ఎన్సీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇది కూడా చదవండి: అలిగిన అజిత్ పవార్.. మరోసారి అసంతృప్తి? -
‘టిప్పూలాగే చేయాలి’.. సిద్ధూకు ప్రాణహానీ? పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించింది ఆ రాష్ట్ర కాంగ్రెస్. ఈ మేరకు బెదిరింపులకు పాల్పడిన మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ పై మైసూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉరి గౌడ, నంజేగౌడలు టిప్పు సుల్తాన్ను అంతం చేసినట్లే.. సిద్ధరామయ్యను సైతం చంపేయాలని పబ్లిక్ మీటింగ్లో అశ్వత్ నారాయణ్ మాట్లాడినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అశ్వత్ నారాయణ్ను అరెస్టు చేయాలని పోలీసులను కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రతినిధి ఎమ్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 18 వ శతాబ్దానికి చెందిన మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్. బ్రిటీషర్ల పోరాటంలోనూ టిప్పు సుల్తాన్ మరణించలేదు. కానీ ఒక్కలిగ జాతికి చెందిన ఉరి గౌడ, నంజె గౌడల చేతిలో చనిపోయాడు. 'టిప్పు మద్దతుదారుడు సిద్ధరామయ్య ఇప్పుడు పరిపాలనలోకి వచ్చాడు. మీకు టిప్పు కావాలా? లేక హిందుత్వాన్ని కాపాడిన సావర్కర్ కావాలా?. నంజెగౌడ ఎం చేశారు?. అదే విధంగా సిద్ధరామయ్యను కూడా చేయాలి' అని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే క్రమంలో సిద్ధరామయ్యను టిప్పుతో పోల్చుతూ మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ అన్నారు. (అక్కడ ఐక్యత చూశా.. విపక్షాల బాయ్కాట్ నిర్ణయంపై ప్రధాని చురకలు!) నేనొస్తే టిప్పు సుల్తాన్ వచ్చినట్టే అశ్వత్ నారాయణ్ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. తనపై ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 'నన్ను అంతం చేయనిస్తారా?. నేను అధికారంలోకి వచ్చానంటే టిప్పు అధికారంలోకి వచ్చినట్టే. టిప్పు సుల్తాన్, కిట్టుర్ రాణి చెన్నమ్మ, సంగోళి రాయన్న అంటే నాకు ఎంతో గౌరవం' అని పబ్లిక్ ర్యాలీలో అన్నారు. అయితే ఫిబ్రవరిలోనే మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఫిర్యాదు చేశారు. కానీ అతనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం పోలీసులకు కాంగ్రెస్ మరోసారి ఫిర్యాదు చేసింది. నేనలా అనలేదు ఈక్రమంలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ చెప్పారు. ఎన్నికల్లో ఓడించాలనే ఉద్దేశంలో ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు. 'నేను సిద్ధరామయ్యను టిప్పు సుల్తాన్తో పోల్చాను. సిద్ధరామయ్యకు టిప్పు సుల్తాన్పై ఉన్న ప్రేమ గురించి మాట్లాడాను. సిద్ధరామయ్యపై నేనేమీ అవమానకరంగా మాట్లాడలేదు. రాజకీయ, భావజాల వైరుధ్యాలే తప్ప సీఎంపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి క్షక్షపూరిత ఆలోచనలు లేవు. నా వ్యాఖ్యలు ఏవైనా ఆయన మనోభావాలను దెబ్బతీస్తే అందుకు చింతిస్తున్నాను' అని అసెంబ్లీలో మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ చెప్పుకొచ్చారు. (మనిషి చనిపోయేది రెండు వారాల ముందే తెలుస్తుందా?.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి!) -
నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితులతో తనకు, తన కుటుంబానికి ఉగ్రవాద సంస్థల నుంచి ప్రాణహాని ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాలకు గురువారం లేఖలు రాశారు. హైదరాబాద్ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడం, తనపై, తన కుటుంబంపై మానవ బాంబులతో దాడులు జరిపేందుకు కుట్రలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి తనకు పలు బెదిరింపు కాల్స్ రావడంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికి భారీ భద్రత కలి్పంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: ఎవరు ఉద్యమం చేసినా కేసీఆర్ భయపడుతున్నారు: బండి సంజయ్ -
సీఎం యోగిని చంపేస్తానని వచ్చిన బెదిరింపు కాల్లో ప్రేమకోణం..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తానని బెదిరింపు కాల్ రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ప్రేమ కోణం ఉన్నట్లు విచారణలో తేలింది. తాను ప్రేమించిన యువతి తండ్రిపై కోపంతో ఓ యువకుడు అతని ఫోన్ దొంగిలించి సీఎంకు చంపేస్తానని కాల్ చేశాడని పోలీసులు తెలిపారు. ప్రేయసి తండ్రిని తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపాలని పథకం పని యువకుడు ఈ పని చేసినట్లు వెల్లడించారు. అతడిపై ఫోన్ చోరీ కేసు కూడా నమోదు చేశారు. నిందితుడ్ని 18 ఏళ్ల అమీన్గా గుర్తించారు. ఏం జరిగిందంటే..? మంగళవారం ఉదయం 112 నంబర్కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తానని బెదిరింపు కాల్ చేశాడు. యూపీ పోలీసుల హెల్ప్ లైన్ వాట్సాప్ నంబర్కు కూడా ఈ సందేశాన్ని పంపాడు. దీంతో అప్రమత్తమైనా పోలీసులు ఆ నంబర్ను ట్రేస్ చేశారు. లక్నోలో ఉంటున్నాడని తెలిసి వెంటనే అతని వద్దకు చేరుకున్నారు. అయితే తన ఫోన్ను రెండు రోజుల క్రితమే ఎవరో దొంగిలించారని, ఈ కాల్ తాను చేయలేదని సజ్జాద్ హుస్సేన్ పోలీసులకు చెప్పాడు. దీంతో పొరుగింటి వారిని పోలీసులు వాకబు చేశారు. అప్పుడే అమీన్ గురించి వాళ్లు చెప్పారు. హుస్సేన్ను ఇరికేందుకు అతడే ఈ పని చేసి ఉంటాడని పేర్కొన్నారు. వెంటనే పోలీసులు అమీన్ వద్దకు చేరుకుని అరెస్టు చేశారు. హుస్సేన్ కూతుర్ని తాను ప్రేమించానని, ఆయన తమ ప్రేమకు ఒప్పుకోలేదనే ఇలా చేసినట్లు విచారణలో తెలిపాడు. హుస్సేన్పై ప్రతీకారంతోనే ఫోన్ దొంగిలించి సీఎం యోగిని చంపేస్తానని బెదిరింపు కాల్ చేసినట్లు అంగీకరించాడు. చదవండి: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం.. కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే..? -
Yogi Adityanath Death Threat: సీఎం యోగిని హత్య చేస్తానంటూ బెదిరింపులు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ను హత్య చేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. లక్నోకు చెందిన ఓ వ్యక్తి యూపీ ఎమర్జెన్సీ నెంబర్ 112కి మెసేజ్ చేశాడు. సీఎం యోగిని త్వరలో చంపుతానంటూ సందేశంలో పేర్కొన్నాడు. దీంతో 112 ఆపరేషన్ కమాండర్ విషయాన్ని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఐపీసీ సెక్షన్లు 506, 507, ఐటీ యాక్ట్ 66 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ కేరళ పర్యటన వేళ ఆయన ఆత్మాహుతి బాంబు దాడిలో చంపుతామంటూ ఓ వ్యక్తి బెదిరించడం కలకలం రేపింది. కొచ్చికి చెందిన జేవియర్ అనే వ్యక్తి ఈ మేరకు కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్కు లేఖ పంపాగా.. ఆయన దానిని పోలీసులకు అందజేశారు. అయితే వారం తర్వాత ఆ లేఖ గురించి మీడియాకు సమాచారం పొక్కింది. దీంతో గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని బయటపెట్టారంటూ బీజేపీ, కేరళ పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఇక ప్రధాని కేరళ రెండో రోజుల పర్యటన కోసం భారీగా పోలీసులను మోహరించారు. -
చంపుతామని బెదిరించినప్పుడు సల్మాన్ డబ్బులు ఆఫర్ చేశాడు:గ్యాంగ్స్టర్
ముంబై: గతేడాది మేలో జరిగిన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇది తమ పనేనంటు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో అతని పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే సిద్ధూ హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ను చంపుతామని ఓ బెదిరింపు లేఖ ఆయనకు చేరింది. సిద్దూ మూసేవాలను చంపినట్లే నిన్నూ హత్య చేస్తాం అని అందులో ఉంది. లేఖపై పేరు లేకపోయినప్పటికీ ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని అందరికీ అర్థమైంది. కొన్నేళ్ల క్రితమే కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్ ఖాన్ను చంపేస్తానని ఇతడు బెదిరించడం తీవ్ర దుమారం రేపింది. అయితే సల్మాన్ను చంపేందుకు రూ.4లక్షలు పెట్టి తుపాకీ కూడా కొన్నట్లు లారెన్స్ బిష్ణోయ్ చెప్పాడు. ఆయన తమ సమాజాన్ని అమమానించాడని, అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. లేదంటే సల్మాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అలాగే సల్మాన్ను బెదిరించినప్పుడు ఆయన తమకు భారీగా డబ్బు కూడా ఆఫర్ చేశాడని, కానీ తాము తిరస్కరించామని తెలిపాడు. 'సల్మాన్ ఖాన్పై మా సమాజంలో తీవ్ర ఆగ్రహం ఉంది. ఆమన మమ్మల్ని అవమానించాడు. అతనిపై ఓ కేసు కూడా ఉంది. కానీ ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు. ఇప్పటికీ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. నాకు ఎవరి సాయం అవసరం లేదు. సల్మాన్పై నాకు చిన్నప్పటి నుంచే కోపం ఉంది. ఆయన అహాన్ని అతి త్వరలో లేదా ఆ తర్వాత దెబ్బతీస్తా. ఆయన మా పవిత్ర దేవాలయానికి వచ్చి క్షమాపణలు చెప్పాలి. అప్పుడు మా సమాజం క్షమిస్తే.. నేను ఏమీ అనను..' అని లారెన్స్ బిష్ణోయ్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ చెప్పాడు. WATCH | अपना नाम बड़ा करने के लिए सलमान खान को धमकी देता है लॉरेंस बिश्नोई ? जानिए क्या बोला @RubikaLiyaquat | @akhileshanandd | @jagwindrpatial LIVE - https://t.co/4StwkoboMD#OperationDurdantOnABPNews #LawrenceBishnoi #SalmanKhan pic.twitter.com/OaTqFxdNC9 — ABP News (@ABPNews) March 14, 2023 చదవండి: 'మేడం చాలా క్యూట్గా ఉన్నావ్..' అంటూ మహిళా పోలీస్ను వేధించిన ఆకతాయి.. -
ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు బెదిరింపులు.. మళ్లీ అతడే..!
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్కు బెదిరింపులు వచ్చాయి. మహారాష్ట్ర ముంబైలోని సిల్వర్ ఓక్లో పవార్ నివాసానికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. షూట్ చేసి చంపేస్తానని హెచ్చరించాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని గుర్తించారు. ఫోన్ చేసిన వ్యక్తి బిహార్కు చెందిన వాడని పోలీసులు వెల్లడించారు. ఇతను గతంలోనూ ఓసారి పవార్ను చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. అయితే అప్పుడు అరెస్టు చేసి వదిలేశామని తెలిపారు. ఇప్పుడు అదే వ్యక్తి మళ్లీ బెదిరింపు కాల్ చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. అతని కోసం వెతుకుతున్నామని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వివరించారు. చదవండి: ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. 24 గంటల్లోపే అరెస్ట్ -
'ఇండోర్లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు
ఇండోర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో రెండు రోజుల్లో మధ్యప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఆయనను చంపేస్తామని బెదిరింపులు రావడం పార్టీ శ్రేణులకు ఆందోళన కల్గిస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ జుని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్వీట్ షాపు ముందు ఈ బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇండోర్లో అడుగు పెట్టగానే బాంబులేసి చంపేస్తామని లేఖలో ఉంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. ఈ లేఖ ఎవరి పని అయి ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడిపై తీవ్ర అభియోగాలు మోపి విచారణ చేపట్టారు. వీర్ సావర్కర్ ప్రాణభయంతో బ్రిటిషర్లను క్షమాభిక్ష కోరిన వ్యక్తి అని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన తరుణంలో ఈ బెదిరింపు లేఖ ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. శుక్రవారం యాత్రలో మహాత్మ గాంధీ మునివనవడు తుషార్ గాంధీ.. రాహుల్తో పాటు పాదయత్రలో పాల్గొన్నారు. నవంబర్ 20న మహారాష్ట్రలో యాత్ర ముగించుకుని మధ్యప్రదేశ్లోకి రాహుల్ అడుగుపెట్టనున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు మహారాష్ట్రలో కేసు పెట్టారు. స్వతంత్ర సమరయోధుడైన తన తాతను రాహుల్ అమమానించారని మండిపడ్డారు. చదవండి: నెహ్రూ మునిమనవడితో గాంధీ మునిమనవడు.. వీడియో వైరల్ -
సిద్ధూ మూసేవాలా తండ్రిని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు
చండీగఢ్: సిద్ధూమూవేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ను చంపుతానని బెదిరించిన వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని రాజస్థాన్ జోధ్పూర్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంజాబ్ మాన్సా కోర్టులో ప్రవేశపెట్టి ఐదు రోజులు రిమాండ్లోకి తీసుకున్నారు. నిందితుడి పేరు మహిపాల్ అని పోలీసులు తెలిపారు. ఈమెయిల్ ద్వారా ఇతడు సిద్ధూ తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు సిద్ధూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజే లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సోషల్ మీడియాలో పేజీ కూడా క్రియేట్ చేశాడు. ఫాలోవర్లను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే సిద్ధూ తండ్రికి మహిపాల్ బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. సిద్ధూ హత్యకు సంబంధించి కెన్యాలో అన్మోల్ బిష్ణోయ్, అజర్బైజాన్లో సచిన్ తాపన్ను అదుపులోకి తీసుకున్నట్లు కేంద్రం సెప్టెంబర్ 1న ధ్రువీకరించింది. స్థానిక అధికారులతో టచ్లో ఉన్నట్లు చెప్పింది. చదవండి: థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్.. 2024లో సరికొత్త చరిత్ర -
సల్మాన్ ఖాన్ను మా వర్గం ఎప్పటికి క్షమించదు: గ్యాంగ్స్టర్ లారెన్స్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ను తమ వర్గం ఎప్పటికి క్షమించదని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పంజాబి సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యా కేసులో లారెన్స్ బిష్ణోయ్ జైలు శిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగర్ హత్యా కేసులో పోలీసులు ప్రస్తుతం అతడిన విచారిస్తున్నారు. ఈ సందర్భంగా లారెన్స్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు. చదవండి: ఆస్పత్రి నుంచి హీరో విక్రమ్ డిశ్చార్జి.. పాత వీడియో వైరల్ చేస్తున్న ఫ్యాన్స్ ‘కృష్ణజింక హత్యకు సంబంధించి మా వర్గం ఎప్పటికీ సల్మాన్ను క్షమించదు. అతడు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెబితేనే క్షమిస్తాం’ అని లారెన్స్ పేర్కొన్నట్లు ఢిల్లీ పోలీసలు చెప్పారు. కాగా జోధ్పూర్ అడవి సమీపంలో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్కు కోర్టు జైలు శిక్ష విధించగా బెయిలుపై బయటకు వచ్చాడు. ఇప్పటికే ఈ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసులో సల్మాన్ను చంపేందుకు లారెన్స్ గ్యాంగ్ 2018లో ప్రయత్నించింది. చదవండి: ది వారియర్ షూటింగ్లో దర్శకుడితో కాస్త ఇబ్బంది పడ్డా: కృతిశెట్టి అంతేకాదు ఇటీవల సల్మాన్ ఖాన్ తండ్రితో పాటు ఆయన తరపు లాయర్కు కూడా లారెన్స్ గ్యాంగ్ నుంచి హత్యా బెదిరింపు లేఖలు వచ్చాయి. ఇద్దరికీ సిద్ధూ మూసేవాలా గతే పడుతుందని హెచ్చరిక లేఖల్లో పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై ఢిల్లీ పోలీసులు లారెన్స్ను ప్రశ్నించగా, అతడు ఈ విషయాలు వెల్లడించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా లారెన్స్ బిష్ణోయ్ కమ్మునిటీలో కృష్ణ జింకను దైవంగా భావిస్తారట. ఈ నేపథ్యంలో బిష్ణోయ్, సల్మాన్ను టార్గెట్ చేశాడు. -
Swara Bhaskar: చంపేస్తామంటూ స్వర భాస్కర్కు బెదిరింపు లేఖ
ముంబై: బాలీవుడ్ నటి స్వర భాస్కర్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. మహారాష్ట్రలోని వెర్సోవాలో ఉన్న తన నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖను పంపారు. బెదిరింపు లేఖపై నటి స్వర భాస్కర్ వెర్సోవా పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీర్ సావర్కర్ను అవమానిస్తే దేశ యువత సహించబోదంటూ హిందీలో ఉన్న ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా సోషల్ మీడియాలో తరచూ పలు అంశాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది స్వర భాస్కర్. 2017లో ఆమె వీరసావర్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తనను జైలు నుంచి విడిపించాలంటూ బ్రిటీష్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడని, అది వీరత్వం ఎలా అవుతుందంటూ ట్వీట్ చేసింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. చదవండి: (కాలికి గాయం, నడవలేని స్థితిలో నిత్యామీనన్!) -
చంపేస్తామంటూ బెదిరింపులు.. గోల్డీ ఎవరో తెలియదన్న సల్మాన్
ముంబై: పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా మాదిరిగా చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. ఈ వ్యవహారంలో తనకు ఎవరిపైనా అనుమానాలు లేవని పోలీసులకు చెప్పారు. ‘‘నాకెవరితోనూ శత్రుత్వం లేదు. చదవండి: అడవి బాట... బాక్సాఫీస్ వేట సిద్ధూను చంపినట్టు చెప్పుకుంటున్న కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఎవరో నాకు తెలీదు. నా తండ్రి మార్నింగ్ వాక్ చేస్తుండగా బెదిరింపుల లేఖ వచ్చింది’’ అని చెప్పారు. సిద్ధూ కేసులో విచారిస్తున్న గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిష్ణోయ్ గురించి తనకు తెలుసన్నారు. కృష్ణజింకను వేటాడిన కేసులో 2018లో అతని నుంచి తనకు చంపేస్తానన్న బెదిరింపులు వచ్చాయని తెలిపారు. చదవండి: పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన నటుడు ఆర్కే -
చంపేస్తామని బెదిరిస్తున్నారు: కంగనా రనౌత్
ముంబై: సాగు చట్టాల రద్దుకు రైతులు చేస్తున్న ఉద్యమంపై సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన తన అభిప్రాయాలను కొందరు తీవ్రంగా వ్యతిరేకించి, చంపేస్తామని బెదిరిస్తున్నారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మంగళవారం వెల్లడించారు. ఈ తరహా హెచ్చరికలు ఎక్కువైపోయాయని, చర్యలు తీసుకోండంటూ పంజాబ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పంజాబ్లోని బటిందాకు చెందిన ఒక వ్యక్తి తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, సంబంధిత ఎఫ్ఐఆర్ ప్రతిని కంగన తన ఇన్స్ట్రాగామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘దేశానికి ద్రోహం చేసే వారికి వ్యతిరేకంగా మాట్లాడతా. అమాయక జవాన్లను చంపేసే నక్సలైట్లనూ వ్యతిరేకిస్తా. తుక్డే తుక్డే గ్యాంగ్లనూ విమర్శిస్తా. విదేశాల్లో కూర్చుని భారత్లో ఖలిస్తాన్ ఏర్పాటు కోసం కలలు కనే ఉగ్రవాదులనూ తప్పుబడతా. అయితే, ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. నన్ను చంపేస్తానని ఓ వ్యక్తి పంజాబ్లో బహిరంగంగా ప్రకటించాడు ’ అని కంగనా పోస్ట్చేశారు. ‘ సోనియా గాంధీజీ మీరూ ఒక మహిళే. మీ అత్తగారు ఇందిర గాంధీ ఇదే ఉగ్రవాదులపై తుదిశ్వాస వరకూ పోరాడారు. నన్ను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పంజాబ్లోని మీ(కాంగ్రెస్) ముఖ్యమంత్రికి సూచించండి’ అని కంగన విజ్ఞప్తిచేశారు. -
సజీవదహనం చేస్తామంటూ ఆప్ ఎంపీకి బెదిరింపులు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్కు బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయి. హిందూ వాహినికి చెందిన గుర్తుతెలియని వ్యక్తి ఫోన్చేసి చంపుతామంటూ సంజయ్ సింగ్పై బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో అప్రమత్తమైన ఆయన నార్త్ ఎవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'హిందూ వాహిని' నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించినట్లు సంజయ్సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. '7288088088 మొబైల్ నంబర్ నుంచి నాకు తెలియని వ్యక్తి నుంచి కాల్స్ వస్తున్నాయి. సోమవారం కూడా అదు నెంబర్ నుంచి నాకు ఫోన్ రావడంతో నా సహోద్యోగి అజిత్ త్యాగి ఫోన్కు మళ్లించాను. మధ్యాహ్నం 3.59 గంటలకు కాల్ తీసుకోగా.. కాల్ చేసిన వ్యక్తి తనను చంపేస్తానంటూ బెదిరించాడు. ఫోన్ చేసిన వ్యక్తి తనకు తానుగా హిందూ వాహిని నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపాడు. కిరోసిన్ పోసి సజీవ దహనం చేస్తానంటూ బెదిరించాడని' ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పోలీసులకు ఫిర్యాదు చేసిన కంప్లైంట్ను సంజయ్ సింగ్ తన ట్విటర్లో షేర్ చేశారు. -
నిన్ను చంపేస్తాం..
ముంబై: నగర మేయర్, శివసేన నాయకుడు కిషోరి ఫెడ్నెకర్ను చంపేస్తామని గుర్తుతెలియని దుండగులు ఆయనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో మేయర్ ఫిర్యాదు మేరకు దుండగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. గతేడాది డిసెంబర్ 21న తన మొబైల్కు గుర్తుతెలియని ఓ వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడని, ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నారని ఇటీవల దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన విలేకరులతో అన్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. 2019 నవంబర్లో ముంబై మేయర్గా ఫెడ్నెకర్ ఎన్నికయ్యారు. చదవండి: (కామాంధుల క్రూరత్వం: పక్కటెముకలు, కాలు విరిచి) -
నన్ను, నా ఫ్యామిలీని చంపేస్తామంటున్నారు
తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారని 'ఉడాన్' నటి మాల్వీ మల్హోత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిర్మాత చేతిలో కత్తిపోట్లకు గురైన నటి తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. తనను ఫ్యామిలీతో సహా చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కాగా తనతో వివాహానికి అంగీకరించలేదన్న కోపంతో నిర్మాత యోగేశ్ మహిపాల్ సింగ్ అక్టోబర్ 26న మాల్వీపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి జరిగిన మరుసటి రోజే పోలీసులు యోగేశ్ను అరెస్ట్ చేశారు. మరోవైపు కత్తిపోటు గాయాల నుంచి ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటుటున్నారు. ఇలాంటి సమయంలో చంపుతామని బెదిరింపులు రావడంతో నటి భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: విషాదం: నటుడి పుట్టినరోజు నాడే కొడుకు మృతి) దీని గురించి మాల్వీ మాట్లాడుతూ.. "నవంబర్ 18న రాత్రి 9 గంటలకు నేను, నా ఫ్యామిలీతో కలిసి ఇంటి పరిసరాల్లో వాకింగ్ చేస్తున్నాను. ఆ సమయంలో మాస్కు పెట్టుకున్న ఓ వ్యక్తి బైక్ మీద వచ్చి మా నాన్నను బెదిరించాడు. యోగేశ్కు త్వరలోనే బెయిల్ వస్తుంది. అప్పుడు మీ కుటుంబం అంతు చూస్తాం అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. మరో ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం" అని తెలిపారు.తన ఆరోగ్య పరిస్థితిని గురించి వివరిస్తూ.. 'పూర్తిగా నయమవలేదు. కేవలం వైద్య పరీక్షల కోసమే బయటకు వెళ్తున్నా. సాయంత్రం పూట నడవాలని వైద్యులు సూచించారు. కత్తిగాయాల వల్ల సరిగా నడలేకపోతున్నందుకు కొంత వ్యాయామం చేయాలన్నారు. తననీ స్థితికి తీసుకువచ్చిన యోగేశ్పై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా'నన్నారు. (చదవండి: బూడిద పూసుకొని నగ్నంగా తిరిగితే తప్పు లేదా..) -
‘నన్ను చంపుతామని బెదిరించారు’
దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న మూకహత్యలు, దాడులపై సినీపరిశ్రమతో పాటు వేర్వేరు రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు గళమెత్తిన సంగతి తెలిసిందే. ఇలా సంతకం చేసిన వారిలో నటుడు కౌషిక్ సేన్ కూడా ఉన్నారు. అయితే మూక హత్యల గురించి మాట్లాడిన తనను చంపుతామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు కౌశిక్ సేన్. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. మూక హత్యల గురించి మరోసారి మాట్లాడితే.. చాలా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది అంటూ బెదిరించడం ప్రారంభించాడు. అప్పుడు అతనితో నేను ‘చావడానికి కూడా సిద్ధమే కానీ నా ఆలోచనను మార్చుకోను. ఇలాంటి కాల్స్ నన్ను భయపెట్టలేవు’ అని స్పష్టం చేశాను’ అన్నాడు కౌశిక్ సేన్. అంతేకాక ఆ నంబర్ను పోలీసులకు ఇచ్చినట్లు తెలిపాడు. ‘అధిక వర్గాలకు జై శ్రీరాం పవిత్రమైనది.. దానిని అపవిత్రం చేయడం మానేయండి. దళితులు, క్రైస్తవులు, ముస్లింలపై జరుగుతున్న అమానుష ఘటనలను, ఊచకోతలను వెంటనే అరికట్టాలి. 2016లో ఇలాంటివి దాదాపు 840 కేసులు నమోదయిన విషయాన్ని నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) తెలిపింది. ఇది చూసి మేము చాలా అశ్చర్యపోయాము. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారింది. ఈ దీన స్థితికి మేము చింతిస్తున్నాము’ అని లేఖలో పేర్కొన్నారు. -
బుర్ఖా నిషేధం.. చంపేస్తామని బెదిరింపులు
తిరువనంతపురం: కేరళలోని ఓ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంఈఎస్) సంస్కరణలు పేరుతో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కోజికోడ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎంఈఎస్ తమ విద్యా సంస్థల పరిధిలో ముస్లిం విద్యార్థినుల బుర్ఖా వాడకంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలు జారీచేసిన సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఫజల్ గఫూర్ హత్యా బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ఇస్లాం సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఎంఈఎస్ నిర్ణయం తీసుకుందని, దానిని వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్కాల్ ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన సూచనలు మేరకు డ్రస్కోడ్ను నిర్ణయించుకునే హక్కు తమకు ఉందని, దానికి అనుగుణంగానే ఎంఈఎస్ విద్యాసంస్థల పరిధిలో బుర్ఖాని నిషేధించామని పోలీసులు వద్ద వాపోయారు. కాగా 2019-20 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సొసైటీ ఫజల్ గఫూర్ దేశ వ్యాప్తంగా ఉన్న తమ విద్యాసంస్థల అధిపతులకు సర్క్యులర్ జారీచేసిన విషయం తెలిసిందే. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బంది కూడా ఈ నిబంధనను తప్పక పాటించాల్సిందేనన్నారు. శ్రీలంకలో ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్ల తర్వాత ఆ దేశ ప్రభుత్వం గత నెల 21న ముస్లిం మహిళల బురఖా వినియోగాన్ని నిషేధించిందని, కానీ తాము అంతకు ముందే నిషేధం విధించామన్నారు. ఇదిలా ఉంటే దీనిపై కేరళ జామియాథుల్ ఉలేమా అధ్యక్షుడు సయ్యద్ ముహమ్మద్ జిఫ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుర్ఖాను నిషేధించాలన్న వారి ఆదేశాలను ఇస్లాంకు, షరియత్ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆర్సీబీని తిడితే చంపేస్తా!
బెంగళూరు : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస ఓటములతో ఆ జట్టు అభిమానులు అసహనం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే కొందరు అభిమానులు ఆర్సీబీ అభిమానులుగా తట్టుకోలేకపోతున్నామని ట్రోలింగ్కు సిద్దపడగా.. మరికొందరు జట్టు కెప్టెన్నే మార్చాలని డిమాండ్ చేశారు. తాజాగా ఓ వీరాభిమాని అయితే కామెంటేటర్ను చంపుతాననే హెచ్చరించాడు. న్యూజిలాండ్ బౌలర్, ప్రముఖ కామెంటేటర్ సిమన్ డౌల్ ఆర్సీబీ ఆటతీరుపై విమర్శలు గుప్పించాడు. దీన్ని తట్టుకోలేకపోయిన ఓ అభిమాని ఆర్సీబీని విమర్శిస్తే చంపుతానని హెచ్చరిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ‘ఇతరుల గురించి మాట అనే ముందు ఒకసారి ఆలోచించు. ఆర్సీబీ వారి పరాజాయాన్ని అంగీకరించింది. మళ్లీ ఎప్పుడూ ఆర్సీబీని కామెంట్ చేయకు. కాదని విమర్శించావో చచ్చిపోతావు.’ అని పోస్ట్లో పేర్కొన్నాడు. అయితే ఈ పోస్ట్పై సిమన్ డౌల్ స్పందించాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ఇది ఒక ఆట మాత్రమే. చిల్ ఔట్ బ్రో’ అంటూ సమాధానం ఇచ్చాడు. చాలా మంది చిన్న చిన్న విషయాలకు స్పందించవద్దని సిమన్ డౌల్కు సూచించడంతో అతను ఈ ట్వీట్ను తొలగించాడు. అయితే ఆ ఆర్సీబీ ఫ్యాన్.. డౌల్ ఏమన్నాడో చెప్పనప్పటికీ.. ఆర్సీబీపై వచ్చే విమర్శలు, ట్రోలింగ్ను తట్టుకోలేక ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆర్సీబీ ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్లు ఓడి గడ్డుకాలం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణ హాని ఉంది
-
‘జేసీ బ్రదర్స్ మమ్మల్ని చంపేస్తారేమో!’
సాక్షి, అనంతపురం: టీడీపీకి గుడ్బై చెప్పిన తాడిపత్రి నేతలు జగ్గీ బ్రదర్స్(బొమ్మిరెడ్డి జగదీశ్వర్రెడ్డి, జయచంద్రారెడ్డిలు) మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారంటున్నారు. ‘తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోంది. జేసీ బ్రదర్స్ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దౌర్జన్యాలు, అక్రమాలకు తెగబడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వాళ్ల నుంచి మాకు ప్రాణహాని ఉంది. జేసీ ఫ్యామిలీ నుంచి మా ఇద్దరికీ రక్షణ కల్పించాలంటూ చంద్రబాబు గతంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్కు లేఖ కూడా రాశారు. మాకు ఏ హాని జరిగినా జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వారి కొడుకులే కారణం. ఇకపై జేసీ బ్రదర్స్ ఓటమే లక్ష్యంగా కృషిచేస్తాం’ అని జగ్గీ బ్రదర్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జగ్గీ బ్రదర్స్ జూన్ 20న వివరణ కూడా ఇచ్చారు. అయితే సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధ్యక్షుని పేరుతో ఉన్న ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన వారిద్దరూ టీడీపీకి గుడ్బై చెప్పారు. తాజా పరిణామాలతో తాడిపత్రి టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మరికొందరు సీనియర్ నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. (పూర్తి కథనం.. తాడిపత్రిలో టీడీపీకి షాక్) -
మహా సీఎంకు బెదిరింపు లేఖ
సాక్షి, ముంబయి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన కుటుంబ సభ్యులను హతమారుస్తామని ఏకంగా సీఎం కార్యాలయానికి లేఖ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్లో గడ్చిరోలి ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు మృత్యువాత పడిన ఘటనను ఈ లేఖలో ప్రస్తావించారు. కొద్దిమంది కామ్రేడ్లను నిర్మూలించడంతో విప్లవం ఆగదని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. సీఎం కార్యాలయానికి బెదిరింపు లేఖ అందడంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు గడ్చిరోలి పోలీసులు తెలిపారు. మరోవైపు ఎన్కౌంటర్ను నిరసిస్తూ గడ్చిరోలి జిల్లా భంరగ తాలూకాలో కరపత్రాలు, బ్యానర్లు వెలిశాయి. అత్యున్నత స్థాయి వ్యక్తులకు బెదిరింపు లేఖ రావడం ఒకేరోజులో ఇది రెండవది కావడం గమనార్హం. రాజీవ్గాంధీని హతమార్చిన తీరులో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్రపన్నినట్టు ఈ మేరకు మావోయిస్టులు ప్రణాళిక రూపొందించారని పూణే పోలీసులు వెల్లడించారు. అందుకు సంబంధించిన లేఖను వారు విడుదల చేశారు.మావోయిస్టులు గత ఏడాది ఏప్రిల్లో ఆ లేఖను రాసినట్టు సమాచారం. -
‘ఆమె రక్తం కావాలి.. ఓపికను పరీక్షిస్తోంది’
తిరువనంతపురం, కేరళ : కేరళలోని త్రిచూర్కు చెందిన ఓ మహిళా లెక్చరర్ తనకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీపా నిశాంత్ త్రిచూర్లోని శ్రీ కేరళ వర్మ కాలేజ్లో లెక్చరర్గా పని చేస్తున్నారు. కొందరు బీజేపీ కార్యకర్తలు ఆమెను చంపుతామంటూ ఫేస్బుక్ వేదికగా బెదిరించారు. తనను బెదిరించిన వారిని త్వరగా అరెస్టు చేయాలని దీపా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ను కోరారు. కేరళ బీజేపీ నాయకుడు, ఇంటెలెక్చువల్ వింగ్ అధ్యక్షుడు టీజీ మోహన్దాస్ తన నంబర్ను సోషల్మీడియాలో పోస్టు చేశారని, అప్పటినుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని దీపా ఫిర్యాదులో పేర్కొన్నారు. బహ్రయిన్లో ఉంటున్న రమేశ్ కుమార్ అనే వ్యక్తి ‘ఆమె రక్తం కావాలి.. ఓపికను పరీక్షిస్తోంది’ అంటూ సోషల్మీడియాలో దీపాను ఉద్దేశించి పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ‘మేం అందుకే ప్రయత్నిస్తున్నాం’ అంటూ ఇంటెలెక్చువల్ వింగ్లో పని చేసే బిజు నాయర్ అనే వ్యక్తి రమేశ్ పోస్టుకు కామెంట్ చేశాడు. కాగా, దీపా ఫిర్యాదుపై స్పందించేందుకు టీజీ మోహన్ దాస్ నిరాకరించారు. -
మంత్రికి బెదిరింపు కాల్..ఎఫ్ఐఆర్ నమోదు
అలహాబాద్ : ఉత్తర్ ప్రదేశ్కు చెందిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి నంద గోపాల్ గుప్తా నందికి శుక్రవారం బెదిరింపు కాల్ వచ్చింది. తాను సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే విజయ్ మిశ్రా అనుచరుడిని అని చెప్పుకుంటూ మంత్రిని చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి మంత్రి మొబైల్కు కాల్ చేసి బెదిరించాడు. ఈ విషయం పోలీసులకు తెలపడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్ చేసిన వ్యక్తి అడ్రస్ తెలుసుకున్న పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. అప్పటికే అతను పరారీలో ఉన్నాడు. కాల్ చేసిన వ్యక్తి ఆటో మొబైల్ ఏజెన్సీ నిర్వాహకుడు రాజత్ కేశర్వాణిగా గుర్తించారు. నంద గోపాల్ గుప్తా పూర్వం బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో ఉండి మాయావతి ప్రభుత్వంలో 2007 నుంచి 2012 వరకు మంత్రిగా పనిచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. 2015 సంవత్సరంలో నందగోపాల్ గుప్తాపై బాంబు దాడి జరిగింది. ఆ సమయంలో గుప్తా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన భార్య ప్రస్తుతం అలహాబాద్ మేయర్. -
ఫేక్ ఎన్కౌంటర్ చేస్తారనే... :తొగాడియా
అహ్మదాబాద్ : అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్పీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన గుజరాత్, రాజస్థాన్ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు బనాయించి ఫేక్ ఎన్కౌంటర్లో చంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘ పదేళ్ల క్రితం కేసును ఇప్పుడు తిరగదోడుతున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు నన్ను వేధిస్తున్నారు. ఎన్కౌంటర్లో నన్ను చంపాలని చూస్తున్నారు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే నా ప్రయత్నం. చట్టాన్ని గౌరవిస్తా.. త్వరలోనే పోలీసుల ముందు లొంగిపోతాను’ అని తొగాడియా ప్రకటించారు. తనకేం జరిగినా ప్రభుత్వాలదే బాధ్యతని ఆయన పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరం, గో వధ నిషేధ చట్టం తదితర అంశాలపై మాట్లాడుతున్నందుకే కొందరు తనపై కక్ష గట్టారని ఆయన చెప్పారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా హిందు సమాజ శ్రేయస్సు కోసం తాను చేసే కృషిని ఎవరూ అడ్డుకోలేరని తొగాడియా వ్యాఖ్యానించారు. సోమవారం మధ్యాహ్నాం నుంచి ఆయన కనిపించకుండా పోయే సరికి.. రాజస్థాన్ పోలీసులే ఆయన్ని అరెస్ట్ చేసి ఉంటారని కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే అనూహ్యంగా ఆయన అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యక్షం కావటం విశేషం. షుగర్ లెవల్స్ పడిపోవటంతో షాహిబాగ్లోని ఓ పార్క్లో స్పృహ కోల్పోయి పడిపోగా.. స్థానికులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు వైద్యులు వెల్లడించారు. -
'వదిలిపెట్టను.. సీఎంను చంపేస్తా..'
సాక్షి, పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను చంపేస్తానంటూ బెదిరింపులు వచ్చాయి. పట్నా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నితీశ్ను త్వరలోనే హత్య చేస్తానని హెచ్చరిస్తూ ఏకంగా సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా జిల్లాలోని ఫతుహా అనే ప్రాంతానికి చెందిన ప్రమోద్ కుమార్ అలియాస్ పోయామా తన బాడీగార్డ్లతో కలిసి ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. నితీశ్ను త్వరలోనే చంపేస్తానంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. అంతకుముందు ముఖ్యమంత్రి నితీశ్ కాన్వాయ్పై దాడి జరిగిన కొద్ది సేపటికే ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు శరవేగంగా స్పందించారు. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు ఎందుకు అలా చేశాడని ప్రశ్నిస్తున్నారు. సమీక్ష యాత్ర పేరుతో నితీశ్ గ్రామాల్లో పర్యటిస్తుండగా నందన్ అనే గ్రామంలో కొంతమంది వ్యక్తులు ఆయన కాన్వాయ్పై దాడి చేశారు. రాళ్లను విసిరి కొట్టారు. అయితే, నితీశ్ సురక్షితంగా బయటపడినప్పటికీ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మాత్రం గాయపడ్డారు. ఆ కాసేపటికే ఈ వీడియో బయటకు వచ్చింది. అరెస్టయిన ప్రమోద్కుమార్ ఇసుక వ్యాపారి అని తెలిసింది. గత కొద్ది రోజులుగా ఇసుక కొరత కారణంగా తన వ్యాపారం దెబ్బదిన్నదనే ఆగ్రహంతోనే అతడు నితీశ్ను చంపేస్తానని అన్నట్లు సమాచారం. -
మమల్ని చంపుతారంట!
రాంచీ : జార్ఖండ్ లో ఈ మధ్యే 11 ఏళ్ల చిన్నారి సంతోష్ కుమారి ఆధార్ అనుసంధానం మూలంగా ప్రాణాలు కోల్పోయిందన్న విమర్శలు తెలెత్తటం తెలిసిందే. నిరక్షరాస్యులైన పేద ప్రజల ఆకలి చావుకు దర్పణం పట్టిన ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే అది ఆధార్ మరణం కాదంటూ యూఐడీఏ చెప్పటం.. మలేరియాతో చిన్నారి చనిపోయిందంటూ ఆరోగ్య శాఖ ప్రకటించటంతో... జార్ఖండ్ ప్రభుత్వం చేతులు దులిపేసుకుందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ కుటుంబం ఉంటున్న సిమ్డేగలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత బాలిక కుటుంబాన్ని చంపుతామంటూ గ్రామస్తులు బెదిరించారని సమాచారం. ఈ మేరకు సంతోషి కుమారి తల్లి కొయిలా దేవి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘మా కుటుంబం భయంతో బతుకుతున్నాం. వెంటనే ఊరు వదిలి వెళ్లాలని.. లేకపోతే చంపేస్తామని బెదిరించారు’’ అని కోయిలా దేవి ఆరోపించారు. దీంతో ఆదివారం పెద్ద ఎత్తున్న పోలీస్ బలగాలు గ్రామంలో మోహరించి పహరా కాస్తున్నాయి. మరోవైపు ఆమెపై ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి సరయు రాయ్ ప్రకటించారు. ఆమెకు ఇకపై ఎలాంటి సమస్య తలెత్తబోదని ఆయన హామీ ఇస్తున్నారు. -
బీజేపీ మహిళా నేతకు బెదిరింపులు
తిరువొత్తియూరు: తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్కు ఫోన్లో బెదిరింపు కాల్స్ రావడంతో ఆమె ఇంటి ముందు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. సౌందరరాజన్కు గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్కాల్ వచ్చింది. అందులో మీ అంతు చూస్తానంటూ ఆ వ్యక్తి బెదిరింపులు ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై తమిళిసై ఆదేశాల మేరకు ఆమె న్యాయవాది తంగమణి విరుగంబాక్కం పోలీసుస్టేషన్లో రాత్రి 12 గంటలకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన విరుగంబాక్కం పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే తమిళిసై ఇంటి ముందు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. గోమాంసం నిషేధానికి మద్దతుగా తన భావాన్ని తెలపడంతో ఆమెకు బెదిరింపులు వచ్చినట్టు తెలియవచ్చింది. ఈ క్రమంలో ఫోన్ నంబరు ఆధారంగా బెదిరింపులు ఇచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెదిరింపులకు భయపడను: తమిళిసై చెన్నై నందనం వైఎంసీఏ మైదానంలో ‘రండి బలమైన భారతం వైపునకు’ అనే పేరుతో శుక్రవారం ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై మాట్లాడుతూ బెదిరింపులకు తాను భయపడనని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మోదీ ఉత్సవాలు జరుగుతున్నాయని.. 9వ తేదీన కోవైలో జరగనున్న కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విచ్చేయనున్నట్లు తెలిపారు. -
మీ వల్లే ఆమె జైలులో ఉంది
ఆప్ నేత ఆశిష్ ఖేతన్కు బెదిరింపు లేఖ న్యూఢిల్లీ: కొన్ని హిందూ అనుంబంధ సంస్థలు తనను చంపుతామని బెదిరించినట్లు ఆప్ నాయకుడు ఆశిష్ ఖేతన్ శనివారం ఆరోపించారు. వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజును డిమాండ్ చేశారు. హిందూ సాధువులపై పాపాలు చేయడంలో అన్ని పరిమితులు దాటారని పేర్కొంటూ మే 9న ఓ లేఖ ఆయనకు చేరింది. ‘మీ వల్లే.. సాధ్వి ప్రగ్యా(మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు), వీరేంద్ర సింగ్(హేతువాది దబోల్కర్ హత్య కేసులో నిందితుడు) జైలులో ఉన్నారు. మీలాంటి వాళ్లకు ఉరిశిక్షే సరి’ అని లేఖలో రాసి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై స్పందిస్తూ... ఇది తనను షాక్కు గురిచేసిందని, హోం మంత్రి రాజ్నాథ్ చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ జర్నలిస్టు అయిన ఆశిష్ ఖేతన్ 2014 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ నియోజక వర్గం పోటీ చేసి ఓడిపోయారు. గతేడాది కూడా ఆయనకు ఇదే విధంగా బెదిరింపు లేఖ వచ్చింది. జర్నలిస్టులు, రచయితలు, హక్కుల కార్యకర్తలకు అతివాదుల నుంచి ముప్పు పొంచివుందని ఖేతన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
'ప్రాణాలతో వెళ్లవని బెదిరించాడు'
న్యూఢిల్లీ: అఖిలేశ్పై తాను చేసిన ప్రశంసలు తేనెపూసిన మాటలు కావని బహిష్కృత నేత అమర్సింగ్ అన్నారు. సమాజ్వాదీ పార్టీలో పునరాగమనం కోసం తాను అఖిలేశ్ను పొగడ లేదని చెప్పారు. సైకిల్ గుర్తును ఎన్నికల కమిషన్(ఈసీ) అఖిలేశ్కు కేటాయిస్తూ చేసిన ప్రకటన అనంతరం అమర్సింగ్ అఖిలేశ్పై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. పార్టీలో ముసలానికి కారణం అఖిలేశేనని అమర్సింగ్ గతంలో విమర్శించారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురికావడం బాధను కలిగించిందని ఆయన చెప్పారు. బహిష్కరణకు గురైన తర్వాతి నుంచి రామ్గోపాల్ యాదవ్ తనను ఓడిపోయిన పోట్లగిత్తలా చూస్తున్నారని అన్నారు. అంతేకాకుండా తనను చంపేస్తానని పలు మార్లు రామ్గోపాల్ యాదవ్ బెదిరించినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాణాలతో వెళ్లలేవని రామ్గోపాల్ యాదవ్ అన్నట్లు తెలిపారు. రాజ్యసభ ఎంపీ అయిన అమర్సింగ్కు ఈ మధ్య కాలంలోనే భద్రతను జెడ్ కేటగిరీకి పెంచారు. కేంద్ర రక్షణా సంస్ధల ఆదేశాల మేరకే అమర్సింగ్కు భద్రతను పెంచినట్లు ఓ అధికారి తెలిపారు. -
అన్నా హజారేను హతమారుస్తాం
పుణె: ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నాహజారేను హతమారుస్తానంటూ ఓ వ్యక్తి ఆయన కార్యాలయానికి బెదిరింపు లేఖ పంపారు. మరాఠీలో చేతిరాతతో రాసి ఉన్న లేఖలో హజారే సమాజంలో అశాంతికి కారణమవుతున్నారని, అందుకే అంతమొందిస్తామని ఉందని ఆయన కార్యాలయ ప్రతినిధి శ్యామ్ అశ్వా తెలిపారు. లేఖలో రాసిన వ్యక్తి తనను నెవెసాకు చెందిన అంబాదాస్ గా పేర్కొన్నాడు. హజారేకు బెదిరింపు లేఖపై సమాచారాన్ని గురించి ఆయన కార్యాలయాన్ని కోరగా వారు నిరాకరించారని పార్నర్ పోలీసులు తెలిపారు. 33 నెలల్లో ఇది 15వ బెదిరింపు లేఖ. కానీ ఈసారి ఆయనను జనవరి 26న హతమారుస్తామని లేఖలో పేర్కొన్నారు. గాంధేయవాది ఇటువంటి బెదిరింపులకు భయపడరని హజారే వ్యక్తిగత కార్యదర్శి అసవ తెలిపారు. హజారేకు జెడ్ కేటగిరీ రక్షణ ఉంది. -
జైల్లో ఉన్నా.. ఆ డాన్ను లేపేస్తామంటున్నారు?
న్యూఢిల్లీ: గత ఏడాది అక్టోబర్లో ఇండోనేషియాలో పట్టుబడ్డ అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ప్రస్తుతం తీహార్ జైలులో అత్యంత భద్రత మధ్య ఉన్నాడు. అయినా అతడికి చావు బెదిరింపులు ఆగడం లేదు. ఛోటా రాజన్ను చంపేస్తామంటూ తాజాగా దావూద్ ఇబ్రహీం నమ్మిన బంటు, గ్యాంగ్స్టర్ ఛోటా షకీల్ తీహార్ జైలు సీనియర్ అధికారికి ఎస్సెమ్మెస్ చేశాడు. ఈ బెదిరింపు మెసేజ్ నేరుగా ఛోటా షకీల్ మొబైల్ ఫోన్ నుంచే వచ్చినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్కు మంరిత అదనపు భద్రత కల్పించాలని జైలు అధికారులు నిర్ణయించారు. 971504265138 సెల్ నంబర్ నుంచి తీహార్ జైలు లా అధికారి సునీల్ గుప్తాకు ఇటీవల ఓ ఎస్సెమ్మెస్ వచ్చింది. ఛోటా రాజన్ను అతిత్వరలోనే అంతం చేస్తామని ఆ ఎస్సెమ్మెస్ బెదిరించింది. ఆ వెంటనే తీహార్ జైలు ల్యాండ్లైన్ నంబర్ ఓ కాల్ కూడా వచ్చింది. అందులోనూ రాజన్ ను చంపేస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలో రాజన్కు మరింత భద్రత పెంచిన జైలు సిబ్బంది.. ఈ బెదిరింపుల గురించి పోలీసులకు సమాచారమిచ్చారు. -
వాళ్లను చంపడం జాతి ధర్మం
జేఎన్యూ వివాదం ఇంకా రగులుతూనే ఉంది. అక్కడి విద్యార్థి సంఘ నేతలు కన్హయ్యకుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను చంపేస్తామంటూ ఎప్పటికప్పుడు కొత్గా పోస్టర్లు వెలుస్తున్నాయి. ఇంతకుముందు కన్హయ్యను చంపితే 11 లక్షలు ఇస్తానని ప్రకటించిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే జైల్లో పెట్టారు. ఈ లోపు వాట్సప్, ఇతర సోషల్ మీడియాలో మరో పోస్టర్ ప్రచారంలోకి వచ్చింది. ''జేఎన్యూ ద్రోహులను కాల్చి చంపడం జాతిధర్మం. నేను ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, కన్హయ్యలను కాల్చేస్తా'' అని ఈ పోస్టర్లో ఉంది. తన పేరు బల్బీర్ సింగ్ భారతీయ అని, తాను సమాజ సేవకుడినని, అన్నా హజారే నేతృత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని అందులో పేర్కొన్నాడు. పోస్టర్లో తన ఫోన్ నంబర్, పాస్పోర్టు సైజు ఫొటో కూడా పెట్టాడు. జేఎన్యూ విద్యార్థులకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆ పోస్టర్లో ఖండించారు. ''అఫ్జల్గురు ఉరితీత దినం రోజున పండగ చేసుకున్నవారిని నేను కాల్చేస్తా.. ఉగ్రవాదుల కంటే వెన్నుపోటుదారుల వల్లే దేశానికి ఎక్కువ ముప్పు ఉంది. ఇలాంటి వాళ్లకు జీవితఖైదు విధించాలి'' అని కూడా పోస్టర్లో రాశారు. ఈ విషయంపై ఇప్పటికే విచారణ ప్రారంభిచినట్లు డీసీపీ జతిన్ నర్వాల్ చెప్పారు. పోస్టర్లో ఉన్న నంబరుకు పోలీసులు ఫోన్ చేస్తే, తనకు యమునా బజార్లో ఓ దుకాణం ఉందని అవతలి వ్యక్తి చెప్పాడు. అయితే పోస్టర్లు వేసిన విషయం గురించి మాత్రం అతడు పెద్దగా స్పందించలేదు. అతడిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. -
సూపర్ స్టార్ భార్యకు బెదిరింపులు
లండన్: హాలీవుడ్ సూపర్ స్టార్ జార్జి క్లూనీ భార్య అమల్ అలముద్దీన్ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్లోని జార్జి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమల్.. అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది. జైలుపాలైన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తరపున ఆమె వాదిస్తోంది. బెదిరింపులు రావడంతో అమల్కు పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేశారు. సౌత్ ఆక్స్ఫర్డ్షైర్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ పాల్ హారిసన్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. జార్జి ఇంటి వద్ద భద్రతతో పాటు నిఘా ఉంచారు. జార్కి ఎక్కువ భద్రత అవసరం లేదని, అమల్కు పటిష్టమైన భద్రత కల్పించామని హారిసన్ చెప్పారు. అత్యున్నత స్థాయి కేసులు వాదిస్తున్నందున ఆమెకు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. మాల్దీవులు అధ్యక్ష పదవి నుంచి 2012లో ఉద్వాసనకు గురైన మహ్మద్ నషీద్కు.. ఉగ్రవాద నిర్మూలన చట్టం కింద గతేడాది 13 ఏళ్ల జైలు శిక్షపడింది. కాగా వెన్నెముకకు సర్జరీ చేయించుకునేందుకు గాను ఆయన ఇంగ్లండ్కు వెళ్లేందుకు ఇటీవల అనుమతిచ్చారు. -
గిరీష్ కర్నాడ్ను చంపేస్తామని హెచ్చరిక
ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని డిమాండ్ చేసినందుకు ఆయన్ను చంపేస్తామంటూ కొంతమంది హెచ్చరించారు. తర్వాత.. హిందువులను, వక్కలింగ వర్గాన్ని అవమానిస్తూ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ బెంగళూరు పోలీసులకు ఓ ఫిర్యాదు కూడా అందింది. మంగళవారం నాడు టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా గిరీష్ కర్నాడ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఈ వేడుకలను నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. వాటిలో కొన్ని హింసాత్మకంగా కూడా మారి, పోలీసు కాల్పుల్లో ఓ వీహెచ్పీ కార్యకర్త మరణించాడు. తన వ్యాఖ్యలతో వివాదం రేగడంతో.. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా అయిన గిరీష్ కర్నాడ్ క్షమాపణలు చెప్పారు. ఎవరైనా తన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడితే క్షమాపణలు చెబుతున్నానని, అలా చెప్పడం వల్ల తనకేమొస్తుందని అన్నారు. 'ఇన్టోలరెంట్ చంద్ర' అనే యూజర్ నేమ్తో ట్విట్టర్లో గిరీష్ కర్నాడ్ను హెచ్చరిస్తూ పోస్టింగ్ వచ్చిందని, దీనిపై ఏమైనా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. -
మత్తయ్య ఫిర్యాదు... కేసు సీఐడీకి అప్పగింత
-
మత్తయ్య ఫిర్యాదు... కేసు సీఐడీకి అప్పగింత
విజయవాడ: తనకు తెలంగాణ పోలీసులు, టీఆర్ఎస్ నేతల నుంచి ప్రాణహాని ఉందంటూ ఓటుకు నోటు వ్యవహారంలో ఏ 4 నిందితుడైన జె.మత్తయ్య మంగళవారం విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడి ఫిర్యాదు మేరకు 506, 387 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని తెలంగాణ ఏసీబీ సిద్ధమవుతుంది. ఈ తరుణంలో మత్తయ్య కేసును చంద్రబాబు సర్కార్ ఆంధ్రప్రదేశ్ సీఐడీకి అప్పగించింది. -
త్రిష కాబోయే భర్తకు హత్యాబెదిరింపులు
నటి త్రిష కాబోయే భర్తకు హత్యాబెదిరింపులు రావడంతో ఆమె భయాందోళనలకు గురవుతున్నారు. త్రిష, వరుణ్మణియన్ల నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. వరుణ్ మణియన్ ప్రముఖ వ్యాపారవేత్త. సినీ నిర్మాత. ఈ ప్రేమ జంట వివాహ నిశ్చితార్థం జరిగిన తరువాత వరుణ్మణియన్ను త్వరలో జరగనున్న ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్కింగ్స్ జట్టును కొనుగోలు చేయమని త్రిష కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని వరున్మణియన్ కొట్టిపారేశారు. ఇలాం టి పరిస్థితిలో ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తే అంతు చూస్తామని ఆయనకు ఫోన్కాల్స్ వస్తున్నాయట. దీంతో వరుణ్మణియన్ ఆదివారం స్థానిక తేనాంపేటలో గల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను బెదిరిస్తున్న ఆగంతులెవరో తెలుసుకుని వారిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.