Dental
-
అన్ని కాలేజీలకు ఒకే ఫీజు సరికాదు
సాక్షి, అమరావతి: పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీలని్నంటిలో ఏకీకృత ఫీజు సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) సిఫారసుల మేరకు 2020–21 నుంచి 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజును ఖరారు చేస్తూ ప్రభుత్వం 2020 మే 29న జారీ చేసిన జీవో 56ను రద్దు చేసింది.ఈ జీవో చట్టం ముందు నిలబడదని స్పష్టం చేసింది. ఏపీహెచ్ఈఆర్ఎంసీ అన్నీ మెడికల్, డెంటల్ కాలేజీలను ఒకే గాటన కట్టి, ఏకీకృత ఫీజు నిర్ణయించడం చట్ట విరుద్ధమన్న కాలేజీల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆ కాలేజీలు ప్రతిపాదించిన ఫీజుల వివరాలను పరిగణనలోకి తీసుకుని తిరిగి ఫీజు ఖరారు చేయాలని, ఆపైన రెండు నెలల్లో ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ను ఆదేశించింది.ఒకవేళ ప్రతిపాదించిన ఫీజుతో కాలేజీలు విభేదిస్తే, ఆ కాలేజీ యాజమాన్యం అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. కమిషన్ ఫీజులను పెంచితే, పెంచిన మేర బ్యాలెన్స్ మొత్తాలను అభ్యర్థుల నుంచి వారిచి్చన హామీ మేరకు కాలేజీలు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అదనపు ఫీజు వసూలులో నిర్ణయం అంతిమంగా కాలేజీలదేనని స్పష్టం చేసింది. జీవో 56ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఈ ఏడాది సెప్టెంబర్లో విచారణ జరిపి, తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది.ఏకీకృత ఫీజు వల్ల కొన్ని లాభపడుతూ ఉండొచ్చు..ఏకీకృత ఫీజు విద్యార్థుల ప్రయోజనాలకు కూడా విరుద్ధం కావొచ్చునని హైకోర్టు తీర్పులో పేర్కొంది. తక్కువ ఫీజు ఉంటే మరింత ఎక్కువ చెల్లించాలని విద్యార్థులను కాలేజీలు బలవంతం చేయవచ్చునని తెలిపింది. ఏకీకృత ఫీజు వల్ల తగిన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది లేని కాలేజీలు లాభపడే అవకాశం ఉందని పేర్కొంది. మంచి సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది కల్పిస్తున్న కాలేజీలకు ఇది నష్టం కలిగించవచ్చని తెలిపింది. ఇటువంటి కాలేజీలు ఎక్కువ ఫీజులు కోరడంలో తప్పులేదని తెలిపింది.ఫీజుల ఖరారుకు ముందు కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయాలు, మౌలిక సదుపాయాల వివరాలని్నంటినీ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదంది. ఆచరణ సాధ్యం కాని ఫీజును నిర్ణయించడం వల్ల ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులు అందించే విద్యా సంస్థలు మూతపడతాయని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఆయా కాలేజీల నాణ్యత, సమర్థత, ఉత్పాదకతపైనా ప్రభావం చూపుతుందని తెలిపింది. -
దంత వైద్య విద్యలో ప్రమాణాల పెంపునకు కృషి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా దంత వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయడంతో పాటు సామాన్యులకు ఉచితంగా, అందుబాటు ధరల్లో దంత చికిత్సలు అందించడానికి కృషి చేస్తానని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీసీఐ) నూతన ప్రెసిడెంట్ డాక్టర్ కె.సతీశ్కుమార్రెడ్డి అన్నారు. డీఐసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తొలి తెలుగు వైద్యుడైన డా.సతీశ్కుమార్ నెల్లూరు జిల్లాకు చెందినవారు. స్కూల్, కాలేజీ విద్యను నెల్లూరు జిల్లాలోనే పూర్తి చేసిన ఆయన.. హైదరాబాద్లోని ఉస్మానియాలో బీడీఎస్, ఎండీఎస్ విద్యనభ్యసించారు. ఉమ్మడి ఏపీ డెంటల్ కౌన్సిల్కు రెండు సార్లు, విభజిత ఏపీ కౌన్సిల్కు ఒకసారి చైర్మన్గా వ్యవహరించారు. ఇటీవల డీసీఐ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన డా.సతీశ్కుమార్రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..యూజర్ చార్జీలపై మార్గదర్శకాలు..వైద్య విద్యార్థులకు శిక్షణ సమయంలో ఎంత ఎక్కువ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటే వారు అంత ఎక్కువ నేర్చుకుంటారు. ఆ మేర సామర్థ్యాలు పెరిగి.. భవిష్యత్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల కల్పనకు వీలవుతుంది. డీసీఐ నిబంధనల ప్రకారం ప్రతి కాలేజీకి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రిలో రోజుకు నిర్దేశించిన స్థాయిలో ఓపీలు, ఐపీలు ఉండాలి. కానీ ప్రస్తుతం దేశంలోని దంత వైద్య కళాశాలల్లో రోగుల కొరత ఉంటోంది.దీంతో విద్యార్థులు శిక్షణ సమయంలో ఎక్కువగా నేర్చుకోలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడంతో పాటు సామాన్యులకు ఉచితంగా, అందుబాటు ధరల్లో దంత వైద్య కళాశాలల ద్వారా చికిత్సలు అందించేందుకు ప్రయత్నిస్తాం. ప్రైవేట్ కళాశాలల్లో చికిత్సలకు యూజర్ చార్జీలపై మార్గదర్శకాలను రూపొందించాలని యోచిస్తున్నాం. ప్రజలు కూడా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల కోసం రూ.వేలల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా.. దంత వైద్య కళాశాలల్లోని ఆస్పత్రులకు వెళ్లాలి. అక్కడ నిపుణులైన సీనియర్ వైద్యులుంటారు. ఇబ్బడిముబ్బడిగా దంత వైద్య కళాశాలలు..దేశంలో దంత వైద్య కళాశాలలు ఎక్కువయ్యాయి. దీంతో కోర్సులు పూర్తి చేసిన వారందరికీ బయట ఉపాధి దొరకడం లేదు. ఇబ్బడిముబ్బడిగా కళాశాలల ఏర్పాటుతో విద్యా ప్రమాణాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కళాశాలలకు ప్రతిపాదనలు పంపొద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు డీసీఐ స్పష్టం చేసింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల నుంచి కొత్త కళాశాలల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. కొత్త కళాశాలలు నెలకొల్పకుండా నియంత్రించే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనల మేరకు ఆమోదించడం, తిరస్కరించడం మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. డెంటల్ ఎడ్యుకేషన్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంపైనా దృష్టి సారిస్తాం. -
బ్రక్సిజమ్ అంటే...? పిల్లల పళ్లుకి ప్రమాదమా..?
కొందరు పిల్లలు... ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా నిద్రలో పళ్లు కొరుక్కోవడంతోపాటు దవడలు బిగబట్టి పళ్లు నూరుతుంటారు. దీనిని వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. దీనివల్ల పళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.తీవ్రమైన మానసిక ఒత్తిడి, యాంగై్జటీ వంటి పరిస్థితులే బ్రక్సిజానికి కారణం. ఎప్పుడో ఒకసారి పళ్లు బిగబట్టడం, కోపం వచ్చినప్పుడు పళ్లు కొరకడం సహజం. కానీ నిత్యం నిద్రలో ఇది జరుగుతుంటే మాత్రం దీన్ని రుగ్మతగా పరిగణించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలు: ΄పొద్దున లేవగానే తలనొప్పి. ఒక్కోసారి ముఖం నొప్పి కూడా. చెవి పోటు దవడ కండరాల నొప్పులు కొందరిలో చెవిలో హోరు (టినైటిస్) నోరు నొప్పి కారణంగా ఆహారం తీసుకోలేకపోవడం నోరు తెరవడానికి, మూయడానికి ఇబ్బంది. రకాలు: అవేక్ బ్రక్సిజమ్ : కొందరు మెలకువగా ఉన్నప్పుడు పగటివేళ పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలాంటి కేసుల్లో ఒత్తిడికి కారణం గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే సరిపోతుంది. అంతకుమించి చికిత్స అవసరం ఉండకపోవచ్చు. కొందరిలో ఏదైనా విషయంపై తదేకంగా దృష్టి కేంద్రీకరించినప్పుడు అసంకల్పితంగా దవడ బిగిస్తుంటారు. దీనికీ చికిత్స అవసరం ఉండదు స్లీప్ బ్రక్సిజమ్: నిద్రలో ఉన్నప్పుడు అదేపనిగా పళ్లు కొరకడంతో ΄ాటు తాము అలా చేస్తున్నామన్న విషయమే పిల్లలకు తెలియదు. పగటివేళల్లో మామూలుగానే ఉంటారు. వీళ్లకు చికిత్స అవసరం. రిస్క్ ఫ్యాక్టర్స్: పిల్లల్లో తీవ్రమైన ఒత్తిడి, యాంగై్జటీ వంటి పరిస్థితుల తోపాటు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్ లేదా జనరలైజ్డ్ యాంగై్జటీ డిజార్డర్స్ వంటి మానసిక పరిస్థితులు పెద్దవారిలో ఆల్కహాల్తో పాటు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ వంటివి ఎక్కువగా తాగడం పెద్దల్లో యాంగై్జటీని తగ్గించడం కోసం వాడే కొన్ని రకాల ఔషధాలు. ఉదాహరణకు ‘సెలక్టివ్ సెరిటోనిన్ రీ–అప్ టేక్ ఇన్హిబిటార్స్ –ఎస్ఎస్ఆర్ఐస్ అనే మందులు పెద్దవారిలో గురక రావడం. చికిత్స: పిల్లలు నిద్రలో ఎప్పుడైనా పళ్లు కొరుకుతుంటే దానికి పెద్దగా చికిత్స అవసరం లేదు. కానీ అది పళ్లకు హాని కలిగించే ంత తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం సీరియస్గా తీసుకోవాల్సిందే. ముందుగా వారి పళ్లు దెబ్బతినకుండా పంటి డాక్టర్ ఆధ్వర్యంలో మౌత్ గార్డ్స్ అమర్చడం అవసరంస్ట్రెస్ తగ్గించడానికి తొలుత కౌన్సెలింగ్, తర్వాత ధ్యానం వంటి పద్ధతులతో తేలిక పాటి వ్యాయామాలు ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’తో చాలావరకు ఉపయోగం ఉంటుంది కొన్ని పరీక్షల తర్వాత యాంగై్జటీ, డిప్రెషన్ వంటివి ఉన్నాయని తేలితే... యాంగ్జియోలైటిక్స్ అనే యాంటీ యాంగై్జటీ మందులతో పాటు మజిల్ రిలాక్సెంట్ ఔషధాలు. జీవనశైలి అంటే లైఫ్స్టైల్లో మార్పులు (మద్యం అలవాటు వదిలేయడం, పరిమితికి మించి కాఫీలు, పొగ తాగడాన్ని మానేయడం) డాక్టర్డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి సీనియర్ డెంటల్ సర్జన్(చదవండి: కిచెన్ని క్లీన్గా ఉంచడంలో టూత్పేస్ట్ ఎలా పనిచేస్తందో తెలుసా..!) -
చిన్న పరిశ్రమ ధగధగ
ఓ ప్రయత్నం పది మందికి ఉపాధి చూపించేందుకు మార్గమైంది. చిన్నపాటి సంకల్పం ఎంచుకున్న రంగంలో విజయపథానికి దారిచూపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే... ప్రతి జిల్లా పారిశ్రామికంగా పురోగమిస్తుందని రుజువైంది. విశాఖపట్నంలో అత్యాధునిక డెంటల్ ల్యాబ్... నెల్లూరు జిల్లా పొదలకూరులో బయో మాస్ బ్రికెట్స్... బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో మారుతి గ్రానైట్స్... ఇలా ఏర్పడిన చిన్న పరిశ్రమలే. ఇప్పుడు వందలాదిమందికి ఉపాధి కల్పిస్తూ... పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు ప్రతి జిల్లాలో పుట్టుకొస్తున్న ఎంఎస్ఎంఈలే సాక్ష్యం. ♦ కరోనా విలయం నుంచి.. విజయపథానికి ♦ గ్రానైట్ ఫ్యాక్టరీతో పది మందికి ఉపాధి.. వ్యవసాయం వదిలి పారిశ్రామిక పయనం బల్లికురవ: వారిది వ్యవసాయం కుటుంబం. భర్త డిగ్రీవరకూ చదువుకోగా... భార్య పాలిటెక్నిక్ పాసయ్యారు. వారికి వ్యవసాయం ద్వారా తగిన ఆదాయం సమకూరకపోవడంతో పదిమందికి ఉపాధి కల్పించాలనుకున్నారు. తొలుత పౌల్ట్రీ పరిశ్రమతో ప్రస్థానం మొదలైంది. దంపతులు ఇద్దరూ అక్కడే పనిచేసి కొందరికి ఉపాధి చూపారు. అయితే బంధువులు గ్రానైట్ వ్యాపారాలు చేసి లాభాలు పొందడాన్ని చూశాక వీరికీ ఓ ఆలోచన వచ్చింది. బాపట్ల జిల్లా ఈర్లకొండ మల్లాయపాలెం గ్రామాల్లో ముడిరాయి దొరుకుతుండడంతో గ్రానైట్ వ్యాపారం చేద్దామనుకున్నారు. అయితే సాయమందించే ప్రభుత్వం అప్పుడు లేదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాయితీతో రుణం అందించి ఊతం అందించడంతో మారుతి గ్రానైట్స్ ఏర్పాటు చేసుకున్నారు. వారి కల సాకారమైంది. ఇప్పుడు విజయవంతంగా ఆ సంస్థ నడుస్తోంది. ఇదీ బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొత్తమల్లాయపాలెం గ్రామానికి చెందిన లేమాటి నీరజ, హనుమంతరావు దంపతుల విజయప్రస్థానం. అధికారుల నుంచి సానుకూల స్పందన పరిశ్రమ స్థాపిస్తామని చెప్పగానే పరిశ్రమల శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. వెంటనే రూ.1.5 కోట్లు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద ఎస్ఐడీబీఐ(సిబీ)గా గుర్తించి బ్యాంక్ ద్వారా లోన్ మంజూరు చేశారు. అందులో రూ.90 లక్షలు ప్రభుత్వ రాయితీ కింద వచ్చింది. మొత్తం మూడు కోట్లతో ఫ్యాక్టరీ పెట్టారు. ముడిరాయిని పలకలు కోస్తూ స్థానికంగా విక్రయిస్తున్నారు. 15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయిన రాళ్లను అద్దంకి, మార్టూరు, ఒంగోలు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, చీరాల, బాపట్ల, గుంటూరు, విజయవాడ పట్టణాలకు తరలిస్తున్నారు. మాకు ఉపాధి దొరికింది నాకు ఏపనీ దొరక్క తిరుగుతున్న సమయంలో గ్రానైట్ అధినేత పిలిచి ఉపాధి కల్పించాడు. గతంలో క్వారీల్లో చేసిన అనుభవం ఉండడంతో ఇక్కడ లైన్ పాలిష్ ఆపరేటర్గా పని చేస్తున్నాను. నెలా నెలా జీతాలు బాగా ఇస్తున్నారు. – డేవిడ్, గ్రానైట్ ఆపరేటర్ కోవిడ్ కష్టకాలంలోనూ చేయూత.. రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి అందరినీ వణికించింది. గ్రానైట్పైనా ప్రభావం చూపింది. ఫ్యాక్టరీ మూత పడింది. కరోనాతో వందల మంది మృతి చెందడంతో అన్నీ రెడ్ జోన్లే. వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డాం. అప్పుడు మాకు మరో రూ.28 లక్షల లోన్ ఇచ్చారు. నెలానెలా కంతుల వారీగా రుణం చెల్లిస్తున్నాం. ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉంది. పిల్లలను బాగానే చదివించుకుంటున్నాం. పది మందికి ఉపాధి కల్పిస్తున్నానే తృప్తి మిగిలింది. సంవత్సరానికి రూ. 1 కోటి వరకు టర్నోవర్ చేస్తున్నాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాకు బాగా అండగా నిలిచింది. – లేమాటి నీరజ, ఫ్యాక్టరీ యజమాని కర్షకుడి నుంచి కర్మాగార స్థాపన వరకూ.. ♦ నెల్లూరు జిల్లా పొదలకూరులో బయోమాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపన ♦ మొక్కవోని దీక్షతో విజయంవైపు అడుగులు పొదలకూరు: ఆయనో సామాన్య రైతు. వ్యాపారం, పరిశ్రమలపై అవగాహన లేదు. అయినా తాను జీవిస్తూ పది మందికి ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పం ఓ చిన్నతరహా పరిశ్రమ స్థాపన వైపు అడుగులు వేయించింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపించి విజయం సాధించారు. మొక్కవోని దీక్షతో వెనుకడుగు వేయకుండా పరిశ్రమను నిర్వహిస్తూ పది మందికి అన్నం పెడుతున్నారు. ఇదీ పొదలకూరు మండలం సూదుగుంట గ్రామానికి చెందిన పెద్దమల్లు శ్రీనివాసులు రెడ్డి విజయప్రస్థానం. పడిలేచిన కెరటంలా.. గతంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో సూదుగుంట షుగర్స్, సోనాక్(రొయ్య పిల్లల మేత) వంటి పెద్ద తరహా పరిశ్రమలు, అల్లోవీర, సిమెంటు బ్రిక్స్ వంటి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టి తట్టుకోలేక మూతపడ్డాయి. కానీ పెద్దమల్లు శ్రీనివాసులురెడ్డి 2015లో బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమలను స్థాపించి నష్టాలు, కష్టాలను అధిగమించి ఓ స్థాయికి చేరుకున్నారు. పడి లేచిన కెరటంలా ఎదిగారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వినియోగించే బయో మాస్ బ్రికెట్స్(కట్టె ముక్కలు) తయారీ పరిశ్రమను స్థాపించి తయారు చేసి వస్తువును అమ్ముకోలేక అనేక ఇబ్బందులు పడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లేక ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ కూడా పొందలేకపోయారు. ఫలితంగా పరిశ్రమకు ఎలాంటి రాయితీలు పొందలేకపోయారు. బ్రికెట్స్ను అమ్ముకోగలిగినా లాభాలు రాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయారు. ఇబ్బందులతో నెట్టుకొస్తున్న సమయంలో 2019 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ పొంది యూనియన్ బ్యాంకులో రూ.కోటి రుణం పొందగలిగారు. దానితో పరిశ్రమలో ఆధునాతన మెషినరీని ఏర్పాటు చేసి ఉద్యోగుల సంఖ్యను పెంచారు. మార్కెటింగ్ పల్స్ తెలుసుకున్నారు. ఫలితంగా విజయం సాధించి ఇప్పుడు రూ.5 కోట్ల టర్నోవర్కు చేరుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 మందికి ఉపాధి అవకాశం కల్పించి నెలకు రూ.3 లక్షల జీతాలు అందజేస్తున్నారు. బ్యాంకు రుణంలో ప్రభుత్వం 20 శాతం రాయితీ ఇవ్వడం, విద్యుత్ యూనిట్కు ఒకరూపాయి సబ్సిడీని అందజేయడంతో నిలదొక్కుకోగలిగారు. సర్కారు సాయంతోనే నిలదొక్కుకున్నాం ప్రారంభంలో ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొన్నాను. నిలదొక్కుకునేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టింది. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమ నిలదొక్కుని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు. నా అదృష్టం బాగుండి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడడం వల్ల ప్రోత్సాహాలు లభించాయి. దీంతో ఫ్యాక్టరీకి అవసరమైన టిప్పర్లు, మెషనరీ కొనుగోలు చేయగలిగాను. ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ పొందడం వల్ల పంచాయతీ, టౌన్ప్లానింగ్ అనుమతులు లభించాయి. ఫలితంగా పరిశ్రమ గాడిలో పడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లించగలుగుతున్నాను. ఎలాంటి కాలుష్యం ఏర్పడనందున ఫార్మాసిటికల్స్ కంపెనీల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. – పెదమల్లు శ్రీనివాసులురెడ్డి, ఫ్యాక్టరీ యజమాని, పొదలకూరు స్థానికంగానే ఉద్యోగం దొరికింది నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. మా ఊరికి చెందిన మారుతీ గ్రానైట్స్ నీరజ, హనుమంతరావు ఫ్యాక్టరీ పెట్టడంతో నాకు అందులో సూపర్వైజర్గా పని ఇచ్చారు. నమ్మకంగా పనిచేస్తున్నాను. ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టడం వల్లే నాకు వేరే ప్రాంతానికి వెళ్లే పని లేకుండా ఉపాధి దొరికింది. నాతోపాటు ఇక్కడ మరో 15 మంది పనిచేస్తున్నారు. – వెంకటేశ్, సూపర్వైజర్ పదేళ్లుగా పనిచేయిస్తున్నా.. మాది రాజస్థాన్. బతుకుతెరువు కోసం వచ్చా. ఇక్కడ మేస్త్రీగా పని చేస్తున్నాను. ఈ ఫ్యాక్టరీ యజమాని మాకు బాగా నచ్చాడు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. నెలా నెలా వేతనాలు అందుతున్నాయి. – బీరారామ్, మేస్త్రీ డెంటిస్ట్ కల అలా సాకారమైంది విశాఖలో డెంటల్ ల్యాబ్కు శ్రీకారం సాక్షి, విశాఖపట్నం: ఆయనో దంత వైద్యుడు. వైద్య విద్యను పూర్తి చేసుకుని 2010లో విశాఖపట్నం మురళీనగర్లో ఓ డెంటల్ క్లినిక్ ప్రారంభించారు. తాను నడిపే క్లినిక్కంటే దానికి సంబంధించిన ఉత్పత్తి పరిశ్రమను స్థాపిస్తే పలువురికి ఉపాధి కల్పించవచ్చని ఆయన భావించారు. దాని వ్యాపార మెలకువలు తెలుసుకునేందుకు ఎంబీఏలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేశారు. స్నేహితుడు గోపీకృష్ణతో కలిసి కృత్రిమ దంతాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఎంఎస్ఎంఈ సింగిల్ పోర్టల్ విధానంలో నెల రోజుల్లోనే అన్ని అనుమతులతో పాటు రుణమూ మంజూరైంది. రూ.3.50 కోట్ల పెట్టుబడితో 2020 జనవరి నుంచి ఉత్పత్తిని ప్రారంభించారు. వార్షిక టర్నోవర్ రూ.4.80 కోట్లకు చేర్చారు. ఆయన పేరు డాక్టర్ గండి వెంకట శివప్రసాద్. ఆయన స్థాపించిన యూనిట్ పేరు డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్. రాష్ట్ర ప్రభుత్వం ఈ డెంటల్ ల్యాబ్కు రూ.20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ కూడా మంజూరు చేసింది. మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో... విశాఖలోని కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈ డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ల్యాబ్ నడుస్తోంది. ఇందులో కృత్రిమ దంతాలకు అవసరమైన అచ్చులు, క్రౌన్లు, బ్రిడ్జిలు వంటివి తయారు చేస్తారు. వీటిని కాస్టింగ్ టెక్నాలజీతో కాకుండా మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో డిజిటల్ త్రీడీ ప్రింటింగ్ విధానంలో చేస్తారు. కొరియన్ టెక్నాలజీతో తయారయ్యే ఇవి మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ ల్యాబ్ తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్దది. ఇప్పుడు 45 మంది శాశ్వత, 20 మంది తాత్కాలిక, మరో 20 మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు మంచి ప్రోత్సాహాన్నిస్తోంది. అతి తక్కువ సమయంలోనే వీటి ఏర్పాటుకవసరమైన అనుమతులను మంజూరు చేస్తోంది. గతంలో ఇలాంటి సౌకర్యం లేదు. మా ల్యాబ్ను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకు రూ.6.50 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం మా ఉత్పత్తులు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు, హైదరాబాద్కు సరఫరా చేస్తున్నాం. భవిష్యత్తులో దేశమంతటా విస్తరించాలని యోచిస్తున్నాం. ల్యాబ్ విస్తరిస్తే వెయ్యి మంది ఉపాధి పొందుతారని భావిస్తున్నాం. – డా. గండి వెంకట శివప్రసాద్, ఎండీ, డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, విశాఖపట్నం -
ఈ టీత్ క్లీనర్ ఉంటే..ముత్యాల్లాంటి పలువరుస మీ సొంతం!
ముత్యాల్లాంటి పలువరుస ముఖానికి ఎనలేని అందాన్ని తీసుకొస్తుంది. నవ్వినా.. మాట కలిపినా.. పలువరుసే ఎదుటివాళ్లను ఆకర్షిస్తుంది. అలా పళ్లు తెల్లగా మెరిసిపోవాలంటే.. నోటి దుర్వాసన మాయం కావాలంటే వెంటనే ఈ ప్రొఫెషనల్ టీత్ క్లీనర్ని తెచ్చేసుకోండి. మరీ ముఖ్యంగా స్మోకింగ్, వైన్, కాఫీ అలవాటున్నవాళ్లు దీంతో ఉపశమనం పొందొచ్చు. ఈ డెంటల్ కాలిక్యులస్ రిమూవల్ టూల్.. సాఫ్ట్, నార్మల్, మీడియం, స్ట్రాంగ్, సూపర్ స్ట్రాంగ్ వంటి ఐదు అడ్జస్టబుల్ మోడ్స్తో పని చేస్తుంది. ఇది చిగుళ్ల ఇరుకుల్లో, దంతాల చుట్టూ పేరుకున్న గారను పూర్తిగా తొలగిస్తుంది. ఈ మెషిన్ కారణంగా పళ్లకు, పళ్ల మీది ఎనామిల్ పొరకు ఎలాంటి నష్టం వాటిల్లదు. దీనికి అడాప్టర్తో పాటు.. ల్యాప్టాప్తోనైనా, పవర్ బ్యాంక్తోనైనా, కారులోనైనా చార్జింగ్ పెట్టుకోవచ్చు. సీ టైప్ చార్జర్ అనువైనది. లోపలికున్న దంతాలు, పై పళ్ల లోపలి భాగాలు స్పష్టంగా కనిపించడానికి ప్రత్యేకమైన డెంటల్ మిర్రర్ లభిస్తుంది. దీని హెడ్కి ఎల్ఈడీ లైట్ అమర్చి ఉండటంతో పళ్లను తేలికగా శుభ్రం చేసుకోవచ్చు. దీని ధర సుమారుగా 155 డాలర్లు. అంటే 12,893 రూపాయలన్న మాట. ఇతర మోడ్స్, ఆప్షన్స్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. (చదవండి: పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు) -
వామ్మో..! నోట్లో ఎన్ని పళ్లో..? గిన్నీస్ రికార్డ్
సాధారణంగా మనందరి నోట్లో 32 పళ్లుంటాయి. కానీ కల్పనా బాలన్(26) అనే మహిళకు నోట్లో ఏకంగా 38 పళ్లున్నాయి. ఈ ఘనతతో మహిళల్లో అత్యధిక పళ్లున్న జాబితాలో ఆవిడ గిన్నీస్ రికార్డ్ సాధించారు. తనకు అడ్డంకిగా ఉన్న పళ్లే రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. Kalpana Balan from India has six more teeth than the average human. Read more by clicking the picture 👇 — Guinness World Records (@GWR) November 20, 2023 కల్పనకు నాలుగు అదనపు దవడ (దిగువ దవడ) పళ్ళు, రెండు అదనపు దవడ (ఎగువ దవడ) పళ్ళు ఉన్నాయి. తన యుక్తవయసులో ఉండగానే అదనపు దంతాలు ఆవిర్భవించాయి. అవి క్రమంగా ఒక్కొక్కటిగా పెరుగుతూ పైకి వచ్చాయి. ఎటువంటి నొప్పిని కలిగించనప్పటికీ ఆహారం తరచుగా అదనపు దంతాల మధ్య చిక్కుకుపోతోందని కల్పన తెలిపారు. అదనపు దంతాలు ఏర్పడినప్పుడు ఆశ్చర్యపోయినట్లు కల్పన తల్లిదండ్రులు తెలిపారు. వాటిని తీసివేయడానికి నిర్ణయించుకున్నారు. కానీ పూర్తిగా పెరిగిన తర్వాతనే తొలగించాల్సి ఉంటుందని వైద్యులు సూచించడంతో ఆగిపోయారు. ఇబ్బందిగా మారిన ఈ పళ్లే తనకు గిన్నీస్ రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. కల్పనలో మరో రెండు అసంపూర్తిగా ఉన్న పళ్లు ఉన్నాయి. అవి పెద్దైతే ఈ రికార్డ్ను ఆమె మరింత పెంచనున్నారు. ప్రస్తుతం మగవారిలో అత్యధికంగా 41 పళ్లున్న జాబితాలో కెనడాకు చెందిన ఎవనో మెల్లోన్ రికార్డుల్లో నిలిచారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..? -
వైద్య విద్యార్థులకు వరం.. డిజిటల్ లైబ్రరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యవిద్యకు సంబంధించిన అత్యాధునిక పుస్తకాలు, వివిధ రకాల అరుదైన చికిత్సలకు సంబంధించిన వీడియోలు, వేలాది జర్నల్స్తో కూడిన డిజిటల్ లైబ్రరీ (ఈ–లైబ్రరీ)ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వైఎస్సార్ మెడ్నెట్ కన్సార్షియం పేరుతో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, ఆయుష్, పారా మెడికల్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి వేలాది రకాల అత్యాధునిక పాఠ్యపుస్తకాలు, జర్నల్స్, అరుదైన చికిత్సలు, ట్రీట్మెంట్ ప్రొటోకాల్కు సంబంధించిన వీడియోలు ఉంచారు. ప్రతి విద్యార్థి డిజిటల్ లైబ్రరీని సులభంగా వినియోగించుకునేందుకు మైలాఫ్ట్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం యూనివర్సిటీ రూ. 4 కోట్లు వెచ్చించింది. మైలాఫ్ట్.. యూజర్ ఫ్రెండ్లీ యాప్.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 2008లోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే అక్కడ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. లైబ్రరీలో మాత్రమే దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో లైబ్రరీ పనివేళల్లో వెళ్లేందుకు కుదరకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. పరిస్థితి గమనించిన ప్రస్తుత వర్సిటీ అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో మైలాఫ్ట్ (మై లైబ్రరీ ఆన్ ఫింగర్ టిప్స్) అప్లికేషన్ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు, టీచింగ్ వైద్యులు, ఎక్కడినుంచైనా తమ మొబైల్లో సైతం లాగిన్ అయ్యి డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీన్లో 21 వేలకు పైగా ఈ–బుక్స్, 22,433కు పైగా ఈ– జర్నల్స్, 11,000 పైగా వీడియోలు ఉన్నాయి. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రతి విద్యార్థి ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా డిజిటల్ లైబ్రరీని ఆధునీకరించాం. మైలాఫ్ట్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ద్వారా విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్కడి నుంచైనా, తమ మొబైల్స్లో సైతం లాగిన్ అయ్యే అవకాశం కల్పించాం. డిజిటల్ లైబ్రరీ వినియోగంపై అన్ని కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ వి.రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ సద్వినియోగం చేసుకోవాలి మైలాఫ్ట్ యాప్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు టెక్నికల్ సిబ్బందితో కలిసి జోనల్ వారీగా సదస్సులు నిర్వహించి యాప్ వినియోగంపై ఫ్యాకలీ్ట, విద్యార్థుల్లో అవగాహన కలి్పస్తున్నాం. వేలాది ఈ–బుక్స్, ఈ–జర్నల్స్, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. – డాక్టర్ కె.సుధ, కో ఆర్డినేటర్, కన్సార్షియం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
అందం కోసం కొత్త దంతాలు.. ‘షార్క్’లా మారిన యువకుడు!
ప్రపంచంలో చాలామంది అందం కోసం విపరీతంగా తాపత్రయపడుతుంటారు. ఇందుకోసం ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంటారు. కొందరు తమ దంతాలు సరిగా లేవంటూ, వాటికి హంగులు సమకూరుస్తారు. ఇటువంటి సందర్బాల్లో చికిత్స చేయించుకున్న కొందరి ముఖాలు భయంకరంగా మారిపోవడాన్ని మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇటువంటి మరో తాజా ఉదంతం ఇప్పుడు వైరల్గా మారింది. ఇటీవలే డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్న ఒక యువకునికి ఎదురైన చేదు అనుభవం గురించి ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వివరించాడు. జాక్ జేమ్స్ కెమెరాలో అందంగా కనిపించాలనే ఉద్దేశంతో నకిలీ దంతాలు పెట్టించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం బ్రిటన్ నుంచి టర్కీకి వెళ్లాడు. £3,000( సుమారు రూ. 3 లక్షలు) వెచ్చించి నకిలీ దంతాలు పెట్టించుకున్నాడు. మొదట్లో ఈ దంతాలు అతని ముఖానికి ఎంతో అందాన్నిచ్చాయి. అయితే కొద్ది రోజుల తరువాత అతని దంతాల నుంచి రక్తం కారసాగింది. అలాగే నోటు నుంచి దుర్వాసన కూడా వెలువడసాగింది. దీంతో జాక్ జేమ్స్.. మాంచెస్టర్లోని ఒక డెంటిస్ట్ను సంప్రదించాడు. ఆ దంతవైద్యుడు పలుపరీక్షలు చేసిన అనంతరం అతని దంతాలు పూర్తిగా పాడయిపోయాయని చెప్పాడు. ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపాడు. ఆ దంతాలను తిరిగి సరిగా చేసేందుకు £20,000(సుమారు రూ. 20 లక్షలు) ఖర్చవుతాయని తెలిపాడు. ఇంగ్లండ్లో ఈ చికిత్సకు ఇంత భారీగా ఖర్చవుతుందని తెలుసుకున్న అతను తిరిగి గతంలో తనకు చికిత్స చేసిన టర్కీలోని డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ డెంటిస్ట్ అతనితో దంత చికిత్సలో తప్పేమీ జరగలేదని, అయితే తిరిగి దంతాలను సరి చేసుకోవాలంటే, మరోమారు చికిత్స చేయించుకోవాలని, ఇందుకు మరింత ఖర్చవుతుందని తెలిపాడు. మరో మార్గంలేక జాక్ అందుకు అంగీకరించాడు. నకిలీ దంతాలను తొలగించుకుని ఇన్ఫెక్షన్ దూరమయ్యేందుకు చికిత్స తీసుకున్నాడు. తరువాత కొత్తగా టెంపరరీ దంతాలను పెట్టించుకున్నాడు. అయితే అతను ఈ టెంపరరీ దంతాలను శుభ్రం చేసుకుంటున్నప్పుడు, అసలు దంతాలు షార్క్ దంతాలుగా మారిపోవడాన్ని గమనించాడు. అన్ని దంతాల మధ్య గ్యాప్ ఉండటాన్ని గుర్తించాడు. జాక్ తన దంతాలు చూసుకున్నప్పుడల్లా ఏదో హర్రర్ ఫిల్మ్లోని క్యారెక్టర్లా ఉన్నానని భావిస్తాడట. దీంతో అతనికి ఈ షార్క్ దంతాలను కూడా తొలగించుకోవాలని అనిపిస్తుందట. ఇందుకోసం మరో వైద్యుడిని సంప్రదించాలని అనుకుంటున్నానని జాక్ తెలిపాడు. ఇది కూడా చదవండి: తొలి హార్ట్ట్రాన్స్ ప్లాంట్కు 56 ఏళ్లు.. ఆ రోజు జరిగిందిదే! -
టెక్యేతర ఉద్యోగాలకు డిమాండ్
ముంబై: బహుళ జాతి ఐటీ దిగ్గజాలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్న తరుణంలో గతేడాది డిసెంబర్లో దేశీయంగా టెక్యేతర రంగాల్లో ఉద్యోగులకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, ఆహార సర్వీసులు, నిర్మాణం, విద్యా రంగాల్లో ఈ ధోరణి నెలకొంది. నెలవారీగా ఉద్యోగాల పోస్టింగ్లపై అంతర్జాతీయ జాబ్ సైట్ ఇన్డీడ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం హెల్త్కేర్ అనుబంధ విభాగాలైన డెంటల్, నర్సింగ్ రంగాల్లో ఉద్యోగాల పోస్టింగ్స్ అత్యధికంగా 30.8 శాతంగా నమోదయ్యాయి. ఫుడ్ సర్వీసెస్ (8.8%), నిర్మాణం (8.3%), ఆర్కిటెక్చర్ (7.2%), విద్య (7.1%) థెరపీ (6.3%), మార్కెటింగ్ (6.1%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కరోనా మహమ్మారి అనంతరం వ్యాపార పరిస్థితులు సాధారణ స్థాయికి తిరిగొస్తున్న నేపథ్యంలో నిర్మాణం, సివిల్ ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో కాస్త సందడి నెలకొందని నివేదిక పేర్కొంది. అలాగే మహమ్మారి సమయంలో భారీగా కోతలు పడిన మార్కెటింగ్ విభాగంలోనూ హైరింగ్ పుంజుకుందని వివరించింది. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని కల్పించడంతో పాటు వ్యాపారం, అమ్మకాలను పెంచుకునేందుకు మార్కెటింగ్ అవసరాన్ని బ్రాండ్లు గుర్తించాయని పేర్కొంది. బెంగళూరు టాప్.. జాబ్ పోస్టింగ్స్ విషయంలో మొత్తం 16.5 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో నిల్చింది. ముంబై (8.23%), పుణె (6.33%), చెన్నై (6.1%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చిన్న నగరాల్లోను డిమాండ్ పెరుగుతోందనడానికి సూచనగా ఉద్యోగాల పోస్టింగ్స్లో అహ్మదాబాద్, కోయంబత్తూర్, కొచ్చి, జైపూర్, మొహాలీ వంటి ద్వితీయ శ్రేణి నగరాల వాటా 6.9 శాతంగా నమోదైంది. ప్రయాణాలపై కోవిడ్–19పరమైన ఆంక్షల ఎత్తివేతతో విదేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలను భారతీయులు గణనీయంగానే అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో దేశాలవారీగా చూస్తే మొత్తం సెర్చ్లలో అమెరికా వాటా 39.29 శాతంగా ఉండగా, కెనడా 17.23 శాతం, బ్రిటన్ 14.34 శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ 13.79 శాతం వాటాతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయంగా వివిధ ఉద్యోగాల కేటగిరీల్లో వృద్ధి కనబడుతోందని, భారత్లో హైరింగ్ ధోరణులు సానుకూలంగా ఉందనడానికి ఇది నిదర్శనమని ఇన్డీడ్ ఇండియా హెడ్ (సేల్స్) శశి కుమార్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి కల్పనపై దృష్టి పెడితే కచ్చితంగా దేశీయంగా జాబ్ మార్కెట్కు మరింత ఊతం లభించగలదని ఆయన చెప్పారు. దేశీయంగా ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉండబోతోందనేది ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో ధోరణులే నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. -
భారత్లో దారుణమైన పరిస్థితులు.. దంత ఆరోగ్యంపై ఖర్చు ఇంత తక్కువా?
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో దంతాల ఆరోగ్యంపై నిర్లక్ష్యం కనిపిస్తోందని, దీనివల్ల భారీగా నష్టం కలుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. భారత్లో దంత ఆరోగ్యం కోసం ఏటా చేస్తున్న తలసరి సగటు ఖర్చు కేవలం నాలుగు రూపాయలేనని పేర్కొంది. ఈ మేరకు ‘ఓరల్ హెల్త్ ఇన్ ఇండియా’ పేరిట ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలో నోటి అనారోగ్యాన్ని ప్రజారోగ్య సమస్యగా గుర్తించ లేదని.. నోరు, దంతాలకు సంబంధించి వచ్చే ఐదు ప్రధాన జబ్బులతో దేశానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.60 వేల కోట్ల నష్టం వస్తోందని తెలిపింది. ఇండియాలో ఒకటి నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయసువారిలో 43.3 శాతం మందికి దంత సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఐదేళ్లపైబడిన వారిలో 28.8 శాతం మందికి తేలికపాటి దంత సమస్యలు ఉన్నాయని వివరించింది. 15 ఏళ్లకు పైబడిన వారిలో 21.8 శాతం మందికి తీవ్రమైన దంత సమస్యలు ఉన్నాయని పేర్కొంది. 20 ఏళ్లు దాటినవారిలో దంతాలు లేనివారు నాలుగు శాతం మంది ఉన్నట్టు తెలిపింది. ఇక నోటి, పెదవుల కేన్సర్లకు సంబంధించి 2020లో 1.35 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని. ఇందులో మహిళలు 31,268 మంది, పురుషులు 1.04 లక్షల మంది ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. సగటున ప్రతి లక్ష జనాభాలో 9.8 మందికి నోటి, పెదవుల కేన్సర్ కేసులున్నాయని తెలిపింది. ఆల్కహాల్, పొగాకు, పంచదార ఉత్పత్తులే ఈ దంత సమస్యలకు కారణమని పేర్కొంది. డబ్ల్యూహెచ్వో నివేదికలోని పలు కీలక అంశాలివీ ►మన దేశంలో ప్రతి ఒక్కరు వివిధ రూపాల్లో కలిపి రోజుకు సగటున 53.8 గ్రాముల పంచదార వినియోగిస్తున్నారు. ►15 ఏళ్లు పైబడినవారిలో పొగాకు ఉత్పత్తులు వాడేవారు 28.1శాతం కాగా..ఇందులో మహిళలు 13.7 శాతం, పురుషులు 42.4 శాతం. ►15 ఏళ్లు పైబడినవారిలో తలసరి సగటున ఏడాదికి 5.6 లీటర్ల మద్యం తాగుతున్నారు. ఇందులో మహిళలు 1.9 లీటర్లు, పురుషులు 9.1 లీటర్లు తాగుతున్నారు. ►2019 లెక్కల ప్రకారం ఇండియాలో దంత వైద్య సహాయకులు 3,515 మంది, దంతాలను కృత్రిమంగా అమర్చే టెక్నీషియన్లు 3,090 మంది, దంత వైద్యులు 2.71 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ►ఐదేళ్లలో ప్రతి పదివేల జనాభాకు ఇద్దరు మాత్రమే కొత్తగా దంత వైద్యులు అందుబాటులోకి వచ్చారు. ►దేశంలో అధునాతన దంత వైద్యానికి సంబంధించి బీమా సౌకర్యం లేదు. ప్రమాదాలు, ఇతర కారణాలతో దంతాలు పోయినా బీమా సౌకర్యం వర్తించడం లేదు. ►దేశంలో జాతీయ ఓరల్ పాలసీ ఉన్నా దంత ఆరోగ్యంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగడం లేదు. సమస్య తీవ్రమైతేగానీ బాధితులు పట్టించుకోవడం లేదు. దంత సమస్యలపై ప్రజల్లో అవగాహన తక్కువ మన దేశంలో దంత, గొంతు సమస్యలపై అవగాహన తక్కువ. దంత సమస్యలుంటే సంతులిత ఆహారం తీసుకోలేం. ఇవి దీర్ఘకాలిక జబ్బులకు కారణం అవుతాయి. నోరు, దంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు పొగాకు, ఆల్కహాల్, తీపి పదార్థాలకు దూరంగా ఉంటే జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. – డాక్టర్ హరిత మాదల, దంత వైద్యులు, నిజామాబాద్ పొగాకు వినియోగమే ప్రధాన కారణం నోటి కేన్సర్, దంతాల సమస్యలకు చాలా వరకు పొగాకు వినియోగమే ప్రధాన కారణం. ఐసీఎంఆర్ అంచనాల ప్రకారం దేశంలో కేన్సర్తో బాధితుల సంఖ్య 2025 నాటికి దాదాపు 29.8 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. కేన్సర్ చికిత్సకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తున్నప్పటికీ.. దాని మూలకారణమైన పొగాకు వినియోగం నియంత్రణపై తగినస్థాయిలో దృష్టి సారించడం లేదు. దేశంలో పొగాకు వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. టీనేజ్ పిల్లలు పొగాకు వ్యసనానికి గురికాకుండా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలి. – నాగ శిరీష, వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -
స్టాలిన్ సర్కారు సరికొత్త పథకం
సాక్షి, చెన్నై: ఇంటింటికీ విద్య, దంత వైద్య సేవా పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. చెన్నైలో తొలి విడతగా మొబైల్ దంత వైద్య సేవలకు సోమవారం ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్ శ్రీకారం చుట్టారు. అందరికీ మెరుగైన వైద్యం అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. చెన్నైలో తొలిసారిగా సోమవారం ప్రజల వద్దకే దంత వైద్య సేవలకు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ శ్రీకారం చుట్టారు. ఇందు కోసం అన్ని రకాల వసతులతో ప్రత్యేకంగా మొబైల్ వాహనం సిద్ధం చేశారు. ఇకపై ప్రతి శనివారం వ్యాక్సినేషన్ క్యాంప్ మీడియాతో సోమవారం ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ మాట్లాడుతూ, ప్రజల వద్దకే దంత వైద్య సేవలకు శ్రీకారం చుట్టామని, దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. ఆదివారం మెగా వ్యాక్సిన్ క్యాంప్ ఏర్పాటు చేయడం ద్వారా అనేక మంది మాంసం ప్రియులు, మందుబాబులు టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదని పరిశీలనలో తేలిందన్నారు. ఆదివారం మద్యం తాగేందుకు, మాసం తినడానికి టీకా సమస్యగా మారుతుందేమోనన్న తప్పుడు ప్రచారమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అందుకే ఇకపై శనివారం మెగా వ్యాక్సిన్ శిబిరం ఏర్పాటుకు నిర్ణయించామని తెలిపారు. ఈసారి 50 వేల శిబిరాలను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. 53 లక్షల వ్యాక్సిన్ డోస్లు చేతిలో ఉన్నాయని వెల్లడించారు. చదవండి: (తొమ్మిదేళ్ల సర్వేశ్ని అభినందించిన సీఎం స్టాలిన్) ఇంటి వద్దకే విద్య.. నవంబర్ 1వ తేదీన పాఠశాలల్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నా, ఇంటి వద్దకే విద్య అన్న నినాదాన్ని తాజాగా అందుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 9,10,11,12 విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు విస్తృతం చేయనున్నా రు. అలాగే, 1తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇంటి వద్దకే వెళ్లి విద్యను అందించేందు చే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. సోమవారం సీఎం ఎంకే స్టాలిన్తో విద్యామంత్రి అన్భిల్ మహేశ్, కార్యదర్శి కాకర్లు ఉషాతో పాటుగా అధికారులు సమావేశం ఈ విషయంపై చర్చించారు. -
మానసను బలిగొంది ప్రేమా? ఉన్మాదమా?
సరదా స్నేహాలు.. విపరీత అనర్థాలకు దారితీస్తున్నాయి. యుక్తవయసులో తెలిసీ తెలియక చేస్తున్న పనులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆకర్షణతో ఒకరికపై ఒకరు పెంచుకుంటున్న ‘ప్రేమ’ అనే ఫీలింగ్.. చివరకు విషాదాన్ని మిగులుస్తోంది. కేరళలో జరిగిన మానస హత్య ఘటన ‘ప్రేమోన్మాదం’ చర్చను మరోసారి తెర మీదకు తెచ్చింది. కొచ్చి: Dental Hose Surgeon మానస హత్య కేసు ప్రస్తుతం కేరళను కుదిపేస్తోంది. పట్టపగలే ఇంట్లోకి చొరబడి మరీ మానసను తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు.. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు.. మరిన్ని వివరాలను సేకరించారు. కొచ్చికి 35 కిలోమీటర్ల దూరంలో కొత్తమంగళం దగ్గర నెల్లికులిలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఇదసలు ప్రేమా? ఉన్మాదమా? అనే అంశంపై యువతలో సోషల్ మీడియాలో, ముఖ్యంగా క్లబ్హౌజ్లో ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. బ్రేకప్కి ఏడాది పీవీ మానస(24) స్వస్థలం కన్నూర్. ఇందిరా గాంధీ కాలేజీలో డెంటల్ కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్కడే స్నేహితురాల్లతో రూమ్లో ఉంటోంది. ఇక రాఖిల్(32?) కూడా అదే జిల్లాకు చెందిన వాడు. ఏడాది క్రితం ఈ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. ఆపై ప్రేమలో పడ్డారు. అయితే నెల క్రితం మానస, రాఖిల్కు బ్రేకప్ చెప్పింది. దీంతో రాఖిల్ ఆమెను బతిమాలడం మొదలుపెట్టాడు. కాళ్ల మీద పడ్డాడు. ఈ విషయంపై కన్నూర్ పోలీస్ స్టేషన్లో మానస ‘వేధింపుల ఫిర్యాదు’ చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీస్ పంచాయితీ జరగ్గా.. రాఖిల్ పేరెంట్స్ రిక్వెస్ట్తో బెదిరించి వదిలేశారు పోలీసులు. దీంతో తన బ్రేకప్ కథకు ముగింపు పలకాలని పక్కా ఫ్లాన్ వేసుకున్నాడు. దగ్గరగా కాల్పులు శుక్రవారం మధ్యాహ్నం కొత్తమంగళంలో మానస ఉంటున్న రూమ్కి వెళ్లాడు. ఆమెతో గొడవకు దిగి.. మరో రూంలోకి లాక్కెళ్లాడు. రూమ్ మేట్స్ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వాళ్లను తుపాకీతో బెదిరించి ఆపై మానసపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో కేరళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈమధ్య వరుసగా వరకట్న మరణాలు చోటు చేసుకోడం, అవి మరిచిపోక ముందే మానస ఘటన చోటు చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాఖిల్కు తుపాకీ ఎలా దొరికిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఒప్పందం ఆధారంగా ఫీజుల ఖరారు చెల్లదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల వార్షిక ఫీజులను భారీగా పెంచుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం 2017లో జారీ చేసిన జీవో 72, 77లను హైకోర్టు రద్దు చేసింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం ఫీజులను నిర్ణయించడాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, జస్టిస్ రావు రఘునందన్రావులతో కూడిన ధర్మాసనం మూడు రోజుల క్రితం తీర్పు వెలువరించింది. ఫీజుల పెంపుపై అప్పట్లో హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై తుది విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఏకాభిప్రాయం ప్రకారమే ఫీజులను పెంచడం జరిగిందని, ఇందులో ఎలాంటి తప్పులేదన్న మెడికల్ కాలేజీల వాదనను తోసిపుచి్చంది. 2017–18 నుంచి 2019–20 సంవత్సరాలకు ఏఎఫ్ఆర్సీ సిఫారసులు లేకుండా ప్రభుత్వం నేరుగా ఫీజులు పెంచిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపింది. -
ఇక వారు కూడా ఆపరేషన్లు చేయొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయు ఆయుర్వేద వైద్య విధానం ప్రోత్సాహానికి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన కేంద్రం తాజాగా ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లు వివిధ రకాల సాధారణ శస్త్రచికిత్సలు చేసేందుకు వీలు కల్పించనుంది. ఈ మేరకు ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేద విద్య) 2016 నిబంధనలను సవరించింది. షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (ఈఎన్టీ, హెడ్, డెంటల్ స్పెషలైజేషన్) కోర్సులను పీజీలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వారికి ప్రత్యేక శిక్షణను ప్రవేశపెట్టింది. శిక్షణ అనంతరం ఈఎన్టీ, దంత వైద్యంతోపాటు, కంటి శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా అనుమతి లభిస్తుంది. ప్రభుత్వనిర్ణయం ప్రకారం ఇకపై ఆయుర్వేద వైద్యులు స్కిన్ గ్రాఫ్టింగ్, కంటిశుక్లం శస్త్ర చికిత్స, రూట్ కెనాల్ వంటి సాధారణ ఆపరేష్లన్లను చట్టబద్ధంగా నిర్వహించవచ్చు. నవంబర్ 19న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పాఠ్యాంశాల్లో భాగంగా షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (చెవి, ముక్కు, గొంతు వ్యాధులు) విధానాలలో అధికారికంగా శిక్షణనిస్తుంది. తద్వారా వారు స్వతంత్రగా సర్జరీలను నిర్వహించే సామర్ధ్యాన్ని సొంతం చేసుకుంటారు. ఎంఎస్ (ఆయుర్వేద) శాల్య తంత్రం డీబ్రిడ్ మెంట్ / ఫాసియోటోమీ / క్యూరెట్టేజ్ పెరియానల్ చీము, రొమ్ము గడ్డ, ఆక్సిలరీ చీము, సెల్యులైటిస్ అన్ని రకాల స్కిన్ గ్రాఫ్టింగ్, ఇయర్ లోబ్ రిపైర్ లింఫోపోమా, ఫైబ్రోమా, స్క్వాన్నోమా మొదలైన కణతుల తొలగింపు గ్యాంగ్రేన్ ఎక్సిషన్ / విచ్ఛేదనం తీవ్ర గాయాలనిర్వహణ, అన్ని రకాల సూటరింగ్, హేమోస్టాటిక్ లిగెచర్స్, బిగుసుకుపోయిన కండరాల చికిత్స లాపరోటమీ హేమోరాయిడెక్టమీ, రబ్బర్ బ్యాండ్ లిగేషన్, స్క్లెరోథెరపీ, ఐఆర్పీ, రేడియో ఫ్రీక్వెన్సీ / లేజర్ అబ్లేషన్ మొదలైన వివిధ పద్ధతులు. యానల్ డైలేటేషన్, స్పింక్టెరోటోమీ అనోప్లాస్టీ ఫిస్టులెక్టమీ, ఫిస్టులోటోమీ, పైలోనిడల్ సైనస్ ఎక్సిషన్, వివిధ రెక్టోపెక్సీలు యురేత్రల్ డైలేటేషన్, మీటోమి, సున్తీ పుట్టుకతో వచ్చే హెర్నియోటమీ, హెర్నియోరాఫీ, హెర్నియోప్లాస్టీ హైడ్రోసెల్ ఎవర్షన్, థొరాసిక్ గాయానికి ఇంటర్కోస్టల్ డ్రెయిన్ మొదలైనవి ఉన్నాయి కన్ను కనుపాపలను సరిచేసే సర్జరీ, క్యూరెట్టేజ్ ట్యూమర్ తొలగింపు సర్జరీ పాటరీజియం ఐరిస్ ప్రోలాప్స్-ఎక్సిషన్ సర్జరీ గ్లాకోమా-ట్రాబెక్యూలెక్టమీ కంటికి గాయం: - కనుబొమ్మ, మూత, కండ్లకలక, స్క్లెరా కార్నియా గాయాలకుమరమ్మత్తు శస్త్రచికిత్స స్క్వింట్ సర్జరీ - ఎసోట్రోపియా, ఎక్సోట్రోపియా డాక్రియోసిస్టిటిస్- డిసిటి / డాక్రియోసిస్టోరినోస్టోమీ [డిసిఆర్] కంటిశుక్లం శస్త్రచికిత్స ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సతో కంటిశుక్లం వెలికితీత మొదలైనవి ముక్కు: సెప్టోప్లాస్టీ, పాలీపెక్టమీ, రినోప్లాస్టీ చెవి : లోబులోప్లాస్టీ. అక్యూట్ సపరేటివ్ ఓటిటిస్, మాస్టోయిడెక్టమీ గొంతు వ్యాధులు : టాన్సిలెక్టమీతో పాటు ఇతర చికిత్సలు దంత : వదులు దంతాల బిగింపు, రూట్ కెనాల్,ఇతర చికిత్స -
పీజీ మెడికల్ ఫీజుల పెంపుపై హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్, దంత వైద్య ఫీజుల పెంపు జీవోపై తాజాగా తెలంగాణ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పీజీ మెడికల్, దంతవైద్య ఫీజులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఏ కేటగిరీ విద్యార్థులకు ఫీజుల్లో యాభై శాతం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. (ఏడు ఆస్పత్రుల నుంచే పరిహారం) అంతేగాక బి కేటగిరీ విద్యార్థులు ఫీజులో 60 శాతం చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. మిగతా ఫీజుకు విద్యార్థులు బాండు రాసివ్వాలని విద్యార్థులకు కోర్టు ఆదేశించింది. ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులు పూర్తి ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఇక ఫీజు చెల్లింపులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. 4 వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని టీఏఎఫ్ఆర్సీ, వైద్య కళాశాలలకు హైకోర్టు ఆదేశించింది. కరోనా సంక్షోభంలో ఫీజుల పెంపు విద్యార్థులకు భారమేనని హైకోర్టు విచారణలో వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 4 వారాలకు కోర్టు వాయిదా వేసింది. (హైకోర్టులో డాక్టర్ సుధాకర్ కేసు విచారణ) -
గ్రామాలపై దృష్టి పెట్టాలి
మాదాపూర్: దంత వైద్యులు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మాదాపూర్లోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో 6వ ఎడిషన్ తెలంగాణ స్టేట్ డెంటల్ కాన్ఫరెన్స్–2019 శనివారం ఆయ న ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కాన్ఫరెన్స్లో దంత వైద్యానికి సం బంధించిన పలు రకాల పనిముట్లు, యంత్ర పరికరాలు, శస్త్ర చికిత్స పద్ధతులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్య అభివృద్ధిలో అట్టడుగున ఉన్న తెలంగాణ.. రాష్ట్రం వచ్చిన తరువాత దేశంలో మూడవ స్థానానికి ఎదిగిందన్నారు. దంత వైద్యులు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. నూతన దంత వైద్య కళాశాలలు ఏర్పాటు చేసే బదులు ఇప్పుడు అందుబాటులో ఉన్న దంత వైద్యులనే సక్రమంగా ఉపయోగించుకోవాలన్నారు. దంత వైద్య శిబిరాలు విస్తృతంగా నిర్వహించాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్రెడ్డి, సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు ఎస్.జగదీశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘డెంటల్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ’
సాక్షి, హైదరాబాద్: డెంటల్ అసిస్టెంట్ కోర్సులో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర సహకార సంఘాల సమాఖ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి గలవారు ఈ నెల 25లోగా మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. శిక్షణలో చేరాలంటే అభ్యర్థుల వయసు 21–45 ఏళ్లలోపు ఉండి ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలని, హైదరాబాద్ జిల్లా వాసి అయి ఉండాలని వెల్లడించింది. వివరాలకు 040–23319313ను సంప్రదించాలని సూచించింది. -
బొగ్గు, ఉప్పు పోయి ఆవాలు, పూదీన వచ్చే!
సాక్షి, న్యూఢిల్లీ : తళతళలాడే దంతాల కోసం తాపత్రయ పడే ప్రజలు మొన్న బొగ్గు, నిన్న ఉప్పు, నేడు ఆవాలు, పూదీన, ఆఖరికి పసుపుతో కూడిన మంజన్లు, పేస్టులు వాడుతున్నారు. భారత్లో ఈ విప్లవానికి శ్రీకారం చుట్టి దంత సంరక్షణ మార్కెట్ను మరెక్కడికో తీసుకెళుతన్నది నిస్సందేహంగా బాబా రామ్దేవ్ నాయకత్వంలోని పతంజలి ఉత్పత్తులే. సంప్రదాయబద్ధంగా ఆయుర్వేదం లేదా ఔషధ మూలికల మూలాలు కలిగిన ఉత్పత్తులతో ముందుకు వస్తున్న పతంజలి ఉత్పత్తులు మార్కెట్లో మరెంతో ముందుకు దూసుకెళుతున్నాయి. ఒక్క భారత్లోనే పదివేల కోట్ల రూపాయల మార్కెట్ కలిగిన దంత సంరక్షణ రంగంలో బాబా రామ్దేవ్ ప్రధాన వాటా కోసం పోటీ పడుతున్నారు. ఆయన పోటీని తట్టుకొని తమ ఉత్పత్తులను నిలబెట్టుకోవడానికి కాల్గేట్, హిందుస్థాన్ యూనిలివర్ లాంటి సంస్థలు కూడా పంతంజలి బాటను పట్టక తప్పలేదు. ‘మీరు వాడే కాల్గేట్లో ఉప్పు ఉందా?’ అంటూ ఈ దిశగా ముందుకొచ్చిన కాల్గేట్ ‘సిబాకా వేదశక్తి’ని 2016, ఆగస్టులో మార్కెట్లోని విడుదల చేసింది. ఇక హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ ఆవాలు, రాతి ఉప్పు మూలాలు కలిగిన ‘ఆయుష్’ బ్రాండ్ను 2017, ఆగస్టులో విడుదల చేసింది. అయినప్పటికీ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఔషధ మూలికల దంత ఉత్పత్తుల్లో అమ్ముడుపోతున్న ఐదింటిలో నాలుగు బ్రాండ్లు పతంజలి, డాబర్ ఉత్పత్తులే కావడం విశేషం. ‘హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్’ లెక్కల ప్రకారం దేశంలో దంత సంరక్షణ మార్కెట్ పదివేల కోట్ల రూపాయలకు విస్తరించగా, 10 సంవత్సరాల క్రితం వీటిల్లో ఆయుర్వేద లేదా ఔషధ మూలికల బ్రాండ్లు ఒక్కటైనను లేదు. నేడు వాటి వాటా పదివేల కోట్ల రూపాయల్లో 20 శాతానికి చేరుకొంది. భారత దేశంలో నేడు 90 శాతం ఇళ్లలో టూత్పేస్ట్ లేదా టూత్ పౌడర్ వాడుతున్నారు. వీటిల్లోకి ఔషధ మూలాలున్న ఉత్పత్తులు చొచ్చుకుపోవడానికి కారణం ఆరోగ్యానికి అవి మంచి చేస్తాయన్న విశ్వాసమే కాకుండా ధర తక్కువగా ఉండడం కూడా మరో కారణం. పతంజలి ఉత్పత్తులో దంత్ కాంతి బ్రాండ్ను ప్రతి వంద గ్రాములను 40 రూపాయలకు విక్రయిస్తుండగా, కాల్గేట్, హిందుస్థాన్ యూనిలీవర్ ఉత్పత్తులను ప్రతి వంద గ్రాములను 55 రూపాయల నుంచి 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ మార్కెట్ లీడర్ కాల్గేట్ కంపెనీయే. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2015 సంవత్సరంలో మార్కెట్లో కాల్గేట్ వాటా 57 శాతం నుంచి 53 శాతానికి పడిపోయింది. ప్రజలు కాస్మోటిక్ కేర్ నుంచి థెరపాటిక్ కేర్కు, అంటే సౌందర్య పిపాస నుంచి ఆరోగ్య సంరక్షణకు మల్లడం వల్ల మూలికల మూలాలున్న ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని డాబర్ ఇండియా సీఈవో సునీల్ దుగ్గల్ వ్యాఖ్యానించారు. భారత్లో డాబర్ ఇండియా రెడ్, బాబుల్, మెశ్వాక్ బ్రాండ్ల టూత్పేస్ట్ను విక్రయిస్తున్న విషయం తెల్సిందే. -
భారీగా పెరిగిన మెడికల్, డెంటల్ సీట్ల ఫీజులు
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య సంబంధిత సీట్లకు రెక్కలొచ్చాయి. రాష్ట్రంలో మెడికల్ మరియు డెంటల్ కాలేజీ సీట్ల ఫీజులు భారీగా పెరిగాయి. A కేటగిరికి చెందిన మెడికల్ సీటు ఫీజు మొత్తం రూ10 వేలు ఉండగా, C కేటగిరి సీటు ఫీజు మొత్తాన్ని రూ. 55 లక్షలుగా నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఫీజుల వివరాలను వెల్లడించారు. పెరిగిన ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.. మెడికల్: A కేటగిరి సీట్లకు రూ. 10 వేలు, B కేటగిరి సీట్లకు రూ.11 లక్షలు, C కేటగిరి సీట్లకు రూ.55 లక్షలు డెంటల్: A కేటగిరీ సీట్లకు రూ. 10 వేలు, B కేటగిరి సీట్లకు 4 లక్షల 50 వేలు, C కేటగిరి సీట్లకు 22 లక్షలు -
స్థానిక వైద్యులతో అపోలో జట్టు
* ఇప్పటికే దంత వైద్యులతో జేవీ * త్వరలో మధుమేహ వైద్యులతో ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్ నూతన వ్యాపార విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి వరకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్పెషాలిటీ క్లినిక్స్ను నిర్వహిస్తున్న ఈ సంస్థ స్థానిక వైద్యులతో చేతులు కలుపుతోంది. స్థానికంగా పేరు ప్రఖ్యాతులున్న ప్రత్యేక వైద్యులతో సంయుక్త భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. తద్వారా అపోలో బ్రాండ్ను విస్తరింపజేయడమేగాక అత్యాధునిక వైద్య సేవలను విస్తృతం చేయాలన్నది సంస్థ ఆలోచన. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై సంస్థ ఇప్పుడు దృష్టిసారించింది. ఇప్పటికే దంత వైద్య విభాగంలో ఈ మోడల్ను అమలు చేస్తోంది. కొద్ది రోజుల్లో మధుమేహ చికిత్సలో నిమగ్నమైన వైద్యులతో చేతులు కలుపనున్నట్టు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీత రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పేరున్న వైద్యులతో.. ప్రముఖ వైద్యులతో చేతులు కలపడం ద్వారా అపోలో బ్రాండ్ను పాపులర్ చేయొచ్చన్నది కంపెనీ భావన. అటు వ్యాపారపరంగా వృద్ధికి ఆస్కారం ఉంటుంది. వైద్యులకు సైతం పెద్ద బ్రాండ్తో భాగస్వామ్యం ఉండడం వల్ల పేషెంట్ల రాక మరింత పెరుగుతుంది. నగరాల్లో ప్రధాన ప్రాంతాల్లో సొంతంగా ఆసుపత్రి నిర్మాణం, నిర్వహణ భారీ వ్యయంతో కూడుకున్నది. అనుభవజ్ఞులైన వైద్యుల నియామకం పెద్దప్రహసనం కూడా. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న క్లినిక్ అయితే ఈ ఇబ్బందులేవీ ఉండవు. అపోలో టెక్నాలజీ.. దంత వైద్య సేవల్లో ఉన్న అపోలో వైట్ డెంటల్ ప్రస్తుతం 15 క్లినిక్లతో జేవీ కుదుర్చుకుంటోంది. వీటిలో మెజారిటీ వాటా అపోలోకు ఉంటుంది. కనీసం 51 శాతం నుంచి కొన్నింటిలో 90 శాతం దాకా వాటా తీసుకుంటున్నట్టు సమాచారం. మధుమేహ చికిత్స సేవల్లో ఉన్న క్లినిక్లకూ ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. జేవీలో భాగంగా క్లినిక్లకు అత్యాధునిక టెక్నాలజీని అపోలో సమకూరుస్తుంది. తద్వారా రోగులకు మరింత మెరుగ్గా వైద్య సేవలను అందించేందుకు వీలవుతుంది. -
సీట్ బ్లాకింగ్ను అరికడతాం
మంత్రి ఆర్.వి.దేశ్పాండే ఫీజు నిర్ణయంలో మార్పు లేదు ఉమ్మడి సీఈటీ నిర్వహణపై సమాలోచనలు సాక్షి,బెంగళూరు: వైద్య, దంత వైద్య, ఇంజినీరింగ్ కోర్సుల సీట్ బ్లాకింగ్ను అరికడుతామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.వి.దేశ్పాండే స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఈ విద్యా ఏడాదికి సీట్ల కేటాయింపు, ఫీజు నిర్ణయంలో ఎలాంటి మార్పు చేయలేదన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో వృత్తి విద్యా కోర్సుల ప్రవేశం కోసం ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ) నిర్వహించే ఆలోచన ఉందన్నారు. వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల్లో పారదర్శకత పెంచేందుకు రూపొందించిన ‘వృత్తి విద్యా కళాశాల ప్రవేశ నియంత్రణ, ఫీజు నిర్ణయం-2014’ బిల్లులో చేసిన మార్పులకు మండలిలో శుక్రవారం ఆమోదం లభించింది. రాష్ట్రంలోని 411 ప్రభుత్వ పీయూసీ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.630 కోట్లు వెచ్చించనున్నామని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రగౌడ అడిగిన ప్రశ్నకు మంత్రి దేశ్పాండే సమాధానమిచ్చారు. అక్రమార్కులపై చర్యలు బీదర్ జిల్లాలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి కోడిగుడ్ల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ రఘునాథ్ రావ్ మల్కాపుర అడిగిన ప్రశ్నకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉమాశ్రీ సమాధానమిచ్చారు. వారంలో మూడు రోజుల చొప్పున ప్రతి నెల 38,70,420 గుడ్లను విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం రూ.1,54,81,680 వెచ్చిస్తున్నట్లు వివరించారు. చర్చించి నిర్ణయం తీసుకుంటాం అక్షర దాసోహ పథకంలో భాగంగా విద్యార్థులకు భోజనం వండుతున్నవారిలో ప్రధాన వంటవారికి రూ.1,700, సహాయకులకు రూ.1,600 గౌరవ వేతనాన్ని అందిస్తున్నట్లు మంత్రి కిమ్మెన రత్నాకర్ పరిషత్కు తెలియజేశారు. గౌరవేతనం పెంపు విషయమై సంబంధిత కేంద్ర మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వంట సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నప్పుడు మరణిస్తే రూ.లక్ష, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.75వేలు, చిన్నపాటి గాయలైతే రూ. 30వేలు పరిహారంగా అందచేస్తునున్నటు చెప్పారు. -
కామెడ్-కేలో తెలుగు తేజం
సాక్షి,బెంగళూరు : రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో డిగ్రీ కోర్సుల ప్రవేశం కోసం గత నెల నిర్వహించిన కన్సోర్టియమ్ ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కామెడ్-కే) ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన కొండవీటి ధరన్ మొత్తం 180 మార్కులకు గాను 164 మార్కులతో జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. కామెడ్-కేకు మొత్తం 90,264 (మెడికల్ విభాగంలో 47,085 ఇంజనీరింగ్ విభాగంలో 43,179) విద్యార్థులు పరీక్ష రాశారు. అందులో 23,794 మంది వైద్య, దంత వైద్య విభాగంలో ప్రవేశానికి అర్హత సాధించగా, ఇంజనీరింగ్ కోర్సులో 43,179 మంది అర్హత సాధించారు. కాగా, కామెడ్ కే పరిధిలో 17,698 ఇంజనీరింగ్, 835 వైద్య, 766 దంత వైద్య సీట్లు అందుబాటులో ఉన్నాయి. కామెడ్-కే కౌన్సిలింగ్ షెడ్యూల్లు త్వరలోనే వెల్లడిస్తామని ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ డాక్టర్ ఎస్.కుమార్ తెలిపారు. ఫలితాలు సంస్థ వెబ్సైట్ www.comed k.org లో అందుబాటులో ఉన్నాయని, మరిన్ని వివరాలకు 08041228992లో సంప్రదించవచ్చని సూచించారు. కాగా, ఇంజనీరింగ్లో మొదటి పది ర్యాంకుల్లో తొమ్మిది మంది కర్ణాటకకు చెందిన విద్యార్థులే ఉన్నారు. అదే విధంగా మెడికల్లో మూడు ర్యాంకులను కర్ణాటకకు చెందిన విద్యార్థులు కైవసం చేసుకోగా మిగిలిన ఏడు ర్యాంకులను ఇతర రాష్ట్రాలకు చెందిన వారు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా సీఈటీలో మొదటి ర్యాంకు సాధించిన గిరిజా అగర్వాల్ కామెడ్-కేలోనూ మొదటి ర్యాంకు సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు 1. టీ. దినేష్రాం కుమార్ (కర్ణాటక-బెంగళూరు) 2. కొండవీటి థరణ్ (ఆంధ్రప్రదేశ్-రాజమండ్రి) 3. టీ.ఎం ప్రజ్వల (కర్ణాటక-బెంగళూరు) మొడికల్ విభాగంలో మొదటి మూడు ర్యాంకులు పొందిన విద్యార్థులు 1. గిరిజా అగర్వాల్ (కర్ణాటక-బెంగళూరు) 2. ఆదిత్యా అగర్వాల్ (గుజరాత్-పాలన్పూర్) 3. శివాని వశిష్ట్ (న్యూ ఢిల్లీ-మాయాపురి) ఈ ఏడాది ఫీజుల వివరాలు (ఏడాదికి) వైద్య విద్య - రూ.3,57,500 దంత వైద్య - రూ.2,53,000 ఇంజినీరింగ్ - రూ.50,000 -
నేటి నుంచి సీఈటీ
రాష్ట్ర వ్యాప్తంగా 314 పరీక్ష కేంద్రాలు పరీక్ష రాయనున్న విద్యార్థులు 1,40,461 మంది సాక్షి, బెంగళూరు : ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో వైద్య, దంత వైద్య, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ) నేటి (గురువారం) నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఇందుకు అవ సరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేసినట్లు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ అధికారులు తెలిపారు. మొత్తం 1,40,461 మంది విద్యార్థులు ఈ ఏడాది సీఈటీ రాయనున్నారు. ఇందులో 36,411 మంది బెంగళూరుకు చెందిన వారు. ఇక సీఈటీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 314 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 70 బెంగళూరులోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రవాస కన్నడిగులకు (హొరనాడు, గడినాడు) కన్నడ భాష పరిజ్ఞానంపై నిర్వహించే పరీక్ష ఈనెల 3న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల వరకూ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 1,660 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ హాల్టికెట్లు అందని వారితో పాటు సీఈటీకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.kea.kar.nic.in, లేదా 080 23568201,23568202,23468205,23461575 లో సంప్రదించవచ్చు. -
ముందు పళ్లు మూడూ విరిగిపోయాయి..?
మా అబ్బాయి వయసు 18. స్నేహితులతో క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి ముందు మూడు పళ్లూ పూర్తిగా ఊడిపోయాయి. కిందిపళ్లు రెండు సగానికి పైగా విరిగిపోయాయి. రెండు రోజుల తర్వాత డాక్టర్ను కలిస్తే పక్క పళ్ల సపోర్ట్తో ఫిక్స్డ్ పళ్లు అమరుస్తానని అన్నారు. ఇంత చిన్న వయసులో కృత్రిమ దంతాలు అంటేనే భయంగా ఉంది. జీవితకాలం వీటితో గడపడం సాధ్యమేనంటారా? - హేమలత, సికిందరాబాద్ ఈమధ్య కాలంలో యాక్సిడెంట్ల వల్ల, ఆటలలో ముఖానికి దెబ్బలు తగలడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి సందర్భాలలో పళ్లు విరగడం, ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. పళ్లు కొద్దిగా విరిగినా, సగానికి చిట్లిపోయినా పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కేవలం ఒకటి రెండు సిట్టింగుల్లో లామినేట్స్ ద్వారాగాని, క్రౌన్స్ ద్వారాగాని ఎంతో అందంగా, మునుపటి పంటి సైజ్, షేప్లో సహజంగా కనిపించేలా చేసుకోవచ్చు. ఇవి మిగిలిన పంటి రంగులో కలిసిపోతాయి. కృత్రిమమని ఎవరూ గుర్తించే అవకాశం లేదు. మంచి ల్యాబరేటరీలు అందుబాటులో ఉన్న హాస్పిటల్లో చికిత్స తీసుకుంటే పూర్తిగా మీ సమస్యలు దూరమవుతాయి. ఇందుకు ఆధునిక టెక్నాలజీ ఎంతగానో సహకరిస్తోంది. గుర్తుంచుకోవాల్సినదేమిటంటే... పళ్లు పూర్తిగా ఊడిపోతే ఒక విషయం అందరూ గుర్తుంచుకోండి. ఊడి, కిందపడిన పళ్లను జాగ్రత్తగా సేకరించి చల్లటి నీటిలోగాని, పాలలో గాని భద్రపరచి, స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువస్తే వాటినే ఊడిన స్థానంలో అమర్చవచ్చు. అవి తిరిగి అతుక్కుపోతాయి. అప్పుడప్పుడూ చెకప్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ... మీ బాబు విషయంలో ఊడిన పళ్లు లేవు కాబట్టి తప్పనిసరిగా కృత్రిమ దంతాలపై ఆధారపడాల్సిందే. అయితే కృత్రిమ దంతాల అమరికపై ఎటువంటి భయాందోళనలు వద్దు. ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా పోయిన పళ్ల స్థానంలో పక్కపళ్లను అరగదీయ నవసరం లేకుండా, వాటి సపోర్ట్తో పనిలేకుండా ఎముకలోకి చిన్న స్క్రూలను అమర్చి వాటి సాయంతో ఎంతో సహజంగా కృత్రిమ దంతాలను అమర్చవచ్చు. వీటితో మామూలు పళ్లలాగే కొరకవచ్చు, నమిలితినవచ్చు. ఒకప్పుడయితే ఈ చికిత్స ఖరీదైనదైనే అభిప్రాయం ఉండేది. కానీ... ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి మీ అబ్బాయి భవిష్యత్తు గురించి ఎటువంటి ఆందోళనా వద్దు. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
ఈ నోటి దుర్వాసన అందుకేనా?
నా వయసు 35. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాను. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు టెన్షన్ తెలియకుండా, చాక్లెట్లు, చ్యూయింగ్ గమ్లు నములుతుండటం అలవాటయింది. ఈ మధ్య నా స్నేహితులు నా నోటినుంచి దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. ఏం చేయమంటారో సలహా ఇవ్వండి. - కృష్ణకౌశిక్, సికిందరాబాద్ ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. చాలామంది ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందే. పని చేస్తున్నప్పుడు కొందరు చాక్లెట్లు, పిప్పరమెంట్లు, చ్యూయింగ్ గమ్ వంటివి నములుతూ ఉంటారు. వీటిలో ఉండే చక్కెర పదార్థాలు నోటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. సహజంగానే నోటిలో ఉండే బ్యాక్టీరియా ప్రమాద స్థాయిలో పెరిగిపోతుంది. దాంతో లాలాజలం పీహెచ్ వాల్యూలో ఆమ్లస్వభావం పెరిగిపోయి, సులభంగా పంటిజబ్బులు వస్తాయి. వీటిలో పళ్లు పుచ్చిపోవడం ఎక్కువగా జరుగుతుంది. పంటికి అతుక్కుపోయే ఆహార పదార్థాల వల్ల పళ్లసందుల్లో పాచి పేరుకుపోయి, చిగుళ్ల జబ్బులూ వస్తాయి. అందుకే బ్రష్ చేసినప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు చాలామంది అవగాహన లేకపోవడం వల్ల మార్కెట్లో దొరికే ఖరీదైన టూత్పేస్ట్లు వాడితే నోటి దుర్వాసన పోతుందనుకుంటారు. అలాగే మంచి బ్రష్లు వాడటం లేదా నోరు పుక్కిలించే మౌత్ వాష్లు, నోటిస్ప్రేలు వాడటం, మరికొందరయితే ఆయిల్ పుల్లింగ్ లాంటి సొంతవైద్యాలూ చేస్తూ ఉంటారు. అందరూ తెలుసుకోవలసింది ఒకటే... పైన చెప్పినటువంటి ఏ ప్రయత్నాల వల్లా నోటి దుర్వాసనను శాశ్వతంగా పోగొట్టలేరు. నోటి దుర్వాసన అనేది పళ్లు లేదా చిగుళ్ల జబ్బులకు సంబంధించిన ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. దీనికి సరైన చికిత్స జరగాలే తప్ప మరే ప్రయత్నాలూ ఫలించవు. అదే సమయంలో ఎక్కువ కాలం నిర్లక్ష్యం మంచిది కాదు. ఒకవేళ చిగుళ్ల జబ్బులు ఉండి ఉంటే నిర్లక్ష్యం వల్ల జబ్బు మరింత పెరిగి, చిన్న వయసులోనే పళ్లు వదులయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు వెంటనే స్పెషలిస్టును కలిసి, వారి సలహా మేరకు చికిత్స చేయించుకోవడం మంచిది. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
ఈ నోటి దుర్వాసన ఎలా పోతుంది?
నా వయసు 32. నా నోటిలో కొన్ని పళ్లు పుచ్చిపోయి, నోరు దుర్వాసన వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చూపండి. - బి. రాణి, నిజామాబాద్ మనం తిన్న ఆహారం పుచ్చుపళ్లు లేదా పంటి రంధ్రాల మధ్య చిక్కుకుపోతుంటుంది. ఇలా నోటిలో చిక్కుకుపోయిన ఆహారంతో బ్యాక్టీరియా కలిసి సల్ఫర్ పదార్థాలు వెలువరించడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఒకవేళ పంటిలోని రంధ్రం పెద్దదిగా ఉండి మొత్తం పన్ను పాడై ఉంటే ఆ పంటిని మూలం (రూట్) నుంచి తొలగించి, అక్కడ కృత్రిమం పన్ను అమర్చుకోవాలి లేదా ‘బ్రిడ్జి’ అనే ప్రక్రియ ప్రకారం చికిత్స తీసుకోవాలి. అయితే పాడైన పంటికి ఇరువైపులా ఉండే పళ్లు బాగుంటేనే ఈ బ్రిడ్జ్ ప్రక్రియ సాధ్యమవుతుంది. ఒకవేళ పంటి రంధ్రం ఒకేచోట లోతుగా ఏర్పడి పన్ను మొత్తం పాడవకుండా, పంటి లోపల నరాలు ఉండేచోట (పల్ప్ ప్రాంతంలో) మాత్రమే దెబ్బతిని ఉంటే దీనికి రూట్కెనాల్ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్స చేసిన ప్రాంతంలో పంటిపైన డెంటల్ క్యాప్ లేదా క్రౌన్ అమర్చడం వల్ల పన్ను మరింత దెబ్బతినకుండా చూడవచ్చు. సాధారణంగా ఈ క్యాప్ను లోహం లేదా సిరామిక్ పదార్థం లేదా ఈ రెండిటి మిశ్రమంతో రూపొందిస్తారు. ఒకవేళ రంధ్రం చిన్నదిగా ఉంటే దాన్ని ఫిల్లింగ్ చేస్తారు. ఇక నోటి దుర్వాసన విషయానికి వస్తే... కొన్ని సందర్భాల్లో చిగుళ్ల సమస్య ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన రావచ్చు. ఒకవేళ మీ నోటిదుర్వాసనకు కారణం చిగుళ్ల సమస్య అయి ఉంటే... చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. దానికి సరైన చికిత్స తీసుకోకపోతే అది పయోరియాకు దారితీయవచ్చు. కొన్నిసార్లు నోటిదుర్వాసన తాత్కాలికమైన సమస్య కావచ్చు. మీరు మీ దంతవైద్యునితో తరచూ పరీక్షలు చేయించుకుంటూ మీ సమస్యకు తగిన చికిత్స తీసుకుంటే నోటిదుర్వాసన తగ్గుతుంది. నాకు యాభై ఏళ్లు ఉంటాయి. నాకు కొన్ని దంతసమస్యలు ఉన్నాయి. చికిత్స కోసం నేను చాలామంది దంతవైద్యులను కలిశాను. అయితే వారి సూచనల మేరకు వైద్యం చేయించుకోవడానికి నా ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు. తక్కువ ఖర్చుతో దంతవైద్యం చేయించుకోలేమా? ఒకవేళ సాధ్యమైతే, అలాంటి చికిత్స ఎక్కడ దొరుకుతుంది? - కృష్ణమూర్తి, విజయవాడ మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. మీరన్నట్లు అన్ని రకాల దంత సమస్యలకు అంటే ప్రత్యేకమైన చికిత్స ప్రక్రియలకు కూడా తక్కువ ఖర్చుతో వైద్యాన్ని పొందవచ్చు. రాష్ట్రంలో దంతవైద్యకళాశాలకు అనుబంధంగా ఉండే అన్ని ఆసుపత్రుల్లో హైదరాబాద్, విజయవాడ, కడప ప్రభుత్వ కళాశాలలకు అనుబంధంగా ఆసుపత్రులు ఉన్నాయి. వీటికితోడు శ్రీకాకుళం, విశాఖపట్నం, భీమవరం, ఏలూరు, రాజమండ్రి, గన్నవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, ఖమ్మం నిజామాబాద్, మహబూబ్నగర్, నార్కేట్పల్లి, వికారాబాద్, సంగారెడ్డి, షామీర్పేట, హైదరాబాద్ (దిల్సుఖ్నగర్)లలో ప్రైవేటు కళాశాలలకు అనుబంధంగా దంతవైద్యశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా మీరు చౌకగా చికిత్స తీసుకోవచ్చు. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
డెంటల్ : తరచు చిగురువాపు, పంటినొప్పి..?
నాకు ఆర్నెల్ల క్రితం పంటినొప్పి వచ్చింది. డెంటిస్ట్ పైవరస పళ్లలో, కింది వరస పళ్లలో రెండు కొత్త క్యాప్స్ పెట్టారు. మళ్లీ రెండు నెలలకు నొప్పి, చిగురువాపు వచ్చాయి. అప్పుడు క్యాప్స్ తొలగించి క్లీన్ చేసి మళ్లీ వాటిని తిరిగి అమర్చారు. కొంతకాలంలోనే ఇలా రెండుమూడుసార్లు చేయాల్సి వచ్చింది. నా సమస్యకు పరిష్కారం చూపండి. - బి.జగన్, సికింద్రాబాద్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వ్యాధి నిర్థారణలోగాని, చికిత్సలో కాని లోపం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇంత చికిత్స జరిగాక కూడా ఇలా మాటిమాటికీ పంటినొప్పి, చిగురు వాపు రావడం పంటి ఆరోగ్యానికి సరైన సూచన కాదు. ప్రతిసారీ క్యాప్ను తీసి అమర్చుతుండటం వల్ల మీకు ఉన్న సమస్య పరిష్కారం కాదు. నొప్పి నివారణ మందులను అదేపనిగా వాడటం వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చి మళ్లీ అదో సమస్య కావచ్చు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేలా అవసరాన్ని బట్టి సరైన చికిత్స చేయించాల్సి ఉంటుంది. మీరు మరో డెంటిస్ట్ను కలిసి వారి అభిప్రాయం తీసుకోండి. నా వయసు 19. ఇటీవల నాకు దవడ చివరన కొత్తగా పళ్లు రావడం గమనించాను. అవి అప్పటికే ఉన్న పళ్లపై వస్తున్నాయి. ఇలా పన్ను మీద పన్ను పెరగకుండా చేయడానికి ఏమైనా మార్గం ఉందా? - వి. అలేఖ్య, వరంగల్ మీరు చెబుతున్న దాన్ని బట్టి మీకు జ్ఞానదంతాలు వస్తుండటం వల్ల ఈ ఇబ్బంది కలుగుతోంది. సాధారణంగా జ్ఞానదంతాలు యుక్తవయసు దాటాక వస్తుంటాయి. అయితే కొందరిలో కొన్నిసార్లు అప్పటికే దవడపై ఉన్న స్థలాన్ని మిగతా పళ్లు ఆక్రమించడం వల్ల ఇలా పంటి పైనే పన్ను రావడం లేదా ఎముకలోనే ఇరుక్కుపోయి బయటకు వచ్చేందుకు సాధ్యం గాక మీరు చెబుతున్న ఇబ్బందుల వంటివి రావచ్చు. అప్పుడు నొప్పి రావడం, రక్తస్రావం జరగడం మామూలే. ఇలాంటి సందర్భాల్లో ఒక చిన్న శస్త్రచికిత్సతో ఆ జ్ఞానదంతాలను తొలగించాల్సి ఉంటుంది. మా బాబుకు ఆరేళ్లు. ఇప్పటికీ వాడి పాలపళ్లు ఊడిపోలేదు. పైగా పళ్ల మధ్య సందులు ఎక్కువగా ఉన్నాయి. మావాడి సమస్యకు తగిన పరిష్కారం చెప్పగలరు. - జి. అరుణ్కుమార్, విశాఖపట్నం సాధారణంగా పిల్లల్లో ఆరేళ్ల నుంచి పన్నెండేళ్ల మధ్యలో పాల పళ్లు ఊడి, వాటి స్థానంలో శాశ్వత దంతాలు వస్తాయి. అయితే ఇవి ఊడటానికి, మళ్లీ రావడానికి పట్టే వ్యవధి వారి శరీరతత్వాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా ఉంటుంది. అయితే ఎనిమిదేళ్ల తర్వాత కూడా పాలపళ్లు ఊడకపోతే అప్పుడు డాక్టర్ను సంప్రదించి, కారణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎండోక్రైన్ వ్యవస్థలో లోపాలు, ఎదుగుదలలో లోపాల వల్ల కూడా పాలపళ్లు ఊడటంలో తేడాలు రావచ్చు. ఇక పళ్ల మధ్య సందుల విషయానికి వస్తే పిల్లల్లో ఇలా ఉండటం సహజమే. కాబట్టి ప్రస్తుతానికి మీ బాబు సమస్య గురించి, పళ్ల మధ్య సందుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి మీ బాబును తీసుకుని డెంటిస్ట్ను కలిస్తే, ఆపై ఇక నిశ్చింతగా ఉండవచ్చు. -
ఈ వయసులో ఆ చికిత్స సాధ్యమేనా?
నా వయసు 32. నాకు పై దవడలో ఉన్న కోరపళ్లు కొద్దిగా వెనక్కి ఉన్నాయి. వాటిని సరిచేయించుకోవాలని ఉంది. దీనికోసం నేను ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. సిరామిక్ బ్రేసెస్ విధానం గురించి విన్నాను. ఈ వయసులో ఈ చికిత్స సాధ్యమేనా? ఈ ట్రీట్మెంట్కి ఎంతకాలం పడుతుంది? బ్రేసెస్ వేయించుకున్న తరవాత పళ్లు నార్మల్ కావడానికి ఎన్నిరోజులు పడుతుంది. మరో మూడునెలల్లో నా పెళ్లి. అప్పటికినా ట్రీట్మెంట్ పూర్తవుతుందా? నాకు తగిన సలహా, సూచనలు ఇవ్వగలరు. - నాగేంద్రకుమార్, కొత్తగూడెం వెనుకగా ఉన్న మీ పళ్లను ముందుకు తీసుకురావడం సాధ్యమే. అయితే ఈ చికిత్సకి సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. ముందుగా కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఎక్స్రే తీసి నిర్ధారణ చేయవలసి ఉంటుంది. అలాగే మౌల్డ్స్ గురించి చికిత్స ప్రారంభించడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మూడు నెలలలో చికిత్స చేయడమనేది అసాధ్యం. మీ పలువరుస సక్రమంగా లేకపోతే మాత్రం మీ దవడలకు కాస్మొటిక్ సర్జరీ లేదా ఆర్థోనాటిక్ సర్జరీ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఈ చికిత్స అనివార్యమయితే, మీరు తప్పనిసరిగా మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ని సంప్రదించవలసి ఉంటుంది. ఈ విధానం వల్ల చికిత్స నూటికినూరు శాతం సక్సెస్ అవుతుంది. ఈ చికిత్స చేసేవారు హైదరాబాదు నగరంలో చాలామంది ఉన్నారు. చాలా సందర్భాలలో సర్జరీకి ముందు, తరవాత కూడా కొద్ది కాలం పాటు క్లిప్పులను ఉపయోగించవలసి ఉంటుంది. మంచి మంచి పరికరాలు, మంచి వైద్యవిధానం మనకి అందుబాటులో ఉంది. చాలామందికి ఈ విధానం వల్ల చాలా సమస్యలు వస్తాయని, అంతేకాక పరిస్థితి చాలా దయనీయంగా మారుతుందనే అపోహ ఉంది. ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. ఈ చికిత్స వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవు. దీని గురించి తెలియనివారు చెప్పే మాటలను వినకండి. మీరు సరయిన మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ని కలిస్తే అన్ని అపోహలు తొలగిపోతాయి. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
పళ్ల మధ్య సందులు... పరిష్కారం చెప్పండి
నా వయసు 45 ఏళ్లు. గత కొన్ని సంవత్సరాలుగా ముందు పళ్ల మధ్య సందులు వచ్చాయి. కాస్త ఎత్తుగా కూడా అవుతున్నాయి. దాంతో నవ్వేటప్పుడు ఇబ్బందిగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - సులక్షణ, మంచిర్యాల యుక్తవయసులో పలువరసగా చక్కగా అమరి ఉన్నప్పటికీ దంత సమస్యలపట్ల అవగాహన లేకపోవడం, వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మీరు చెప్పిన సమస్యలు వస్తుంటాయి. ఒకప్పుడు పలువరస చక్కగా ఉండి, ఆ తర్వాత గ్యాప్స్ వస్తున్నాయంటే అందుకు చిగుర్ల జబ్బులే కారణం. ముఖ్యంగా ప్రసూతి తర్వాత ఆడవాళ్లలో చిగుర్ల జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. గర్భంతో ఉన్నప్పుడు వచ్చే చిన్నపాటి చిగుర్ల ఇన్ఫెక్షన్కి చికిత్స చేయించుకోకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మధ్యవయసు వచ్చేసరికి పళ్ల మధ్య సందులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే దీనికి కంగారు పడాల్సిందేమీ లేదు. పళ్ల మధ్య సందులు ఉంటే ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నవారిలా కనిపిస్తారు. ఎత్తు పళ్లు వచ్చినట్లుగా తెలుస్తూ, పెదవులు ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తాయి. వయసు పైబడ్డట్లు కనిపించవచ్చు. అందువల్ల వీటిని సరిచేయించుకోవాలి. దంతవైద్యనిపుణుడిని కలిస్తే ఎక్స్-రే సహాయంతో మీకు చిగుర్ల జబ్బు ఉందా లేదా అని నిర్ధారణ చేసి, పళ్లను దృఢంగా చేసే ప్రత్యేక చిగుర్ల చికిత్సలు చేస్తారు. దాంతోపాటు ఎడంగా ఉన్న పళ్లను సరిచేయడానికి ఇప్పుడు పెద్దవారికి సైతం క్లిప్పులతో చికిత్స చేయవచ్చు. కొంతమంది ఈ వయసులో క్లిప్పులు వేసుకోవడమా అని వెనకాడుతుంటారు. వీళ్లు తమ పళ్లను అందంగా చేసుకోడానికి స్మైల్ డిజైనింగ్ ప్రక్రియను అనుసరించవచ్చు. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
దంత చికిత్సకు ఇంత ఖర్చా?
తొలగించి, ఆ స్థానంలో కృత్రిమ దంతాన్ని అమర్చుకోవాలన్నారు. ఫిక్స్డ్ పన్ను అమర్చుకోవాలంటే చాలా ఖరీదనిపించింది. స్నేహితులను అడిగితే వారు కూడా తమ అనుభవాలను చెప్పారు. అవన్నీ వింటుంటే ఆధునిక దంతవైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదనిపించింది. మీరేమంటారు? - పి. కృష్ణమూర్తి, హైదరాబాద్ దంతవైద్యం ఖర్చుతో కూడుకున్నదన్నది కేవలం అపోహే. సాధారణంగా ప్రతి ఆరునెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్ను కలుస్తూ ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు పొందడం ఉత్తమం. అవసరాన్ని బట్టి పళ్ల క్లీనింగ్, పాలిషింగ్ చేయించుకోవడం, ఏవైనా ఒకటి రెండు పళ్లు పుచ్చి ఉంటే వాటికి ఫిల్లింగ్ చేయించుకోవడంలాంటివన్నీ జరిగినా కూడా కేవలం కొన్ని వందల్లోనే చికిత్స పూర్తవుతుంది. దంతవైద్యానికి సంవత్సరానికి ఇంటిల్లిపాదికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. ఇలా చేయడం వల్ల చాలా వరకు దంత సమస్యలు రాకుండానే లేదా అవి చిన్నవిగా ఉన్నప్పుడే, పంటి జబ్బు ముదిరిపోకముందే సరి చేసుకోవచ్చు. సాధారణంగా దంతవైద్యంలో ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా అవసరమయ్యే చికిత్సలన్నీ చవకగానే ఉంటాయి. మధ్యతరగతి వారు, పేద వారు కూడా భరించే స్థాయిలోనే ఉంటాయి. కాకపోతే తొంభై శాతం మంది ఈ విధంగా డెంటిస్ట్ను కలవడం లేదు. బాగా పంటినొప్పి వచ్చినప్పుడు లేదా జబ్బులు బాగా ముదిరిన తర్వాత, తప్పనిసరి పరిస్థితులు వస్తే తప్పించి దంత చికిత్స చేయించుకోవడం లేదు. దాంతో చేయాల్సిన చికిత్సలు పెద్దవిగా ఉంటూ ఖర్చు కూడా పెరిగిపోతుంటుంది. ఉదాహరణకి మీరే తీసుకోండి... ముప్ఫై సంవత్సరాల వయసులోనే పన్ను కదిలిందంటే... మీరు దాన్ని జబ్బుగా గుర్తించక పోయి ఉండవచ్చు. ఫలితంగా చివరకు చిన్న వయసులోనే పంటిని పోగొట్టుకోవలసి వచ్చింది. మిగిలిన పళ్లకి కూడా ఈ సమస్య రాకూడదనుకుంటే ప్రత్యేక చిగుళ్ల చికిత్సలు చేసి పళ్లను గట్టి చేయాల్సి ఉంటుంది. ఇటువంటి చికిత్సలు కొంత ఖర్చుతో కూడుకుని ఉన్నవే. వీటితోబాటే వైద్యవిధానానికి అయ్యే ఖర్చు కూడా కొంత పెరిగింది. కృత్రిమ దంతాల అమరికలో అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ పొందాలంటే వేలల్లోనే ఖర్చవుతుంది. అదే సమయంలో ఎటువంటి చికిత్సలైనా సరే స్పెషలిస్ట్ను బట్టి, చికిత్సకు వాడుకునే టెక్నాలజీ పరికరాలను బట్టి ఫీజులు కూడా మారుతుంటాయి. సమస్యను బాగా నిర్లక్ష్యం చేసి పెద్ద చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ‘అమ్మో! దంతవైద్యం బాగా ఖరీదైనదే’ అనుకోవడం సరైనది కాదు. ప్రతి చికిత్సలోనూ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్తో చర్చించి మీ అనుకూలతను బట్టి దశలవారీగా చికిత్సను పొందితే ఖర్చు కొంత తగ్గే అవకాశం ఉంది. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
ప్రమాదంలో విరిగిన పంటిని తిరిగి అమర్చడం సాధ్యమేనా?
మా బాబు వయసు 14 సంవత్సరాలు. క్రికెట్ ఆడుతుంటే ముఖానికి బంతి తగిలి ముందు పన్ను ఒకటి విరిగిపోయింది. అది మేము వెంటనే గమనించలేదు. నోటిలోనుంచి రక్తం కారుతుంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. డాక్టర్ గారు పరీక్ష చేసి పన్ను ఊడిందని, దాన్ని తీసుకువచ్చి ఉంటే అతికించేవాడినని చెప్పారు. ఇది నిజమేనంటారా? ఊడిన పంటిని తిరిగి అమర్చవచ్చా? ఏం చేయాలో సలహా ఇవ్వండి. -వి. అపర్ణ, ఖమ్మం పిల్లల్లో ముఖానికి దెబ్బలు తగలడం సర్వసాధారణం. ఆడుకునేటప్పుడు కాని, లేదా యాక్సిడెంట్ల వల్లగాని ముఖానికి దెబ్బలు తగిలినప్పుడు పళ్లు కూడా విరిగిపోవడమో, ఊడిపోవడమో జరుగుతుంటాయి. దెబ్బ తగిలిన చోట రక్తం కారుతుండడంతో నొప్పి, బాధతో రక్తాన్ని చూసి భయపడి పోతుంటారు. కంగారులో ఇంకేమీ పట్టించుకోకుండా డాక్టరు దగ్గరకి పరుగెడతారు. పరీక్షలు చేసిన తర్వాత గానీ, అక్కడేం జరిగిందో తల్లిదండ్రులకి కానీ, దెబ్బలు తగిలించుకున్న పిల్లలకు కానీ సరిగా గమనించే అవకాశం లేదు. పళ్లు సాంతం ఊడిపోయి కిందపడిపోతే వాటిని డాక్టర్ దగ్గరకు తీసుకెళితే ఊడిన పంటిని అదే స్థానంలో బిగించవచ్చు. అలా పంటిని సహజంగానే తిరిగి పొందవచ్చు. కానీ దెబ్బ తగిలిన వెంటనే ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి... దెబ్బలు తగిలి రక్తం వస్తుంటే కంగారు పడకుండా ధైర్యాన్నివ్వాలి. శ్వాస సరిగా తీసుకోగలుగుతున్నారా లేదో పరిశీలిస్తూ వీలైతే చల్లని నీటితో కళ్లు తుడవటమో లేదా నీళ్లు ముఖం మీద చిలకరించటమో చేసి, వారు పూర్తిగా స్పృహలోకి వచ్చేలా చేయాలి. పళ్లు ఊడిన చోట రక్తం వస్తుంటే శుభ్రమైన వస్త్రాన్ని లేదా కర్చీఫ్ను లేదా దూది ఉండను ఉంచి పళ్లతో గట్టిగా అదిమి ఉంచమని చెప్పాలి. ఈలోగా దెబ్బలు తగిలిన ప్రదేశంలో జాగ్రత్తగా వెదికి, పన్ను కనుక కనపడితే దానిని శుభ్రంగా కడిగి, ఒక చిన్న కవరులోగానీ, భరిణలోగానీ చల్లటి నీటిలో లేదా చల్లటి పాలలో భద్రపరిచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ఇలా తీసుకెళ్లిన పంటిని దంతవైద్యుడు అదే స్థానంలో తిరిగి బిగించగలుగుతారు. కొంతమందికి పళ్లు పూర్తిగా ఊడిపోకుండా ఒక పక్కకు తిరిగి పోవటమో, కదిలిపోవటమో జరగవచ్చు. మరికొన్ని సందర్భాలలో పన్ను కొద్దిగా లేదా సగం దాకా విరిగిపోవటం చూస్తుంటాం. ఇలా కదిలి పోయిన పళ్లను తిరిగి యథాస్థానంలో అమర్చవచ్చు. విరిగిన పళ్లను ఒకటి లేదా రెండు సిట్టింగ్లలోనే బిల్డప్ చేయడం ద్వారా గానీ లేదా తొడుగు వేయడం ద్వారా కానీ చూడటానికి మామూలుగా కనిపించేలా చేయవచ్చు. మీ బాబు విషయంలో కంగారు పడవద్దు. దానికి దీటైన కృత్రిమ దంతాన్ని అమర్చడం ఆధునిక దంత వైద్యంలో సాధ్యమే. ఫిక్స్డ్ విధానంలో శాశ్వతంగా బిగించే పళ్లు మిగిలిన పళ్ల రంగులో కలిసిపోయి, చూడటానికి కూడా ఎంతో సహజంగా కనిపిస్తాయి. వెంటనే డెంటల్ స్పెషలిస్ట్ను కలిసి సమస్యను చర్చించండి. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
కొన్ని పళ్లు అరిగిపోయాయి...అన్ని పళ్లూ కట్టించుకోక తప్పదా?
నా వయసు 60 సంవత్సరాలు. బీపీ, షుగర్ ఉన్నాయి. పళ్లు బాగా అరిగిపోయాయి. ఈ మధ్యనే కొన్ని పళ్లు పీకించాను. మిగిలిన పళ్లతో అంత బాగా నమిలి తినలేకపోతున్నాను. డాక్టర్ను కలిస్తే అన్ని పళ్లూ పీకేసి, కొత్తవి కడదాం అన్నారు. భయమేసి మళ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్లలేదు. నేను అన్ని పళ్లూ పీకించాలంటారా? సలహా ఇవ్వండి. - ఎస్. జయలక్ష్మి, హైదరాబాద్ ఎవరికైనా యాభై సంవత్సరాలు దాటిన తర్వాత శరీరంతోపాటు నోటిలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. పళ్లను... నమలడానికి దశాబ్దాల తరబడి వాడుతుంటాం. కాబట్టి అరిగిపోవడం సాధారణమే. కొంతమందికి ఎక్కువగా, మరికొంతమందికి తక్కువగా అరుగుతుంటాయి. ఇక బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు తోడైనప్పుడు నోటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావమే ఉంటుంది. నోట్లో లాలాజలాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు కూడా సరిగా పనిచేయక సహజసిద్ధమైన దంతపరిరక్షక వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల పళ్లు పుచ్చిపోవటం, చిగుళ్లకు సంబంధించిన జబ్బులు వంటివన్నీ పళ్లు పూర్తిగా దెబ్బతినడానికి కారణమవుతాయి. షుగర్ పేషెంట్లలో అసిటోన్ స్మెల్ అనే నోటి దుర్వాసన కూడా ఉంటుంది. అందుకే యాభై సంవత్సరాలలోపు కంటే ఆపై వయసున్నవారే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా దంతవైద్యుడిని కలిసి తగిన సలహాలు, సూచనలు పొందాలి. ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకుంటుండాలి. అరిగిన లేదా విరిగిన పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, తొడుగులు వేయడం ద్వారా బాగా నమిలి తినే శక్తిని తిరిగి తీసుకురావచ్చు. చిగుళ్ల జబ్బులు నయం చేసే క్యూరటాస్, ఫ్లాప్ ట్రీట్మెంట్, ప్రత్యేక లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పళ్లు ఊడినా లేదా తీసేసినా, వెంటనే కృత్రిమ దంతాలను అమర్చుకోవడం తప్పనిసరి. ఒకటిరెండు పళ్లు పోతే ఏమైందిలే, మిగిలిన పళ్లతో మేనేజ్ చేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ, ఏదైనా ఒక దవడలో ఒక పన్ను లేకుంటే 25 శాతం నమిలే శక్తిని కోల్పోతారని ఒక అంచనా. ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నామన్నది ముఖ్యం కాదు. వాటిని ఎంత బాగా నమిలి, జీర్ణం చేసుకోగలుగుతున్నాం, ఎంత ఒంటబట్టించుకోగలుగుతున్నాం అనేది కీలకం. అందుకే నమిలే శక్తి బాగా ఉన్నంతకాలం ఎవరూ ముసలితనాన్ని ఫీలవరు. నోటి ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకోగలిగినంతకాలం వృద్ధాప్యం రాదు. వీరిపట్ల ప్రతి ఒక్కరూ కాస్తంత అవగాహన కలిగి ఉండాలి. స్పెషలిస్టును కలిసి, చికిత్స చేయించుకోండి. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
గారను క్లీన్ చేయిస్తే పళ్లు వదులైపోతాయా?
నా వయసు 25. నాకు పన్ను మీద పన్ను ఉంటుంది. డాక్టర్ని కలిస్తే వాటిలో ఒక పన్ను తీసేసి క్లిప్పుతో సరిచేస్తానన్నారు. ఇంట్లో వాళ్లు పన్నుమీద పన్ను ఉంటే అదృష్టం అంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. సలహా ఇవ్వగలరు. - బి. రమ్యశ్రీ, హైదరాబాద్ ఇది చాలామందికి వుండే సమస్యే. వంకరపన్ను వల్ల అందమైన చిరునవ్వు దూరమవుతుంది. చిగుళ్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వంకరటింకర పళ్లున్నవారిలో చిగుళ్లనుంచి రక్తం రావడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చిన్న వయసులోనే వీటిని సరిచేయించడం మంచి ది. పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం వస్తుందన్నది పూర్తి అశాస్త్రీయమైనది. మూఢనమ్మకం కూడా. మీరు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెంటిస్టును కలిసి మీ సమస్యను దూరం చేసుకోండి. నా వయసు 32. చిన్నప్పటినుంచి గుట్కా, పాన్పరాగ్ తినడం అలవాటు. దాంతో పళ్లన్నీ నల్లగా అయ్యాయి. నవ్వాలంటే ఇబ్బందిగా ఉంటోంది. నేను పళ్లను క్లీన్ చేయించి, ఇకపై ఈ దురలవాటును మానేయాలనుకుంటున్నాను. అలా చేయడం వల్ల పళ్లన్నీ వదులై ఊడిపోతాయని కొందరు అంటున్నారు. నిజమేనా? తగిన సలహా ఇవ్వవలసింది. - టి. అరుణ్, నెల్లూరు పాన్పరాగ్, పాన్మసాలా, గుట్కా, జర్దా, వక్కపొడి, తంబాకు నమలడం తదితర అలవాట్లన్నీ నోటి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. వీటివల్ల కేవలం పళ్లే కాకుండా నోటిలోని భాగాలన్నీ దెబ్బతింటాయి. పంటిపై ఉండే ఎనామిల్పై పొగాకు ఉత్పత్తులలో ఉండే ప్రమాదకర రసాయనాలు ఇంకిపోయి పంటిపైన ఒక నల్లటిపొరలాగ పేరుకుపోయి క్రమేపీ పంటిరంగు మారిపోతుంది. అంతేకాదు, వీటిలో ఉండే రసాయనాల దుష్ర్పభావం వల్ల లోపలి దవడలు, నాలుక మొద్దుబారిపోతాయి. ఫలితంగా నోరు పెద్దగా తెరవలేకపోవడం, ఆహారాన్ని నమలలేకపోవడం, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం తదితర సమస్యలతోబాటు నోటిక్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులబారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పు తెలుసుకుని గుట్కా మానేయాలని నిర్ణయించుకోవటం అభినందనీయం. మీ స్నేహితులు చెప్పినట్లుగా గార పట్టిన పళ్లను క్లీన్ చేయించుకోవడం వల్ల పళ్లు వదులైపోవు. స్పెషలిస్ట్ను కలిస్తే స్కేలింగ్, పాలిషింగ్తో పంటిపైన ఉండే గారను తొలగించి, బాగున్న పళ్లను బ్లీచింగ్ వంటి చికిత్సలతో మరింత తెల్లగా చేస్తారు. వీటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ ఉండవు. మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం మరచిపోవద్దు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
పంటి ఆరోగ్యాన్ని కాపాడుకునే పద్ధతులేవి?
నా వయసు 20. ఒక పన్ను పుచ్చితే ఈ మధ్యే చికిత్స చేయించుకున్నాను. మా అమ్మ కూడా పంటిజబ్బులతో ఇబ్బంది పడుతోంది. నేను ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా పంటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. దంత సమస్యలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలో సలహా ఇవ్వండి. - సుష్మ, విశాఖపట్నం రోజూవారి ఆహారం తీసుకోవడం వల్ల దంతాలు, నోటిలోని ఇతర భాగాలు బయటి వాతావరణానికి నిరంతరం ప్రభావితమవుతుంటా యి. మనం తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలు నోటి ఆరోగ్యాన్ని పదికాలాలపాటు కాపాడతాయి. అన్నింటికన్నా ముందు మనం చెప్పుకోవలసింది... తినే ఆహారం గురించే! పంటికి అతుక్కుపోయే అహారపదార్థాలు.. అంటే తీపి పదార్థాలైన చాక్లెట్లు, స్వీట్లు, బేకరీలలో ఎక్కువగా దొరికే ఆహారం ఎంతో ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. సులభంగా నోట్లో మిగిలిపోకుండా పంటికి, చిగుళ్లకు అతుక్కోకుండా నేరుగా గొంతులోకి వెళ్లే ఆహారమే అత్యుత్తమమైనది. ఈ మధ్య అందరూ ఎక్కువగా తీసుకుంటున్న జంక్ఫుడ్ పంటిపైన, పంటి సందుల్లోనూ అతుక్కుపోతుంటుంది. సాధారణంగానే నోటిలో ఉండే బ్యాక్టీరియా ఈవిధంగా ఇరుక్కున్న ఆహారంతో కలిసిపోయి హానికర రసాయనాలను విడుదల చేస్తుంది. దాంతోనే అన్నిరకాల దంత సమస్యలూ మొదలవుతాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇక రెండవ విషయం... మన ఇంట్లో రోజువారీ శుభ్రత... మనం రోజూ చేసే బ్రషింగ్ గురించి. ఒకపూట పళ్లు తోముకుని నోటి ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడిపోతున్నామని ఫీలైపోతుంటారు. కొంతమంది అతిజాగ్రత్తకు పోయి పళ్లని 15 - 3 0 నిమిషాలపాటు తోమేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. రోజూ నిద్రలేవగానే, ఆ తర్వాత పడుకునే ముందు రెండుసార్లు కేవలం నాలుగు నిమిషాలపాటు తప్పనిసరిగా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగని పళ్లని అడ్డదిడ్డంగా తోమేయడం, బలంగా రుద్దడం సరికాదు. ఖరీదైన పేస్టు, చిత్రమైన బ్రష్ల మీద కాకుండా బ్రష్ చేసుకునే విధానంపైన దృష్టిపెడుతూ శాస్త్రీయపద్ధతిలో వీలైతే అద్దంలో చూసుకుంటూ బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే అంతటితో సరిపెట్టకూడదు. రెండు పళ్ల మధ్య చేరుకున్న ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ అనబడే నైలాన్ దారంతో శుభ్రపరచుకోవాలి. టూత్పిక్స్, పిన్నులు లాంటి వాటితో కెలక్కూడదు. ఇది హానికరమైన అలవాటు. దీంతోపాటుగా మౌత్వాష్ అనబడే నోరు పుక్కిలించే ద్రవాన్ని కనీసం రోజుకొక్కసారి వాడాలి. దీనివల్ల నోటిలోని బ్యాక్టీరియాను అదుపులో ఉంచవచ్చు. ఇవన్నీ చేస్తూనే ప్రతి ఆరునెలలకోసారి ఇంటిల్లిపాదీ డెంటిస్ట్ను కలిసి చెకప్ చేయించుకోవటం, డాక్టర్ సలహా మేరకు చికిత్స చేయించుకోవడం అవసరం. రెగ్యులర్గా చేసుకునే పంటి క్లీనింగ్ (స్కేలింగ్), పాలిషింగ్ లాంటి చికిత్సల వల్ల దంతసమస్యలను అరవై శాతం వరకు నివారించవచ్చు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
ఏమి తిన్నా పళ్ల సందుల్లో ఇరుక్కుంటోంది..?
నా వయసు 35. ఏమి తిన్నా పళ్ల సందుల్లో ఇరుక్కుంటుంది. భోజనం చేసిన వెంటనే పుల్లలతో కుట్టుకుంటే తప్ప తృప్తిగా ఉండదు. పళ్ల మధ్య ఏర్పడిన జాగాలో ఫిల్లింగ్ చేయించవచ్చంటారా? సలహా ఇవ్వండి. - పరమేశ్, హైదరాబాద్ ఇది చాలామంది సమస్య. మనం ఏ హోటల్కెళ్లినా బిల్లుతోబాటు టూత్పిక్స్ కూడా ఇవ్వడం పరిపాటి. ప్రతి పదిమందిలో ఎనిమిదిమంది పుల్లలతో పళ్లసందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని క్లీన్ చేసుకోవడం చూస్తుంటాం. అందరి దృష్టిలో ఇది సాధారణమైన పనే. ఇదేదో సాధారణమైన పనే అనే భావన అందరిలోనూ ఉంది. కాని, ఎవరైతే ఇలా టూత్పిక్ వాడాల్సి వస్తోందో, వీళ్లందరికీ కూడా చిగుళ్ల జబ్బులున్నట్టు లెక్క. ఏదోరకమైన చిగుళ్ల జబ్బు లేదా ఇన్ఫెక్షన్ వల్ల రెండు పళ్లమధ్య సందుల్లో ఉన్న చిగుళ్లు కిందకు జారిపోతాయి. దాంతో ఆహారం అక్కడికి చేరుతుంది. దాంతో అసౌకర్యంగా ఉండి అలా పళ్లు కుట్టుకుంటుంటారు. పుల్లలతో కానీ, పిన్నులతో కానీ పూర్తిస్థాయిలో క్లీన్ చేసుకోవడం సాధ్యం కాదు. ఇలా చేయడం మంచిది కూడా కాదు. అలాగే ఇట్లా కుట్టుకుంటున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం కూడా చూస్తుంటాం. అలా ఇరుక్కున్న ఆహారాన్ని తీసేటప్పుడు మనకు తెలీకుండానే సగం చిగుళ్ల లోపలికి తోసేస్తుంటాం. దాంతో ఇన్ఫెక్షన్లు పెరిగి, సమస్య మరింత తీవ్రమవుతుంటుంది. అలాంటప్పుడు తగిన చికిత్స చేయించుకోవడం ఒకటే మార్గం. చిత్రం ఏమిటంటే... పుల్లలతో కుట్టుకుంటున్న వారిని వారికి చిగుళ్ల జబ్బు ఉందంటే ఒప్పుకోరు. కారణం వారికి ఎటువంటి నొప్పి, బాధ లేకపోవడమే. డెంటిస్ట్ని కలిస్తే ఎక్స్రే తీసి చిగుళ్ల ఇన్ఫెక్షన్ ఎంతుందో చూసి, ప్రత్యేకమైన చిగుళ్ల చికిత్స చేయడం ద్వారా సమస్యను దూరం చేస్తారు. సందులు కనుక మరీ పెద్దవిగా ఉంటే పంటికి తొడుగులు వేయడం ద్వారా కూడా సందును మూసేస్తారు. రెండు పళ్లమధ్య చేరుకున్న ఆహారాన్ని శుభ్రం చేసుకోవడానికి డెంటల్ ఫ్లాస్ అనబడే సన్నటి నైలాన్ దారాన్ని వాడాలి. ఇది అన్ని మెడికల్ షాపుల్లోనూ, సూపర్ బజార్లలో కూడా దొరుకుతుంది. భోజనం చేసిన తర్వాత ఈ డెంటల్ ఫ్లాస్ అన బడే దారాన్ని రెండు చేతుల వేళ్లతో పళ్లమధ్య పోనిచ్చి ఇటు, అటు లాగుతూ శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా మొత్తం పాచిని, ఆహారపదార్థాలను ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ లేకుండా చూసుకోవచ్చు. ఈ డెంటల్ ఫ్లాస్ సుమారు 5-6 మీటర్ల దూరం చిన్న బాక్స్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఎంతవరకైతే ఈ దారాన్ని వాడతామో, దాన్ని తుంచేసి, మిగిలిన దానిని తర్వాత వాడుకోవచ్చు. మీ పళ్లమధ్య సందులని డాక్టర్తో పరీక్ష చేయించుకుని, డెంటిస్ట్ సూచనల మేరకు చిగుళ్ల చికిత్స చేయించుకోవడం, సందును పూడ్చడానికి ఫిల్లింగ్ లేదా క్యాప్ చేయించడం ద్వారా మీ సమస్య నుంచి బయట పడవచ్చు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
నెలకోరకం పేస్టును వాడచ్చా?
నేను సూపర్ మార్కెట్టులో ప్రతినెలా పేస్టు కొనేటప్పుడు ఎన్నో కొత్తకొత్త పేస్టులు, పౌడర్లు కనిపిస్తుంటాయి. వాటిలో ఏది మంచిదో తేల్చుకోలేక ప్రతిసారీ కొత్తది కొంటుంటాను. ఇలా నెలకొకటి చొప్పున వాడవచ్చా? లేదా ప్రతినెలా మారుస్తుండాలా? - కృష్ణమూర్తి, ఒంగోలు టూత్పేస్ట్ అనేది రోజూ మనం తప్పనిసరిగా వాడే వస్తువైనప్పటికీ దీని గురించి ప్రజలలో అవగాహన తక్కువే. దాదాపు అన్ని పేస్టులలో కూడాను ఒకేరకమైన పదార్థాల మిశ్రమమే (ఇన్గ్రెడియంట్స్) ఉంటుంది. రంగు, రుచి, వాసన, ట్యూబ్ ఆకారం, పరిమాణం మాత్రమే మారుతుంటాయి. పళ్లు తోముకునేటప్పుడు బ్రష్తో శుభ్రం చేసిన పాచినంతటినీ పేస్టు నురగతోపాటు ఉమ్మేయడానికి మాత్రమే ఒక మీడియాలాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నోటిలో అన్ని మూలలకూ కదలడానికి, పంటిమీద ఆనడానికి ఒక కందెనలా ఉపయోగపడుతుంది. అంతేకాని, మీరు అడ్వటైజ్మెంట్లలో చూసినట్లు పలానా పేస్టు వాడితే నోటిలోని జబ్బులన్నీ పోతాయని కాదు. ఖరీదైన పేస్టును వాడితే మంచి ఫలితాలు ఉంటాయని, మామూలు పేస్టు వాడితే అంతగా ఉపయోగం ఉండదనీ ఎప్పుడూ అనుకోవద్దు. వాడే పేస్టు కంటే కూడా మనం బ్రష్ చేసుకునే విధానంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి... ఎంత ఖరీదైన పేస్టయినా సరే, సరిగా రెండుపూటలా శాస్త్రీయ పద్ధతిలో బ్రష్ చేసుకోకుంటే ఎటువంటి ఫలితాన్నీ ఇవ్వదు. అదేవిధంగా జీవితకాలం ఒకే రకమైన పేస్టు వాడాలనే నిబంధన ఏమీ లేదు. రంగు, రుచిని బట్టి మీకు నచ్చిన పేస్టుతో హాయిగా పళ్లు తోముకోవచ్చు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
చిన్న సమస్యకు అంత పెద్ద చికిత్స అవసరమేనా?
నా వయసు 35. ఈ మధ్య పళ్లు లాగుతున్నట్లు అనిపిస్తే డెంటిస్ట్ దగ్గరకెళ్లాను. ఆయన ఎక్స్రే తీసి చిగుళ్లకు చిన్న సర్జరీ చేయాలని, లేకుంటే పళ్లు ఊడిపోయే ప్రమాదం ఉందన్నారు. నాకైతే సమస్య అంత పెద్దగా అనిపించడం లేదు. డాక్టర్గారేమో ఆపరేషన్ చేస్తానంటున్నారు. ఎందుకో అనుమానంగా ఉంది. ఇది నిజమేనంటారా? సలహా ఇవ్వండి. - బి. లక్ష్మి, కాకినాడ దంత సమస్యల్లో చాలా వరకు నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చేవేనని చెప్పుకోవచ్చు. మనందరికీ ప్రతి ఆరునెలలకోసారి రెగ్యులర్గా డెంటిస్ట్ను కలవడం అనే అలవాటు లేకపోవడం, దంత సమస్యల పట్ల అవగాహన తక్కువగా ఉండటంతోపాటు బాగా నొప్పి ఉంటేనే జబ్బు వచ్చినట్లుగానూ, నొప్పి, బాధ లేకపోతే చిన్న సమస్యగా భావిస్తాం. అందువల్లే చాలా దంత సమస్యలు డాక్టర్ గారు ఎక్స్రే, స్కానింగ్ తీసినప్పుడు బయట పడతాయి. ఇవి కేవలం నోటి ఆరోగ్యానికే కాకుండా శరీర ఆరోగ్యం విషయంలో కూడా వర్తిస్తుంది. బహుశ మీ ఎక్స్రే చూసినప్పుడ డాక్టర్ గారికి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండటం, పంటికి ఆధారంగా ఉన్న ఎముక అరిగిపోవటం లాంటివి కనిపిస్తే... చిగుళ్లను దృఢంగా చేయడానికి చిన్నపాటి చిగుళ్ల సర్జరీలు చేసుకోమని సలహా ఇస్తుంటారు. ఇప్పటికీ చాలామంది ఇటువంటి సలహా పొందినప్పుడు చికిత్సకు మొగ్గు చూపరు. కారణం వీలైనంత వరకు చికిత్స లేకుండా దానంతట అదే మందులతోనో, ఇంజెక్షన్ల ద్వారానో, వివిధ రకాలైన టూత్ పేస్టుల వంటి వాటితో తగ్గించేసుకుందామనే భావన ఎక్కువగా ఉండటమే. అందుకే మార్కెట్లో దొరికే లేదా అడ్వటైజ్మెంట్లలో కనిపించే ప్రతి టూత్పౌడరునీ, పేస్టునీ కొని ప్రయత్నం చేస్తుంటారు. సమయం గడిచే కొద్దీ సమస్య మరింత ముదిరిపోయి, తర్వాత ఇబ్బంది పడతారు. మీరు కలిసిన స్పెషలిస్టు తీసుకున్న నిర్ణయాలు మీకు అనుమానంగా అనిపిస్తే మరొక డెంటిస్ట్తో సరి చూసుకోవచ్చు. (క్రాస్ వెరిఫికేషన్) ఒకరికి ఇద్దరు డాక్టర్ల అభిప్రాయాలు తీసుకోవడంలో తప్పు లేదు. కాని జబ్బు ఉందని తెలిసినప్పుడు చిన్నదైనా, పెద్దదైనా చికిత్సని ఏదో ఒక వంకతో వాయిదా వేయడం మంచిది కాదు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్