dheeraj
-
సంస్కరణలతో తగ్గుతున్న పనిభారం
సాక్షి అమరావతి: న్యాయవ్యవస్థలో ఎప్పటికప్పుడు అమలు చేస్తున్న సంస్కరణల వల్ల న్యాయస్థానాలపై పనిభారం తగ్గుతోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తెలిారు. సంస్కరణల వల్ల కోర్టులు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా న్యాయవ్యవస్థ ఓ సంరక్షకుడిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తోందని తెలిపారు. దేశ నిర్మాణం అంటే బలమైన వ్యవస్థలు మాత్రమే కాదని, ప్రజల హక్కులు, విలు] లు, సమగ్రత కూడా అందులో భాగమని చెప్పారు.శాంతి, సౌభ్రాతృత్వం సాధించేందుకు ప్రజలంతా మమేకం కావాలని జస్టిస్ ఠాకూర్ ఆకాంక్షించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.ఆదివారం హైకోర్టులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అంతకుముందు బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడారు. స్వతంత్ర సమరంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, అదనపు అడ్వొకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కేసుల విచారణ బాధ్యతాయుతంగా ఉండాలి
విశాఖ లీగల్: దిగువ న్యాయస్థానాల్లో కేసుల విచారణ బాధ్యతాయుతంగా ఉండాలని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. విశాఖ ఏయూ కాన్వొకేషన్ కేంద్రంలో శనివారం జాతీయ, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో దక్షిణ మండల–2 న్యాయమూర్తులకు ‘న్యాయస్థానాల్లో వ్యాజ్యాల జాబితా అన్వేషణ, మినహాయింపు’ అనే అంశంపై నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు.కేసుల విచారణలో మానవత్వం, మానవ హక్కులు, మధ్యవర్తిత్వం, ప్రత్యామ్నాయ మార్గాలు పాటించాలని, ఈ విధానాల వల్ల కక్షిదారునికి అన్యాయం జరగకుండా తీర్పులొస్తాయన్నారు. ఎన్ని తీర్పులిచ్చాం అనే దానికంటే తీర్పుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం ముఖ్యమన్నారు. దిగువ కోర్టుల్లో విప్లవాత్మక మార్పులు చేస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే పూర్తి కంప్యూటర్ ఫైలింగ్, కృత్రిమ మేధస్సు సేవలు, కాగిత రహిత మార్పులు వంటివి అమల్లోకి వస్తాయన్నారు. దేశవ్యాప్తంగా 38 లక్షల కేసుల నమోదుజాతీయ జ్యుడీషియల్ అకాడమీ చైర్మన్ జస్టిస్ అనిరుధ్ బోస్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఏటా సగటున 38 లక్షల కేసులు నమోదవుతున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో 4.5 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. ఇలాంటి కేసుల విషయంలో మధ్యంతర ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయడం మంచిదన్నారు. జాతీయ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ పీఎస్ నరసింహ మాట్లాడుతూ.. అవసరం లేని సుదీర్ఘ వాదనలు, సంబంధం లేని సాక్ష్యాలు, కాలయాపన చేయడానికి జరుగుతున్న వివిధ రకాల పిటిషన్లు న్యాయవ్యవస్థను ఒత్తిడికి గురిచేస్తున్నాయన్నారు.వీటినుంచి బయటపడి సాంకేతికతో కూడిన విధానాలను పాటించాలని సూచించారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.నరేంద్ర, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు మాట్లాడారు. సదస్సులో ఐదు రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, గుత్తుల గోపి, ఎం.వెంకటరమణ తదితరులు న్యాయమూర్తులను సత్కరించారు. -
చాంపియన్స్ ధీరజ్, దీపికా కుమారి
జంషెడ్పూర్: ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్లో మెగురైన ప్రదర్శన కనబర్చినా... పతకం సాధించలేకపోయిన ఈ ఆంధ్ర ఆర్చర్.. జాతీయ టోర్నీలో పెద్దగా పోటీ ఎదుర్కోకుండానే స్వర్ణం గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన రికర్వ్ సింగిల్స్ ఫైనల్లో ధీరజ్ 6–2తో హరియాణాకు చెందిన దివ్యాన్‡్ష చౌధరిపై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో వెనుకబడిన ధీరజ్ ఆ తర్వాత పుంజుకొని అదరగొట్టాడు. ఉత్తరాఖండ్కు చెందిన అతుల్ వర్మ కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో నాలుగుసార్లు ఒలింపియన్ దీపికా కుమారి చాంపియన్గా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్లో తన సహచర ఆర్చర్ అకింత భకత్పై విజయంతో దీపికా కుమారి పసిడి పతకం కైవసం చేసుకుంది.శుక్రవారం ఫైనల్లో దీపిక 6–2తో అంకితపై గెలిచింది. సిమ్రన్జీత్ కౌర్కు కాంస్యం దక్కింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ దీపిక స్వర్ణం గెలిచింది. తన భర్త అతాను దాస్తో కలిసి పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్పీబీ) జట్టు తరఫున బరిలోకి దిగింది. ఫైనల్లో పీఎస్పీబీ 6–2తో పంజాబ్ టీమ్పై విజయం సాధించింది. -
ధీరజ్, సురేఖలకు నిరాశ
ట్లాక్స్కాలా (మెక్సికో): ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్స్లో భారత స్టార్ ప్లేయర్లు, ఆంధ్రప్రదేశ్కు చెందిన బొమ్మదేవర ధీరజ్, వెన్నం జ్యోతి సురేఖ నిరాశపరిచారు. ప్రపంచ ర్యాంకింగ్స్లోని టాప్–8 ప్లేయర్లకు వరల్డ్కప్ ఫైనల్స్ టోర్నీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. పారిస్ ఒలింపిక్స్లో పోటీపడ్డ ధీరజ్ పురుషుల రికర్వ్ విభాగంలో ఆడిన తొలి మ్యాచ్లోనే (క్వార్టర్ ఫైనల్) ఓడిపోయాడు. మరోవైపు మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ కూడా ఆడిన తొలి మ్యాచ్లోనే (క్వార్టర్ ఫైనల్) పరాజయం పాలైంది. పురుషుల కాంపౌండ్ విభాగంలో భారత ప్లేయర్ ప్రథమేశ్ కాంస్య పతక మ్యాచ్లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్రీ మార్టా పాస్ (ఎస్తోనియా)తో జరిగిన మ్యాచ్లో జ్యోతి సురేఖ 145–147 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. ప్రథమేశ్ క్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన ప్రియాంశ్పై 147–146తో గెలిచాడు. సెమీఫైనల్లో ప్రథమేశ్ డెన్మార్క్ ప్లేయర్ మథియాస్ ఫులర్టన్ చేతిలో ఓటమి చవిచూశాడు. కాంస్య పతక మ్యాచ్లో ప్రథమేశ్ 146–150తో మైక్ ష్లాసెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. రికర్వ్ క్వార్టర్ ఫైనల్లో ధీరజ్ 4–6 (28–28, 29–26, 28–28, 26–30, 28–29)తో లీ వూ సియోక్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశాడు. -
చిన్నారులపై అకృత్యాలు దారుణం
గుంటూరు వెస్ట్ : అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రస్తుత కాలంలో కూడా చిన్నారులపై లైంగిక దాడులు, కిడ్నాప్లు, హత్యా నేరాలు పెరగడం అత్యంత దారుణమని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్సింగ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో (జువెనైల్ జస్టిస్ కమిటీ) విభిన్న ప్రతిభావంతుల బాలల హక్కుల పరిరక్షణపై స్టేక్ హోల్డర్స్తో శనివారం గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించిన వార్షిక రాష్ట్రస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రసంగించారు.ఆయన మాట్లాడుతూ.. రాకెట్ సైన్స్లో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో మానవ ఆలోచనా విధానం ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. జాతీయ క్రైం బ్యూరో 2023 గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 1,62,000 మంది బాలలపై నేరాలు జరిగాయన్నారు. 83,350 మంది చిన్నారుల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని.. బాలలపై కిడ్నాపింగ్, బలవంతపు నేరాలు 45 శాతం ఉన్నాయన్నారు.ఇక దేశంలో లైంగిక వేధింపులకు గురైన వారి సంఖ్య 2021 కంటే 2022లో మరింత పెరిగాయన్నారు. పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) చట్టం ద్వారా కఠినమైన శిక్షలు వేస్తున్నా నేరాలు మాత్రం తగ్గడంలేదన్నారు. ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారం.. 1,004 కేసుల్లో 900 కేసులు తెలిసినవారి కారణంగా జరిగినవేనని చెబుతూ జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ భావోద్వేగానికి లోనయ్యారు. బాలలు బలహీనులు, వారేమీ చేయలేరు, ఎవరికీ చెప్పుకోలేరని చాలామంది దాడులకు తెగబడుతున్నారని.. ఈ విధానం మారాలన్నారు. సామాజిక బాధ్యతగా బాలల రక్షణ..సమావేశంలో జువెనైల్ జస్టిస్ కమిటీ చైర్పర్సన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. నరేందర్ మాట్లాడుతూ.. బాలల రక్షణను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. జువెనైల్ జస్టిస్ చట్టం అనేది రక్షణ, సంరక్షణ అవసరమైన చిన్నారుల కోసం మాత్రమే కాదని.. తీవ్రమైన నేరారోపణలకు గురయ్యే పిల్లల సంరక్షణ కోసం కూడా ఉద్దేశించబడిందని వివరించారు. చట్టాలు అమలుచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనా ఎంతో ఉందని చెప్పారు. అనంతరం.. చిన్నారులుతో ముచ్చటించారు. సమావేశంలో రాష్ట్ర, జిల్లా న్యాయస్థానాల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రెండో రౌండ్లోనే ధీరజ్ ఓటమి
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్కు మరోసారి నిరాశ తప్పలేదు. ఇప్పటికే పురుషుల టీమ్ విభాగంలో ఆకట్టుకోలేకపోయిన ధీరజ్.. వ్యక్తిగత విభాగంలో హోరాహోరీగా పోరాడి వెనుదిరిగాడు. మంగళవారం పురుషుల తొలి రౌండ్లో ధీరజ్ 7–1తో ఆడమ్ లీ (చెక్ రిపబ్లిక్)పై గెలిచాడు. అనంతరం రెండో రౌండ్లో చివరి వరకు పోరాడిన ధీరజ్ 5–6తో ఎరిక్ పీటర్స్ (కెనడా) చేతిలో ఓడాడు. ఐదు సెట్ల తర్వాత ఇద్దరూ 5–5తో సమంగా నిలిచారు. దాంతో ‘షూట్ ఆఫ్’ నిర్వహించారు. ‘షూట్ ఆఫ్’లో ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే ధీరజ్ కొట్టిన బాణం కంటే కెనడా ప్లేయర్ కొట్టిన బాణం కేంద్ర బిందువుకు సమీపంగా ఉండటంతో కెనడా ప్లేయర్ను విజేతగా ప్రకటించారు. మహిళల విభాగంలో భారత్ ఆర్చర్ భజన్ కౌర్ ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లింది. తొలి రౌండ్లో భజన్ 7–3తో సిఫా (ఇండోనేసియా)పై గెలిచింది. అనంతరం రెండో రౌండ్లో 6–0తో మజర్ (పోలాండ్)పై నెగ్గింది. భారత్కే చెందిన అంకిత తొలి రౌండ్లో 4–6తో వియోలెటా (పోలాండ్) చేతిలో ఓడిపోయింది. -
ధీరజ్కు రెండు కాంస్యాలు
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ రెండు కాంస్య పతకాలు సాధించాడు. మిక్స్డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్లో ధీరజ్–భజన్ కౌర్ (భారత్) ద్వయం 5–3తో మటియాస్–వలెన్సియా (మెక్సికో) జోడీపై గెలిచింది. వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్లో ధీరజ్ 7–3 తో మౌరో నెస్పోలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
రెండు పతకాలపై ధీరజ్ గురి
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీ పురుషుల రికర్వ్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ రెండు పతకాల రేసులో నిలిచాడు. రికర్వ్ మిక్స్డ్ విభాగంలో భజన్ కౌర్తో కలిసి ధీరజ్ ఆదివారం కాంస్య పతకం కోసం పోటీపడనున్నాడు. దాంతోపాటు పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలోనూ ధీరజ్ సెమీఫైనల్ చేరుకున్నాడు. వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో ధీరజ్ 7–3 (28–29, 28–27, 29–29, 28–27, 30–27)తో వెటెర్ (జర్మనీ)పై గెలిచాడు. మిక్స్డ్ విభాగం సెమీఫైనల్లో ధీరజ్–భజన్ కౌర్ ద్వయం 3–5 (37–34, 36–38, 37–37, 36–38)తో జెన్ హన్యంగ్–లీ వూసియోక్ (కొరియా) జంట చేతిలో ఓడింది. -
మూడో స్థానంలో ధీరజ్
పురుషుల రికర్వ్ వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ధీరజ్ బొమ్మదేవర 693 పాయింట్లతో మూడో స్థానాన్ని పొందాడు. 684 పాయింట్లతో తరుణ్దీప్ రాయ్ ఏడో స్థానంలో, 672 పాయింట్లతో ప్రవీణ్ జాధవ్ 25వ స్థానంలో నిలిచారు.మహిళల రికర్వ్ వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్లో భారత క్రీడాకారిణులు అంకిత (664 పాయింట్లు), భజన్ కౌర్ (657 పాయింట్లు), దీపిక కుమారి (656 పాయింట్లు) వరుసగా 15వ, 29వ, 30వ స్థానాల్లో నిలిచారు. -
తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం.. ప్రారంభించిన టాలీవుడ్ నిర్మాత!
ఊర్వశివో రాక్షసివో, బేబి, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్గా టాలీవుడ్లో పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన నిర్మాతగానే కాదు.. సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్గా పలు సూపర్ హిట్ సినిమాలను పంపిణీచేస్తున్నారు. బేబి, గుంటూరు కారం, హనుమాన్, గామి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళ్తున్నారు. ఆయన తాజాగా సీడెడ్ ఏరియా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ యతితో కలిసి తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించారు ధీరజ్ మొగిలినేని. ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా నటించిన 'ఓం భీమ్ బుష్', సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్'తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తిరుపతిలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇండస్ట్రీ మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
అటు డాక్టర్గా ఇటు హీరోగా.. త్వరలోనే డబుల్ టక్కర్..
ధీరజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం డబుల్ టక్కర్. మీరా మహతి దర్శకత్వం వహిస్తుండగా ఏర్ ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. స్మృతి వెంకట్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని, గౌతమ్ రాజేంద్రన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. నటి కోవై సరళ, ఎంఎస్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం యానిమేషన్ పాత్రలతో కలిసి నటీనటులు నటించడం అన్న వినూత్న ప్రయోగంతో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్గా తెరపై రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో చైన్నెలోని ఒక ప్రైవేటు కళాశాలలో నిర్వహించారు. ఇందులో హీరో ధీరజ్ మాట్లాడుతూ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, షారుక్ ఖాన్ వంటి ప్రముఖ హీరోల సినిమాల ఆడియో ఆవిష్కరణ వేడుకలు తరువాత ఇదే వేదికపై డబుల్ టక్కర్ చిత్ర ఆడియో ఆవిష్కరణ నిర్వహించే అవకాశం కల్పించినందుకు కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి సపోర్ట్ చేసిన దర్శకుడు రవికుమార్, జయం రవిలకు ప్రేమతో కూడిన కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడండి.. ఆనందంతో థియేటర్ నుంచి బయటకు వస్తారని పేర్కొన్నారు. జయంరవి మాట్లాడుతూ.. డబుల్ టక్కర్ టైటిల్.. హీరో కోసమే పెట్టినట్లు అనిపిస్తోందన్నారు. డాక్టర్ అయిన ధీరజ్ ఇప్పుడు యాక్టర్గా మారి రెండు రంగాల్లో రాణిస్తున్నానన్నారు. తన మంచి మిత్రుల్లో ధీరజ్ ఒకరని, ఆయనతో కలిసి త్వరలో ఒక చిత్రం చేయాలనిపిస్తోందన్నారు. విద్యాసాగర్ సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. చదవండి: కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్కు పెళ్లయిపోయింది -
భారత ఆర్చరీ జట్టులో ధీరజ్, జ్యోతి సురేఖ
ఈ ఏడాది జరిగే మూడు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ఆదివారం ఎంపిక చేశారు. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఆధ్వర్యంలో హరియాణాలోని సోనీపట్లో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన బొమ్మదేవర ధీరజ్ ట్రయల్స్లో అగ్రస్థానంలో నిలిచి జాతీయ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విజయవాడకు చెందిన ధీరజ్ ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ బెర్త్ కూడా దక్కించుకున్నాడు. ధీరజ్తోపాటు తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, మృణాల్ చౌహాన్ భారత రికర్వ్ జట్టులో చోటు సంపాదించారు. భారత మహిళల రికర్వ్ జట్టులో ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి, భజన్ కౌర్, అంకిత, కోమలిక ఎంపికయ్యారు. మరోవైపు ఒలింపిక్ ఈవెంట్కాని కాంపౌండ్ విభాగంలో భారత మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతోపాటు అదితి స్వామి, పర్ణీత్ కౌర్, అవనీత్ కౌర్ చోటు సంపాదించారు. పురుషుల కాంపౌండ్ జట్టులో ప్రథమేశ్, అభిõÙక్ వర్మ, రజత్ చౌహాన్, ప్రియాంశ్ ఎంపికయ్యారు. ప్రపంచకప్ తొలి టోర్నీకి ఏప్రిల్ 23 నుంచి 28 వరకు షాంఘై ఆతిథ్యమిస్తుంది. ప్రపంచకప్ రెండో టోర్నీ మే 21 నుంచి 26 వరకు యోచోన్లో, ప్రపంచకప్ మూడో టోర్నీ జూన్ 18 నుంచి 24 వరకు అంటాల్యాలో జరుగుతాయి. -
స్పోర్ట్స్: ఆ ఆర్చర్ పేరు 'బొమ్మదేవర ధీరజ్'!
అక్టోబర్ 2023.. హాంగ్జూలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఆర్చరీ రికర్వ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడొకడు పోటీ పడుతున్నాడు. వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. రెండో సెట్లో మొదటి బాణంతో సున్నా స్కోరు.. నాలుగో సెట్ రెండో బాణంతో సున్నా స్కోరు.. మొత్తం ఎనిమిది బాణాల వ్యవధిలో రెండు 0, 0 స్కోర్లు.. ఎవరూ ఊహించని రీతిలో అతి ఘోరమైన ప్రదర్శన.. ఆ కుర్రాడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. నవంబర్ 2023.. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ఆర్చరీ కాంటినెంటల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్... ఈ కీలక పోరులో అదే కుర్రాడు తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.. ఈసారి ఒక్క బాణం కూడా గురి తప్పలేదు. తన ప్రతిభనంతా ప్రదర్శిస్తూ అతను చెలరేగిపోయాడు. ఫలితంగా ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్లో భారత్ పాల్గొనేందుకు అవసరమైన తొలి అర్హత (కోటా)ను అందించాడు. తనతో పాటు సహచరులందరిలోనూ సంతృప్తి. ఆసియా క్రీడల్లో వైఫల్యంతో చోకర్ అంటూ అన్నివైపుల నుంచి విమర్శలపాలై ఆపై ఒలింపిక్స్కు అర్హత సాధించడం వరకు నెల రోజుల వ్యవధిలో అతను జీరో నుంచి హీరోగా మారాడు. ఆ ఆర్చర్ పేరు బొమ్మదేవర ధీరజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పించింగ్’.. దీరజ్ చేసిన పొరపాటుకు సాంకేతిక నామమిది. ఆర్చర్ లక్ష్యం దిశగా బాణాలు విసురుతున్న సమయంలో ఆటగాడి ప్రమేయం లేకుండా మూడో వేలు పొరపాటున బాణం చివరన తగిలితే అది దిశ లేకుండా ఎక్కడితో దూసుకెళ్లిపోతుంది. ఇది సాంకేతికంగా జరిగిన తప్పే కావచ్చు. కానీ ఫలితం చూస్తే ఆర్చర్దే పెద్ద వైఫల్యంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అతడిని మరీ పేలవమైన ఆటగాడిగా చూపిస్తుంది. ఇలాంటి అనుభవమే ధీరజ్కు ఎదురైంది. ఆర్చరీలో 9 పాయింట్లు సాధించిప్పుడు, ఆపై పర్ఫెక్ట్ 10 సాధించలేని సందర్భాల్లో కూడా ఆర్చర్లు తీవ్రంగా నిరాశ చెందుతారు. అలాంటి సున్నా పాయింట్లు అంటే పెద్ద వైఫల్యం కిందే లెక్క. ఈ స్థితిలో ధీరజ్ అసలు తన లోకంలో తాను లేనట్లుగా కుప్పకూలిపోయి పోటీ నుంచి ఓటమిపాలై నిష్క్రమించాడు. జట్టు సహచరులు ‘నీ తప్పేం లేద’ంటూ ఓదార్చే ప్రయత్నం చేసినా అతని బాధ తగ్గలేదు. ‘క్రికెట్లో అంటే సాధారణ అభిమానులకు ఎక్కడ తప్పు జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆర్చరీలో సాంకేతికాంశాలను నేను ఎలా వివరించగలను. ఇలాంటివి ఏమీ తెలియకుండా నన్ను ఆన్లైన్లో చాలామంది తీవ్ర పదజాలంతో దూషించారు. మాటల్లో చెప్పలేనంత వేదన అనుభవించాను’ అని ధీరజ్ నాటి ఘటనను గుర్తు చేసుకుంటాడు. బలంగా పైకి లేచి.. క్రీడల్లో కింద పడటం కొత్త కాదు కాని, పడ్డ ప్రతిసారి పైకి లేచేందుకు క్రీడలు అవకాశం కల్పిస్తాయి. ఘోర వైఫల్యం ఒకటి ఎదురైతే, ఆ తర్వాత మళ్లీ దానిని సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. ధీరజ్ విషయంలో కూడా ఇదే జరిగింది. కేవలం నాలుగు రోజుల్లోనే అతను తన తప్పును దిద్దుకొని సత్తా చాటేందుకు అదే ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్ వేదికగా మారింది. ‘నా వల్ల కాదు’ అంటూ ధీరజ్ సహచరులకు చెప్పినా, ‘నువ్వు బాణాలు సంధించు చాలు అంతా బాగుంటుంది’ అంటూ వారు ధైర్యం చెప్పారు. చివరకు భారత జట్టు టీమ్ విభాగంలో సగర్వంగా ఫైనల్ చేరి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. అతాను దాస్, తుషార్ షెల్కే, ధీరజ్లతో కూడిన జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఆర్చరీలో ఆల్టైమ్ గ్రేట్ టీమ్ కొరియాతో జరిగిన ఫైనల్లో ఓటమిపాలైనా, ఓవరాల్ ప్రదర్శన భారత్కు సంతృప్తినిచ్చింది. ధీరజ్ కూడా కీలక సమయాల్లో పర్ఫెక్ట్ స్కోర్లతో తన వంతు పాత్ర పోషించాడు. అలా మొదలై.. ధీరజ్ స్వస్థలం విజయవాడ. చాలామంది చిన్నపిల్లల్లాగే బాణాలతో ఆడుకునే సరదా ఆ తర్వాత అసలైన ఆట వైపు మళ్లించింది. ఐదేళ్ల వయసులో అతను ఈ ఆటవైపు బాగా ఆకర్షితుడై విల్లును అందుకున్నాడు. ఉపాధ్యాయుడైన తండ్రి తన కుమారుడిని నిరుత్సాహపరచకుండా ఆర్చరీలో ప్రాథమిక శిక్షణ వైపు తీసుకెళ్లాడు. నగరంలోని ప్రముఖ ఓల్గా ఆర్చరీ అకాడమీలో ధీరజ్ ఓనమాలు నేర్చుకున్నాడు. కోచ్లు చెరుకూరి లెనిన్, చెరుకూరి సత్యనారాయణ మార్గనిర్దేశనంలో అతని ఆట పదునెక్కింది. అకాడమీలో జార్ఖండ్ నుంచి వచ్చిన ఇతర కోచ్లు కూడా అతని ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దారు. దాంతో స్థానికంగా, చిన్న స్థాయి టోర్నీల్లో విజయాలు సాధిస్తూ ధీరజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే మలుపు.. వరుస విజయాలతో దిగువ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకుంటూ వచ్చిన ధీరజ్కు కెరీర్లో మరింత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అయితే ఆర్థిక సమస్యలతో పాటు ఇతర ప్రతికూలతలు ఇబ్బందిగా మారాయి. ఇలాంటి సమయంలో క్రీడా ఎన్జీఓ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ) ధీరజ్ ఆటను గుర్తించడం అతని కెరీర్లో కీలకమైన మలుపు. 2017లో ప్రతిభాన్వేషణలో భాగంగా నిర్వహించిన సెలక్షన్స్లో ఓజీక్యూ ప్రతినిధి అనుకూల్ భరద్వాజ్ దృష్టిలో పడ్డాడు. తమ జూనియర్ ప్రోగ్రామ్లో ధీరజ్ను చేర్చుకొని వారు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యుత్తమ స్థాయిలో శిక్షణ, అంతర్జాతీయ స్థాయి ఎక్విప్మెంట్తో ధీరజ్ తన ఆటకు పదును పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు ఎదురైనా, అవి అతని కెరీర్కు ప్రతిబంధకం కాలేదు. 2018 యూత్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత జట్టులో అతనికి స్థానం దక్కలేదు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ ట్రయల్స్లో కూడా నాలుగో స్థానంలో నిలవడంతో ఆ అవకాశమూ పోయింది. అయితే ఈ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకంటూ ధీరజ్ ఇతర టోర్నీల్లో సత్తా చాటుతూ వచ్చాడు. ఆర్మీ అండదండలతో.. 2017లో ఆసియా అవుట్డోర్ చాంపియన్షిప్లో వ్యక్తిగత రజతం, 2018లో ఆసియా గ్రాండ్ ప్రి టీమ్ ఈవెంట్లో రజతంతో ధీరజ్కు తగిన గుర్తింపు దక్కింది. అయితే అతని కెరీర్ గత రెండేళ్లలో మరింతగా దూసుకుపోయింది. ఈ క్రమంలో పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ అతని ఆటకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు అవకాశం కల్పించింది. అక్కడ చేరిన అనంతరం కొరియా కోచ్ కిమ్హగ్యాంగ్ శిక్షణలో ధీరజ్ రాటుదేలాడు. ఇది అతని ప్రదర్శనలలో, ఫలితాల్లో కనిపించింది. వరుసగా పెద్ద విజయాలు ధీరజ్ ఖాతాలో చేరాయి. వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్లో టీమ్ స్వర్ణం, వరల్డ్ కప్లో 1 స్వర్ణం, 3 రజతాలు, ఆసియా గ్రాండ్ ప్రిలో 2 స్వర్ణాలతో పాటు గత ఆసియా క్రీడల్లో రజతంతో అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో భాగంగా అతను కొత్త ప్రపంచ రికార్డును సృష్టించడం విశేషం. కోల్కతాలో జరిగిన ఈవెంట్లో మొత్తం 1140 పాయింట్లతో అమెరికాకు చెందిన బ్రాడీ ఎలిసన్ గత రికార్డు (1386)ను అతను సవరించాడు. ఆర్మీలో సుబేదార్ హోదాలో ఉన్న ధీరజ్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడం మరో పెద్ద అవకాశాన్ని కల్పించింది. ఆర్చరీలో అతి కష్టమైన, బాగా ఉండే ఈవెంట్ పురుషుల రికర్వ్ విభాగం. అయితే ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 14వ స్థానంలో ఉన్న ధీరజ్ చూపిస్తున్న ఫామ్, ఆత్మవిశ్వాసం భారత్కు ఒలింపిక్స్ చరిత్రలో తొలి ఆర్చరీ పతకాన్ని అందించవచ్చు. — మొహమ్మద్ అబ్దుల్ హాది -
ధీరజ్ ధమాకా
బాగ్ధాద్ (ఇరాక్): ఆసియా కప్ ఆర్చరీ తొలి అంచె టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్ మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన ధీరజ్ పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో, టీమ్ విభాగంలో, మిక్స్డ్ టీమ్ విభాగంలో విజేతగా నిలిచాడు. వ్యక్తిగత విభాగం ఫైనల్లో ధీరజ్ 7–3తో భారత్కే చెందిన తరుణ్దీప్ రాయ్ను ఓడించాడు. టీమ్ విభాగం ఫైనల్లో ధీరజ్, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్లతో కూడిన భారత జట్టు 6–2తో ఇస్లామ్, రూబెల్, అలీఫ్లతో కూడిన బంగ్లాదేశ్ జట్టుపై గెలిచింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో ధీరజ్–సిమ్రన్జోడీ 6–0తో దియా–ఇస్లామ్ జంట (బంగ్లాదేశ్)పై నెగ్గింది. ఇండియన్ ఆర్మీలో హవల్దార్గా విధులు నిర్వహిస్తున్న ధీరజ్ విజయవాడలోని ఓల్గా ఆర్చరీ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్నాడు. గత ఏడాది థాయ్లాండ్లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోరీ్నలో ధీరజ్ రజత పతకం సాధించి పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందాడు. -
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’లో ఏ కులాన్ని కించపరచలేదు: నిర్మాత
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’సినిమా ట్రైలర్ చూసి ఇందులో కులాల గురించి డిస్కషన్ ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఊరిలో జరిగే కథ కాబట్టి సహజంగా పెద్ద కులాలు, చిన్న కులాలు ఉంటాయి. అంతే గానీ ఒక కులాన్ని కించపరచడం గానీ మరో కులాన్ని గొప్పగా చూపించడం గానీ చేయలేదు’అని చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని అన్నారు. సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ధీరజ్ మిగిలినేని నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ధీరజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు. ► ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇది కామెడీ మూవీ అనుకున్నారు. పాటలు రిలీజ్ చేశాక ఇది లవ్ స్టోరీ కావొచ్చని అన్నారు. ట్రైలర్ చూశాక సీరియస్ సబ్జెక్ట్ అని రివీల్ అయ్యింది. సుహాస్ కలర్ ఫొటో లాంటి మూవీ చేశాడు. పెద్ద హీరోల సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. తన నెక్ట్ మూవీ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" అవ్వాలని సుహాస్ కోరుకున్నాడు. అలాగే ఎంతో కమిట్ మెంట్ తో కష్టపడి నటించాడు. సహాస్ పర్ ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో స్క్రీన్ మీద చూస్తారు. మేము కూడా అతన్ని ఒక సీరియస్ సబ్జెక్ట్ లోనే చూపించాలని అనుకున్నాం. ► మా సినిమా ద్వారా ఎలాంటి సందేశం చెప్పడం లేదు. ఇలా ఉండాలని సూచించడం లేదు. ఒక ప్రాంతంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను అలాగే సినిమాగా తెరకెక్కించి చూపిస్తున్నాం. ఇది మంచీ ఇది చెడు..ఇలా మారిపోండి అని ప్రేక్షకులకు చెప్పాలని అనుకోవడం లేదు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ఒక ప్రేమ కథ మాత్రమే కాదు. ఇందులో లవ్ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. సుహాస్ అక్క క్యారెక్టర్ లో స్కూల్ టీచర్ గా శరణ్య ప్రదీప్ నటించింది. ఆమెది కథలో ఒక కీ రోల్. కథలోని ప్రధాన భాగం ఆమె క్యారెక్టర్ చుట్టూ సాగుతుంది. శరణ్య క్యారెక్టర్ ద్వారా స్టోరీలోని కొన్ని అంశాలు చెప్పాం. ►మేము కథ వినే టైమ్ కు సుహాస్ కలర్ ఫొటో రిలీజైంది, రైటర్ పద్మభూషణ్ షూటింగ్ జరుగుతోంది. కథ విన్నప్పుడు ఈ క్యారెక్టర్ కు సుహాస్ అయితే యాప్ట్ అవుతాడు అని అనుకున్నాం. తను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. రెండు సార్లు గుండు చేసుకున్నాడు. కథలో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ కోసం సుహాస్ గుండుతో కనిపించాలి. సహజంగా ఉండాలంటే విగ్ పెట్టుకోవద్దు. అయితే తొలిసారి గుండు చేయించుకున్నప్పుడు కొన్ని సన్నివేశాలను మాత్రమే షూట్ చేశాం. జుట్టు పెరిగిన తర్వాత మరిన్ని సన్నివేశాలకు గుండుతో కావాల్సి వచ్చింది. దీంతో సుహాస్ వెంటనే రెండో సారి గుండు చేయించుకున్నాడు. సుహాస్ బిజీ ఆర్టిస్ట్. కలర్ ఫొటో తర్వాత హీరోగా ఓ పది మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు. వాటి గురించి ఆలోచించకుండా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు"లో గుండు చేసుకుని నటించారు. ఆయన కమిట్ మెంట్ కు మేము సర్ ప్రైజ్ అయ్యాం. ►‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ లో హీరోయిన్ గా పేరున్న వారిని తీసుకుంటే కమర్షియల్ ఫీల్ వస్తుందేమో అనుకుని కొత్త వాళ్ల కోసం ఆడిషన్ చేశాం. శివానీ హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ కు వచ్చింది. అయితే ఆమె పర్ ఫార్మెన్స్ చూసి హీరోయిన్ గా తీసుకోవచ్చు అని డైరెక్టర్ అన్నారు. అలా మళ్లీ ఆమెను పిలిచి హీరోయిన్ క్యారెక్టర్ కు ఆడిషన్ చేశారు దుశ్యంత్. బాగా చేస్తుందనే కాన్ఫిడెన్స్ రావడంతో హీరోయిన్ గా తీసుకున్నాం. మేము అనుకున్నట్లే తన రోల్ బాగా ప్లే చేసింది. ►గీతా ఆర్ట్స్ లో చాలా పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు చేస్తుంటారు. మేము ఈ మూవీని డిజైన్ చేసిందే కొత్తదనం కనిపించాలని. గీతా ఆర్ట్స్ గుడ్ విల్ కాపాడేలా ఉంటూనే ఒక ఫ్రెష్ నెస్, కొత్త వాళ్లతో సినిమా చేశాం. శరణ్య క్యారెక్టర్ కు మరో పేరున్న నటిని తీసుకోవచ్చు కానీ కథలోని ఆ ఒరిజినాలిటీ కనిపించాలంటే సీనియర్స్ వద్దనే అనిపించింది. ►అల్లు అరవింద్ గారు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాను చూసి సంతోషంతో మమ్మల్ని హగ్ చేసుకున్నారు. చిన్న కరెక్షన్ కూడా చెప్పలేదు. సినిమా బాగా నచ్చడంతో రెండోసారి కూడా చూశారు. ►మా సినిమాకు శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. తన సంగీతంతో మా సినిమా ఫీల్ ను రెట్టింపు చేశారు. దర్శకుడు దుశ్యంత్ కథతో పాటే డైలాగ్స్ రాసుకుంటాడు. ఆయన కథ, డైలాగ్స్ లో నేటివిటీ కనిపిస్తుంటుంది. దర్శకులు కథ చెప్పినంత బాగా సినిమా చేయరు. కానీ దుశ్యంత్ కథ చెప్పినంత బాగా మూవీని రూపొందించాడు. టెక్నికల్ గా కూడా సినిమా ఆకట్టుకుంటుంది. ►ప్రస్తుతం రశ్మిక మందన్నతో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చేస్తున్నాం. ఈ సినిమా 40 శాతం షూటింగ్ చేశాం. ఈ ఏడాదే విడుదల చేస్తాం. మరో మూడు ప్రాజెక్ట్స్ రెడీ చేసుకుంటున్నాం. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తాను. -
లెక్కకు రాని కట్టలు ఎన్నో!
రికార్డులు తిరగరాసిన ఉదంతమిది. అయితే అది వన్నె తెచ్చే రికార్డు కాకపోవడమే విషయం. యాభై మంది బ్యాంక్ అధికారులు, 40 కౌంటింగ్ మిషన్లు, ఆరు రోజుల పాటు అలుపెరగని సోదా, దొరికిన 350 కోట్లకు పైగా నగదు... దేశంలో ఇంతవరకూ ఏ దర్యాప్తు సంస్థ జరిపిన సోదాల్లోనూ కనివిని ఎరుగని కళ్ళు తిరిగే లెక్కలివి. జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ కుటుంబ డిస్టిలరీ సంస్థపై రాంచీ సహా వివిధ ప్రాంతాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహిస్తున్న దాడులు వారం రోజులుగా వార్తల్లో ముఖ్యాంశమవడానికి ఇదే కారణం. లెక్కింపు మిషన్లు కూడా మొరాయించేలా, గుట్టలు గుట్టలుగా సంచులకొద్దీ డబ్బు ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన సంస్థల్లో దొరకడం సామాన్య ప్రజానీకాన్ని ముక్కున వేలేసుకొనేలా చేస్తోంది. మునుపెన్నడూ లేనంతగా ఒకేసారి ఇంత డబ్బు ఐటీ సోదాల్లో దొరకడం సహజంగానే అధికార పక్షానికి అందివచ్చిన అస్త్రమైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ను ఇరుకునపెట్టడంలో బీజేపీ నేతలు బిజీ అయ్యారు. సాక్షాత్తూ ప్రధాని, పార్లమెంట్ సాక్షిగా హోమ్ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లోని ప్రసిద్ధ ‘మనీ హైస్ట్’ సిరీస్ తరహాలో కాంగ్రెస్ అవినీతి దోపిడీ సాగుతోందని ప్రధాని వీడియో మీమ్లు పెట్టడం కొసమెరుపు. వెరసి, కాంగ్రెస్ది కక్కలేని మింగలేని పరిస్థితి. అయిదుగురు సోదరుల సాహూ కుటుంబమంతా తర తరాలుగా పార్టీ విధేయులూ, వివిధ సమయాల్లో చట్టసభ సభ్యులూ కావడంతో ఆ పార్టీ తప్పించు కోలేని దుఃస్థితి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందీ నడిగడ్డ మీద మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలై, అందులోనూ రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి డీలా పడ్డ కాంగ్రెస్ను ఇది ఇరుకున పడేసింది. ఈ పరిస్థితుల్లో లెక్కలేని ఈ ధనరాశుల మచ్చ తనపై పడకుండేలా ఆ పార్టీ శతవిధాల యత్నిస్తోంది. బాహాటంగా సాహూను ఏమీ అనకున్నా, ఈ సోదా నగదుపై వివరణ కోరిందన్నది వార్త. సోదాల్లో దొరికిన నగదులో అధిక మొత్తం బౌద్ డిస్టిలరీస్ గ్రూపులో బయటపడ్డదే. అయితే, సాహూ కుటుంబం తరతరాలుగా సారాయి వ్యాపారంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో భారీగా సాగే ఇలాంటి వ్యాపారంలో నగదు చెల్లింపులే ఎక్కువన్నదీ బహిరంగ సత్యమే. పైగా, కుటుంబసంస్థలో కాంగ్రెస్ ఎంపీ సాహూ కనీసం డైరెక్టరైనా కాదు. సాహూ కుటుంబ సంస్థ అయినంత మాత్రాన ఆ డబ్బు సాహూది ఎలా అవుతుంది? అంతకు మించి ఆ డబ్బంతా కాంగ్రెస్దెలా అయిపోతుంది? ఇదీ హస్తం పార్టీ సమర్థకుల వాదన. సాంకేతికంగా అది నిజమే! అయితే, ఇందిరా గాంధీ కాలం నుంచి కాంగ్రెస్ వెంట నడిచి, ఒకటికి రెండు మూడు సార్లు ఎంపీలైన సాహూ సోదరుడు, సాహూ... తమ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేందుకు తమ వ్యాపార రాబడిని ఆసరాగా చేసుకొని ఉంటారనేది ఊహకందని విషయమేమీ కాదు. అది సాక్ష్యాధారాలతో సంబంధం లేని సామాన్య ఇంగితం. ఆరోపణలు, వివరణల మాటెలా ఉన్నా తాజా సాహూ వ్యవహారం మరింత లోతైన వ్యవహారాన్ని సూచిస్తోంది. సమాజంలో పేరు, పలుకుబడి ఉన్న పెద్దమనుషుల వద్ద లెక్కాజమా లేకుండా పోగుపడుతున్న ధనరాశుల చిట్టాలో ఇది లవలేశమేనన్న స్పృహ కలిగిస్తోంది. దాదాపు నూటికి 42 మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బీద రాష్ట్రంలో, నూటికి 48 మంది ప్రజానీకం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న రాష్ట్రంలో ఒక మద్యం డిస్టిలరీ సంస్థ వద్ద ఇంత ధనం దొరకడం సమకాలీన సమాజంలోని విరోధాభాస. సామాన్యులు తమ ప్రతి పైసా ఆదాయానికీ, ఖర్చుకూ లెక్కలు పూచీపడుతుంటే, బడా బాబుల వద్ద లెక్కకందని డబ్బుల కట్టలు మూలుగుతుండడం బయటపడ్డ ప్రతిసారీ దిగ్భ్రాంతి కలిగిస్తూనే ఉంది. పెద్ద నోట్ల రద్దు లాంటి ఆలోచనలు పదేపదే నిష్ఫలమైన తీరునూ కళ్ళ ముందుంచుతోంది. నిజానికి రాజకీయాలకూ, వ్యాపారానికీ మధ్య బంధం కొత్తేమీ కాదు. విజయ్ మాల్యా, అదానీ, అంబానీ అంటూ పేర్లు మారవచ్చేమో కానీ, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అనుకూలురితో అధికార పీఠం బంధాలు పెనవేసుకోవడం దశాబ్దాలుగా దేశంలో చూస్తున్నదే. వందల రెట్లలో ఎదుగుతున్న వ్యాపార లెక్కల పైనే కాదు... పీఎం కేర్ ఫండ్స్ మొదలు పార్టీలకు అందుతున్న విరా ళాలు, ఎలక్టోరల్ బాండ్స్పైనా రచ్చ రేగుతున్నది అందుకే. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పన్ను లెక్కల్లో చూపని అక్రమ ధనం స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ళ తర్వాతా దేశాన్ని పట్టి పీడిస్తూనే ఉండడం విషాదం. ప్రతి 10–15 ఏళ్ళకోసారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ప్రకటిస్తున్నా నల్ల డబ్బు చీడ తొలగలేదు. చివరకివి ఆర్థికవ్యవస్థనే తలకిందులుచేసే స్థాయికి పెరిగిపోవడం దిగ్భ్రాంతికరం. డిజిటల్ చెల్లింపులు ప్రాచుర్యంలో పెట్టామని జబ్బలు చరుచుకొంటే చాలదు. ఆ పరిధిలోకి రాని ఇలాంటి నగదు గుట్టలను అరికట్టే ప్రణాళికలు చేపట్టాలి. రెండో ప్రపంచ యుద్ధానంతరం కొన్ని దేశాల్లో చేసినట్టే... నిర్ణీత పరిమితి దాటి ఎవరైనా అనధికారికంగా నగదు కలిగివుంటే తక్షణ శిక్షార్హ నేరంగా పరిగణించేలా చట్టం తేవాలి. అధికార పార్టీ నేతలపైనా ఆరోపణలు వినిపిస్తున్న వేళ, తరతమ భేదాలు లేని చర్యలు అవసరం. పైగా, వచ్చే ఎన్నికల్లో అవినీతి అంశాన్ని అస్త్రంగా చేసుకొని ఉరకాలని భావిస్తున్న అధికార పార్టీ నుంచి మరింత జవాబుదారీతనం ఆశిస్తాం. ప్రతిపక్షానికి సైతం తామే కాదు... తమ ఎంపీలూ పులు కడిగిన ముత్యాలేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అవేమీ లేకుండా, సామాన్యులకు చిరకాలం గుర్తుండే ఈ నగదు కట్టల దృశ్యాలు వట్టి వైరల్ వీడియోలుగా, శుష్క ఆరోపణలుగా మిగిలిపోతేనే కష్టం. -
ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు చేసిన సోదాల్లో దొరికిన నగదు మొత్తం రూ.351 కోట్లకు చేరింది. దేశంలో ఒక దర్యాప్తు సంస్థ ఒకేసారి చేసిన సోదాల్లో ఇంతటి భారీస్థాయిలో కరెన్సీ బయటపడటం ఇదే తొలిసారి! బౌద్ధ్ డిస్టిల్లరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్లు, ఇతరులకు సంబంధించిన చోట్ల ఐటీ అధికారుల సోదాలు ఐదోరోజైన ఆదివారమూ కొనసాగాయి. మద్యం వ్యాపారం ద్వారా పొందిన దాంట్లో లెక్కల్లో చూపని ఆదాయం గుట్టుమట్లను ఐటీ శాఖ రట్టుచేస్తోంది. తనిఖీల్లో భాగంగా రాంచీలోని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహూ సంబంధిత ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు చెక్చేశారు. ఇక్కడ ఎంత మొత్తంలో నగదు, ఇతర పత్రాలు లభించాయనేది అధికారులు వెల్లడించలేదు. ‘ఈ అంశం ధీరజ్ సాహూ కుటుంబ విషయం. దాదాపు వందేళ్లకు పైగా వారి కుటుంబం ఉమ్మడి వ్యాపారం చేస్తోంది. అందులో సాహూకు చిన్న వాటా ఉంది. ఏదేమైనా ఆయనకు సంబంధించిన చోట్ల సోదాలు జరిగాయికాబట్టి ఆయన ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందే. అందుకే ఆయన నుంచి వివరణ తీసుకున్నాం. కాంగ్రెస్ పారీ్టకి ఈ సోదాలకు సంబంధం లేదు’’ అని జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ అవినాశ్ పాండే ఆదివారం స్పష్టంచేశారు. విపక్షాలపై అమిత్ విమర్శలు ఐటీ దాడులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ‘‘ దర్యాప్తు సంస్థలను కేంద్రం దురి్వనియోగం చేస్తుందని ఇన్నాళ్లూ విపక్షాలు ఎందుకు అన్నాయో ఇప్పుడు అర్థమవుతోంది. విపక్షాలు తమ అవినీతి, అక్రమ సొమ్ము వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ఇన్నాళ్లూ విషప్రచారం చేశాయి. తీరా ఇప్పుడు కరెన్సీ కట్టలు బయటపడ్డాక కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, డీఎంకే, ఆర్జేడీలు మౌనం వహిస్తున్నాయి’’ అమిత్ వ్యాఖ్యానించారు. -
ఆర్చరీలో తొలి ఒలింపిక్స్ బెర్తు తెచ్చిన ధీరజ్
ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీలో తొలి ఒలింపిక్స్ కోటా బెర్తును తెచ్చి పెట్టాడు. బ్యాంకాక్లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో ధీరజ్ రజతం సాధించాడు. ఫైనల్లో స్వర్ణ పతకంపై గురిపెట్టిన 22 ఏళ్ల తెలుగు కుర్రాడు 5–6తో జి సియాంగ్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడి... రజతంతో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు క్వార్టర్స్లో ధీరజ్ 6–0తో సాదిగ్ అష్రాఫి బవిలి (ఇరాన్)పై, సెమీ ఫైనల్లో 6–0తో మొహమ్మద్ హొస్సేన్ గొల్షాని (ఇరాన్)పై విజయం సాధించాడు. ఈ ఈవెంట్లో ఫైనల్ చేరిన ఇద్దరికి మాత్రమే ఒలింపిక్స్ కోటా బెర్తు లభిస్తుంది. మహిళల విభాగంలో అంకిత భకత్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోవడంతో బెర్తు దక్కలేదు. -
తెలుగు రాష్ట్రలో ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు
-
పసిడి పోరుకు జ్యోతి సురేఖ జోడీ
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్కు పతకం ఖరారైంది. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్ర ప్లేయర్ ఓజస్ ప్రవీణ్ దేవ్తలె ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సురేఖ–ఓజస్ రెండో రౌండ్లో 159–157తో మరియా–గైల్స్ (లక్సెంబర్గ్)లపై... క్వార్టర్ ఫైనల్లో 159–156తో సోఫీ–అడ్రియన్ గోంటీర్ (ఫ్రాన్స్)లపై... సెమీఫైనల్లో 157–155తో ఫాతిన్ నూర్ఫతే–జువైది (మలేసియా)లపై గెలిచారు. నేడు జరిగే ఫైనల్లో చెన్ యి సువాన్–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ)లతో జ్యోతి సురేఖ–ఓజస్ తలపడతారు. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మాత్రం అతాను దాస్–భజన్ కౌర్ (భారత్) ద్వయం తొలి రౌండ్లో 3–5తో డెన్మార్క్ జోడీ చేతిలో ఓడిపోయింది. ధీరజ్ అద్భుతం... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో ధీరజ్ 6–0తో థియో కార్బొనెటి (బెల్జియం)పై, రెండో రౌండ్లో 6–4తో కెజియా చాబిన్ (స్విట్జర్లాండ్)పై, మూడో రౌండ్లో 6–4తో జిగా రావ్నికర్ (స్లొవేనియా)పై, నాలుగో రౌండ్లో 6–5తో అమెరికా దిగ్గజం బ్రాడీ ఇలిసన్పై, క్వార్టర్ ఫైనల్లో 6–4తో తరుణ్దీప్ రాయ్ (భారత్)పై గెలుపొందాడు. ప్రపంచ మాజీ చాంపియన్, మూడు ఒలింపిక్ పతకాలు నెగ్గిన ఇలిసన్తో జరిగిన మ్యాచ్లో ధీరజ్ ‘షూట్ ఆఫ్’లో గెలిచాడు. ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేసినా ధీరజ్ కొట్టిన బాణం 10 పాయింట్ల లక్ష్యబిందువుకు అతి సమీపంలో ఉండటంతో విజయం ఖరారు చేసుకున్నాడు. ఆధిక్యంలో అర్జున్ సాటీ జుల్డిజ్ ఓపెన్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ఎనిమిది రౌండ్ల తర్వాత తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఏడు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన నాలుగు గేముల్లో మూడింట గెలిచిన అర్జున్, మరో గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. వఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), బిబిసారా (కజకిస్తాన్), బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)లపై నెగ్గిన అర్జున్ జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమెర్తో జరిగిన గేమ్ను ‘డ్రా’గా ముగించాడు. 12 మంది అగ్రశ్రేణి ప్లేయర్ల మధ్య 11 రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నేడు చివరి మూడు రౌండ్లు జరుగుతాయి. -
సీక్వెల్ కు జై కొడుతున్న స్టార్ హీరోలు..
-
రెండు సీన్లు చూసి ఆ సినిమాను ఎక్కువ రేటుకు కొన్నారు
Shikaaru Movie Trailer: ‘‘నా ‘ఆది’ సినిమా అప్పుడు జస్ట్ రెండు సీన్లు చూసి ఎక్కువ రేటుకు కొన్నారు బాబ్జీ. ఆయనకు జడ్జిమెంట్ బాగా తెలుసు. బాబ్జీని ఒప్పించి, దర్శకుడు హరి ఈ సినిమా చేయడం గొప్ప విషయం. వైజాగ్ పంపిణీదారుడుగా మంచి పేరున్న బాబ్జీ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. నాగేశ్వరి (పద్మ) సమర్పణలో హరి కొలగాని దర్శకత్వంలో పీఎస్ఆర్ కుమార్ (బాబ్జీ) నిర్మించిన చిత్రం ‘షికారు’. సాయి ధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ నవకాంత్ ప్రధాన తారలుగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్ను వీవీ వినాయక్ ఆవిష్కరించారు. బాబ్జీ మాట్లాడుతూ– ‘‘చక్కని కామెడీతో హరిగారు ఈ సినిమాని తెరకెక్కించారు. శేఖర్ చంద్ర చక్కని బాణీలు సమకూర్చారు’’ అన్నారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ఇది’’ అని తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ నవకాంత్ అన్నారు. -
Dhiraj Bommadevara: రెండో రౌండ్లో ధీరజ్
గ్వాటెమాలా సిటీ: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర వ్యక్తిగత రికర్వ్ విభాగంలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో ధీరజ్ 6–0తో జోస్ కార్లోస్ లోపెజ్ (గ్వాటెమాలా)పై విజయం సాధించాడు. ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్ సెట్స్’ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్లో ఒక్కో సెట్లో ఆర్చర్లకు మూడు బాణాలు సంధించే అవకాశం ఇస్తారు. మూడు బాణాలు సంధించాక అత్యధిక స్కోరు సాధించిన ఆర్చర్ సెట్ను గెలిచినట్టు. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు... స్కోరు సమం అయితే ఇద్దరికీ చెరో పాయింట్ ఇస్తారు. ధీరజ్ తొలి సెట్ను 28–23తో... రెండో సెట్ను 30–27తో... మూడో సెట్ను 27–24తో గెలిచి ఓవరాల్గా 6–0తో విజయాన్ని అందుకున్నాడు. భారత్కే చెందిన తరుణ్దీప్ రాయ్ 6–0తో ఇవాన్ గొంజాలెజ్ (మెక్సికో)పై గెలుపొందగా... ప్రవీణ్ జాదవ్, అతాను దాస్లకు నేరుగా రెండో రౌండ్కు ‘బై’ లభించింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు దీపిక, అంకిత, కోమలిక, మధు వేద్వాన్లకు నేరుగా రెండో రౌండ్కు ‘బై’ లభించింది. -
మేడ
‘‘హలో...’’ టార్చ్ లైట్ వెలుగు సహాయంతో ముందు గదిలోకి వచ్చిన ధీరజ్ ఆ ఇంట్లో వారిని ఉద్దేశించి పిలిచాడు. జవాబుగా అవతల నుంచి ఏ పలుకూ లేదు. అలాగే ఇంకాస్త ముందుకు వెళ్లి.. ‘‘ఎవరండీ ఇంట్లో?’’ అడిగాడు. కిటికీ రెక్కలు రెండూ ధడేల్ ధడేల్ మంటూ కొట్టుకున్న చప్పుడు. వినిపించిన వైపు టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్లి పరిశీలనగా చూశాడు. గడియ పడి ఉన్నాయి. ఇందాకే కదా.. అంత గట్టిగా కొట్టుకున్నాయి.. ఆ క్షణంలోనే ఎలా గడియ పడ్డాయి? విస్మయపోతూనే తెరవడానికి ప్రయత్నించాడు. కొన్నేళ్ల నుంచీ తుప్పు పట్టినట్టున్నాయి ఆ బోల్ట్స్. ఎంత తెరిచినా రావట్లేదు. ఇంకాస్త గట్టిగా లాగితే కిటికీలే ఊడొచ్చేంత పాతగా ఉన్నాయ్. బహుశా ఆ పెద్ద చప్పుడు తన భ్రమేమో అనుకుని ఇంకాస్త ముందుకు వెళ్లాడు టార్చ్ వెలుగులోనే. ఈ సారి ఓ మూల నుంచి కిర్రుమంటూ శబ్దం వినిపించింది . అటు వైపు మళ్లాడు. యుగాల నాటి పెద్ద గుమ్మాన్ని తలపించే ద్వారం. తలుపు ఓరగా తెరిచి ఉంది. దాని దరికి రాగానే ఒక్కసారిగా గబ్బిలాల కంపు.. లోపల్నించి గబ్బిలాల రెక్కల చప్పుడు.. ఎలుకల కిచకిచలు. ఆ గదిలోకి వెళ్దామనుకొనీ వెళ్లక వెనకడుగు వేశాడు. ఆ వాసనకు, శబ్దాలకు చీదర కలిగి. టార్చ్ను ఆ ఫోకస్ నుంచి తిప్పబోతూ ఆగిపోయాడు. ఆ గదిలో వెలుతురు పడ్డ మేర చాలా శుభ్రంగా.. మార్బుల్ ఫ్లోర్ మెరుస్తూ కనిపించింది. రెండడుగులు లోపలికి వేసి.. గదంతా టార్చ్ లైట్ తిప్పాడు. నీట్గా.. సాంబ్రాణి వాసనతో ఆహ్లాదంగా ఉంది. షాక్ అయ్యాడు ధీరజ్. గదిలోంచి వెనక్కి వచ్చాడు. మళ్లీ గబ్బిలాల కంపు.. ఎలుకలు.. కిచకిచలు..ఇంకోసారి పరీక్షిద్దామని లోపలికి వెళ్లబోతుంటే పైన గదిలోంచి శబ్దం... తూగుటుయ్యాల ఊగుతున్నట్టు.. కూయి.... కూయి.. అంటూ!మేడ పైకి ఎక్కేందుకు మెట్ల కోసం చూశాడు.. ఎక్కడా కనపడలేదు. గబగబా ఆ ఇంటి వెనక్కి వెళ్లాడు చీకట్లో అదే టార్చ్ లైట్ సహాయంతో. అక్కడా మెట్లు కనపడలేదు. కుడి వైపు.. ఎడమ వైపు.. ముందు వైపు.. అలా ఇంటికి నాలుగు దిక్కులా వెదికాడు.. ఎక్కడ మెట్ల ఆనవాలు లేదు. మరి మేడ మీద గది ఉన్నట్టు.. ఉయ్యాల ఊగుతున్నట్టూ చప్పుడేంటి... తన భ్రాంతా? అని సణుక్కుంటూ మళ్లీ ఇంట్లోకి వెళ్లాడు. ఇల్లంతా టార్చ్ తిప్పాడు. గోడలన్నీ మంటల్లో పొగచూరినట్టుగా నల్లగా ఉన్నాయి. ఒక్కసారిగా హాహాకారాలు.. అరుపులు.. కేకలు.. బిందెల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తున్న సౌండ్.. గాజుల గలగలలు.. గాబరాగా నడుస్తుంటే వచ్చే పాదాల పట్టీల చప్పుడు.. దిమ్మ తిరిగింది ధీరజ్కి.. మొహమంతా ముచ్చెమటలు... ఆ శబ్దం అంతకంతకూ ఎక్కువవుతూ.. అదంతా తన చుట్టే జరుగుతున్నట్టనిపించి ఒక్కసారిగా ఆ ఇంటి బయటకు పరిగెత్తాడు. వాకిట్లోకి రాగానే .. చెవుల్లోంచి ఎవరో ఆ గోలను తీసి అవతల పారేసినట్టు ప్రశాంతంగా అనిపించింది ధీరజ్కు. ఇందాకటి అలజడీ లేదు. వెనక్కి తిరిగి చూసే సాహసం చేయకుండా గేట్ తోసుకుంటూ రోడ్డు మీదకు వచ్చిపడ్డాడు.భయం భయంగానే ఆ ఇంటి వైపు చూశాడు. లైట్లతో దేదీప్యమానంగా వెలుగుతోంది కొత్త ఇల్లులా! చుట్టూ మొక్కలు.. చెట్లతో ముస్తాబై ఉంది.. ఎప్పటిలా! ధీరజ్కు ముప్పై ఏళ్లుంటాయి. ఇంకా పెళ్లి కాలేదు. సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆ వీధిలోకి కొత్తగా చేరాడు. ఆ కాలనీకి వచ్చినప్పుడే ఆ మేడ మీద ధీరజ్ కన్ను పడింది. అందంగా కంటే కూడా దృష్టిని ఆకర్షించే ప్రత్యేకతేదో ఉంది ఈ మేడ మీద అని అనుకునేవాడు దాన్ని చూసినప్పుడల్లా. రోజూ షూటింగ్స్ ముగించుకొని ఇంటికొచ్చే సరికి అర్ధరాత్రి అవుతుంది. వీధి మొదట్లోనే క్యాబ్ దిగి...వీధి చివర ఉన్న తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తాడు. ఆ మేడ ముందుకు రాగానే దాన్నే తిరిగి తిరిగి చూస్తూ ముందుకు సాగడం అతనికి ఇష్టం. రాత్రి పన్నెండు దాటినా ఆ ఇల్లంతా లైట్లతో వెలుగుతూంటుంది. అంత రాత్రీ మనుషుల అలికిడి ఉన్నట్టే కనిపిస్తుంది. తన ఇంటికి రెండిళ్ల ముందు ఉంటుంది ఈ మేడ. తన ఇంట్లో పనిచేసే అమ్మాయిని అడిగాడు.. ‘‘ఆ ఇల్లు ఎవరిది?’’ అని. ఏమీ అర్థం కానట్టు ‘‘ఏ ఇల్లు సార్?’’ అంది ఆమె. ‘‘అదే ఆ మూడో ఇల్లు?’’ చేతితో ఆ డైరెక్షన్ను చూపిస్తూ మరీ అడిగాడు. ‘‘మూడో ఇల్లా?’’ అంటూ ముక్కున వేలేసుకొని అతను చూపించిన వైపు చూసింది ఆమె.నటిస్తోందా? నిజంగానే తెలియదా? సందేహిసూ ్త ఇక ఆ ఇంటి గురించి రెట్టించలేదు.!ఆ ఉదయం.. తను పాల పాకెట్ తీసుకొని వస్తూంటే కనిపించింది పనమ్మాయి ఆ ఇంట్లోంచి బయటకు వెళ్తూ. మరి ఆ రోజు ఎందుకలా నటించింది? తను ఆ ఇంటి గురించి అడిగితే అసలు అక్కడ ఇల్లే లేనట్టు?.. అనే అనుమానం అతని మెదడులో లిప్తపాటు కదిలి మాయమైపోయింది. ఇప్పుడు.. రాత్రి.. షూటింగ్ నుంచి వస్తూ వస్తూ.. ‘‘ఎలాగైనా లోపలికి వెళ్లి.. ఆ ఇల్లు ఎలా ఉంటుందో? అంత రాత్రి పూటా లైట్లన్నిటినీ ఎందుకు వెలిగిస్తారో? అందులో ఎంత పెద్ద కుటుంబం ఉంటోందో? లాంటి జిజ్ఞాస ధీరజ్ను లోపలికి లాక్కెళ్లింది. ఆ ఇల్లు లోపల కూడా అంతే అందంగా ఉంటే బాగుంటే షూటింగ్కి ఇస్తారేమో కనుక్కోవాలి అనీ నిశ్చయించుకున్నాడు. తీరా లోపలికెళ్లాక చూస్తే.. భూత్ బంగ్లాలా బెదరగొట్టింది.. ఇంటికెలా వచ్చాడో తెలియదు. రాగానే ఫ్రిజ్ తెరిచి గటగటా మంచి నీళ్లు తాగాడు. మార్గశిర మంచులో కూడా గ్రీష్మ తాపం.. చెమటతో ఒళ్లంతా తడిసి ముద్దయిపోయింది. అలాగే సోఫాలో కూలబడ్డాడు.. తల వెనక్కి వాల్చి కళ్లు మూసుకున్నాడు.. చీకటి.. ఆ చీకట్లో ఓ మేడ.. ఇంట్లో హాహాకారాలు.. గాజుల గలగలలు.. మువ్వల సవ్వడి.. తూగుటుయ్యాల ఊగుతూ.. కిటికీ రెక్కలు కొట్టుకుంటూ.. తలుపు కిర్రున తెరుచుకుంటూ.. ముక్కు పుటాలు అదిరే గబ్బిలాల కంపు.. ఎలుకల కదలికలు.. సాంబ్రాణి వాసన..ఒక్కసారిగా తల విదిలించి.. కళ్లు తెరిచాడు.. ఎదురుగా.. పనమ్మాయి.. నవ్వుతోంది.. తెరలు తెరలుగా! ‘‘అక్కడ ఇల్లు కనిపించిందా నీకు? అంటే నువ్వు నా వాడివే అన్నమాట. ఆ రోజు కట్నం చాల్లేదని పెళ్లి పీటల మీద నుంచి నువ్వు వెళ్లిపోయేసరికి .. అవమానంతో ఒంటికి నిప్పంటించుకున్నా. ఒంటిని కాలుస్తున్న ఆ మంటలను తట్టుకోలేక ఇల్లంతా పరిగెత్తా .. ప్చ్.. నాతో పాటు మా వాళ్లూ కాలి బూడిదైపోయారు తెలుసా?’’ అంటూ బాధగా గోడకు ఒరిగింది ఆమె...‘‘ఎప్పటికైనా నువ్వొస్తావని తెలుసు. అందుకే ఆ ఇల్లు వదిలిపెట్టలేదెవ్వరం! ఇన్నేళ్లకు వెదుక్కుంటూ వచ్చావ్. రా.. మనింటికి పోదాం...’’ అంటూ ధీరజ్ చేయి పట్టుకుంది. చేతి నిండా గాజులు.. పరీక్షగా చూశాడు ఆమెను.. పెళ్లి కూతురు అలంకరణలో ఉంది.‘‘హేయ్ .. ఎవరు నువ్వు? నా చేయి వదులు..’’ అంటూ చేయి విదిలిస్తున్నాడు. గొంతు పెగలట్లేదు.. చేయి కదలట్లేదు.. అరుస్తున్నాడు.. విదిలిస్తున్నాడు.. పట్టు బిగిస్తూ నవ్వుతోంది ఆమె.. గట్టిగా.. క్రూరంగా! సరస్వతి రమ -
ఆత్మ అలజడి
మహేంద్ర, ధీరజ్, పావని ముఖ్య తారలుగా ధీరజ్ (ఎమ్. రమేశ్కుమార్) దర్శకత్వంలో డా. బి. మహేంద్ర నిర్మించిన చిత్రం ‘ఆడో ఎదవ’. రమేశ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఒక ఆత్మ మరో జీవిలోకి వెళ్లి చేసిన అలజడితో తెరకెక్కిన చిత్రమిది. వినోదాత్మకంగా ఉంటుంది. కథ డిమాండ్ మేరకు మహేంద్ర భారీ బడ్జెట్తో నిర్మించారు’’ అన్నారు. ‘‘దర్శకుడు నాకు చెప్పిన కథని పది రెట్లు ఎక్కువగా తెరమీద చూపించబోతున్నారు. ఇందులో 4 ఫైట్లు భారీ ఖర్చుతో తెరకెక్కించాం. ‘జబర్దస్త్’ టీమ్ చక్కటి వినోదం పంచారు. కిషన్ కవాడియా ఇచ్చిన పాటలు బాగున్నాయి. తెలుగులో ఇప్పటి వరకూ రాని కొత్త కథతో సినిమా తీశాం. త్వరలోనే పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు మహేంద్ర. ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్. ప్రకాష్రావు, సహ నిర్మాతలు: సత్విక్ తంగెళ్ల, అక్కరమణి కొండబాబు, వానపల్లి శ్రీనివాస్.