free power
-
కాంగ్రెస్ Vs బీఆర్ఎస్.. రేవంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటకలో విజయం సాధించడంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో కేసీఆర్ టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. ఇక, తాజాగా తెలంగాణలో ఉచిత కరెంట్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా, రేవంత్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ సర్కార్, ఫ్యామిలీని టార్గెట్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లో ‘కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా.. మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే’ అని తెలిపారు. 🔥కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా… మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. 🔥వచ్చేది కాంగ్రెస్… రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్.#ByeByeKCR pic.twitter.com/KERC60owzn — Revanth Reddy (@revanth_anumula) July 12, 2023 వ్యవసాయానికి 24 గంటల కరెంట్.. ఇక, అంతకుముందు కూడా రేవంత్ తెలంగాణలో ఉచిత కరెంట్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘తెలంగాణలో 95% రైతులు మూడెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు. ఒక ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు మూడు గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉంటే చాలు. టోటల్గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే స్లోగన్ తీసుకొచ్చిండు. ఉచిత కరెంట్ పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతుండు. ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు. దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని చెప్పేసి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా చెబుతున్నం’ అని అన్నారు. దీంతో, రేవంత్ కామెంట్స్ పొలిటికల్ హీట్ను పెంచాయి. కాంగ్రెస్కు కవిత కౌంటర్.. మరోవైపు.. రేవంత్ కామెంట్స్పై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రైతుకు వ్యవసాయం మంచిగా ఉండాలంటే నీళ్లు, కరెంటు ఉండాలి. కేసీఆర్ పెట్టిన రైతుబంధు పధకాన్ని ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఓ బోగస్. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే తప్పు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తే తమకు కళ్ళ మంట ఎందుకంటూ ఫైరయ్యారు. కాంగ్రెస్ పాలనలో అర్ధరాత్రి కరెంటు వస్తే అనేక మంది రైతులు చనిపోలేదా అంటూ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘నాకు తెలంగాణ సీఎం కావాలనే ఆశ లేదు’ -
‘ఫ్రీ’ ఫైర్.. అగ్గేసిన కాంగ్రెస్.. అందుకున్న బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగింది. తెలంగాణ రైతాంగానికి టోటల్గా ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్ మాత్రం విద్యుత్ సంస్థల నుంచి కమీషన్ల కోసమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు వేడి రాజేశాయి. అధికార బీఆర్ఎస్ రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమంది. తాము అమలు చేస్తోన్న రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతోందని, అందులో భాగంగానే రేవంత్రెడ్డి అమెరికాలో ఈ వ్యాఖ్యలు చేశారని విరుచుకుపడింది. పలువురు మంత్రులు, ఆ పార్టీ నేతలు రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావులు కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ధరణి ఎత్తివేస్తామని, ఉచిత విద్యుత్ తీసేస్తామని చెపుతున్న కాంగ్రెస్ పార్టీకి కరెంటు షాకులు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలకు నిరసనగా బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. దీంతో మంగళవారం నాడే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్లెక్కారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక విధానమంటూ లేదని, ఎవరికి తోచింది వారు చెబుతూ ప్రజలను గందరగోళ పరిస్థితుల్లోకి నెడుతున్నారని విమర్శించింది. రేవంత్ వ్యాఖ్యలు ఊహించని విధంగా వివాదాన్ని సృష్టించడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. పేటెంట్ మాదే.. బీఆర్ఎస్, బీజేపీల విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. రేవంత్ వ్యాఖ్యలు వైరల్ కావడం, బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించడంతో ఎదురుదాడికి దిగింది. నష్ట నివారణకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, మల్లురవి, అద్దంకి దయాకర్, షబ్బీర్అలీ, రైతు విభాగం నేతలు కోదండరెడ్డి, సుంకేట అన్వేష్రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్కౌశిక్ యాదవ్ తదితరులు రేవంత్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే రైతులని, రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని, రేవంత్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి మంత్రులు ఊరకుక్కల్లా మాట్లాడుతున్నారంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపేందుకే రేవంత్ అలా మాట్లాడారని, విద్యుత్ రంగంలో అవినీతిపై బహిరంగ చర్చకు మంత్రులు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇక ఉచిత విద్యుత్పై పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని పార్టీ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించగా, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు తమపై బురద జల్లుతున్నారని మాజీ ఎంపీ మల్లురవి విమర్శించారు. బీజేపీ తెచి్చన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు మద్దతిచ్చిన బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు. పార్టీ విధాన నిర్ణయాన్ని రేవంత్ ప్రకటించలేదంటూ, రైతులకు ఉచిత విద్యుత్కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. రైతు డిక్లరేషన్లో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. సత్యాగ్రహ దీక్షను నీరుగార్చే కుట్ర: రేవంత్ బీఆర్ఎస్ విమర్శల పర్వం, కార్యాచరణపై అమెరికాలో ఉన్న రేవంత్రెడ్డి తాజాగా స్పందించారు. రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన బీజేపీ కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ చేపట్టిన సత్యాగ్రహ దీక్షను నీరుగార్చేందుకు బీజేపీ బీ టీం అయిన బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఒక ప్రకటనలో విమర్శించారు. గాంధీ విగ్రహాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు సిద్ధమవుతున్న సమయంలో అసత్య, అసందర్భ అంశాన్ని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ చిల్లర హడావుడి చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న విషయం తేలడంతోనే బీఆర్ఎస్ మంత్రులు, నేతలు దు్రష్పచారం చేస్తున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో 12 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని, ఇందుకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్స్టేషన్ల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ బీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టించిందని, అందుకే తాను అమెరికాలో మాట్లాడిన మాటలు అవకాశంగా తీసుకుని కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ స్కీం అని, ఆ విషయంలో కాంగ్రెస్ను వేలెత్తి చూపే అర్హత బీఆర్ఎస్కు లేదని స్పష్టం చేశారు. అసలు రేవంత్ ఏమన్నారు..? అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించిన గ్రీట్ అండ్ మీట్లో ఎన్ఆర్ఐలు అడిగిన పలు ప్రశ్నలకు రేవంత్రెడ్డి సమాధానాలిచ్చారు. ఈ సమావేశంలోనే ఉచిత విద్యుత్పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మీరు అధికారంలోకి వస్తే తెలంగాణ రైతాంగానికి నిరంతరాయంగా ఇస్తున్న కరెంటును కొనసాగిస్తారా లేక రద్దు చేస్తారా? రైతుబంధు కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? అని ఓ ఎన్ఆర్ఐ ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన రేవంత్.. ‘తెలంగాణలో 95 శాతం రైతులు మూడెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులు. మూడెకరాలలోపు ఉంటే ఒక ఎకరానికి నీరు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాలకు ఫుల్లుగా నీరు పారాలంటే మూడు గంటలు సరిపోతుంది. టోటల్గా ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలనే స్లోగన్ తీసుకొచి్చండు. ఉచిత కరెంటు అని కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఇలాంటి ఉచితాలను అనుచితంగా స్వార్థానికి వాడుకోవద్దు. ఉచిత విద్యుత్ గురించి రైతు డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పాం..’ అని అన్నారు. -
రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత మంచి జోష్తో దూసుకెళుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఆత్మరక్షణలో పడేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్కు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టాయనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక సొంత పార్టీలోనే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతుంటే, మరికొందరు మాత్రం..అధికార బీఆర్ఎస్ రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. మొత్తం మీద రేవంత్ వ్యాఖ్యల పర్యవసానం తీవ్రంగానే ఉంటుందని, 24 గంటల విద్యుత్ ఇవ్వకపోతే నిలదీసి ప్రభుత్వం చేత ఇప్పించాల్సిన బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. అసలు 24 గంటల విద్యుత్తే అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించడం పార్టీకి నష్టం చేకూరుస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పలువురు కాంగ్రెస్ నేతలు ప్రెస్మీట్లు పెట్టి రేవంత్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధిష్టానం దృష్టికి..! అమెరికా వేదికగా ఉచిత విద్యుత్పైనా, అవసరమైతే సీఎంగా సీతక్క అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే యోచనలో సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి స్పందించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘రేవంత్ అమెరికా వెళ్లేంతవరకు బాగానే ఉన్నాడు. అక్కడకు వెళ్లిన తర్వాత బాలకృష్ణ, ఎర్రబెల్లి ప్రభావం పడి అలా మాట్లాడుతున్నాడేమో’ అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఈ విషయమై కొందరు సీనియర్లు అనధికారికంగా మాట్లాడుతూ.. ‘రేవంత్ పప్పులో కాలేస్తున్నాడేమో అనిపిస్తోంది. ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు యాధృచ్చికంగా ఒక్క పదం అన్నందుకే తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వ్యవసాయం దండుగ అన్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. రేవంత్రెడ్డి కూడా అదే బాటలో వెళ్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతులకు 7–9 గంటల విద్యుత్ ఇచ్చాం. అసలు ఉచిత విద్యుత్ గురించి ఎందుకు మాట్లాడాలి? 24 గంటలు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ను విమర్శించాలి కానీ ఇస్తామంటే వద్దనడమెందుకు? దీంతో పాటు కాంగ్రెస్సే రేవంత్, రేవంతే కాంగ్రెస్ అని ఆయన అంటున్నారు. సీతక్కను సీఎం చేస్తామంటున్నారు. పీసీసీ ప్రెసిడెంట్, సీడబ్ల్యూసీ, సీఎం పదవులన్నీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికేనా? అసలైన కాంగ్రెస్ వాదులకు ఏం పదవులు లేవా? ఇలాంటి విషయాలన్నీ రాహుల్గాంధీతోనే మాట్లా డుతాం.’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఉచిత విద్యుత్పై రేవంత్ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. కాంగ్రెస్ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు(మంగళ, బుధవారం) బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ టీకాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర ఆ పార్టీదని విమర్శించారు. ఇప్పుడు మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ బయటపెట్టుకుందని అన్నారు. దీన్ని తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి ఆయన పిలుపునిచ్చారు. చదవండి: రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు..: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఈరోజు, రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు భారత రాష్ట్ర సమితి పిలుపు 👉 తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు… pic.twitter.com/teXS5Vk1JF — BRS Party (@BRSparty) July 11, 2023 కాగా, అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం తానా మహాసభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో అధికంగా ఉన్నది మూడెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులేనని, ఎకరాకు సాగునీరు పారించాలంటే ఒక గంట, అదే మూడు ఎకరాలకు మూడు గంటలు చాలని అన్నారు. మొత్తం మీద ఒక రైతుకు ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కేవలం విద్యుత్ సంస్థల వద్ద కమీషన్కు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ అనే నినాదాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఉచిత కరెంట్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఉచితాన్ని అనుచితంగా వ్యవహరించవద్దని అన్నారు. మన స్వార్థానికి వాడుకోవద్దని అన్నారు. నాడు కాంగ్రెస్ పాలనలో ఇదీ కరెంటు దుస్థితి... మళ్లీ ఆ చీకటి రోజులు మనకొద్దు! 3 గంటల కరెంటు మాత్రమే ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని బొందపెడదాం... 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి రైతుల బాధలు తీర్చిన కేసీఆర్ పాలనకే జై కొడదాం!! pic.twitter.com/X64kv1gd3S — BRS Party (@BRSparty) July 11, 2023 -
ఉచిత విద్యుత్ ఎంతెంత భారం!
శివాజీనగర: సాధారణంగా ప్రతిసారి కర్ణాటక విద్యుచ్ఛక్తి నియంత్రణ కమిషన్ (కేఇఆర్సీ) ప్రజలకు షాక్ ఇస్తూ ఉండేది. అయితే ఇటీవలి నిర్ణయం వల్ల ఈ దఫా ప్రభుత్వానికి షాక్ కొట్టింది. కొన్ని వారాల కిందట ఖర్చులు, నిర్వహణ వ్యయం పెరిగినందున ప్రతి యూనిట్కు కనీసం 33 పైసల నుంచి 51 పైసలు పెంచింది. దీనిద్వారా మొత్తంలో గృహ వినియోగానికి అనుమతి ఇచ్చిన 14,090 మిలియన్ యూనిట్ విద్యుత్కు లెక్కించినపుడు సంవత్సరానికి సుమారు రూ.500 కోట్ల మేర వినియోగదారులపై భారం పడింది. ఈ భారం ఇప్పుడు ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. ఎందుకంటే నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ఇస్తామని సర్కారు ప్రకటించింది. కనుక కొత్త చార్జీల పెంపు భారం భరించటం సర్కారుకు అనివార్యమైంది. రూ.500 కోట్లకు పైనే కొత్త చార్జీల ప్రకారం రూ.500 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీంతోపాటు జీఎస్టీ తదితరాల కింద రూ.45 కోట్లు పన్నులు కట్టాలని అధికారులు అంచనా వేశారు. ప్రజలు ఉచిత విద్యుత్ పథకం కింద ఈ మొత్తాన్ని నేరుగా ప్రభుత్వమే భరించాల్సి వస్తుందని విశ్లేషించారు. ప్రతి ఏటా ఉచిత విద్యుత్కు రూ.500 కోట్ల నుంచి 740 కోట్ల వరకూ వ్యయమవుతుందని సర్కారు తెలిపింది. వరుసగా చార్జీల వడ్డింపులు గతంలో కేఈఆర్సీ వెనువెంటనే విద్యుత్ చార్జీలను పెంచుతూ వచ్చింది. ఇటీవల మే 12న ప్రతి యూనిట్కు సరాసరి 70 పైసలు పెంచుతున్నట్లు కేఇఆర్సీ ప్రకటించింది. అంతలోనే జూలై–సెప్టెంబర్, అక్టోబర్– డిసెంబర్కు అన్వయించే విధంగా మళ్లీ 33 పైసల నుండి గరిష్ట 51 పైసలు వరకు చార్జీల వాత పెట్టింది. ముందు రెండు త్రైమాసికాల్లో, బెస్కాం సవరించిన ప్రకారం ప్రతి యూనిట్ విద్యుత్పై రూ.1.01 పెరిగింది. దీనిద్వారా మొత్తం రూ.1.71 చొప్పున ప్రతి యూనిట్ విద్యుత్ వాడకంపై వడ్డించారు. 100 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు యూనిట్కు రూ.4.75 ఉండేది. 100 యూనిట్లు దాటితే యూనిట్కు రూ.7 అవుతుంది. ప్రభుత్వం ఉచితం పేరుతో విద్యుత్ సరఫరాను కుంటుపరచరాదని, ఇతర రంగాలపై దుష్ప్రభావం పడకుండా చూడాలని ఈ రంగ నిపుణులు పేర్కొన్నారు. -
వ్యవసాయ మీటర్లు భారం కాదు.. భరోసా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ను రైతన్నకు హక్కుగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ కొరత రాకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగంపై కచ్చితమైన లెక్కలు వచ్చేలా చర్యలు చేపట్టింది. అయితే ఉచిత విద్యుత్ పథకం కొందరికే అమలవుతుందని, రైతులే బిల్లులు చెల్లించాల్సి వస్తుందని కొందరిలో అపోహలు ఉన్నాయి. ఇవన్నీ అపోహలేనని, నిజాలు కావని అధికారులు చెబుతున్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల ఉపయోగాలే తప్ప రైతుకు ఎటువంటి భారం ఉండదని స్పష్టంచేస్తున్నారు. పైగా నాణ్యమైన విద్యుత్ను పొందేందుకు రైతుకు భరోసా ఇచ్చినట్లవుతుందని చెబుతున్నారు. రైతుపై పైసా భారం ఉండదు స్మార్ట్ మీటర్లు బిగించినప్పటికీ రైతుకు పైసా భారం పడదు. ఇప్పుడు అమలవుతున్నట్లుగానే అర్హులైన రైతులందరికీ ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ బిల్లు దగ్గర్నుంచి, మీటర్లు బిగించడానికి, వాటి మరమ్మతులకు అయ్యే ఖర్చు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. వినియోగించిన విద్యుత్కు రైతులు చెల్లించాల్సిన బిల్లు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా జమ చేస్తుంది. రైతులు ఆ బిల్లు సొమ్మును విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించాలి. దీనిద్వారా వారికి ఉచిత విద్యుత్ను హక్కుగా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. రైతుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డిస్కంలకు బకాయిలనేవి ఉండవు కాబట్టి కచ్చితంగా మెరుగైన సేవలు అందిస్తాయి. నాణ్యమైన విద్యుత్ మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా అవుతున్న విద్యుత్ నాణ్యత (లో వోల్టేజీ, అంతరాయాలు వంటివి లేకుండా) మెరుగుపడుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఉండాలన్నా, సబ్ స్టేషన్లపై లోడ్ ఎక్కువై లో వోల్టేజీ సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఎవరెవరికి విద్యుత్ అందుతుందో, ఏ రైతుకు ఏ కారణంగా విద్యుత్ అందడం లేదో తెలియాలన్నా ఈ మీటర్లతోనే సాధ్యమవుతుందని డిస్కంలు, ఇంధన శాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. అనధికార కనెక్షన్ల క్రమబద్ధీకరణ అనధికార, అదనపు లోడ్ విద్యుత్ కనెక్షన్లనూ కిలోవాట్కు రూ.1,200 చొప్పున డెవలప్మెంట్ చార్జీ, ప్రతి హెచ్పీకి రూ.40 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే వాటిని క్రమబద్ధీకరించి, మీటర్లు అందించి ఉచిత విద్యుత్ పరిధిలోకి తీసుకువస్తారు. ప్రస్తుత యజమాని పేరిట సర్వీసు కనెక్షన్ పేరు మార్చుకోవాలంటే పట్టాదారు పాసు పుస్తకం, భూ యాజమాన్య హక్కుపత్రం ఆధారంగా మార్చుకోవచ్చు. అవి అందుబాటులో లేకపోతే గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. వృథా ఉండదు 2020–21 ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో 26 వేల వ్యవసాయ కనెక్షన్లకు 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారని డిస్కంలు అంచనా వేశాయి. దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడీని చెల్లించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇదే జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 28 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించారు. తర్వాత 67.76 మినియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించినట్లు వచ్చింది. అంటే.. 2 వేల వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ తక్కువగా వినియోగించినట్లు తేలింది. దీనివల్ల ఇప్పటివరకు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పేరుతో చేస్తున్న అదనపు చెల్లింపులకు అడ్డుకట్ట పడింది. ఇదే విధంగా రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు 6 నెలల్లో మీటర్లు పెడితే వ్యవసాయ విద్యుత్కు చెల్లిస్తున్న దాదాపు రూ.10 వేల కోట్ల సబ్సిడీలో మూడోవంతు మిగులుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈమేరకు చర్యలు వేగవంతం చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించింది. -
AP: పేదోడి గూటికి ‘పవర్’
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన నిరుపేద దళితురాలు బలగ కామాక్షి భర్త చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందగా కుమారుడు బాలరాజు కిడ్నీ వ్యాధితో చనిపోయాడు. కాయకష్టం చేసుకొని మనవరాళ్లకు వివాహం చేసింది. గతంలో విద్యుత్ బిల్లులు కట్టలేక నానా అవస్థలు పడేది. ఇప్పుడు 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తో పాటు పింఛన్ కూడా అందిస్తుండటంతో తన జీవితంలో వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయని సంతోషంగా చెబుతోంది’’ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మీటేతాండలో ఆర్.భీమా నాయక్కు చిన్న ఇల్లు ఉంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ఆయన గతంలో నెలకు రూ.150 నుంచి రూ.250 వరకు కరెంటు బిల్లు కట్టేవారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందచేస్తుండటంతో మూడేళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కరెంట్ బిల్లుల కింద ఇప్పటి వరకు సుమారు రూ.8 వేలకుపైగా మిగలడంతో ఇతర అవసరాలకు ఉపయోగపడిందని చెబుతున్నాడు’’ ఫ్యాన్, రెండు బల్బులకు.. ఉచిత విద్యుత్తో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్ది మా జీవితాల్లో వెలుగులు నింపారు. ఒక ఫ్యాన్, రెండు బల్బులు వినియోగానికి ఇబ్బంది లేదు. పొదుపుగా వాడుకుంటూ నెలకు 200 యూనిట్లు వినియోగం దాటకుండా చూసుకుంటున్నాం. –దేవదాసు, భీమవరం, నంద్యాల జిల్లా పేదల ఇళ్లలో విద్యుత్ వెలుగులపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 2019 ఆగస్టు నుంచి నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల దాదాపు 22,54,596 మంది ఎస్సీ, ఎస్టీలకు మేలు చేకూరుతోంది. గత మూడేళ్లుగా నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించుకుంటున్న వారంతా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా విద్యుత్తు వెలుగులు పొందుతున్నారు. ఈ ఏడాది 17,44,562 ఎస్సీ కుటుంబాలకు, 5,10,034 ఎస్టీ కుటుంబాలకు ఉచిత కరెంటును ప్రభుత్వం అందచేసింది. పొదుపుగా వాడుతున్నాం ఉచిత విద్యుత్ పథకం ఎస్సీ, ఎస్టీలకు గొప్పవరం. గతంలో ప్రతి నెలా రూ.250కిపైగా బిల్లు చెల్లించే వాళ్లం. ఉచిత విద్యుత్ పుణ్యమా అని చార్జీలు చెల్లించే అవసరంలేదు. నెలకు 200 యూనిట్లు దాటకుండా కరెంటును పొదుపుగా వాడుకుంటున్నాం. –పి.భీమన్న, కర్నూలు జిల్లా పోలకల్ గ్రామం. హామీని నిలబెట్టుకున్నారు... కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేకునే నేను గతంలో కరెంటు బిల్లులు చెల్లించలేక ఇబ్బంది పడ్డా. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. –గిరి, నంద్యాల హరిజనపేట -
అడిగితేనే విద్యుత్ సబ్సిడీ ఇస్తాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఉచిత, సబ్సిడీ విద్యుత్పై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడిగే వారికి మాత్రమే ఉచిత లేదా సబ్సిడీ విద్యుత్ ఇస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి వస్తుందని చెప్పారు. ‘చౌక విద్యుత్ అనేది ఇప్పుడు ఢిల్లీలో ఐచ్ఛికం. అంటే, వినియోగదారుడు విద్యుత్ సబ్సిడీని కోరుకుంటేనే ఇక నుంచి ఉచిత లేదా రాయితీతో కూడిన విద్యుత్ను పొందుతాడు. సబ్సిడీ అవసరం లేదకునేవారు సాధారణ రేటుకే కరెంటు ఉపయోగించుకుంటామని ప్రభుత్వానికి తెలపాలి. దీనికి సంబంధించిన కార్యాచరణ త్వరలో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1 నుండి రాయితీతో కూడిన విద్యుత్ అడిగిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంద’ని కేజ్రీవాల్ వివరించారు. (చదవండి: వెనక్కి వెళుతున్న విమానంలా ఉంది) ప్రస్తుతం ఢిల్లీలోని వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఎటువంటి బిల్లు లేదు. నెలకు 201 నుంచి 400 యూనిట్ల విద్యుత్పై రూ. 800 సబ్సిడీ ఇస్తున్నారు. ఉచిత విద్యుత్, నీటి పథకాలతో కేజ్రీవాల్ ఢిల్లీలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. పంజాబ్లోనూ దీన్ని అమలు చేస్తామని ఆయన హామీయిచ్చారు. విద్యా, వైద్య రంగాల్లోనూ ఢిల్లీ సర్కారు మంచి ప్రగతి సాధించడంతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. (చదవండి: ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన) -
జలకళ.. కనెక్షన్ భళా!
కర్నూలు(రాజ్విహార్): వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంతో మెట్ట భూముల్లో ఉచితంగా బోర్లు వేస్తున్నారు. అంతేకాకుండా ఉచితంగా విద్యుత్ కనెక్షన్, మోటార్ కూడా ఇస్తున్నారు. దీంతో చిన్న, సన్నకారు రైతులకు జలకళ పథకం వరంగా మారింది. ఒకప్పుడు వర్షాధారంపై కనాకష్టంగా సంవత్సరానికి ఒక పంట పండించేవారు. నేడు సమృద్ధిగా నీరు ఉండడంతో మూడు పంటలు పండిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. 766 బోర్లలో సమృద్ధిగా నీరు జలకళ పథకం కింద రెండున్నర ఎకరాల్లోపు భూమి ఉన్న సన్నకారు రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి డ్వామా (జిల్లా నీటి యాజమాన్యపు సంస్థ) అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేశారు. సీనియారిటీ ప్రకారం జిల్లాలో 1100కు పైగా బోర్లు చేశారు. వాటిలో 766 బోర్లలో నీరు పడ్డాయి. దీంతో రెవెన్యూ డివిజన్ల వారీగా జాబితాను విద్యుత్ శాఖ కర్నూలు ఆపరేషన్స్ అధికారులకు అందజేశారు. దీని కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఆయా బోర్లకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంతోపాటు సరఫరా ఇవ్వాలని డ్వామా అధికారులు కోరారు. సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళిక వైఎస్సార్ జలకళ పథకం కింద వేసిన 766 బోర్లకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సన్నకారు రైతులకు చేదోడుగా నిలవడంతోపాటు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. జలకళ పథకం కింద వివిధ పనుల కోసం రూ.26,60,27,751 నిధులు కావాలని అంచనాలు తయారు చేసి పంపించారు. కర్నూలు టౌన్, కర్నూలు రూరల్, నంద్యాల, ఆదోని, డోన్ డివిజన్ల వారీగా కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, లెన్త్ ఆఫ్ లైన్, ఏబీ స్విచ్లు, ఇతర సామగ్రి కావాలని అడిగారు. మొత్తం 620కి పైగా ట్రాన్స్ఫార్మర్లకు రూ.3.80కోట్లు, 8,837 విద్యుత్ స్తంభాలకు రూ.1.59కోట్లు, 767 కిలో మీటర్ల విద్యుత్ వైరుకు రూ.2.26కోట్లు, 72.540 కిలో మీటర్ల విద్యుత్ వైరుకు రూ.39.70లక్షలు, ఇతర సామగ్రి, సివిల్ పనులు, లేబర్ చార్జీల కోసం రూ.9.25కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆమోదం లభించడంతో డ్వామా అధికారులు నిధులు విడుదల చేశారు. నాణ్యతతో పనులు ఉమ్మడి జిల్లాల్లో జలకళ కింద వేసి బోర్లకు కనెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ముఖ్యంగా మొదటి వేసిన బోర్లకు సీనియారిటీ ఆధారంగా విద్యుత్ సరఫరా అందిస్తూ వస్తున్నారు. మొదటి విడతలో రూ.2లక్షల లోపు నిధుల అంచనాలో ఉండే 71 బోర్లకు కనెక్షన్లు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కర్నూలు ఆపరేషన్స్ ఎస్ఈ నేతృత్వంలో పనుల నాణ్యతతో చేశారు. విడతల వారీగా పనులు వైఎస్సార్ జలకళ పథకం కింద 766 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని డ్వామా అధికారులు విన్నవించారు. రూ.26.60 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపగా ఆమోదం లభించింది. డ్వామా అధికారులు నిధులు చెల్లిస్తున్న మేరకు విడతల వారీగా పనులు పూర్తి చేసి, కనెక్షన్లు మంజూరు చేస్తున్నాం. – కె. శివప్రసాద్ రెడ్డి, ఎస్ఈ, కర్నూలు ఆపరేషన్స్, విద్యుత్ శాఖ నాడు వర్షాధారం.. నేడు సమృద్ధిగా జలం నడిపి వెంకయ్య స్వామి. ఓర్వకల్లు మండలం ఎన్. కొంతలపాడు గ్రామ వాసి. తనకున్న మూడెకరాల పొలంలో వర్షాధారంపై వివిధ పంటలు సాగు చేసేవాడు. ప్రకృతి సహకరిస్తేనే దిగుబడులు వచ్చేవి. లేదంటే అప్పుల కుప్ప మిగిలేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు దశ తిరిగింది. వైఎస్సార్ జలకళ పథకంతో పొలంలో ఉచితంగా 600 అడుగుల లోతు బోరు వేశారు. రెండు ఇంచుల నీరు పడడంతో విద్యుత్ అధికారులు రూ.2,61,229 వెచ్చించి ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు, విద్యుత్ వైర్లు అమర్చి కనెక్షన్ ఇచ్చారు. సర్వీసు నంబర్ 8322317000412ను విడుదల చేశారు. సమృద్ధిగా నీరు ఉండడంతో ఈయన కూరగాయల పంటలు పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. -
పంజాబ్ ప్రజలకు ఆప్ సర్కార్ శుభవార్త..
చండీగఢ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్తనందించింది. జూలై 1నుంచి ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు కరెంట్ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం.. నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ ప్రకటన చేసింది. ఈనెల 16న పంజాబ్ ప్రజలకు శుభవార్త అందించనున్నట్లు సీఎం భగవంత్ మాన్ ఇటీవల ప్రకటించారు అదే విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమమై దీనిపై చర్చించినట్లు సీఎం తెలిపారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం ఇప్పుడు మీరు అయిదేళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదు.. పంజాబ్ ప్రజలు రేపు పెద్ద ప్రకటన వినబోతున్నారు’’ అని ఆప్ ట్వీట్ చేసింది. అయితే ఢిల్లీలోని ఆప్ సర్కార్ కూడా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తోంది. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆప్ ఇచ్చిన హామీల్లో.. ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన నెలలోనే ఇచ్చిన హామీని నెలబెట్టుకుంది ఆప్ సర్కార్. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఇస్తోంది. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 92 చోట్ల విజయకేతనాన్ని ఎగరవేసింది. చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు -
మేము చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదు
-
ఉచిత విద్యుత్ ఘనత వైఎస్సార్దే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి పునరుద్ఘాటించారు. ఉచిత విద్యుత్ తాము అమలు చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్ను ఇస్తున్నట్లు వివరించారు. కరోనా వైరస్పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పించామని చెప్పారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాత సచివాలయం స్థానంలో ప్రార్థనా మందిరాలు పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు. 39.36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదని గుర్తుచేశారు. సంక్షేమానికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా రాష్ట్ర గీతం నిర్ణయించలేదని తెలిపారు. గందిమళ్ల నిర్వాసితులకు గజ్వేల్ పక్కన ఏడున్నరవేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదుల హత్య కేసులో ఇప్పటికే చాలామంది అరెస్టయ్యారని గుర్తుచేశారు. ఆ హత్య కేసులో తమ పార్టీ మండల అధ్యక్షుడు హస్తం ఉందని వార్తలు రావడంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని వివరించారు. పెట్రోల్ ధరలను అదుపు చేయడం తమ చేతుల్లో లేదని అన్నారు. -
‘సీఎం ఆదేశాలను పక్కదారి పట్టిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను విద్యుత్ అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఆరోపించారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహిస్తున్న క్షౌరశాలలకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వగా... అవగాహనలేమితో అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇతర కులాలు, మతాల వారు నడుపుతున్న క్షౌరశాలలు, బ్యూటీపార్లర్లను కూడా ఈ పథకం కింద నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా.. నాయీ బ్రాహ్మణులు నడుపుతున్న క్షౌరశాలలను మాత్రమే నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు అందలేదని జవాబిచ్చారని తెలిపారు. అధికారులు ఇలాగే వ్యవహరిస్తే క్షౌరవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న క్షురకులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నాయీ బ్రాహ్మణులు నడుపుతున్న క్షౌరశాలలను మాత్రమే ఉచిత విద్యుత్ పథకంలో చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని లింగం నాయీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
ఉచిత విద్యుత్పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ శాఖ, వైఎస్సార్ ఉచిత విద్యుత్పై సోమవారం సమీక్షించారు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ జి.సాయిప్రసాద్, ఏపీ ట్రాన్స్కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్తో పాటు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. (చదవండి: కౌలు రైతుల కష్టాలకు చెల్లు) రైతులకు అవగాహన కల్పించాలి: ⇒ వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చినంత మాత్రాన రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడబోదన్న విషయాన్ని గట్టిగా ప్రచారం చేయాలి. ⇒ మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యుత్ సరఫరాను తెలుసుకునే వీలు కలుగుతుంది. ⇒ దీని వల్ల ఎలాంటి అంతరాయం లేకుండా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ⇒ ఆ విద్యుత్ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ⇒ ఆ తర్వాత రైతులు అదే నగదును విద్యుత్ బిల్లు కింద డిస్కమ్లకు చెల్లిస్తారు. ⇒ మొత్తం ఈ ప్రక్రియలో రైతులపై ఏ మాత్రం భారం పడదు. వారికి ఇంకా నాణ్యమైన విద్యుత్ అందుతుంది. ⇒ ఇదే విషయంపై రైతులకు అవగాహన కల్పించాలి. ⇒ ఆ మేరకు అన్ని గ్రామ సచివాలయాల్లో పోస్టర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలి. ⇒ నాణ్యమైన విద్యుత్ను 9 గంటల పాటు, నిరంతరాయం సరఫరా చేయడం కోసమే మీటర్ల ఏర్పాటు అన్న విషయంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి. ⇒ ఆ ప్రక్రియలో భాగంగా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి కమిటీలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ⇒ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు మెసేజ్ క్లియర్గా ఉండాలి. ఎక్కడా అపోహలకు అవకాశం ఇవ్వకూడదు. నాణ్యత – ఐఎస్ఐ ప్రమాణాలు: ⇒ ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ల సేకరణ, ఏర్పాటులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యంఇవ్వాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ (ఈఈఎస్ఎల్)తో మాట్లాడండి. ⇒ రైతులు ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన మోటర్లు వినియోగించేలా అవగాహన కల్పించాలి. ⇒ అదే విధంగా కెపాసిటర్లు కూడా ఐఎస్ఐ ప్రమాణాలతో ఉండాలి. ఈ విషయంపై అధికారులు దృష్టి పెట్టాలి. శిక్షణనిచ్చాం: కాగా, మీటర్ల ఏర్పాటు వల్ల ఎలాంటి భారం పడబోదన్న విషయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ఇప్పటికే 14,354 లైన్మెన్లకు శిక్షణ ఇచ్చినట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. అన్ని ఫీడర్ల కింద వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు ఇప్పటికే 97.5 శాతం ఫీడర్లు పూర్తి కాగా, మిగిలినవి కూడా నవంబరు నాటికి పూర్తవుతాయని తెలిపారు. సౌర విద్యుత్: మరోవైపు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే బిడ్ డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయని, జ్యుడీషియల్ ప్రివ్యూ పూర్తి కాగానే టెండర్లు పిలుస్తామని అధికారులు పేర్కొనగా, వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశించారు. (చదవండి: విచారణతోనే న్యాయం) -
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో దేశ రాజధానివాసులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భారీ నజరానా ప్రకటించారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి ఉచిత విద్యుత్ వర్తింపచేస్తామని కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. 201 యూనిట్ల నుంచి 400 యూనిట్లలోపు విద్యుత్ వినియోగానికి విద్యుత్ బిల్లులపై 50 శాతం రిబేట్ను ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 200 యూనిట్లలోపు వినియోగానికి ఎలాంటి బిల్లు రాదని, పూర్తిగా ఉచితమని కేజ్రీవాల్ వెల్లడిస్తూ ఇది సామాన్యులకు మేలు చేసే చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. నగర విద్యుత్ వినియోగదారుల్లో 33 శాతం మంది ఉచిత విద్యుత్తో లబ్ధి పొందుతారని అన్నారు. కాగా ఢిల్లీలో మహిళలందరికీ ఉచిత మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం కేజ్రీవాల్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. -
సీఎం జగన్ మరో హామీని నిలబెట్టుకున్నారు!
సాక్షి, అమరావతి: రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను రేపటి నుంచి అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంపై వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ను కలిసి అభినందించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 9 గంటల విద్యుత్ ఇస్తానని చెప్పి మోసం చేశారని, కానీ సీఎం వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీని అమలు చేసి నిరూపించారన్నారు. రైతులకు గురువారం నుంచే పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 శాతం ఫీడర్ల ద్వారా రేపటి నుంచే పగటిపూట నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలని చెప్పారు. మిగిలిన 40 శాతం ఫీడర్ల మరమ్మతులకు రూ. 1700 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వచ్చే ఏడాది జులై నుంచి మిగిలిన 40 శాతం ఫీడర్ల నుంచి కూడా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. -
జగనన్నహామీతోరైతుల్లోధీమా
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులు పండించిన పంటలకు బీమా నేరుగా ప్రభుత్వం చెల్లిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో ఇచ్ఛాపురంలో చేసిన ప్రకటనతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతన్నలకు వెన్నుదన్నుగా బీమా పథకం ఉంటుంది. రైతుల్లో ఈ బీమాపై అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. అత్యధిక మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోకపోవడం, పంటలు వేసే సమయానికి బీమా సమయం దాటిపోవడంతో బీమా చేయించుకోకుండా నష్టపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందే సహాయం అరకొరగానే ఉంటోందని ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్లుగా ప్రకృతి విపత్తు సమయంలో రైతులకు నష్టాలే తప్ప ఆదుకునే వారే కరువయ్యారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 2,40,844 హెక్టార్లలో 6,11,086 మంది రైతులు వివిధ రకాల పంటలు వేశారు. వీరిలో 3 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల వల్ల 13,194 హెక్టారుల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. వీటిలో 702 హెక్టారుల్లో వరి, 293 హెక్టారుల్లో ప్రత్తి, 177 హెక్టారుల్లో చెరకు పంటల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనావేశారు. రబీలో మాత్రం తిత్లీ తుపాను కారణంగా వరి పంటతో పాటు పొగాకు పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం జిల్లా వ్యాప్తంగా 25 వేల మందికి పైగా పంటలపై భీమాలేక నష్టపోయినట్లు రైతు సంఘం నాయకులు చెప్తున్నారు. జగనన్న హామీతో రైతులకు భరోసా ప్రజాసంకల్పయాత్ర చేసి గ్రామగ్రామాన ప్రజా సమస్యలను తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల కష్టాలను దగ్గరగా చూసి చలించిపోయారు. కష్టాలను తీర్చేవిధంగా ఇచ్ఛాపురం సభలో ఆయన ఇచ్చిన హామీలతో రైతులు చెప్పలేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు పంటల సహాయంతో పాటు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండుగలా చేస్తారని రైతులు అన్నారు. జగన్ పాలనలో తమ బతుకులు తప్పకుండా మారతాయని వారంటున్నారు. పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వం చెల్లించడం, 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇవ్వడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. రైతు భరోసా పథకం కింద ఖరీఫ్, రబీ సీజన్ ముందు రైతులకు పంట ఖర్చులను రూ. 12,500 పెట్టుబడి సహాయం, ఉచిత బోర్లు, వడ్డీలేని పంట రుణాలను అందిస్తామనే జగన్ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి మంచి రోజులు వస్తున్నాయని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. రానున్నది రైతు రాజ్యమే అని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి మంచి రోజులు వస్తాయి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ప్రకటించిన హామీలు తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం ఉంది. వ్యవసాయానికి మంచి రోజులు రాబోతున్నాయి. పగటి పూట 9 గంటలకు ఉచిత విద్యుత్, ఉచిత బోర్లు వేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.– బిరుదుగడ్డ మురళి,రైతు, బుట్టాయగూడెం మండలం రానున్నది రైతు రాజ్యమే రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్రెడ్డి ప్రకటించిన వైఎస్సార్ భరోసా పథకం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఏడాదికి రూ. 12,500 చొప్పున రూ.50 వేలు నేరుగా రైతుకు ఇస్తామనడం సంతోషమే. రానున్నది రైతు రాజ్యమే. జగన్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.– అల్లూరి సోమేశ్వరరావు, రైతు,రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం -
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
-
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి 24 గంటలూ ఉచిత విద్యుత్ అందించడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మంగళవారం నుంచే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను ప్రయోగాత్మకంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే యాసంగి నుంచి వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తామని తెలిపారు. 11వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు డిస్కంలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మోటార్లకు పెట్టిన ఆటోస్టార్టర్లను రైతులు వెంటనే తొలగించాలని సీఎం కేసీఆర్ కోరారు. నోట్ల రద్దు పరిణామాలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం.. నరేంద్రమోదీ సర్కారు డీమానిటైజేషన్ చేపట్టి.. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నోట్ల రద్దు పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ వాయాదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. స్పీకర్ ఈ తీర్మానాన్ని తిరస్కరించారు. నోట్లరద్దుతో దేశ ఆర్థిక ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రైతులు, వ్యాపారులు, సామాన్యులు తీవ్రంగా నష్టపోయారని, ఈ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. -
ఉచిత విద్యుత్ నిర్ణయం వరం
కడప అగ్రికల్చర్: తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం వేంపల్లెలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఈ హామీని అమలు చేస్తామని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని చెప్పారు. జగన్ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మాటతప్పిందని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. అన్న వస్తే అంతా మేలు జరుగుతుంది వైఎస్ జగనన్న ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పటికే ఆయన ప్రకటించిన నవరత్నాలు అందరి మన్నలను పొందాయి. వేంపల్లెలో రచ్చబండ సందర్భంగా ఆయన ఇచ్చిన ఉచిత కరెంటు హామీ తప్పకుండా అమలవుతుంది. – వినయ్కుమార్, ఎస్సీ కాలనీ, పులివెందుల ఎంతో మేలు జరుగుతుంది ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇవ్వటం సంతోషంగా ఉంది. హామీలను అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. జగన్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇవ్వటం వల్ల ఎస్సీలు బాగు పడతారు. –ఎన్.పెంచలయ్య, మల్లేపల్లె, బ్రహ్మంగారిమఠం మండలం సంతోషంగా ఉంది ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ వరం. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం సంతోషకరం. దళితుల పక్షపాతి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి. –మర్రి సుబ్బన్న, పెద్దచెప్పలి దళితవాడ, కమలాపురం మండలం -
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న కేసీఆర్
-
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఉచిత విద్యుత్ ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డిదేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు శాసనసభ సాక్షిగా అంగీకరించారు. బుధవారం సభలో రైతు సమస్యలు, ఉచిత విద్యుత్పై చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఇచ్చిన ఉచిత విద్యుత్ విధానాన్నే తాము కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ సభలో మాట్లాడుతూ...‘రుణమాఫీని పూర్తిగా అమలు చేశాం. ఎవరికైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తాం. మాది రైతు ప్రభుత్వం, రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం. రూ.5వేల కోట్లతో ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ను అమలు చేసింది వైఎస్ఆరే. తడిచిన పత్తిని కొంటాం. మొన్న ఎన్నికల్లో మమ్మల్ని మేలు రకంగా, మిమ్మల్ని నాసిరకంగా గుర్తించారు. మళ్లీ అందరు ప్రజల్లోకి వెళ్లాల్సిందే.’ అని అన్నారు. ఉచిత విద్యుత్ దివంగత నేత వైఎస్ఆర్ ఘనతే.. -
పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ.. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎవరి కార్లకూ బుగ్గలు (సైరన్ లైట్లు) తీసేస్తామని ప్రకటించారు. దాంతో ఇక ముఖ్యమంత్రికి తప్ప వేరెవ్వరికీ బుగ్గ కార్లు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. శనివారం నాడు సమావేశమైన అమరీందర్ మంత్రివర్గం ఇంకా అనేక నిర్ణయాలు తీసుకుంది. వాటన్నింటినీ ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పంజాబ్నుంచి డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా తరిమేయడానికి వీలుగా ఒక స్పెషల్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. స్వాతంత్ర్య సమర యోధులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు రైతులకు ఉచిత విద్యుత్తును కొనసాగిస్తామన్నారు. రుణమాఫీ విషయాన్ని అంచనా వేసి, దాని అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇచ్చేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న డీటీఓలు, హల్కా ఇన్చార్జులు ఉండబోరని, ఆ రెండు వ్యవస్థలను రద్దుచేయాలని తమ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నదీ జలాల పరిరక్షణ కోసం అన్ని రకాల న్యాయపరమైన, పాలనాపరమైన అవకాశాలను చూస్తామన్నారు. పాత ప్రభుత్వ హయాంలో పెట్టిన తప్పుడు కేసులు, ఎఫ్ఐఆర్లపై విచారణకు ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. నిర్దోషులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. My cabinet has decided to rid the state of VIP culture. All beacon lights to be removed from vehicles of Ministers, MLAs and bureaucrats. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 We have also decided to set up a Special Task Force to crack down on drugs and wipe them out from Punjab. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 No more DTOs, no more Halqa Incharges to harass and bleed my people. My cabinet has decided to abolish both. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 We have decided to constitute a Group Of Experts to assess and propose farm debt waiver ways in 60 days. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 We will continue to give free power to the farmers of Punjab and bring our agriculture back on track. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 My government will pursue all legal and administrative options to protect the waters of Punjab in the SYL canal issue. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 Will set up a Commission Of Enquiry to probe false cases and FIRs done by the previous govt and ensure justice to all innocent. — Capt.Amarinder Singh (@capt_amarinder) 18 March 2017 -
భారం సర్కారుదే
♦ ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ♦ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తాం ♦ కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.. నీటి పారుదల శాఖకు ప్రతినెలా రూ.2,100 కోట్లు ♦ ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న రైతులను చంద్రబాబు రాచిరంపాన పెట్టారు ♦ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతారామ ఎత్తిపోతలు.. శరవేగంగా మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించాలని అధికారులకు సూచన ♦ సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించి తీరుతామన్నారు. గురువారం కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. రైతులను ఆదుకోవడం కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమని పేర్కొన్నారు. ప్రాజెక్టులకు ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నామని.. అందులో ప్రతి నెలా రూ.2,100 కోట్ల చొప్పున నీటి పారుదల శాఖకు జమ చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరిన రైతులను చంద్రబాబు ప్రభుత్వం రాచిరంపాన పెట్టిన పరిస్థితిని ప్రజలు చూశారని.. అలాంటి పాలకులను తిరస్కరించారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందివ్వడంతో పాటు సాగునీరు అందించడం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని, దీనికి జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. ఇరు రాష్ట్రాల రైతులూ బాగుండాలి తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ ద్వారా సముద్రంలోకి పోయే నీటిని సమర్థంగా వినియోగించుకోగలుగుతామని కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి ఏటా 4,500 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ పూర్తయినా.. వెయ్యి టీఎంసీలలోపే నీటిని వాడుకోగలమని, మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్కే వెళుతుందని చెప్పారు. సముద్రంలోకి వృథాగా వెళుతున్న నీటిని వినియోగించుకునేలా ఏపీ ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు.ఇరు రాష్ట్రాల రైతులూ బాగుండాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టుతో 320 మెగావాట్ల విద్యుత్ ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ ప్రాజెక్టులను సమీకృతం చేసి రూపొందించిన సీతారామ ఎత్తిపోతల పథకాన్ని భవిష్యత్తులో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన డిజైన్లను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం దుమ్ముగూడెం వద్ద నిర్మించిన బ్యారేజీ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి సీతారామ ప్రాజెక్టును నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత బ్యారేజీకి 200 మీటర్ల కింద మరింత ఎత్తుగా బ్యారేజీ నిర్మించి మొత్తం ఖమ్మం జిల్లా అవసరాలు తీర్చేలా సాగునీటి వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. దానివల్ల దాదాపు 22 టీఎంసీల నీరు నదిలోనే నిల్వ ఉండటంతో పాటు.. దాదాపు 31 కిలోమీటర్ల వరకు నదిలో నీరు నిలుస్తుందని, ఎలాంటి ముంపు లేకుండా ఆ నీటిని వాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ డిజైన్ వల్ల దాదాపు 320 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కూడా చేసుకోవచ్చన్నారు. భవిష్యత్తులో కృష్ణా నదిలో జలాలు లేకున్నా... ఈ ప్రాజెక్టు ద్వారా ఆ జిల్లా వ్యవసాయానికి ఢోకా ఉండని పరిస్థితి తేవాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక, అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. శరవేగంగా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే తెలంగాణ రైతులకు అంత ప్రయోజనం చేకూరుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులు చేస్తున్న ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు అమర్పాల్సింగ్, రామకృష్ణారావు, రజనీశ్ చౌహాన్లతో ఇదే సమీక్షలో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా ఎల్అండ్టీ ప్రతినిధులు మేడిగడ్డ నిర్మాణ మెథడాలజీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 24 నెలల సమయంలో బ్యారేజీ నిర్మాణం చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళికను అందులో పేర్కొన్నారు. బ్యారేజీతో పాటు నదికి ఇరువైపులా మట్టికట్ట కట్టే ప్రాంతాలను కూడా ఖరారు చేశారు. బ్యారేజీ పూర్తయ్యే కన్నా ముందే పంప్హౌస్ల నిర్మాణం పూర్తి చేసి నీటిని లిఫ్ట్ చేయాలని ఈ సందర్భంగా వారికి కేసీఆర్ సూచించారు. ఈ సమీక్షలో మంత్రి జగదీ్శ్రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పాలనకు మానవీయతను అద్దిన జననేత
ఒక పాలకుడు భౌతికంగా దూరమై ఆరేళ్ళు గడిచినా ప్రజల గుండెల్లో ఆయన సజీవంగా ఉండడం ఇటీవల కాలంలో సాధ్యమేనా? ఆ పాలకుని పాలన ముగిసినా... ఆయ నను ఇంకా గుర్తుంచుకో వడం ఈ రోజుల్లో జరిగే పనేనా? ప్రజలు ఎందుకు ఆయనను మరిచిపో కుండా నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నారు? ప్రజల జీవితాలతో మమేకమైన ఆయనే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రజాకంటక పాలనకు విరుగు డుగా జనరంజక పాలనను అందించి, పేదలు, బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన జననేత వైఎస్. ఆయనకు ముందు వెనుక పాలనను చూస్తే తప్ప డాక్టర్ వైఎస్ తెలుగు ప్రజలపై వేసిన ప్రభా వం ఏమిటో స్పష్టం కాదు. పేదోడికి గూడు కావాలంటే అధికార పార్టీకి నిరంతరం కొమ్ముకాస్తే తప్ప ఇంటికి గతిలేని దిక్కు మాలిన పాలన అది. రోగం వచ్చినా, మంచి చదు వులు చదువుకోవాలన్నా పేదలకు ఎటువంటి భరోసా ఇవ్వలేని పాలకులున్న రోజులవి. చేతి వృత్తులు కునారిల్లి, వ్యవసాయం దండుగ మారిగా మారిన రోజులవి. అంతెందుకు కరెంట్ బిల్లులే షాక్ కొట్టే ‘స్వర్ణాంధ్ర’ పాలన అది. పేదలపై కనికరం లేని ‘పారదర్శక’ పాల నది. రైతులు, నేతన్నలు, కూలీలు వలసబాట పట్టి తమ ప్రాణాలు మిగుల్చుకున్న రోజులవి. ఒక సామాజిక పింఛను, తెల్ల రేషన్ కార్డు, బలహీన వర్గాల ఇల్లు.. ఇదీ అప్పట్లో పేదల కోర్కెల చిట్టా. నిరుపేదల జీవితాలలో నిరంతరం దోబూచులాడే ఆరోగ్య సమస్యలు,ఆర్థిక ఇబ్బం దులు విని చలించిపోయిన కరుణామూర్తి డాక్టర్ వైఎస్. పేదల నోటికి ‘ఐదేళ్ళు’ అందివచ్చిన పాలనను అందించి, మళ్ళీ మరో ఐదేళ్ళు అధికారంలో కొనసాగే నైతిక తను సొంతం చేసుకున్న పాలకుడాయన. నూటికి ఎనభైశాతం మంది ఆధారపడిన వ్యవసాయాన్ని గాడిలో పెడితే తప్ప గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాదని నమ్మి అక్కడ నుంచే చికిత్సను ప్రారంభించారు. రైతాంగానికి ఉచిత విద్యుత్, మహిళలకు పావలావడ్డీకే రుణాలు, విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్, రెండు రూపాయలకే కిలో బియ్యం, బలహీనవర్గాలకు ఇందిరమ్మ ఇళ్ళు, వికలాంగులకు, వృద్ధులకు వృద్ధాప్యపు పింఛన్లు తదితర సంక్షేమ పథకాలతో పాటు జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి దీర్ఘకాలిక పథకాలన్నింటికి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం దాకా వైఎస్ జరిపిన పాదయాత్ర సమయంలో వెలుగులోకి వచ్చిన పేదల కష్టాలు కన్నీళ్ళే కారణం. పదోతరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నా పై చదువులకు ఆర్థికస్తోమత లేనందున నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన ఒక విద్యార్థి రైల్వే కూలిపను లకు వెళ్తున్న విషయం వైఎస్ను కదిలించిన ఫలితమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. అలాగే మైక్రోఫై నాన్స్ కంపెనీల ఆగడాలనుంచి తమను కాపాడా లని గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామ మహిళలు మొరపెట్టుకున్నప్పుడు వైఎస్ మదిలో మెదిలిన పథకమే డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీతో రుణ కల్పన. ఏవిధంగా నిరుపేదలకూ ఖరీదైన వైద్యాన్ని అందించగలమనే ఆలోచన నుంచి పుట్టిందే రాజీవ్ ఆరోగ్యశ్రీ. తెల్ల రేషన్ కార్డున్న ప్రతి నిరుపేదా నయాపైసా ఖర్చుపెట్టకుండా తమను తాము రక్షిం చుకునే భరోసాను కల్గించారాయన. ప్రపంచ బ్యాంక్ షరతుల నడుమ ప్రజలకు ఆమోదయో గ్యమైన పాలన అందించడం, అందులోనూ మాన వీయతతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడం ఒక్క డాక్టర్ వైఎస్కే చెల్లింది. అందుకే ఆయన లేని లోటును జీర్ణించుకోలేని పేద గుండెలు వందల సంఖ్యలో ఆగిపోయాయి. ప్రాంతాలతో పనిలేకుండా, కాలంతో నిమిత్తం లేకుండా, ఎప్పటికీ డాక్టర్ వైఎస్ ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న పాలకుడే. (జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా) వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు 9553750001 - బుర్రా విజయశేఖర్ -
కేంద్రంతో ఆప్ కయ్యం..!
- ఢిల్లీ అవినీతి నిరోధక చీఫ్గా చతుర్వేది! - నిర్ణయం తీసుకోనున్న ఆప్ సర్కారు - ఎయిమ్స్ సీవీఓ పదవి నుంచి చతుర్వేదికి - గతంలో ఉద్వాసన పలికిన మోదీ సర్కారు న్యూఢిల్లీ : అధికారంలోకి వచ్చి 24 గంటలైనా కాకుండానే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సర్కారు ఎన్డీయే ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వింది. ఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) చీఫ్ విజిలెన్స్ అధికారి(సీవీవో)గా పనిచేసిన సంజీవ్ చతుర్వేదిని ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ చీఫ్గా తీసుకురావాలనుకుంటున్నట్లు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. సంజీవ్ చతుర్వేదిని అతని నియామక తీరుపై వచ్చిన అభ్యంతరాలతో ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగం నుంచి అర్ధంతరంగా తొలగించింది. చతుర్వేది నియామక తీరు సరైంది కాదని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీఓపీటీ)కి ప్రస్తుత కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా లేఖ రాయటంతో, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చతుర్వేదిని తప్పించారు. ఆ సందర్భంలో చతుర్వేదిని ఆప్ పూర్తిగా సమర్థించింది. ఇప్పుడు ఆయనను ఏసీబీ చీఫ్గా నియమిస్తే ఆ విభాగం వంద రెట్లు బలపడుతుందని సిసోడియా అన్నారు. ఈ దిశగా ఆప్ సర్కారు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఆప్ను గెలిపించింది ఆర్ఎస్ఎస్సే బీజేపీ నినాదమైన ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’లో భాగంగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపునకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కృషి చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఆరెస్సెస్ దీర్ఘకాలిక ప్రణాళికలో కేజ్రీవాల్ కూడా భాగస్వామేనని ఆయన గురువారం అన్నారు. అన్నాహజారే ఉద్యమం వెనుక సంఘ్ పాత్ర ఉందని గతంలో దిగ్విజయ్ ఆరోపించారు. ‘‘అన్నా ఉద్యమం వెనుక సంఘ్ ఉందని నేనన్నప్పుడు అంతా నన్ను పిచ్చివాడన్నారు. చివరకు నేనన్నదే నిజమైంది. ఇప్పుడు కూడా నేను చెప్పిందే నిజం’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి హామీలు ఎవరైనా ఇస్తారా? ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తు సరఫరాపై నూటికి నూరు శాతం ఆధారపడే ఢిల్లీలో విద్యుత్తు బిల్లులను తగ్గిస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇవ్వటంపై ప్రధాని నరేంద్రమోదీ విస్మయం వ్యక్తం చేశారు. సంప్రదాయేతర ఇంధన వనరుల సదస్సులో ఆదివారం మాట్లాడుతూ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాజకీయ పార్టీలు ఉచిత విద్యుత్తు వంటి హామీలు ఇస్తున్నాయని, ఇలాంటి హామీల గురించి ప్రజలు ఒకసారి ఆలోచించాలని ఆయన అన్నారు. ఢిల్లీలో ఆప్ హామీలను పరోక్షంగా ప్రస్తావిస్తూ రైతులకు నీటి బిల్లులు పెరిగి పోవటానికి ప్రధాన కారణం విద్యుత్ భారమేనని.. రైతుల సమస్యలకు కారణం ఏమిటన్నది రాజకీయ నేతలు వాస్తవంగా ఆలోచించాలని.. పైగా విద్యుత్ కోసం పూర్తిగా ఇతర రాష్ట్రాలపై ఆధారపడే చోట ఇలాంటి హామీలు ఇబ్బందికరంగా మారతాయని మోదీ అన్నారు. మోదీ వ్యాఖ్యలపై ఆప్ వెంటనే స్పందించింది. తాము ప్రధాని మాటలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడబోమని, ఢిల్లీకి కొరత లేకుండా విద్యుత్ సరఫరా చేయటంలో మోదీ సహకరించాలని ఆప్ నేత అశుతోష్ కోరారు. -
ఉచిత విద్యుత్ వద్దని రాసివ్వాలి..!
-
ఉచిత విద్యుత్ వద్దని రాసివ్వాలి..!
* సోలార్ పంపుసెట్ల మంజూరుకు విద్యుత్ శాఖ మెలిక * సోలార్ పంపు సెట్లు తీసుకోవాలంటూ రైతులపై అధికారుల ఒత్తిడి * ఇక ఉచిత విద్యుత్ కోరబోమంటూ హామీ పత్రం ఇవ్వాలంటూ షరతు * రైతుల్లో సంశయం.. సోలార్పంపు సెట్లు తీసుకోవాడానికి వెనుకంజ * ఖరీఫ్ కల్లా 6 లక్షల పంపుసెట్లు బిగించాలని అధికారులపై ఒత్తిడి * లేదంటే కేంద్రం ఇచ్చే నిధులు మురిగిపోతాయని సర్కారు తొందర * సోలార్ సెట్లతో ఉచిత విద్యుత్ భారం సగం తగ్గుతుందనే యోచన * 8,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపుతో రూ. 4,000 కోట్ల ఆదా అంచనా * ప్రయోగాత్మకంగా పరిశీలించకుండా అంటగట్టడం సరికాదంటున్న రైతు సంఘాలు సాక్షి, హైదరాబాద్: సోలార్ పంపుసెట్లు కావాలా? అయితే మీరు ఉచిత విద్యుత్ పథకం నుంచి తప్పుకోవాలి! శాశ్వతంగా సౌర వినియోగంపైనే ఆధారపడాలి. దీనికి కట్టుబడి ఉన్నామని ముందే హామీ పత్రం రాసివ్వాలి. ఆ తర్వాత సాంకేతిక లోపం వచ్చినా.. ఇతరత్రా సమస్యలొచ్చినా మళ్ళీ ఉచిత విద్యుత్ కోరబోమని స్పష్టం చేయాలి. విద్యుత్ శాఖ పెట్టే కొత్త మెలిక ఇది! వీలైనంత త్వరగా రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ పంపుసెట్లను సౌర విద్యుత్ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల భారీగా విద్యుత్ ఆదా అవుతుందని సర్కారు భావిస్తోంది. అయితే ముందే హామీ పత్రాలు ఇచ్చేందుకు రైతులు సంశయిస్తున్నారు. ఇబ్బందులు ఎదురయితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సోలార్ పంపుసెట్లకు ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. సాధ్యమైనంత వరకూ రైతులను ఒప్పించి, సోలార్ పంపుసెట్లు అమర్చాలని ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. మొత్తం మీద వచ్చే ఖరీఫ్ నాటికి మొత్తం 6 లక్షల సోలార్ పంపుసెట్లను అమర్చాలని సంప్రదాయేతర ఇంధన వనరులు, పునరుత్పాదన సంస్థ (నెడ్క్యాప్) కంకణం కట్టుకుంది. తొలుత కొత్త కనెక్షన్లకే సోలార్ పంపుసెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆశించిన మేర రైతులు ఆసక్తి కనబరచడం లేదు. 13 జిల్లాల్లో ఇప్పటికే 2.5 లక్షల మంది కొత్త కనెక్షన్ల కోసం వేచి చూస్తున్నారు. వీళ్ళంతా అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్నారని పంపిణీ సంస్థలు చెప్తున్నాయి. 8 వేల మిలియన్ యూనిట్ల పొదుపు అంచనా... రాష్ట్రంలో 8,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ను పొదుపు చేసే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. దీనివల్ల రూ. 4,000 కోట్లు ఆదా చేయవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 13.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు అధికారికంగా ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ వినియోగం ఏటా 11,000 మిలియన్ యూనిట్ల వరకూ ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజుకు ఏడు గంటలు పంపుసెట్లకు విద్యుత్ ఇచ్చినా.. ఈ మొత్తం 8,000 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం లేదు. మిగిలిన 3,000 మిలియన్ యూనిట్లు అనధికారికంగా వాడుతున్న పంపుసెట్ల వల్ల ఖర్చవుతోందని భావిస్తున్నారు. మీటర్లు, చిప్లను అమర్చడం ద్వారా ఈ విద్యుత్ను ఆదా చేయవచ్చనేది పంపిణీ సంస్థల యోచన. ఇక రాష్ట్రానికి ఇప్పటి వరకూ 6 లక్షల సోలార్ పంపుసెట్లు మంజూరయ్యాయి. వీటిని వినియోగంలోకి తెస్తే, దాదాపు 4,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. దీంతో వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్లో 7,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ను పొదుపు చేయవచ్చని భావిస్తున్నారు. ఉచిత విద్యుత్కు దశల వారీగా మరిన్ని కోతలు... దీన్ని ఏడాదిలో అమలు చేస్తే, ఉచితంగా ఇచ్చే విద్యుత్ కేవలం ఏటా 4,000 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంటుంది. వీటిని కూడా దశల వారీగా తగ్గించడం సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. తొలి దశలో మీటర్లు అమర్చడం, ఆ తర్వాత ఉచిత విద్యుత్ను పరిమిత యూనిట్లకే కుదించడం తదుపరి అంకాలుగా అధికారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని చెప్తున్న ప్రభుత్వం.. కొనుగోలు విద్యుత్కు రోజుకు రూ. 11.5 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు స్పష్టం చేసింది. పీక్ అవర్స్లో యూనిట్ 6 రూపాయల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. ఈ కొనుగోలు విద్యుత్ను, సంస్థ ఉత్పత్తి చేసే విద్యుత్ను కలుపుకుంటే, యూనిట్కు దాదాపు రూ. 5 వరకూ ఖర్చవుతోంది. ఇందులో రాబడి తీసేస్తే యూనిట్కు 1.75 వరకూ నష్టం వస్తోంది. నష్టపోయే విద్యుత్ మొత్తం వ్యవసాయ విద్యుత్ను తగ్గించడం ద్వారా పూడ్చుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా చెప్తున్నారు. నిధులు మురిగిపోతే కేంద్రానికి సంజాయిషీ ఇవ్వాలి... సోలార్ పంపుసెట్ల కోసం అధికారులు ఊరూ వాడా తిరిగినా రైతుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటి వరకూ ఈ కసరత్తు చేశారు. పంపిణీ సంస్థలపై తీవ్ర ఒత్తిడి తేవడంతో సోలార్ పంపుసెట్లు తీసుకోవాలని విద్యుత్ సిబ్బంది బలవంతం చేస్తున్నారు. కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంజూరు చేసిన సోలార్ పంపుసెట్ల నిధులు ఏడాదిలోగా ఖర్చు పెట్టాలి. నిధులు మురిగిపోతే సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందని నెడ్క్యాప్ ఆందోళన చెందుతోంది. నిరంతర విద్యుత్ సందర్భంగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా సోలార్ పంపుసెట్లు అమర్చడంలో ముందుకెళ్ళలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్టుగా కేంద్రం భావించే ప్రమాదం ఉంది. ఈ కారణంగా రైతులపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారని క్షేత్రస్థాయి నివేదికలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో సోలార్ పంపుసెట్ల వినియోగంపై ఎలాంటి ప్రయోగాత్మక ఫలితాన్ని చూపకుండానే అంటగట్టడం సరికాదని రైతు సంఘాలు అంటున్నాయి. ప్రైవేటుగా అమర్చిన సోలార్ పంపుసెట్లు 100 అడుగులకు మించి నీరు పైకి తేలేకపోతున్నాయని వారు చెప్తున్నారు. గుజరాత్లో విజయవంతమైనట్టు ప్రభుత్వం చెప్తున్నా.. రైతు సంఘాలను అక్కడికి తీసుకెళ్లి చూపించలేదని, వాస్తవాలు ఎలా తెలుస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. -
మొన్న రైతులు.. ఇప్పుడు దళితుల వంతు
-
దళితులపై కరెంటు దెబ్బ
ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్కు బాబు సర్కారు మంగళం! 2011 నుంచి వాడుకున్న ఉచిత విద్యుత్తుకూ బిల్లులు వసూలు ఎస్సీ, ఎస్టీలని నిరూపించుకోవాలని హుకుం.. కుల ధృవీకరణ తెమ్మంటూ మెలిక సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దళితులు బిల్లులు కట్టని 4 వేల కనెక్షన్లు కట్ ఉన్నపళంగా వేల రూపాయలు ఎలా కడతామంటూ దళితుల ఆవేదన సాక్షి, హైదరాబాద్: మొన్న రైతులు.. ఇప్పుడు దళితుల వంతు. ఉచిత విద్యుత్ సౌకర్యం నుంచి తొలగింపునకు గురవుతున్న వర్గాలివి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కరెంటు బిల్లుల కొరడాకు విలవిల్లాడుతున్న నిరుపేద వర్గాలివి. కొన్నేళ్లుగా వాడుకుంటున్న ఉచిత విద్యుత్కు బిల్లులు కట్టాలని ఇటీవల రైతులకు వేలల్లో బిల్లులు పంపిన సర్కారు.. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలపై ఇదే నిర్దయ ప్రదర్శిస్తోంది. వారి ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడుతోంది. 2011 నుంచి వాడుకున్న విద్యుత్తుకు ఒక్కసారే వేలల్లో బిల్లులు పంపుతోంది. వారు షాక్ నుంచి తేరుకునేలోపే కనెక్షన్ కట్ చేస్తోంది. ‘అసలు మీరు దళితులేనా?’ అని ప్రశ్నిస్తోంది. రుజువులు చూపించాలని వెంటబడుతోంది. కుల ధృవీకరణ పత్రం చూపించని వారు ఉచిత విద్యుత్ పరిధిలోకి రారంటూ బిల్లుల కొరడా ఝళిపిస్తోంది. దళితులకు ఉచిత విద్యుత్ ఇస్తామని 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి దళితులు బిల్లులు చెల్లించడంలేదు. ఆ తర్వాత 2013 ఏప్రిల్లో సవాలక్ష నిబంధనలు పెట్టి దీన్ని చట్టబద్ధం చేశారు. 50 యూనిట్లకే ఉచిత విద్యుత్ అని చెప్పారు. ఆపైన ఒక్క యూనిట్ దాటినా ఉచిత విద్యుత్ పరిధిలోకి రారని, మొత్తం బిల్లు చెల్లించాలని షరతు విధించారు. అంటే వినియోగదారుడు 51 యూనిట్లు వాడినా అన్ని యూనిట్లకు బిల్లు చెల్లించాలి. అప్పటికే ఎన్నికలు దగ్గర పడటంతో ప్రభుత్వం ఈ షరతులను గోప్యంగా ఉంచేసింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగానే దళితుల ఉచిత విద్యుత్పై దృష్టి పెట్టారు. కిరణ్ సర్కారు నిబంధనలకు తోడు గా, అసలు వీరంతా దళితులా కాదా తేల్చాలని డిస్కంలకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారికే నెలకు 50 యూనిట్ల ఉచిత విద్యుత్ వర్తింపజేయాలనే నిబంధన పెట్టారు. ఎప్పుడు కుల ధృవీకరణ పత్రం ఇస్తే అప్పటి నుంచే అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలి సింది. ఇలా దళితులు వాడుకున్న కరెంటు కు బిల్లు వసూలు చేయాలని ప్రభుత్వం పరోక్షంగా చెప్పింది. అంతకు ముందు ఈ సర్టిఫికెట్ల నిబంధన లేదు. దీంతో దళితులెవరూ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదు. దీంతో వీళ్లందరినీ అధికారులు బకాయిదారులుగానే తేల్చారు. వీరందరి నుంచి తక్షణమే బిల్లులు వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈపీడీసీఎల్ పరిధిలో రూ. 53.96 కోట్లు, ఎస్పీడీసీఎల్ పరి ధిలో రూ. 50 కోట్ల మేర దళితులు బకాయిలు పడినట్టు విద్యుత్ శాఖ తేల్చింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. బిల్లులు చెల్లిం చని వారి ఇళ్ల విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారు. దీంతో రాష్టరంలోని 6,72,252 మంది ఎస్సీ, ఎస్టీలు కుల ధృవీకరణ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో దాదా పు 2 లక్షల మంది (30 శాతం) మాత్రమే ఇప్పటివరకు కుల ధృవీకరణ పత్రాలు అందించారు. మిగతా 4.72 లక్షల మందిని ప్రభుత్వం దళితులే కాదంటోంది. వారికి 50 యూనిట్ల ఉచిత విద్యు త్ ఇవ్వబోమని చెబుతోంది. పాత బకాయిలతో సహా బిల్లులు వసూలు చేయాలని అంటోంది. చెల్లించని వారి కనెక్షన్లు తొలగిస్తున్నారు.ఇప్పటివరకు 4 వేలకు పైగా దళితుల ఇళ్ల కనెక్షన్లను తొలగించినట్లు సమాచారం. ఒకేసారి రూ.వేలల్లో వస్తున్నాయి నాకు ఒకేసారి 1,114 రూపాయల బిల్లు పంపారు. ప్రభుత్వం కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇంతేసి బిల్లులేస్తే ఎలా? ఏరోజుకారోజు పని చేసుకుని బతికేవాళ్లం. ఇన్ని వందల రూపాయలు ఒకేసారి ఎలా కట్టగలం? - డి భాగ్యమ్మ, ఎం పణుకువలస, బొబ్బిలి మండలం బిల్లు కట్టలేదని కనెక్షన్ తొలగించారు మాకు ఉచితంగా కరంటు ఇస్తారని రెండేల్ల క్రితం చెప్పారు. ఇప్పు్పడేమో వేలకు వేలు బిల్లులు వస్తున్నాయి. ఉచిత విద్యుత్తు అనేసరికి మేమెవ్వరం ఇప్పటివరకు బిల్లులు కట్టలేదు. ఇప్పుడు మొత్తం 1,546 రూపాయల బిల్లు పంపించారు. దానిని కట్టకపోయేసరికి అక్టోబరు నెలలో కరంటు కనెక్షన్ పీకేశారు. మళ్లీ దానికి అప్పులు చేసుకొని, జరిమానాలతో కలిపి 1,630 రూపాయలు కట్టాం. ఉచితమని చెపిప ఇన్నేసి వేల రూపాయల బిల్లులు వస్తే ఎలా? - కే సత్తెమ్మ, ఎం పణుకువలస, బొబ్బిలి మండలం ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే..: అధికారులు ఇందులో తమ తప్పేమీ లేదని ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులు అంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే బిల్లులు వసూలు చేస్తున్నామని చెబుతున్నారు. డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. గత ఏవాగి మార్చి 31 నాటికి ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు విద్యుత్ సబ్సిడీ కింద ప్రభుత్వం రూ. 65.22 కోట్లు చెల్లించాలి. దీన్ని ఇంత వరకూ విడుదల చేయలేదని ఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. కుల ధృవీకరణ పత్రాలు సమర్పించిన తర్వాతే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిబంధనల కారణంగా బకాయిల కోసం దళితులను నిలదీయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. -
ఆల్ ఫ్రీ... తూచ్!
-
ఆల్ ఫ్రీ... తూచ్!
* ఎన్నికల ముందు వందలాది ఉచిత హామీలిచ్చిన చంద్రబాబు * ఆరునెలలవుతున్నా ఒక్కశాతం కూడా అమలు కాని తీరు * 30 రోజుల్లో నూతన పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని మర్చిపోయారు * ఆరు నెలల్లో ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అమలు కాలేదు * వ్యవసాయ రుణాలపై తొలిసంతకమూ అంతే * డ్వాక్రా మహిళల రుణాల మాఫీ లేదని తేల్చి చెప్పారు * కలగా మారిన వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ * పది లక్షల వృద్ధాప్య, వితంతు పింఛన్లకు కోత * రాష్ట్ర విభజన- ఆర్థిక సమస్యలంటూ హామీల దాటవేత * రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పన్ను రాయితీ సాధించడంలోనూ వైఫల్యం సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షం హెచ్చరించిన చందంగానే, పరిశీలకులు ఊహించిన విధంగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలకు స్వయంగా ‘తూచ్’ మంత్రం పఠించారు. విజయవాడలో గురువారం జరిగిన తెలుగుదేశంపార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల సమక్షంలో పచ్చి అబద్ధాలను కన్నార్పకుండా పలికేయడంతో రాష్ట్ర ప్రజల్లో అక్కడక్కడా మిగిలి ఉన్న భ్రమలు పటాపంచలైపోయాయి. తాను పంటరుణాలు మాత్రమే మాఫీ చేస్తానని హామీ ఇచ్చినట్టూ. ఇంట్లో ఎన్ని రుణాలున్నా ఒకరికి మాత్రమే... అదీ లక్షన్నర లోపే మాఫీ చేస్తానని వాగ్దానం చేసినట్టూ అవలీలగా బొంకేయడంతో వింటున్న పార్టీ నేతలుసైతం నోళ్లు వెళ్లబెట్టక తప్పలేదు. ఎందుకంటే పంటరుణాలేకాదు, మొత్తం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని, బంగారం తాకట్టు పెట్టిన రుణాలను కూడా తామే కట్టేస్తామనీ, డ్వాక్రా మహిళల రుణాలు కూడా తీర్చేస్తామనీ ఊరూవాడా ఏకం చేస్తూ ఎన్నికల ముందు తెలుగుదేశం చేసిన ప్రచారం జనం మదిలో ఇంకా తాజాగానే ఉంది. మొత్తం 300 వాగ్దానాలతో పంచిన మేనిఫెస్టో ప్రతులు, వేసిన కరపత్రాలు, అంటించిన పోస్టర్లు, మోత మోగించిన టీవీ ప్రకటనలు, పత్రికలనిండా పరుచుకున్న ప్రచారం... ఇంకా సాక్ష్యంగా లభ్యమవుతుండగానే చంద్రబాబు అడ్డంగా బుకాయించడంతో అన్ని వాగ్దానాలూ అటకెక్కినట్టేనన్న విషయం బోధపడింది. అన్నింటికంటే కీలకమైన రైతుల రుణమాఫీ విషయాన్నే తీసుకుందాం. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ ప్రభుత్వం ఈ విషయంలో వేస్తున్న పిల్లి మొగ్గల్ని చూస్తే... పంచపాండవులు మంచంకోళ్లలాగా ముగ్గురే అని రెండు వేళ్లు చూపించిన సామెత గుర్తొస్తుంది. రుణమాఫీకి అర్హమైన రైతుల ఖాతాలను తగ్గించేందుకు ఆరునెలలుగా సర్కారు చేస్తున్న యత్నాలు చూస్తుంటే పీసీ సర్కార్ మేజిక్షో గుర్తుకొస్తుంది. ప్రధానమైన ఇతర రంగాల సంగతీ అంతే. డ్వాక్రా మహిళల రుణమాఫీ సంగతి నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్టయింది. సామాజిక పెన్షన్లు పెంచినట్టే పెంచి 10 లక్షలమంది లబ్ధిదారులను కత్తిరించేశారు. ఇంటికో ఉద్యోగం-లేదంటే రెండువేలు నిరుద్యోగ భృతి హామీని పూర్తిగా మరచిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ను రైతులకు ఉచితంగా ఇస్తామని స్పష్టంగా చెప్పిన హామీ... ఆ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఖరీఫ్ సీజను పూర్తయి, రబీ సీజన్ కూడా మొదలైనా అమలుకు నోచుకోలేదు. అసలా హామీ ముఖ్యమంత్రి నోట నుంచిగానీ, ఏ ఇతర మంత్రి నోట నుంచి వినిపించడం కూడా లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు తీసుకున్న ఐదు కీలక నిర్ణయాల్లో ఒకటైన ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు తమకూ వర్తింపజేయాలంటూ కార్పొరేషన్ల ఉద్యోగులు మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఉన్న 12 వేలకు పైగా గ్రామాల్లో కనీసం రెండు గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ సుజల పథకం ఏర్పాటుకు నోచుకోలేదు. అధికారంలోకి రాగానే 30 రోజుల్లో నూతన పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని పూర్తిగా మరిచిపోయారు. ఆరు నెలల్లో ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని స్పష్టంగా గడువు పెట్టిన హామీని అమలు చేసి చూపించలేకపోయారు. ఇసుక రీచ్లను పంచాయతీరాజ్ శాఖకే అప్పగించి, వచ్చే ఆదాయం దామాషా ప్రకారం గ్రామ, మండల, జిల్లా పరిషత్లకు కేటాయిస్తామన్న హామీ అమలుకాలేదు. మార్చి 31న విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రూ. రెండు లక్షల కోట్ల వ్యయమయ్యే హామీలిచ్చారని అప్పట్లోనే ఉజ్జాయింపు లెక్కలు వేశారు. మేనిఫెస్టోలోని ప్రతి హామీనీ, పథకాన్నీ, ప్రణాళికనూ అమలు చేసి ఆదర్శంగా నిలుస్తామని ఎన్నికలప్పుడు ప్రకటించుకున్నారు. అధికారంలోకి వచ్చాకేమో ‘రాష్ట్ర విభజన- ఆర్థిక సమస్యలు’ అంటూ దాటవేత మొదలుపెట్టారు. కానీ ఇప్పటికిప్పుడు ఏ మాత్రం అదనపు ఆర్థిక భారం పడని హామీలూ అమలుకు నోచుకోవడం లేదు. పరిశ్రమల అభివృద్ధికి పన్ను రాయితీలను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించే గురుతర బాధ్యతను నిర్వర్తించగల సత్తా టీడీపీకే ఉందంటూ చెప్పి.. చివరకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందిన ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’, ‘పన్ను రాయితీ’ హామీలలో ఒక్కదానిని కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. టీడీపీ మేనిఫెస్టోలోని కొన్ని హామీలు... - పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం. రైతులకు లాభసాటి ధర వచ్చేందుకు స్వామినాథన్ కమి టీ సిఫార్సులు అమలయ్యేలా చూస్తాం. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులకు ఎరువుల సబ్సిడీ నిమిత్తం రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం. రూ.5,000 కోట్లతో పంటల ధర స్థిరీకరణ నిధి ఏర్పా టు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు అం దించి వారికీ రుణసౌకర్యాలు కల్పిస్తాం. - వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుతును ఉచితంగా ఇస్తాం. గృహా వసరాలకు, పరిశ్రమలకు నిరంతరాయం గా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం. - డ్వాక్రా సంఘాలను పునరుజ్జీవింపజేసే ప్రక్రియలో భాగంగా డ్వాకా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. - పుట్టిన బిడ్డ పేరుతో అర్హులైన కుటుంబాలకు రూ. 25వేలు బ్యాంకులో డిపాజిట్ చేసి, వారికి యుక్త వయసు వచ్చేనాటికి రూ. 2 లక్షలను అందజేస్తాం. పేద గర్బిణులకు ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం రూ. 10వేలు అందజేస్తాం - ఒక్కొక్క గ్యాస్ సిలిండర్కు రూ. 100 సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తాం. - అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తాం. మద్యం బెల్ట్షాపుల రద్దు, ప్రతి జిల్లాలో డీఆడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. - నిరుద్యోగ యువకులకు రూ. 1,000 నుంచి రూ. 2000 వరకు నిరుద్యోగ భృతి. ఇంటి కో ఉద్యోగం, కళాశాల విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్ కంప్యూటర్లు. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 33 శాతానికి పెంచుతాం. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను ఆధార్తో సంబంధం లేకుండా అమలు చేస్తాం. - చేనేత కార్మికుల బ్యాంకు రుణాల మాఫీ. పవర్ లూమ్స్పైఉన్న రుణాలు కూడా రద్దు చేస్తాం. చేనేత కార్మికులకు రూ. 1000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి ఏటా వెయ్యి కోట్లు కేటాయింపులు. జిల్లాకు ఒక చేనేత పార్కు. - ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఆరు నెలల కాలంలో అభ్యర్థులు అందుబాటులో ఉంటే భర్తీ చేస్తాం. ఎస్సీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తాం. భూమి లేని గిరిజన కుటుంబాలకు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తాం. గిరిజన అమ్మాయి వివాహానికి రూ. 50 వేల ఆర్థిక సహాయం. ప్రతి జిల్లాలో గిరిజన భవన్ నిర్మాణం. - ముస్లింలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించే ప్రక్రియను చట్టపరంగా సాధించడానికి కృషి చేస్తాం. దళిత క్రైస్తవులను ఎస్సీల్లోకి చేర్చడానికి చర్యలు చేపడతాం. కాపుల రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ను నియమించి నిర్ణీత కాలవ్యవధిలో బీసీలకు నష్టం కలగకుండా సమస్యను పరిష్కరిస్తాం. - ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేస్తాం. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు. ఉద్యోగులు రిటైర్మెంట్కల్లా ఇల్లు ండేలా అందుబాటులో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తాం. - అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తాం. పరిశ్రమల స్థాపనకు 30 రోజుల్లోనే అన్ని అనుమతులిస్తాం. కడప, అనంతపురం జిల్లాల్లో ఇనుప ఖనిజం ఆధారంగా ఉక్కు ఫ్యాక్టరీలను నిర్మించేందుకు కృషి. జిల్లాల్లో డెయిరీ పరిశ్రమలు పటిష్టం. పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు. - శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం నుండి నెల్లూరు జిల్లా దుగరాజుపట్నం వరకు పాత పోర్టులతోపాటు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ప్రతి జిల్లాలో ఒక పోర్టును అభివృద్ధి చేస్తాం. ఈ పోర్టులన్నీ అనుసంధానం చేస్తూ ఇప్పుడున్న కలక త్తా- చెన్నై జాతీయ రహదారికి సమాంతరంగా సముద్రతీరానికి దగ్గరగా మరొక రహదారిని నిర్మిస్తాం. బకింగ్హాం కెనాల్ను పునరుద్ధరించి జల రవాణాకు అనుకూలంగా మారుస్తాం. - ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కల్పించిన ప్రత్యేక ప్యాకేజీలను వినియోగించుకొని అక్కడ పారిశ్రామిక అభివృద్ధి. రాయలసీమ జిల్లాలకు కల్పించిన ప్రత్యేక ప్యాకేజీలను వినియోగించుకొని చిత్తూరు, అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. -
9 గంటల కరెంట్పై తొండి
* వ్యవసాయానికి ప్రస్తుతానికి 7 గంటలకు మించి ఇవ్వలేమని అసెంబ్లీలో మంత్రి పల్లె వెల్లడి * ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేస్తామని వాయిదా వేయడం మోసమే: పెద్దిరెడ్డి * కనెక్షన్లు తొలగిస్తారని రైతుల్లో ఆందోళన: చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నప్పటికీ ప్రస్తుతానికి 7 గంటలకు మించి ఉచిత విద్యుత్ ఇవ్వలేమని, పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్తులో 9 గంటలు ఇస్తామని తేల్చేసింది. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీడిక రాజన్న దొర, ఉప్పులేటి కల్పన, గడికోట శ్రీకాంత్రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నపై చర్చ జరిగింది. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్లుగా వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ను ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని పెద్దిరెడ్డి నిలదీశారు. ఉచిత విద్యుత్పై మొదటి సంతకం అని చెప్పి ఇప్పుడు వాయిదా వేయడం రైతుల్ని మోసగించడమే అవుతుందన్నారు. సీఎం చంద్రబాబు తరఫున సమాచార, సాంకేతిక మంత్రి పల్లె రఘునాధరెడ్డి బదులిస్తూ.. ప్రస్తుతానికి 7 గంటల ఉచిత విద్యుత్ను అమలు చేస్తున్నామని, దశలవారీగా 9 గంటలకు పెంచుతామని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ‘అందరికీ విద్యుత్’ పథకం ప్రారంభమవుతుందన్నారు. వచ్చే 5 ఏళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 22 మిలి యన్ యూనిట్ల లోటు ఉందని, సెప్టెంబర్ ఒకటి నాటికి లోటు భర్తీ చేసి జీరో స్థాయికి తీసుకువచ్చామన్నారు. ప్రస్తుతం విద్యుత్ కొరత లేదన్నారు. 2009 జూన్ 25న రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా 9 గంటల ఉచిత విద్యుత్ను అమలు చేయలేదని మంత్రి అనడంతో వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2003 వరకు 9 గంటల ఉచిత విద్యుత్ను ఇచ్చామని, 2004లో ఇవ్వలేకపోయామని మంత్రి చెప్పారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ పంపిణీ వ్యవస్థను నాశనం చేశాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఐఎస్ఐ గుర్తింపులేని 36 వేల పంపుసెట్లను మారుస్తామని మంత్రి చెప్పారు. పెండింగ్ కనెక్షన్ల గురించి అడిగితే మంత్రి ఏదేదో చెబుతున్నారని, ఈ కనెక్షన్లు ఒకేసారి ఇస్తారా? లేక దశలవారీగా ఇస్తారో చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్కు పరిమితులు విధించి కనెక్షన్లు తొలగిస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారని, ఇది నిజమో కాదో చెప్పాలని చెవిరెడ్డి కోరారు. -
అక్టోబర్ 2 నుంచి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తాం
-
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేస్తారా?
హైదరాబాద్: రైతులకు 9 గంటల విద్యుత్ ఎప్పటి నుంచి ఇస్తారని ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రశ్నించింది. సోమవారం శాససభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. 9 గంటల ఉచిత విద్యుత్ దశలవారీగా ఇస్తామనడం ఎంతవరకు సమంజమని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో హమీయిచ్చినట్టు రైతులకు 9 గంటల ఉచిత్ విద్యుత్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేసే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం ఉందా అని ఆయన అడిగారు. ఇలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే వెల్లడించాలని డిమాండ్ చేశారు. -
9 గంటల కరెంటూ తూచ్!
మరో హామీపై బాబు సర్కారు వెనుకంజ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా సమయం ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు. సాగుకు ఉచిత విద్యుత్ సరఫరా సమయాన్ని 7 నుంచి 8 గంటలకు పెంచాలని.. వచ్చే ఏడాది నుంచే దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం వ్యవసాయానికి అధికారికంగా ఏడు గంటల ఉచిత విద్యుత్ అమలవుతోంది. (వాస్తవానికి నాలుగైదు గంటలు కూడా సరఫరా లేదు) ఆరేళ్ల కిందట ఈ 7 గంటల విద్యుత్ను 9 గంటలకు పెంచుతామని దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఆయన మరణానంతరం ఈ హామీని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. అధికారంలోకి వస్తే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అయితే.. ప్రస్తుతం దీనిని కూడా 8 గంటలకే కుదించాలని భావిస్తోంది. ప్రస్తుతం విద్యుత్ సరఫరా మెరుగుపడిన నేపథ్యంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా పెంచే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ దిశగా ఆలోచించడం లేదు. -
1.72 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్
రాష్ట్రంలో ఉన్న మొత్తం 1.72 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఉత్తరప్రదేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 201 తహసీళ్లకు గాను 166 చోట్ల 33/11 కెవి సబ్స్టేషన్ల నిర్మాణం ఈ సంవత్సరం అక్టోబర్నాటికల్లా పూర్తవుతుందని ఆయన చెప్పారు. మిగిలినవి 2015 మార్చికి పూర్తవుతాయి. రాష్ట్రమంతటికీ కోతలు లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్న ప్రణాళిక కోసం 122 ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అంపారా-డి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు, హర్దువాగంజ్, పాంకా విస్తరణ, ఓబ్రా-సి, ఘాతంపూర్, మేజా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను తగిన కాలావధిలోగా పూర్తి చేయాలన్నారు. లోహియా గ్రామాల్లో సోలార్ లైట్ల ఏర్పాటును సీనియర్ అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,200 సోలార్ పంపులను ఏర్పాటుచేసేందుకు కూడా నిధులు విడుదల చేశామని అన్నారు. -
ఉచిత విద్యుత్ ఉత్తుత్తిదే
నెల్లూరు(హరనాథపురం): రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ఇళ్ల కు 24 గంటల విద్యుత్, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పాడైన ట్రాన్స్ఫార్మర్లకు 24 గంటల్లో మరమ్మతులు... ఇవి టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు. జిల్లాలో వాస్తవ పరిస్థితి ఏమిటంటే విద్యుత్ కోసం ఎండల్లో ఎం డుతూ, రాత్రుళ్లు కటిక చీకట్లో చేల ల్లోనే గంటల తరబడి రైతులు నిరీక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నా యి. వీటిలో 1.38 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. పేద, మధ్యతరగతి రైతులకు ఇచ్చిన ఫ్రీ సర్వీసులకు నెలకు రూ.30 వంతున యూజర్ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లించే మోతుబరి రైతులకు ఇచ్చిన 2000 వ్యవసాయ కనెక్షన్లకు యూనిట్కు రూ.4.50 వంతున వసూలు చేస్తున్నారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లకు నెలకు రూ.25 కోట్ల రాయితీని భరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. టీడీపీ హామీలు ఇచ్చినట్లు జిల్లాలో తొమ్మిది గంటల విద్యుత్ అమలు కావడం లేదు. ఏడు గంటల విద్యుత్ సరఫరాలో నిరవధికంగా మూడు గంటలు కూడా అమలు కావడం లేదు. జిల్లాలో సబ్స్టేషన్ల వారీగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను నాలుగు గ్రూపులుగా విభజించిన అధికారులు సరఫరా వేళలను మార్చారు. ‘ఎ’ గ్రూపునకు రాత్రి 11.15 నుంచి 4.15 గంటల వరకు, మధ్యాహ్నం 2.15 నుంచి 4.15 వర కు, బీ గ్రూపునకు ఉదయం 4.55 నుంచి 9.15 వరకు, రాత్రి 11.15 నుంచి 1.15 వరకు, సీ గ్రూపునకు రాత్రి 9.15 నుంచి 2. 15 వరకు, మధ్యాహ్నం 1.15 నుంచి 3.15 వరకు, డీ గ్రూపునకు మధ్యాహ్నం 2.10 నుంచి 7.10 వరకు, రాత్రి 3.15 నుంచి 5.15 వరకు విద్యుత్ సరఫరా వేళలుగా నిర్ణయించారు. అయితే ఆచరణలో ఎక్కడా అ మలు కావడం లేదు. చంద్రబాబు పాలన వ చ్చి నెల గడుస్తున్నా 9 గంటల విద్యుత్కు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుతున్న ఎండలు, వడగాలుల నేపథ్యంలో ఉ దయం 6 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. తప్పని ఇక్కట్లు: రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో మిగులు విద్యుత్ ఉంటుం దని, కోతలు తగ్గుతాయని భావిస్తే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంది. విద్యుత్ కోతల తో పంట చేతికి వస్తుందో లేదోనని రైతులు భయాందోళనలో ఉన్నారు. ఉదయగిరి, విం జమూరు, కలిగిరి, పొదలకూరు, రాపూరు తదితర మండలాల రైతులు వ్యవసాయ వి ద్యుత్పై ఆధారపడి అరటి, బత్తాయి, పత్తి, కూరగాయలు, తదితర పంటలు సాగు చేస్తు న్నారు. డెల్టాలోనూ కొంత మేర చెరుకు, వరి పంట బోర్ల కిందే సాగుచేస్తున్నారు. ప్రస్తు తం కోతల నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి నా 24 గంటల్లో మార్చేస్తామన్న ప్రకటన ఆచరణకు నోచుకోవడం లేదు. ఫీజులు దెబ్బతిన్నా, గాలులకు తీగలు తెగిపడినా సిబ్బంది స్పందించడం లేదు. ప్రభుత్వం స్పందించి సమస్యలు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
కాంగ్రెస్ పథకాలను కొనసాగించాలి: రుద్రరాజు
సాక్షి, హైదరాబాద్: దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఏపీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్కు, ఆయన మంత్రి వర్గానికి సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే గొప్ప రాష్ట్రంగా పేరొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు స్థానిక ఇందిరాభవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలనాదక్షత, అపార అనుభవమున్న కేసీఆర్ సీఎంగా మంచి పాలన అందిస్తారనే నమ్మకముందన్నారు. అయితే, కాంగ్రెస్ పథకాలను కేసీఆర్ విజ్ఞతతో కొనసాగిస్తారన్న ఆశాభావం, విశ్వాసం కూడా తమకుందని చెప్పారు. తెలంగాణాలో కాంగ్రె స్ ఓడిపోయినా ప్రజా సంక్షేమం కోసం పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. -
భారం...దూరమయ్యేనా?
పాలమూరు, న్యూస్లైన: మూడేళ్లుగా విద్యుత్ చార్జీల బాదుడుకు జిల్లా జనం అల్లాడిపోయారు. ఇబ్బడిముబ్బడిగా చార్జీల పెంపు, సర్దుబాటు చార్జీల పేరిట వసూలు చేస్తూ.. వినియోగంకంటే రెండింతలు బిల్లులు వసూలు చేస్తుండటంతో సామాన్యులు అవస్థలు పడ్డారు. ఆ కష్టాలను తలచుకుంటూనే తెలంగాణ రాష్ట్ర కొత్త సర్కారుపై జనం గంపెడాశలు పెట్టుకున్నారు. అదనపు విద్యుత్ భారం కొత్తప్రభుత్వమైనా.. తగ్గిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం అమలుపర్చారు. అన్ని రంగాలకూ ప్రయోజనం కల్పించాలన్న సంకల్పంతో విద్యుత్ రాయితీని అధికమొత్తంలో ప్రభుత్వమే భరించింది. ఆయన మరణానంతరం ఈ ఆశయం నీరుగారిపోయింది. గడిచిన మూడేళ్లలో పెరిగిన విద్యుత్, సర్దుబాటు చార్జీల పేర జిల్లాలోని విద్యుత్ వినియోగదారులపై రూ.300 కోట్లకు పైగా భారం మోపారు. కేవలం ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట రెండేళ్లలోనే రూ.80 కోట్లు వసూలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపితే విద్యుత్తు చార్జీల భారం ప్రజలకు కొంతమేరకైనా తగ్గుతుందని భావిస్తున్నారు. బాదుడు ఇలా.. గత ప్రభుత్వం పెంచిన విద్యుత్చార్జీలతో పాటు సర్దుబాటు చార్జీలను కూడా సామాన్యులపై మోపి కోలుకోలేని స్థితికి చేర్చింది. ప్రజలపై అధికభారం మోపిన రాష్ట్ర సర్కారు.. విద్యుత్ శాఖ ద్వారా మరో షాక్ తగిలించింది. జిల్లాలోని గృహ, వాణిజ్య రంగాల విద్యుత్ వినియోగదారులపై ఈ ఏడాదిలో రూ.40 మోపారు. జిల్లావ్యాప్తంగా 6.65 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గృహ కనెక్షన్లు 4.25 లక్షలు, 1.90 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, 55వేల వరకు వ్యాపార, వాణిజ్య, పరిశ్రమలు, ఇతరత్రా కనెక్షన్లు ఉంటాయి. విద్యుత్ సర్దుబాటు చార్జీలపేర జనంపై ఎక్కడలేని భారం మోపడంతో ప్రభుత్వ విధానాలపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. విద్యుత్ వాడకంతో లబ్ధిపొందే చిరువ్యాపారులు రెండింతలుగా వచ్చిన విద్యుత్ బిల్లులను చెల్లించలేక, తమ వ్యాపారాలను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ను సక్రమంగా సరఫరా చేయకపోగా, ఎడాపెడా చార్జీల భారం మోపడంపై మండిపడుతున్నారు. సర్చార్జీ వసూలు అద్దె ఇళ్లల్లో సమస్యలకు దారి తీస్తోంది. ఎవరో వాడుకున్న విద్యుత్కు మేం ఇంధన చార్జీలు చెల్లించడమేమిటని పలువురు గొడవలు పడిన సందర్భాలూ ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి నుంచి కొత్త ప్రభుత్వం తమను బయటపడేయాలని విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు. -
‘ఉచిత విద్యుత్’కు చీకట్లు
కె.జి.రాఘవేంద్రరెడ్డి: ‘రైతులకు ఉచిత విద్యుత్’.. ఏ పాలకుడూ ఊహించని, సాధ్యమని నమ్మని పథకం. తొమ్మిదేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు.. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలు బట్టలారేసుకోవడానికే పని కొస్తాయని ఎద్దేవా చేశారు. ప్రపంచబ్యాంకు నిబంధనలను కూడా కాదని రైతులకు వరంలా ఉచిత విద్యుత్ను అమలు చేసి చూపారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన అనంతరం మళ్లీ పాలకులు చంద్రబాబు పాలనను గుర్తుకుతెస్తున్నారు. చంద్రబాబు పాలనలో.. - ప్రభుత్వం చేసే ప్రతి పనికీ ప్రజల నుంచి చార్జీలు వసూలు చేయాలన్నది బాబు విధానం, సిద్ధాంతం. ఇందులో భాగం గానే వ్యవసాయానికీ విద్యుత్ చార్జీలను వసూలు చేశారు. - విద్యుత్ చార్జీలు చెల్లించని రైతులపై కేసులు పెట్టారు. జైళ్లకు పంపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేశారు. - రైతులపై 78 వేల కేసులు నమోదు చేశారు. - ఏటా విద్యుత్ చార్జీలు పెంచారు. అటు గృహ వినియోగానికి, ఇటు వ్యవసాయానికీ చార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుదే. - చార్జీలు చెల్లించడం లేదని వ్యవసాయ కనెక్షన్లను తొలగించారు. పొలం మీద పడి మోటార్లు ఎత్తుకెళ్లారు. ఫ్యూజులు పీకేశారు. పంటలు ఎండిపోతున్నా కనికరించలేదు. - ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించదని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలకు బట్టలు ఆరేసుకోవాల్సిందేనని హేళన చేశారు. - {పైవేటు ప్లాంట్లను ప్రోత్సహించారు. గ్యాసు లేదని తెలిసీ మరీ గ్యాసు ప్లాంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. విద్యుత్ ఇవ్వకపోయినా, స్థిర చార్జీలు చెల్లిస్తామని ఒప్పందంలో హామీ ఇచ్చారు. రోశయ్య, కిరణ్ హయాంలో.. - ఏటా విద్యుత్ చార్జీలను పెంచారు. సర్దుబాటు చార్జీల పేరుతో పరోక్షంగా బాదారు. రెగ్యులర్, సర్దుబాటు చార్జీలను కలిపి ఏకంగా రూ. 24,218 కోట్ల మేరకు ప్రజలపై భారం వేశారు. - ఇది చాలదన్నట్టు 2014-15లో ఏకంగా రూ. 9,370 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రతిపాదనలు సమర్పించారు. - రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ను పూర్తిగా మరచిపోయారు. వ్యవసా యానికి ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కొత్త కొత్త ఆంక్షలను ముందుకు తెచ్చారు. - వ్యవసాయ కనెక్షన్లకు సర్వీసు చార్జీని నెలకు 20 నుంచి 30 రూపాయలకు పెంచారు. - వైఎస్ హయాంలో వసూలు చేయని సర్వీసు చార్జీలను బకాయిల పేరుతో వసూలు చేసేందుకు తెర లేపారు. వాటిని చెల్లించని రైతుల వ్యవసాయ స్టార్టర్లు, మోటార్లు ఎత్తుకెళుతున్నారు. - వైఎస్ మరణం తరువాత ఒక్క కొత్త విద్యుదుత్పాదన ప్లాంటు నిర్మాణ పనులు కూడా ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. - సకల జనుల సమ్మె సాకుతో 2011 అక్టోబరులో మొదలైన విద్యుత్ కోతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీలు - రైతులకు కచ్చితంగా 7 గంటల ఉచిత విద్యుత్ సరఫరా - ఆ తరువాత ఉచిత విద్యుత్ సరఫరా సమయాన్ని 7 గంటల నుంచి 9 గంటలకు పెంపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం ‘గత ఐదేళ్లలో విద్యుత్ చార్జీలను పెంచలేదు.. మరో ఐదేళ్లు పెంచేది లేదు’ - 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్పష్టీకరణ - ‘అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఉచిత విద్యుత్’ ఫైలుపైనే. విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తూ ఆయన రెండో సంతకం చేశారు. - ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ లభించింది. రైతులు బకాయిపడ్డ రూ.1250 కోట్ల కరెంటు బకాయిలు మాఫీ అయ్యాయి. సుమారు 2 లక్షల మంది రైతులపై నాటి చంద్రబాబు ప్రభుత్వం బనాయించిన కేసులు రద్దు అయ్యాయి. - ఏటా లక్షన్నర వ్యవసాయ కనెక్షన్లను జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. - 2004 నుంచి ఒక్క ఏడాదీ విద్యుత్ చార్జీలు పెంచలేదు. కనీస సర్వీస్ చార్జి అయిన రూ.20లను కూడా వసూలు చేయలేదు. - వచ్చే ఐదేళ్లు కూడా విద్యుత్ చార్జీలు పెంచేది లేదని 2009 ఎన్నికల ముందు స్వయంగా వైఎస్ హామీనిచ్చారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్ను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచుతామన్నారు. - 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో ఉత్పత్తి ప్రారంభమైన వెంటనే వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చారు. - 2014-15 ఆర్థిక సంవత్సరానికి మరో 9,370 కోట్ల మేరకు పెంచేందుకు ప్రతిపాదనలను సమర్పించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. బిల్లులు భారమైతున్నయ్ ఏడాదికి రెండుమూడుసార్లు కరెంటు బిల్లులు పెంచుతుండ్రు. అయిగూడ అడ్డగోలుగ అస్తున్నయ్. పల్లెల్లో పగటిపూట మొత్తం కరెంటు లేకపోవడం వల్ల తాగడానికి గుక్కెడు నీరు కూడా దొరుకతలేదు. వైఎస్ ఉన్నప్పుడు ఇట్ట లేకుండె. గిప్పుడేమో వేసవి రాకముందు నుంచి నాలుగు నెలలపాటు కరెంటు కోతలు విధిస్తున్నరు. కరెంటు లేక పంటలు దెబ్బతిని నష్టపోతున్నం. మేం ఎవుసాయం ఎట్టచేయాలె.. ఎట్ట బతకాలె.. ఏమీ అర్థమైతలేదు. -సాడం కుమార్, ఘన్పూర్(ఎం), నిజామాబాద్ ఉచితమే గాదు,కరెంటు ఫుల్గా వొచ్చేది దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి సారు ఉన్నపుడు ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు రోజుకు ఏడు గంటలు వచ్చేది. ఉన్న రెండె కరాలు నిమ్మలంగా పండించిన. ఇపుడేమో రోజుకు మూడు గంటలే ఇస్తున్నరు. ఎవర్ని అడిగినా చెప్పరు. ఎకరమే వరి నాటేసినం,అది కూడ పారుత లేదు. నాటేసిన పొలంల కొంత ఇప్పటికే ఎండుముఖం పట్టింది. రోజుకు మూడు గంటలే వొస్తుంది.అది ఎపుడు వోస్తదో తెలువది. - నీరుడి సత్తయ్య, మూసాపేట, మెదక్ జిల్లా. ఉచిత విద్యుత్ 12గంటల పాటు ఇయ్యాలె కరెంటుపై ఆధారపడే పంటలు పండించుకునేటోళ్లం. సర్కారేమో కరెంటు ఏడు గంటలు ఇస్తామని చెప్పి మూడు గంటలు కూడా ఇస్తలేదు. మా గోస పట్టించుకునేటోళ్లే కరువైండ్రు. గా రాజశేఖరరెడ్డి సారు ఉన్నప్పుడు కరెంటు బాగొస్తుండె.తెలంగాణ రాష్ట్రంలోనైనా 12గంటల ఉచిత విద్యుత్ అందిస్తే రైతులు బాగుపడతరు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి ఏడాదంతా పంటలు నీళ్లందించేలా చేస్తే గదే పదివేలు. -కృష్ణయ్య, టంకర, మహబూబ్నగర్ -
మీవల్లే పెద్ద రైతులకూ ఉచిత కరెంటు
రైతుల సమస్యలపై తనను కలిసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తనదైన శైలిలో చురక అంటించారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న కరెంటు అర్హులైన రైతులకు మాత్రమే అందితే బాగుంటుందని, కానీ మీవల్లే పెద్ద రైతులు కూడా దాన్ని అనుభవించే పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు. దాంతో ఏమీ మాట్లాడలేని నాయకులు నీళ్లు నమిలినట్లు తెలిసింది. ఇక ఇప్పుడు ఎటూ మంత్రివర్గం లేదు కాబట్టి, రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని వారు గవర్నర్ను కోరారు. -
ఉచిత విద్యుత్కు గంట కోత!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ... వ్యవసాయూనికి ఏడు గంటల ఉచిత సర ఫరాకు ఎప్పుడో తిలోదకాలు రెండు లేదా మూడు గంటలకు మాత్రమే పరిమితం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయూనికి ఉచిత విద్యుత్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. పథకాన్ని ఎప్పటికప్పుడు ఆంక్షల చట్రంలో బిగిస్తూ రైతుల్ని ఇక్కట్ల పాలు చేస్తున్న ప్రస్తుత సర్కారు.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో ఇచ్చిన ఏడు గంటల ఉచిత విద్యుత్కు ఎప్పుడో తిలోదకాలిచ్చింది. ప్రస్తుతం రెండు, మూడు గంటలు మాత్రమే ఇస్తోంది. తాజాగా మరో గంటపాటు కోత కోస్తూ శనివారం ఇంధన శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక గంటా రెండు గంటలు కూడా ఉచిత విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా యూనిట్గా వ్యవసాయ ఫీడర్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. 7 గంటలు వ్యవసాయ విద్యుత్ ఉన్న సమయంలో ‘ఎ’ గ్రూపునకు పగలు 3 గంటలు, రాత్రి 4 గంటలు ఇస్తే.. ‘బి’ గ్రూపునకు పగలు 4 గంటలు, రాత్రి 3 గంటలు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పగలు గంట, రాత్రి గంట మాత్రమే ఇస్తున్నారు. తాజాగా అధికారిక ఉచిత విద్యుత్ సరఫరాను 6 గంటలకు కుదించారు. దీంతో వ్యవసాయానికి ఎప్పుడు విద్యుత్ సరఫరా ఉంటుందో.. ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి నెలకొంది. తాజా ఆదేశాల ప్రకారం ‘ఎ’ గ్రూపునకు రాత్రి 9 నుంచి 12 గంటల వరకు, పగలు 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇవ్వాలని ఆదేశించారు. ‘బి’ గ్రూపు ఫీడర్లకు రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవ్వాలని ఆదేశించారు. అయితే పగలు గ్రామాల్లో అసలుకే విద్యుత్ సరఫరా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో రాత్రిపూట కేవలం ఒక గంట మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 10 వేల వ్యవసాయ ఫీడర్లు ఉన్నాయి. ఇందులో సగం ఫీడర్లకు నిర్దేశిత 7 గంటలు విద్యుత్ సరఫరా చేయడం లేదని అధికారికంగా డిస్కంలే చెబుతున్నాయి. అయితే వాస్తవ పరిస్థితి మరింత దారుణంగా ఉందని, తాజాగా 7 గంటల విద్యుత్ను 6 గంటలకు కుదించిన నేపథ్యంలో ఇక పంటలు ఎండిపోక తప్పదని రైతులు అంటున్నారు. లాభ నష్టాలపైనే దృష్టి.. సంక్షేమం నాస్తి విద్యుత్ లోటు నేపథ్యంలో గ్రామాల్లో పగలు 12 గంటల పాటు విద్యుత్ కోతను అమలు చేస్తున్న ప్రభుత్వం వ్యవసాయానికి అరకొరగానే సరఫరా చేస్తోంది. గృహాలకు విద్యుత్ చార్జీలు తక్కువగా ఉండటం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కావడంతో ప్రభుత్వం ఈ రెండు కేటగిరీల విషయంలో కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నారుు. భారీగా విద్యుత్ ఛార్జీలు ఉన్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థల జోలికి ప్రభుత్వం వెళ్లకుండా కరెంటు సరఫరా చేయడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. లాభనష్టాల బేరీజు తప్ప ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టకపోవడమే విద్యుత్ కోతల్లో ఈ విధమైన వ్యత్యాసానికి కారణమన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి 31న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, సరఫరా, లోటు వివరాలు.. విద్యుత్ డిమాండ్: 282.32 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా: 256.48 మిలియన్ యూనిట్లు లోటు : 25.84 మిలియన్ యూనిట్లు ఇవీ అధికారిక కోతలు.. గ్రామాలు: 12 గంటలు మండల కేంద్రాలు: 6 నుంచి 8 గంటలు జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు: 2 నుంచి 4 గంటలు హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, వరంగల్: 1 నుంచి 2 గంటలు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు: కోతలు లేవు. -
‘ఉచిత విద్యుత్’ రైతులకు షాక్!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: 2004లో ఉచిత విద్యుత్ కనెక్షన్ పొందిన రైతుల నుంచి సేవా పన్ను వసూలు చేయకూడదని అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతినెలా చెల్లించాల్సిన రూ.20 సర్వీసు చార్జీ నుంచి రైతులకు ఊరట లభించింది. ఈ పన్ను శాశ్వతంగా మాఫీ అవుతుంద నుకున్న అన్నదాతలపై ప్రస్తుత సర్కారు కర్కశంగా వ్యవహరిస్తోంది. పాత చార్జీల బకాయిలను రూపంలో గణిస్తూ వసూళ్లకు తెగబడుతోంది. నెలవారీగా ఇంటికొచ్చే బిల్లులతో పాటే వ్యవసాయ కనెక్షన్కు సంబంధించిన సేవా పన్నును జతచేస్తూ రైతులను ఏమారుస్తోంది. ఒక్కొక్కరికి సగటున రూ.1200 నుంచి రూ.2 వేలు అదనంగా బాదేస్తూ బిల్లులు దంచేస్తుండడంతో అన్నదాత కుదేలవుతున్నాడు. బిల్లులు చెల్లించని కర్షకుల స్టార్లర్లు, మోటార్లు ఎత్తుకెళుతూ మానసికంగా వేధిస్తోంది. ఇటీవల మంచాల మండలం ఆరుట్ల, వికారాబాద్ మండలం గొట్టిముక్కులలో విద్యుత్ సరఫరా నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేసింది. 83వేల మందిపై మోత గత నాలుగేళ్లుగా కరువుతో అల్లాడిన రైతాంగం.. ఈయేడు వరదలతో సతమతమైంది. ఈ క్రమంలోనే ఈసారి కురిసిన వర్షాలకు భవిష్యత్పై రైతులకు ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే రబీకి సిద్ధమవుతున్న అన్నదాతలపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్కో సర్వీసు చార్జీల పేరిట దండయాత్రలు సాగిస్తోంది. బకాయిలు చెల్లించకపోతే మొదటగా ఇంటి కనెక్షన్ను కట్ చేస్తున్నారు. ఆపై స్టార్టర్లు మోటార్లు ఎత్తుకెళుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సంబంధిత వ్యవసాయ కనెక్షన్లను తొలగిస్తున్నారు. 2004లో అప్పటి సీఎం వైఎస్సార్ ఉచిత విద్యుత్కు శ్రీకారం చుట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా 82,244 మంది రైతులు ఈ స్కీం పరిధిలో చేరారు. ఉచిత విద్యుత్ క నెక్షన్లకు సర్వీసు చార్జీల రూపంలో రూ.20 వసూలు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయదారుల నుంచి ఈ మొత్తాన్ని కూడా ఏనాడూ వసూలు చేయలేదు. దీంతో రైతాంగం సర్వీసు చార్జీ వ్యవహారాన్ని మరిచిపోయింది. ఈ నేపథ్యంలో చార్జీని 2011లో రూ.30కి పెంచుతూ ఇంధన శాఖ నిర్ణయం తీసుకుంది. తాజాగా సర్వీసు చార్జీలు చెల్లించాలంటూ రైతులకు బిల్లులు పంపింది. 2004 నుంచి ఇప్పటివరకు మొత్తాన్ని లెక్కగట్టి మరీ రైతులకు బిల్లుల చిట్టాను జారీ చేస్తోంది. ఇంటికి వ చ్చే కరెంట్ బిల్లులోనే దీన్ని కూడా జమ చేసి పంపుతోంది. సకాలంలో స్పందించి బిల్లులు కడితే సరేసరి.. లేకపోతే ఒకట్రెండు రోజుల్లోనే తమ ప్రతాపాన్ని చూపుతోంది. రూ.20 కోట్ల భారం..! గత తొమ్మిదేళ్లుగా ఉచిత విద్యుత్ పొందుతున్న 83వేల మంది రైతులపై తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రూ.20 కోట్ల భారం పడనుంది. అన్నదాతలపై కాఠిన్యాన్ని ప్రదర్శించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని గుర్తుకు తెచ్చేలా ప్రస్తుత కిరణ్ సర్కారు వ్యవహరిస్తుండడంతో రైతాంగం లబోదిబోమంటోంది. వరుస కరువుతో అల మటించిన తమకు ఈయేడే వాతావరణం అనుకూలించడంతో కాస్తో కూస్తో పంటలు పండుతాయనే ఆశలపై తాజాగా ట్రాన్స్కో నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తోందని రైతులు వాపోతున్నారు. తొమ్మిదేళ్ల బకాయిలను ఇప్పుడు మోపడం ఎంతవరకు సబబు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉచిత విద్యుత్పై స్పష్టత ఇవ్వాలి: కోదండరెడ్డి
కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రైతులకిచ్చే ఉచిత విద్యుత్ను నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తలపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కిసాన్సెల్ చైర్మన్ ఎ.కోదండరెడ్డి డిమాండ్ చేశారు. ‘పైరుకు వైరు కట్ ’ శీర్షికన మగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. కష్టాల కడలిలో ఉన్న రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ చాలా ఊరటగా ఉందని, దానిని కూడా రైతులకు అందకుండా చేయాలని చూడడం దారుణమని వ్యాఖ్యానించారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీ ఉందని, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అదే కారణమైందని చెప్పారు. 2009 మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ ఇచ్చే వేళ లను పెంచుతామన్నారని, అందుకు విరుద్ధంగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వస్తున్న వార్తలు వాస్తవమైతే.. అది సరైంది కాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. పార్టీలో చర్చించకుండా.. దొడ్డిదారిన ఇలాంటి చర్యలకు పూనుకోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. -
పల్లెకు విద్యుత్ ‘షాక్’!
సాక్షి, హైదరాబాద్: వేసవికి ముందే రాష్ట్ర ప్రజలకు చెమటలు పడుతున్నాయి. ఒకవైపు ఎండల వేడిమి... మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. గ్రామాలైతే ఏకంగా 12 గంటల పాటు విద్యుత్ సరఫరా లేక అల్లాడుతున్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కూడా 2 నుంచి 3 గంటలు మాత్రమే సరఫరా అవుతోంది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో రోజుకు 2 గంటల చొప్పున విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో 4 గంటలు, మండల కేంద్రాల్లో 6 గంటల చొప్పున కోతలు విధిస్తున్నారు. అయితే ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకూ అని అధికారికంగా ఎక్కడా ప్రకటించడం లేదు. అనధికారికంగా ఇష్టమొచ్చినట్టు కోతలను అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు అక్టోబర్ మొదటివారంలో విద్యుత్ కోతలు అమలుచేసిన సందర్భం లేదు. గత ఏడాది మాత్రమే సింగరేణిలో సమ్మె కారణంగా బొగ్గు సరఫరాకు ఆటంకం ఏర్పడి కొద్దిమేరకు విద్యుత్ కోతలను అమలు చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతున్నప్పటికీ విద్యుత్ కోతలు ఎందుకు అమలవుతుండటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గృహ వినియోగదారులకు అడ్డదిడ్డంగా కోతలు అమలు చేస్తున్న ప్రభుత్వం... మరోవైపు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను కూడా తీవ్రంగా తగ్గించింది. వ్యవసాయ ఫీడర్లకు రోజుకు 7 గంటల చొప్పున ఉచిత విద్యుత్ను సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఎక్కడా 7 గంటలు సరఫరా కావడం లేదు. కేవలం 2-3 గంటల మేరకు మాత్రమే విద్యుత్ వస్తోంది. అది కూడా పదే పదే ట్రిప్ అవుతూ మూడు, నాలుగు విడతలుగా వస్తోంది. దీంతో తడిపిన మడినే మళ్లీ మళ్లీ తడపాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పంట చేతికి వస్తున్న సమయంలో విద్యుత్ కోతల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా చేస్తే జీతాల్లో కోత విధిస్తామని ఉద్యోగులను ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా దారుణంగా పడిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో వ్యవసాయానికి ఏరోజైనా 7 గంటలు సరఫరా కాకపోతే... మరుసటి రోజు ఆ మేరకు అదనంగా విద్యుత్ సరఫరా చేసేవారు. ఈ విధానాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. ఉత్పత్తి పెంచని సర్కారు!: భారీ వర్షాలతో రిజర్వాయర్లు నీళ్లతో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్లలో విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతోంది. వీటితో పాటు జూరాల, సీలేరు బేసిన్లోని విద్యుత్ ప్లాంట్లలోనూ ఉత్పత్తి బాగా జరుగుతోంది. అయితే పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీపీసీకి చెందిన వైజాగ్లోని సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ఒక యూనిట్లో బొగ్గు కొరత కారణంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మిగిలిన మూడు యూనిట్లలోనూ పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. దీంతో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన విద్యుత్ వాటా తగ్గిపోయింది. ఈ ప్లాంట్లకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచేందుకు వీలుంది. తద్వారా రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ కూడా పెరుగుతుంది. అయితే ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేసవిని తలపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పల్లెలు తేడా లేకుండా అనధికారిక విద్యుత్ కోతలు అమలవుతున్నాయని చెబుతున్నారు. -
ఉచిత విద్యుత్ పథకంలో కోత!