Delimitation
-
Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి
న్యూఢిల్లీ: లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ మోదీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. అయితే జన గణన, డీ లిమిటేషన్ వంటివాటితో నిమిత్తం లేకుండా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. అలాగే మూడో వంతు రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా వర్తింపజేయాలన్నారు. బుధవారం లోక్సభలో మహిళా బిల్లుపై చర్చను విపక్షాల తరఫున ఆమె ప్రారంభించారు. రిజర్వేషన్ల అమలులో ఏ మాత్రం ఆలస్యం చేసినా అది భారత మహిళల పట్ల దారుణ అన్యాయమే అవుతుందని అన్నారు. ‘కుల గణన జరిపి తీరాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఇందుకోసం తక్షణం కేంద్రం చర్యలు చేపట్టాలి‘ అని పునరుద్ఘాటించారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగతాన్నీ, భావోద్వేగాలను కూడా రంగరిస్తూ సాగిన ప్రసంగంలో సోనియా ఏమన్నారంటే... ‘దేశాభివృద్ధిలో మహిళల పాత్రను సముచితంగా గుర్తుంచుకునేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది సరైన సమయం. అందుకే, నారీ శక్తి విధాన్ అధినియమ్కు కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా మద్దతిస్తుంది. దాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలి. ఆ దారిలో ఉన్న అడ్డంకులను తలగించాలి‘. వంటింటి నుంచి అంతరిక్షం దాకా... ‘మసిబారిన వంటిళ్ల నుంచి ధగధగా వెలిగిపోతున్న స్టేడియాల దాకా, అంతరిక్ష సీమల దాకా భారత మహిళలది సుదీర్ఘ ప్రయాణం. అటు పిల్లలను కని, పెంచి, ఇటు ఇల్లు నడిపి, మరోవైపు ఉద్యోగాలూ చేస్తూ అంతులేని సహనానికి మారుపేరుగా నిలిచింది మహిళ. అలాంటి మహిళల కష్టాన్ని, గౌరవాన్ని, త్యాగాలను సముచితంగా గుర్తించినప్పుడు మాత్రమే మానవతకు సంబంధించిన పరీక్షలో మనం గట్టెక్కినట్టు‘. స్వాతంత్య్ర పోరులోనూ నారీ శక్తి ‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలోనూ, అనంతరం ఆధునిక భారత నిర్మాణంలో కూడా భారత మహిళలు పురుషులతో భుజం కలిపి సాగారు. కుటుంబ బాధ్యతల్లో మునిగి సమాజం, దేశం పట్ల తమ బాధ్యతలను ఎన్నడూ విస్మరించలేదు. సరోజినీ నాయుడు, సుచేతా కృపాలనీ, అరుణా అసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్, రాజ్ కుమార్ అమృత్ కౌర్, ఇంకా ఎందరెందరో మహిళామణులు మనకు గర్వకారణంగా నిలిచారు. గాం«దీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ తదితరుల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ వంతు పాత్ర పోషించారు‘. రాజీవ్ కల.. అప్పుడే సాకారం ‘చట్ట సభల్లో మహిళలకు సముచిత ప్రాతి నిధ్యం దక్కాలన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు ఆమోదం పొందినప్పుడే అది పూర్తిగా సాకారవుతుంది. నేనో ప్రశ్న అడగాలనుకుంటున్నా. భారత మహిళలు తమ రాజకీయ బాధ్యతలను తలకెత్తుకునేందుకు 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇప్పుడు కూడా వారిని ఇంకా ఆరేళ్లు, ఎనిమిదేళ్లు... ఇలా ఇంకా ఆగమంటూనే ఉన్నారు. భారత మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన సరైనదేనా?‘ మహిళా శక్తికి ప్రతీక ఇందిర... ఇక దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిత్వం భారత మహిళల శక్తి సామర్థ్యాలను తిరుగులేని ప్రతీకగా ఇప్పటికీ నిలిచి ఉంది. వ్యక్తిగతంగా నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన సందర్భం. మహిళలకు స్థానిక సంస్థల్లో మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ నా జీవిత భాగస్వామి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తొలిసారిగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. కానీ రాజ్యసభలో ఆ బిల్లును కేవలం ఏడు ఓట్లతో ఓడించారు. అనంతరం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పాస్ చేయించింది. ఫలితంగా నేడు 15 లక్షలకు పైగా మహిళలు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా రాణిస్తున్నారు‘. -
అదొక్కటే ప్రమాణం కాదు! డీలిమిటేషన్పై అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు
డీలిమిటేషన్పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గాల విభజనకు జనాభా మాత్రమే ప్రాతిపదిక కాకూడదని హిమంత బిస్వాశర్మ అన్నారు. కొత్తగా రూపొందించిన నాలుగు జిల్లాల విలీనానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన ఒకరోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి డీలిమిటేషన్ కోసం జిల్లాల విలీనానికి మంత్రి వర్గం ఆమోదం తెలపలేదని, కేవలం పరిపాలనపరమైన చర్యల కోసమే అలా చేశామని తేల్చి చెప్పారు. ఐతే ఈ డీలిమిటేషన్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ విషయమై తాము పార్లమెంటు చేసిన చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు. అలాగే జనాభాను నియంత్రించమని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను కోరిందని, కానీ కొన్ని ప్రాంతాల్లో దీన్ని పాటించలేదని ముఖ్యమంతి హిమంత బిస్వా శర్మ అన్నారు. అంతేగాదు తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ప్రస్తుత చట్టం ప్రీమియం ఇస్తుంది కాబట్టి పార్లమెంటులో ఈ విషయంపై చర్చ జరగాలన్నారు. ఈ డీలిమిటేషన్ అనేది దేశంలో లేదా శాసన సభ ఉన్న రాష్ట్రంలో ప్రాదేశిక నియోజకవర్గాల పరిమితులు లేదా సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. కానీ ఇది స్వదేశీయుల హక్కులను, భవిష్యత్తును రక్షించలేకపోయిందని అన్నారు. ఈ డీలిమిటేషన్ కసరత్తు మన సమాజాన్ని కాపాడుతుందని, అలాగే అసెంబ్లీ లోపల జనాభా మార్పును కాపాడుతుందని అన్నారు. దీన్ని రాజకీయేతర రాజ్యంగ కసరత్తుగా అభివర్ణించారు. కాగా విలీన ప్రణాళిక ప్రకారం..బిస్వనాథ్ జిల్లాను సోనిత్పూర్లో, హోజాయ్ను నాగావ్లో, తముల్పూర్ జిల్లాను బక్సాలో, బజలి జిల్లాను బార్పేట జిల్లాలో విలీనం చేశారు. ప్రస్తుతం అస్సాంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతున్నందున జనవరి 1, 2023 నుంచి అస్సాం ప్రభుత్వం ఏ జిల్లాలు లేదా పరిపాలన విభాగాలలో ఎటువంటి మార్పులు చేయకూడదని నిర్దేశిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు) -
ఈ కశ్మీర్ లెక్క కరెక్టేనా?
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ–కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) కమిషన్ ప్రతిపాదన అసంతృప్తి జ్వాలలను రగులుస్తున్నది. కేంద్రం నియమించిన డీలిమిటేషన్ కమిషన్ కొత్తగా జమ్మూలో ఆరు అసెంబ్లీ సీట్లు, కశ్మీర్లో ఒకటి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించి, జనాభిప్రాయాన్ని కోరింది. ఈ ప్రతిపాదనలు బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయనీ, జమ్మూ, కశ్మీర్ల మధ్య విభజన రేఖను గీసి వాటి మధ్య శత్రుత్వ భావం పెంచేలా ఉన్నాయనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి 2011 జనాభా గణాంకాలను బట్టి చూస్తే... మొత్తం 90 సీట్లలో కశ్మీర్కు ప్రస్తుతం ఉన్న 46 స్థానాలను 51 స్థానాలకు, జమ్మూకు ప్రస్తుత 37 సీట్లను 39కి పెంచాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్లో ఉన్న రాజకీయ కేంద్రీకరణ, ఆధిపత్యంౖపై ఈ ప్రతిపాదన ఒక దాడి లాంటిది. 2019 ఆగస్టు 5న బీజేపీ నాయకత్వం లోని ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ సాధికారతను తగ్గించడానికి ప్రారం భించిన చర్యల్లో ఇదొక భాగం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత జనాభా లెక్కల ప్రకారం, జమ్మూ జనాభా కన్నా కశ్మీర్ జనాభా 15 లక్షల మంది ఎక్కువగా ఉన్నప్పటికీ కశ్మీర్కు 1, జమ్మూకు 6 కొత్త నియోజక వర్గాలను ఏర్పాటు చేయాలనడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవు తోంది. జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరగాలనేది 1995 నుంచీ బీజేపీ ఎజెండాగా ఉంది. 2020 మార్చి 6న కేంద్ర ప్రభుత్వం జమ్మూ–కశ్మీర్లో నియోజక వర్గాల పునర్విభజన కోసం డీలిమిటేషన్ కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ డిసెంబర్ 20న తన అసోసియేట్ సభ్యులైన ముగ్గురు నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీలు, ఇద్దరు బీజేపీ ఎంపీలకు మొత్తం మీద ఆరు కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనల గురించి చెప్పింది. తమ ప్రతి పాదనలపై డిసెంబర్ 31 లోపు ప్రతి స్పందించాలని కోరిందని ఎంపీలు పేర్కొన్నారు. కశ్మీర్కు మరిన్ని సీట్లు రావలసి ఉందనీ, ఈ ప్రతిపాదన తమకు ఏమాత్రం సమ్మతం కాదనీ ఎన్సీ ఎంపీ జస్టిస్ (రిటైర్డ్) హస్నెయిన్ మసూది అన్నారు. డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనతో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో జమ్మూ సీట్లు 37 నుంచి 43కు, కశ్మీర్ సీట్లు 46 నుంచి 47కు పెరుగు తాయి. జమ్మూలోని కథువా, సంబా, ఉధంపూర్, దోడ, కిష్త్వార్, రాజౌరీ జిల్లాల్లో ఒక్కో నియోజక వర్గాన్ని, కశ్మీర్ లోయలోని కుప్వారా జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని అదనంగా ఏర్పాటు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. కథువా, సంబా, ఉధంపూర్ సెగ్మెంట్లలో హిందువులు అత్యధికంగా ఉన్నారు. జనాభా లెక్కల ప్రకారం కథువాలో 87.61 శాతం హిందూ జనాభా ఉంది. కాగా సంబాలో 86.33 శాతం, ఉధంపూర్లో 88.12 శాతం హిందువులు ఉన్నారు. కిష్త్వార్, దోరా, డజౌరీ జిల్లాల్లోనూ గణనీయంగా (37 శాతం నుంచి 45 శాతం) హిందువులు ఉన్నారు. పునర్విభజన కథ ఇదీ... అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఒకే పరిమాణంలో ఓటర్లు ఉండేలా చూసేందుకు డీలిమిటేషన్ చేపడతారు. చివరిసారి దేశంలో నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) 2002లో జరిగింది. జమ్మూ– కశ్మీర్లో మాత్రం 1995లో రాష్ట్రపతి పాలన ఉన్న కాలంలో జరిగింది. దానికి ముందు 1993లో తాత్కాలిక ప్రాతిపదికన జగ్మోహన్ డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించారు. అప్పట్లో 87 అసెంబ్లీ సీట్లు ఉండాలని ప్రతిపాదిం చారు. అయితే 2002లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం 2026 వరకు డీలిమిటేషన్ను నిర్వహించడానికి వీల్లేకుండా రాష్ట్ర రాజ్యాంగాన్ని సవరించింది. కానీ 2008 నుంచి బీజేపీ డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. జమ్మూ ప్రాంతానికి అసెంబ్లీ స్థానాల్లో తగిన వాటా వచ్చేందుకు డీలిమిటేషన్ అవసరం ఉందని ఆ పార్టీ వాదిస్తూ వచ్చింది. జమ్మూ కశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసిన అనంతరం 2020 మార్చి 6న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టడానికి కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ నిర్వహించిన ఓ సమావేశం (2021, ఫిబ్రవరి)లో బీజేపీ నాయకులు జమ్మూలో డీలిమిటేషన్కు కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులనూ పరిగణనలోకి తీసు కోవాలని కమిషన్ను కోరారు. దీంతో జూన్లో కమిషన్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న మొత్తం 20 జిల్లాల్లో ఉన్న భౌగోళిక పరిస్థితులు, జనాభా విస్తరణ, జనసాంద్రత, ప్రజల రాజకీయకాంక్షలు లేదా నియోజకవర్గాలకు సంబంధించిన ఆకాంక్షల సమాచారాన్ని సమర్పించాలని ఆయా జిల్లా కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 20 నాడు ముసాయిదా డీలిమిటేషన్ ప్రతిపాదనలను... కమిషన్ అనుబంధ çసభ్యులైన జమ్మూ కాశ్మీర్ ఎంపీలు ఐదుగురికీ ఇచ్చి డిసెంబర్ 31 లోపు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. జమ్మూకు లభించాల్సినంత ప్రాతినిధ్యం లభించలేదనీ, అందు వల్ల నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనీ ఎప్పటినుంచో బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జమ్మూలో 25 స్థానాలు గెలుచుకుని చరిత్రలో మొదటిసారిగా సంకీర్ణ ప్రభు త్వంలో భాగస్వామి అయింది. జమ్మూకు అసెంబ్లీలో తగిన ప్రాతి నిధ్యం లభించలేదంటున్న బీజేపీ వాదం సరికాదనే విమర్శా ఉంది. ఎందుకంటే గత డీలిమిటేషన్లో కూడా కశ్మీర్ లోయ కన్నా జమ్మూకే ఎక్కువ లాభం చేకూరింది. 1995లో జరిగిన నియోజక వర్గాల పునర్విభజనలో కశ్మీర్కు 46 సీట్లు కేటాయిస్తే, జమ్మూకు 37 స్థానాలు కేటాయించారు. అంటే మొత్తం రాష్ట్ర జనాభాలో 56.15 శాతం ఉన్న కశ్మీర్ జనాభాకు 55.42 శాతం ప్రాతినిధ్యం లభించిం దన్నమాట. అదే సమయంలో 43.84 శాతం ఉన్న జమ్మూ ప్రజలకు 44.57 శాతం ప్రాతినిధ్యం లభించింది. అంతేకాక, అంతకుముందు 1957లో జమ్మూ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీట్లకు రెట్టింపు స్థానాలు జమ్మూకు లభించాయి. కాగా, కశ్మీర్కు మొత్తం మీద 3 సీట్లు పెరగగా, జమ్మూ సీట్లు 7 పెరిగాయి. 1957లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల నాటికి కశ్మీర్కు 43 స్థానాలు కేటాయించగా, జమ్మూకు 30 స్థానాలు కేటాయించారు. లద్దాఖ్కు 2 సీట్లు ఇచ్చారు. జమ్మూ–కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత లద్దాఖ్ ఇప్పుడు జమ్మూ–కశ్మీర్లో భాగం కాదన్న సంగతి తెలిసిందే. డీలిమిటేషన్ ప్రకియ అంతా ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రంలో హిందూ ముఖ్యమంత్రిని ప్రతిష్ఠించాలన్న బీజేపీ ‘కలల ప్రాజెక్టు’ను సాకారం చేయడానికే అని కశ్మీర్ లోయలో అధిక జనాభా భావిస్తోంది. 1947 నుంచి జమ్మూ–కశ్మీర్లో ఎన్నికైన ప్రభుత్వానికి ఒక్క గులాం నబీ ఆజాద్ తప్ప అందరూ కశ్మీర్ లోయకు చెందినవారే ముఖ్యమంత్రిగా నాయకత్వం వహించారు. డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదన కశ్మీర్లోయను, జమ్మూను విభజించే ధోరణిలో ఉందని కశ్మీర్ రాజకీయ నాయకులు మండి పడుతున్నారు. ‘‘జమ్మూ–కశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ముసాయిదా ప్రతిపాదన మాకు సమ్మతం కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకు 6 జీట్లు, కశ్మీర్కు 1 స్థానం ఇవ్వడం న్యాయం కాద’’ని మాజీ సీఎం, ఎన్సీ ఉపాధ్యక్షులు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. మరో మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రా టిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ... ‘‘2019 ఆగస్ట్లో తీసుకున్న చట్టవిరుద్ధ, రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణ యాన్ని చట్టబద్ధం చేసే ప్రభుత్వాన్ని జమ్మూ కశ్మీర్లో స్థాపించడమే అసలు గేమ్ ప్లాన్’’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదన పూర్తిగా పక్షపాతంతో కూడుకుని ఉందని, కశ్మీర్లో ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవారికి ఇది ఒక షాక్ అని పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ ఘనీ విమర్శించారు. జస్టిస్ (రిటైర్డ్) రంజనా దేశాయ్ అధ్యక్షునిగా ఉన్న డీలిమిటేషన్ కమిషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో... మొత్తం 20 జిల్లాలను 30 కేటగిరీలుగా విభజించి, కష్టతరమైన భౌగోళిక పరిస్థితులు, ఇతర దేశాల సరిహద్దుల్లో జీవించడం వంటి విషయాలను దృష్టిలో ఉంచు కుని అదనపు నియోజకవర్గాలను కేటాయించామని తెలియజేసింది. అలాగే జనాభా ప్రాతిపదికన మొదటిసారిగా మొత్తం 90 సీట్లలో 9 సీట్లు ఎస్టీలకు, 7 సీట్లు ఎస్సీలకు కేటాయించాలని ప్రతిపాదించామని కమిషన్ తెలిపింది. వాస్తవానికి 2011 జనాభా గణాంకాలను చూస్తే మొత్తం 90 సీట్లలో కశ్మీర్కు ప్రస్తుతం ఉన్న 46 స్థానాలను 51 స్థానాలకు, జమ్మూకు ప్రస్తుత 37 సీట్లను 39కి పెంచాల్సి ఉంది. – ఉమర్ మఖ్బూల్,శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్ట్ (‘ది వైర్’ సౌజన్యంతో) -
కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనలో సంక్లిష్టతలు
జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో రాజకీయ మద్దతు తీసుకునే లక్ష్యంతోనే ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలే అక్కడి రాజకీయ పార్టీలతో భేటీ అయ్యారు. పర్యవసానంగా నియోజకవర్గాల పునర్విభజన కమిటీ ఆ మధ్య జమ్మూకశ్మీర్ను సందర్శించి ఈ అంశంపై ప్రాథమిక సమాచార సేకరణ కోసం శ్రీనగర్, కిష్వార్, పహల్ గామ్, జమ్మూ ప్రాంతాల్లోని 290 పైగా బృందాలతో సమావేశమైంది. నియోజకవర్గాల పునర్విభజనకి మద్దతుగా చేసే ప్రధాన వాదన ఏదంటే అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ అంశమే. వీరు ప్రధానంగా 1947లో శరణార్థులుగా భారత్కు వచ్చినవారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వీరిని పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులుగా ప్రస్తావిస్తుంటారు. పైగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిరావడం అనేది నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటుకు దారితీసింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సీట్ల పంపిణీ 1981 జనాభా లెక్కల ప్రాతిపదికన జరిగింది. 2019 ఆగస్టులో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్తగా పెంచింది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూకశ్మీర్ శాసనసభ స్థానాలు 83 నుంచి 90కి పెరగనున్నాయి. గత అసెంబ్లీలో కూడా ఎస్సీలకు రాజకీయపరమైన రిజర్వేషన్లు ఉనికిలో ఉండేవి. ఎస్సీల కోసం కేటాయించిన స్థానాల నుంచి పలువురు కీలక మంత్రులు గతంలో పదవులు చేపట్టగలిగారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్ కూడా వారిలో ఒకరు. ప్రధానితో ఇటీవలి సమావేశానికి ఈయన్ని కూడా ఆహ్వానించారు. కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తుందన్నది వాస్తవం. దీంట్లో ప్రధానంగా లబ్ధిదారులు గుజ్జర్లు. వీరు చాలావరకు ముస్లింలే. గత శాసనసభ ఎన్నికల్లో కశ్మీర్ లోయలోని లోలాబ్, కంగన్ అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను గుజ్జర్ అభ్యర్థులు ఎన్నికయ్యారు. జమ్మూలోని సురాన్ కోట్, మెంధర్, రాజౌరి, గులాబ్ఘర్, డర్హాల్, కాలాకోటె, గూల్ అర్నాస్ నియోజకవర్గాలకు కూడా గుజ్జర్ అభ్యర్థులే ప్రాతినిధ్యం వహించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, గుజ్జర్ల జనాభా పూర్వ రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 9 శాతంగా ఉండేది. జమ్మూకశ్మీర్ గత శాసనసభలో గుజ్జర్లకు 10.8 శాతం ప్రాతినిధ్యం ఉండేది. కశ్మీర్లో శాసన కార్యనిర్వాహక మార్పును మాత్రమే కోరుకుంటున్న రాజకీయ పార్టీలు అక్కడి గిరిజన అభ్యర్థులకు ఇకనైనా ప్రాధాన్యం ఇవ్వడంపై ఏమంత ఆసక్తిని ప్రదర్శించడం లేదు. కాబట్టి జమ్మూ కశ్మీర్ భవిష్యత్ శాసనసభలో కూడా గుజ్జర్ల ప్రాతి నిధ్యం 2014లో ఎన్నికైన గత అసెంబ్లీలో ఉన్న విధంగానే ఉంటుంది తప్పితే పెద్దగా మార్పు ఉండదు. కశ్మీర్లో కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మార్పు ఏమీ ఉండదు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ ఎన్నికలలో ఓటు వేసే అర్హత ఉన్న వారి సంఖ్య కొద్దిగా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పూర్వ రాష్ట్రంలో బయటనుంచి వచ్చిన వారి వాస్తవ సంఖ్య 1.6 లక్షలు మాత్రమే. వాస్తవానికి, గత కొన్ని సంవత్సరాలుగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే డిమాండ్ జమ్మూకశ్మీర్లోని కొన్ని రాజకీయ పక్షాలనుంచి వచ్చింది. గత అసెంబ్లీలో కశ్మీర్ లోయలో 46 అసెంబ్లీ సీట్లు ఉండగా జమ్మూలో 37 స్థానాలుండేవి. 19వ శతాబ్దిలో విభిన్న సాంస్కృతిక, భౌగోళిక ప్రాంతాలను కలిపి సృష్టించిన జమ్మూకశ్మీర్ 1947లో కీలక మార్పులను చవిచూసింది. జమ్మూలోని చీనాబ్ లోయలో రెండు మతాల జనాభా కలిసివుండే అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించడం సంక్లిష్టంగా మారనుంది. పైగా గత అసెంబ్లీ కంటే ఇప్పుడు ఏర్పడనున్న అసెంబ్లీలో ఎస్టీలకంటే ఎస్సీలకు కాస్త ఎక్కువ సీట్లు లభ్యం కానున్నాయి. ఈ నేపథ్యంలో రీజియన్లకు, దిగువశ్రేణి ప్రాంతాలకు రాజకీయ, ఆర్థిక అధికారాన్ని సంస్థా గతీకరించేటప్పుడు అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరిపిన ఇతర ప్రాంతాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. - లవ్ పురి వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత -
కశ్మీరీల్లో అపనమ్మకాన్ని తొలగించాలి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాను బలవంతంగా తీసేయడంతో కశ్మీరీల్లో నెలకొన్న అపనమ్మకాన్ని కేంద్రప్రభుత్వం తొలగించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్లుల్లా సూచించారు. విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రతిపత్తి కల్పనతోపాటు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముందుగానే జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను ఇవ్వాలని ఆ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. కశ్మీర్లో రాజకీయాలకు పునరుజ్జీవం పోసేందుకు ప్రధాని మోదీతో అఖిలపక్ష సమావేశంలో తమ డిమాండ్లను స్పష్టం చేశాక శ్రీనగర్ చేరుకున్న ఫరూఖ్, ఒమర్లు శనివారం మీడియాతో మాట్లాడారు. తదుపరి కార్యాచరణ వివరాలను తమ పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) సభ్యులతో మాట్లాడాకే వెల్లడిస్తామని వారు చెప్పారు. ‘జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తిపై నాడు జవహర్ లాల్ నెహ్రూ ప్రజాభిప్రాయం ద్వారా సాకారం చేస్తానని మాటిచ్చి తర్వాత వెనకడుగు వేశారు. ఆ తర్వాత ప్రధాని పీవీ నరసింహారావు సైతం పార్లమెంట్ సాక్షిగా మాటిచ్చారు. మేమెన్నడూ స్వాతంత్య్రం కావాలని అడగలేదు. స్వతంత్ర ప్రతిపత్తే కావాలన్నాం. ఇప్పుడు అదెక్కడుంది?. రాష్ట్ర హోదా తీసేసి కశ్మీరీల్లో ఉన్న నమ్మకాన్ని కేంద్రం పోగొట్టుకుంది. ఇక మీదటైనా కేంద్ర ప్రభుత్వం నమ్మకం పెరిగేలా ఏదైనా చేస్తుందేమో చూస్తాం’ అని ఫరూఖ్ మీడియాతో అన్నారు. గుప్కార్ అలయన్స్కు ఇక ముగింపు పలకనున్నా రనే వాదనలను ఆయన కొట్టిపారేశారు. ‘నియోజక వర్గాల పునర్విభజన పూర్తయ్యాక ఎన్నికలు జరిపి ఆ తర్వాతే రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం చెబుతోంది. దీనికి మేం అస్సలు ఒప్పకోం. రాష్ట్ర హోదా ఇచ్చాకే ఎన్నికలు పెట్టండి’ అని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. అఖిలపక్ష భేటీ తర్వాత గుప్కార్ అలయన్స్లో ఐక్యత లోపించిందనే వాదనను ఒమర్ తోసిపుచ్చారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే తమ కలను బీజేపీ 70 ఏళ్ల తర్వాత సాకారం చేసుకుంది. మేం కూడా పోరాటంలో విజయం సాధించేందుకు 70 వారాలు.. 70 నెలలు.. అంతకంటే ఎక్కువ కాలం పట్టినా సరే ఎన్నాళ్లయినా పోరాడతాం’ అని ఒమర్ అన్నారు. -
'విభజన రాత్రిళ్లు జరిగిందనడం హాస్యాస్పదం'
సాక్షి, నల్గొండ : డీసీసీబీ సహకార బ్యాంకులకు నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలకు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కేంద్ర ప్రభుత్వం చట్టాలను అగౌరవ పరుస్తుందన్నారు. రాష్ట్ర విభజన రాత్రిళ్లు చేసుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. డీలిమిటేషన్ ప్రక్రియ జమ్మూకశ్మీర్కే వర్తింస్తుందనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. పునర్విభజన చట్టాన్ని గౌరవించి రెండు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి అనేది మంచి కార్యక్రమం అని, ఇలాంటి వాటికి రాజకీయాలు జోడించాల్సిన అవసరం లేదన్నారు. -
‘విజ్ఞప్తులు పట్టించుకోకుండా పునర్విభజన చేశారు’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీల డీ లిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగిందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్కుమార్ ఆరోపించారు. మున్సిపాలిటీల పునర్విభజనకు సంబంధించి కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, వంశీచంద్రెడ్డి, సంపత్కుమార్లు బుధవారం గాంధీభవన్లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంపత్కుమార్ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా మున్సిపాలిటీల పునర్విభజన చేశారని మండిపడ్డారు. 3385 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లలో కూడా అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే వివిధ వేదికల ద్వారా న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. వంశీచంద్ మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం వార్డుల విభజన చేసిందని ఆరోపించారు. దీనిపై పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కమిటీ సుదీర్ఘంగా చర్చిందని తెలిపారు. మున్సిపాలిటీల్లోని ప్రజలు వార్డుల పునర్విభజనపై ఏం కోరుకుంటున్నారో ఆ దిశగా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీకి పూర్వ వైభవం తీసుకోస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొన్నం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ వార్డులకు సంబంధించిన వినతుల కోసం గుడువును పెంచాలని కోరారు. స్థానిక నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాదమని తెలిపారు. -
‘గ్రేటర్’లో ఉన్నా రూరల్ జిల్లాలోనే గీసుకొండ!
‘గ్రేటర్’లో ఉన్నా రూరల్ జిల్లాలోనే గీసుకొండ! మూడు డివిజన్లు, 17 పంచాయతీలూ రూరల్ జిల్లాలోకి.. అభ్యంతరం చెబుతున్న స్థానికులు గీసుకొండ : కొత్తగా ఏర్పాటు కానున్న వరంగల్ రూరల్ జిల్లాలోకి గీసుకొండ మండలం రాబోతోంది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉండగా.. ఈ ప్రాంతం నగరాన్ని ఆనుకుని ఉండి, కొంత మేర గ్రేటర్ వరంగల్లో భాగమైనా జిల్లాల పునర్విభజనలో భాగంగా మొత్తం మండలాన్ని వరంగల్ రూరల్ జిల్లాలో చేర్చనున్నారు. ఈమేరకు కలెక్టర్ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి పంపించిన తాజా నివేదికలో ఈ విషయాన్ని పొందుపరినట్లు తెలుస్తోంది. గతంలో 25 గ్రామపంచాయతీలతో గీసుకొండ మండలం ఉండగా.. ఎనిమిది గ్రామపంచాయతీలను గ్రేటర్ వరంగల్ 2013 ఆగస్టు 1న విలీనం చేశారు. దీంతో మండలంలోని రెడ్డిపాలెం, మొగిలిచర్ల, పోతరాజుపల్లి, గొర్రెకుంట, కీర్తీనగర్, ధర్మారం, జాన్పాక, గరీబ్నగర్, స్తంభంపెల్లి, వసంతాపూర్, దూపకుంట ప్రాంతాలు నగరంలోకి చేరగా వీటిని 2, 3, 4వ డివిజన్లుగా ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 17 గ్రామపంచాయతీలకు సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు మండలానికి ఎంపీపీ, జెడ్పీటీసీ ఉన్నారు. తాజాగా జిల్లాల పునర్విభజన తెరపైకి రావడంతో నగరంలో విలీనమైన ప్రాంతం వరంగల్ జిల్లాలో, మిగతాది రూరల్ జిల్లాలో కొనసాగుతుందని అంతా భావించారు. కానీ మండలం మొత్తం వరంగల్ రూరల్ జిల్లా కిందికి వెళ్లనున్నట్లు ప్రతిపాదనల్లో పొందుపర్చడంతో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వరంగల్ జిల్లాలోనే మండలాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. కాగా, సంగెం మండలం నుంచి గ్రేటర్ వరంగల్లో విలీనమైన బొల్లికుంట, గాడెపల్లి గ్రామాలు ప్రస్తుతం 4వ డివిజన్లో ఉన్నాయి. ఈ రెండు గ్రామాలతో పాటు సంగెం మండలం మొత్తం కూడా వరంగల్ రూరల్ జిల్లాలోకి వెళ్లనుంది. -
అంతా అస్తవ్యస్తం
* డీలిమిటేషన్పై అభ్యంతరాలు * కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు * 15లోగా ప్రభుత్వానికి తుది నివేదిక సాక్షి, సిటీబ్యూరో: డీలిమిటేషన్ ముసాయిదాపై ప్రజలతో పాటు వివిధ రాజకీయ పక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అస్తవ్యస్తంగా ఉందని ఆరోపిస్తూ కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై ప్రభుత్వానికి తుది నివేదిక అందించేందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో వాతావరణం వేడెక్కింది. మరోవైపు కొన్ని సర్కిల్ కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి ఇంకా తుది ప్రతిపాదనలు అందలేదు. ఏ సర్కిల్ నుంచి ఎన్ని అభ్యంతరాలు అందాయో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జనాభా దామాషాకు అనుగుణంగా డీలిమిటేషన్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ... కొత్తగా ఏర్పాటు చేస్తున్న డివిజన్లలో ఎక్కడ ఎంత జనాభా ఉందో... దాని స్వరూప స్వభావాలేమిటో తెలిపే మ్యాపులను అధికారులు ప్రజల ముందు ఉంచలేదు. దీనిపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అభ్యంతరాలను నామ్కేవాస్తేగా ఆహ్వానించారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేస్తారా? లేక యధావిధిగా తుది జాబితా తయారు చేస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిని త్వరితంగా పూర్తి చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ జనార్దన్రెడ్డి డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఒకటికి రెండు పర్యాయాలు అన్నీ పరిశీలించి తుది నివేదిక సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యంగా ఎల్బీనగర్ సర్కిల్లో అభ్యంతరాలను మరోమారు పరిశీలించి... ముఖ్యాంశాలను పరిగణనలోకి తీసుకొని తుది నివేదిక రూపొందించాల్సిందిగా సూచించారు. అలాగే పటాన్చెరు, ఆర్సీపురం సర్కిల్ నుంచి అందిన అభ్యంతరాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. ఇంకా, పాతబస్తీ పరిధిలోని సర్కిల్ 4, 5, 7బి, అంబర్పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్ సర్కిళ్లలోనూ పరిశీలించాల్సిన కీలకాంశాలు ఉన్నాయని... వాటిని జాగ్రత్తగా సమీక్షించాలని సూచించినట్లు తెలిసింది. అస్తవ్యస్తంగా, అభ్యంతరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై డిప్యూటీ కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించాలని ఆదేశించారు. వివిధ అంశాలపై 200కు పైగా అభ్యంతరాలు అందాయి. అభ్యంతరాలలో కొన్ని... * సర్కిల్-9బికి 36 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఎక్కువగా కాచిగూడ డివిజన్ పేరును తొలగించడంపైనే ఉన్నాయి. * కుత్బుల్లాపూర్ సర్కిల్లో 20 ఫిర్యాదులు రాగా... షాపూర్ నగర్ పేరును కొనసాగించాలనే డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. * మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లకు సంబంధించి 14 అభ్యంతరాలు అందగా.. నేరేడ్మెట్, యాప్రాల్ డివిజన్ల పేర్లను కొనసాగించాలని ఎక్కువ మంది కోరారు. * సికింద్రాబాద్ సర్కిల్ నుంచి కేవలం 6 అభ్యంతరాలు మాత్రమే అందాయి. వీటిలో 4 చిలకలగూడ డివిజన్ను గల్లంతు చేయవద్దనే వచ్చాయి. * శేరిలింగంపల్లి-1 సర్కిల్లోని భెల్ ఎంఐజీ కాలనీని మెదక్ జిల్లాలోని పటాన్చెరు సర్కిల్లో నూతనంగా ఏర్పాటయ్యే భారతీ నగర్ డివిజన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. * శేరిలింగంపల్లి సర్కిల్-2 పరిధిలో మూడు ఫిర్యాదులు అందాయి. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను రెండు సర్కిళ్లలోనే ఉంచాలని స్థానిక ఎమ్మెల్యే కోరారు. * ఉప్పల్ సర్కిల్లో 21 అభ్యంతరాలు రాగా... ఉప్పల్ డివిజన్లో రామంతాపూర్కు చెందిన కాలనీలను కలప వద్దని స్థానికులు అభ్యంతరం చెప్పారు. * కొన్ని కాలనీలను సగం ఒక డివిజన్, మిగిలిన సగం మరో డివిజన్కు కేటాయించారని... అలా కాకుండా ఒక కాలనీని ఒకే డివిజన్లో వచ్చే విధంగా ఉంచాలని కోరారు. * కాప్రా సర్కిల్కు మొత్తం 40 అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో ప్రతిపాదిత మల్లాపూర్, హౌసింగ్ బోర్డు, చర్లపల్లి డివిజన్లకు సంబంధించి ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయి. * వివిధ అంశాలపై మరికొన్ని సర్కిళ్ల నుంచి కూడా అభ్యంతరాలు అందాయి. బీసీ గణన 25 శాతమే బీసీ గణనకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు గురువారం వరకు దాదాపు 25 శాతం పూర్తి చేశారు. గ్రేటర్లోని మొత్తం జనాభా 70,68,495. ఇప్పటి వరకూ 17,56,715 మంది సర్వే పూర్తి చేశారు. ఇంకా 53,11,780 మంది సర్వే జరగాల్సి ఉంది. ఈనెల 18 లోగా ఇది పూర్తి చేయాల్సి ఉంది. ఇంత స్వల్ప వ్యవధిలో కచ్చితమైన సమాచారంతో సర్వే పూర్తి చేయడం అధికారులకు సవాల్గా మారింది. -
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వార్డుల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా వార్డుల పునర్విభజన పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంజీని విభజించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. పునర్విభజనతో జీహెచ్ఎంసీ వార్డులు సంఖ్య 150 నుంచి 200 వరకు పెరిగే అవకాశం కనబడుతోంది. పునర్విభజన పూర్తైన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుత తెలుస్తోంది. -
మళ్లీ పునర్విభజన..
►ఇప్పటికే 14 అసెంబ్లీ స్థానాలు, కొత్తగా మరో తొమ్మిది? ►2011 జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ►భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాల సంఖ్య ►రాష్ట్రంలోనే అధిక స్థానాలతో నంబర్ వన్గా మారే అవకాశం ►ముక్కలుకానున్న పట్టణ సెగ్మెంట్లు రిజర్వేషన్లలోనూ మార్పులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాల్లో రంగారెడ్డి జిల్లా బలీయశక్తిగా అవతరించనుంది. 2019 నాటికి తెలంగాణ శాసనసభలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన జిల్లాగా రూపుదాల్చనుంది. నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి రావడంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం మారనుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తు తం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను కాస్తా 153కు పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర పున ర్విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం పొందుపరిచింది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో నియోజకవర్గాల పునర్విభజన అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా తొమ్మిది నియోజకవర్గాలు! 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగనుంది. దీంతో రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిఉన్న మన జిల్లాలో ఏకంగా తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు కొత్తగా ఏర్పడనున్నాయి. సగటున 2.30 లక్షల జనాభాను ప్రామాణికంగా చేసుకొని డీలిమిటేషన్ను చేసే అవకాశమున్న నేపథ్యంలో ఈ మేర నియోజకవర్గాల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శరవేగంగా జరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో జిల్లా జనాభా అరకోటిని దాటింది. దీంతో శాసనసభలో జిల్లా ప్రాతినిధ్యం పెరిగేందుకు అనువుగా నియోజకవర్గాల విభజనలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా శివారు అసెంబ్లీ స్థానాలు మూడు ముక్కలుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గ భౌగోళిక స్వరూపం, చారిత్రక నేపథ్యం, కనెక్టివిటీ, పరిపాలనాపరమైన ఇబ్బందులను ఎన్నికల కమిషన్ నియమించే డీలిమిటేషన్ కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. మండలాలు, గ్రామ సరిహద్దులు చెరిగిపోకుండా ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించిన అనంతరం నియోజకవర్గాలను పునర్విభజిస్తారు. కేవలం నియోజకవర్గాల డీలిమిటేషనేకాకుండా రిజర్వుడ్ స్థానాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. రాష్ట్ర జనాభా ప్రాతిపదికన వీటిని కూడా సవరిస్తారు. అయితే ఈ తతంగమంతా పూర్తికావడానికి కనీసం మూడేళ్లు పట్టే అవకాశంలేకపోలేదు. పెరిగే అసెంబ్లీ సెగ్మెంట్లు కలుస్తాయి తప్ప.. లోక్సభ సెగ్మెంట్లలో ఎలాంటి మార్పులుండవు. ప్రాంతాల మధ్య వ్యత్యాసం 2009లో పునర్విభజన జరిగినప్పుడు 2001 జనాభాను పరిగణనలోకి తీసుకోవడంతో నియోజకవర్గాల జనాభాలో వ్యత్యాసం భారీగా నమోదైంది. దీంతో గ్రామీణ, పట్టణ నియోజకవర్గాల మధ్య సమతుల్యత కొరవడింది. తాజాగా 2011 జనగణన ఆధారంగా చేపడుతుం డడంతో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాల్సిన బా ధ్యత యంత్రాంగంపై ఉందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెరగనున్న రిజర్వ్డ్ స్థానాలు.. ప్రస్తుతం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఇందులో రెండు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. తాజాగా నియోజకవర్గ పునర్విభజన చేపడితే రిజర్వ్డ్ స్థానాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతమున్న రెండు రిజర్వ్డ్ స్థానాలకు అదనంగా మరో రెండు రిజర్వ్డ్ స్థానాలు ఏర్పడనున్నాయి. మొత్తం నాలుగు రిజర్వ్డ్ స్థానాల్లో మూడు ఎస్సీ స్థానాలు కాగా, ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. పునర్విభజనకు ప్రామాణికాలు... ►ఒక్కో నియోజకవర్గానికి సగటు జనాభా 2.30 లక్షలు ►2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 53.57 లక్షలు ►దీంతో జిల్లాలో 23 అసెంబ్లీ స్థానాలు ఏర్పడనున్నాయి ►పట్టణ నియోజకవర్గాలన్నీ ముక్కలు కానుండగా, గ్రామీణ స్థానాల్లో భారీ మార్పులు చోటుచేసుకోన్నాయి. -
పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్
ఖమ్మం సిటీ : ఖమ్మం నగరపాలక సంస్థలో డివిజన్లను మళ్లీ పునర్విభజించాలని ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. నగరంలో 57 డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రక్రియను 31 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. కార్పొరేషన్ ఏర్పడి సుమారు రెండేళ్లవుతోంది. గత ఏడాది 50 డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2001 జనాభా లెక్కల ప్రకారం నగరాన్ని రైల్వే, రోడ్డు మార్గాలు, చేరువులను పరిగణనలోకి తీసుకుని డివిజన్లను ఏర్పాటు చేశారు. ఆతర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే.. అప్పటికే 2011 జనాభా లెక్కలు విడుదల కావడంతో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల నాగేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డివిజన్లు రద్దు చేయాలని, తిరిగి 2011 జనాభా లెక్కల ప్రకారం డివిజన్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న డివిజన్లు ఐదు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నయని, దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, నిధులు సైతం సరిగా ఖర్చు చేయలేమని పిటిషన్లో తెలిపారు. దీనిపై వాదనలు విన్న కోర్టు డివిజన్లను రద్దు చేస్తూ గత ఏడాది ఆక్టోబర్లో ఆదేశాలు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తిరిగి డివిజన్లను ఏర్పాటు చేయాలని సీడీఎంఏను ఆదేశించింది. ఈ క్రమంలో కొన్ని పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈక్రమంలోనే సార్వత్రిక ఎన్నికల ముందు స్థానిక సంస్థలకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు వచ్చాయి. అయితే.. ఖమ్మం కార్పొరేషన్కు డివిజన్లు పునర్విభజన జరగకపోవడంతో దీని ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే వాయిదా పడిన ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి డివిజన్లతోపాటు మేయర్, వార్డుల రిజర్వేష్లు కూడా మారనున్నాయి. -
ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన
-
ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన
రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నా, విభజనకు సంబంధించిన ప్రకటనలు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్ 'సాక్షి'తో అన్నారు. మే 16న ఫలితాలు వచ్చినా పాత అసెంబ్లీ కాలం సమయం పూర్తయిన తర్వాత కొత్త అసెంబ్లీ నోటిఫై అవుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ చేతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే తాము రాష్ట్రంలోని నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి పెడతామని సంపత్ తెలిపారు. నేరచరితులను, నల్లధనాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక పరిశీలకులను నియమించామని, ఎన్నికల కమిషన్ సిబ్బంది సహాయంతో ఇంటింటికీ తిరిగి ఓటర్లకు స్వయంగా ఓటర్ స్లిప్ ఇస్తుందని ఆయన వివరించారు. కొత్త ఓటర్ల నమోదుకు మార్చి 9వరకు గడువుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ తెలిపారు.