gajendra singh
-
‘ప్రధాని బహమతుల’ వేలం నేటి నుంచే
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ షూ, పారాలింపిక్ విజేతలకు చెందిన వస్తువులు, అయోధ్య రామాలయం ప్రతిరూపం, వెండి వీణ..ఇలా ప్రధాని మోదీ ఏడాది కాలంలో అందుకున్న బహమతుల వేలం ఈ నెల 17న మొదలై అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. సుమారు రూ.1.5 కోట్లకు పైగా విలువైన 600 జ్ఞాపికలను వేలంలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో ప్రదర్శనను సోమవారం మంత్రి తిలకించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వేలం రూ.600 నుంచి గరిష్టంగా రూ.8.26 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. -
రాజస్తాన్ రాజెవరో?
రాజస్తాన్ శాసనసభ ఎన్నికల్లో విపక్ష బీజేపీ ఘన విజయం సాధించింది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి పరాభవం ఎదురైంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై అందరి దృష్టి కేంద్రకృతమైంది. రాజస్తాన్ రాజు ఎవరవుతారో మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. ప్రధానంగా నలుగురు ముఖ్యనేతలు సీఎం రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరోసారి పదవి ఆశిస్తున్నారు. పార్లమెంట్ సభ్యురాలు దియా కుమారి(ఈ ఎన్నికల్లో విద్యాధర్నగర్ స్థానం నుంచి గెలిచారు), కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మహంత్ బాలక్నాథ్ యోగి సైతం సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే.. వసుంధర రాజే వసుంధర రాజే గతంలో రెండుసార్లు రాజస్తాన్ సీఎం చేశారు. ఈ ఎన్నికల్లో జాల్రాపటాన్ స్థానం నుంచి భారీ మెజారీ్టతో గెలుపొందారు. ఆమె బీజేపీ అధిష్టానాన్ని విభేదిస్తున్న నేతగా పేరుగాంచారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పెద్దగా సత్సంబంధాలు లేవన్న సంగతి బహిరంగ రహస్యమే. బీజేపీలో పాతతరం నేత అయిన వసుంధర రాజేను మూడోసారి గద్దెనెక్కించడానికి పార్టీ అగ్రనేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఆశీస్సులు లేకపోవడంతో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కుదించుకుపోయాయి. దియా కుమారి రాజ్సమంద్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దియా కుమారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి నెగ్గారు. జైపూర్ దివంగత మహారాణి గాయత్రి దేవి మనవరాలైన దియా కుమారి బీజేపీలో వసుంధర రాజేకు ప్రత్యామ్నాయ నేతగా ఎదిగారు. రాచరిక నేపథ్యం, రాజ్పుత్ వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసివచ్చాయి. చాలాఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. గతంలో సవాయ్మాధోపూర్ ఎమ్మెల్యేగా ఆమె చేసిన అభివృద్ధి పనులు ప్రశంలందుకున్నాయి. రాజస్తాన్లో నూతన ముఖ్యమంత్రిని నియమించే విషయంలో పార్టీ అధిష్టానం దియా కుమారి వైపు మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మహంత్ బాలక్నాథ్ యోగి రాజస్తాన్లోనూ ఉత్తరప్రదేశ్ తరహా ప్రయోగం చేయాలనుకుంటే ముందుగా గుర్తొచ్చే పేరు మహంత్ బాలక్నాథ్ యోగి. ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ మఠాధిపతి అయిన ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యారు. బాలక్నాథ్ ప్రస్తుతం రాజస్తాన్లో అల్వార్ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. గతంలో సన్యాసం స్వీకరించారు. మహంత్ చాంద్నాథ్ మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. రాష్ట్రంలో బలమైన అనుచరవర్గం ఉంది. నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం దృష్టిలో ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గజేంద్రసింగ్ షెకావత్ రాజస్తాన్ బీజేపీలో మరో సీనియర్ నేత గజేంద్రసింగ్ షెకావత్. ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అవినీతి వ్యవహారాలపై పలు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా పనిచేశారు. ముఖ్యమంత్రిపై పలు ఆరోపణలు గుప్పించారు. తదుపరి సీఎం రేసులో తాను ఉన్నానంటూ ఇప్పటికే సంకేతాలు పంపించారు. కొందరు బీజేపీ ముఖ్యనేతలు ఆయనకు మద్దతిస్తున్నారు. సీఎం పోస్టుపై గజేంద్రసింగ్ ఆశలు పెట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పోలవరం తొలిదశ పూర్తికి రూ.15,661 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.15,661 కోట్లు అవసరమని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తేల్చింది. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేస్తూ శుక్రవారం కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి నివేదిక పంపినట్లు సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్విందర్సింగ్ వోరా వెల్లడించారు. ఇప్పటికే పోలవరం తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ఇందులో భాగంగా జూన్ 5న కేంద్ర ఆర్థికశాఖ మెమో కూడా జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి అదనంగా 36 గ్రామాలు వస్తాయని తేలింది. ఆ గ్రామాల ప్రజలకు తొలిదశ కిందే పునరావాసం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. ఆ మేరకు సవరించిన ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.17,148 కోట్లు అవసరమంటూ సవరించిన వ్యయ ప్రతిపాదనలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా సీడబ్ల్యూసీకి పంపింది. వాటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ తొలిదశ పూర్తికి రూ.15,661 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత నిధుల విడుదల.. సీఎం జగన్ చేసిన విజ్ఞప్తి.. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి సూత్రప్రాయంగా కూడా అంగీకరించింది. ఆ గ్రామాల ప్రజలకు పునరవాసం కల్పించడానికి అదనంగా రూ.2,749.85 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. మొత్తం రూ.15,661 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్శక్తి శాఖకు శుక్రవారం సిఫార్సు చేసింది. కేంద్ర జల్శక్తి శాఖ ఆ మేరకు పోలవరానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేయనుంది. దీని ఆధారంగా కేంద్ర కేబినెట్కు జల్శక్తి, ఆర్థిక శాఖలు ప్రతిపాదన పంపనున్నాయి. దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే పోలవరం తొలిదశ పూర్తికి అవసరమైన నిధులు విడుదలకు మార్గం సుగమం అవుతుంది. దశల వారీగా పోలవరంలో నీటినిల్వ.. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాగా.. గరిష్ట నీటినిల్వ 194.6 టీఎంసీలు. కొత్తగా నిరి్మంచే ఏ ప్రాజెక్టులోనైనా సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది దాని పూర్తినిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు.. మరుసటి ఏడాది 2/3వ వంతు, తర్వాత పూర్తిస్థాయిలో నీటినిల్వ చేయాలి. లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంతోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలిఏడాది 41.15 మీటర్లలో, తర్వాత దశల వారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం 45.74 మీటర్లలో నీటినిల్వ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కేంద్రాన్ని ఒప్పించిన సీఎం జగన్.. నిజానికి.. కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో 2013–14 ధరల ప్రకారమే పూర్తిచేస్తామని 2016, సెప్టెంబరు 7న నాటి సీఎం చంద్రబాబు అంగీకరించి పనులను దక్కించుకున్నారు. అప్పటి ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.20,398.61 కోట్లు ఇచ్చేందుకు అప్పట్లో కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఇందులో 2014, ఏప్రిల్ 1 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు మినహాయించి మిగతా అంటే రూ.15,667.91 కోట్లు ఇస్తామని తేల్చింది. 2014, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.14,969.37 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇక రూ.698.54 కోట్లు మాత్రమే మిగిలాయి. కానీ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లు అవసరం. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేస్తూ.. 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఖరారు చేసిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేసి, ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ప్రధాని మోదీని కోరారు. ఈ క్రమంలోనే తొలిదశ పూర్తికి అడ్హక్గా రూ.పది వేల కోట్లు ఇచ్చి.. ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా రైతులకు అందించేందుకు సహకరించాలని సీఎం జగన్ చేసిన వినతిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్శక్తి, ఆర్థిక శాఖలను ఆదేశించారు. -
కాళేశ్వరంపై సందేహాలన్నీ తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం, మనుగడ, సుస్థిరతలపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేననెత్తిన సందేహాల్లో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని, వాటికి కూడా బదులిస్తే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీని పరిశీలిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్లు తెలిసింది. జీఎస్టీ సమావేశంలో పాల్గొనేందుకు గత జూలైలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అక్కడ జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తాజాగా షెకావత్ స్పందించారు. మంత్రి హరీశ్రావు స్వయంగా లేఖ రాశారు. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలు అసంపూర్ణంగా ఉన్నాయని, అన్ని అంశాలపై సమగ్ర సమాధానాలను ఇవ్వాలని లేఖలో కోరినట్టు తెలిసింది. ఆ వెంటనే ప్రాజెక్టుకు అనుమతుల జారీ ప్రక్రియను పునరుద్ధరిస్తామని కూడా తెలియజేసినట్టు సమాచారం. ఇబ్బందికర ప్రశ్నలు..క్లుప్తంగా వివరాలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు చేసిన వ్యయం, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు యూనిట్కు రూ.3 చొప్పున విద్యుత్ సరఫరాకు తెలంగాణ ఈఆర్సీ అనుమతి ఇచ్చిందా? ప్రస్తుత విద్యుత్ చార్జీలు ఎంత? విద్యుత్ చార్జీల భారం దృష్ట్యా భవిష్యత్తులో ప్రాజెక్టు ఆర్థికంగా మనుగడ సాధిస్తుందా? ప్రాజెక్టు సుస్థిర మనుగడకు ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి ? ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎంత? రుణాలు, వడ్డీల రేట్లు ఎంత? తదితర వివరాలను అందజేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. గతేడాది జూలైలో గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్హౌస్లు ఎందుకు మునిగాయి? పంప్హౌస్లు, సర్విస్ బే ఎత్తుఎంత? జలాశయాల ఎఫ్ఆర్ఎల్ ఎంత? లాంటి సాంకేతిక అంశాలపై కూడా ఆరా తీసింది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన అన్ని కాంపోనెంట్ల డిజైన్లను సమర్పించాలని సూచించింది. దూర ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణాలు, ప్రాజె క్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలనూ అడిగింది. సీడబ్ల్యూసీ అడిగిన సమాచారం చాలావరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండడంతో వివరాలు క్లుప్తంగా అందజేసినట్టు తెలిసింది. కాగా ఈ సమాచారంపై సంతృప్తి చెందకపోవడంతోనే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీ ప్రక్రియ ను సీడబ్ల్యూసీ నిలుపుదల చేసినట్టు సమాచారం. -
ఇంకా 2 నెలలు కావాలి!
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్య పరిష్కారం విషయంలో సుప్రీం కోర్టు సూచన మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల సీఎంలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆ శాఖ తాజాగా సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇందుకు మరికొంత సమయం కావాలని, మంగళవారం సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణను రెండు నెలలకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ అడ్వొకేట్ ఆన్ రికార్డ్ అరవింద్కుమార్ శర్మ ఇటీవల సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కి లేఖ రాశారు. ►పోలవరం ప్రాజెక్టుతో ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ముంపు ప్రభావం తీవ్రంగా ఉందని, నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఆయా రాష్ట్రాలు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పోలవరం ముంపు సాంకేతికపరమైన అంశం కావడంతో సంబంధిత రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖను ఆదేశిస్తూ గతేడాది నవంబర్ 6న సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఆయా రాష్ట్రాల సీఎంలతోఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి విభేదాలను సైతం పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీలు మూడు విడతలుగా సమావేశాలు నిర్వహించి సాంకేతికపర అంశాలను ఓ కొలిక్కి తెచ్చాయి. సుప్రీంలో కేసు తదుపరి విచారణకు వచ్చే నాటికి సీఎంలతో కూడా సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రయత్నాలు చేస్తోంది. 15న సాధ్యం కాని సీఎంల సమావేశం... వాస్తవానికి ఈ నెల 15న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తామని, రాగలరో లేదో తెలిపాలని ..పేర్కొంటూ ఆశాఖ ఈ నెల 8న ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సీఎంలకు లేఖ పంపించింది. కొన్ని రాష్ట్రాల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో 15న సమావేశం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మరో కొత్త తేదీని ప్రతిపాదిస్తూ ఆయా రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ మళ్లీ లేఖ రాయనుంది. సంబంధిత రాష్ట్రాల సీఎంలు సానుకూలంగా స్పందిస్తేనే ఈ సమావేశం సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. కొలిక్కి వచ్చిన సాంకేతిక అంశాలు.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గతేడాది సెప్టెంబర్ 29న 4 రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అక్టోబర్ 7న కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) మరో సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి సాంకేతిక అంశాలపై సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సీడబ్ల్యూసీ సూచన మేరకు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు తమ అభ్యంతరాలు, డిమాండ్లతో టెక్నికల్ నోట్స్ను సమర్పించగా, వీటిని పరిశీలించి సీడబ్ల్యూసీ వివరణలు పంపించింది. ఏపీ నుంచి సైతం వివరణలు తీసుకుంది. సీడబ్ల్యూసీ ఇచ్చిన వివరణలపై మళ్లీ మూడు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను పంపించాయి. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలపై పరిశీలన అనంతరం పోలవరం ముంపు ప్రభా వానికి సంబంధించిన సాంకేతిక అంశాలను కొలిక్కి తెచ్చి ఓ నివేదికను సీడబ్ల్యూసీ సిద్ధం చేసింది. సీఎంలతో సమా వేశం అనంతరం ఈ నివేదికకు తుది రూపు ఇచ్చి సుప్రీం కోర్టులో జరిగే తదుపరి విచారణలో సమర్పించనుంది. ఉమ్మడి సర్వేకి ముందుకు రావాలి.. పీపీఏ లేఖ గత నెల 25న నాలుగు రాష్ట్రాల అధికారులతో సీడబ్ల్యూసీ నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు తెలంగాణలో పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వేకి ముందుకు రావాలని సూచిస్తూ తాజాగా ఏపీకి పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ లేఖ రాసింది. వానకాలం ప్రారంభానికి ముందే సర్వే నిర్వహించాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఉమ్మడి సర్వేలో తేలిన అంశాల ఆధారంగా ముంపు నివారణకు పోల వరం ఆథారిటీ/ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమావేశం మినిట్స్లో సీడబ్ల్యూసీ పేర్కొంది. -
టోక్యో ఒలింపిక్స్.. వైకల్యాన్ని పరుగు పెట్టించింది
తొమ్మిది నెలలకు ముందే జన్మించిన శిశువు ఆమె! చెవులు కూడా పూర్తిగా ఎదగలేదు. ఏడు నెలలు ఇన్క్యుబేటర్లో ఉంచవలసి వచ్చింది. ఆ తర్వాతనైనా ఆమె బతుకుతుందని వైద్యులు నమ్మకంగా చెప్పలేకపోయారు. 22 రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె టోక్యో పారా ఒలింపిక్స్లో వంద మీటర్ల పరుగు పందెంలో పోటీ పడబోతోంది! ఆ మెగా ఈవెంట్కు అర్హత సాధించేలా సిమ్రాన్ శక్తిమంతురాలు అవడానికి ఆమె వైకల్యాలు ఒక కారణం అయితే.. భర్త చేయూత మరొక కారణం. ఆర్మీ జవాను భార్య టోక్యో పారా ఒలింపిక్స్కి వెళుతోందని సిమ్రాన్ శర్మను ఇప్పుడు అంతా కీర్తిస్తూ ఉన్నా.. ఆమెలోని ‘సైనికురాలికీ’ ఈ తాజా విజయంలో తగిన భాగస్వామ్యమే ఉంది. ఈ నెల 23న టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం అవుతున్న సమయానికే మొదలవుతున్న పారా ఒలింపిక్స్లోని వంద మీటర్ల ట్రాక్ ఈవెంట్కు సిమ్రాన్ అర్హత సాధించారు! భారతదేశంలో ఇప్పటి వరకు ఏ క్రీడాకారిణీ సాధించని ఘనత ఇది. అవును. పారా ఒలింపిక్స్లోని వంద మీటర్ల పరుగు పందానికి బరిలో దిగబోతున్న తొలి భారత మహిళ సిమ్రాన్ శర్మ! ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో (జె.ఎన్.ఎస్.) జూన్ 30 న జరిగిన వంద మీటర్ల పరుగు పందెంలో విజయం సాధించి.. టోక్యో ఫ్లయిట్ ఎక్కేందుకు ఇప్పుడామె సిద్ధంగా ఉన్నారు. పన్నెండు సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఒలింపిక్స్ ఎంట్రీ సంపాదించారు సిమ్రాన్. టోక్యో వెళ్లే ముందు ఆఖరి నిముషం వరకు కూడా సాధన చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తానని చెబుతున్న సిమ్రాన్.. జీవితంలో అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొన్న ఒక ‘రన్నర్’. ∙∙ సిమ్రాన్, ఆమె సిపాయి భర్త ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. భర్తే తన కోచ్ కావడం, ఆర్మీలో అతడి ఉద్యోగం కూడా ఢిల్లీలోనే అవడం సిమ్రాన్కు కలిసొచ్చింది. భార్యను గెలిపించి తీరాలన్న గజేంద్ర సింగ్ (30) సంకల్పం కూడా ఆమెను దృఢ మనస్కురాలిని చేసింది. అతడు ఆమెకు ఇచ్చింది సాధారణ శిక్షణ కాదు. భార్య కోసం, భార్యతో కలిసి అతడూ జె.ఎన్.ఎస్.లో రోజుకు ఐదు గంటలు ప్రాక్టీస్ చేశాడు! అదే గ్రౌండ్లో ఆమెను ఒలింపిక్స్కి ప్రవేశం సాధించిన విజేతగా నిలబెట్టాడు. అయితే ఇదేమీ అంత తేలిగ్గా జరగలేదు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయం ఆమె పోషకాహారానికి, ఇతర అవసరాల వరకు మాత్రమే సరిపోయేది. అందుకే భార్య శిక్షణకు అవసరమైన డబ్బు కోసం తాముంటున్న ప్లాట్ను అతడు అమ్మేశాడు గజేంద్ర సింగ్. బ్యాంకుల నుంచీ, స్నేహితుల నుంచీ మరికొంత అప్పు తీసుకున్నాడు. వాటికి ఈ దంపతులు వడ్డీ కట్టవలసి ఉంటుంది. అయితే ఒలింపిక్స్కి అర్హత సాధించడంతో ‘అసలు’ కూడా తీరిన ఆనందంలో ఉన్నారు వారిప్పుడు. ∙∙ భర్త ఆమె వ్యక్తి గత కోచ్ అయితే, ఆంటోనియో బ్లోమ్ ఆమె అధికారిక శిక్షకుడు. అంతర్జాతీయ స్థాయి వరకు ట్రాక్ అండ్ ఫీల్డ్లో 19 ఏళ్ల అనుభవం ఉన్న ఐ.ఎ.ఎ.ఎఫ్. కోచ్! అతడి శిక్షణలో ఆమె ప్రపంచ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించారు. 2019లో సిమ్రాన్ దుబాయ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కి చేరిన సమయానికి ఆమె తండ్రి మనోజ్ శర్మ ఇక్కడ ఇండియాలో వెంటిలేటర్ మీద ఉన్నారు. సిమ్రాన్ ఆ పోటీలను ముగించుకుని రాగానే కన్నుమూశారు. అంత దుఃఖంలోనూ అదే ఏడాది సిమ్రాన్ చైనా గ్రాండ్ ప్రిక్స్లో బంగారు పతకం సాధించారు. 2021 ఫిబ్రవరిలో దుబాయ్లోనే జరిగిన వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్లో బంగారు పతకం గెలుపొందారు. ఇంట్లో పెద్దమ్మాయి సిమ్రాన్. టోక్యో ఒలింపిక్స్తో ఇప్పుడు పుట్టింటికీ, మెట్టినింటికీ పెద్ద పేరే తేబోతున్నారు. సిమ్రాన్ శర్మ : పన్నెండు సెకన్లలో 100 మీటర్ల పరుగు లక్ష్యాన్ని ఛేదించి టోక్యో ఒలింపిక్స్కి అర్హత సాధించారు. -
కేంద్రమంత్రులు షెకావత్, ప్రకాష్ జవదేకర్కు సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్, ప్రకాష్ జవదేకర్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ మరోసారి సీఎం వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాకే.. రాయలసీమ లిఫ్ట్ సందర్శించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని ఆదేశించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్కు సీఎం జగన్ లేఖ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తోందని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ‘‘శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది. ఈనెల 1 నుంచి ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. 796 అడుగుల నీటిమట్టం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోందని’’ సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా రాయలసీమ లిఫ్ట్ను పరిశీలిస్తామని పదేపదే కేఆర్ఎంబీ కోరుతోంది. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాకే రాయలసీమ లిఫ్ట్ సందర్శించేలా కేఆర్ఎంబీని ఆదేశించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని, కేంద్ర జలశక్తి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అనేక ఫిర్యాదులు చేసినా సరైన చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఏపీ పట్ల కేఆర్ఎంబీ వివక్షతో వ్యవహరిస్తోందని, తెలంగాణ తప్పుడు ఫిర్యాదుల పట్ల మాత్రం కేఆర్ఎంబీ వేగంగా స్పందిస్తోందన్నారు. ఏపీ ఇచ్చిన ధర్మబద్ధమైన ఫిర్యాదులను కేఆర్ఎంబీ పట్టించుకోవడంలేదని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. ‘‘శ్రీశైలంలో 854 అడుగుల నీరు లేకుంటే కరువు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే అవకాశం లేదు. పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 800 అడుగుల వద్ద పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ నిర్మిస్తోంది. ఈ అక్రమ ప్రాజెక్టు వల్ల శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండే అవకాశాలు లేవని’’ సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్కు సీఎం వైఎస్ జగన్ లేఖ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్కు రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ‘‘జూన్ 1 నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా పరిధిలో ఇరిగేషన్ అవసరాలు లేకుండా తెలంగాణ నీటిని వినియోగిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసమే ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించింది. 854 అడుగులకు చేరితే గానీ పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే అవకాశం లేదని’’ లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలవనరుల కమిషనర్కు పూర్తి డీపీఆర్ను అందజేశామని.. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. -
నష్టపోయాం ఆదుకోండి: సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ : చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కురిసిన వర్షాలతో హైదరాబాద్ తీవ్రంగా అతలాకుతలమైందని, ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నిధి నుంచి సాయం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఢిల్లీ వచ్చిన కేసీఆర్.. షాతో సమావేశమయ్యారు. భారీ వర్షాలు, మునుపెన్నడూ లేని వరదలతో హైదరాబాద్ అతలాకుతలమైన తీరు, జరిగిన నష్టాన్ని సుదీర్ఘంగా ఆయనకు వివరించారు. వందలాది కాలనీలు నీట మునిగి హైదరాబాద్ వాసులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారని, బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సాయం అందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల వల్ల దాదాపు రూ.5వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని.. తక్షణ సాయం కింద రూ.1,350 కోట్లు సాయం అందించాలని ప్రధాని మోదీకి అక్టోబర్ 15న లేఖ రాసినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో వరద బాధితుల పునరావాస చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కేసీఆర్ కోరారు. రాజకీయ అంశాలూ చర్చకు..? కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సీఎం కేసీఆర్ దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. వరదసాయం, తెలంగాణలోని ఇతరత్రా అంశాలతోపాటు రాజకీయపరమైన విషయాలూ ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. కేంద్రంలో బీజేపీకి అంశాలవారీగా మద్దతిస్తూ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్న టీఆర్ఎస్కు.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వైఖరి కొంత ఇబ్బందిగా మారింది. గతంలోనూ పలుమార్లు టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొంత దూరం పెరిగినా తిరిగి ఎన్నికల అనంతరం సర్దుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు పార్టీల మధ్య సామరస్య వాతావరణం నెలకొల్పడం ద్వారా తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రప్పించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని.. అందుకే కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ట్రిబ్యునల్ మళ్లీ ఏర్పాటు చేయండి.. శుక్రవారం ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్.. తొలుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అభ్యర్థించారు. కృష్ణా నదీ జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య తిరిగి పంచేందుకు వీలుగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956 పరిధిలోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ను మళ్లీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు లేఖ కూడా సమర్పించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఉందని, 3 టీఎంసీల సామర్థ్యానికి అనుమతి రావాల్సి ఉందని వివరించారు. పర్యావరణ అనుమతులు రాకముందే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణం ప్రారంభించిందని, దీనిపై ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి, నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశాలపై కూడా షెకావత్తో కేసీఆర్ చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలు సహా ఇటీవలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తరపున లేవనెత్తిన అంశాల్లో కొన్నింటిని మరోసారి మంత్రి వద్ద ప్రస్తావించినట్టు పేర్కొన్నాయి. -
రాజస్తాన్: ఆడియో టేపుల కలకలం
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్ రాజకీయాల్లో ఆడియో టేపుల కలకలం రేగింది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రెబల్ ఎమ్మెల్యే భన్వర్లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ యత్నించారని పేర్కొంటూ కాంగెస్ పార్టీ రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ)నకు ఫిర్యాదు చేసింది. వారి కుట్రలకు సంబంధించిన మూడు ఆడియో టేపులు కూడా తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాల తెలిపారు. అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ నేతల కుట్రలను వెలికి తీయాలని ఆయన ఎస్ఓజీ పోలీస్ అధికారులను కోరారు. కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు గజేంద్ర సింగ్ షెకావత్, సంజయ్ జైన్, భన్వర్లాల్ శర్మపై ఎస్ఓజీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. (చదవండి: రాజకీయ సంక్షోభం: వసుంధరపై సంచలన ఆరోపణలు) ఇక ఇప్పటికే తిరుగుబాటు నేత సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేల పదవులను ఊడబెరికిన కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. బీజేపీ నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు భన్వర్లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ల పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను కాంగ్రెస్ రద్దు చేసింది. వారికి షోకాజ్ నోటీసులను జారీ చేసింది. కాగా, కాంగ్రెస్ ఆరోపణనలన్నీ అవాస్తవాలేనని రెబల్ ఎమ్మెల్యే భన్వర్లాల్ శర్మ తోసిపుచ్చారు. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. తమకు 109 మంది ఎమ్మెల్యేల బలం ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ మహేష్ జోషి వెల్లడించారు. అవసరమైనప్పుడు బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. మరోవైపు రాజస్తాన్ స్పీకర్ జారీ చేసిన నోటీసులపై సచిన్ పైలట్ వేసిన పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు కాసేపట్లో విచారించనుంది. (19 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ నోటీసులు) -
రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
-
గజేంద్ర సింగ్ షేకావత్తో బుగ్గన భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జల శక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి నిధుల విడుదల విషయంలో జాప్యం లేకుండా చూడాలని కోరారు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రితో భేటీ అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరాను. నిధుల విడుదలలో జాప్యం లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. రీయింబర్స్మెంట్ కోసం రివాల్వింగ్ ఫండ్ నుంచి నిధులు విడుదలయ్యేలా ఏర్పాటు చేయనున్నారు. నాబార్డు ద్వారా నిధుల సమీకరణ చేస్తున్నప్పటికీ, ఆ నిధుల విడుదలలో జాప్యం లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. -
పక్కాగా పోలవరం లెక్కలు
సాక్షి, అమరావతి: పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు పనులకు చేసిన వ్యయం రూ.5,177.62 కోట్లకు సంబంధించిన వోచర్ల (బిల్లులు)పై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మదింపు చేసి ఇచ్చిన నివేదిక (ఆడిటెడ్ స్టేట్మెంట్)ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు పంపింది. పోలవరం పనులకు ఖర్చుచేసిన రూ.3,791 కోట్ల బకాయిలను రీయింబర్స్ చేయాలని కోరింది. ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపి న నేపథ్యంలో రీయింబర్స్కు మార్గం సుగమమైం దని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత సర్కారు కాలయాపన.. 2014 ఏప్రిల్ 1కి ముందు పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.5,177.62 కోట్లకు సంబంధించి ఆడిటెడ్ స్టేట్మెంట్ను పంపితేనే నిధులు విడుదల చేస్తామని 2018 జూలై 26న కేంద్రం స్పష్టం చేసింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపకుండా కాలయాపన చేసింది. 2019 నవంబర్ 26న అదే విషయాన్ని మరోమారు గుర్తు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపుతామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో జనవరి 9న రూ.1,850 కోట్లను కేంద్ర జల్ శక్తి శాఖ పోలవరానికి విడుదల చేసింది. కాగ్తో ఆడిట్.. ► 2014 ఏప్రిల్ 1కి ముందు పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5,177.62 కోట్లు ఖర్చు చేసింది. పనులకు రూ.3,777.44 కోట్లు వెచ్చించగా భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీకి రూ.1,400.18 కోట్లు వ్యయం అయింది. ► కేంద్ర జల్శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు పనులకు చెల్లించిన మొత్తానికి సంబంధించిన 5,609 వోచర్లు, భూసేకరణ, సహాయ పునరా వాస ప్యాకేజీకి ఖర్చు చేసిన మొత్తానికి సంబం« దించిన 363 వోచర్లను ప్రిన్సిపల్ అకౌంటెట్ జనరల్కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ► వీటిని మదింపు చేసిన ‘కాగ్’ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ లెక్కలన్నీ పక్కాగా ఉన్నట్లు తేల్చి రాష్ట్ర జలవనరుల శాఖకు ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపారు. తొలగిన అడ్డంకులు.. ► పోలవరానికి ఖర్చు చేసిన రూ.2,300 కోట్లను రీయింబర్స్ చేయాలని మూడు నెలల క్రితం పీపీఏ ద్వారా రాష్ట్ర ప్రభు త్వం కేంద్ర జల్శక్తి శాఖకు ప్రతిపాదన పంపింది. అయితే ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపితేనే రీయింబర్స్ చేస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది. ► ప్రస్తుతం కేంద్ర జల్ శక్తి శాఖకు ఆడిటెట్ స్టేట్మెంట్ను పంపిన నేపథ్యంలో రీయింబర్స్కు అడ్డంకులు తొలగిపోయిన ట్లేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ► రూ.2,300 కోట్లతోపాటు మరో రూ.1,491 కోట్లను కూడా రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖను రాష్ట్ర జలవనరుల శాఖ కోరింది. -
నెలలోగా అపెక్స్ కౌన్సిల్ భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు నెలలోగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తామని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి.. అజెండాను సిద్ధంచేయాలని కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలతో అపెక్స్ కౌన్సిల్ భేటీని నిర్వహించి.. వివాదాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రెండు బోర్డుల చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్లతో మంత్రి షెకావత్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బోర్డుల వర్కింగ్ మాన్యువల్, కొత్త ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి అజెండాను పంపాలని ఇరు రాష్ట్రాలను కోరామని.. కానీ, ఇప్పటిదాకా అవి స్పందించలేదని మంత్రికి బోర్డుల చైర్మన్లు వివరించారు. దీనిపై షెకావత్ స్పందిస్తూ.. వారంలోగా అపెక్స్ కౌన్సిల్కు అజెండా పంపాలని కోరుతూ మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖలు రాయాలని, అప్పటికీ స్పందించకపోతే ఇటీవల నిర్వహించిన బోర్డుల సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా అజెండా ఖరారుచేసి పంపాలని బోర్డుల చైర్మన్లను ఆదేశించారు. అలాగే, రెండు బోర్డుల పరిధి, వర్కింగ్ మాన్యువల్నూ ఖరారు చేస్తామన్నారు. అజెండాను పంపితే.. ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించి నెలలోగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి షెకావత్ చెప్పినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. -
ఎండిన గొంతులు తడిపేందుకే..
సాక్షి, అమరావతి: దుర్భిక్ష రాయలసీమలో ఎండిన గొంతులు తడిపేందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని వివరిస్తూ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు లేఖ రాయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మా వాటా నీళ్లను వాడుకోవడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని.. ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని మాత్రమే వినియోగించుకుంటామని స్పష్టంచేయాలని దిశానిర్దేశం చేశారు. కృష్ణా, గోదావరిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల మీద రెండు రాష్ట్రాలు ఆయా బోర్డులకు ఇటీవల పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో ఈనెల 4న కృష్ణా బోర్డు.. 5న గోదావరి బోర్డు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాలను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాల్సిన ఆవశ్యకతను సమగ్రంగా వివరిస్తూ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రికి లేఖ రాయాలని సీఎం వారిని ఆదేశించారు. లేఖలో పొందుపర్చాలంటూ ముఖ్యమంత్రి సూచించిన ముఖ్యాంశాలు ఇవీ.. ► ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు కర్ణాటక పెంచుతుండటంవల్ల అదనంగా దాదాపు 100 టీఎంసీల మేర నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత జాప్యం జరుగుతుంది. ► విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కృష్ణాపై చేపట్టిన కొత్త ప్రాజెక్టులు. ► కృష్ణాకు వరద రోజులు తగ్గాయి. అలాగే, ఒకేసారి భారీగా వరద వస్తున్న అంశం. ► శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 881 అడుగుల్లో ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్ ప్రకారం పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించే అవకాశం ఉంది. కానీ, ఆ స్థాయిలో నీటి మట్టం పది రోజులు కూడా ఉండదు. ► నీటి మట్టం 854 అడుగులు ఉంటే కేవలం ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుంది. అంతకంటే నీటి మట్టం తగ్గితే కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా వాడుకునే అవకాశం ఉండదు. ► అందుకే 800 అడుగుల నుంచి నీటిని తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం. ► కానీ, శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తోంది. 796 అడుగుల నుంచి ఎడమగట్టు విద్యదుత్పత్తి కేంద్రం ద్వారా 42 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం తెలంగాణకు ఉంది. ► తెలంగాణ సర్కార్ శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి నీటిని తరలిస్తున్నప్పుడు.. అదే స్థాయి నీటి మట్టం నుంచి, రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన నీటిని తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల చేపడితే తప్పెలా అవుతుంది. ► ఈ ప్రాజెక్టువల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదు. ► అలాగే, రాయలసీమ ఎత్తిపోతలవల్ల పర్యావరణానికీ ఎలాంటి హాని కలగదు. మన వాటా నీటిని వినియోగించుకోవడానికే ఈ ప్రాజెక్టు చేపట్టాం. ► ఈ అంశాన్ని వివరిస్తూ ఎన్జీటీ (జాతీయ హరిత న్యాయస్థానం)లో పిటిషన్ దాఖలు చేయాలి. అంతేకాక.. కేంద్ర జల్శక్తి శాఖ, ఎన్జీటీలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని.. రాయలసీమ ఎత్తిపోతల పనులకు టెండర్లు పిలిచి శరవేగంగా రాయలసీమ ప్రజల తాగునీటి కష్టాలను కడతేర్చాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
తడారిన గొంతుక తడిపేందుకే ఎత్తిపోతల
సాక్షి, అమరావతి: దుర్భిక్షంతో తడారిన రాయలసీమ గొంతుక తడపడానికే.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని కృష్ణా బోర్డుకు మరోసారి స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన వాటా ప్రకారం నీటిని వాడుకోవడానికే ఎత్తిపోతల చేపట్టామని వివరించేందుకు సిద్ధమైంది. విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టులను నిలుపుదల చేశాకే రాయలసీమ ఎత్తిపోతలపై చర్చించాలని స్పష్టం చేయనుంది. కృష్ణా నదిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు ఇటీవల పరస్పరం బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ అంశంపై కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలు నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా బోర్డుకు నిర్దేశం చేశారు. తక్షణమే బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ క్రమంలో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాస, మిషన్ భగీరథ ప్రాజెక్టులతోపాటు సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ పనులను నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్ను బోర్డు ఆదేశించింది. అదే తరహాలో రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఇరు రాష్ట్రాలకు చైర్మన్ ఎ.పరమేశం లేఖ రాశారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లతోపాటు నీటి పంపిణీ, విద్యుత్ పంపిణీ, టెలీమెట్రీ రెండో దశ అమలు, బడ్జెట్ –సిబ్బంది కేటాయింపు అంశాలను అజెండాలో చేర్చారు. కృష్ణా బోర్డు సూచనల మేరకు సమావేశంలో చర్చించే అంశాల అజెండాను ఏపీ జలవనరుల శాఖ ఖరారు చేసింది. ఆ అజెండాలో ముఖ్యాంశాలు ఇవీ.. ► శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్(పీహెచ్పీ) ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు నీటిని తరలించవచ్చు. కానీ ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదిలో 10 – 15 రోజులు కూడా ఉండదు. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటే పీహెచ్పీ ద్వారా కేవలం ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. నీటి మట్టం అంతకంటే తగ్గితే రాయలసీమ ప్రాజెక్టులకు చుక్క నీరు కూడా చేరదు. కేటాయింపులున్నా నీటిని తీసుకునేందుకు అవకాశం ఉండదు. ► తెలంగాణ కొత్తగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాస, మిషన్ భగరీథ, సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీల డీపీఆర్లను పరిశీలించిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ ఇస్తాం. ► కృష్ణా నదికి వరద వచ్చే సమయంలో ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి నీటిని విడుదల చేసే సమయంలో వినియోగించుకున్న నీటిని లెక్కలోకి తీసుకోకూడదు. సాంకేతిక కమిటీ నివేదికను తక్షణమే తెప్పించి మిగులు జలాల్లో వాటాలను తేల్చాలి. ► నాగార్జునసాగర్ ఎడమ కాలువలో 39.41 – 43.67 శాతం వరకు సరఫరా నష్టాలను తెలంగాణ సర్కార్ చూపిస్తోంది. దీంతో ఏపీ వాటా కింద రావాల్సిన జలాలు రావడం లేదు. సరఫరా నష్టాలను తేల్చడానికి రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేయాలి. ► కృష్ణా బోర్డు ఏర్పాటై 6 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ బోర్డు పరిధిని తేల్చలేదు. వర్కింగ్ మ్యాన్యువల్ను ఆమోదించలేదు. తక్షణమే పరిధిని ఖరారు చేసి వర్కింగ్ మ్యాన్యువల్ను ఆమోదించాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలి. ► విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పనిచేయాలి. బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించాలి. -
పోలవరానికి రూ.3,319.89 కోట్లు రీయింబర్స్ చేయండి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.3,319.89 కోట్లను రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్డబ్ల్యూడీఏ) ద్వారా కాకుండా ‘నాబార్డు’ నుంచి నిధులను నేరుగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి(పీపీఏ) విడుదల చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ప్రతిపాదించారు. దీనిపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. పోలవరానికి రూ.2,156 కోట్లు రీయింబర్స్ చేయాలని పీపీఏ ప్రతిపాదనలు పంపిందని.. వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ.1,163.89 కోట్ల రీయింబర్స్మెంట్కు సంబంధించి పీపీఏ నుంచి ప్రతిపాదనలు రాగానే, వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. - పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేయడంతోపాటు సవరించిన అంచనాల మేరకు నిధులు ఇచ్చి సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలంటూ పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. - దాంతో గత నెలలో పోలవరానికి రూ.1,850 కోట్లను రీయింబర్స్ చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్డబ్ల్యూడీఏ ద్వారా పీపీఏకు నాబార్డు నిధులు విడుదల చేసింది. వాటిలో రూ.1,780 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ విడుదల చేసింది. దీంతో కేంద్రం రీయింబర్స్ చేయాల్సిన బకాయిలు రూ.5,099.89 కోట్ల నుంచి రూ.3,319.89 కోట్లకు తగ్గాయి. - రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లులపై ఆడిటింగ్ నిర్వహిస్తున్న పీపీఏ.. మార్చి మొదటి వారంలో రూ.2,156 కోట్లు రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు సిఫార్సు చేసింది. ఈ ఫైలుపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఆమోదముద్ర వేసి.. ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు పంపారు. రెండు రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో ఫోన్లో మాట్లాడారు. పోలవరానికి రీయింబర్స్ చేయాల్సిన నిధులు విడుదల చేయడంతోపాటు 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. - సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సమావేశమై.. పోలవరానికి రీయింబర్స్ చేయాల్సిన నిధులు విడుదల చేయాలని విన్నవించారు. అభివృద్ధి ఆగదు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అసలు జరగడం లేదు అనేది తప్పుడు ప్రచారమేనని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోయినప్పటికీ అభివృద్ధి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని పునరుద్ఘాటించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ రమేష్చంద్ర (వ్యవసాయం), డాక్టర్ రఘునాథ్ మిశ్రాతో(సాగునీటి శాఖ) సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. విజ్ఞాపన పత్రాలు అందజేశారు. అనంతరం ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఏపీలో గత ప్రభుత్వం తీసుకున్న అనవసరమైన నిర్ణయాలను వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సమీక్షిస్తోందని, అప్పట్లో జరిగిన అవినీతిని వెలికితీస్తోందని, దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ ఇంకా ఏం చెప్పారంటే.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన - ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు తీర్పు దరిమిలా నిర్వహిస్తున్నామని, అందువల్ల పెండింగ్లో ఉన్న రూ.5,000 కోట్ల గ్రాంట్ను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరాం. - కేంద్రం గ్రాంట్ ఇవ్వకపోయినా ఇప్పటివరకూ గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో కనీస సదుపాయాలకు అయిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించిందనే విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశాం. - ఉత్తరాంధ్రలోని ఉద్ధానం, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని కొన్ని మండలాలు, వైఎస్సార్ జిల్లాలోని పులివెందులకు మంచి నీటి సదుపాయం కల్పించడం కోసం వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని ప్రతిపాదించామని, దానికి నిధులివ్వాలని గజేంద్రసింగ్ షెఖావత్కు విజ్ఞప్తి చేశాం. - గత టీడీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. టీడీపీ ప్రభుత్వం దిగిపోతూ రూ.60 వేల కోట్ల మేరకు చెల్లింపు బకాయిలు పెట్టి పోయింది. వీటిలో ఇప్పటికి అన్నీ కలిపి సుమారు రూ.23 వేల కోట్లు చెల్లించాం. - వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగించడం సరికాదు. పిల్లల చదువులపై వ్యయం చేయడం తప్పా? రైతు భరోసా అమలు చేసి అన్నదాతలను ఆదుకోవడం తప్పా? కేంద్రం ఇస్తున్న నిధులకు మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను జత చేసి రైతులకు సాయం అందిస్తోంది. బీమా పథకాన్ని రైతులకు అలవాటు చేయాలన్న ఉద్దేశంతో పంటలకు బీమా కట్టడం తప్పవుతుందా? -
వాటర్ గ్రిడ్కు అధిక నిధులివ్వండి
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటిలో మంచి నీటి కొళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి 365 రోజుల పాటు నీటి సరఫరా చేయడానికి ఉద్దేశించిన వాటర్ గ్రిడ్ పథకం అమలుకు కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలసి వినతిపత్రం అందజేసేందుకు సోమవారం రాష్ట్రం నుంచి అధికారుల బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. లోక్సభలో వైఎస్సార్సీపీ పక్ష నాయకుడు మిథున్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, వాటర్ గ్రిడ్ ఇన్చార్జి ఎండీ గిరిజా శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఈఎన్సీ కృష్ణారెడ్డిలు సోమవారం కేంద్రమంత్రిని కలుస్తారని అధికారవర్గాలు తెలిపాయి. 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయి ఏర్పాటు లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే కొత్తగా ‘జల జీవన్ మిషన్’ పేరుతో ఓ కొత్త కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అవసరమయ్యే నిధులను కేంద్రం– రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సమకూర్చుకోవాలన్నది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేంద్రం ప్రారంభించిన జలజీవన్ మిషన్ కార్యక్రమం లాంటి లక్ష్యాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందే వాటర్ గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టిన అంశాన్ని అధికారుల బృందం కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. అందుకనుగుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాటర్ గ్రిడ్ పథకం అమలుకు జలజీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా కేంద్రం నుంచి అధికంగా నిధులను రాష్ట్రానికి కేటాయించాలని కోరనుంది. వచ్చే 30 ఏళ్లకు అనుగుణంగా ప్రణాళికలు.. వాటర్ గ్రిడ్ పథకం అమలుకు మొత్తం రూ. 49,938 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. ప్రతి వేసవిలోనూ నీటి సరఫరాకు ఆటంకం లేకుండా ఉండేందుకు సాగునీటి రిజర్వాయర్ల నుంచి నేరుగా పైపుల ద్వారా మంచినీటి పథకాలకు నీటి సరఫరా జరిగేలా ఈ వాటర్ గ్రిడ్ను డిజైన్ చేశారు. వచ్చే 30 ఏళ్లకు అనుగుణంగా పెరుగుతున్న అవసరాలకు తగ్గుట్టు గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికీ రోజుకి వంద లీటర్ల చొప్పున, మున్సిపాలిటీలో 135 లీటర్ల చొప్పున, నగరాల్లో 150 లీటర్ల చొప్పున సరఫరా చేయడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటి సరఫరాకు వీలుగా మొత్తం వాటర్ గ్రిడ్ పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి 2020–21 సంవత్సరంలో రూ. 8,040 కోట్లు, 2021–22లో రూ. 11,166 కోట్లు, 2022–23లో రూ. 13,409 కోట్లు, 2023–24లో రూ. 17,323 కోట్ల చొప్పున ఈ పథకానికి ఖర్చు చేయనున్నారు. -
గోదావరి – కృష్ణా అనుసంధానంపై ముసాయిదా డీపీఆర్ సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నుంచి కృష్ణా, కృష్ణా నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్లింపు కోసం నేషనల్ వాటర్ డవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్లు్యడీఏ) ముసాయిదా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం రాజ్యసభలో వివరించారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆదుకునేందుకు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు నీరు మళ్లించే అవకాశాలను పరిశీలించవలసిందిగా కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్æ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని వివరించారు. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్ట్కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా సీఎం కోరినట్లు మంత్రి చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై ఎన్డబ్లు్యడీఏ సిద్ధం చేసిన ముసాయిదా డీపీఆర్పై తమ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతూ సంబంధిత రాష్ట్రాలకు పంపించినట్లు షెకావత్ చెప్పారు. గోదావరి–కావేరీ లింక్ ప్రాజెక్ట్లో ప్రధానంగా మూడు లింక్లు ఉంటాయని, ఆయా ప్రాజెక్ట్ల ద్వారా నిరుపయోగంగా పోతున్న 247 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. గోదావరి–కృష్ణా లింక్ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 3.45 లక్షల నుంచి 5.04 లక్షల హెక్టార్ల భూములకు ఏటా సాగునీటి వసతి కల్పించవచ్చని చెప్పారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్పై సంబంధిత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన అనంతరం తుది డీపీఆర్ రూపొందించి, చట్టపరమైన అనుమతులు పొందిన తరువాత పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు. సాగరమాల కింద ఏపీలో 32 రోడ్డు, 21 రైల్ ప్రాజెక్ట్లు సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్ప్రాజెక్ట్లలో ఆంధ్రప్రదేశ్కు 32 రోడ్డు, 21 రైల్ప్రాజెక్ట్లు కేటాయించినట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. ఏపీలోని 9 జిల్లాల్లో సంప్రదాయ పారిశ్రామిక క్లస్టర్లు సాంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రత్యేక నిధితో ఒక పథకాన్ని ప్రారంభించినట్లు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మంత్రి నితిన్గడ్కరీ రాజ్యసభలో చెప్పారు. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఈ పథకంలో భాగంగా ఖాదీ, క్వాయర్, విలేజ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసి తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీలోని చిత్తూరు (కలంకారీ), విజయనగరం (క్వాయర్ పరుపుల తయారీ), చిత్తూరు (క్వాయర్ ఉత్పాదనలు), కృష్ణా (కొండపల్లి బొమ్మలు), తూర్పుగోదావరి (జొన్నాడ ఫుడ్ప్రాసెసింగ్), చిత్తూరు (చింతపండు), గుంటూరు (మంగళగిరి బంగారు ఆభరణాలు), తూర్పు గోదావరి (కడియపులంక కొబ్బరిపీచు ఉత్పాదనలు) జిల్లాల్లో మొత్తం 9 సంప్రదాయ పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
2021 నాటికి ‘పోలవరం’ పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికను(యాక్షన్ ప్లాన్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసించింది. గోదావరికి వరదలు వచ్చేలోగా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, నిర్వాసితుల పునరావాసం పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడింది. ఆర్థిక వనరులు సమకూర్చితే ఆ యాక్షన్ ప్లాన్ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తుందని స్పష్టం చేస్తూ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు శనివారం నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హెచ్కే హల్దార్ నేతృత్వంలో నిపుణుల కమిటీ నివేదికలో ఏం పేర్కొన్నారంటే.. పకడ్బందీ ప్రణాళికతో పనులు - పోలవరం స్పిల్ వేలో 18.48 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకుగానూ, 15.81 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన 2.67 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను జూలై 2020 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు. నెలకు సగటున 33,375 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం ద్వారా వాటిని పూర్తి చేయనున్నారు. - స్పిల్ ఛానల్లో 18.75 లక్షల క్యూబిక్ మీటర్లకుగానూ, 13.31 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 5.44 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను నెలకు 48,545.55 క్యూబిక్ మీటర్ల చొప్పున పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. - వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించి.. ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు చేయడానికి వీలుగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను జూన్ నాటికి పూర్తి చేయడానికి కసరత్తు సాగిస్తున్నారు. - 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే పనులు చేపట్టారు. వాటిని మే నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. - కుడి కాలువ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఎడమ కాలువలో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని.. కొత్త కాంట్రాక్టర్లకు రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు అప్పగించి.. 2021 నాటికి డిస్ట్రిబ్యూటరీలతో సహా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు. - వచ్చే సీజన్లో ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్.. కాలువలకు నీటిని సరఫరా కుడి, ఎడమ అనుసంధాలు, స్పిల్ వేకు గేట్లు బిగించే ప్రక్రియతోసహా 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించే దిశగా కసరత్తు చేస్తున్నారు. నిధులు సమకూర్చితే.. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి సెప్టెంబరు 2019 వరకూ రూ.11,377.243 కోట్లు వెచ్చించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6,764.16 కోట్లు(ఇందులో పీపీఏ కార్యాలయ నిర్వహణ వ్యయం రూ.15 కోట్లు) రీయింబర్స్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి 2018–19లో రూ.393.51 కోట్లు .. నవంబర్ 8, 2019న రూ.1,850 కోట్లను రీయింబర్స్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఆ నిధులను విడుదల చేయలేదు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లు. ఇందులో జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయంపోగా మిగతా.. అంటే రూ.50,987.96 కోట్లు నీటిపారుదల విభాగం వ్యయం. ఆ మేరకు నిధులను సమకూర్చితే సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందించవచ్చునని నిపుణుల కమిటీ పేర్కొంది. -
కడపలో బీజేపీ భారీ ర్యాలీ
-
‘సీఏఏకు మద్దతుగా మిస్డ్ కాల్ ఇవ్వండి’
సాక్షి, వైఎస్సార్ కడప : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) దేశ రక్షణ కోసమేనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ పేర్కొన్నారు. జిల్లాలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ హాజరయ్యారు. ఆయన సమక్షంలో టీడీపీ మాజీ అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ బీజేపీలో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకే ఈ చట్టాలను తీసుకు వచ్చామని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు తీసుకు వచ్చామని, భారత భూభాగమైన కశ్మీర్లో 390 ఆర్టికల్ రద్దు ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని ప్రశంసించారు. ముస్లిం దేశాల్లో అమలు చేయని ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకు వచ్చామన్నారు. దేశంలో అశాంతి సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని విమర్శించారు. దేశ భద్రత కోసం తెచ్చిన చట్టాలను వ్యతిరేకించడం తగదని అన్నారు. పాకిస్తాన్లో హిందువులను ఉండనివ్వడం లేదని, అక్కడ పది లక్షల మంది శరణార్థులుగా ఉన్నారన్నారు. పౌరసత్వం కోసం 11 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని, వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేక పిల్లలను చదివించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ వెంట రాహుల్ నడుస్తున్నారని, వీరికి ఓటు బ్యాంకు రాజకీయాలు తగవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల్లో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వాస్తవాలను తెలియజేసేందుకు ఇంటింటికి వెళ్తామన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి అందరూ మద్దతు పలకాలని, సీఏఏకు మద్దతు తెలిపేందుకు 8866288662కు మిస్డ్ ఇవ్వాలని సూచించారు. ప్రజల మద్దతు తమకు ఉంటే మమతా, రాహుల్, ఎంఐఎం పార్టీ ఏమి చేయలేవన్నారు. -
పోలవరం పర్యటనకు కేంద్ర మంత్రి : అనిల్కుమార్
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి మంగళవారం ఆయన కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ.. ‘రివర్స్ టెండరింగ్పై కేంద్ర మంత్రి సంతృప్తి చెందారు. పోలవరం ప్రాజెక్టులో కేంద్రానికి రూ.800 కోట్లు ఆదా చేశామని వివరించాను. పార్లమెంటు సమావేశాల తర్వాత పోలవరం సందర్శనకు వస్తానని షెకావత్ చెప్పారు. పోలవరానికి సంబంధించి రూ.1850 కోట్లు రెండు మూడు రోజుల్లో విడుదలౌతాయి. మిగిలిన నిధులకు సంబంధించి ఆడిటింగ్ కూడా పూర్తయింది . రూ. 55 వేల కోట్ల ప్రాజెక్టులో 11 వేల కోట్ల రూపాయలు పనులు మాత్రమే టీడీపీ పూర్తి చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే కుడి, ఎడమ కాలువల పనులు పూర్తయ్యాయి. పోలవరం పనులు 35 శాతం మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యాయి. 2021 కల్లా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’అని అనిల్కుమార్ అన్నారు. -
ఆడిట్ పూర్తయిన తర్వాతే పోలవరానికి నిధులు
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ. 3,222.75 కోట్లు విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితోపాటు.. సవరించిన నిర్మాణ వ్యయం అంచనాలను ఆమోదించే అంశాలను కేంద్రం పరిశీలిస్తోందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ను ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ.. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు ఖర్చు చేసిన రూ. 5 వేల కోట్లకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ ఆడిట్ నిర్వహిస్తోందని మంత్రి గజేంద్ర షెకావత్ సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు రూ. 3 వేల కోట్ల మేరకు ఆడిట్ పూర్తయినందున అందులో కొంత మొత్తం విడుదల చేసే అంశాన్ని ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. -
డీపీఆర్ ఇస్తే నిధులు!
సాక్షి, అమరావతి: సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను ఒడిసి పట్టి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గోదావరి–కృష్ణా (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్)– పెన్నా నదుల అనుసంధానానికి నిధులివ్వాలంటూ జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ చేసిన వి/æ్ఞప్తిపై కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పంపితే పరిశీలించి నిధులిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులతో జల్ శక్తి అభియాన్, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, స్వచ్ఛ భారత్ తదితర పథకాలపై గజేంద్రసింగ్ షెకావత్ సమావేశం నిర్వహించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తదితరులు దీనికి హాజరయ్యారు. మూడు రాష్ట్రాలకు ప్రయోజనం గోదావరి నుంచి ఏటా సగటున 2,500 టీఎంసీలకుపైగా సముద్రంలో కలుస్తున్నాయని మంత్రి అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. నీటి లభ్యత నానాటికీ తగ్గుతుండటం, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానాన్ని చేపట్టాలని నిర్ణయించిందని చెప్పారు. డీపీఆర్ రూపకల్పన బాధ్యతను వ్యాప్కోస్కు అప్పగించామన్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానం వల్ల తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు ప్రయోజనం చేకూరుతుందని, ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. వాటర్ గ్రిడ్కు సహకారం.. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికీ రోజూ పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు నీటిని అందచేసే వాటర్ గ్రిడ్ పథకానికి నిధులివ్వాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ కోరారు. అయితే 55 లీటర్ల నీటి సరఫరాకు అయ్యే వ్యయాన్ని మాత్రమే కేంద్రం ఇస్తుందని, అంతకంటే ఎక్కువ పరిమాణంలో నీటిని అందించడానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో శుద్ధి చేసి ఇళ్లకు సరఫరా చేయాలని వ్యయం తగ్గుతుందని సూచించారు. వాటర్ గ్రిడ్కు అవసరమైతే విదేశీ ఆరి్థక సంస్థల ద్వారా రుణం అందించేందుకు సహకరిస్తామని చెప్పారు. త్వరలో మిగతా నిధులు.. పోలవరానికి మిగతా రూ.3,222.75 కోట్లను కూడా రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి టి.రాజేశ్వరిని మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఆదిత్యనాథ్ దాస్ కోరారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని, త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చూస్తామని టి.రాజేశ్వరి పేర్కొన్నారు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి రూ.రెండు వేల కోట్ల బిల్లులను మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. -
అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలకోసం భారీ ప్రాజెక్టులు చేపట్టేకంటే ఉపరితల నీరు, భూగర్భ జలాల సమగ్ర వినియోగంపై దృష్టి పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దక్షిణాది రాష్ట్రాలకు సూచించారు. ఎక్కడి నీటిని అక్కడే వినియోగించేలా ప్రభుత్వాల విధానాలు, కార్యాచరణలు ఉండాలని తెలిపారు. అంతేతప్ప భారీ ప్రాజెక్టులు చేపట్టి, వాటికి కేంద్రం నిధులు ఇవ్వాలని కోరితే మాత్రం తాము ఇవ్వలేమని తేల్చిచెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే భారీ ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దన్నారు. కేంద్రం తీసుకొచ్చిన జల్జీవన్ మిషన్ అంశంపై జలశక్తి శాఖ దక్షిణాది రాష్ట్రాలతో హైదరాబాద్లోని ఐటీసీ కాకతీయ హోటల్లో సోమవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ రాష్ట్రాల నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు హాజరయ్యారు. తెలంగాణ తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్, కర్ణాటక మంత్రి ఈశ్వరప్పతో పాటు సీఎస్ ఎస్కే జోషి, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, కాడా కమిషనర్ మల్సూర్, సీఈలు బంగారయ్య, వీరయ్య, మోహన్కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట జలశక్తి శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ జల్మిషన్ ప్రాథమ్యాలను వివరించారు. దేశంలోని 14.60 కోట్ల గ్రామీణ ప్రాంత గృహాలకు సురక్షిత నీటి సరఫరా చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, దీనికోసం 2024 నాటికి ఏడాదికి రూ.40 వేల కోట్ల చొప్పున రూ.2 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుందని తెలిపారు. అనంతరం తెలంగాణసహా మిగతా రాష్ట్రాలు తాము చేపడు తున్న ప్రాజెక్టులు, వాటికి ఖర్చు చేస్తున్న నిధులు, వాటి ప్రయోజనాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించాయి. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు తమ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించాలని గట్టిగా కోరాయి. దీనిపై చివరగా కేంద్ర మంత్రి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రోల్స్రాయిస్ మీరిచ్చుకోండి.. మీ రాష్ట్రాల ప్రజలకు రోల్స్ రాయిస్ కారివ్వాలని అనుకుంటే రాష్ట్రాల నిధుల్లోంచి యథేచ్ఛగా నిధులు ఇచ్చుకోవచ్చని, అయితే కేంద్రం మాత్రం మారుతి–800 కారు మాత్రమే ఇస్తుందని షెకావత్ స్పష్టం చేశారు. అద్భుతమైన ప్రాజెక్టులు కట్టి మేము ఎక్కువ నిధులు ఖర్చు చేశాం కాబట్టి, కేంద్రం నిధులు ఇవ్వాలంటే మాత్రం తాము ఇవ్వలేమన్నారు. ఏపీ, తెలంగాణకంటే ఎక్కువ నీటి ఎద్దడి ఉన్న రాష్ట్రాలున్నాయని, నీటి ఎద్దడి ఉందన్న కారణంగా ఎక్కువ నిధులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే భారీ ప్రాజెక్టులు కట్టాలని హితవు పలికారు. నీటి సద్వినియోగం కోసం అందరం కృషి చేయాలని, గ్రామం యూనిట్గా తాగునీటి సదుపాయాలు కల్పించాలన్నారు. నీటి పునర్వినియోగంలో రామకృష్ణా మిషన్ మోడల్ చాలా బాగుందని, దానిపై రాష్ట్రాలు దృష్టి సారించాలన్నారు. జలజీవన్ మిషన్ కింద మొదటి విడత నిధులు విడుదల చేశామని, రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి పనులు చేపట్టాలన్నారు. జల్ జీవన్ మిషన్ విజయవంతం కావడానికి తొలి ఆరు నెలల పనితీరే కీలకమని, సంబంధిత అధికారులంతా మిషన్ పనులను ప్రారంభించడంతో పాటు మెరుగైన పనితీరును కనబరచాలని షెకావత్ అన్నారు. నదుల అనుసంధానానికి నిధులివ్వాలి ఏపీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ, పోలవరం నుంచి రాయలసీమ ప్రాంతాలకు తాగు, సాగు నీరిచ్చేలా గోదావరి–పెన్నా నదుల అనుసంధానం చేపడుతున్నామని తెలిపారు. దీన్ని 2021 నాటికి పూర్తి చేస్తామని, దీనికి కేంద్ర సహకారం అందించాలని కోరారు. ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజ శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఏపీలో ఎక్కువగా గిరిజన, కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాలున్నాయని, ఇక్కడి తాగునీటి అవసరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఎక్కువ నిధులివ్వాలని కోరారు. ఇదే సమయంలో కర్ణాటక ప్రతినిధులు మాట్లాడుతూ, మిషన్ భగీరథపై ప్రశంసలు కురిపించారు. ‘భగీరథ’కి నిధులివ్వాలి సీఎస్ ఎస్కే జోషి తెలంగాణ తరఫున సీఎస్ ఎస్కే జోషి మాట్లాడుతూ, రక్షిత తాగునీటి సరఫరాలో అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణ ముందుందని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇప్పటికే తాగునీటి సరఫరా చేస్తున్నామని, భారీగా అప్పులు తెచ్చి దీన్ని పూర్తి చేశామని, వాటి తిరిగి చెల్లింపులకు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్న రాష్ట్రాలకు మరిన్ని నిధులు పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాలను ఒకే గాటన కట్టకుండా, పనిచేసే రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న షెకావత్. చిత్రంలో సీఎస్ జోషి, మంత్రి దయాకర్రావు, ఏపీ మంత్రి అనిల్ తదితరులు -
దేశవ్యాప్తంగా మిషన్ ‘భగీరథ’
సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశవ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన కేంద్రానికి ఉన్నదని కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని, ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు అమలు చేయడంతోపాటు, మురుగు నీటిని (సీవరేజ్) ట్రీట్ చేసి ఆ నీళ్లను వ్యవసాయ, గృహోపయోగానికి ఉపయోగించే విధానాలు అవలంబించాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రగతిభవన్లో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథపథకం గురించి షెకావత్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారులు మిషన్ భగీరథ స్వరూపాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఆర్థిక సహకారం ఇవ్వండి.. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ‘తెలంగాణ రాష్ట్రంలో 24 వేల ఆవాస ప్రాంతాలకు ప్రతి రోజూ మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకం చేపట్టాం. రాష్ట్రంలో చాలా చోట్ల మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేది. చాలా చోట్ల ఫ్లోరైడ్ సమస్య ఉండేది. అసలు తాగునీళ్లే దొరకక పోయేది. దొరికిన నీళ్ళు కూడా శుభ్రంగా ఉండకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారు. అందుకే గోదావరి, కృష్ణా జలాలను శుద్ధి చేసి ప్రజలకు అందివ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. పథకం దాదాపు పూర్తయింది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ పథకం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకు ఇబ్బందులు తప్పాయి. వారి జీవన పరిస్థితులు మెరుగయ్యాయి. రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభాను కూడా అంచనా వేసుకుని, అప్పటి అవసరాలు కూడా తీర్చే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశాం. ఇలాంటి పథకం దేశమంతా అమలయితే మంచిది. ప్రజలకు మంచినీరు అందించడానికి చేసే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడొద్దు’ అని ముఖ్యమంత్రి వివరించారు. ఇదే సమయంలో ‘దేశంలో ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధిస్తోంది. కాబట్టి మిషన్ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించండి’ అని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. 11వ శతాబ్ధంలోనే కాకతీయలు వేలాది చెరువులు తవ్వించారని, సమైక్య పాలనలో అవన్నీ నాశనమయ్యాయని సీఎం చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో జరిగిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి వివరించారు. 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేయగలిగామని వెల్లడించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి, తాను త్వరలోనే మరోసారి తెలంగాణలో పర్యటించి క్షేత్ర స్థాయిలో ఈ పథకాల అమలును స్వయంగా చూస్తానని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, టీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వర్రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథకు జాతీయ జల్ మిషన్ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ : నీటి యాజమాన్య పద్ధతులు, జల సంరక్షణ, నీటి వినియోగంలో ఉత్తమ విధానాల అమలుకుగానూ జాతీయ జల్ మిషన్ ప్రదానం చేసే అవార్డుల్లో తెలంగాణకు 3 అవార్డులు దక్కాయి. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం ఢిల్లీలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం వల్ల తాగు నీటి సామర్థ్యం 20% పెంపుదల విభాగంలో మొదటి బహుమతి కింద రూ.2 లక్షల చెక్కును రాష్ట్ర మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి అందుకున్నారు. జలవనరుల సమాచారం, నిర్వహణ లో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నడిచే తెలం గాణ వాటర్ రీసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం రెండో స్థానంలో నిలవగా ఆ అవార్డును రాష్ట్ర సాగు నీటి శాఖ తరఫున సీఏడీఏ కమిషనర్ మల్సూర్ అందుకున్నారు. ప్రమాదకర స్థితికి చేరిన భూగర్భ జలాల పునరుజ్జీవనానికి తీసుకుంటున్న చర్యలకుగాను రాష్ట్ర భూగర్భ జల విభా గం 3వ స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అందజేశారు. -
‘శ్రీరామ్ పుస్తకం దేశానికి ప్రేరణగా నిలుస్తుంది’
ఢిల్లీ: రాజస్థాన్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ జల ఉద్యమాన్ని.. జన ఉద్యమంగా మార్చారని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. గురువారం శ్రీరామ్ రచించిన ‘విలక్షణమైన నీటి నిర్వహణ గాథ’ పుస్తకాన్ని లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకవత్లు ఆవిష్కరించించారు. ఈ కర్యక్రమంలో మంత్రులు ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి, సంజయ్ దొత్రేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ‘రాజస్థాన్లో 99.7 శాతం నీటి సంరక్షణ ప్రాజెక్టు విజయవంతమైంది. నాలుగున్నర అడుగుల మేర నీరు పైకి వచ్చింది. ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెరగాల్సి ఉంది. దేశంలో జల్ క్రాంతి రావాలి. ప్రధానమంత్రి నీటి నిర్వహణపై ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సాంకేతికత ఆధారంగా నీటి నిర్వహణ, సంరక్షణ చేయాలి. వెదిరే శ్రీరామ్ పుస్తకం దేశానికి ప్రేరణగా నిలుస్తుంది. నాడు ఉపవాసం ఉన్న దేశం నేడు సమృద్ధిగా ఆహారదేశంగా మారింద’న్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. శ్రీరామ్ జల ఉద్యమాన్ని జన ఉద్యమంగా మార్చారన్నారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో నీటి వనరులు సృష్టించారని తెలిపారు. శ్రీరామ్ మాట్లాడుతూ.. రాజస్థాన్లో తాను నిర్వహించిన ముఖ్యమంత్రి జలశక్తి స్వావలంబన ద్వారా ఆరు అడుగుల మేర నీటి నిల్వలు పెరిగాయని తెలిపారు. ఈ పథకం విజయవంతం కావడం వల్ల 50 శాతం నీటి ట్యాంకర్ల అవసరం తగ్గిపోయిందని పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో ఈ పథకం విజయవంతమైందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణ నదులు తెలుగు రాష్ట్రాలకు జీవధారలుగా ఉన్నాయన్నారు. గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. సముద్రంలోకి గోదావరి వృధాగా పోతోందని.. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యతో తల్లడిల్లుతోందని తెలిపారు. కేంద్ర ఐటీ సహాయ మంత్రి సంజయ్ దోత్రే.. ‘జలమే జీవనం, ప్రకృతిని నాశనం చేయడం వల్లే ఈ కరువు కాటకాల పరిస్థితి ఏర్పడింది. వాన నీటి సంరక్షణకు అందరూ నడుం కట్టాలి. నీటి నిర్వహణలో అద్భుతాలను సృష్టించారు. ఇది దేశమంతటికీ ఒక మోడల్గా నిలుస్తుంద’న్నారు. కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ .. ‘ దేశానికి వెదిరే శ్రీరామ్ వంటి వారు అవసరం.. ఆయన చేసిన కార్యక్రమానికి అధికారులు సైతం అభినందించాలి. సుమారు 50వేల కోట్ల రూపాయలతో నీటి సంరక్షణ అడవులు పెంపకానికి కేటాయించామని తెలిపారు. -
గోదావరి జలాల మళ్లింపునకు సాయం చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ‘శ్రీశైలం, నాగార్జునసాగర్లకు గోదావరి జలాల మళ్లింపు పథకం’ ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు లేఖ రాశారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం ప్రయోజనం పొందుతాయని, ఏపీలోని కరువు ప్రభావిత, వెనకబడిన ప్రాంతాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ లేఖను వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి బుధవారం ఇక్కడ కేంద్ర మంత్రిని కలసి అందజేశారు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను ఆయనకు వివరించారు. లేఖ సారాంశం ఇదీ.. ‘ఏపీలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు నిత్యం కరువు తాండవించే జిల్లాలు. గడిచిన పదేళ్లలో 2009–10 నుంచి 2018–19 వరకు ఏడేళ్లపాటు సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు కాగా.. కేవలం మూడేళ్లు సాధారణ వర్షపాతం కంటే స్వల్పంగా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. అనంతపురం జిల్లాను వర్షపాతంలో, కరువులో జైసల్మేర్ జిల్లాతో పోల్చుతారు. ఈ ఆరు జిల్లాల్లో సాగు యోగ్యత గల ప్రాంతం 98.89 లక్షల ఎకరాలుగా ఉంది. 39.77 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి వసతి ఉంది. కృష్ణా, తుంగభద్ర, పెన్నా, ఇతర చిన్న నదులు, వాగుల ఆధారంగా ఇక్కడ సాగవుతోంది. అయితే శ్రీశైలం రిజర్వాయర్కు ఇన్ఫ్లో ఏటా తగ్గుతూ వస్తోంది. గడిచిన ఐదేళ్లలో వచ్చిన ఇన్ఫ్లో 52 ఏళ్ల సగటుతో పోల్చితే 63 శాతం తక్కువ. పైన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులు కట్టడం, ఎక్కువ నీటిని వినియోగించుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో గోదావరిలో భారీగా మిగులు జలాలు ఉత్పన్నమవుతున్నాయి. దాదాపు 2,500 టీఎంసీలు కేవలం నాలుగు నెలల కాలం (జూలై నుంచి అక్టోబరు వరకు)లోనే సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి–కృష్ణా నదులను అనుసంధానించడం ద్వారా ఈ నీటిని శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లలోకి మళ్లించాల్సిన అవసరం ఉంది. తద్వారా కరువు ప్రభావిత రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఈ దిశగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ ఏపీ, తెలంగాణ సీఎంలు, అధికారులతో కూడిన సమావేశం జూన్ 28న జరిగింది. గోదావరి జలాల మళ్లింపునకు విభిన్న ప్రత్యామ్నాయాలు కనుగొనేందుకు రెండు రాష్ట్రాల రిటైర్డ్ ఇంజినీర్లు, నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశాం. రోజుకు 4 టీఎంసీల నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలోకి గోదావరి వరద ఉన్న రోజుల్లో 120 రోజుల పాటు దాదాపు 480 టీఎంసీల మేర మళ్లించాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా కరువు ప్రాంత, వెనకబడిన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు తీర్చడమే కాకుండా కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ జరుగుతున్నందున కేంద్రం ఈ పథకానికి తగిన సాయం చేయాలి’ అని ముఖ్యమంత్రి లేఖలో కోరారు. -
‘ఈ ప్రాజెక్టులో కేంద్రం సగం ఖర్చును భరించాలి’
సాక్షి, న్యూఢిల్లీ : మిషన్ భగీరథ ద్వారా వేసవికాలంలో కూడా తాగునీటి కొరత లేకుండా చేయగలిగామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ.. మంగళవారం ‘గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా- స్వచ్ఛ భారత్’ సదస్సును నిర్వహించింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రం తరఫున ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ఇలాంటి సదస్సు నిర్వహించడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల అధికారులు ప్రశంసించిన విషయాన్ని కేంద్రమంత్రికి చెప్పామని పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చేపట్టిన ఇంత పెద్ద ప్రాజెక్టుకు భారీగా ఖర్చుపెట్టిన కారణంగా అప్పు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఖర్చులో సగం ఖర్చును కేంద్రం భరించాలి లేదా పథకం నిర్వహణ ఖర్చునైనా భరించాలని కేంద్రానికి విన్నవించామని పేర్కొన్నారు. -
‘సామాన్యుని లోగిలికి అభివృద్ధి ఫలాలు’
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతోందని, గత ఐదేళ్లలో ప్రవేశ పెట్టిన పథకాలతో సత్ఫలితాలు వస్తున్నాయ ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. అవినీ తి తగ్గటంతో పాటు అభివృద్ధి ఫలాలు సామా న్యుల లోగిలికి చేరుతున్నాయన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు లక్ష్మణ్, ప్రేమేందర్రెడ్డి తదితరులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కిసాన్ సమ్మాన్ యోజనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 12.91 లక్షల మంది రైతుల జాబితాను అప్లోడ్ చేసిందని, అందులోని 5 లక్షల మంది ఖాతా ల్లోకి డబ్బు జమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసా సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఆదాయం నెలకు ఆరువేలే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒక రైతు కుటుంబం అన్ని వనరుల నుంచి పొందే ఆదాయం సగటున నెలకు కేవలం రూ.6,426 మాత్రమేనని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం రాజ్య సభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. దేశంలోని రైతు కుటుంబాల వార్షిక ఆదాయ గణాంకాలను జాతీయ శాంపిల్ సర్వే 2013లో సేకరించినట్లు మంత్రి తెలిపారు. ఆ సర్వే దేశంలోని ఒక రైతు కుటుంబం పొందే నెలసరి ఆదాయం సగటున 6426 రూపాయలుగా అంచనా వేసినట్లు తెలిపారు. 2018-19 ఏడాదికి రైతు కుటుంబాల వార్షిక ఆదాయాల గణన నేషనల్ శాంపిల్ సర్వే చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం 2018 జనవరి నుంచి 2019 డిసెంబర్ వరకు కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. మైక్రో ఇరిగేషన్తో ఖర్చుల్లో తగ్గుదల.. సాగు వ్యయంలో మైక్రో ఇరిగేషన్ ద్వారా 20 నుంచి 50 శాతం ఖర్చులు తగ్గించుకోవచ్చునని గజేంద్ర సింగ్ వెల్లడించారు. ఎరువుల ఖర్చులో 28 శాతం ఆదా చేయవచ్చునని తెలిపారు. విద్యుత్ వాడకాన్ని 31 శాతం తగ్గించుకునే అవకాశం మైక్రో ఇరిగేషన్ కల్పిస్తుందన్నారు. ఈ విధానంలో పంట ఉత్పాతకత 42 నుంచి 52 శాతం పెరుగుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైందని మంత్రి అన్నారు. తద్వారా రైతు ఆదాయంలో గణనీయమైన పెరుగుదల సాధ్యమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మత్స్య పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేలా రాష్ట్రంలో ఇన్లాండ్ ఫిష్ ఫార్మింగ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవ సాయ శాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. గురువారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసిన బూర నర్సయ్య, తెలంగాణలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న చేయూతను వివరించారు. రైతులకు ఉచితంగా 40 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా అవకాశాలు కల్పించే ఇన్లాండ్ ఫిష్ ఫార్మింగ్ పరిశోధనా కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన కోరారు. అలాగే కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయల్ను కలసి జనగాంలో వీవర్స్కాలనీ వద్ద అండర్పాస్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలని కోరారు. -
'గజేంద్రను ఉసిగొల్పారు'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలు ఉసిగొల్పడం వల్లే గజేంద్ర సింగ్(41) ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. కిసాన్ ర్యాలీలో ఆప్ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం కూడా అతడిని ఆత్మహత్యకు పురికొల్పాయన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఢిల్లీ పోలీసులు నివేదిక సమర్పించారు. గజేంద్ర సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకునేందుకు ఆప్ ప్రభుత్వం ప్రయత్నించిందని నివేదికలో ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. కాగా, ఏ కేసు విచారణలోనైనా ప్రత్యక్ష సాక్షుల వాంగూల్మామే అత్యంత కీలకమని ఢిల్లీ పోలీసు చీఫ్ బీఎస్ బాసీ విలేకరుల సమావేశంలో చెప్పారు. విచారణలో దర్యాప్తు అధికారి ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తారని, కేసుకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తారని వెల్లడించారు. రాజస్థాన్లోని దౌసా గ్రామానికి చెందిన రైతు గజేంద్రసింగ్ ఈనెల 22న జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేపట్టిన కిసాన్ ర్యాలీలో చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. -
ఇంతకీ ఈ కేసు ఎవరు దర్యాప్తు చేయాలి?
న్యూఢిల్లీ: దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు 'మీరంటే మీరు కారణం' అంటూ ఓ పక్క రాజకీయ పార్టీలు కొట్టుకు చస్తుంటే మరోపక్క కేసును ఎవరు దర్యాప్తు చేయాలి ? ఎవరిదా అధికారం ? అన్న అంశంలో జిల్లా మేజిస్ట్రేట్, ఢిల్లీ పోలీసు అధికారులు సంఘర్షణ పడుతున్నారు. ఒకవేళ జిల్లా మేజిస్ట్రేటే దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తే అది పోలీసు అధికారుల దర్యాప్తులో వెలువడిన అంశాలకు భిన్నంగా ఉంటే అనవసర గందరగోళానికి దారితీస్తుందని, పైగా కోర్టు ముందు అభాసుపాలు కావాల్సి వస్తుందని సీనియర్ ఐపీఎస్ అధికారులు, మాజీ పోలీసు కమిషనర్లు వాదిస్తున్నారు. ఇప్పటికే కేసుపై జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. ఈ కేసు మీ పరిధిలోకి రాదంటూ ఢిల్లీ పోలీసు అధికారులు జిల్లా మేజిస్ట్రేట్కు తెలియజేయడంతో వివాదం మొదలైంది. కేసు దర్యాప్తును ఇప్పటికే చేపట్టిన జిల్లా మేజిస్ట్రేట్ సంఘటనకు సంబంధించిన ఆధారాలు, సమాచారం ఏదైనా ఉంటే తనకు సమర్పించాల్సిందిగా ప్రజలను కోరారు. అలాగే టీవీ ఫుటేజ్లు సమర్పించాల్సిందిగా టీవీ చానళ్లను ఆదేశించారు. అంతేకాకుండా శుక్రవారంలోగా ప్రాథమిక దర్యాప్తు వివరాలను సమర్పించాల్సిందిగా ఢిల్లీ పోలీసు అధికారులను కూడా ఆదేశించారు. తన ఆదేశాలను ధిక్కరిస్తే న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటానని వారిని హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తు తమ పరిధిలోకి వస్తుందని వాదిస్తున్న ఢిల్లీ పోలీసు అధికారులు మేజిస్ట్రేట్ ఆదేశాలను ఖాతరు చేయలేదు. వారికిచ్చిన గడువుకు కూడా తీరిపోవడంతో న్యాయపరంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ఓపక్క కేసును మేజిస్ట్రేట్ దర్యాప్తు చేస్తుంటే అది తమ దర్యాప్తుకేమీ అడ్డంకాదని, అయితే పరస్పర భిన్నంగా దర్యాప్తు నివేదిలుంటేనే గందరగోళం అవుతుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీనియర్ క్రైమ్బ్రాంచి అధికారి మీడియాకు తెలిపారు. 2014లో ఢిల్లీ నగరంలో 7,545 అసహజ మరణాలు సంభవించాయని, ఇందులో వేటిలోనూ జిల్లా మేజిస్ట్రేట్ స్వయంగా దర్యాప్తునకు ఆదేశించలేదని ఆయన తెలిపారు. అలాంటిది ఈ కేసులో మాత్రం ఎందుకు అంతగట్టిగా పంతం పడుతున్నరన్నది అర్థం కావడం లేదన్నది ఆయన ఆవేదన.పెళ్లైన ఏడేళ్లలోపు మహిళలెవరైనా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తేనే జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తు అవసరమవుతుందని సీనియర్ పోలీసు అధికారులు వాదిస్తున్నారు. ఇలాంటి కే సుల విచారణలో ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, గోప్యత అవసరమని, చట్టాల ప్రకారమే అన్ని విభాగాలు పనిచేయాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. ప్రాథమిక పోస్టుమార్టమ్ నివేదిక ప్రకారం ఉరివేసుకోవడం వల్లనే గజేంద్ర సింగ్ చనిపోయినట్టు తెలుస్తోందని ఆయన చెప్పారు. భారతీయ శిక్షాస్మృతిలోని 174(1), 176(1) సెక్షన్ల ప్రకారం ఏ కేసులోనైనా జిల్లా మేజిస్ట్రేట్ జోక్యం చేసుకోవచ్చని, ఏ అధికారినైనా పిలిపించి దర్యాప్తునకు ఆదేశించవచ్చని సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల వాదన ఎలా ఉన్నా, ప్రస్తుత కేసులో సంఘర్శణకు కారణం ఏమిటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ పోలీసులు కేంద్రం పరిధిలో పని చేస్తుండడం, జిల్లా మేజిస్ట్రేట్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తుండడం తెల్సిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, రాష్ట్రంలో ఆప్ అధికారులో ఉండడం వల్ల అటు రాజకీయంగా మొదలైన రగడ ఇటు ప్రభుత్వ విభాగాల మధ్య సంఘర్షణకు కూడా దారితీసింది. -
ఏలికల పాపం రైతుకు శాపం
రైతాంగం ప్రతి నీటి చుక్కను ఆదా చేసి, ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పడం కేవలం నూతన సాంకేతికతను అమ్ముకోవడం కోసమే. రైతుకు కావాల్సింది రుణం కాదు, ఆదాయం. చాలా ఏళ్లుగా మనం ఆహార ధరలను అదుపు చేయడం కోసం ఉద్దేశపూర్వకంగానే రైతుకు సమంజసమైన ఆదాయాన్ని ఇవ్వ నిరాకరిస్తున్నాం. ఇలా భారాన్నంతా పేద రైతులపై మోపేకంటే వారికి అధిక ధరను ఇచ్చి, రైతు ఉత్పత్తులపై వినియోగదారులకు సబ్సిడీని ఇవ్వాలి. జపాన్, తదితర సంపన్న దేశాల్లో జరుగుతున్నదదే. కానీ మన ప్రభుత్వాలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే రైతాంగం పేదరికంలో మగ్గిపోయేట్టు చేస్తున్నాయి. వ్యవసాయ ఆదాయాలు గణనీయంగా పెరగకపోతే వారి బాగు కోసం చేపట్టే ఏ చర్యా సఫలం కాదు. దేశ రాజధాని ఢిల్లీ దిగ్భ్రాంతికి గురైంది. రాజస్థాన్లోని దౌసా గ్రామానికి చెందిన రైతు గజేంద్రసింగ్ (41) దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా సాగుతున్న రైతు ఆత్మహత్యలను ఢిల్లీ దర్బారు వాకిట్లోకే తీసుకొచ్చాడు. రాజకీయాధికార కేంద్రానికి సుదూరంగా ఉన్న ఆ సమ స్య ఇప్పుడు ఏలికలకు ఇబ్బందికరమైనంత సన్నిహితం గా నిలచి వారి కళ్లలోకి గుచ్చి గుచ్చి చూస్తోంది. అదీ మరీ ఎంత ఇరకాటంగానంటే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ ఘటనకు తాను కుంగిపోయానని, నిరుత్సా హానికి గురయ్యానని అంగీకరించక తప్పింది కాదు. ‘‘కష్టించి పనిచేసే రైతు ఏ పరిస్థితుల్లోనూ తాను ఒంటరి నని ఆలోచించరాదు. భారత రైతాంగానికి మెరుగైన భవితను సృష్టించడం కోసం మనమంతా కలసికట్టుగా పనిచేస్తున్నాం’’ అని ఆయన ఆ తర్వాత ట్వీటర్లో వ్యాఖ్యానించారు. రైతు ఆత్మహత్యలన్నీ రాజకీయ ప్రకటనలే పార్లమెంటు బయట రాజకీయవేత్తలంతా అవతలి పార్టీయే రైతులను నిర్లక్ష్యం చేస్తోందంటూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటుండగా... ప్రధాన రాజకీయ పార్టీ లన్నిటి చేతులు రైతుల నెత్తుటితో తడిసినవేననే వాస్తవం మాత్రం యథాతథంగా నిలిచి ఉంది. రైతు ఆత్మహ త్యలు ఇటీవలే తలెత్తిన సమస్య కాదు. గత 20 ఏళ్లుగా, దాదాపు మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సగటున ఏడాదికి 14 నుంచి 15 వేల మం ది, ప్రతి గంటకు ఇద్దరు రైతులు ప్రాణాలను తీసుకుం టూనే ఉన్నారు. ఆత్మహత్యకు పాల్పడటానికి ఎంతో గొప్ప ధైర్యం కావాలి. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగం వాస్తవానికి తమ మరణం ద్వారా ఒక రాజ కీయ ప్రకటన చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ స్పం దన ఎరుగుని తోలు మందం వ్యవస్థను వేలాది రైతుల మరణాలు ఏ మాత్రం కదల్చలేకపోయాయి. కొత్త మొహం, కొత్త పేరు... పాత కథ జంతర్మంతర్ వద్ద గజేందర్ ఉరేసుకున్న తదుపరి వెంటనే టీవీ చానళ్లు రైతు ఆత్మహత్యలపై తీసిన వ్యంగ్య చిత్రం ‘పీప్లీ లైవ్’ సన్నివేశాలను తిరిగి కళ్లకు కట్టించడం మొదలెట్టేశాయి. చానళ్ల పీప్లీ లైవ్ సన్నివేశాల్లోని వారం తా రాజస్థాన్లోని గజేంద్రసింగ్ గ్రామస్తులు. చనిపోయే ప్పుడు అతను ఫలానా రంగు తలపాగాయే ఎందుకు చుట్టుకున్నాడు, వగైరా విషయాలను చర్చిస్తుండటాన్ని గొప్పగా చూపారు. ఇక ఆ తర్వాత ప్రతి చానలూ వివిధ రాజకీయ పార్టీల అధికారిక ప్రతినిధులను పిలిపించి చర్చాగోష్టులను నిర్వహించేస్తోంది. టీవీ షోలకు వచ్చిన ఆ ప్రతినిధులేమో రైతు ఆత్మహత్య నివారణకు తాము చేపట్టిన చర్యల జాబితాను ఏకరువు పెడుతూ, తమ చొక్కా ఎంత తెలుపో చెప్పుకోడానికి మీడియా వేదికను వాడుకుంటున్నారు. అంతే తప్ప ఈ వరుస మృత్యు నర్తనానికి వెనుక ఉన్న మౌలిక కారణాలేమిటో తెలుసు కునే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. తమ పాత్రికే యులను ఏ ఏ ప్రాంతాలకు పంపాలంటూ పత్రికల నుంచి నాకు అదే పనిగా ఫోన్లు వస్తున్నాయి. మళ్లీ ఒక కొత్త మొహం, కొత్త పేరు... కథ మాత్రం అదే. వ్యవసాయ ఆదాయాల క్షీణతే అసలు కారణం గత రెండు దశాబ్దాలుగా నిరంతరాయంగా సాగుతున్న రైతుల ఆత్మహత్యలకు ప్రాథమికమైన, అత్యంత ముఖ్య మైన కారణంగా దేన్నయినా ఎత్తి చూపాలంటే... రైతాంగ ఆదాయాల క్షీణతనే చూపుతాను. 2014 నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్ఓ) సమాచారం ప్రకారం రైతాంగ కుటుంబానికి వ్యవసాయ కార్యక లాపాల నుంచి లభించే సగటు ఆదాయం రూ. 3,078. కుటుంబ అవసరాలు తీరాలంటే రైతు కుటుంబం గ్రామీణ ఉపాధి కార్యక్రమం వంటి వ్యవసాయేతర కార్యకలాపాల్లో పాల్గొనడం తప్పనిసరి అవుతోంది. మొత్తంగా రైతు కుటుంబ రాబడి అలా సగటున నెలకు రూ.6,000కు చేరుతోంది. అంటే 58 శాతం రైతులు పస్తు పడుకోవాల్సి వస్తోంది. 76 శాతం వేరే అవకాశమేైదైనా దొరికితే వ్యవసాయాన్ని విడిచిపోవాలనుకునే వారే. అందరి ఆదాయాలు పెరుగుతున్నా... ఈ సమస్యను మరింత లోతుగా తరచి చూసినా సహ చరుడొకరు అద్భుతమైన తారతమ్య విశ్లేషణ చేసి చూపా డు. 1970లో గోధుమ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,450. కాగా నలభై ఐదేళ్ల తర్వాత, 2015 నాటికి గోధుమ సేకరణ ధర ఇంచుమించు 19 రెట్లు పెరిగింది. రైతులకు ఇచ్చే గోధుమ ధరలోని ఈ పెరుగుదలను వివిధ వర్గాల జీతాల పెరుగుదలతో పోల్చి చూద్దాం. ఈ 45 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సగటున 110 నుంచి 120 రెట్లు, స్కూల్ టీచర్ల జీతాలు 280 నుంచి 320 రెట్లు, కాలేజీలు, యూనివర్సిటీల అధ్యాపకుల జీతాలు 150 నుంచి 170 రెట్లు పెరిగాయి. ఇక మధ్యస్థ స్థాయి నుంచి ఉన్నత స్థాయి కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల జీతాలు 350 నుంచి 1,000 రెట్లు పెరి గాయి. అదే సమయంలో స్కూలు ఫీజులు 200 నుంచి 300 రెట్లు, వైద్య చికిత్స వ్యయం 200 నుంచి 300 రెట్లు, నగరాల్లో ఇంటి అద్దె సగటున 350 రెట్లు పెరిగాయి. రైతుపైనే ఆహార ధరల అదుపు భారం అంటే, ఆహార ధరలను తక్కువగా ఉంచడానికిగానూ రైతులు జరిమానా చెల్లించాల్సి వస్తున్నట్టే. ఆహార ద్రవ్యో ల్బణాన్ని అదుపులో ఉంచడం కోసం ఈ ఏడాది కూడా గోధుమ ధరను క్వింటాలుకు రూ. 50 మాత్రమే పెం చారు. ఈ పెరుగుదల స్వల్పం, 3.2 శాతం మాత్రమే. ఈలోగా ప్రభుత్వ ఉద్యోగులకు రెండో దఫా డీఏ లభించి, 6 శాతం గంతేసింది. త్వరలోనే వారికి ఏడవ వేతన సంఘం సిఫారసుల ప్రకారం వేతనాలు లభి స్తాయి. అతి తక్కువ స్థాయి ఉద్యోగియైన బంట్రోతుకు నెలకు రూ.26,000 జీతం కోరుతున్నారు. రైతుకు అధిక ధర... వినియోగదారులకు సబ్సిడీ గత 45 ఏళ్లలో అతి తక్కువగా జరిగిన వేతనాల పెరుగు దలనే పరిగణనలోకి తీసుకున్నాగానీ గోధుమ ధర 100 రెట్లు పెరగాల్సింది అంటే గోధుమకు నేడు రైతులకు లభిస్తున్న క్వింటాలుకు రూ. 1,450కు బదులు, 1970లో ఇచ్చిన క్వింటాలు రూ.76 ధరకు 100 రెట్ల ధర న్యాయంగా లభించాల్సింది. ఆ లెక్కన రైతుకు క్విం టాలు గోధుమ ధర రూ. 7,600 లభించాల్సింది. మనకు ఇష్టమున్నా లేకున్నా అది రైతుకు దక్కాల్సిన ధర. అలా అని తెగ ఆందోళన పడిపోకండి. నేనేమీ ఆహా ర ద్రవ్యోల్బణం చుక్కలు తాకాలని కోరుకోవడం లేదు. మొత్తం భారాన్నంతా పేద రైతుపై మోపేకంటే రైతుకు అధిక ధరను ఇచ్చి, వారి ఉత్పత్తులపై వినియోగ దారు లకు సబ్సిడీని ఇవ్వాలి. జపాన్లో జరుగుతున్నదదే. పలు ఇతర సంపన్న దేశాలు సైతం ఇదే పద్ధతిని అను సరిస్తున్నాయి. రైతు పేదరికంలో మగ్గేట్టు చేస్తున్నాం వ్యవసాయ ఆదాయాలు గణనీయంగా పెరగకపోతే, రైతుకు అనుకూలంగా తీసుకునే ఏ చర్య అయినా పని చేస్తుందని నేననుకోను. రైతులు పంటల ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందనీ, ప్రతి నీటి చుక్కను ఆదా చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పడమంతా కేవలం సరికొత్త సాంకేతికతను అమ్ముకోవడం కోసమే. ఆ రెండూ రైతుకు మరింత పరపతిని అందించి, రుణ విష వలయం నుంచి బయటపడేలా చేసేవేమీ కావు. రైతుకు కావాల్సింది రుణం కాదు, ఆదాయం. చాలా ఏళ్లుగా మనం ఉద్దేశ పూర్వకంగానే రైతుకు సమంజసమైన మం చి ఆదాయాన్ని ఇవ్వ నిరాకరిస్తున్నాం. ఒక ప్రభుత్వం తర్వాత మరో ప్రభుత్వం వారిని ఉద్దేశ పూర్వకంగానే పేదరికంలో మగ్గిపోయేట్టు చేస్తున్నాయి. (వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు ఈమెయిల్: hunger55@gmail.com) దేవీందర్ శర్మ -
చస్తుంటే చోద్యం చూస్తున్నారా?
దేశ రాజధాని హస్తినలో అందరూ చూస్తుండగా ఓ అన్నదాత ఆత్మహత్యకు పాల్పడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా పాల్గొన్న ఆమ్ ఆద్మీ ర్యాలీలో భూమిపుత్రుడి బలవన్మరణం పుణ్యధరిత్రిలో సాగుదారుల వెతలకు సజీవ సాక్ష్యం. విత్తు నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రతి దశలో వంచనకు గురవుతున్న రైతుల ఆవేదన వర్ణనాతీతం. ప్రకృతి సహకరించక, పాలకులు కనికరించక రాలిపోతున్న రైతులు ఎందరో. రాజస్థాన్ కు చెందిన గజేంద్ర సింగ్ అనే రైతు ఢిల్లీ నడిబొడ్డున.. వేలాది మంది చూస్తుండగా ఆత్మహత్య చేసుకున్నా అందరూ చోద్యం చూశారే తప్పా ఆపేందుకు ఏ ఒక్కరు ముందుకు రాలేదు. పోలీసులు, పాలకులు, ప్రెస్ వాళ్లు ఎంత మంది ఉన్నా ఒక నిండు ప్రాణాన్ని కాపాడలేపోయారు. చనిపోయేందుకు చెట్టు ఎక్కిన రైతును చూసి వినోదించారే గానీ అతడి ఆయువును నిలిపాలన్న ఆలోచన ఏ ఒక్కరికి రాకపోవడం శోచనీయం. కళ్ల ముందే ఒకడు చస్తుంటే చలనం లేకుండా చూస్తుండి పోయిన వారిని ఏమనాలి? అన్ని అంశాల మాదిరిగానే అన్నదాత ఆత్మహత్యపైనా పాలకులు బ్లేమ్ గేమ్ మొదలు పెట్టారు. రైతు చావుపై రాద్ధాంతం చేస్తున్నారు. అందరూ చూస్తుంగానే అన్నదాత కడతేరిపోయాడన్న కనికరం కూడా లేకుండా పరస్పరం కాట్లాడుకుంటున్నారు. సేద్యకారుల చావులకు కారణమవుతున్న సాగు సంక్షోభం సమస్య పరిష్కారానికి దారులు వెతక్కుండా రోత రాజకీయాలు చేస్తున్నారు. అన్ని విధాలుగా అన్యాయమైపోతున్న అన్నదాతను ఒడ్డునపడేసేందుకు బదులు బురద చల్లుడుకు దిగుతున్నారు. ఆప్ నేతలు రెచ్చగొట్టడం వల్లే రైతు ప్రాణాలు తీసుకున్నాడన్న పోలీసులు ఆరోపణలు నిజమే అయితే అంతకన్నా దారుణం మరోటి ఉండదు. చివరి నిమిషంలో అన్నదాతను కాపాడేందుకు తాము చేసిన ప్రయత్నాలకు ఆప్ నేతలు, కార్యకర్తలు గండి కొట్టారన్న ఖాకీల నిందలు దడ పుట్టిస్తున్నాయి. కళ్ల ముందే రైతు ప్రాణాలు తీసుకుంటుంటే ఖాకీలు చేతులు ముడుచుకుని కూర్చున్నారన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. అన్నింటికీ మించి అన్నదాత జేబులోంచి పడిన సూసైడ్ నోట్ ను దక్కించుకునేందుకు మీడియా ప్రతినిధులు పోటీ పడ్డారన్న అభాండాలు విస్తుగొల్పుతున్నాయి. ఇవన్ని చూస్తుంటే గజేంద్రను విపరీత చర్య దిశగా రెచ్చగొట్టారన్న అతడి కుటుంబ సభ్యుల ఆవేదనలో నిజముందని అనిపించక మానదు. -పి. నాగశ్రీనివాసరావు -
తప్పు చేశాను క్షమించండి..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణ చెప్పారు. ఆప్ ర్యాలీలో గజేంద్ర సింగ్ ఆత్మహత్య సందర్శంగా వెల్లువెత్తిన విమర్శలతో ఇరకాటంలో పడిన కేజ్రీవాల్ తప్పు దిద్దుకునే పనిలో పడ్డారు. ఘటన జరిగిన రెండు రోజులు తర్వాత ఆయన స్పందించారు..నేను తప్పుచేశాను క్షమించండి.,,, ఆ దుర్ఘటన తర్వాత నేను ప్రసంగించకుండా ఉండాల్సింది. ఎవర్నయినా బాధపెట్టి వుండే నా మన్నించండన్నారు. కాగా భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం ఆప్ తలపెట్టిన ర్యాలీ రాజస్థాన్ చెందిన 41 సంవత్సరాల గజేంద్రసింగ్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతణ్ని ఆసుపత్రి తరలించిన తరువాత దాదాపు పదినిమిషాలపాటు ప్రసంగించిన కేజ్రీవాల్ గజేంద్రను కాపాడ్డంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. దీనిపై ప్రతిపక్షాలు, ఢిల్లీ పోలీసులు విరుచుకుపడ్డారు. గజేంద్రను రక్షించడంలో ఆప్ నేతలు, కార్యకర్తలు నిర్లక్ష్యాన్నిప్రదర్శించారని, వైదికపై ఉండి చోద్యం చూశారని మండిపడ్డారు. దీనిపై గురువారం పార్లమెంటులో గందరగోళం చెలరేగింది. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం క్షమాపణలు తెలిపినట్టు సమాచారం. , -
రైతు బలిదానం
దేశవ్యాప్తంగా కొన్నేళ్లుగా సాగుతున్న రైతుల నెత్తుటి తర్పణలు పాలకుల పాషాణ హృదయాలను కరిగించలేకపోతున్నాయని భావించాడేమో...దేశ రాజధాని నగరంలో వేలాదిమంది సాక్షిగా, చానెళ్ల కెమెరాల ముందు రాజస్థాన్కు చెందిన యువ రైతు గజేంద్ర సింగ్ బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుల విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికలను రూపొందించి ఆత్మహత్యలను నివారించలేని అశక్తతలో పడిపోయిన పార్లమెంటుకు కూతవేటు దూరంలో రాజేంద్రసింగ్ ప్రాణార్పణ చేశాడు. మన పాలకుల చేతగానితనాన్ని ప్రపంచం ముందుచాటాడు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నిర్వహించిన రైతు ర్యాలీలో చోటుచేసుకున్న ఈ విషాదం నివారించడానికి సాధ్యంకానిదేమీ కాదు. అతను మరణం అంచులవైపు కదులుతుంటే ఒక్కరంటే ఒక్కరు ముందుకురికి రక్షించే ప్రయత్నం చేయలేదు. రైతు ఆత్మహత్యాయత్నం చేస్తుండగా జనంలోనైనా కాస్త ఆదుర్దా వ్యక్తమైంది. కిందకు రావాలని బతిమాలడం కనబడింది. కానీ, అక్కడున్న పోలీసు సిబ్బందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు కదల్లేదు. ప్రేక్షకపాత్ర వహించారు. అయిదారువేలమంది జనం ఉన్న సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన కేబినెట్ సహచరులు, వారందరి అంగరక్షకులు, ర్యాలీ కోసమని మోహరించిన పోలీసులు... ఇంతమంది ఉండగా ఎవరూ చొరవ ప్రదర్శించలేక పోయారు. ర్యాలీలో నాయకుల ప్రసంగాలు ఆగలేదు. ఈ సంగతి నాయకుల కంట పడలేదనడానికి లేదు. స్వయంగా కేజ్రీవాలే గజేంద్ర సింగ్ను వేదికపైనుంచి గమనించినట్టు వీడియో దృశ్యాలు, ఫొటోలు చెబుతున్నాయి. అంతమంది ముందు ఒక రైతు ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నించిన ఆ విషాద సమయంలో సభను ఆపాలన్న స్పృహ కూడా ఆప్ నేతలకు కొరవడింది. రైతు మరణించగానే మాత్రం నాయకులందరూ సిగ్గువిడిచి వీధినపడి ‘మీరంటే మీరు కారణమ’ని పరస్పరం నిందించుకుంటున్నారు. మొన్నటివరకూ పౌర సమాజ ప్రతినిధులుగా ఉండి ఎన్నో సమస్యలను వెలికితీసిన ఆప్ నేతలు తాము సైతం ఎంత బండబారిపోయారో నిరూపించుకున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న చందంగా బాధ్యతారహితమైన ప్రకటనలు చేసి తమను తాము పలచన చేసుకున్నారు. ఆదినుంచీ నిర్లక్ష్యానికి గురవుతున్న వ్యవసాయరంగం ఆర్థిక సంస్కరణల అమలు ప్రారంభమయ్యాక మరింతగా కుంగిపోవడం మొదలైంది. ఆ సంస్కరణల ఫలాలు కనబడటం ప్రారంభించిన సమయంలోనే వ్యవసాయరంగంలో సంక్షోభం విస్తరించడం మొదలైంది. 1995 నుంచి 2014 వరకూ 3,00,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో వెల్లడించిన గణాంకాలే ఈ సంగతిని తెలియజెబుతున్నాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో ఒక్క విదర్భ ప్రాంతంలోనే వేయిమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇంతే సంఖ్యలో అన్నదాతలు ప్రాణార్పణ చేశారని మానవహక్కుల నివేదిక చెబుతున్నది. నిరుడు డిసెంబర్లో విదర్భ ప్రాంతంలో ఒక రైతు తన పంటపొలంలో చితి పేర్చుకుని నిప్పంటించుకుని తనువు చాలించాడు. పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఏ స్థాయిలో ఆదుకుంటున్నాయో గణాంకాలే వెల్లడిస్తాయి. 2013 జీడీపీలో వ్యవసాయరంగం వాటా 13.7 శాతం ఉంది. ఇదే కాలంలో పరిశ్రమల వాటా 21.5 శాతం. 54 శాతం వ్యవసాయ క్షేత్రాలు పూర్తిగా వర్షాధారంగా ఉన్న పరిస్థితుల్లో...దాదాపు 80 శాతంమంది చిన్న, సన్నకారు రైతులుగా ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునందించడమంటే మాటలు కాదు. వ్యవసాయం ద్వారా రైతులకు లభించే ఆదాయం అరకొరే. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకుంటే రైతు కుటుంబానికి నెలకు సగటున వచ్చే ఆదాయం రూ. 6,000 మించడం లేదు. కానీ దేశ జనాభాలో 49 శాతంమందికి వ్యవసాయరంగమే ఉపాధి కల్పిస్తోంది. పారిశ్రామికరంగంద్వారా ఉపాధి పొందుతున్నవారి శాతం 20మాత్రమే! కానీ పారిశ్రామికరంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాల్లో పదోవంతైనా వ్యవసాయరంగానికి దక్కడం లేదు. ప్రైవేటు రంగంపై ఎక్కడలేని మోజూ ప్రదర్శిస్తున్న పాలకులు వ్యవసాయం కూడా ప్రైవేటు రంగమేననీ, అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎనలేని సేవలందిస్తున్నదనీ మరిచిపోతున్నారు. మన పంట భూముల్లో 54 శాతం పూర్తిగా వర్షాధారమైనవి. 71 శాతం మంది రైతాంగం ఈ వర్షాధార భూముల్లోనే సేద్యం చేయాల్సివస్తున్నది. ఇంత చేసినా చివరకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పండిన పంటంతా ధ్వంసమవుతున్నది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతుకూ, వ్యవసాయ సంక్షోభానికీ ఎలాంటి సంబంధం లేదని చెప్పడానికి అధికార గణం నానాపాట్లూ పడుతోంది. అకాలవర్షాలవల్ల పంట ధ్వంసమైన కారణంగా అప్పులపాలయ్యానని, ముగ్గురు పిల్లల్ని పోషించుకోవడమెలాగో తెలియక సతమతమవుతున్నానని గజేంద్రసింగ్ లేఖరాస్తే...అతను సాగుచేస్తున్న ప్రాంతంలో నష్టం పెద్దగా లేదని చెప్పడానికి రాజస్థాన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిజానికి రైతులు తమ కర్తవ్యంగా భావించి వ్యవసాయం చేస్తారు తప్ప లాభనష్టాల లెక్కలు వేసుకోరు. వారలా లెక్కలేసుకుంటే జనాభాలో అధిక సంఖ్యాకులు పస్తులతో గడపాల్సివచ్చేది. ప్రకృతి వైపరీత్యాలవల్ల కుంగిపోతున్న రైతులను పాలకులు ఆదుకోకపోగా పగబట్టినట్టు వ్యవ హరిస్తున్నారు. విత్తనాలు మొదలుకొని అన్నిటి ధరలూ ఆకాశాన్నంటు తుండగా వ్యవసాయ దిగుబడులకు ప్రకటించే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అరకొరగా ఉండటం రైతాంగం మనసు కష్టపెడుతోంది. ఇవి చాలవన్నట్టు ఈ ఏడాదినుంచి ఆహారధాన్యాల సేకరణకు కూడా కేంద్రం పరిమితులు విధించింది. ఇలాంటి పోకడలే వ్యవసాయ రంగ సంక్షోభాన్ని మరింతగా పెంచుతున్నాయి. రైతులను మృత్యుకుహరంలోకి నెడుతున్నాయి. గజేంద్రసింగ్ మరణంతోనైనా పాలకులు మేల్కొనాలి. ప్రతిష్టకు పోకుండా తమ ప్రమాదకర విధానాలను సవరించుకోవాలి. అలా చేసినప్పుడే దేశవ్యాప్తంగా నిత్యమూ సాగుతున్న రైతుల బలిదానాలు ఆగుతాయి. -
ఆ సూసైడ్ నోట్ రాసిందెవరు?
రాజకీయ రంగు పులుముకున్న రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ కళ్యాణ్వత్ ఆత్మహత్య సంఘటనలో కొత్తకోణం వెలుగుచూసింది. ఆత్మహత్యకు ముందు గజేంద్ర రాసినట్టు చెబుతున్న సూసైడ్ నోట్ అసలు ఆయన రాసింది కాదని, ఆ నోటులోని రాతకు, ఆయన చేతిరాతకు సంబంధం లేదని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. పైగా ఆ నోటు రాజకీయ పరిభాషలో ఉందని, ఎక్కడా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు గజేంద్ర పేర్కొనలేదని స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు తెలిపారు. దౌసా జిల్లాలోని నంగల్ జమర్వాడ గ్రామంలో గురువారం కుటుంబ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకుల సమక్షంలో గజేంద్రసింగ్ అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగానూ రాజకీయ నినాదాలు వినిపించాయి. టెలివిజన్లో గజేంద్ర రాసినట్టు చెబుతున్న సూసైడ్ నోటును చూశామని, ఆ చేతి రాత ఆయనది కాదని ఐదుగురిలో నాలుగో సోదరి అయిన రేఖా కన్వర్, గజేంద్ర మామ గోపాల్ సింగ్ మీడియాకు తెలిపారు. గజేంద్ర తమ్ముడు విజేంద్ర సింగ్ మాత్రం సూసైడ్ నోట్ గజేంద్ర రాశారా, లేదా? అన్న విషయం జోలికి వెళ్లకుండా, అసలది సూసైడ్ నోటులా లేదని చెప్పారు. అందులో తన తండ్రితో ఉన్న గొడవలను ప్రధానంగా ప్రస్తావించాడే తప్ప ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యానించారు. బహూశ తాను ఇవ్వదల్చుకున్న ఉపన్యాసం గురించి నాలుగు ముక్కలు రాసుకున్నాడో, ఏమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘అకాల వర్షాల కారణంగా పంటకు నష్టం ఏర్పడడంతో నా తండ్రి నన్ను ఇంట్లోకి రావద్దన్నాడు. నాకు ముగ్గురు పిల్లలు. జై జవాన్, జై కిసాన్ అంటూ నేను ఎలా ఇంటికి వెళ్లగలను’ అని ఆ లేఖలో ఉంది. సూసైడ్ నోటు గజేంద్రనే రాశారా, లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. -
క్లింటన్కే తలపాగా చుట్టిన గజేంద్రుడు!
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆత్మహత్య చేసుకున్న రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి. దీంతో గజేంద్ర సింగ్ ఎవరు? నిజంగా రైతేనా, అకాలవర్షాల కారణంగా ఆయన పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడా? అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఇంకా ఏమైనా కారణాలున్నాయా?....ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునేందుకు జాతీయ మీడియా యావత్తు రాజస్థాన్లోని దౌసా గ్రామానికి దౌడ్ తీసింది. సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కే తలపాగా చుట్టిన చరిత్ర గజేంద్రసింగ్కు ఉంది. దీంతోపాటు.. ఆయన స్వగ్రామంలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యపానానికి, వరకట్నానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్న గజేంద్ర సింగ్కు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. బీజేపీతో మొదలైన ఆయన రాజకీయాలు, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మీదుగా ఆమ్ ఆద్మీ పార్టీకి చేరుకున్నాయి. ఇప్పుడు ఆ పార్టీలే ఆ రైతు ఆత్మహత్య పట్ల పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. దౌసా గ్రామస్థుల కథనం ప్రకారం: గజేంద్ర సింగ్ 2003లో బీజేపీలో చేరారు. తహసిల్లో జరిగిన పలు పార్టీ సభలూ, సమావేశాల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ టెక్కెట్ ఆశించి భంగపడ్డాడు. దాంతో సమాజ్వాదీ పార్టీ టెక్కెట్పై అసెంబ్లీకి పోటీచేశాడు. బీజేపీ అభ్యర్థి అల్కాసింగ్ చేతుల్లో ఓడిపోయాడు. 2013 వరకు ఆయన ఆ పార్టీలోనే కొనసాగి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర సమితి క్రియాశీలక సభ్యుడిగా కొనసాగాడు. తర్వాత అసెంబ్లీ టిక్కెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ పార్టీలో టిక్కెట్ రాకపోవడంతో చివరకు ఆమ్ ఆద్మీని ఆశ్రయించాడు. గజేంద్ర సింగ్ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. ఆయనది విశాలమైన పక్కా భవంతి. దాదాపు 8 ఎకరాల వ్యవసాయ భూమి. జామ, ఉసిరి తోట ఉంది. ఇంటి ఎదురుగానే టేకు వనం ఉంది. ఇటీవలి అకాల వర్షాల వల్ల గోధుమ, ఆవాల పంట నాశనం అయింది. ఆ పంట నష్టం కూడా 25 శాతానికి మించి ఉండదని జిల్లా అధికారులు తెలిపారు. గజేంద్రకు 12వ తరగతి చదువుతున్న ఒ ఆడపిల్ల, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆత్మహత్య చేసుకునేంత మనోదౌర్బల్యం కూడా లేదు. పది మందికీ సహాయం చేసే మంచి గుణం కూడా ఉంది. ఆయన వ్యవసాయాన్ని కూడా అంతగా పట్టించుకునేవాడు కాదట. జైపూర్లో పర్యాటకులకు రాజస్థాన్ సంప్రదాయ తలపాగా చుట్టడమే పనిగా పెట్టుకొని అలా వచ్చే డబ్బులతో అక్కడే ఎక్కువకాలం జీవించేవాడు. కేవలం 20 సెకడ్లలో తలపాగా చుట్టే నేర్పరిగా పేరు తెచ్చుకున్న గజేంద్ర రాజస్థాన్ సాంస్కృతిక శాఖ నుంచి 'మిస్టర్ డిసర్ట్' అనే టైటిల్ కూడా అందుకున్నారు. బిల్ క్లింటన్ 2000 సంవత్సరంలో రాజస్థాన్లో పర్యటించినప్పుడు ఆయనకు తలపాగా చుట్టారు. ఇంకా పలువురు విదేశీ నేతలకు తలపాగా చుట్టిన ఆయన గతంలో వాజపేయి, ఇటీవల కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు కూడా తలపాగా చుట్టిన ఫొటోలను ఆయన మిత్రులు చూపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా కృషిచేస్తానని ఢిల్లీ వెళ్లేముందు గ్రామస్థులకు మాట ఇచ్చాడట. కేజ్రీవాల్ను స్వయంగా కలుసుకునేందుకు మూడు రోజులు ముందుగానే ఢిల్లీ వెళుతున్నానని చెప్పాడని ఆయన మేనల్లుడు అమిత్ సింగ్ తెలిపాడు. జంతర్ మంతర్ వద్ద చెట్టెక్కి టీవీలను ఆకర్షించినప్పుడు 'చూస్కో నేను టీవీలో కనిపిస్తున్నాను' అని తనకు ఫోన్చేసి చెప్పాడని ఆయన తమ్ముడు విజేంద్ర సింగ్ తెలిపాడు. ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా కుటుంబ సమస్యలు ఉన్నాయని, పలుసార్లు ఇల్లు విడిచి వెళ్లి పోవాలనుకున్నాడని కొంత మంది గ్రామస్థులు తెలిపారు. ఏదేమైనా ఆత్మహత్య చేసుకునే బలహీనుడు మాత్రం గజేంద్రసింగ్ కాడని గ్రామస్థులు ఏకమాటగా చెప్పారు. దీంతో ప్రమాదవశాత్తు ఆయన చెట్టుమీది నుంచి జారిపడ్డాడా? అనే కొత్త ప్రశ్న పుట్టుకొచ్చింది. ఈ దిశగా కూడా ఇప్పుడు ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రభుత్వ తీరు వల్లే రైతు ఆత్మహత్యలు: రాహుల్
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నేడు పార్లమెంట్ను కుదిపేయనుంది. రాజ్యసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా నిన్న భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో రాజస్థాన్కు చెందిన గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రైతు ఆత్మహత్యపై చర్చించాలంటూ విపక్ష సభ్యులు గురువారం ఉదయం రాజ్యసభలో నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ తీరు వల్లే రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ అంశంపై ఆయన నేడు సభలో ప్రసంగించే అవకాశం ఉంది. కాగా లోక్సభలోనూ రైతు ఆత్మహత్యపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఆప్ నేతలు రెచ్చగొట్టడం వల్లే గజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆప్ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గజేంద్ర సింగ్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు. -
'రైతు' చుట్టూ శవరాజకీయాలు
న్యూఢిల్లీ: దేశరాజధాని నగరం ఢిల్లీ నడిబొడ్డున ఓ రైతు అత్మహత్య చేసుకుంటే ... దానికి దారితీసిన తీవ్రమైన పరిస్థితులను అర్థం చేసుకోకుండా రాజకీయ పార్టీలు నిసిగ్గుగా శవ రాజకీయాలకు తెరతీశాయి. రైతులోకంలో అలముకున్న బాధాకరమైన పరిస్థితులకు అద్దం పడుతున్న ఈ సంఘటనను చూడాల్సిన కోణంలో చూడకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇదంతా పోలీసుల తప్పని, పోలీసుల ఆదిపత్యం తమ చేతుల్లో లేదంటూ ఆప్ పార్టీ ముందుగా తమ పాత రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకొచ్చి శవరాజకీయాలకు శ్రీకారం చుట్టగా, కాంగ్రెస్ పార్టీ ఈ దారుణానికి ఆప్ పార్టీయే కారణమంటూ రాజకీయ శంఖారావం పూరించింది. మధ్యలో భారతీయ జనతాపార్టీ రంగంలోకి దిగి తప్పంతా భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన ఆప్ పార్టీదేనని ఆరోపణల జడివాన కురిపించింది. ఇదంతా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నప్పుడే జరగడం మరెంత దారుణమో ఆ పార్టీలే గ్రహించాలి. జంతర్ మంతర్ నుంచి ఒక్కసారిగా సీన్ రామ్ మనోహర్ లోహియాకు మారిపోయింది. మృతుడి బంధువులను పలకరించడంలో అక్కడ కూడా రాజకీయ పోటీ రక్తి కట్టించింది. ఈ సంఘటనపై ఎవరేమన్నారో పరిశీలిస్తే రాజకీయ పార్టీల శవ రాజకీయాల గురించి ఎవరూ చెప్పక్కర్లేదు. అరవింద్ కేజ్రివాల్: మనందరి కళ్ల ముందే రైతు చెట్టెక్కాడు. ఆ మనిషిని రక్షించండి...రక్షించండి! అంటూ మనం పోలీసులకు చెబుతూనే ఉన్నాం. ఢిల్లీ పోలీసులు మన చేతుల్లో లేరనే విషయం మనకు తెల్సిందే. మన మాట వినకపోయినా కనీసం మానవత్వంతోనైనా పోలీసులు ఆ రైతును రక్షించి ఉండాల్సింది. వారు అసలు స్పందించలేదు. ఆ విషయం తాను చూసుకుంటానని కమిషనర్ తాపీగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్: రైతును కాపాడాల్సిన ఆప్ నాయకులు అది పట్టించుకోకుండా ర్యాలీని కొనసాగించారు. నేను విన్నది నిజమే అయితే....ఆ రైతును కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. వారికి ఓ వ్యక్తి ప్రాణాలను రక్షించడంకంటే రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడమే వారికి ముఖ్యమంది. రైతుల కోసం పోరాడుతామంటున్న వారి మాటల్లో నిజం ఎంతో ఈ సంఘటనతో స్పష్టమవుతోంది. బీజేపీ నేత సంబితా పాత్ర: ఇది కుట్ర...ఇది జరుతుందని కేజ్రివాల్కు ముందే తెలుసు. చెట్టు ఎక్కుతున్న రైతు ఆత్మహత్య చేసుకోబోతున్నాడని మీకు తెలుసు. కానీ మీరు శవరాజకీయాలకు పాల్పడ్డారు. ఓ వ్యక్తి ప్రాణంకన్నా మీకు మీ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమైంది. ఓ డాక్టర్గా ఆ రైతు ప్రాణం పోవడం ఎంత బాధాకరమో నాకు తెలుసు. ఆప్నేత సోమ్నాథ్ భారతి: రైతు ఆత్మహత్యను ఆపేందుకు ఆప్ కార్యకర్తలు ఎంతో ప్రయత్నించినా లాభం లేకపోయింది. చెట్లెక్కడం ఢిల్లీ పోలీసులకు నేర్పకపోవడం దారణం. ఇందులో ఏదో కుట్ర ఉంది. అయితే ఈ సంఘటనతో ర్యాలీని కొనసాగించకుండా ఆపి వేయాల్సింది.