Helicopters
-
AP: బురదలో ఆహార పొట్లాలు.. సాయం ఇలాగేనా?
సాక్షి, విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి ఆహారం, నీరు లేకపోవడంతో హెలికాప్టర్ వద్దకి ప్రజలు పరుగులు తీస్తున్నారు. వాంబే కాలనీలో ఆహార పొట్లాలను హెలికాప్టర్ ద్వారా బురదలోకి జారవిడుస్తున్నారు. దీంతో ఆహారం, వాటర్ కోసం స్థానికులు బురదలో పడి కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.పక్కనే అపార్ట్మెంట్లు ఉన్నా బురదలో పడేయడం ఏంటి అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బురదలో పడి ఆహారం కోసం కుక్కలా కొట్టుకొనేటట్లు ప్రభుత్వం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురదలో ఆహార ప్యాకెట్లు పడటంతో సగం పైనే బురదమయం అవుతున్నాయని మహిళలు వాపోతున్నారు.మరో వైపు, వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి కష్టాలు తప్పడం లేదు. వరద బాధితులను తరలించేందుకు అధికారులు బోట్లను రప్పించారు. తిండీ తిప్పల్లేకుండా ఆకలితో అలమటిస్తూ.. బోట్లతో మత్స్యకారులు వచ్చారు. ముస్తాబాద్ వద్ద వరద బాధితుల కోసం బోటు ఏర్పాటు చేయగా, బోటుతో పాటు మచిలీపట్నం నుంచి ముగ్గురు మత్స్యకారులు వచ్చారు.అధికారులు తీసుకొచ్చి తమను వదిలేశారని.. ఒక్కరు కూడా తమను పట్టించుకోవడమ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల ప్రాణాలను రక్షిస్తున్న తమ ప్రాణాలకు గ్యారంటీ లేదని మత్స్యకారులు వాపోతున్నారు. -
పొలం పనులకు వెళ్లి.. వరదలో చిక్కుకుని..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/అశ్వారావుపేటరూరల్: ఒక్కసారిగా పెద్దవాగుకు వరద పోటెత్తింది. దీంతో ఆ వరద ఉధృతిలో 28 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లు రంగంలోకి 25 మందిని సురక్షిత ప్రాంతానికి చేర్చగా, మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. వాన తగ్గిందని...భద్రాద్రి కొత్తగూడెంజిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి దగ్గర పెద్దవాగుపై మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టులోకి వరద వచ్చే క్యాచ్మెంట్ ఏరియాలో కొంత ఏపీలోని బుట్టాయిగూడెం మండల పరిధిలో ఉంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులో ప్రవాహం పెరిగింది. మరోవైపు అశ్వారావుపేట మండలంలో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. మధ్యాహ్నం 12:30 గంటలకు వాన కొంత తగ్గుముఖం పట్టడంతో స్థానికులు పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో పెద్దవాగుకు అకస్మాత్తుగా వరద పెరిగి ముందుగా ఒడ్డు వెంట ఉన్న పొలాలను చుట్టుముట్టింది. దీంతో వరదలో చిక్కుకున్న వారు ప్రాణాలు కాపాడుకునేందుకు చెరువుకట్టకు దగ్గరలో ఉన్న ఎత్తయిన ప్రదేశం వైపు వెళ్లారు. ఆ తర్వాత క్రమంగా వరద నీటిమట్టం పెరుగుతూ మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి బాధితుల మోకాళ్లలోతు వరకు వచ్చాయి. క్రమంగా గట్టు దాటుకొని పొలాలను ముంచెత్తింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యానికి మించి వరద రావడంతో ముందుగా ప్రాజెక్టు ఎగువ భాగం ముంపునకు గురైంది. దీంతో వెంటనే ప్రాజెక్టుకు ఉన్న మూడు గేట్లు తెరిచేందుకు ప్రయత్నించగా అందులో ఒకటి తెరుచుకోలేదు. బాధితులు ఫోన్లో సమాచారం ఇవ్వగా, వరద పరిస్థితిని తెలుసుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని సహాయ కార్యక్రమాల కోసం అప్రమత్తం చేశారు. అటు అనుకుంటే ఇటు..: ఏపీలోని వేలేరు పాడు మండలం అల్లూరినగర్ దగ్గర వరద నీటిలో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ఐదుగురిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి నేవీ హెలికాప్టర్ను పంపింది. అయితే హెలికాప్టర్ రావడం ఆలస్యం కావడంతో గ్రామస్తులు ఆ కారులో ఉన్న ఐదుగురిని కాపాడారు. దీంతో నేవీ హెలికాప్టర్ సంఘటనా స్థలానికి రాకుండా ఏలూరులో ఆగిపోయింది. అయితే అదే సమయంలో పెద్దవాగు ప్రాజెక్టు ఎగువన నారాయణపురంలో 28 మంది వరదలో చిక్కుకుపోయిన విషయం వెలుగుచూసింది. దీంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్కడి అధికారులతో మాట్లాడి హెలికాప్టర్ను ఇటు పంపించారు. జాయింట్ ఆపరేషన్: ఏలూరు నుంచి హెలికాప్టర్ ఘటనా స్థలికి 6:15 గంటలకు వచ్చింది. వెలుతురు సరిగ్గా లేదు. సహా య కార్యక్రమాలు ఏమేరకు జరుగుతాయో అనే సందేహం నెలకొంది. నేవీ హెలికాప్టర్ ముందుగా ప్రభావిత ప్రాంతంలో చక్కర్లు కొట్టి బాధితులు ఉన్న లొకేషన్ను గుర్తించింది. ఆ తర్వాత 20 నిమిషాలకు తెలంగాణకు చెందిన హెలికాప్టర్ ఘటనా స్థలికి చేరుకుంది. 6:45 గంటలకు అసలైన రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. నేవీ హెలికాప్టర్ దారి చూపిస్తూ లొకేషన్ దగ్గరికి తీసుకెళ్లి బాధితులు ఉన్న చోటుపై లైట్ వేసింది. రెండో హెలికాప్టర్ ఆ స్థలానికి చేరుకుని బాధితులకు రోప్ అందించింది. విడతల వారీగా బాధితులను బయటకు తీసుకురా వడంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. వైకుంఠధామంలో ల్యాండింగ్..బాధితులు మధ్యాహ్నం 3 గంటలకు వరద నీటిలో చిక్కుకున్నారు. గంటగంటకూ వరద నీరు పెరుగుతూ మోకాళ్ల లోతుకు వచ్చింది. బాధితుల్లో మహేశ్ అనే యువకుడి దగ్గరే ఫోన్ ఉంది. దీంతో ప్రాణభయంతో అందరూ ఆ ఫోన్ నుంచే కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తమ ప్రాణాలు దక్కవేమోనంటూ బోరున విలపించారు. మూడు గంటలు గడిచినా రెస్క్యూఆపరేషన్ మొదలు కాకపోవడం, మరోవైపు చీకటి పడుతుండటంతో పైప్రాణాలు పైనే పోయాయని భావించారు. అయితే ఏడు గంటల సమయంలో వరద నీటి నుంచి వారిని కాపాడిన హెలికాప్టర్ ల్యాండింగ్కు సరైన స్థలం లేక నారాయణపురం గ్రామంలో ఉన్న వైకుంఠధామం (స్మశానం)లో వారిని దించింది. ప్రాణాపాయం నుంచి బయటపడిన వారికి వైకుంఠధామం తొలి ఆశ్రయం ఇచ్చింది.పెద్దవాగుకు గండిరైట్ కెనాల్ తూము దగ్గర 40 మీటర్ల వద్ద....తెలంగాణలో రెండు, ఏపీలో ఏడు గ్రామాలు మునక!ముందుగానే గ్రామాలు ఖాళీ చేసిన ప్రజలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీ, తెలంగాణవాసులను గడగడలాడించిన పెద్దవాగుకు ప్రాజెక్టుకు గండిపడింది. రెండు రాష్ట్రాల పరిధి పెద్దవాగు క్యాచ్మెంట్ ఏరియాలో సుమారు 16 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో గురు వారం ఉదయం నుంచి వాగుకు వరద పోటెత్తింది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 40,500 క్యూసెక్కులు కాగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 70 వేల క్యూసెక్కులు, సాయంత్రం 5గంటలకల్లా 90 వేల క్యూసెక్కుల వరద చేరింది. దీంతో మధ్యాహ్నం నుంచే ప్రాజెక్టుకు ఎగపోటు మొదలైంది. సాయంత్రం 5–30 గంటలకు గేట్లు, మట్టికట్ట మీద నుంచి నీరు ప్రవహించడం మొద లైంది. రాత్రి 7.30గంటల సమయంలో 32 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. అయితే ఉధృతి తగ్గకపోవడంతో రాత్రి 8 గంటల సమయంలో రైట్ కెనాల్ తూము దగ్గర 40 మీటర్ల మేరకు గండి పడగా, అక్కడి నుంచి కొంత దూరంలో మరో 20 మీటర్ల మేరకు గండి పడింది. మొత్తంగా 150 మీటర్ల మేరకు మట్టి కట్ట బలహీనపడిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. నీట మునిగిన గ్రామాలు: పెద్దవాగు దిగువన తెలంగాణలో గుమ్మడవెల్లి, కొత్తూ రు గ్రామాలు ఉన్నాయి. గురువారం సాయంత్రం వరద ఉధృతి పెరిగిన వెంటనే ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు అధికారులు హుటా హుటిన ఖాళీ చేయించారు. గండి పడిన తర్వాత వచ్చిన వరద నలభై ఇళ్లను ముంచెత్తింది. పశువులు ఇతర ఆస్తి నష్టం వివ రాలు తెల్లవారితే కానీ తెలిసే అవకాశం లేదు. ఏపీలోని వేలేరుపాడు మండలం మేడిపల్లి, రామవరం, గుండ్లవాయి, రెడ్డిగూడెంకాలనీ, మద్దిగట్ల, పూచిరాల గ్రామాల్లోనూ వరద ప్రభావానికి లోనయ్యాయి. -
గాల్లో నేవీ హెలికాఫ్టర్లు ఢీ.. 10 మంది దుర్మరణం
మలేషియాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లు గాల్లోనే ఒకదాంతో మరొకటి ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. రాయల్ మలేషియన్ నేవీ పరేడ్ కోసం మంగళవారం ఉదయం లుముత్ నేవల్ బేస్లో రిహాల్సల్ జరిగాయి. ఆ సమయంలో రెండు హెలికాఫ్టర్లు ఆకాశంలోనే ఢీ కొట్టాయి. ముక్కలైన శకలాలు కింద మైదానంలో పడిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. రెండు హెలికాఫ్టర్లలో పది మంది సిబ్బంది అక్కడికక్కడే చనిపోయినట్లు మలేషియా నేవీ ప్రకటించుకుంది. మృతదేహాల గుర్తింపునకు కోసం నేవీ ఆస్పత్రికి మృతదేహాల్ని తరలించినట్లు తెలిపింది. ⚡Ten people are reported killed as two military #helicopters had a mid-air collision in #Malaysia during preparations for a naval military parade. The incident occurred in the town of Lumut at around 9:30 am during a training to mark the 90th anniversary of the Royal… pic.twitter.com/OEF3SDNG6a — Shafek Koreshe (@shafeKoreshe) April 23, 2024 -
రేపే ఎన్నికలు.. సిద్ధంగా హెలికాప్టర్లు! ఎందుకంటే..
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దండే ఎన్నికలకు సన్నద్ధత గురించిన సమాచారాన్ని అందించారు. ఉత్తరాఖండ్లోని మొత్తం ఐదు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యవసర సేవ కోసం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేశామని, ఈసారి ఓటింగ్ ప్రమాద రహితంగా ఉంటుందని, ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తదని ఉత్తరాఖండ్ అదనపు ఎన్నికల అధికారి జోగ్దండే తెలిపారు. "అన్ని పోలింగ్ బృందాలు బయలుదేరుతున్నాయి. వారి అత్యవసర సేవ కోసం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేశాం. ఒక హెలికాప్టర్ గర్వాల్లో, మరొకటి కుమావోన్లో మోహరిస్తాం. వీటిని అత్యవసర అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తాం. బూత్ స్థాయిలో సహాయ నిర్వహణలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అంబులెన్స్ల నంబర్లను అందుబాటులో ఉంచాం" అని ఆయన పేర్కొన్నారు. కొండ ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 11వేలకు పైగా పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో వరుసగా రెండుసార్లు మొత్తం ఐదు స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి క్లీన్స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని ఉత్సాహంగా ఉంది. -
వినువీధిలో మిలాన్ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్–2024 విన్యాసాల్లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను గురువారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్భట్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను ఆర్కే బీచ్లో ప్రారంభించారు. యుద్ధ నౌకల ప్రదర్శనలు, మిగ్–29 ఎయిర్క్రాఫ్ట్ల గగుర్పొడిచే విన్యాసాలు, సీహాక్స్, చేతక్, ఏఎల్హెచ్ హెలికాఫ్టర్ల సమర ప్రదర్శనలకు విశాఖ ఆర్కే బీచ్ వేదికైంది. లక్షలాది మంది వీక్షకుల నడుమ మార్కోస్.. శత్రుమూకలతో చేసిన పోరాటాలు సాగర తీరాన్ని రణరంగంగా మార్చాయి. యుద్ధ విన్యాసాల అనంతరం.. మిలాన్లో పాల్గొన్న 51 దేశాల జాతీయ జెండాల ప్రదర్శన, నౌకాదళ సిబ్బంది పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన నేవీ బ్యాండ్ ఉర్రూతలూగించగా.. కూచిపూడి, థింసా, గరగ, తప్పెటగుళ్లు, కొమ్ము నృత్యం, కోలాటం, గార్భా, దాండియా.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు విదేశీయుల్ని సైతం మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ఏర్పాటు చేసిన శకట ప్రదర్శనకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. నేవీ బ్యాండ్తో ముగింపు పలకగా.. చివర్లో దేశ పరాక్రమాన్ని, ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని ప్రస్ఫుటించేలా నిర్వహించిన లేజర్ షో అద్భుతంగా సాగింది. బాణసంచా పేలుళ్లతో కార్యక్రమాన్ని ముగించారు. సాగర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు వార్షిప్స్ జలాశ్వ, ముంబై, చెన్నై యుద్ధ నౌకలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి అజయ్భట్ స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు విశాఖలో నిర్వహించిన రెండు మిలాన్లు అతిపెద్ద విన్యాసాలుగా చరిత్రకెక్కాయి. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ నగరం మేరీటైమ్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్లో నౌకాదళానికి విశాఖ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన సిటీ పరేడ్ ద్వారా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించాలన్నదే లక్ష్యం. 51 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. – అజయ్భట్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి విశాఖ నగరం అద్భుత ఆతిథ్యమిచ్చింది మిలాన్–2024 విన్యాసాలకు విశాఖ నగరం అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించినందుకు కృతజ్ఞతలు. విశాఖకు, నౌకాదళానికి అవినాభావ సంబంధం ఉంది. ఈస్ట్రన్ సీ బోర్డ్లో విశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్నకు.. ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి నగరానికి అంకితం చేశాం. ఇక్కడ నిర్వహించే ప్రతి నౌకాదళ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి, విశాఖ ప్రజలకు కృతజ్ఞతలు. – అడ్మిరల్ ఆర్ హరికుమార్, భారత నౌకాదళాధిపతి -
దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ గురి
ఖాన్ యూనిస్: శనివారం దక్షిణ గాజాలోని నిర్దేశిత లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్లో హెలికాప్టర్ల ద్వారా మొట్టమొదటిసారిగా మ్యాప్ ముద్రించిన కరపత్రాలను విడిచిపెట్టింది. అందులో, దాడుల నుంచి రక్షణ పొందేందుకు తాముంటున్న చోటు నుంచి సురక్షిత ప్రాంతానికి ఎలా వెళ్లాలో తెలిపే వివరాలున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు దాడుల్లో కనీసం 200 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజాలోని ఆరోగ్య శాఖ తెలిపింది. -
తక్కువ సమయంలో విస్తృత ప్రచారం
సాక్షి,. హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు, సాధ్యమైనన్ని ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయడానికి వీలుగా బీజేపీ ముఖ్యనేతలు హెలికాప్టర్ సేవలను వినియోగించుకోనున్నారు. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు నిర్వహించే ప్రచారానికి హెలికాప్టర్లను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా...గురువారం ఉదయమే ఢిల్లీ నుంచి నగరానికి తిరిగొచ్చిన ఈటల రాజేందర్...బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో మహబూబాబాద్ జిల్లా గూడూరుకు వెళ్లారు. గూడూరు నుంచి రోడ్డు మార్గాన డోర్నకల్ నియోజకవర్గంలోని నరసింహులపేటకు వచ్చిన ఆయన బీజేపీ అభ్యర్థి భూక్య సంగీత తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరుకు చేరుకుని అక్కడ బీజేపీ అభ్యర్థి హుస్సేన్ నాయక్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల సభ ముగిశాక హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకున్నారు. మళ్లీ ఈ నెల 5వ తేదీ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఈటల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తాజాగా పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కావడంతో...నామినేషన్ల దాఖలు...ఎన్నికల ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ను ఖరారు చేసుకోవాల్సి ఉంది. మరో మూడు రోజుల్లో ప్రచార షెడ్యూల్ను ఖరారు చేసుకుని హెలికాప్టర్ ద్వారా విస్తృత ప్రచారాన్ని చేపడతామని బండి సంజయ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ప్రతీరోజు ఉదయం 7 నుంచి 11 దాకా, మళ్లీ సాయంత్రం 4 నుంచి 9 దాకా తాను పోటీచేస్తున్న కరీంనగర్లో సంజయ్ ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా వరుసగా ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారానికి సంజయ్ సిద్ధమవుతున్నారు. పార్టీ అప్పగించిన ప్రచార బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూనే.. పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు సంజయ్ తెలిపారు. బీజేపీ అభ్యర్థుల మలివిడత జాబితాను ప్రకటించాక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ ఇతర నేతల ఎన్నికల ప్రచారానికి పార్టీ షెడ్యూల్ ఖరారు చేస్తోంది. కిషన్రెడ్డి, ఇతర ముఖ్యనేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సభలో పాల్గొనేందుకు వీలుగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు హెలికాప్టర్లో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా..కాంగ్రెస్ కూడా పార్టీ అధినేతలు వచ్చిన సమయంలో హెలికాప్టర్ సేవలను వినియోగించుకుంటోంది. -
గ్రాండ్ వెడ్డింగ్లో అంబానీల మించిన జంట ఎవరో తెలుసా?
డెస్టినేషన్వెడ్డింగ్స్, విలాసవంతమైన సౌకర్యాలతో, ఆడంబరమైన పెళ్లిళ్లు ఈ మధ్యకాలంలో బడాబాబులకు, ఐశ్వర్యవంతులకు చాలా సాధారణంగా మారిపోయింది. కానీ భారతీయ చిత్రనిర్మాత, ఫ్యాషన్ డిజైనర్ జపిందర్ కౌర్, హోటల్ వ్యాపారి హర్ప్రీత్ సింగ్ చద్దా 2017లోనే దుబాయ్లో జరిగిన వివాహం సరికొత్త ట్రెండ్ని సృష్టించింది. పెళ్లి వేదికనుంచి దుస్తులు, ఆభరణాలనుంచి ప్రతీ వేడుక సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. డిజైనర్ దుస్తులు, బంగారు తీగతో చేసిన చీర, డైమండ్లు, రత్నాల పొదిగిన ఆభరణాలు హెలికాప్టర్, ప్రైవేట్ యాచ్, ఇంకా.. చాలా ..చాలా..ఈ వివరాలేంటో ఒకసారి చూద్దాం. జపిందర్ కౌర్ దుబాయ్కి చెందిన ఫ్యాషన్ డిజైనర్ కాగా, చద్దా ప్రముఖ వ్యాపారవేత్త. అంబానీ, అదానీలకు మించిపోయిన జపిందర్ కౌర్ , హర్ప్రీత్ సింగ్ చద్దా వివాహ వేడుకలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. దుబాయ్లోని ది పాలాజ్జో వెర్సెస్, ది పాలాజ్జో వెర్సెస్ దుబాయ్, బుర్జ్ ఖలీఫా , బుర్జ్ అల్ అరబ్లో అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకల్లో ముఖ్యమైన మెహిందీ ఈవెంట్ కోసం ఈ జంట మెగా ప్రైవేట్ యాచ్ని కూడా బుక్ చేసుకుంది. హెలికాప్టర్ద్వారా 350 కిలోల గులాబీ రేకులను లగ్జరీ పడవలోకి జార విడవడంప్రత్యేక ఆకర్షణ. ఐదు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో ప్రతీదీ ఒక స్పెషల్ ఎట్రాక్షన్. ఈ వివాహానికి మొత్తం ఖర్చు రూ. 600 కోట్లుగా అంచనా. ఇది ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ పెళ్లి ఖర్చు కంటే కొంచెమే తక్కువ అంటే అర్థం చేసుకోవచ్చు ఈ పెళ్లి రేంజ్ను. అద్భుతమైన డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్స్ బుర్జ్ఖలీఫాలో నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. లేస్ డిజైన్తో తీర్చిదిద్దిన గౌనులో యువరాణిలా రాయల్టీ లుక్లో వెలిగిపోయింది. జపిందర్ గోల్డెన్ బ్యాండ్తో కూడిన 12 క్యారెట్ల డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ను ధరించగా, ప్లాటినమ్ బ్యాండ్పై 6 క్యారెట్ల డైమండ్ రింగ్ను ధరించాడు చద్దా. ఈ లవబర్డ్స్ తమ రోకా వేడుకను విలాసవంతమైన బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో నిర్వహించారు. మెగా మెహిందీ ఈవెంట్ అంతేకాదు నిశ్చితార్థ వేడుకను మించి తమ రికార్డును తామే బద్దలు కొట్టి మరీ మెహందీ వేడుకను ఒక ప్రైవేట్ యాచ్లో నిర్వహించారు. గులాబీ రేకులను చల్లేందుకు ప్రత్యేకమైన హెలికాప్టర్ను బుక్ చేసుకున్నారు. 350 కిలోల గులాబీ రేకులను జంటపై, పడవలో ఉన్న ఇతరులపై హెలికాప్టర్ అందంగా వెదజల్లింది. ఇది వధూవరులను మాత్రమే కాదు అక్కడున్న వారందరినీ థ్రిల్ చేసిందంటే అతిశయోక్తి కాదేమో. గ్రాండ్ వెడ్డింగ్ జపిందర్ కౌర్ హర్ప్రీత్ సింగ్ చదా గ్రాండ్ వెడ్డింగ్ వేడుక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విలువైన రత్నాలు పొదిగిన 5 మీటర్ల పొడవున్న ఈ గౌన్ బరువు 10 కిలోల కంటే ఎక్కువే. దార్ సారా పాస్టెల్ పింక్ హై-ఫ్యాషన్ వెడ్డింగ్ గౌన్తో, అంతకుమించిన డైమండ్ ఆభరణాలు,120-క్యారెట్ పోల్కీ వజ్రాలు, బర్మీస్ కెంపులు, పచ్చలు, ధరించిన మ్యాచింగ్ చెవిపోగులు , మాంగ్ టికాతో కూడిన లేయర్డ్ నెక్లెస్ దివినుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపించింది. ఈ వివాహ వేడుక వెడ్డింగ్ రిసెప్షన్లో కూడా ఎక్కడా తగ్గలేదు ఈ జంట. ఈ రాయల్ రిసెప్షన్ కోసం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన స్వచ్ఛమైన బంగారు దారంతో గౌను, బంగారు కిరీటంతో ధగ ధగ మెరిసిపోయింది. ఇక హర్ప్రీత్ రాయల్ బ్లూ షేర్వానీలో, కెంపులు , పచ్చలు పొదిగిన బంగారు ఖడ్గంతో రాజకుమారిడిలా వెలిగిపోయాడు. ఇక విందు భోజనాలు గురించి ప్రత్యేకంగా చెప్సాల్సింది ఏముంటుంది. View this post on Instagram A post shared by JAPINDER KAUR (@japinderkaur) -
ఎన్నికల సందడి.. స్టార్ క్యాంపెయినర్లతో విమానాలకు డిమాండ్
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రచారానికి సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు, వందల సంఖ్యలో ప్రచార సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు డిమాండ్ ‘టేకాఫ్’ తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చే జాతీయ పార్టీ నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వీటిని అద్దెకు తీసుకునేందుకు సై అంటున్నారు. ఒత్తిడి లేకుండా, వేగవంతంగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసే వీలుతో పాటు సమయం ఆదా అవుతుండటంతో అద్దె హెలికాప్టర్లకు ఎన్నికల వేళ గిరాకీ జోరందుకుంటుంది. గంటల వ్యవధిలోనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లి పలు ప్రచారాల్లో పాల్గొనే అవకాశం ఉండటం కూడా నేతలను గాల్లో చక్కర్లు కొట్టేలా చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ అద్దె లక్షల్లోనే... బ్లేడ్ ఇండియా, అర్బన్ ఎయిర్ మొబిలిటీ, ఇండియన్ ఫ్లై సర్విసెస్, జెట్సెట్గో వంటి కంపెనీలు హెలికాప్టర్లు, జెట్ విమానాలను అద్దెకు ఇస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీలతో పాటు సువిధ యాప్ ద్వారా కూడా హెలికాప్టర్లతో సహా వాహనాలను అద్దెకు తీసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా బెల్ 407, ఎయిర్బస్ హెచ్125, హెచ్130 వంటి హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటారు. ఇందులో అయిదుగురు ప్రయాణించవచ్చు. సాధారణంగా సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ అద్దె గంటకు రూ.1.5 లక్షల నుంచి ఉంటుంది. రెండు ఇంజిన్ల సామర్థ్యం ఉంటే రూ.2.75 లక్షల వరకు అవుతుంది. జాతీయ పార్టీల నుంచి డిమాండ్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు, స్టార్ క్యాంపెనర్లతో తెలంగాణలో ప్రచారం చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో అద్దె హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లయిట్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు, వ్యక్తిగత రాజకీయ నాయకుల నుంచి హెలిక్టాపర్ల అద్దెకు అభ్యర్థనలు వస్తున్నాయని ఓ సంస్థ ప్రతినిధిని తెలిపారు. ఆయా పార్టీల నాయకులు కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో తమ హెలికాప్టర్లను అద్దెకు తీసుకొని ప్రచారం సాగించారని తెలిపారు. తెలంగాణలోనూ ఇరు పార్టీలు ప్రధానంగా పోటీలో ఉండటం వల్ల ఇక్కడ కూడా ఫుల్ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీజీసీఏ మార్గదర్శకాలు తప్పనిసరి.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్దేశించిన నిబంధనలను ఆపరేటర్లు తూ.చ. తప్పకుండా పాటించాల్సిందే. పైగా ఎన్నికల సమయంలో ప్రత్యేక మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. మంత్రులు, సీనియర్ రాజకీయ నేతలు రెండు ఇంజిన్లు ఉన్న హెలికాప్టర్ లేదా విమానంలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. వీఐపీ విమానాలను నడిపే పైలట్లు ని ర్మిష్ట రకం విమానం లేదా హెలికాప్టర్లో నిర్దిష్ట సంఖ్యలో ఫ్లయింగ్ గంటల అనుభవాన్ని కలిగి ఉండాలి. అద్దె ఖర్చు ఎవరి ఖాతాలో.. హెలికాప్టర్ అద్దెలపై కూడా ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి, స్థానిక డిప్యూటీ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక స్టార్ క్యాంపెయినర్ హెలికాప్టర్ను ఉపయోగిస్తే అభ్యర్థి పేరు తీసుకోకుండా లేదా అభ్య ర్థితో వేదికను పంచుకోకుండా ప్రసంగాలు చేస్తే అప్పుడు ఆ ఖర్చు మొత్తం పార్టీపైనే పడుతుంది. ఒకవేళ అభ్యర్థి పేరుతో ప్రచారం చేస్తే గనుక అప్పుడు ఆ వ్యయం పార్టీ, అభ్య ర్థికి చెరి సగం పడుతుందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. సొంతంగా హెలికాప్టర్లు ఉన్న వారి ప్రయాణ సమయం, అద్దెను అభ్యర్థుల ఖర్చుగా పరిగణిస్తారు. ప్రచార రథాలు సిద్ధం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వివిధ పార్టీలకు ప్రచార వాహనాలను రూపొందించే సిబ్బందికి, వాహనాలకు, డ్రైవర్లకు ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. పార్టీల జెండాలు, బ్యానర్లను తయారు చేసే టైలర్లకు సైతం భారీ గిరాకీ వచ్చింది. ఉప్పల్, చర్లపల్లి తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రెడీమేడ్ దుస్తులను తయారు చేసే పలు కంపెనీల్లోని కుట్టుమిషన్లపైన ఇప్పుడు పార్టీల జెండాలు రెడీ అవుతున్నాయి. అంబర్పేట్ పటేల్నగర్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల్లోనూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జెండాలను, బ్యానర్లను తయారు చేసే మహిళా టైలర్లకు డిమాండ్ వచ్చేసింది. తాత్కాలికంగా అయినా ఇప్పుడు ఇది ఓ కుటీర పరిశ్రమగా మారినట్లు పటేల్నగర్కు చెందిన బాలమణి తెలిపారు. రోజుకు 250 నుంచి 300 వరకు బ్యానర్లు, జెండాలు, ఇతర ప్రచార సామగ్రిని తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రచార రథాలకు మేకప్.... నేతలు ప్రచార వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచార వాహనాల కోసం వినియోగించే టాటా, మహీంద్ర వాహనాలకు డిమాండ్ వచ్చేసింది. అభ్యర్థుల కటౌట్లు, బ్యానర్లు తదిర హంగులతో ప్రచార రథాలుగా తీర్చిదిద్దేందుకు కా ర్మికులు, టెక్నీషియన్లు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. మూసారాంబాగ్, ఇందిరాపార్కు, తదితర ప్రాంతాల్లో ప్రచార ర«థాల తయారీ పనులు జోరుగా సాగుతున్నాయి. -
Karnataka Assembly Election 2023: హెలికాప్టర్లకు డిమాండ్
సాక్షి,బళ్లారి: విధానసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో బరిలో ఉన్నదెవరో తేలిపోయింది. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పోలింగ్కు మరో 12 రోజులే గడువు ఉంది. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ బహిరంగ సభలు నిర్వహించి ప్రముఖులతో ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో పర్యటించేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనాయకులు హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతానికంటే ఈ సారి ఎన్నికలు విభిన్నంగా జరగనున్నాయి. అనేక మంది సీనియర్నేతలు పార్టీలు మారారు. దీంతో ఏ పార్టీకి కూడా గెలుపు అంత ఈజీ కాదనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో బీజేపీ తరఫున ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు అమిత్షాతో పాటు కేంద్ర మంత్రివర్గం మొత్తం రాష్ట్రంలో తిష్టవేసి ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లనున్నారు. యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డీకేశి, జేడీఎస్ తరఫున దేవెగౌడ, కుమారస్వామి కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వీరందరూ కూడా దాదాపు హెలికాప్టర్లు వాడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెట్టింపు సంఖ్యలో హెలికాప్టర్లు రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయని హెలిప్యాడ్ సంస్థ సంబంధిత అధికారి తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల అతిరథ మహారథులు దాదాపు 100 హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు అంచనా. రాష్ట్రంలో తగినన్ని హెలికాప్టర్లు లేనందున ముంబై, పుణే, పనాజి, హైదరాబాద్ తదితర ప్రముఖ నగరాల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి బాడుగకు తీసుకు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. భారీగా పెరిగిన హెలికాప్టర్ బాడుగ బెంగళూరు, మంగళూరు, హుబ్లీ, బెళగావి, మైసూరు తదితర ప్రాంతాల్లో హెలిప్యాడ్లో ప్రముఖులు హెలికాప్టర్లను ఉంచి చుట్టుపక్కల నియోజకవర్గాలకు కార్లలో వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లేటప్పుడు హెలికాప్టర్ను బయటకు తీస్తారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సంవత్సరం హెలికాప్టర్ బాడుగ కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. రెండు సీట్ల కెపాసిటీ ఉన్న హెలికాప్టర్ బాడుగ గంటకు రూ. లక్ష ఉండేది. ప్రస్తుతం రూ.2 లక్షలకు చేరింది. నాలుగు సీట్ల హెలికాప్టర్ బాడుగ రూ.2.5 లక్షలు, 8 సీట్ల హెలికాప్టర్ బాడుగ రూ.3.5 లక్షలు, 15 సీట్ల హెలికాప్టర్ బాడుగ రూ.5 లక్షల అద్దె వసూలు చేస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్లను ఉంచేందుకు 8 గంటలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బాడుగ తీసుకుంటారు. -
తిరుమలలో హెలికాప్టర్ల చక్కర్లు..
సాక్షి, తిరుపతి: తిరుమలలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. నో ఫ్లై జోన్ నుంచి మూడు హెలికాప్టర్లు వెళ్లాయి. అయితే ఇవి ఎయిర్ఫోర్స్కు చెందినవని సమాచారం. కడప నుంచి చెన్నై వెళ్లే సమయంలో తిరుమల మీది నుంచి ప్రయాణించినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని ఎయిర్ఫోర్స్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. మంగళవారం మధ్యాహ్నం ఈ హెలికాప్టర్లు కన్పించాయి. తిరుమల నో ఫ్లైయింగ్ జోన్ అనే విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో విమానాలు, హెలికాప్టర్లు ఎగరకూడదనే నిబంధన ఉంది. చదవండి: తిరుమలలో పాముల కలకలం -
భారత వైమానిక దళంలోకి మన ప్రచండ్ (ఫొటోలు)
-
గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు
-
‘10 టన్నుల’ హెలికాప్టర్లపై దృష్టి పెట్టాలి
కంటోన్మెంట్(హైదరాబాద్): దేశ రక్షణ, భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. హకీంపేట ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘చేతక్’హెలికాప్టర్ డైమండ్ జూబ్లీ కాన్క్లేవ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘చేతక్.. దేశానికి సేవలందించిన గొప్ప యుద్ధవిమానం. రాణాప్రతాప్ గుర్రాన్ని గుర్తు చేసుకునేలా ఈ హెలికాప్టర్కు ‘చేతక్’అనే నామకరణం చేశారు. ఇది ఎప్పటికప్పుడూ రూపాంతరం చెందుతూ నేటికీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. భారత్.. ఐదు టన్నుల సామర్థ్యం కలిగిన హెలికాప్టర్ల డిజైన్, డెవలప్మెంట్, ఆపరేషన్లతో సత్తా చాటింది. ఇక 10 టన్నుల సామర్థ్యం కలిగిన హెలికాప్టర్ల రూపకల్పనపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయంగా రక్షణ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ‘ఆత్మ నిర్భరత’ను సాధించాల్సిన అవసరం ఉంది. దేశీయ ఆయుధ సంపత్తి, సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ మేరకు రక్షణ దళాలు, శాస్త్రవేత్తలు, రక్షణ ఉత్పత్తిదారులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దేశీయ పరిశ్రమలకు సైతం డీఆర్డీఓ ద్వారా శాస్త్ర, సాంకేతిక సహకారం అందించనుంది. ఈ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం. భారత్ ఏనాడూ అధికారం, ఆక్రమణ, ఆధిపత్యం కోసం యుద్ధం చేయలేదు. ప్రజాస్వామ్యం, మానవత్వ పరిరక్షణ కోసమే యుద్ధం చేసింది. ఈ కాన్క్లేవ్ దేశ సేవలో అమరులైన వారికి ఘన నివాళి వంటింది’అని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సహా త్రివిధ దళాల హెలికాప్టర్ విభాగం ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్, హెచ్ఏఎల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న 'వింగ్స్ ఇండియా 2022' ఏవియేషన్ షో
-
సాగర తీరంలో కనువిందు చేస్తోన్న యుద్ధనౌకలు, హెలికాప్టర్లు
-
8వేల కోట్ల ఆయుధాల కొనుగోలుకు ఓకే
న్యూఢిల్లీ: దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, సైనిక సంబంధ ఆయుధాలు, పరికరాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఆయుధాల సమీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీలో జరిగిన రక్షణ ఆయుధాలు, ఉపకరణాల కొనుగోలు మండలి(డీఏసీ) సమావేశంలో ఆమోదం పొందాయని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సైన్యం అవసరాల కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 12 హెలికాప్టర్లను, నావికా దళం కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి లైనెక్స్ నావల్ గన్ఫైర్ నియంత్రణ వ్యవస్థను కొనుగోలుచేయనున్నారు. నావికాదళ గస్తీ విమానాలైన డార్నియర్ ఎయిర్క్రాప్ట్లను హిందుస్తాన్ ఏరోనాటిక్స్తో అప్గ్రేడ్ చేయించాలని డీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ‘‘స్వావలంభనతోనే ఆయుధాల సమీకరణలో ‘ఆత్మనిర్భర్’ సాధించే దిశగా ముందడుగు వేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగానే విదేశాల నుంచి నావికాదళ గన్స్ కొనుగోళ్లను అర్ధంతరంగా ఆపేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(భెల్) నుంచి అప్గ్రేడెడ్ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్(ఎస్ఆర్జీఎం)లను తెప్పించాలని సమావేశంలో నిర్ణయించారు’’ అని రక్షణశాఖ ప్రకటనలో పేర్కొంది. యుద్ధనౌక ముందుభాగంలో ఠీవీగా కనబడే ఎస్ఆర్జీఎంతో ఎదురుగా ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో చేధించవచ్చు. రూ.7,965 కోట్ల విలువైన ఆయుధసంపత్తి కొనుగోలు ప్రధానాంశంగా జరిగిన ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. త్రివిధ దళాల అత్యవసరాలు, నిర్వహణ, ఆధునీకరణ, నిధుల కేటాయింపుల అంశాలను సమావేశంలో చర్చించారు. సైన్యం అవసరాల కోసం సమకూర్చుకోనున్న ఆయుధాలు, ఉపకరణాల డిజైన్, ఆధునికీకరణ, తయారీ మొత్తం ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో కొనసాగాలని సమావేశంలో నిర్ణయించారు. ఇటీవల కాలంలో తూర్పు లద్దాఖ్లో చైనా సైనికులతో ఘర్షణల తర్వాత భారత సైన్యం కోసం అధునాతన ఆయుధాల సమీకరణ జరిగింది. -
అపాచీకి దీటుగా స్వదేశీ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్కు చెందిన అపాచీ హెలికాప్టర్లకు దీటుగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మధ్య తరహా మిలటరీ హెలికాప్టర్లను తయారు చేయడానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సన్నాహాలు చేస్తోంది. 2027 కల్లా ఈ సైనిక హెలికాప్టర్లను తయారు చేసి భారత అమ్ముల పొదిలో చేర్చడానికి క్షేత్రస్థాయిలో పని ప్రారంభించినట్టు హాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ వెల్లడించారు. రానున్న సంవత్సరాల్లో భారత్లోని త్రివిధ బలగాలకు అవసరమైన హెలికాప్టర్లను తామే రూపొందించడానికి కృషి చేస్తున్నట్టు ఆదివారం పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ హెలికాప్టర్ల డిజైన్ల రూపకల్పన ఇప్పటికే పూర్తయింది. ప్రభుత్వం అనుమతినిస్తే 500 యూనిట్లలో హెలికాప్టర్కు సంబంధించిన తొలి నమూనా పని 2023 నాటికి పూర్తయ్యేలా హాల్ లక్ష్యంగా నిర్ణయించింది. మి–17 స్థానంలో 10–12 టన్నుల కేటగిరీలో హెలికాప్ట్టర్ల తయారీపై హాల్ దృష్టి పెట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 500 హెలికాప్టర్ల తయారు చేయగలిగితే విదేశాల నుంచి రూ. 4 లక్షల కోట్లకు పైగా విలువైన దిగుమతుల్ని నిరోధించవచ్చునని మాధవన్ వెల్లడించారు. తేజస్ తర్వాత అతి పెద్ద ప్రాజెక్టు తేజస్ యుద్ధ విమానాల తయారీ తర్వాత హాల్ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు ఇదే. హెలికాప్టర్ల డిజైన్ల తయారీకి, నమూనా హెలికాప్టర్ తయారీకి రూ.9,600 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ‘‘ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ప్రాథమిక డిజైన్కు అనుమతి లభిస్తే 2027 నాటికి 500 హెలికాప్టర్లను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వాయుసేన, నేవీతో కూడా చర్చిస్తున్నాం. ఆర్మీ, వాయుసేనకు ఒక తరహా హెలికాప్టర్లు రూపొందిస్తే, నేవీ కోసం భిన్నమైన డిజైన్తో రూపొందించాల్సి ఉంటుంది. ఈ దిశగా నావికా, వైమానిక దళాధికారులతో చర్చలు కొనసాగిస్తున్నాం’అని మాధవన్ వెల్లడించారు. రెండు శక్తిమంతమైన ఇంజిన్లతో నడిచే ఈ హెలికాప్టర్ యుద్ధ నౌకలపై నుంచి కార్యకలాపాలు నడిపేలా బ్లేడ్ ఫోల్డింగ్ ఫీచర్తో రూపొందించనున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంటుందని మాధవన్ అంచనా. -
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
-
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: భారత వాయుసేన ఆధునీకరణ దిశగా పెద్ద ముందడుగు పడింది. వాయుసేన అమ్ములపొదిలోకి తాజాగా ఎనిమిది అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరాయి. అమెరికాలో తయారైన అపాచీ ఏహెచ్-64ఈ (ఐ) హెలికాప్టర్లు మంగళవారం భారత్ చేరాయి. పఠాన్కోట్ ఎయిర్బేస్లో వీటిని వాయుసేన స్వాధీనం చేసుకుంది. వాయుసేనకు చెందిన125 హెలికాప్టర్ యూనిట్ ’గ్లాడియేటర్స్’ ఈ అత్యాధునిక హెలికాప్టర్లు వినియోగించనున్నారు. వాయుసేన అమ్ములపొదిలోకి ఈ హెలికాప్టర్లు చేరిన సందర్భంగా వాటిని ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా, ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ పరిశీలించారు. అమెరికా నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్లను భారత్ దిగుమతి చేసుకొంది. వీటిని కొనుగోలు చేసేందుకు 2015లోనే భారత్ అమెరికా రక్షణ సంస్థ బోయింగ్తో 1.1 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2022నాటికి భారత వాయుసేనలోకి మొత్తం 22 అపాచీయుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరనున్నాయి. మొత్తం నాలుగు దశల్లో వీటిని బోయింగ్ భారత్కు అప్పగించనుంది. ప్రస్తుతం భారత వాయుసేన సోవియట్ నాటి ఎంఐ-25, ఎంఐ 35 హెలికాప్టర్లను వినియోగిస్తోంది. వీటి స్థానంలో అపాచీ హెలికాప్టర్లను వాయుసేన ఇకనుంచి వినియోగించనుంది. పాకిస్థాన్ సరిహద్దులకు కొద్ది దూరంలోనే ఉన్న పఠాన్ కోట్ ఎయిర్బేస్లో ఈ యుద్ధ హెలికాప్టర్లలోని నాలుగింటిని వాయుసేన మోహరించనుంది. -
మాల్యా హెలికాప్టర్లు అమ్మేసారు..
-
మాల్యా చాపర్స్ రూ.8 కోట్లకు పైననే పలికాయి
బెంగళూరు : బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా హెలికాప్టర్లను వేలం వేశారు. బెంగళూరులోని డెట్ రికవరీ ట్రైబ్యునల్(డీఆర్టీ-1) ఈ-ఆక్షన్ను నిర్వహించి, బిజినెస్ టైకూన్ మాల్యాకు చెందిన రెండు హెలికాప్టర్లను ఢిల్లీకి చెందిన చౌదరి ఏవియేషన్కు అమ్మేసింది. ‘మాల్యాకు చెందిన రెండు వ్యక్తిగత హెలికాప్లర్లను తమ కంపెనీ రూ.8.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఒక్కోటి రూ.4.37 కోట్లు’ అని చౌదరీ ఏవియేషన్ డైరెక్టర్ సత్యేంద్ర సెహ్రావత్ ప్రకటించారు. 17 బ్యాంకుల కన్సోర్టియం తరుఫున రికవరీ కోర్టు ఈ ఈ-ఆక్షన్ను నిర్వహించింది. 2007-2012 మధ్య తీసుకున్న రూ.9వేల కోట్లకు పైగా రుణాలను మాల్యా, ఆయనకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ చెల్లించకుండా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఆ అనంతరం 2016లో మాల్యా దేశం విడిచిపారిపోయారు. తాము కొనుగోలు చేసిన 5 సీటర్ ఎయిర్బస్ యూరోకాప్టర్ బీ155 చాపర్స్ 10 ఏళ్ల కాలం నాటివని, ఇవి మంచి డ్యూయల్ ఇంజిన్ను కలిగి ఉన్నాయని సత్యేంద్ర తెలిపారు. ప్రస్తుతం ఇవి ముంబైలోని జుహు ఎయిర్పోర్ట్లో పార్క్ చేసి ఉంచినట్టు పేర్కొన్నారు. ఈ ఈ-ఆక్షన్లో మొత్తం మూడు కంపెనీలే పాల్గొన్నాయి. 2008 మోడల్కు చెందిన ఒక్కో హెలికాప్టర్ కనీస బిడ్ ధరగా రూ.1.75 కోట్లను నిర్ణయించింది రికవరీ కోర్టు. ఈ చాపర్లను వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకోనున్నామని సత్యేంద్ర తెలిపారు. చౌదరి ఏవియేషన్ ప్రస్తుతం గ్రౌండ్ ఆపరేషన్లను నిర్వహించడమే కాకుండా.. దేశ రాజధాని పరిధిలోని ఆసుపత్రులకు ఎయిర్ అంబులెన్స్ సర్వీసులను అందజేస్తుంది. ఈ-ఆక్షన్ నిర్వహిస్తున్న విషయాన్ని రికవరీ కోర్టు అసలు మీడియాకు వెల్లడించలేదు. -
21 వేల కోట్లతో 111 హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: భారత నౌకాదళం కోసం రూ.21,000 కోట్లతో 111 యుటిలిటీ హెలికాప్టర్లు కొనాలన్న ప్రతిపాదనకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. మరో రూ.25,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకూ ఓకే చెప్పింది. ఢిల్లీలో జరిగిన రక్షణ పరికరాల కొనుగోలు మండలి(డీఏసీ) సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. శత్రు స్థావరాలపై దాడి, నిఘా, గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొనే 111 యుటిలిటీ హెలికాప్టర్లను రూ.21,000 కోట్లకుపైగా వ్యయంతో నేవీ కోసం కొనుగోలు చేయనున్నారు. వీటిని వ్యూహాత్మక భాగస్వామ్య విధానం కింద విదేశీ–స్వదేశీ సంస్థలు సంయుక్తంగా భారత్లోనే తయారుచేస్తాయి. సైన్యం కోసం రూ.3,364.78 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 150 అత్యాధునిక 155 ఎంఎం అర్టిలరీ గన్స్ కొనుగోలు ప్రతిపాదనకు డీఏసీ ఆమోదం తెలిపింది. సబ్ మెరైన్లపై దాడిచేయగల 24 నేవల్ మల్టీరోల్ హెలికాప్టర్ల కొనుగోలుకూ డీఏసీ పచ్చజెండా ఊపింది. 14 స్వల్పశ్రేణి క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించిన రక్షణశాఖ, వీటిలో 10 వ్యవస్థలు దేశీయంగా అభివృద్ధి చేసినవి అయ్యుండాలని షరతు పెట్టింది. గతేడాది మేలో తీసుకొచ్చిన వ్యూహాత్మక భాగస్వామ్య విధానం కింద విదేశీ ఆయుధ కంపెనీలతో జట్టుకట్టే భారత ప్రైవేటు కంపెనీలు.. యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, హెలికాప్టర్లు, సాయుధ వాహనాలను తయారుచేసేందుకు మాత్రమే వీలుంది. -
హెలికాప్టర్లతో అవుట్ ఫీల్డ్ను ఆరబెట్టారు
-
హెలికాప్టర్లతో అవుట్ ఫీల్డ్ రెడీ చేశారు...
లాహోర్: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఏ చిన్న కారణంతోనైనా మ్యాచ్ జరగపోతే ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ నాకౌట్ మ్యాచ్లంటే మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రధానంగా వర్షం వెలిసిన తర్వాత అవుట్ ఫీల్డ్ను సిద్ధం చేయడంలో క్రికెట్ బోర్డులో సరైన చర్యలు తీసుకోలేకపోతే విమర్శలు వర్షం కురుస్తోంది. ఇలా చేయాలంటే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా తమవద్ద ఉన్న వనరులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సద్వినియోగం చేసుకుని మ్యాచ్ సజావుగా జరిగేలా చేసిన ఘటన పీఎఎస్ఎల్ చోటు చేసుకుంది. అందుకు హెలీకాప్టర్లను సైతం ఉయోగించుకుని శభాష్ అనిపించింది. బుధవారం పెషావర్ జల్మీ-కరాచీ కింగ్స్ జట్ల మధ్య ఎలిమినేటర్-2 మ్యాచ్ జరిగింది. మ్యాచ్కు ముందు వర్షం పడటంతో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో సాధ్యమైనన్ని ఓవర్ల పాటు మ్యాచ్ను జరిపించాలని భావించిన పీసీబీ పెద్దలు ఉన్నపళంగా రెండు హెలికాప్టర్లను తెప్పించారు. వాటి సాయంతో అవుట్ ఫీల్డ్ను ఆరబెట్టారు. ఇది నాకౌట్ మ్యాచ్ కావడంతో హెలికాప్టర్లతో పిచ్ను సిద్ధం చేయడం ఒక్కటే మార్గమని తలచిన పీసీబీ.. ఆ మేరకు చర్యలు తీసుకుని సక్సెస్ అయ్యారు. ఆ క్రమంలోనే 16 ఓవర్ల పాటు మ్యాచ్ జరపడానికి అంపైర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో పెషావర్ జల్మీ 13 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరింది. -
చివరి ప్రయత్నం..
సాక్షి, చెన్నై : బంగాళాఖాతంపై అదృశ్యమైన ఏఎన్-32 విమానం కోసం చివరి ప్రయత్నంగా మళ్లీ గాలింపునకు శ్రీకారం చుట్టారు. మానవ రహిత అత్యాధునిక పరికరాలతో చెన్నైకు 160 నాటికన్ మైళ్ల దూరంలో ఈ గాలింపు జరుగుతోంది. పన్నెండు చోట్ల సముద్రంలో మూడున్నర కి.మీ. దూరం మేరకు సాగర్ నిధి సాయం తో ఈ చివరి పరిశోధన సాగించే పనిలో నిపుణులు నిమగ్నమయ్యారు. చెన్నై తాంబరం ఎయిర్ బేస్ నుంచి అండమాన్ బయలు దేరిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం జూలై 22న బంగాళాఖాతంపై అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంలో గల్లంతైనా, అందుకు తగ్గ ఆధారాలు, సమాచారాలు ఇంతవరకు లభించ లేదు. ఈ విమానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వారితో పాటుగా 29 మంది ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాల్లో మునిగారు. నెలన్నర రోజులుగా చెన్నైకు 150 నాటికన్ మైళ్ల దూరంలో 20 నౌకలు, 18 విమానాలు, హెలికాప్టర్ల ద్వారా తీవ్రగాలింపు సాగినా, చిన్న పాటి ఆధారం చిక్క లేదు. ఆపరేషన్ తలాష్ పేరుతో సాగిన ఈ గాలింపులో జాతీయ సముద్ర తీర పరిశోధనా విభాగానికి చెందిన సాగర్ నిధి, భారత భౌగోళిక పరిశోధనా సంస్థకు చెందిన సముద్ర రత్నాకర్ నౌకలను రంగంలోకి దించినా ఫలితం శూన్యం. ఈ పరిస్థితుల్లో ఇరవై రోజుల క్రితం ఈ ఆపరేషన్ను పక్కన పెట్టిన అధికారులు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐవోటీ)లో తదుపరి ప్రయత్నాలపై సమాలోచనలో పడ్డారు. భారత నౌకాదళం, వైమానిక దళంలతో పాటు ఎన్ఐవోటీ, తదితర విభాగాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొని తమకు చిక్కిన యాభై రకాల వస్తువులపై పరిశోధనలు సాగించడంతో పాటు తుది ప్రయత్నం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో ఆ విమానంలో ఉన్న 29 మంది ఇక బతికి ఉండే అవకాశం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా విమాన శకలాల కోసం గాలింపునకు సర్వం సిద్ధం చేశారు. అయితే, ఒక్క సాగర్ నిధిని మాత్రం రంగంలోకి దించారు. ఆదివారం ఈ నౌక చెన్నైకు 160 నాటికన్ మైళ్ల వద్ద చివరి ప్రయత్నంగా పరిశోధనల్లో మునిగింది. తమకు లభించిన వస్తువుల ఆధారంగా, పన్నెండు చోట్ల సముద్ర గర్భంలో గాలింపు చర్యలు చేపట్టారు. మానవ రహిత అత్యాధునిక పరికరాల్ని సముద్రగర్భంలో మూడున్నర కి.మీ దూరం పంపించి పరిశోధనల్ని ముమ్మరం చేసే పనిలో నిపుణులు ఉన్నారు. ఎంపిక చేసిన పన్నెండు చోట్ల గాలింపు ఇదే చివరి ప్రయత్నం అని, ఈ ప్రయత్నం ఫలించని పక్షంలో ఇక ఆపరేషన్ తలాష్కు శుభం కార్డు పడ్డట్టే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా ఈ గాలింపు గురించి ఓ అధికారి పేర్కొంటూ మానవ రహిత పరిశోధనా పరికరాల్ని సముద్రం గర్భంలోకి పంపించడం ద్వారా ఏదేని ఫలితాలు లభించేందుకు ఆస్కారం ఉందని, ఆ దిశగా చివరి ప్రయత్నం ఫలించాలన్నదే తమ ఆకాంక్షగా పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల క్రితమే ఈ గాలింపునకు శ్రీకారం చుట్టి ఉండాల్సి ఉందని, అయితే, వాతావరణం అధ్వానంగా ఉండడంతో వెనక్కు తగ్గామని వ్యాఖ్యానించారు. -
‘రక్షణ’ దుమారం!
అధికారంలో ఉండగా వరస కుంభకోణాలతో వెలవెలబోయి సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ను స్కాంలు ఇప్పట్లో వదిలేలా లేవు. అధికార పీఠం దిగి రెండేళ్లవుతుండగా అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ, ఆమె సహాయకుడు అహ్మద్ పటేల్ తదితరుల పాత్రపై కొత్తగా ఆరోపణలు ముసురుకున్నాయి. సాధారణంగా ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో కెక్కే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పెద్దల సభలో అడుగుపెట్టిన మరుసటిరోజే ఈ స్కాంలో సోనియా పేరును ప్రస్తావించారు. ఉత్తరాఖండ్లో విధించిన రాష్ట్రపతి పాలనపై ఎన్డీఏ సర్కారును ఇరకాటంలో పెడుతున్న కాంగ్రెస్కు ఇది ఊహించని షాక్. పార్టీలో ‘75 ఏళ్లకు రిటైర్మెంట్’ విధానాన్ని అమలుచేస్తూ సీనియర్లను పక్కనబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ 76 ఏళ్ల వయసున్న స్వామికి రాజ్యసభ అవకాశం ఎందుకిచ్చారో ఇప్పుడందరికీ అర్ధమై ఉంటుంది. వాస్తవానికి ఇదేమీ కొత్తగా బయటపడిన స్కాం కాదు. 2010లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్లాండ్తో ఏడబ్ల్యూ-101 హెలికాప్టర్లు డజను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కుదరడం కోసం మధ్యవర్తులకు ముడుపులు చెల్లించారన్న ఆరోపణలు ఏడాది వ్యవధిలోనే ఇటలీలో వెల్లువెత్తాయి. రూ. 3, 546 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో మొత్తంగా రూ.360 కోట్లు చేతులు మారాయని వాటి సారాంశం. అమెరికా హెలికాప్టర్ల తయారీ సంస్థ సిరోస్కీ ఉత్పత్తి చేస్తున్న ఎస్-92 సూపర్హాక్ను అధిగమించి అగస్టావెస్ట్లాండ్ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. రక్షణ కొనుగోళ్లు అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఏది కొన్నా టెండర్లు పిలవడం తప్పనిసరి. అందులో ఏ సంస్థను ఎంపిక చేసినా మరో సంస్థ లొసుగులు వెదకడం షరా మామూలు. కాంట్రాక్టు చేజిక్కించుకున్న సంస్థపై నిఘా మొదల వుతుంది. అంతా సవ్యంగా ఉన్న పక్షంలో కాంట్రాక్టు పొందిన సంస్థను ఎవరూ దెబ్బతీయలేరు. ఎక్కువ సందర్భాల్లో అందుకు భిన్నంగా జరుగుతుంది గనుకే వివాదాలు ముసురుకుంటాయి. బోఫోర్స్ మొదలుకొని దాదాపు అన్నిటా ఇదే తంతు. దళారుల ప్రమేయాన్ని అంగీకరించబోమని మన ప్రభుత్వాలు పైకి చెప్ప డమే తప్ప సొమ్ములు చేతులు మారుతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తాయి. రక్షణ ఉత్పత్తుల సంస్థలు నాసిరకం పరికరాలు, ఉత్పత్తులు అంటగట్టే ప్రమాదం ఉండటమే ఇందులోని ప్రధాన సమస్య. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్ల వ్యవహారాన్ని గమనిస్తే ఇది అర్ధమవుతుంది. మన వైమానిక దళం ఐఏఎఫ్ వినియోగిస్తున్న సోవియెట్ తయారీ ఎంఐ-8 హెలికాప్టర్లకు కాలం చెల్లిందని, వాటి స్థానంలో మరింత సామర్థ్యంగల హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉండగా 1999లో నిర్ణయించారు. ఆ హెలికాప్టర్ల సామర్థ్యం, ప్రమాణాలు ఎలా ఉండాలో నిర్ణయించడానికి మరో నాలుగేళ్లుపట్టింది. అవి గరిష్టంగా 6,000 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలిగి ఉండాలని, రాత్రిపూట ప్రయాణానికి అనువుగా ఉండాలని, ఏ వాతావరణాన్నయినా తట్టుకునేలా ఉండాలని నిర్దేశించారు. 2005లో మొదటిసారి టెండర్ పిల్చినప్పుడున్న ఈ నిబంధనలు ఏడాది వ్యవధిలోనే మారాయి. అగస్టా వెస్ట్లాండ్కు అర్హత సాధించి పెట్టేందుకే ఈ మార్పులు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ముందనుకున్న ప్రమాణాలను ఎందుకు తగ్గించాల్సివచ్చిందో, ఆ మార్పులు చేసిందెవరో...వారినలా చేయమన్నదెవరో గుర్తిస్తే దర్యాప్తులో చాలా భాగం పూర్తయినట్టే. కానీ 2013లో యూపీఏ సర్కారు దర్యాప్తునకు ఆదేశించినా ఈ విషయంలో సీబీఐ రాబట్టిందేమీ లేదు. అటు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ దర్యాప్తు పరిస్థితీ ఇంతే. ఎన్డీఏ సర్కారు వచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇటలీ ఈ విషయంలో చాలా మెరుగు. ఈ ఒప్పందంలో అయిదు కోట్ల యూరోలు ముడుపులు తీసుకున్నాడన్న ఆరోపణపై దళారి రాల్ఫ్ హష్కేను స్విట్జర్లాండ్లో 2012లోనే అరెస్టు చేశారు. మరి కొన్నాళ్లకే అగస్టా వెస్ట్లాండ్ మాతృ సంస్థ ఫిన్మెకానికా చైర్మన్ ఓర్సీ, సీఈఓ స్పాగ్నోలినీలు సైతం కటకటాల వెనక్కు వెళ్లారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన ఇటలీ పోలీసు విభాగం హష్కే, మరో ముగ్గురి మధ్య చోటుచేసుకున్న సంభాషణలను సైతం రికార్డు చేయగలిగింది. హెలికాప్టర్ల ఒప్పందం సాకారం కావడం కోసం చెల్లించిన ముడుపుల్ని మారిషస్, ట్యునీషియాల్లోని సంస్థల ద్వారా చేర్చామన్నది ఈ సంభాషణల సారాంశం. అంతేకాదు...భారత్లో దర్యాప్తు చేసే ‘మూర్ఖులు’ ఏళ్ల తరబడి శ్రమించినా వీటిని ఛేదించలేరని వారు జోకులేసు కున్నారు. కనీసం అలా అన్నందుకైనా సీబీఐ గట్టిగా పనిచేసి ఉండాల్సింది. కానీ జరిగిందేమీ లేదు. 2014 అక్టోబర్లో ఇటలీలోని కింది కోర్టు ఓర్సీ, స్పాగ్నోలినీలపై అవినీతి ఆరోపణలు కొట్టేసింది. అయితే ఇన్వాయిస్లు సరిగా లేవన్న ఆరోపణను అంగీకరిస్తూ స్వల్ప శిక్షతో సరిపెట్టింది. ఇటీవలే ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చి ముడుపులు చేతులు మారాయని నిర్ధారించింది. నిందితులకు శిక్షలు ఖరారు చేసింది. అంతేకాదు అప్పట్లో ఐఏఎఫ్ చీఫ్గా ఉన్న త్యాగికి ఆయన బంధువుల ద్వారా అవి అందాయని తేల్చింది. ఫలితంగానే ప్రస్తుత వివాదం రాజుకుంది. విపక్షంలో ఉన్నవారు ఆరోపణలు చేయడం సర్వసాధారణం. అధికార పక్షం కూడా ఆ పనే చేయడం సబబనిపించుకోదు. ఉన్న అధికారాన్ని వినియోగించుకుని వచ్చిన ఆరోపణలోని వాస్తవాలేమిటో తేల్చడం ముఖ్యం. గత రెండేళ్లుగా సీబీఐ ఈ విషయంలో ఎందుకు ప్రగతి సాధించలేకపోయిందో ఆరా తీసి లోటుపాట్లను సరిదిద్దడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. ఈ కుంభకోణం సూత్రధారులు, పాత్ర ధారులు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్టడం అవసరం. దీన్ని రాజకీయ కోణంలోనే చూడటంవల్లా, వాగ్యుద్ధాలకు దిగడంవల్లా దేశానికి ఒరిగేదేమీ ఉండదు. ఇరు పక్షాలూ ఈ సంగతి గ్రహించాలి. -
హెలికాప్టర్ల అవినీతికి మధ్యవర్తి ఈయనే
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల డీల్లో అవినీతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వెస్ట్ ల్యాండ్తో డీల్ వ్యవహారం అనంతరం భారతీయ మీడియాతో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అగస్టా వెస్ట్ ల్యాండ్ మధ్యవర్తికి ఆరు మిలియన్ పౌండ్లను ఇచ్చినట్లు తెలిసింది. 2010-2012 మధ్య కాలంలో హెలికాప్టర్ల కొనుగోలు గురించి ఎటువంటి దుష్ర్ఫచారం లేకుండా చేయడానికి అగస్టా కంపెనీ క్రిష్టియన్ మైఖేల్ అనే వ్యక్తి డబ్బును సమకూర్చింది. మొత్తం 3,546 వేల కోట్ల రూపాయల ఈ డీల్లో 12 అగస్టా వెస్ట్ల్యాండ్ 101 హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్ఫోర్స్కు అందించేందుకు 2010లో ఒప్పందం జరిగింది. స్కామ్తో సంబంధం ఉన్న మైఖేల్ను పట్టుకోవడానికి ఈడీ ఇంటర్పోల్కు ఫిబ్రవరి 4న లేఖను రాసింది. ప్రస్తుతం మైఖేల్ దుబాయ్లో ఉన్నట్లు కనుగొన్న ఈడీ, సీబీఐలు అతని మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించాయి. 2013లో బయటపడిన ఈ స్కామ్లో దేశ కీలక రాజకీయ నేతలతో పాటు మిలటరీ అధికారులు అగస్టా వెస్ట్ ల్యాండ్కి 610మిలియన్ డాలర్లకు బిడ్ దక్కేలా చేసేందుకు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మైఖేల్పై కుట్ర, మోసం, అవినీతికి మధ్యవర్తిత్వం నిర్వర్తించడం తదితర చట్టాలపై కేసులు నమోదు చేశారు. -
హెలికాప్టర్ల కోసం ఇక హెలిపోర్ట్స్
♦ ప్రారంభంలో నాలుగు హెలిపోర్ట్ల నిర్మాణం ♦ పదేళ్లలో కొత్త హెలికాప్టర్లకు 50 వేల కోట్లు కావాలి ♦ పవన్ హన్స్ సీఎండీ బి.పి. శర్మ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేగంగా విస్తరిస్తున్న హెలికాప్టర్ల పరిశ్రమ కోసం ప్రత్యేక హెలిపాడ్స్ ఉండేలా హెలిపోర్ట్స్ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వరంగ సంస్థ పవన్ హన్స్ తెలియజేసింది. ఇందులో భాగంగా ఢిల్లీ, గౌహతి, ముంబైలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక చోట ఈ హెలీపోర్ట్ను ఏర్పాటు చేయనున్నట్లు పవన్ హన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ బి. పి. శర్మ తెలిపారు. ఒక హెలిపోర్ట్ నిర్మాణానికి రూ. 400 కోట్లు వ్యయం అవుతుందని, జూన్ నాటికి ఢిల్లీ హెలిపోర్ట్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలియజేశారు. ప్రస్తుత విమానాశ్రయాల్లో అత్యవసర సమయాల్లో హెలికాప్టర్లు ఎగరడానికి చాలాసేపు ఎదురు చూడాల్సి వస్తోందని, ఇందుకోసం ప్రత్యేకంగా ప్రలి జిల్లాలో ఒక హెలీ హబ్ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమని చెప్పారాయన. హెలీ టూరిజం, అత్యవసర సేవలు, హెలీ అంబులెన్స్లకు మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో 270 హెలికాప్టర్లు ఉండగా పదేళ్లలో వీటి సంఖ్య 1,000 దాటుతుందని, ఇందుకోసం రూ. 50,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. ‘‘ప్రస్తుతం మా దగ్గర 43 హెలికాప్టర్లు ఉన్నాయి. 2025 నాటికి ఈ సంఖ్య 100కి చేరుతుంది. ఇందుకోసం రూ. 5,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నాం’’ అని వివరించారాయన. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నక్సల్స్ సమస్యతోపాటు హెలీ టూరిజంకు ఉన్న అవకాశాలపై రెండు రాష్ట్రాలతో శుక్రవారం చర్చలు జరపనున్నట్లు తెలిపారు. ఎయిర్బస్తో కలిపి ముంబైలో ఎంఆర్వో యూనిట్ ఏర్పాటు చేయడానికి ఇరు సంస్థలు ఇంచుమించు అంగీకారానికి వచ్చాయని, త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన చేస్తామని శర్మ చెప్పారు. -
ఇక హైదరాబాద్లో అపాచీ హెలికాప్టర్ల తయారీ
ఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ విమాన రంగ సంస్థ బోయింగ్, భారతీయ సంస్థ టాటాతో కలిసి జాయింట్ వెంచర్ను ప్రారంభించబోతున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రక్షణ, విమానయాన రంగంలో వాడే AH-64 రకానికి చెందిన అపాచి హెలికాఫ్టర్లను తయారు చేయనున్నారు. అది కూడా హైదరాబాద్లో తయారు చేస్తారట. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ట్విట్టర్ ద్వారా కూడా తెలిపారు. విమానయాన రంగంలో భవిష్యత్తులో టాటాతో కలిసి మరిన్ని ప్రాజెక్టులు చేపట్టే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు బోయింగ్ ప్రకటించింది. ఎయిర్ క్రాఫ్ట్ల విభాగంలో కొత్త తరహాకు చెందిన అపాచీతో పాటు చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాఫ్టర్లను బోయింగ్ నుంచి కొనుగోలు చేయాలని భారత్ ఇటీవల నిర్ణయించింది. టాటాతో హెలికాఫ్టర్ ల తయారీ ఒప్పందం ద్వారా ఇండియాకు పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధికి అనుకూలంగా ఉంటుందని బోయింగ్ ఇండియా చైర్మన్ ప్రత్యూష్ కుమార్ అన్నారు. టాటాతో చేపడుతున్న ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఈ ఒప్పందం పెద్ద వార్త అని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా అపాచీ హెలికాఫ్టర్లు హైదరాబాద్లో తయారుకానున్నాయని ఆయన వెల్లడించారు. Another big news for Telangana. Boeing & Tata Advanced System JV to manufacture Apache helicopters soon from Hyderabad #HappeningHyderabad — K Taraka Rama Rao (@KTRTRS) November 9, 2015 -
హెలికాప్టర్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ
న్యూఢిల్లీ: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా తలెత్తే ట్రాఫిక్ సమస్యలను నివృత్తి చేసేందుకు ఢిల్లీ పోలీసులు సరికొత్త ఐడియాను అమలుచేశారు. ఫలితం సంగతి ఎలా ఉన్నప్పటికీ శుక్రవారం నాటి దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి హెలికాప్టర్ల సహాయం తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు హెలికాప్టర్లను వినియోగించడం దేశరాజధానిలో ఇదే ప్రథమం. 'యమునా నదికి దారితీస్తూ సాగే నిమజ్జనయాత్రను.. ఆకాశమార్గం నుంచి పరిశీలిస్తూ, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో, దానిని ఎలా కంట్రోల్ చేయాలో నిరంతరం కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతూ ఉంటుంది. ఆ సమాచారాన్ని వైర్ లెస్ సెట్ల ద్వారా రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి తెలియజేస్తారు. దీంతో ట్రాఫిక్ సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు' అని ఢిల్లీ స్పెషల్ కమిషనర్ (ట్రాఫిక్) ముక్తేశ్ చందర్ చెప్పారు. నిమజ్జన మహోత్సవరం నాడు కేవలం రోడ్లపై ఉండి ట్రాఫిక్ ను నియంత్రించడం కష్టసాధ్యమని, అందుకే ఈ ఏర్పాటని, ఇందుకోసం 'పవన్ హన్స్' అనే సంస్థకు చెందిన హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. -
రాజమండ్రికి రెండు ప్రత్యేక హెలికాప్టర్లు
విమానాశ్రయం (గన్నవరం): గోదావరి పుష్కరాల కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, యాత్రికుల సౌకర్యార్థం కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి రాజమండ్రికి రెండు ప్రత్యేక హెలికాప్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్పోర్టు డెరైక్టర్ ఎం.రాజ్కిషోర్ తెలిపారు. సోమవారం ఆయన 'సాక్షి'తో మాట్లాడుతూ.. పుష్కరాలకు దేశ విదేశాల నుంచి సుమారు మూడు కోట్ల మంది వరకు యాత్రికులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు. దీనివల్ల రోడ్డు మార్గంలో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవడంతో పాటు రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాత్రికులను త్వరితగతిన పుష్కర ఘాట్లకు తీసుకువెళ్లడంతో పాటు వారిని తిరిగి తీసుకు వచ్చేందుకు ప్రత్యేక హెలికాప్టర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దీని కోసం పవన్ హాన్స్ లిమిటెడ్ సంస్థ 10 సీటింగ్, 6 సీటింగ్ కెపాసిటీ కలిగిన రెండు హెలికాప్టర్లను గోదావరి పుష్కర ప్రయాణికుల కోసం కేటాయించిందని రాజ్ కిషోర్ తెలిపారు. -
మత్స్యకారుల కోసం హెలికాప్టర్లతో అన్వేషణ
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్బాబు అన్నారు. శనివారం కాకినాడ బీచ్ రోడ్డులో బాధిత మత్స్యకార కుటుంబాలను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గల్లంతైన వారి కోసం రిలయన్స్ హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నామని, సముద్రంలో వారు ఎక్కడ చిక్కుకున్నా గుర్తించి కాపాడతామన్నారు. కాకినాడ దుమ్ములపేటకు చెందిన బోటులో ఆరుగురు మత్స్యకారులు ఈ నెల 17న సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. కాగా దుమ్ములపేట, పర్లోపేటకు చెందిన మరో 20 బోట్ల సమాచారం కూడా తెలియరావడం లేదని మత్స్యకారులు పేర్కొంటున్న నేపథ్యంలో... కోస్ట్గార్డ్, రిలయన్స్ హెలికాప్టర్ల ఆధ్వర్యంలో వారి కోసం శనివారం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
పోటాపోటీగా ఇద్దరు సీఎంల హెలికాప్టర్లు!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ అభివృద్ధిలో పోటీ పడటం మాట అటుంచి.. తమకు తాము సౌకర్యాలు కల్పించుకోవడంలో మాత్రం ముందంజలో ఉంటున్నారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన కోసం ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందుకు పోటీగా అన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక హెలికాప్టర్ కొనుగోలు చేయాలని తాజాగా నిర్ణయించింది. ముఖ్యమంత్రులు పర్యటనలు చేయడానికి, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి ప్రతి రాష్ట్రానికి హెలికాప్టర్ ఉంటుంది. అలాగే ఇంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా హెలికాప్టర్ ఉంది. దాన్ని ఏం చేయాలన్న విషయాన్ని మాత్రం పక్కన పెట్టి, ఇప్పుడు మళ్లీ ఇద్దరూ తలో హెలికాప్టర్ కొనాలని భావిస్తున్నారు. -
రైల్వే ఎమర్జెన్సీకి హెలికాప్టర్లు
సాక్షి, ముంబై: రైలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు హెలికాప్టర్లు అందుబాటులో ఉంచాలని రైల్వే పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. అందుకు నగరంలోని ప్రముఖ లోకల్ రైల్వేస్టేషన్ల సమీపంలో హెలిపాడ్లు నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అధికారులు 14 లోకల్ రైల్వే స్టేషన్ల సమీపంలో స్థలాలను ఎంపిక చేశారు. అధ్యయనం పనులు పూర్తికాగానే హెలిపాడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. రైలు ప్రమాదంలో అవయవాలు పొగొట్టుకున్న ప్రయాణికులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తే ప్రాణ నష్టం జరగదని రైల్వే భావించింది. దీంతో ఈ బృహత్తర నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. నగరం, శివారు ప్రాంతాల్లో ప్రతీరోజు పట్టాలు దాటుతూ, అదుపుతప్పి కిందపడిపోవడం, ప్లాట్ఫారం-రైలు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో నుంచి కిందపడిపోవడం ఇలా సరాసరి 15-20 ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో సరాసరి ఎనిమిది మంది చనిపోతున్నారు. మిగతావారు తీవ్రంగా గాయపడడమో లేదా అవయవాలు కోల్పోవడమో జరుగుతోంది. ఇలా గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించాలంటే అంబులెన్స్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇవి ఎక్కడో పార్కింగ్ చేసి ఉంటాయి. అక్కడి నుంచి స్టేషన్ వరకు రావాలి. ఆ తర్వాత బాధితుడిని ఆస్పత్రికి తరలించాలి. కాని నగరంలో ఎప్పుడు, ఏ రహదారిపై చూసినా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో అత్యవసర వాహనాలు కూడా ముందుకు కదలలేని పరిస్థితి ఉంటోంది. ఫలితంగా కొనఊపిరితో ఉన్న వారు ప్రాణాలు వదిలే పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అన్ని రైల్వే స్టేషన్ల ఆవరణలలో హెలిపాడ్లు నిర్మించాలని రైల్వే శాఖ యోచించింది. కాని అన్ని స్టేషన్ల వద్ద అనుకూలమైన స్థలం అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం 14 కీలకమైన స్టేషన్ల సమీపంలో ఈ హెలిపాడ్లు ఏర్పాటు చేయాలని రైల్వే పరిపాలన విభాగం నిర్ణయించింది. ఎక్కడైనా ప్రమాదం జరిగినట్లు తెలియగానే అక్కడికి సమీపంలో ఉన్న హెలిపాడ్లో ఈ హెలికాప్టర్లు ల్యాండ్ అవుతాయి. అక్కడి నుంచి నేరుగా సమీప ఆస్పత్రికి బాధితులను చేరవేస్తాయి. ఇదిలా ఉండగా, హెలిపాడ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సమకూర్చి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. కాని పట్టించుకోకపోవడంతో స్వయంగా రైల్వే పరిపాలన విభాగం చొరవ తీసుకుంది. హెలిపాడ్ల నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాలివే... ఆజాద్మైదాన్, మాటుంగా జింఖానా, కుర్లా రైల్వే కాలనీ గ్రౌండ్, ఠాణేలోని దాదోజీ కొండ్దేవ్ స్టేడియం, కల్యాణ్ రైల్వే స్కూల్, అంబర్నాథ్ ఎంఐడీసీ, బద్లాపూర్ ఆదర్శ్ విద్యామందిర్ గ్రౌండ్, భీవ్పూరి రోడ్లోని నందకుమార్ ఇన్స్టిట్యూట్, టిట్వాలాలోని గణేశ్ మందిరం, లోనావాలా హెలిపాడ్, జగత్పురి రైల్వే గ్రౌండ్, పన్వేల్ హెలిపాడ్, వసయిరోడ్లోని వైఎంసీఏ గ్రౌండ్. -
హెలికాప్టర్లు వద్దు
శివసేన ప్రతిపాదనలు పక్కకు పెట్టిన బీఎమ్సీ వాటితో ప్రమాదం తీవ్రమవుతుందన్న పరిపాలనా విభాగం సాక్షి, ముంబై: నగర అగ్నిమాపక శాఖ కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లు కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను నగర పాలక సంస్థ(బీఎమ్సీ) తిరస్కరించింది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు హెలికాప్టర్లను వినియోగించడంవల్ల మంటలు మరింత తీవ్రమవుతాయనే సాకుతో బీఎమ్సీ పరిపాలనా విభాగం వాటి కొనుగోలు ప్రతిపాదనను పక్కన బెట్టినట్టు తెలుస్తోంది. ఒక్కప్పుడు నగరం, శివారు ప్రాంతాల్లో 10-15 అంతస్తులకే పరిమితమైన భవనాలు నేడు అందనంత ఎత్తులో నిర్మిస్తున్నారు. దీనికితోడు నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోవడంతో ప్రమాదస్థలికి వెంటనే ఫైరింజన్లు చేరుకోవడం కష్టమవుతోంది. దీంతో అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతుంది. ఈ నష్టాన్ని నివారించేందుకు ముంబై అగ్నిమాపక శాఖకు హెలికాప్టర్లు కొనుగోలు చేసి ఇవ్వాలని శివసేనకు చెందిన యామిని జాధవ్ ప్రతిపాదించారు. కాని బీఎమ్సీ పరిపాలనా విభాగం దీన్ని తిరస్కరించింది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ పరిధిలో ఫైరింజన్ల వాహనాలపై 22 అంతస్తుల ఎత్తుకు సరిపడే నిచ్చెనలు ఉన్నాయి. భాయ్కళలోని అగ్నిమాపకశాఖ ప్రధాన కార్యాలయంలో సుమారు 28 అంతస్తులకు సరిపడే ఫైరింజన్ ఒకేఒకటి ఉంది. ఈ భారీ వాహనం ఇక్కడి నుంచి ట్రాఫిక్ జామ్లో సంఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాగా నగరంలో మూతపడిన మిల్లుల స్థలాల్లో ఎక్కడ చూసినా టవర్లు, ఆకాశహర్మ్యాలు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేయాలంటే అగ్నిమాపక జవాన్లకు తలప్రాణం తోకకు వస్తోంది. ఇప్పటికే నగర విస్తరణ, పెరిగిన జనాభాతో పోలిస్తే అగ్నిమాపక కేంద్రాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో కేవలం 33 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. వీటి సంఖ్య రెట్టింపు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కాని అది కార్యరూపం దాల్చలేకపోయింది. దీంతో హెలికాప్టర్ల ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అయితే అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పివేసేందుకు వెళ్లిన హెలికాప్టర్ రెక్కల నుంచి వచ్చే వేగమైన గాలివల్ల మంటలు విస్తరించడంతోపాటు మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. అంతేగాక హెలికాప్టర్ నీటిని నిల్వ చేసుకుని గాలిలో ఎగురుతుండగా మంటలపై పిచికారి చేయడం సాధ్యమయ్యే పని కాదు. అంతేగాక వాటి నిర్వహణ, మెకానిక్లు, హెలిప్యాడ్లు అందుబాటులో ఉంచడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా విభాగం ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. -
నిఘా నేత్రం
ఆదిలాబాద్ క్రైం, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికలను జిల్లా పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. జిల్లాలో బుధవారం నిర్వహించనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. పోలింగ్కు జిల్లా వ్యాప్తంగా 9800 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే అవకాశమున్న అరాచక శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లాకు 15 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. వీరితోపాటు హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న 18 మంది ఐపీఎస్ అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. గగనతలం నుంచి నిఘా... సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గగనతలం నుంచి రెండు హెలికాప్టర్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన హెలికాప్టర్లను ఎస్పీ గజరావు భూపాల్ పరి శీలించారు. హెలికాప్టర్ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద యం నుంచి సాయంత్రం వరకు గస్తీ నిర్వహించనున్నారు. మావోయిస్టుల నుంచి ముప్పును పసిగట్టేందుకు వీటిని వినియోగిస్తున్నారు. సరిహద్దుప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచామని, సమాచార వ్యవస్థతోపాటు స్పెషల్ బ్రాం చ్ పోలీసులు అనుక్షణం సమాచారం సేకరిస్తున్నారని ఎస్పీ భూపాల్ తెలిపారు. ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా ప్రతిచర్యలకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పోలీసు బందబోస్తు.. జిల్లావ్యాప్తంగా మొత్తం 2318 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందులో 185 కేంద్రాలు అతిసమస్యాత్మకం, 340 కేంద్రాలు సమస్యాత్మకం, 79 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. పోలింగ్ రోజున నలుగురు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 180 మంది ఎస్సైలు, 400 మంది ఏఎస్సైలు, 1800 మంది హెడ్కానిస్టేబుళ్లు, 3000 వేల మంది కానిస్టేబుళ్లు, 500 మంది మహిళా పోలీసులు, 800 మంది హోంగార్డులతోపాటు ప్రత్యేకంగా కర్నూల్ జిల్లా నుంచి వచ్చిన 2500 మంది పోలీసులు పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ రోజున అలజడి సృష్టించే అనుమానాస్పద వ్యక్తులున్నా కేంద్రాలుగా 47 కేంద్రాలను గుర్తించారు. -
నక్సల్స్ ప్రాంతాల్లో హెలికాప్టర్లు
గాయపడిన పోలీసులను వైద్యానికి తరలించేందుకే ఈసీ ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసుల కోసం హెలికాప్టర్లు ఏర్పాటు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. నక్సల్స్ దాడుల్లో ఎవరైనా గాయపడితే, వారిని తక్షణమే ఆస్పత్రులకు తరలించేందుకు వాటిని వినియోగించనుంది. క్షతగాత్రులను తీసుకెళ్లడానికి అంబులెన్సులైతే జాప్యం జరుగుతుందని, అందుకే ఎయిర్ అంబులెన్సులు (హెలికాప్టర్లు) ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు తొలుత తెలంగాణ ప్రాంతంలో జరిగే ఎన్నికలకు హెలికాప్టర్లు ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత సీమాంధ్రకి తరలించాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టారు. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, సీమాంధ్రలో తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. ఏదై నా హింస చోటుచేసుకుని పోలీ సులు గాయపడితే వారిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తీసుకొచ్చేందుకు శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. వైద్య సేవల కోసం సీమాంధ్రలోని రాయల్ ఆస్పత్రి, జీఎస్ఎల్ వైద్య కాలేజీ(రాజమండ్రి), సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, రాఘవ ఎమర్జెన్సీ ఆస్పత్రి(కాకినాడ)ని గుర్తించినట్టు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే, తెలంగాణలో ఆస్పత్రులను గుర్తించాల్సి ఉందన్నారు. -
'జెట్' స్పీడ్
-
నేతల విషయంలో జాగ్రత్త!
పైలట్లు, విమానయాన సంస్థలకు డీజీసీఏ మార్గదర్శకాలు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు, నేతలు విమానాలు, హెలికాప్టర్లను వినియోగిస్తున్నందున పౌర విమానయాన నియంత్రణ విభాగం(డీజీసీఏ) పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వీఐపీలు వినియోగించే వి మానాలు లేదా హెలికాప్టర్లలో అనధీకృత డబ్బుకానీ, ఆయుధాలు, మత్తుపదార్థాలు కానీ రవాణా చేయడం లేదంటూ పైలట్లు, కేబిన్ సిబ్బంది హామీ ఇవ్వాలని పేర్కొంది. అద్దెకిస్తున్న విమానం ప్రయాణానికి వీలుగా పూర్తి సామర్థ్యంతో ఉందని, అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఆపరేటర్లు తెలియజేయాలని ఆదేశించింది. వీఐపీల ప్రయాణం విషయంలో భద్రతాపరమైన మార్గదర్శకాలను పాటించకుంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రయాణికుల వివరాలను కూడా వారం ముందే తెలియజేయాలని కోరింది. కేవలం జీపీఎస్పైనే ఆధారపడకుండా స్థానిక మ్యాపులను వెంట ఉంచుకోవాలని సూచిస్తూ డీజీసీఏ తాజా ఆదేశాలు జారీ చేసింది. వీటి కాపీలను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపినట్లు డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన వ్యక్తిగత రవాణా విమానాన్ని ఇటీవలే ఢిల్లీ విమానాశ్రయంలో తనిఖీలు చేసిన సందర్భంగా, రక్షణ పరికరాలు గడువు తీరిపోవడం, పైలట్ లెసైన్స్ లేకుండా విమానాన్ని నడుపుతూ ఉండడాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన వారానికే డీజీసీఏ తాజా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
వాంటెడ్.. హెలికాప్టర్లు
అడ్వాన్స్ బుకింగ్ పూర్తి కిరణ్, చంద్రబాబుకు దొరకని వైనం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ ప్రైవేట్ హెలికాప్టర్లు, విమానాలకు గిరాకీ పెరిగింది. జాతీయ పార్టీలతో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ప్రచారానికి వెళ్లటానికి హెలికాప్టర్లను ముందుగానే బుక్ చేసుకున్నారు. ప్రైవేటు ఆపరేటర్లు నడిపించే అన్ని హెలికాప్టర్లనూ ఇప్పటికే చాలా మంది నేతలు బుక్ చేసేసుకోవటంతో.. కాస్త ఆలస్యంగా స్పందిస్తున్న నేతలకు ఇప్పుడు హెలికాప్టర్లు దొరికే పరిస్థితి లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ హెలికాప్టర్లు, విమానాలను ప్రధానమంత్రిగాని, ముఖ్యమంత్రులు గానీ వినియోగించరాదు. దీంతో జాతీయ పార్టీల నేతలు, ప్రాంతీయ పార్టీల నేతలు ప్రైవేట్ హెలికాప్టర్లను వినియోగించక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే జీఎంఆర్ సంస్థ దేశంలోని రెండు జాతీయ పార్టీలను సంతృప్తి పరిచేలా వ్యవహరించింది. కాంగ్రెస్, బీజేపీలతో పాటు జయలలిత, కరుణానిధి, నవీన్జిందాల్, శరద్పవార్లు ప్రైవేట్ హెలికాప్టర్లు, విమానాలను ముందుచూపుతో జనవరి నెలలోనే అడ్వాన్స్ బుకింగ్లు చేసుకున్నారు. వినియోగించినా వినియోగించకపోయినా అలా బుక్ చేసుకున్న కాప్టర్లకు రోజుకు కనీసం నాలుగు గంటలు ఫ్లైయింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గంటకు మూడు లక్షల చొప్పున చార్జీలతో మార్చి నుంచి వినియోగించుకునేలా ఆయా పార్టీలు, నేతలు ప్రైవేట్ హెలికాప్టర్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. కిరణ్, చంద్రబాబులకు దొరకని కాప్టర్లు... దేశంలో వీఐపీల వినియోగానికి పనికి వచ్చే పది నుంచి 12 హెలికాప్టర్లను ఎన్నికల నేపథ్యంలో నేతలందరూ బుక్ చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు కిరణ్కుమార్రెడ్డి, చంద్రబాబునాయుడు హెలికాప్టర్ల కోసం ప్రయత్నించినప్పటికీ వారికి దొరకలేదని సమాచారం. కిరణ్ ఇటీవలి కాలంలో విశాఖ పర్యటన కోసం ప్రైవేట్ హెలికాప్టర్ కోసం ప్రయత్నించగా దొరకలేదు. చంద్రబాబు కూడా ప్రైవేట్ హెలికాప్టర్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏ కంపెనీ కాప్టర్లు ఎవరెవరికి... - జీఎంఆర్కు చెందిన రెండు హెలికాప్టర్లను, ఒక విమానాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్వాన్స్గా బుక్ చేసుకుంది. అన్నీ ఏఐసీసీకే ఇస్తే మరో జాతీయ పార్టీ బీజెపీకి ఆగ్రహం వస్తుందని గ్రహించిన జీఎంఆర్ తెలివిగా మరో విమనాన్ని బీజెపీకి కూడా అద్దెకు ఇచ్చింది. - నవయుగ సంస్థకు చెందిన హెలికాప్టర్లను జయలలిత బుక్ చేసుకున్నారు. - హెలిగోకు చెందిన హెలికాప్టర్ను డీఎంకే అధినేత కరుణానిధి కోసం బుక్చేశారు. - జిందాల్ సంస్థకు చెందిన నాలుగు హెలికాప్టర్లను కాంగ్రెస్ కోసం నవీన్జిందాల్ వినియోగిస్తున్నారు. - డీఎల్ఎఫ్ సంస్థకు చెందిన హెలికాప్టర్ను నరేంద్రమోడీ వినియోగిస్తున్నారు. - ఇయాన్ సంస్థ హెలికాప్టర్ను శరద్పవార్ బుక్ చేసుకున్నారు. -
'మావోయిస్టు ప్రాంతాలలో హెలికాప్టర్లు వినియోగిస్తాం'
ఎన్నికల సమయంలో మావో ప్రభావిత ప్రాంతలలో హెలికాప్టర్లు వినియోగిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. వెల్లడించారు. శనివారం ఆయన విశాఖపట్నం విచ్చేశారు. ఈ సందర్బంగా విలేకర్ల సమావేశంలో భన్వర్లాల్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు 457 భద్రత బలగాలు అవసరమని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కొత్తగా ఓటర్లు నమోదుకు సీమాంధ్రలో ఏప్రిల్ 8 వరకు గడువు విధించినట్లు చెప్పారు. గుర్తింపు కార్డు సమస్య వస్తే 9246280027కు సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) చేయాలని ఆయన ఓటర్లకు సూచించారు.10 లక్షల మంది ఓటర్లు కొత్తగా దరఖాస్తు చేసుకోవడం దేశంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని భన్వర్లాల్ తెలిపారు.