IAS officials
-
ఏపీలో IASల బదిలీలు..
-
తెలంగాణలో బయటపడుతున్న పలువురు ఐఏఎస్ ల బాగోతం
-
తెలంగాణలో 9మంది ఐఏఎస్లకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం తొమ్మిది మంది ఐఏఎస్లకు వివిధ జిల్లాల్లో బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి(సీఎస్) శాంతికుమారి ఉత్వర్వుల్లో సంతకం చేశారు. తాజా పోస్టింగ్లలో.. హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా రాధిక గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్గా పి శ్రీజా, జనగాం అడిషనల్ కలెక్టర్గా పింకేష్ కుమార్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్గా లెనిన్ వట్సల్ టోప్పో, భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్గా కదివరన్ ఐఏఎస్లను నియమించారు. అలాగే.. నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా పి గౌతమి, మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్గా సురేంద్ర ప్రసాద్, వనపర్తి అడిషనల్ కలెక్టర్ గా సంచిత గంగువార్లను నియమిస్తూ పోస్టింగ్ ఉత్తర్వులు పంపించింది తెలంగాణ ప్రభుత్వం. -
తెలంగాణాలో ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు: కొత్త ఎస్పీలు, కమిషనర్లు
సాక్షి, హైదరాబాద్:తెలంగాణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పోస్టుల నియామకాలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. పది జిల్లాలకు కొత్త ఎస్పీలు, వరంగల్, నిజమాబాద్కు కొత్త కమిషనర్ల నియామకం జరిగింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాదాద్రి కలెక్టర్గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి కలెక్టర్గా భారతీ హోలీకేరి, మేడ్చల్ కలెక్టర్గాగౌతం, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా క్రిస్టినా నియమితులయ్యారు. అలాగే వరంగల్ కమిషనర్గా అంబర్ కిషోర్ ఝా , నిజామాబాద్ కమిషనర్గా కల్మేశ్వర్ని ఎంపిక చేశారు. కాగా రానున్న తెలంగాణా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈసీ ఏకంగా 20 మంది ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా నలుగురు జిల్లాల కలెక్టర్ల, 13 మంది IPS అధికారులను బదిలీ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు పూర్తిస్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీల నివేదికను పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రతిపాదిక జాబితా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఈసీకి పంపగా ఇందులోని పలువురి పేర్లను ఖరారు చేసింది. పోలీసు కమిషనర్లు, ఎస్పీల జాబితా వివరాలు ►సంగారెడ్డి - చెన్నూరి రూపేష్ ►కామారెడ్డి- సింధు శర్మ ►జగిత్యాల- సన్ప్రీత్ సింగ్ ►మహబూబ్ నగర్ - హర్షవర్ధన్ ►నాగర్ కర్నూల్- గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ►జోగులాంబ గద్వాల్- రితిరాజ్ ►మహబూబాద్ - డాక్టర్ పాటిల్ సంగ్రామ్ ►నారాయణపేట - యోగేష్ గౌతమ్ ►జయశంకర్ భూపాలపల్లి - ఖరే కిరణ్ ప్రభాకర్ ►సూర్యాపేట- బీ.కే.రాహుల్ హెడ్గే ►వరంగల్ పోలీసు కమిషనర్-అంబర్ కిషోర్ ఝా ►నిజామాబాద్ పోలీసు కమిషనర్ -కల్మేశ్వర్ సింగేనేవర్ -
తెలంగాణ: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ అయ్యారు. అదే విధంగా వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది ప్రభుత్వం. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు నూతన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆర్థికశాఖ జాయింట్ సెక్రటరీగా కె. హరిత భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా ప్రియాంక ములుగు జిల్లా కలెక్టర్గా ఐలా త్రిపాఠి టూరిజం కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్గా కొర్ర లక్ష్మీ టూరిజం డైరెక్టర్గా కె. నిఖిల ఆయుష్ డైరెక్టర్గా హరిచందన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్సీఆర్ హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్, ఆయుష్ డైరెక్టర్గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య నియమితులయ్యారు. హైదరాబాద్ కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి నియమించారు. ఇక తెలంగాణ స్టేట్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్, సెర్ప్ సీఈవోగా పాట్రు గౌతమ్, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా మంద మకరందు, ములుగు కలెక్టర్గా ఐలా త్రిపాఠి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా ముజమిల్ ఖాన్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా కె. హరితను నియమించారు. చదవండి: కవిత, కేటీఆర్పై సుఖేష్ సంచలన ఆరోపణలు, గవర్నర్కు మరో లేఖ హస్త కళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా అలగు వర్షిణి, క్రీడల డైరెక్టర్గా కొర్రా లక్ష్మి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్గా హైమావతి, పర్యాటక శాఖ డైరెక్టర్గా కే నిఖిల, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శిగా సత్య శారదాదేవి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా స్నేహ శబారిష్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా ప్రియాంక ఆల, మహబూబ్నగర్ అదనపు కలెక్టర్గా వెంకటేశ్ ధోత్రే నియమితులయ్యారు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్న కే స్వర్ణలతను జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేశారు. అభిలాష అభినవ్ను ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్గా, కామారెడ్డి అదనపు కలెక్టర్గా మను చౌదరిని, టీఎస్ దివాకరను జగిత్యాల అదనపు కలెక్టర్గా నియమించారు. నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్గా కుమార్ దీపక్, పెద్దపల్లి అదనపు కలెక్టర్గా చెక్క ప్రియాంక, కరీంనగర్ అదనపు కలెక్టర్గా జల్దా అరుణశ్రీ, సంగారెడ్డి అదనపు కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్, రంగారెడ్డి అదనపు కలెక్టర్గా ప్రతిమా సింగ్, సిద్దిపేట అదనపు కలెక్టర్గా గరిమా అగర్వాల్ నియమితులయ్యారు. -
ఏపీ సీఎస్పై కథనాలు అవాస్తవం: ఐఏఎస్ అసోసియేషన్
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎస్ జవహర్రెడ్డిపై వచ్చిన కథనాలు పూర్తి అవాస్తమని, తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఐఏఎస్ అసోసియేషన్ తెలిపింది. సీఎస్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం సరికాదన్నారు. తప్పుడు కథనాలపై ఐఏఎస్ అసోసియేషన్లో చర్చించాం. ఇలాంటి కథనాలపై న్యాయపరమైన చర్యలు ఉంటాయని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ప్రవీణ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎస్ జవహర్రెడ్డి కడపలో పర్యటించారని ప్రవీణ్ వివరణ ఇచ్చారు. సీనియర్ అధికారిపై తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. చదవండి: ‘లోకేష్ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’ -
హైకోర్టు తీర్పు గుబులు.. ఆ 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరిస్థితేంటి?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించినందున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ రాష్ట్రానికే వెళ్లాలని మంగళవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నతాధికారుల్లో గుబులు రేపుతోంది. హైకోర్టు ఉత్తర్వులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ తీర్పుతో మిగిలిన ఉన్నతాధికారులంతా విధిగా ఆయా రాష్ట్రాలకు తిరిగి వెళ్లాల్సిందేనా? అన్న చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణలో పని చేస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర కేడర్కు కేటాయించిన వారు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నారు. రెండు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కేడర్లలో కాకుండా క్యాట్ ఉత్తర్వులతో కొనసాగుతున్న వారిలో 9 మంది ఐఏఎస్లు, ఆరుగురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఐపీఎస్లకు సంబంధించి ఇటీవలే తెలంగాణ ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్, అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్, అభిలాష్ మహంతిలు ఆంధ్ర కేడర్కు చెందిన అధికారులు కాగా.. తెలంగాణలో పనిచేస్తున్నారు. మొన్నటివరకు ఏపీ కేడర్కు చెందిన సంతోష్ మెహ్రా తెలంగాణలో పనిచేసినా, ఈ మధ్యనే ఆయన ఏపీ కేడర్కు వెళ్లిపోయారు. కాగా తెలంగాణకు కేడర్కు కేటాయించిన మనీష్కుమార్ సింగ్, అమిత్గార్గ్, అతుల్ సింగ్లు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నారు. ఇక ఈ విధంగా ఐఏఎస్ అధికారుల్లో సోమేశ్కుమార్, వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఎం.ప్రశాంతి, కాటా ఆమ్రపాలి తెలంగాణ కేడర్లో పనిచేస్తుండగా అలాగే తెలంగాణ కేడర్కు కేటాయించిన హరికిరణ్, శ్రీజన, శివశంకర్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నారు. చదవండి: (తెలంగాణ నూతన సీఎస్గా శాంతికుమారి) -
తెలంగాణ రాష్ట్ర కేడర్కు ఆరుగురు ఐఏఎస్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేడర్కు ఆరుగురు 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. శ్రద్ధ శుక్ల (ఛత్తీస్గఢ్), కిరణ్మయి కోపిశెట్టి (తెలంగాణ), నారాయణ్ అమిత్ మాలెపాటి (తెలంగాణ), వికాస్ మహతో (ఝార్ఖండ్), ఉమాశంకర్ ప్రసాద్ (బిహార్), మాయంక్ సింగ్ (మధ్యప్రదేశ్) త్వరలో రాష్ట్ర కేడర్లో చేరనున్నారు. కేంద్ర సర్వీసులకు రజత్షైనీ రాష్ట్ర రెవెన్యూ శాఖ లో సీసీఎల్ఏ డైరెక్టర్గా పనిచేస్తున్న 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ షైనీ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఆయనను కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండస్ట్రీ ప్రమోషన్, ఇంటర్నల్ ట్రేడ్ విభాగానికి డైరెక్టర్గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: రైతే జెండా.. ఎజెండా! బీఆర్ఎస్ కార్యచరణపై కేసీఆర్ కసరత్తు -
ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీ
-
టీ–హబ్ను సందర్శించిన ఐఏఎస్లు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రం నగరంలోని టి–హబ్ను 40 మంది రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. టి–హబ్లోని పలు ఇన్నోవేషన్ హబ్లైన వి–హబ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), రీసర్చ్, ఇన్నోవేషన్స్ సర్కిల్ ఆఫ్ తెలంగాణ (రిచ్), ఇమేజ్, తదితర కేంద్రాలను, వారు రూపొందించిన ఆవిష్కరణలను ఐఏఎస్ అధికారులు ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. టి–హబ్ ఇప్పటివరకు వందకు పైగా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్లను అందించిందని, స్టార్టప్లు, ఇతర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ వాటాదారులపై ప్రభావం చూపుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు టి–హబ్ను సందర్శించినవారిలో ఉన్నారు. -
సీఎం వైఎస్ జగన్ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్
సాక్షి, అమరావతి: 2021 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిశారు. పాలనాపరమైన అవగాహన పెంపొందించుకునేందుకు వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని ఐఏఎస్ ప్రొబేషనర్స్కు మార్గనిర్దేశం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వారికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన ఐఏఎస్ ప్రొబేషనర్స్లో పి. ధాత్రిరెడ్డి, వై.మేఘ స్వరూప్, ప్రఖర్ జైన్, గొబ్బిళ్ళ విద్యాధరి, శివ నారాయణ్ శర్మ, అశుతోష్ శ్రీవాత్సవ, అపూర్వ భరత్, రాహుల్ మీనా, సూరపాటి ప్రశాంత్ కుమార్లు ఉన్నారు. ఇదీ చదవండి: మార్చి 31 నాటికి అన్నిరోడ్లను బాగు చేయాలి: సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని మార్గనిర్ధేశం చేసి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పిన సీఎం. pic.twitter.com/7VIDUFBpz9 — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 7, 2022 -
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు సస్పెన్షన్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. లిక్కర్ పాలసీపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్న ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎ.గోపీకృష్ణ, ఆనంద్కుమార్ తివారీని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. ఈ కుంభకోణం చోటుచేసుకున్న సమయంలో గోపీకృష్ణ ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్గా, ఆనంద్కుమార్ డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్గా పనిచేశారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఈ ఇద్దరు అధికారుల పేర్లు ఉన్నాయి. దీంతో వారిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: Delhi Liquor Scam: బీజేపీలో చేరితే కేసులు ఎత్తేస్తామన్నారు -
పలువురు ఐఏఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీలు తక్షణం అమల్లోకి వస్తాయంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ డైరెక్టర్గా ఉన్న చదలవాడ నాగరాణిని సాంకేతిక విద్య డైరెక్టర్గా బదిలీ చేశారు. పోలా భాస్కర్ను సాంకేతిక విద్య డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎంఎం నాయక్ను హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయనకు ఆప్కో వీసీ, ఎండీతోపాటు ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆప్కో ఎండీ, ఖాదీ–గ్రామీణ పరిశ్రమల శాఖ సీఈఓ బాధ్యతల నుంచి చదలవాడ నాగరాణిని రిలీవ్ చేశారు. ఇక బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మికి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ కమిషనర్గా ఉన్న కాటంనేని భాస్కర్ను పాఠశాల విద్యా శాఖ పరిధిలోని పాఠశాల మౌలిక వసతుల కమిషనర్గా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు కాటంనేని భాస్కర్ మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. అలాగే, బి. శ్రీనివాసరావును సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్గా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు శ్రీనివాసరావుకు రైతుబజార్ల సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. -
ట్రెండింగ్లో ‘కుక్క’.. ఆ జంటను ఆడేసుకుంటున్నారు
పెంపుడు కుక్కను ఈవినింగ్ వాక్ కోసం స్టేడియంలోకి తీసుకెళ్లడం, ఆ ఐఏఎస్ జంట కోసం నిర్వాహకులు అథ్లెట్లను ఖాళీ చేయించడం.. నిన్నంతా ఈ వ్యవహారం దేశ రాజధానిలో హీట్ పుట్టించింది. విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం రంగంలోకి దిగగా.. ఆ జంటపై ఆఘమేఘాల మీద ‘బదిలీ’ చర్యలు తీసుకుంది కేంద్ర హోం శాఖ. అయితే ఈ జంట వ్యవహారం ఇప్పుడు ట్విటర్లో కొత్త ట్రెండ్కు దారి తీసింది. ఈ ఉదయం నుంచి #Kutta హ్యాష్ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఐఏఎస్ జంట అయిన సంజీవ్ ఖీరావర్, రింకూ దుగ్గను చెరో ప్రాంతానికి బదలీ చేసింది కేంద్ర హోం వ్యవహారాల శాఖ. ఖీరావర్ను లడఖ్, దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్ను బదిలీ చేస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకుగానూ శిక్ష విధించింది. Karmo ka fal babu-bhaiya.#Ladakh 🤝 #ArunachalPradesh ❤️ Kutta kiske sath jayega????😉#Delhi #IASCouple #Dog pic.twitter.com/bEh1qpI7qB — Roshan Singh🚩 (@Yogi_Bhkt) May 27, 2022 ఈ తరుణంలో.. నెట్లో కుక్క మీమ్స్ నవ్వులు పూస్తున్నాయి. పూల్ ఔర్ కాంటే సినిమాలోని అజయ్ దేవగణ్ ఫేమస్ స్టంట్ను ఈ జంటపై ప్రయోగించాడు ఓ నెటిజన్. అక్కడి నుంచి మొదలైన.. కుక్క ట్రెండ్ ఓ రేంజ్లో దూసుకుపోతోంది. Kutta right now -:#IASOfficer pic.twitter.com/OAO7A4JNCp — 𝙆𝘼𝙆𝘼𝙎𝙃𝙄𝙄 (@_meherbaaa_) May 27, 2022 ఇద్దరూ చెరోవైపు వెళ్లారని, పాపం ఆ కుక్క ఎక్కడికి వెళ్తుందని ఫన్ పుట్టిస్తున్నారు కొందరు. ఇదిలా ఉంటే.. త్యాగరాజ్ స్టేడియంలో ఈ జంట కోసం అథ్లెట్లను వెళ్లగొట్టిన ఘటనపై ఢిల్లీ సీఎస్ దగ్గరి నుంచి నివేదిక తెప్పించుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఆపైనే బదిలీ చర్యలు తీసుకుంది. Meanwhile dog #Kutta #IASOfficer pic.twitter.com/uDejS64GUO — Hardev Singh (@hardevsingh93) May 27, 2022 #WhereWillTheDogGo #Kutta #8Years_Of_Disaster Actually what was the problem, IAS couple providing security cover for the dog, or the dog not getting SPG cover😂😂 pic.twitter.com/gL1DtyNZLQ — Anoasku (@Anoasku) May 27, 2022 సంబంధిత వార్త: స్టేడియంలో అధికారి కుక్క వాకింగ్ కోసం.. -
హైకోర్టులో ఆ ఐఏఎస్లకు ఊరట
సాక్షి, అమరావతి: ఐఏఎస్ అధికారులు వై. శ్రీలక్ష్మీ, బి. రాజశేఖర్, చినవీరభద్రుడు, జె. శ్యామలరావు, జి. విజయ్కుమార్, ఎంఎం నాయక్లకు రాష్ట్ర హైకోర్టు ఊరటనిచ్చింది. ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహంలో నెలలో ఓ ఆదివారం చొప్పున 12 ఆదివారాలు సామాజిక సేవ చేయాలంటూ సింగిల్ జడ్జి విధించిన శిక్షను హైకోర్టు ధర్మాసనం ఎనిమిది వారాలపాటు నిలిపివేసింది. తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సామాజిక సేవకు ఐఏఎస్ల అంగీకారం ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణాలను తొలగించాలన్న ఆదేశాలను సకాలంలో అమలుచేయకపోవడాన్ని సింగిల్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ కోర్టు ధిక్కారంగా పరిగణించారు. ఇందుకు పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, అప్పటి కమిషనర్ చిన వీరభద్రుడు, పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, ఆ శాఖ ప్రస్తుత స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మీ, ఆ శాఖ అప్పటి డైరెక్టర్ జి. విజయ్కుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం నాయక్లను బాధ్యులుగా చేశారు. కోర్టు ధిక్కారం కింద వారికి నెలరోజుల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించారు. అయితే.. వారు క్షమాపణ కోరడంతో పాటు వారి అభ్యర్థన మేరకు ఆ శిక్షను సామాజిక సేవగా మార్చారు. ఈ తీర్పును పునః సమీక్షించాలంటూ శ్రీలక్ష్మీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ కొట్టేశారు. దీంతో సామాజిక సేవ చేయాలన్న తీర్పును సవాలు చేస్తూ ద్వివేదీ, గిరిజా శంకర్లు ఇటీవల ధర్మాసనం ముందు వేర్వేరుగా రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై గత వారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం, గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్లకు విధించిన సామాజిక సేవ శిక్ష అమలును నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఆరుగురు ఐఏఎస్ అధికారుల అప్పీళ్లు ఈ నేపథ్యంలో.. మిగిలిన ఐఏఎస్ అధికారులు కూడా సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం జస్టిస్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపింది. ఐఏఎస్ అధికారుల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్రెడ్డి, ఎ. సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, కోర్టు ధిక్కారానికి పాల్పడిన వారికి ఎలాంటి శిక్ష విధించాలో, ఎంత కాలపరిమితితో విధించాలో కోర్టు ధిక్కార చట్టంలో స్పష్టంగా ఉందని వివరించారు. ఇదే వ్యవహారంలో సీజే ధర్మాసనం ఉత్తర్వులను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో శ్రీలక్ష్మీ తదితరులు దాఖలు చేసిన ఈ అప్పీళ్లలో కూడా సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
AP: ముగ్గురు ఐఏఎస్లకు స్పెషల్ సీఎస్లుగా పదోన్నతి
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేడర్ 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ), ఎక్స్ అఫీసియో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న కే. విజయా నంద్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్ఎస్ రావత్, రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న బి. రాజశేఖర్కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న పోస్టుల్లోనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మరుగుదొడ్లను శుభ్రం చేసిన ఐఏఎస్లు
నెల్లూరు (టౌన్)/నెల్లిమర్ల: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇద్దరు ఐఏఎస్లు శనివారం వేర్వేరు ప్రాంతాల్లో పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేశారు. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) కిశోర్కుమార్ నెల్లిమర్ల రెల్లివీధిలో ఉన్న బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ మరుగుదొడ్డిలోకి ప్రవేశించి బ్రష్ను చేతబట్టి, యాసిడ్ పోసి మరుగుదొడ్డిని శుభ్రం చేశారు. అనంతరం తరగతి గదిలోకి ప్రవేశించి, మరుగుదొడ్లను ఎవరికి వారే శుభ్రం చేసుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు. అలాగే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పొదలకూరు రోడ్డులోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ మరుగుదొడ్డిని శుభ్రపరిచారు. పాఠశాలల ఆవరణలో మొక్కలను నాటారు. రాజశేఖర్ మాట్లాడుతూ..పారిశుధ్య కార్మికులు, ఆయాలను చిన్న చూపు చూడకూడదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 వేలకు పైగా పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రతకు రూ.450 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆయాలు ఆర్.సుమతి, సీహెచ్ గాయత్రి, బుజ్జమ్మ, సీహెచ్ రాజేశ్వరిలను సన్మానించారు. -
కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఇతర కార్యాలయాల నిర్మాణాలేవీ చేపట్టరాదంటూ గతేడాది తామిచ్చిన ఆదేశాలను అధికారులు ఇప్పటివరకు అమలుచేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నిర్మాణాలు చేపట్టకుండా కిందిస్థాయి అధికారులకు ఎందుకు ఆదేశాలు జారీచేయలేదని ప్రశ్నించింది. ఇప్పటికైనా అధికారులకు తగిన ఆదేశాలిస్తే, కోర్టు ధిక్కార వ్యాజ్యాలను మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామంది. ప్రభుత్వమే ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు ఈ అన్యాయం గురించి ఎవరికి చెప్పుకుంటారని నిలదీసింది. ఐఏఎస్ అధికారుల్లో అత్యధిక శాతం మంది కోర్టు ఆదేశాలను అమలుచేయాల్సిన అవసరంలేదన్న భావనలో ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతేడాది ఇచ్చిన ఆదేశాలు ఇప్పటివరకు అమలుకాకపోవడానికి పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ, పురపాలక శాఖ అధికారులు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు కొంత గడువునివ్వాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్లు అభ్యర్థించడంతో అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను 31కి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకూ ఎనిమిది మంది అధికారులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. కోర్టు ఎదుట ఉన్నతాధికారుల హాజరు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలతో సహా ఇతర కార్యాలయాల నిర్మాణాలేవీ చేపట్టరాదంటూ గతేడాది న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టడంపై తాజాగా పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గత ఏడాది ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు అమలుచేయకపోవడంతో అధికారుల చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, పలు శాఖల ఉన్నతాధికారులను న్యాయమూర్తి కోర్టు ముందుకు పిలిపించారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్ చినవీరభద్రుడు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, అప్పటి డైరెక్టర్ విజయకుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం నాయక్లు హైకోర్టు ముందు హాజరైన వారిలో ఉన్నారు. పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి శ్యామలరావు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. -
అది బస్తీ దవాఖానా.. కానీ అక్కడికి ఐఏఎస్లూ వస్తారు
సాక్షి, బంజారాహిల్స్: తాజా మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులతో పాటు సంపన్న వ్యాపార, పారిశ్రామికవేత్తలు తమకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే బడా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తారని అంతా భావిస్తారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని ప్రశాసన్నగర్లో నివసిస్తున్న తాజా, మాజీ బ్యూరోక్రాట్లు మాత్రం తమ కాలనీలో ఉన్న బస్తీ దవాఖానాను సద్వినియోగం చేసుకుంటున్నారు. బీపీ, షుగర్ తదితర పరీక్షలతో పాటు అందుకు సంబంధించిన మందులను కూడా వీరంతా ఈ బస్తీ దవాఖానాలోనే పొందుతున్నారు. వైద్యం కోసం వచ్చిన అధికారి సురేష్ చందా.. 2018 మార్చిలో ఇక్కడ బస్తీ దవాఖానా ఏర్పాటు చేశారు. ఇక్కడున్న సౌకర్యాలతో ఐఏఎస్, ఐపీఎస్లు ఆకర్షితులయ్యారు. సమీపంలోనే కార్పొరేట్ వైద్యం లభిస్తుండటంతో మెల్లమెల్లగా అధికారులంతా ఇక్కడే వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతిరోజూ 20 నుంచి 30 మంది అధికారులు ఇక్కడ షుగర్, బీపీ పరీక్షలతో పాటు లివర్ ఫంక్షన్ టెస్టులు, రెనాల్ ప్రొఫైల్ టెస్టులు, సీరం కాల్షియం, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. దీంతో బస్తీ దవాఖానా కాస్తా కాలనీ దవాఖానాగా వరిపోయింది. ఇక్కడ సామాన్యులతో పాటు సంపన్నులు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటుండటంతో బస్తీ దవాఖానా కార్పొరేట్ ఆస్పత్రి తరహాగా సేవలు అందిస్తోంది. బస్తీ దవాఖానాలో పరీక్షలు చేయించుకుంటున్న ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ అన్ని పరీక్షలూ ఇక్కడే.. డ్రైవర్లు, పని మనుషుల కోసం మాత్రమే ఏర్పాటైన బస్తీ దవాఖానాలో లభిస్తున్న వైద్య సేవలు సంపన్నులను సైతం ఆకర్షిస్తున్నాయి. నాణ్యమైన మందులతో పాటు వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండటంతో ప్రతిరోజూ 20 నుంచి 30 మంది వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పరీక్షల కోసం వస్తున్నారు. ప్రతి వైద్య పరీక్షను ఇక్కడే చేయించుకుంటున్నారు. వీరితో పాటు కాలనీకి చెందిన పని మనుషులు, డ్రైవర్లు, సమీప బస్తీల నుంచి ప్రతిరోజూ 80 నుంచి 100 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. – డాక్టర్ అమూల్య, ప్రశాసన్నగర్ బస్తీ దవాఖానా -
ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
సాక్షి, అమరావతి: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్న ఇంతియాజ్ మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్గా బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ఉన్న జె. నివాస్ కృష్ణా జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఇక శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ఎల్ఎస్ బాలాజీరావు, అనంతపురం జిల్లా కలెక్టర్గా నాగలక్ష్మి, చిత్తూరు జిల్లా హౌసింగ్ జేసీగా వెంకటేశ్వర్, అనంతపురం జిల్లా హౌసింగ్ జేసీగా నిశాంతి, పాడేరు ఐటీడీఏ పీవోగా గోపాలకృష్ణ, ప్రకాశం జిల్లా హౌసింగ్ జేసీగా కేఎస్ విశ్వనాథన్, వైఎస్ఆర్ కడప జిల్లా హౌసింగ్ జేసీగా ధ్యానచంద్ర, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ జేసీగా జాహ్నవి, కర్నూలు జిల్లా హౌసింగ్ జేసీగా మౌర్య, కృష్ణా జిల్లా హౌసింగ్ జేసీగా అజయ్కుమార్, గుంటూరు జిల్లా హౌసింగ్ జేసీగా అనుపమ అంజలి, నెల్లూరు జిల్లా హౌసింగ్ జేసీగా విధే ఖారే, పశ్చిమగోదావరి జిల్లా హౌసింగ్ జేసీగా సూరజ్ ధనుంజయ్, విశాఖ జిల్లా హౌసింగ్ జేసీగా కల్పనకుమారి, విజయనగరం జిల్లా హౌసింగ్ జేసీగా మయూర్ అశోక్, శ్రీకాకుళం జిల్లా హౌసింగ్ జేసీగా హిమాన్షు కౌశిక్ , ఏపీ ఆగ్రోస్ ఎండీగా కృష్ణమూర్తి బదిలీ అయ్యారు. -
ఇద్దరు ఐఏఎస్లకు వారెంట్లు
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో తామిచ్చిన ఆదేశాల మేరకు తమ ముందు హాజరు కానందుకు ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వారెంట్లను అమలు చేసి ఐఏఎస్ అధికారులైన బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ బి.రామారావులను తమ ముందు హాజరుపరచాలని విజయవాడ పోలీస్ కమిషనర్, గుంటూరు ఎస్పీలను ఆదేశించింది. ఈ నెల 19లోపు వారెంట్లను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లా పరిధిలోని బీసీ హాస్టల్ ఉద్యోగి చంద్రమౌళికి పదోన్నతి కల్పించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయలేదంటూ చంద్రమౌళి కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఇందులో ప్రవీణ్కుమార్, రామారావులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. గతంలో దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఇరువురు అధికారులను మార్చి 5న తమ ముందు హాజరు కావాలని ఆదేశాలిచ్చారు. ఈ ధిక్కార వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా ప్రవీణ్కుమార్, రామారావు హాజరు కాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ వేశారు. దీన్ని కొట్టేసిన న్యాయమూర్తి.. ఇద్దరు అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ఇదే వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్లాల్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తిలను ఏప్రిల్ 6న తమ ముందు హాజరవ్వాలని ఆదేశించారు. విచారణను ఆ మేరకు వాయిదా వేశారు. చదవండి: అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు -
యోగికి షాకిచ్చిన ఐఏఎస్ అధికారులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద లవ్ జిహాద్ ఆర్డినెన్స్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో సదరు ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు సంతకం చేసిన లేఖను మంగళవారం విడుదల చేశారు. లవ్ జిహాద్ వ్యతిరేక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత రాష్ట్రం "ద్వేషం, విభజన, మతోన్మాద రాజకీయాలకు కేంద్రంగా" మారిందని వారు లేఖలో పేర్కొన్నారు. ఇక దీనిలో సంతకం చేసిన వారిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు, ప్రధానమంత్రి మాజీ సలహాదారు టీకేఏ నాయర్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. "చట్టవిరుద్ధమైన ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని" వారు లేఖలో డిమాండ్ చేశారు. అంతేకాక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో సహా ఇతర రాజకీయ నాయకులందరూ "మీరు ... పాటిస్తామని ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని మరోసారి తిరిగి చదవాల్సిన అవసరం ఏర్పడింది" అని పేర్కొన్నారు. "ఒకప్పుడు గంగా-జమునా నాగరికతకు కేంద్రంగా బాసిల్లిన యూపీ.. ఇప్పుడు ద్వేషం, విభజన, మూర్ఖత్వ రాజకీయాలకు కేంద్రంగా మారింది. పాలనా సంస్థలు ఇప్పుడు మతపరమైన విషంలో మునిగిపోయాయి" అని వారు లేఖలో తెలిపారు. "స్వేచ్ఛగా బతకాలనుకునే భారతీయు పౌరులు హక్కుకు వ్యతిరేంగా యూపీలోని ప్రభుత్వ యంత్రాంగం యువకులపై దారుణాలకు పాల్పడుతుంది’’ అని లేఖలో పేర్కొన్నారు. అంతేకాక ఆర్డినెన్స్ని అడ్డుపెట్టుకుని మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని పాల్పడిన దారుణాల గురించి లేఖలో ప్రస్తావించారు. వీటిలో ముఖ్యమైనది ఈ నెల ప్రాంరభంలో రాష్ట్రంలోని మొరాదాబాద్లో జరిగిన సంఘటన. దీనిలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇద్దరు వ్యక్తులను దారుణంగా కొట్టారు. బాధితుల్లో ఓ వ్యక్తి పెళ్లి పేరుతో బలవంతంగా ఓ హిందూ యువతిని మతం మారేలా చేశాడని ఆరోపించారు. పోలీసులు సదరు వ్యక్తుల మీద ఈ ఆర్డినెన్స్ కింద కేసు నమోదు చేశారని ఐఏఎస్ అధికారులు లేఖలో తెలిపారు. అలానే మరి కొన్ని ఘటనల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు అమాయకపు జంటలను వేధింపులకు గురి చేశారని.. ఆ సమయంలో పోలీసులు స్పందించలేదని.. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. మరో ఘటనలో దంపతులను వేధించగా.. గర్భవతిగా ఉన్న యువతికి అబార్షన్ అయ్యిందంటూ ఓ ఆంగ్ల న్యూస్ పేపర్లో వచ్చిన ఉదంతాన్ని ఐఏఎస్ అధికారులు లేఖలో ప్రస్తావించారు. అలానే గత వారం బిజ్నోర్లో జరిగిన మరో సంఘటనను కూడా ప్రస్తావించారు. ఇక సదరు ఆర్డినెన్స్ భారతీయ ముస్లిం యువకులు హక్కులను కాలరాస్తుందని పేర్కొన్నారు. ఇక యూపీ తీసుకొచ్చిన లవ్ జిహాద్ ఆర్డినెన్స్ను అలహాబాద్ కోర్టు కూడా వ్యతిరేకించిందని లేఖలో పేర్కొన్నారు. ఇక యూపీ తీసుకువచ్చిన సదరు యాంటీ లవ్ జిహాద్ ఆర్డినెన్స్ను నలుగురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా వ్యతిరేకించారు. వీరిలో జస్టిస్ మదన్ బీ లోకూర్ సదరు ఆర్డినెన్స్ని రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు. -
ఏపీలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎం.వి.శేషగిరిబాబు, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా కె.ప్రవీణ్కుమార్ రెడ్డి.. ఏపీ టవర్స్ లిమిటెడ్ సీఈవోగా ఎం.రమణారెడ్డి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్గా ఎస్బిఆర్.కుమార్లకు బాధ్యతలు అప్పగించారు. -
ని‘వారించండి’...
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్లో యువతను దుష్టశక్తులు ఉగ్రవాదంపైపు ఆకర్షిస్తూ ఉగ్ర గ్రూపుల్లో చేర్చుకుంటున్న వైనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాద భూతంతో విలవిల్లాడుతు న్న జమ్మూకశ్మీర్లో యువత ‘తప్పుడు బాట’పట్టకుండా నివారించేందుకు మహిళా పోలీసు అధికారులు ఆయా పిల్లల తల్లులను చైతన్యపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ సూ చించారు. మహిళా అధికారులకు ఆ సామ ర్థ్యం ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్ శివార్లలోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన 2018 బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్య అతిథిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులతో మాట్లాడిన మోదీ... వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కశ్మీర్లో యువత పరిస్థితిని ప్రస్తావించడంతోపాటు టెక్నాలజీ వాడకం, శిక్షణ, నైపుణ్యం వంటి అంశాలపై ప్రొబేషనర్లకు కీలక సూచనలు చేశారు. కశ్మీరీలు ప్రేమపూర్వక ప్రజలు... ఓ మహిళా ప్రొబేషనర్కు బదులిస్తూ కశ్మీరీలు ఎంతో ప్రేమపూర్వక ప్రజలని మోదీ కితాబిచ్చారు. కొత్త విషయాలను నేర్చుకొనే ప్రత్యేక సామర్థ్యం వారిలో ఉందన్నారు. ‘‘వారితో నేను ఎంతగానో మమేకమయ్యాను. వారు మిమ్మల్ని ఎంతో ప్రేమతో చూస్తారు. కశ్మీరీ యువత తప్పుడు బాటలో పయనించకుండా ఆపేలా మనందరం కలసికట్టుగా కృషి చేయాలి. దీన్ని మహిళా పోలీసు అధికారులు ఎంతో సమర్థంగా నిర్వహించగలరు. అలాంటి పిల్ల ల తల్లులను వారు చైతన్యపరిచి యువత వెనక్కి వచ్చేలా చేయగలరు. దీన్ని తొలి దశలోనే చేయగలిగితే మన పిల్లలు తప్పుడు మా ర్గంలోకి వెళ్లకుండా నివారించగలమని గట్టిగా నమ్ముతున్నా’’అని మోదీ పేర్కొన్నారు. టెక్నాలజీ వాడకమే కీలకం... సమర్థ పోలీసింగ్లో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తుంది. అది సీసీటీవీ ఫుటేజీ కావొచ్చు లేదా మొబైల్ ట్రాకింగ్ కావచ్చు. అది మీకు ఎంతగానో దోహదపడుతుంది. క్షేత్రస్థాయి సమాచారానికి ప్రాధాన్యమిస్తూనే బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా వంటి వాటిని మెరుగైన పోలీసింగ్లో ఆయుధాలుగా ఉపయోగించవచ్చు’’అని మోదీ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సానుకూలంగా ఉపయోగించేలా పోలీసు అధికారులు ప్రజలకు శిక్షణ ఇవ్వాలన్నారు. పోలీసులు ఎలాంటి తప్పులు చేయరాదన్న మోదీ.. ఒకవేళ ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం వారిని పట్టిస్తుందని హెచ్చరించారు. ‘సింగం’ పాత్రల ప్రభావానికి లోనుకావొద్దు.. ‘‘పోలీసు అకాడమీ నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణం పరిస్థితి మారిపోతుంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. మొదటి అభిప్రాయమే చివరి వరకు ఉంటుంది. మీ బదిలీతోపాటు మీ ఇమేజ్ మీ వెంట వస్తుందన్న విషయం మరువరాదు. మీకు పోస్టింగ్ లభించిన ప్రతి ఠాణాతో అనుబంధ భావనను పెంచుకొంటూ దానిని గర్వకారణంగా భావించాలి’’అని ప్రధాని కోరారు. ప్రజలను భయపెట్టి అదుపు చేయడంకన్నా వారిపై దయ, జాలిని చూపించి వారి మనసులను గెలుచుకొంటే అది చిరకాలం నిలిచిపోతుందన్నారు. ‘సింగం’లాంటి సినీ వీరోచిత పోలీసు పాత్రల ప్రభావానికి లోనుకారాదని మోదీ సూచించారు. ‘‘ఎన్నటికీ మీ ఖాకీ దుస్తులపై గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. పోలీసులు చేసిన మంచి పనుల కారణంగా ప్రత్యేకించి ప్రస్తుత కరోనా కాలంలో పోలీసులు ప్రదర్శించిన మానవత్వం కారణంగా ఖాకీ యూనిఫారం ప్రజల జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేసుకుంది’’అని ప్రధాని కొనియాడారు. శిక్షణను శిక్షగా భావించొద్దు.. ‘‘శిక్షణ అనేది శిక్షతో కూడిన పోస్టింగ్గా భావించే మనస్తత్వం నుంచి మీరంతా బయటపడాలి. శిక్షణకు ప్రాధాన్యమిచ్చేందుకు ‘మిషన్ కర్మయోగి’కి కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ఏడు దశాబ్దాల చరిత్రగల సివిల్ సర్వీసులో సామర్థ్యాల పెంపు పరంగా చూసినా, పనిపట్ల ప్రదర్శించే వైఖరిపరంగా చూసినా ఇది ఒక పెద్ద సంస్కరణ. ప్రతిభను గుర్తించడంలో, ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వడంలో మిషన్ కర్మయోగి సాయపడుతుంది. దీంతో సరైన పాత్రలో సరైన వ్యక్తిని నియమించడం సాధ్యమవుతుంది’’అని మోదీ చెప్పారు. గత కొన్నేళ్లలో విపత్తు సంభవించిన సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమించిన తీరు పోలీసు సేవకు కొత్త గుర్తింపును తీసుకొచ్చిందని ప్రధాని ప్రశంసించారు. మీరంతా యువతలో స్ఫూర్తి నింపగలరు: అమిత్ షా ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారుల చిత్తశుద్ధి యువతరం మరింతగా ఐపీఎస్ బాట పట్టేలా చేయడంలో స్ఫూర్తినింపుతుందని విశ్వసిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశ భద్రత, సమగ్రతలను కాపాడటంలో రాజీపడొద్దని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ సూచించారు. ప్రొబేషనరీ అధికారులంతా ప్రధాని నిర్దేశించినట్లు స్మార్ట్ పోలీస్ విజన్ లక్ష్యా లను చేరుకొని ముందుకు సాగాలన్నారు. ఆల్రౌండర్ ప్రొబేషనర్గా కిరణ్ శ్రుతి.. పాసింగ్ అవుట్ పరేడ్లో 71 ఆర్ఆర్ (2018) బ్యాచ్ నుంచి 121 మంది ప్రొబేషనరీ అధికారులు, 70 ఆర్ఆర్ (2017) బ్యాచ్ నుంచి మరో 10 మంది ప్రొబేషనరీ అధికారులు పాల్గొన్నారు. శిక్షణలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ప్రొబేషనరీ అధికారులకు జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అతుల్ కార్వా ల్ ట్రోఫీలను బహూకరించారు. 2018 బ్యాచ్ ఆల్రౌండర్ ప్రొబేషనరీ అధికారిగా నిలిచిన డి.వి. కిరణ్ శ్రుతి పరేడ్కు నాయకత్వం వహించారు. కరోనా నేపథ్యంలో ఈసారి ట్రైనీ అధికారుల కుటుంబ సభ్యులు, అతిథులు, మీడియాను లోపలకు అనుమతించలేదు. -
సీఎం సహాయ నిధికి కియా భారీ విరాళం
సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించేందకు పలువురు ప్రముఖులు, పలు సంస్థలు ముందుకొస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కియా మోటార్స్ రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు కియా మోటార్స్ ఇండియా ఎండీ కుక్ హయాన్ షిమ్ గురువారం సీఎం వైఎస్ జగన్ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళాలకు సంబంధించిన వివరాలను అందజేశారు. (భారతి సిమెంట్స్ రూ.5 కోట్ల విరాళం) రూ. 2 కోట్లు విరాళం ప్రకటించిన శ్రీ సీటీ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ సంస్థ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసిన శ్రీ సిటీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సన్నారెడ్డి రవీంద్ర.. విరాళానికి సంబంధించిన చెక్ను అందజేశారు. మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన ఏపీ ఐఏఎస్లు.. కరోనా నియంత్రణ చర్యల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్.. వారి మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్, విజయకుమార్, ప్రద్యుమ్న, ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్కుమార్ విరాళాలకు సంబంధించిన వివరాలు అందించారు. రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన జీఎల్ మంధానీ గ్రూప్ కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఎంబీజీ కమొడిటీస్ తరఫున జీఎల్ మంధానీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని జీఎల్ మంధానీ గ్రూప్ ట్రస్టీ బిజయ్ మంధానీ ఆన్లైన్ ద్వారా సీఎం సహాయ నిధికి బదిలీ చేశారు. -
ఏపీ: సీనియర్ ఐఏఎస్లకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ముఖ్య కార్యదర్శులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా... కార్యదర్శులు ముఖ్యకార్యదర్శులుగా పదోన్నతి పొందారు. మరికొందరు సంయుక్త కార్యదర్శులుగా పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్న రజత్ భార్గవ్, జవహర్రెడ్డి, అనంతరాము, ప్రవీణ్కుమార్... స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతులు పొందారు. అదే విధంగా... సెక్రటరీ హోదాలో ఉన్న జి.జయలక్ష్మి, ఉషారాణి, రామ్గోపాల్కు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా... జాయింట్ సెక్రటరీలుగా ఉన్న ముత్యాలరాజు, బసంత్కుమార్ పదోన్నతి పొందారు. ఇదిలా ఉండగా... ఇంటర్ క్యాడర్ ట్రాన్స్ఫర్ల ద్వారా ఏపీకి ఇద్దరు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో నాగాలాండ్, యూపీ క్యాడర్కు చెందిన.. మంజిర్ జిలానా సమూన్, తమీమ్ అన్సారియాకు విశాఖలో పోస్టింగ్ లభించింది. వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్గా మంజిర్ జిలానీ సమూన్, జీవీఎంసీ అదనపు కమిషనర్గా తమీమ్ అన్సారియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
గవర్నర్ గిరి..ఐపీఎస్లపై గురి!
సాక్షి, హైదరాబాద్: త్వరలో పలు రాష్ట్రాల గవర్నర్ల పదవీ కాలం ముగిసిపోనున్న నేపథ్యంలో సమర్థమైన వారి కోసం కేంద్రం అన్వేషణ మొదలుపెట్టింది. రాజకీయ నాయకులతో పాటు ఐపీఎస్ అధికారులను ఈసారి గవర్నర్లుగా నియమించాలని భావిస్తోంది. ఇందుకోసం సరైన ఐపీఎస్ అధికారుల వేట మొదలుపెట్టింది. సాధారణంగా గవర్నర్ పోస్టులో రాజకీయ నాయకులే ఉంటారు. సీనియర్లు, పరిపాలనలో సమర్థులుగా పేరున్న వారిని వారిని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గవర్నర్లుగా నియమించడం పరిపాటే. అయితే అప్పుడప్పుడూ సివిల్ సర్వీసెస్ అధికారులను కూడా నియమిస్తూ ఉంటారు. సీనియర్ అధికారులైన ఈఎస్ఎల్ నరసింహన్ (ఏపీ), కిరణ్బేడీ (పుదుచ్చేరి), పీఎస్ రామ్మోహన్రావు (తమిళనాడు) గవర్నర్లుగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇటీవలే భేటీ.. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దక్షిణాది నుంచి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను గవర్నర్లుగా నియమించాలని కేంద్రంలోని ఓ కీలక నేత ప్రయత్నాలు చేస్తున్నారు. పనిపై నిబద్ధత, విధి నిర్వహణలో సమర్థులు, ట్రబుల్ షూటర్లు అని ఆ ఇద్దరు అధికారులకు ఉన్న రికార్డే ఇందుకు కారణం. అందులో భాగంగా తెలంగాణకు చెందిన ఓ ఐపీఎస్ అధికారితో ఆ సీనియర్ నేత ఇటీవల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ పదవిని చేపట్టే విషయమై ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఊహించని ఈ ఆఫర్కు అవాక్కయిన ఆ అధికారి.. తొలుత నమ్మలేదు. కానీ, సీరియస్గా అడిగేసరికి.. తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానని, ఆలోచించుకునేందుకు కాస్త సమయం కావాలని కోరినట్లు తెలిసింది. ఐపీఎస్లే ఎందుకు? రాజకీయ సంక్షోభం, సరిహద్దు, తీవ్రవాదం, ఉగ్రవాదం, తిరుగుబాటు తదితర జఠిల సమస్యలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఐపీఎస్లు రాణించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నా యి. పరిపాలనాపరంగా ఉన్న అనుభవం, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడని మనస్తత్వం, క్లిష్ట పరిస్థితుల్లో పరిస్థితులను చేయిదాటకుండా సమన్వయం చేసుకోవడంలో వీరికి అపార అనుభవం ఉంటుంది. అందుకే ఐపీఎస్లను కేంద్ర ప్రభుత్వా లు గవర్నర్లుగా నియమిస్తుంటాయి. వామపక్ష తీవ్రవాదం ఉచ్ఛస్థితిలో ఉన్న 2007లో జార్ఖండ్ గవర్నర్గా ఐపీఎస్ అధికారి ఈఎస్ఎల్ నరసింహన్ను అప్పటి యూపీఏ ప్రభుత్వం పంపింది. ఆయన గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాక అన్ని విధాలా సఫలీకృతమయ్యారు. అదే సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఆయనకు ఉమ్మడి ఏపీ బాధ్యతలను కూడా అప్పగించారు. 2014లో రాష్ట్ర విభజన నుంచి 2019 సెప్టెంబర్ వరకు ఏపీ, తెలంగాణలకు ఆయనే గవర్నర్గా విజయవంతంగా విధులు నిర్వహించారు. మరోవైపు కిరణ్బేడీ ప్రస్తుతం పుదుచ్చేరి గవర్నర్గా కొనసాగుతున్నారు. వీరిద్దరి కంటే ముందే.. 2002లో ఉమ్మడి ఏపీ నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పీఎస్ రామ్మోహన్రావు తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు దేశంలోని వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు. -
న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రాత్రి నూతన సంవత్సర స్వాగత వేడుకల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర ఐఏఎస్ అధికారులు విజయవాడలోని బెరం పార్కులో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య ఆయన ఈ వేడుకల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. -
తెలంగాణ ఐఏఎస్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
-
తెలంగాణ ఐఏఎస్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో హైకోర్టు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ గురించి వివరణ ఇచ్చే క్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేందర్ కుమార్ జోషి సహా మున్సిపల్ శాఖ కార్యదర్శి గురువారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో వారి వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివారణ చర్యలు తీసుకుంటున్నట్లయితే జనవరిలో 85గా ఉన్న డెంగీ కేసులు.. అక్టోబర్ నాటికి 3,800కి ఎలా పెరిగాయని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మూసీ నదిని ఆనుకుని ఉన్న హైకోర్టులోనే దోమలున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దోమల నివారణకై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇందులో భాగంగా దోమల నివారణకు 1000 మిషన్లు కొనుగోలు చేయాలని.. వీటికోసం ప్రభుత్వం వెంటనే నిధులను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై ప్రతి గురువారం కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించాలని తెలిపింది. ఒకవేళ డెంగీ వ్యాధి నివారణలో ప్రభుత్వం గనుక విఫలమైతే.. డెంగీ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. మూసీ నదిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సీఎస్, అధికారులకు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ మొదటి వారానికి వాయిదా వేసినట్లు పేర్కొంది. మీరు ఈ దేశ పౌరులు కాదా? డెంగీపై వివరణ ఇస్తున్న సందర్భంగా తెలంగాణ ఐఏఎస్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఐఏఎస్లను చేస్తే.. మీరు సామాన్య ప్రజలకు ఏం సేవ చేస్తున్నారని మండిపడింది. ఈ సందర్భంగా తెలంగాణ ఐఏఎస్లు ఈ దేశ పౌరులు కాదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే ఐఏఎస్లపై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పౌరులు ఎవరైనా మరణిస్తే అందుకు వారే బాధ్యత వహించాలని పేర్కొంది. అలా మరణించిన కుటుంబానికి ఐఏఎస్లు తమ సొంత అకౌంట్ నుంచి రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సీఎస్ జోషి , ఐఏఎస్లు అరవింద్ కుమార్, లోకేష్ కుమార్ , శాంత కుమారి, యోగితా రాణా సైలెంట్గా ఉండిపోయినట్లు సమాచారం. చదవండి: డెంగీకి బలవుతున్నా పట్టించుకోరా? -
తెలుగు రాష్ట్రాలకు 16 మంది కొత్త ఐఏఎస్లు
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు 16 మంది కొత్త ఐఏఎస్లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 9 మంది, తెలంగాణాకు 9 మందిని కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వూలు జారీ చేసింది. వీరంతా 2019 బ్యాచ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్లు కావడం గమనార్హం. -
‘నాయకుడు కావాలంటే కలెక్టర్ల కాలర్ పట్టుకోండి’
రాయ్పూర్: ఛత్తీస్గడ్ మంత్రి కవాసి లఖ్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నెల సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి సుక్మా జిల్లాలోని పావ్నార్ గ్రామంలో ఉన్న ఓ పాఠశాలకు ముఖ్యఅతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో సరదాగా మాట్లాడారు. ఈ క్రమంలో పాఠశాల విద్యార్థులు మంత్రిని పలు ప్రశ్నలు అడిగారు. అయితే ఓ విద్యార్థి ‘మీలాగా పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే.. ఏం చేయాలి’ అని ప్రశ్నించాడు. విద్యార్థి ప్రశ్నకు మంత్రి ఏమాత్రం తడుముకోకుండా.. ‘జిల్లా కలెక్టర్లు, ఎస్పీల చొక్కా కాలర్ పట్టుకొవాలి’ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న విద్యార్థులు నవ్వారు. అయితే రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్న కవాసి చేసిన వ్యాఖ్యలపై కలెక్టర్లు, ఎస్పీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తమను అవమానించారని విమర్శించారు. దీంతో మంత్రి స్పందించి.. ‘నేను విద్యార్థులతో సరదాగా వ్యాఖ్యానించిన మాటలు వక్రీకరించబడ్డాయని’ అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలు మిమ్మల్ని కించపరిచే విధంగా చేసినవి కాదని మంత్రి వివరణ ఇచ్చారు. మంత్రి కవాసి సుక్మా జిల్లాలోని కొంటా ప్రాంతం నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్నారన్న విషయం తెలిసిందే. -
అమరావతి అప్పులు కన్సల్టెన్సీలకు ఫలహారం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో గత సర్కారు అందినకాడికి తీసుకున్న అప్పులు నూతన ప్రభుత్వానికి పెనుభారంగా మారాయి. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోపాటు అధిక వడ్డీలతో తీసుకున్న అప్పులను కన్సల్టెంట్లు, వడ్డీల చెల్లింపుల కోసం చంద్రబాబు సర్కారు వ్యయం చేసింది. రాజధానిలో ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణాలను చేపట్టలేదు. అమరావతి బాండ్ల పేరుతో రూ.2,000 కోట్లు అధిక వడ్డీకి అప్పు తీసుకుని అనుత్పాదక కన్సల్టెన్సీలకు రూ.322 కోట్లను చెల్లించింది. విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి పట్టణాభివృద్ధి అథారిటీ నిధి కింద రూ.215 కోట్లు ఉండగా ఇందులో నుంచి రూ.22 కోట్లను కన్సల్టెన్సీలకు చెల్లించింది. రాజధానిలో సచివాలయం, రాజ్భవన్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1,500 కోట్ల నుంచి చంద్రబాబు సర్కారు రూ.329 కోట్లను వడ్డీల చెల్లింపులకు వెచ్చించడం గమనార్హం. అప్పు రూ.2,000 కోట్లు.. వడ్డీలు రూ.2,000.82 కోట్లు విదేశీ, స్వదేశీ బ్యాంకులు ఇచ్చే రుణాలను సంబంధిత ప్రాజెక్టు కోసమే వినియోగించాలి. అయితే ఇష్టానుసారంగా ఖర్చు చేసేందుకు బాండ్ల ద్వారా అప్పులు చేయాలని టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నిర్ణయించారు. దీన్ని అప్పట్లోనే పలువురు ఐఏఎస్ అధికారులు తప్పుబట్టారు. ఒకపక్క పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో జీహెచ్ఎంసీ ప్రభుత్వ గ్యారెంటీ లేకుండానే బాండ్లు జారీ చేస్తే కేవలం 9.38 శాతం వడ్డీకే అప్పులు ఇవ్వడానికి భారీగా సంస్థలు ముందుకు వచ్చాయని, కర్ణాటక కూడా 5.85 శాతానికే అప్పులు చేస్తోందని, అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తూ ఏకంగా అమరావతి బాండ్లకు 10.32 శాతం వడ్డీ చెల్లించాలని ఎలా నిర్ణయిస్తారని అభ్యంతరం తెలిపారు. బాండ్ల దళారీకి అప్పులో 0.1 శాతాన్ని ఫీజు కింద జీహెచ్ఎంసీ చెల్లిస్తుండగా, అమరావతి బాండ్ల దళారీకి మాత్రం 0.85 శాతం చెల్లించాలని నిర్ణయించడంపై కూడా విస్మయం వ్యక్తమైంది. ఇక అమరావతి బాండ్ల ద్వారా చంద్రబాబు సర్కారు ఎంత అప్పు తీసుకుందో అంతకు మించి వడ్డీలు, ఫీజుల రూపంలో చెల్లించాల్సి రావడం గమనార్హం. అమరావతి బాండ్లకు భారీ వడ్డీ, దళారీ ఫీజుతో కలిపి పదేళ్లలో రూ.2,000.82 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అప్పుల భారాన్ని తగ్గించుకుని సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగటంపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. -
ఐదేళ్లయినా అంతంతే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదేళ్లు గడిచినా రాష్ట్రాన్ని ఇంకా అఖిల భారత సర్వీసు అధికారుల కొరత వేధిస్తోంది. దీంతో ఉన్న ఐఏఎస్లకే అదనపు బాధ్యతలు అప్పగించడం లేదా నాన్ ఐఏఎస్లతో నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కీలక ప్రభుత్వ శాఖల కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో చాలా మంది రెండు, మూడు శాఖల ‘అదనపు’ బరువు బాధ్యతలతో సతమతమవుతున్నారు. తమ సొంత శాఖలో కింది స్థాయి అధికారులు, సిబ్బందికే సమయం కేటాయించలేకపోతున్నారు. అలాగే వివిధ సమస్యలతో వచ్చే ప్రజలకు సమయం కేటాయించలేకపోతున్నారు. గతేడాది జనవరిలో చివరిసారిగా భారీ స్థాయిలో ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. అప్పట్లో పలువురు ఐఏఎస్లకు కేటాయించిన అదనపు బాధ్యతలను ప్రభుత్వం ఏడాదిన్నర తర్వాత కూడా కొనసాగిస్తుండటం గమనార్హం. అవసరంకన్నా చాలా తక్కువ... రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలతోపాటు పాలనాపరంగా కలిపి మొత్తం 250 మంది వరకు ఐఏఎస్ అధికారుల అవసరం ఉంది. కానీ కేవలం 136 మంది మాత్రమే వివిధ శాఖల్లో ఉన్నతాధికారులుగా, జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి అనుమతిచ్చిన దానికన్నా ఇంకా 72 మంది తక్కువగా ఉన్నారు. ఏటా 10 మంది కంటే ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్లను కేంద్రం కేటాయించడం లేదు. ఈ విషయమై కేంద్రానికి ఎన్నిసార్లు రాష్ట్రం విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారులపై భారం... ఒకే అధికారికి కీలక బాధ్యతలను అప్పగించడంతో వారు దేనిపైనా పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. దీంతోపాటు ఆయా అధికారులపై పనిభారం పెరుగుతోంది. అన్ని శాఖల్లో రోజువారీగా క్లియర్ చేయాల్సిన ఫైళ్లతోపాటు పలు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫైళ్లు, ఆయా శాఖల్లో చేపట్టాలనుకునే కొత్త ప్రాజెక్టులు, పథకాలు, ఆయా శాఖలకు సంబంధించి కేంద్రంతో సమన్వయం లాంటివి ఐఏఎస్ అధికారులకు భారంగా మారుతోంది. రెవెన్యూశాఖకు గుండెకాయ లాంటి భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టు గత రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉంది. సీనియర్ ఐఏస్లకు అదనపు బాధ్యతగా ఈ పోస్టును ప్రభుత్వం అప్పగించగా వారు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోయారు. ఇన్చార్జి అధికారి పర్యవేక్షణలోనే భూ రికార్డుల ప్రక్షాళన లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారులు, సిబ్బందిలో అధిక శాతం మంది లంచాలు లేకుండా ఏ పనీ చేయడం లేదని ఇటీవల కాలంలో ఆరోపణలు అధికమయ్యాయి. సీసీఎల్ఏ కమిషనర్ను నియమిస్తేనే క్షేత్రస్థాయిలో రెవెన్యూశాఖ గాడినపడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాల విభజనతో మరింత కొరత... గతంలో రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరణలో భాగంగా 33 జిల్లాలకు పెంచడంతో ఐఏఎస్ల అవసరం మరింత పెరిగింది. జిల్లాలు చిన్నవి అయినప్పటికీ ఆయా జిల్లాల్లో పరిపాలనను గాడినపెట్టడంతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత వారిదే. సీనియర్ ఐఏఎస్లు అందుబాటులో లేకపోవడంతో చాలా జిల్లాల్లో జూనియర్ ఐఏఎస్లను ప్రభుత్వం కలెక్టర్లుగా నియమించి పాలనా బాధ్యతలు అప్పగించింది. కొందరు కలెక్టర్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, అవగాహనలేమితో చిన్నచిన్న విషయాలనూ సచివాలయ అధికారులకే పంపుతున్నారు. తెరపైకి తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్... ఐఏఎస్ల కొరతతోపాటు కేంద్రం కేటాయించే అధికారుల సంఖ్య కూడా తక్కువ కావడంతో సమస్యను అధిగమించేందుకు సీఎం కేసీఆర్ కొత్తగా తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్)ను ప్రతిపాదించారు. ఈ మేరకు విధివిధానాలు రూపొందించేందుకు సీనియర్ ఐఏఎస్లతో కమిటీ వేశారు. గత మూడేళ్లలో పలుమార్లు సమావేశమైన ఈ కమిటీ... ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక సమర్పించలేదు. అయితే టీఏఎస్ ప్రతిపాదనను రెవెన్యూ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో తమకు ఐఏఎస్ల పదోన్నతి అవకాశాలు గండిపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పలువురు సీనియర్ ఐఏఎస్లతోపాటు ఇటీవల ఇటీవల ఐఏఎస్లుగా కన్ఫ్ర్డ్ అయిన 10 మంది అధికారులు కొత్త పోస్టింగ్ల కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఈ జాబితాలో ఉన్నారు. -
నిరాడంబర నేత.. విలువల కలబోత
సాక్షి, అమరావతి: రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన.. పరిపాలనా పరమైన అంశాలపై నిండైన పరిజ్ఞానం.. మూర్తీభవించిన మంచితనం, నిరాడంబరత.. దేవుడు, ప్రజలపై సంపూర్ణ విశ్వాసం.. ఇచ్చిన హామీలను అమలు చేసి చూపాలన్న పట్టుదల... విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వం.. ఇవన్నీ వైఎస్ జగన్మోహన్రెడ్డిలో తాము గమనించిన లక్షణాలని పలువురు ఐఏఎస్ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ఇబ్బందులతో పాటు సాగునీటి రంగంపై జగన్కు ఉన్న అవగాహన చూస్తే ఆశ్చర్యం వేసిందని, ఎంతో అనుభవం గల నాయకుడి లక్షణాలు ఆయనలో కనిపించాయని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన తరువాత ఐదు రోజులుగా జగన్మోహన్రెడ్డిని పలువురు ఐఏఎస్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానంగా శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన వెంటనే రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధిపై జగన్లోని పట్టుదల, ఆరాటం దీన్నిబట్టి తేటతెల్లమవుతున్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రగతికి తొలి అడుగు కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉంటే ఒకరినొకరు దూషించుకోవడం, రాజకీయ విమర్శలు చేసుకోవడం తప్ప ప్రజా సంక్షేమం కోసం పరితపించిన నాయకులను తమ ఇన్నేళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదని ఐఏఎస్లు పేర్కొంటున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే ప్రధానమంత్రిని కలిసి, రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు సంప్రదింపులు జరపడం ప్రశంసనీయమని, రాష్ట్ర ప్రగతి దిశగా తొలి అడుగు పడినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి ప్రధానమంత్రికి జగన్మోహన్రెడ్డి 55 నిమిషాల పాటు వివరించారని, లోతైన అవగాహన ఉంటే తప్ప అది సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రస్తావించిన అంశాలపై ప్రధానమంత్రి స్పందించిన తీరు సైతం బాగుందని అంటున్నారు. అంతేకాకుండా ప్రధానికి వినతిపత్రం సమర్పించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)ను కూడా భాగస్వామిని చేయడం జగన్మోహన్రెడ్డిలోని ప్రత్యేకతను చాటిం దని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఏపీకి పునర్వైభవం తథ్యం ఢిల్లీ పర్యటన సందర్భంగా జగన్మోహన్రెడ్డిని ఏపీ భవన్లో రిటైర్డ్ ఐఏఎస్లతో పాటు కేంద్ర సర్వీసులో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఎలాంటి అధికార దర్పం చూపించకుండా జగన్ తమను ఆప్యాయంగా పలుకరించారని, ఆయన ఇంత నిరాడంబరంగా ఉంటా రా? అని పలువురు అధికారులు చర్చించుకోవడం గమనార్హం. ఢిల్లీలో కేంద్ర సర్వీసులో ఉన్న తమను ఏపీకి వచ్చేయాల్సిందిగా జగన్మోహన్రెడ్డి ఆహ్వా నించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర సర్వీలో ఉన్నంత కాలం రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్న పట్టుదల పెరిగిందని మరో సీనియర్ అధికారి పేర్కొన్నారు. జగన్ వ్యవహారశైలి మన రాష్ట్రానికి మేలు చేస్తుందని, రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందడానికి వీలుంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రితో భేటీ అనంతరం ఏపీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్మోహన్రెడ్డి ఎలాంటి సందేహాలకు తావులేకుండా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించారని ఐఏఎస్లు కొనియాడుతున్నారు. ఆయన వ్యవహార సరళి చూస్తే రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోందని, ఫలితంగా రాష్ట్రానికి పునర్వైభవం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవి విప్లవాత్మక చర్యలు జగన్ నిష్కల్మషంగా, ఆత్మీయంగా తమతో మాట్లాడారని పలు జిల్లాల కలెక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఏయే జిల్లాల్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారంటూ సర్వీసు వివరాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అంతేకాకుండా పాదయాత్రతో పాటు వివిధ సందర్భాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలంటూ జగన్ సూచించారని గుర్తుచేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న పట్టుదల ఆయనలో ఉందని చెబుతున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తరహాలోనే ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డికి కూడా సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి పరిజ్ఞానం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సాగునీటి రంగంలో అవినీతి చోటుచేసుకున్న టెండర్ల రద్దు, టెండర్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని జగన్ చెప్పారని, నిజంగా ఇవన్నీ విప్లవాత్మకమైన చర్యలను అధికారులు ప్రశంసిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసి, రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న తపన ఆయనలో కనిపించిందని, అంతేకాకుండా రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో ఉన్నారని పేర్కొంటున్నారు. ఎన్నికల ప్రణాళికలోని నవరత్నాలను ప్రజల వద్దకు చేర్చాలన్న తపన జగన్లో ఉందని, భిన్నమైన ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు చూస్తారని మరో సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే జగన్మోహన్రెడ్డి పరిపాలనకు సంబంధించిన అంశాలపై పట్టు సాధించారని, ఏ అధికారి సేవలను ఎక్కడ వినియోగించుకోవాలన్న దానిపై ఆయనలో స్పష్టత ఉందని తెలిపారు. పరిపాలన వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం, పారదర్శకతకు పెద్దపీట వేయడం, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండడం, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం తన ధ్యేయమన్న సంకేతాలను జగన్ ఇప్పటికే ఇచ్చారని ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు. -
చేసి చూపాలనే తపన..
-
సుపరిపాలన దిశగా..
సాక్షి, అమరావతి/గన్నవరం: ఎంతో నమ్మకంతో వైఎస్సార్ సీపీకి అఖండ మెజార్టీ అందించిన ప్రజలకు అత్యుత్తమ, ప్రజారంజక పాలన అందించడంపై కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పుడే దృష్టి సారించారు. ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులు, సుపరిపాలనకు చేపట్టాల్సిన మార్పులపై ఆయన కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకుని పరిశీలించిన వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలసి పరిస్థితిని వివరించి రాష్ట్ర ప్రగతికి చేయూత ఇవ్వాలని కోరారు. ఢిల్లీ నుంచి సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన జగన్ను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిశారు. ఈ సందర్భంగా పరిపాలనలో తేవాల్సిన సంస్కరణలపై సీనియర్ ఐఏఎస్లతో ప్రాథమికంగా సమీక్షించారు. చేసి చూపాలనే తపన.. ‘తాను కోరుకుంటున్నట్లుగా పారదర్శకత, సుపరిపాలన అందించాలంటే ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ప్రస్తుతం జగన్ అదే చేస్తున్నారు. ఏయే శాఖల్లో ఏం జరిగింది? ఏయే మార్పులు అవసరం. వాటిని చేయడానికి ఏం కావాలి? అధ్యయనం చేయడం కోసం ప్రాథమిక కసరత్తును కాబోయే ముఖ్యమంత్రి అప్పుడే ప్రారంభించారు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎవరూ ఇలాంటి కసరత్తు చేసిన దాఖలాలు లేవు. పారదర్శకపాలన అందిస్తానని చెప్పడం కాదు, చేసి చూపించాలనే తపన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు తనకోసం వచ్చిన వారిని కలుస్తూనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల ఆశలను నెరవేర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదారు రోజులు ఆయా శాఖలతో సమీక్ష, సమావేశాలు నిర్వహించి పూర్తిస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని మార్పులకు శ్రీకారం చుట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది శుభ సంకేతం...’ అని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు తెలిపారు. జగన్ను కలసిన పలువురు ఉన్నతాధికారులు వైఎస్ జగన్ను సోమవారం కలసిన వారిలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జవహర్రెడ్డి, ఎంటీ కృష్ణబాబు, ఉదయలక్ష్మి, శశిభూషణ్ కుమార్, లక్ష్మీకాంతం, సంధ్యారాణి, ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్, ప్రవీణ్ కుమార్, వరప్రసాద్, సంజయ్, కార్తికేయ మిశ్రా, మేరి ప్రశాంతి, రవిప్రకాశ్, అరుణ్ కుమార్, సత్యనారాయణ, ముత్యాల రాజు, రేఖారాణి, ఇంతియాజ్, మురళీ, ఎం.వేణుగోపాల్రెడ్డి, జి.చంద్రుడు, కె.వెంకట రమణారెడ్డి, సూర్యకుమారి, గౌతమ్ సవాంగ్, స్టీఫెన్ రవీంద్ర, త్రిపాఠి, సిద్ధార్థ కౌశల్, ప్రొటోకాల్ అధికారి అశోక్ బాబు తదితరులు ఉన్నారు. ఈ అధికారులను అడిషనల్ సెక్రటరీ ధనుంజయరెడ్డి దగ్గరుండి జగన్కు పరిచయం చేశారు. అదేవిధంగా గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్తోపాటు ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ కార్మిక విభాగం నేత గౌతమ్ రెడ్డి తదితరులు కూడా వైఎస్ జగన్ను కలిశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి గన్నవరం ఎయిర్పోర్టులో వైఎస్ జగన్కు ఘనస్వాగతం ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం గన్నవరం విమానాశ్రయంలో పలువురు అధికారులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.55కు ఇక్కడికి చేరుకున్నారు. వైఎస్ జగన్తోపాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్రెడ్డి, వల్లభనేని బాలశౌరి, నందిగం సురేశ్, మార్గాని భరత్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఉన్నారు. వైఎస్ జగన్కు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, గన్నవరం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ నేత ఉప్పాల రామ్ప్రసాద్, పలువురు అధికారులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. వీరందరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్ రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి బయలుదేరివెళ్లారు. నేడు తిరుమలకు పయనం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు. నేటి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆయన తిరుమలకు వెళ్తారు. రాత్రి ఏడు గంటలకు తిరుమలకు చేరుకుని అక్కడే బస చేసి 29 ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. కడపలో పెద్ద దర్గాను దర్శిస్తారు. తర్వాత పులివెందులకు వెళ్లి సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు. తర్వాత కడప చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. నాడు శ్రీవారి ఆశీస్సులతో పాదయాత్రకు శ్రీకారం వైఎస్ జగన్ శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ఏ కార్యక్రమమైనా చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. 2017, నవంబర్ 4న తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన తర్వాతే జగన్ నవంబర్ 6న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నుంచి ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రజాసంకల్ప యాత్ర పూర్తి చేసుకుని ఈ ఏడాది జనవరి 9న ఆయన నేరుగా ఇచ్ఛాపురం నుంచి తిరుపతికి వచ్చారు. తిరుపతి నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లి జనవరి 10న స్వామివారిని దర్శించుకున్నారు. ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేయాలని, ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని కోరనున్నారు. -
బాబు బెదిరింపులపై ఐఏఎస్ అధికారుల ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెదిరింపులపై ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. నిన్న రాత్రి విజయవాడలోని ఓ స్టార్ హోటల్లో పలు శాఖలకు చెందిన అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు.ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చంద్రబాబు బెదిరింపుల వ్యవహారంపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఈఓ గోపాల ద్వివేదీని బెదిరించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబినేట్కి రాకపోతే అధికారుల సంగతి చూస్తానన్న బాబు బెదిరింపులపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై నిరసనగా అధికారులు కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. కొద్ది రోజుల్లో మళ్లీ సమావేశమవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కేబినేట్ మీటింగ్ పెడితే కార్యాచరణ మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. -
బాబు బెదిరింపులపై ఐఏఎస్ అధికారుల ఆగ్రహం
-
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఫొని తుపాను రేపు (3న) ఒడిశాలోని గోపాల్పూర్, చాంద్బలీల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో తీవ్ర ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ఫొని తుఫానుపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి తదితర కోస్తా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నేడు, రేపు తీర ప్రాంతం వెంట గంటకు 90 నుంచి 120 కి.మీల వేగంతో బలమైన గాలులు వీయడంతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. పర్యవేక్షణకు ముగ్గురు ఐఏఎస్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను పంపుతున్నామని, అలాగే ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటి వనరులకు, విద్యుత్కు అంతరాయం కలిగితే సకాలంలో నీరందించేందుకు వీలుగా ట్యాంకర్లను, జనరేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. పునరావాస కేంద్రాల్లో కావాల్సిన సౌకర్యాలను కల్పించాలన్నారు. కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందించేందుకు కృషి చేయాలన్నారు. నిత్యావసర సరుకులను, మందులను, మంచినీటి ప్యాకెట్లను, కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఫోన్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ విద్యుత్కు అంతరాయం కలిగితే తక్షణం పునరుద్ధరించడానికి వీలుగా ప్రతి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో 500 విద్యుత్ స్తంభాలు, రెండు జేసీబీలు, ఇతర మెటీరియల్ అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డా.కేఎస్ జవహర్రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల్లవన్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి డి.వరప్రసాద్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్, ఆర్టీజీఎస్ సీఈవో బాబు సహాయక చర్యలను వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: కేంద్ర కేబినెట్ కార్యదర్శి సిన్హా ఫొని తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీ నుంచి మూడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. 3వ తేదీ సాయంత్రం 5గం.ల 35 నిమిషాల సమయంలో ఒడిశాలోని గోపాల్పూర్, చాంద్బలీ ప్రాంతాల మధ్య తుపాన్ తీరాన్ని దాటొచ్చన్నారు. దీని ప్రభావం ఒడిశా తీరంపై అధికంగా ఉంటుందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు. ఈ ప్రాంతాల్లో కచ్చా గృహాల్లో నివసించేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన పునరావాసం కల్పించాలని సీఎస్ను ఆదేశించారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామన్నారు. తుపాన్ ఎఫెక్ట్... పవర్ సెక్టార్ అలర్ట్ ‘ఫొని’ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అప్రమత్తమయింది. తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రలో, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువ చూపనుంది. దీంతో గతంలో హుద్హుద్, తిత్లీ తుపాన్లు సృష్టించిన పెనుబీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని ఈపీడీసీఎల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస, టెక్కలి, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి, వజ్రపుకొత్తూరు, కంచిలి, సంతబొమ్మాళి, పోలాకి, గార, నందిగామ మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ వల్ల తలెత్తే పరిణామాలను ఎదుర్కోడానికి ఐదు వేల మంది కార్మికులను శ్రీకాకుళం జిల్లాకు తరలించారు. అలాగే తుపానుకు విద్యుత్ స్తంభాలు కూలిపోయిన పక్షంలో వాటి స్థానంలో అమర్చడానికి 12 వేల స్తంభాలను ఆ జిల్లాకు పంపారు. వాటిని పాతడానికి అవసరమైన 30 పోల్ డ్రిల్లింగ్ మిషన్లు, 70 పవర్ రంపాలు, క్రేన్లను సిద్ధం చేశారు. తగినన్ని ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్లు (విద్యుత్ తీగలు), ఇన్సులేటర్లను అందుబాటులో ఉంచారు. ఈపీడీసీఎల్ పరిధిలోని ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల సిబ్బందిని శ్రీకాకుళం జిల్లాకు పంపారు. నాలుగు మండలాలకు ఒక చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)ను, మూడు సబ్ స్టేషన్లకు ఒక జనరల్ మేనేజర్, ఒక్కో సబ్స్టేషన్కు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఫీడర్కు ఒక ఏఈఈ చొప్పున ఇన్చార్జులను నియమించినట్టు ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ బొడ్డు శేషుకుమార్ చెప్పారు. ఈపీడీసీఎల్ సీఎండీ రాజబాపనయ్య బుధవారం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు. తుఫాన్ తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు ఆయన అక్కడే ఉండి అవసరమైన సహాయ, పునరావాస పనులను సమీక్షిస్తారు. సమాచారం కోసం శ్రీకాకుళం (94906 12633), విశాఖపట్నం (0891–2853854)కంట్రోల్ రూంలలో సంప్రదించాలని ఆపరేషన్స్ డైరెక్టర్ శేషుకుమార్ కోరారు. -
మన పాలనా వ్యవస్థకు ఏమైంది?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వ పాలనారంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గతేడాది శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లోకి ఆయా రంగాల్లో అనుభవం ఉన్న తొమ్మిది మంది అధికారులను సంయుక్త కార్యదర్శి స్థాయిలో తాత్కాలిక (మూడేళ్లు కనిష్టం, అయిదేళ్లు గరిష్టం) ప్రాతిపదికపై తీసుకుంది. వివిధ రంగాల్లో అనుభవం ఉన్న 40-45 ఏళ్ల ఐఏఎస్ యేతర అధికారుల నియామకానికి కేంద్రంలోని యూపీఎస్సీ 2018, జూన్ నెలలో దరఖాస్తులను ఆహ్వానించింది. వారిలో తొమ్మిది మందిని ఎంపిక చేసి వారికి కాంట్రాక్టు పద్ధతిపై వారిని సంయుక్త కార్యదర్శి హోదాలో నియమించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రభుత్వంలోని అన్ని రంగాల్లోకి పాలనాపరమైన అనుభవజ్ఞులైన ఐఏఎస్ యేతరులను తీసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. తద్వారా తమంత వారు లేరనే ఐఏఎస్ల అనవసరపు అహంకారాన్ని దెబ్బతీయడంతోపాటు పాలనావ్యవస్థను మెరగుపర్చవచ్చన్నది కూడా మోదీ ప్రభుత్వం ఉద్దేశం. వివిధ రాష్ట్రాల గవర్నర్ల పదవుల్లోకి ఆరెస్సెస్ నాయకులను తీసుకున్నట్లుగానే వారిని ప్రభుత్వ పాలనలోకి తీసుకోవడానికి మార్గమే ఈ కొత్త విధానమంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. వారి విమర్శల్లో నిజం ఉందా ? నిజంగానే ఐఏఎస్లకు అహంకారం పెరిగిందా ? వారి, వారి అనుభవ రాహిత్యం వల్ల దేశంలో పాలనా వ్యవస్థ కుంటుపడిందా ? బయటి నుంచి వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వారిని తీసుకున్నట్లయితే ప్రయోజనం ఉంటుందా ? ప్రస్తుతం మన పాలనా వ్యవస్థ ఎలా ఉంది ? అన్న అంశాలపై చర్చ జరుగుతుందనుకున్న తరుణంలోనే ఎన్నికలు వచ్చి పడడంతో ఈ అంశం మరుగున పడి పోయింది. భారత దేశంలో పాలనా వ్యవస్థ సవ్యంగా లేదని పౌరులెవరైనా ఒప్పుకుంటారు. కానీ అది ఆసియాలోనే అత్యంత అధ్వాన్నంగా ఉందన్న విషయం వారికి తెలియదు. ఆసియా దేశాల పాలనా వ్యవస్థలపై హాంకాంగ్కు చెందిన ‘పొలిటికల్ అండ్ ఎకనామిక్ రిస్క్ కన్సల్టెన్సీ’ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. సకాంలో పౌరులకు సరైన సేవలను అందించడంలో విఫలం అవుతుండడం వల్లనే భారత పాలనా వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. దీనికి మొట్టమొదటి కారణం ఐఏఎస్ అధికారులు చాలా తక్కువగా ఉండడం. తద్వారా సేవల్లో ఆలస్యం జరగడం, తొందరగా పనులు కావడం కోసం అవినీతిని ఆశ్రయించడం, అందుకు అధికారులు అలవాటుపడడం, రెండు ప్రధాన కారణాలయితే మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మూడో కారణం ఆయా రంగాల్లో ఐఏఎస్ అధికారులకు సరైన అనుభవం లేకపోవడం. ఒక్క చివరి కారణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే వ్యవస్థలో ఆశించిన మార్పులు అసాధ్యం. ఐఏఎస్ అధికారులు అంతగా పనికి రారనుకోవడం పొరపాటు. వారికి కూడా వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చినట్లయితే వారూ అన్ని విధాల పనికి వస్తారు. ప్రస్తుతం బిజినెస్ స్కూళ్లలో వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అలా ఐఏఎస్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇప్పించవచ్చు. ప్రస్తుతం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ అకాడమీలో ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చే సౌకర్యాలు లేవు. వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. దేశంలో నేడు మంజూరైన 20 శాతం ఐఏఎస్ పోస్టులు ఖాళీగా ఉండడానికి కారణం, వారికి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీలో వసతులు లేకపోవడమేనని కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. అలాంటప్పుడు శిక్షణా సౌకర్యాలను పెంచేందుకు కృషి చేయాలిగదా! దేశంలో ప్రస్తుతం 6,500 ఐఏఎస్ పోస్టులు ఉన్నాయి. వారందరికి ‘జనరల్ ఫిజిషియన్’లా ఒకే రకమైన శిక్షణ ఉంటోంది. ఒకప్పుడు ఏ రోగం వచ్చినా జనరల్ ఫిజిషియన్ దగ్గరకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు కాలం మారింది. సమస్యను బట్టి అంకాలజిస్ట్, కార్డియాలోజిస్ట్, పిడియాట్రిషన్ వద్దకు వెళ్తున్నాం గదా! ఐఏఎస్ల ఏకఛత్రాధిపత్యం లేకుండా చేయాలంటే దానికి సమాంతరంగా మరో అధికార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేయ అడ్మినిష్ట్రేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయవచ్చు. ఏది ఏమైన కేవలం తొమ్మిది మందిని సంయుక్త కార్యదర్శి స్థాయిలో నిపుణులను ప్రయోగాత్మకంగా తీసుకుంటే అది విజయమయిందో, విఫలమయిందో చెప్పలేం. కనీసం వంద మందిని తీసుకొని ఉంటే ఆ ప్రయోగానికి ఓ అర్థం ఉండేది. -
ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు
సాక్షి, విజయవాడ : ఎన్నికల సమయంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.ఎండి.ఇంతియాజ్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా ఐఏఎస్ అధికారులకు తెలియజేయవచ్చని చెప్పారు. విజయవాడలోని ఏపీటీడీసీకి చెందిన హరిత హోటల్లో ఐఏఎస్ అధికారులకు బస ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులు ఉంటే ప్రతి రోజు ఉదయం 10గంటల నుంచి 11 గంటల వరకు అధికారులను నేరుగా కలవవచ్చన్నారు. లేని పక్షంలో వారి వారి సెల్ఫోన్లకు కాల్ చేసి ఫిర్యాదు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. వివిధ నియోజక వర్గాల ఎన్నికల పరిశీలకుల పేర్లు, వారి ఫోన్ నంబర్ల వివరాలు మచిలీపట్నం పార్లమెంట్- గణేష్ కుమార్- జె.సి.ఛాంబర్, బందరు- 6300606742. విజయవాడ- పార్లమెంట్-పి.జవహర్- హరితహోటల్-రూమ్ నంబర్ 202- 9847794220. మైలవరం, నందిగామ, జగయ్యపేట- భన్వర్ సింగ్ సంధూ- హరితహోటల్ రూమ్ నంబర్ 201- 9676969337. తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య, విజయవాడ తూర్పు- పి. శ్రీవెంగడ ప్రియ- హరితహోటల్ రూమ్ నెంబర్ 204- 9347072208. .నూజివీడు, కైకలూరు- జయకృష్ణన్అభిర్-హరితహోటల్ రూమ్ నంబర్ 304- 7032167986 గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం- రాజేష్ కుమార్ పాండే- హరితహోటల్ నంబర్ 303-9491123246. .పెనమలూరు, పామర్రు, అవినిగడ్డ- హరితహోటల్ రూమ్ నంబర్ 101- 9347066714. -
ఆ ఐఏఎస్ జంట పెళ్లి ఖర్చు రూ.500!
సాక్షి, బెంగళూరు : వాళ్లిద్దరు ఐఏఎస్ అధికారులు. పరస్పరం ప్రేమించుకొని నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసి అప్పులపాలవుతున్న వారికి ఆదర్శంగా నిలిచి, సమాజానికి కొత్త సందేశాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ఐఏఎస్ అధికారిణి హెప్సిబారాణి ఉడుపి జిల్లా అధికారిణిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా పశ్చిమబెంగాల్కు చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి ఉజ్వల్ కుమార్ ఘోష్ బాగల్ కోట జిల్లా కృష్ణా ఎగువ ప్రాజెక్టు కమిషనర్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దలను ఒప్పించి... సోమవారం హుబ్లీలోని మినీ విధానసౌధలో బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం నూతన జంట మాట్లాడుతూ ఆడంబరంగా పెళ్లిళ్లు చేస్తూ పేద కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లికి ఎంత ఖర్చు పెట్టామనే విషయం పరిగణనలోకి రాదని, నూతన దంపతులు భవిష్యత్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా గడపడమే ముఖ్యమన్నారు. కాగా ఈ పెళ్లికి రూ.500 మాత్రమే ఖర్చు అయినట్లు వారి బంధువులు పేర్కొన్నారు. -
ఆమె బుర్రలేని కలెక్టర్ : ఎమ్మెల్యే
తిరువనంతపురం : అక్రమ నిర్మాణాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిని బుర్ర లేదంటూ సీపీఎం నాయకుడు అవమానించారు. గత శుక్రవారం జరిగిన ఈ సంఘటన విజువల్స్ ప్రస్తుతం టీవీల్లో ప్రసారం అవుతుండటంతో సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వివరాలు.. మున్నార్ హిల్ స్టేషన్లో ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న ఓ భవన నిర్మాణాన్ని అడ్డుకున్నారు సబ్ కలెక్టర్ రేణు రాజ్. ఆమె చర్యలను వ్యతిరేకించిన సీపీఎం ఎమ్మెల్యే ఎస్ రాజేంద్రన్ ఓ ప్రజా కార్యక్రమంలో సబ్ కలెక్టర్ను ఉద్దేశిస్తూ ‘ఆమెకు బ్రెయిన్ లేదు. పంచాయతి నిర్మాణ పనుల్లో ఒక కలెక్టర్ జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. ఇంత చిన్న విషయం ఆమెకు తెలియకపోవడం దారుణం. వీళ్లంతా కేవలం కలెక్టరు పోస్టోకు అర్హత సాధించే చదువులను మాత్రమే చదువుతారు. వారి బుర్ర కూడా అలానే ఉంటుంది. ప్రజస్వామ్య దేశంలో ఇలాంటి వారు ఉండటం మన ఖర్మ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ టీవీల్లో ప్రసారం కావడంతో రాజేంద్రన్ వ్యాఖ్యల పట్ల వివాదం చేలరేగుతోంది. ఈ విషయం గురించి సబ్ కలెక్టర్ రేణు మాట్లాడుతూ.. ‘అక్రమ నిర్మాణాన్ని ఆపండంటూ ఈ నెల 6న సదరు పంచాయతీ అధికారులకు మెమో కూడా జారీ చేశాం. కానీ వారు ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే వారి మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చింద’ని తెలిపారు. ఈ వివాదంలో రెవెన్యూ మినిస్టర్ చంద్రశేఖరన్ కూడా రేణుకు మద్దతు తెలిపారు. సబ్ కలెక్టర్ తీసుకున్న చర్యలు చట్టబద్దమైనవే అన్నారు. -
ఐఎస్ఎస్లు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్ఎస్) అధికారులు పరిపాలనా విభాగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య అన్నారు. ఐఎస్ఎస్ల శిక్షణ నిమిత్తం నేషనల్ స్టాటిస్టికల్ సిస్టమ్స్ ట్రయినింగ్, కేంద్ర స్టాటిస్టికల్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ సహకారంతో నిర్వహించిన ‘మిడ్ కెరీర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్’ముగింపు కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమం ఐఎస్ఎస్లకు సాధికారతను చేకూర్చి,పరిపాలనా విభాగాల్లో ఉన్నతస్థానాలకు చేరుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఐఎస్ఎస్లు నిత్యం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ కమ్యూనికేషన్ టెక్నాలజీతో అప్డేట్ కావాలన్నారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వశాఖల నుంచి ఐఎస్ఎస్లు పాల్గొన్నారు. -
జయ మరణం వెనుక ఐఏఎస్ల కుట్ర?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక ఐఏఎస్ ఉన్నతాధికారుల కుట్ర ఉందని న్యాయవాది మహ్మద్ జాఫరుల్లా ఖాన్ ఆర్ముగస్వామి కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్లను ప్రతివాదులుగా చేర్చాలన్నారు. ‘చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలితకు జరిగిన చికిత్సపై శశికళ, రామ్మోహన్రావులకు మాత్రమే పూర్తి వివరాలు తెలుసు. జయకు చికిత్సల సమయంలో సుమారు 20 కీలక ఫైళ్లపై వీరిద్దరే సంతకాలు చేశారు. అందుకే, జయకు చికిత్స మొదలుకొని మృతి వరకు వీరే కీలకం’ అని అందులో పేర్కొన్నారు. -
పెద్ద సార్ల ఆటవిడుపు
-
పెద్ద సార్ల ఆటవిడుపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా తీరిక లేకుండా గడిపిన అఖిల భారత సర్వీసుల సీనియర్ అధికారులు ఈ ఆదివారం తమ కుటుంబాలతో కండ్లకోయలో హాయిగా సేద తీరారు. గడిచిన శుక్రవారం పోలింగ్ ముగిసేదాకా సెలవులు లేకుండా విధులు నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ఈ ఆదివారం మాత్రం ఆటవిడుపుగా మారింది. అటవీ శాఖకు చెందిన కండ్లకోయ వనక్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడిపారు. నగర శివార్లలోని ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్లో వీరు ఆత్మీయంగా కలుసుకుని వన భోజనాలు చేశారు. ఆటపాటలతో సరదాగా గడుపుతున్న సీపీ అంజనీకుమార్ తదితరులు ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) మహేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి అధర్ సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, పీసీసీఎఫ్ పీకే ఝా, సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితర అధికారులు తమ కుటుంబ సభ్యులతో కలసి ఈ కార్యక్రమానికి హాజరై ఉల్లాసంగా గడిపారు. గత మూడు నెలలుగా ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా గడిపిన డీజీపీ, సీపీతో పాటు పలువురు ఇతర అధికారులు కొద్దిసేపు రాజకీయ చర్చలు, పాలనా వ్యవహారాల ముచ్చట్లను పక్కనబెట్టి గ్రామీణ క్రీడలు, ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు. -
ఊరు కాదు.. ఐఏఎస్ల కార్ఖానా
ఉత్తరప్రదేశ్లోని మారుమూల గ్రామం మేథోపట్టి. కేవలం 75 ఇళ్లు ఉండే ఈ ఊరు విద్యుత్, రోడ్లు వంటి సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉంది. అనారోగ్యంపాలైతే గ్రామస్తులు చికిత్స కోసం 10 కి.మీ దూరంలో ఉన్న ఆసుపత్రికి పరుగుతీయాల్సిందే. అదంతా నాణేనికి ఓవైపు. మరోవైపు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ పరీక్షలో ఈ గ్రామస్తులు ర్యాంకులు కొల్లగొడుతున్నారు. ఈ ఊరు నుంచి ఇప్పటిదాకా ఏకంగా 47 మంది ఐఏఎస్ అధికారులుగా ఎంపికయ్యారు. ఒకే ఇంటి నుంచి నలుగురు ఐఏఎస్ అధికారులవ్వడం విశేషం. బ్రిటిష్ ఇండియాలో 1914లో ఖాన్ బహద్దూర్ సయ్యద్ మొహమ్మద్ ముస్తఫా ఖాన్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఊరు నుంచి ఐఏఎస్ అయ్యారు. 1952లో ఇందు ప్రకాశ్ అనే వ్యక్తి ఈ ఊరి నుంచి రెండో ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి ఈ గ్రామ యువకుల జైత్రయాత్ర కొనసాగుతోంది. 1955లో మేథోపట్టి నుంచి వినయ్ కుమార్ ఐఏఎస్గా ఎంపికై బిహార్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి హోదాలో పదవీవిరమణ చేశారు. ఆయన తర్వాత ముగ్గురు తమ్ముళ్లు ఛత్రపతిపాల్, అజయ్, శశికాంత్లు ఐఏఎస్ అధికారులుగా నియమితులయ్యారు. ఈ విషయమై స్థానికంగా టీచర్గా పనిచేస్తున్న కార్తికేయ సింగ్ మాట్లాడుతూ..‘జోన్పూర్లోని డిగ్రీ కళాశాలే వీరిలో పోటీతత్వాన్ని నింపింది. ఇక్కడ సివిల్స్ కోసం కోచింగ్ తీసుకున్నవారు చాలా అరుదు. సివిల్స్ అనగానే ఇప్పుడంతా ఇంగ్లిష్ మీడియంవైపు పరుగులు పెడుతున్నారు. కానీ ఊరిలో సివిల్స్కు ఎంపికైన వారంతా హిందీ మీడియంలో చదువుకున్నవారే’ అని వెల్లడించారు. -
ఐదుగురు ఐఏఎస్ల బదిలీలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కర్నూలు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న వెంకటేశ్ను విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్గా, సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రెటరీగా వీర బ్రహ్మయ్యను, ఏపీ క్రీడాప్రాధికార సంస్థ వైస్ చైర్మన్గా ఎంవీ శేషగిరి బాబును, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈఓగా కృతిక భాత్రను, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా విధులు నిర్వహిస్తున్న పట్టన్ శెట్టి రవి సుభాష్ను కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఐదుగురికి స్థానచలనం కల్పిస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. -
తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రదీప్ చంద్రను నియమించగా, పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీగా ధర్ నియమితులయ్యారు. అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా బీఆర్ మీనా, ఐక్యాడ్ సెక్రటరీగా వికాస్రాజ్, సెర్ప్ సీఈవోగా పౌసమి బసు, కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా దేవసేనను నియమించారు. -
రాష్ట్రంలో మూడు ఈఎస్ఐ వైద్యశాలల ఏర్పాటు
మార్కాపురం(ప్రకాశం జిల్లా): త్వరలో రాష్ట్రంలో ఈఎస్ఐ వైద్యశాలలను విజయనగరం, గుంటూరు, కాకినాడల్లో ఏర్పాటు చేస్తున్నామని ఈఎస్ఐ వైద్యశాలల జాయింట్ డైరెక్టర్ జి.రవికుమార్ తెలిపారు. స్థానిక ఈఎస్ఐ వైద్యశాలను మంగళవారం తనిఖీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. విజయనగరంలో 200 పడకలు, కాకినాడ, గుంటూరుల్లో వంద పడకల వైద్యశాలలు కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఏపీలో 75 ఈఎస్ఐ వైద్యశాలలున్నాయని, వీటిల్లో 50 వైద్యశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, రెవెన్యూ అధికారులు స్థలాలు కేటాయిస్తే వెంటనే భవనాలు నిర్మించుకుంటామని చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో డయాగ్నోసిస్ సెంటర్లు ఉన్నాయని, 10 పడకలు మాత్రమే ఇక్కడ ఉంటాయన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిలలో ప్రాంతీయ వైద్యశాలలు ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 10 మంది సభ్యులకు గాను ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉంటారని తెలిపారు.