Kanakadurga Temple
-
విజయవాడ : ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి.. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భవానీలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆరోరోజు దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఇక, నేడు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి దర్శనాలు మొదలయ్యాయి. కాగా, ఇంద్రకీలాదిపై వినాయకుడి గుడి నుంచి కొండపై వరకూ భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా వేశారు. క్యూలైన్లు నిండిపోవడంతో వీఎంసీ వద్ద కంపార్ట్మెంట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఇంద్రకీలాద్రికి రానున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం జగన్.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక, మూలనక్షత్రం సందర్బంగా విశాఖలోని శారదాపీఠంలో అక్షరాభ్యాసాలు జరుగనున్నాయి. రాజశ్యామల అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు. దేవాలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. మరోవైపు, తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఆరోరోజు తిరుమల శ్రీవారు.. హనుమంత వాహనంపై దర్శనమివ్వనున్నారు. అలాగే, రాత్రి గజవాహనంలో దర్శనమిస్తారు. ఇక, గురువారం గరుడోత్సవం సందర్భంగా రెండు లక్షలకు పైగా మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. గరుడోత్సవం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,757 కాగా, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,395గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్లు. ఇది కూడా చదవండి: వరుసగా మూడో ఏడాదీ వైఎస్సార్ అవార్డులు -
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ దంపతులు
Updates.. ►ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ►పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఈవో కె.ఎస్.రామారావు, ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, వైదిక కమిటీ సభ్యులు. ►అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు ►అంతరాలయంలో ప్రత్యేక పూజలు జరిపిన గవర్నర్ దంపతులు ►అమ్మవారి దర్శనానంతరం వేదాశీర్వచనం అందజేసిన వేద పండితులు ►అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం అందించిన ఈవో,ఛైర్మన్ ►దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ►ఆదివారం కావడంతో తొలిరోజే పెరిగిన భక్తులు ►8:30 గంటలకు అమ్మవారిని దర్శించుకోనున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ►స్నపనాభిషేకం అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులకు మొదలైన దర్శనాలు ►శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం నుంచి దేవీ శరన్నవరాత్రులు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ►తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ►భక్తుల రద్దీని అంచనా వేసేందుకు పోలీస్, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం నిరంతరం ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసింది. ►భక్తుల కోసం శనివారం నాటికి మూడు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం సాయంత్రం పరిశీలించారు. ►భక్తుల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేలా చూడాలని ఆలయ ఈవో కెఎస్ రామారావు, ఫెస్టివల్ ఆఫీసర్ ఆజాద్కు పలు సూచనలు చేశారు. -
Vijayawada : ఇంద్రకీలాద్రిపై శ్రావణమాస శోభ (ఫొటోలు
-
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓ భక్తురాలి అత్యుత్సాహం
సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో ఓ భక్తురాలు అత్యుత్సాహం చూపారు. అమ్మవారి మూల విరాట్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వెంటనే దుర్గగుడి ఈవో భ్రమరాంబ విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సిబ్బంది సీసీ కెమెరాలు పరిశీలించి శాంతి కుమారి అనే భక్తురాలు వీడియో తీసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్సీపీ) -
బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్
సాక్షి, విజయవాడ: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు అందజేశారు. ఈ సందర్బంగా వై.వి. సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈవో భ్రమరాంబ, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. కాగా, దసరా ఉత్సవాల్లో టీటీడీ దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అనంతరం.. మహిషాసురమర్ధిని అలంకారంలో ఉన్న దుర్గమ్మను వారు దర్శించుకున్నారు. ఇక, దర్శనానంతరం వేద పండితులు దంపతులిద్దరికీ వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబ.. సుబ్బారెడ్డి దంపతులకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. దర్శనం అనంతరం వై.వి. సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. టీటీడీ తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి బ్రహ్మోత్సవాల కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాము. దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కూడా చక్కని ఏర్పాట్లు చేశారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని రెండున్నర లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. సీఎం జగన్ పాలనలో సకాలంలో వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించాను’ అని తెలిపారు. -
లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం లలితా త్రిపుర సుందరీదేవిగా కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వడం, ఆదివారం సెలవురోజు కావడంతో సాయంత్రానికి 50 వేల మందికిపైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సాయంత్రం వేళ కృష్ణమ్మ అందాలను తనివితీరా ఆస్వాదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ ఘనంగా నగరోత్సవం జరిగింది. లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారిని హోం మంత్రి మేకతోటి సుచరిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు దర్శించుకున్నారు. కాగా, మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లు అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
దసరా నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
-
దుర్గమ్మ సన్నిధిలో పీవీ సింధు
సాక్షి, విజయవాడ: టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింధును, ఆమె కుటుంబసభ్యులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ భ్రమరాంబ అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సింధు మీడియాతో మాట్లాడింది. అమ్మవారి దర్శనానికి రావడం సంతోషంగా ఉందని తెలిపింది. ‘ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉన్నాయి. 2024లో కూడా ఒలింపిక్స్లో ఆడాలి.. ఈసారి స్వర్ణం సాధించాలి’ అని పేర్కొంది. -
శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే
సాక్షి, విజయవాడ : శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ భక్తులకు స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై.. కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు. ఇలా నవరాత్రుల్లో కనకదుర్గమ్మ అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. అవేంటంటే... రెండో రోజు.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రెండవరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు. చదవండి: కోవిడ్ నియమాలతో దసరా ఉత్సవాలు.. మూడో రోజు.. దుర్గగుడిలో మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీమంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. చదవండి: అమ్మవారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు నాలుగో రోజు.. దసరా వేడుకల్లో అమ్మవారు నాలుగో రోజున శ్రీ లలితా త్రిపురసందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా... చిరుమందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చదవండి: స్వర్ణకవచాలంకృత రూపంలో దుర్గాదేవి అయిదవ రోజు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో అయిదో రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి విశేష పుణ్యదినాలుగా అమ్మవారి ఆరాదనలు ముమ్మరమవుతాయి. ఆరవ రోజు.. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఉత్సవాలు ప్రారంభమైన ఆరో రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం. ఏడోరోజు.. ఉత్సవాల్లో ఏడో రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్ట సంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎనిమిదవ రోజు.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వకంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. తొమ్మిదవ రోజు.. దసరా నవరాత్రి వేడుకల ముగింపు నాడు విజయదశమి రోజున అమ్మవారు రెండు అవతారాలలో దర్శనం దర్శనమివ్వనున్నారు. దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని రూపంలో తొమ్మిదో రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే... భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి. ఆఖరి అవతారంగా శ్రీ రాజరాజేశ్వరీ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపంను దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. -
దుర్గాగుడి పాలకమండలి నిర్ణయాలు
-
‘ఆలయాలపై దాడులకు పాల్పడే వారిని వదలం’
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రి దుర్గగుడి రథంలోని వెండి సింహాలు చోరీ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. రథం పక్కన పెట్టి ఏడాది పైనే కావస్తుందని, చోరీ ఎప్పుడు జరిగిందో విచారణలో తెలాల్సి ఉందన్నారు. సీపీ మాట్లాడుతూ.. ఆలయాలు, ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఇంటి దొంగల పనా లేక ప్రొఫెషనల్స్ చేశారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నగరంలో 1,500 పైగా దేవాలయాలు ఉన్నట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు. 215 దేవాలయాలకు మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీ కెమెరాలు లేని ఆలయాల్లో ఆలయ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. (రథంపై సింహాలు మాయం.. పోలీసులకు ఫిర్యాదు) ‘కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. పీస్ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ప్రతి ఆలయంలో పెట్టుకోవాలని సూచించాం. అంతర్వేది ఘటన తరువాత వివిధ ఆలయాలపై దాడులు జరిగాయి. వాటన్నిటిపై విడివిడిగా విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం వాస్తవాలు బయటకు వస్తాయి. ఆలయాలపై దాడులకు పాల్పడే వారిని ఎవరినీ వదలం. ఆలయాల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్థుల కదలిక పైనా నిఘా పెట్టాం’ అని కమిషనర్ పేర్కొన్నారు. (సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం) -
‘గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదు’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి రథం మీద ఉన్న మూడు వెండి సింహాలు మాయమైన విషయంపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ ఈవో సురేష్ బాబు.. గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 17 నెలల తర్వాత ఇంజనీరింగ్ పనులు నిమిత్తం పరిశీలిస్తే సింహాలు మాయమైనట్లు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు సింహాలు అపహారణ మాయంపై విచారణ ప్రారంభించారు. (‘హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది’) వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని ఇంద్రకీలాద్రి ఆయల ఛైర్మన్ సోమినాయుడు తెలిపారు. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఘాట్రోడ్లో ఉన్న రథాన్ని జమ్మిదిడ్డి లో పెట్టినట్లు, ఆ తరవాత మహామండపం దగ్గరకు తీసుకొచ్చి పెట్టారని గుర్తుచేశారు. 2019 లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉగాదికి వాడిన తర్వాత కరోనా వలన వాడలేదని స్పష్టం చేశారు. అప్పుడు ఏ రకంగా వాడిన తరవాత పట్టా కట్టి ఉంచారో ఇప్పటికి అలాగే ఉంచామన్నారు. నిన్న(బుధవారం) కనపడని సింహాలు స్టోర్ట్రూమ్లో ఉన్నాయో లేవో అని గుడి తాలూకా అధికారులు అందరూ తనిఖీ చేసినట్లు వెల్లడించారు. అయితే ఆ సింహాలు స్టోర్రూమ్లో లేవన్నారు. పోయిన సింహాలను తయారు చేసి ఆ రథానికి అమర్చే ప్రక్రియను బుధవారమే ప్రారంభించమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సెక్యురిటి అధికారులు ఇప్పుడు వచ్చిన మాక్స్ సెక్యురిటి వాళ్ళకి ఆ సింహాలు అప్పజెప్పలేదని తెలిపారు. ఈ రోజు సింహాలు కనపడకుండా పోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆయల ఛైర్మన్ సోమినాయుడు మాట్లాడుతూ.. ‘పోయిన సింహాలు ఏరకంగా పోయాయి అని పోలీసులను దర్యాప్తు చేయాలి అని కోరాం. హిందువుల మనోభావాలు కాపాడేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని మాట్లాడారు. గత టీడీపీ-బీజేపీ హయాంలో దేవాలయంలో క్షుద్రపూజలు జరిగినప్పుడు అప్పటి మీ దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేశారా?. గత టీడీపీ హయాంలో సుమారు 40 దేవాలయాలు కులగొట్టినప్పుడు ఆ రోజు జనసేన నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు. ఒక ఎమ్మెల్సీ మాట్లాడేటప్పుడు మర్యాద కూడా లేకుండా మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు బుద్ధ వెంకన్న. విచారణలో దోషులు తేలితే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాము. గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో తప్పులు జరిగాయి అప్పుడు ఎన్ని సారులు మీ మంత్రులతో రాజీనామా చేయించావు చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని వదంతులు చేసిన ప్రజలకు సీఎం వైఎస్ జనగ్పై అపార నమ్మకం ఉంది.’ అన్నారు. 2018 తరవాత ఇంద్రకీలాద్రి రథాన్ని తీయలేదని దుర్గగుడి ఈవో సురేష్బాబు పేర్కొన్నారు. ‘స్టోర్ రూమ్ తాళాలు నా దగ్గర ఉండవు. అక్కడ లేవు కాబట్టి స్టోర్ రూమ్లో సింహాలు ఉంటాయి అనే ఉద్దేశంతో నిన్న పరిశీలించాము. కానీ అక్కడ సింహాలు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశాము.’ అన్నారు. -
రేపటి నుంచి భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం
-
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనం నిలిపివేత
సాక్షి, విజయవాడ: కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తున్నందున నేడు సాయంత్రం నుంచి బెజవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు ప్రకటించారు. అయితే అమ్మవారికి ప్రతిరోజూ పూజాకార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేటి నుంచి ఘాట్లో వాహనాలు నిలిపివేస్తున్నామని వెల్లడించారు. తిరిగి అమ్మవారి దర్శనం ఎప్పుడు ఉంటుందనేది తర్వాత చెప్తామని తెలిపారు. (శ్రీవారి ఆలయంలో 128 ఏళ్ల తర్వాత నిలిచిపోనున్న దర్శనం) అప్పటివరకు భక్తులు గుడికి రావద్దని విఙ్ఞప్తి చేశారు. వీఐపీ దర్శనాలను కూడా అనుమతించమని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సిబ్బంది ఎప్పటిలాగే తమ విధులు నిర్వహిస్తారని పైలా సోమినాయుడు పేర్కొన్నారు. కాగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి పలు ఆలయాలు భక్తులకు దర్శనాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. (అమ్మవారి గుడిలో మార్చి 31 వరకు సేవలు నిలిపివేత) -
కనకదుర్గమ్మను దర్శించుకున్న నమ్రత
-
దుర్గమ్మను దర్శించుకున్న నమ్రత
సాక్షి, విజయవాడ : ప్రముఖ నటుడు మహేశ్బాబు సతీమణి నమ్రత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నమ్రత వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు. అలాగే ఆలయ ఈవో చేతుల మీదుగా నమ్రతకు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. వైఎస్ భారతిరెడ్డిని కలిసిన నమ్రతా శిరోద్కర్ అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతిరెడ్డిని..నమ్రతా శిరోద్కర్ మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా బుర్రిపాలెం గ్రామ అభివృద్ధి పనులపై నమత్ర చర్చించారు. కాగా హీరో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పుట్టిన ఊరైన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామమ్ ఫౌండేషన్ ద్వారా బుర్రిపాలెంలో అభివృద్ధి పనులు మహేష్ బాబు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఏపీ ప్రభుత్వంతో కలిసి గ్రామం ఫౌండేషన్ ద్వారా గ్రామాభివృద్ధి కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నమత్ర ఈ సందర్భంగా తెలిపారు. -
అమ్మ గుడిలో అన్నీ..అవకతవకలే
సాక్షి, అమరావతి: ఎలాంటి అనుమతులు లేకుండానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నియమించారు. కాంట్రాక్ట్ కార్మికుల నియామకంలోనూ ఇదే పరిస్థితి. ప్రసాదాల పేరిట రూ.కోట్లు దుర్వినియోగమయ్యాయి. చివరకు అమ్మవారికి భక్తులు సమర్పించే చీరల విషయంలోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయి. బెజవాడ కనకదుర్గ ఆలయ వ్యవహారాలపై దేవదాయ శాఖ కమిషనర్ పద్మ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని అంశాలివి. తెలుగుదేశం పార్టీ హయాంలో.. గడచిన ఏడాది కాలంలో విజయవాడ దుర్గ గుడిలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆ నివేదికలో స్పష్టం చేశారు. ఒక పోస్టులో ఉండే అధికారి బదిలీపై వెళ్లి.. మరొకరు ఆ స్థానంలోకి వచ్చినప్పుడు కొత్తగా ఆ బాధ్యతలు చేపట్టిన అధికారి అక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారికి నివేదిక ఇవ్వడం అనవాయితీ. 2018 ఆగస్టు 16వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 22 వరకు దుర్గ గుడి ఈవోగా పనిచేసిన ఐఆర్ఎస్ అధికారి వి.కోటేశ్వరమ్మ స్థానంలో ఆ బాధ్యతలు చేపట్టిన దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ సురేష్ తాను బాధ్యతలు చేపట్టిన సమయంలో గుర్తించిన లోపాలు, అవకతవకలపై దేవదాయ శాఖ కమిషనర్కు సమాచారమిచ్చారు. కమిషనర్ వాటన్నింటినీ ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపుతూ.. చర్యలు తీసుకోవడానికి తగిన సూచనలు చేయాలని కోరారు. నివేదికలో పేర్కొన్న అవకతవకల వివరాలివీ.. ►2018 దసరా ఉత్సవాల నాటినుంచి 2019 సెప్టెంబర్ వరకు ఆలయంలో అప్పాలు ప్రసాదం ఉచితంగా పంపిణీ చేసినందుకు రూ.1.21 కోట్లు ఖర్చు పెట్టినట్లు చూపించారు. అయితే, ఆలయంలో అప్పాలు ప్రసాదం పంపిణీకి ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. ►రికార్డుల్లో పేర్కొన్న చీరల ధరలకు, గోడౌన్లలో ఉంచిన చీరల ధరలకు మధ్య చాలా తేడాలున్నాయి. అమ్మవారి చీరల విషయంలోనే ఆ ఏడాది కాలంలో రూ.9,50,218 మేర అక్రమాలు చోటు చేసుకున్నాయి. ►గతంలో భక్తులు సమర్పించే చీరల వ్యవహారాలన్నీ ఆలయ రెగ్యులర్ ఉద్యోగుల పర్యవేక్షణలో ఉండేవి. టీడీపీ సర్కారు హయాంలో ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే అమ్మవారి చీరల పర్యవేక్షణను ఒక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి కనీసం ప్రభుత్వ అనుమతి కూడా లేదు. ఈవో కోటేశ్వరమ్మ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఒక జూనియర్ అసిస్టెంట్ ద్వారానే 14 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీతాల చెల్లింపులు చేశారు. ►ఆలయ అధీనంలో ఉండే వేద పాఠశాల, ప్రసాదం స్టోర్, గుడిలో పని చేసే క్లర్కులు, సెక్యూరిటీ గార్డులు కలిపి 21 మంది సిబ్బందిని ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. ►గర్భగుడిలో అమ్మవారి అలంకారం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో చేయాలి. టీడీపీ హయాంలో.. కోటేశ్వరమ్మ ఈవోగా పనిచేసిన కాలంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అమ్మవారి అలంకారం కోసమంటూ కన్సాలిడేట్ పే కింద ఒక వ్యక్తిని నియమించారు. దీనివల్ల గర్భాలయంలోకి బయటి వ్యక్తుల ప్రవేశానికి వీలు కలిగినట్టయ్యిందని దేవదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. ►ఆలయ ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఆలయానికి వివిధ వ్యక్తులు చెల్లించాల్సిన బిల్లులు రూ.6.65 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు కమిషనర్ తన నివేదికలో వెల్లడించారు. -
ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు
-
దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు
-
దుర్గమ్మ ప్రసాదిట్టం
విజయవాడ కనకదుర్గ దేవాలయంలో దేవీ నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర తీరాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అమ్మను దర్శించుకుని ప్రసాదం సేవిస్తేనే కాని తృప్తి చెందరు భక్తులు. అంతేనా! పులిహోర, లడ్డు ప్రసాదం తినకుండా లేదా కొనకుండా వెళ్లరు. అమ్మవారి మీదే కాదు, అమ్మవారి ప్రసాదం మీద కూడా భక్తి ఎక్కువే. ఈ ప్రసాదం స్వీకరిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అమ్మవారి ప్రసాదాలను ‘దిట్టం’ ప్రకారమే అంటే కొలతల ప్రకారంగానే చాలా సంవత్సరాలుగా తయారు చేస్తున్నారు. ప్రసాదాలకు పెరుగుతున్న ఆదరణతో ప్రసాదం తయారీలో చిన్న చిన్న మార్పులూ వస్తున్నాయి. వాటిల్లో భాగంగానే లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి తయారు చేయడానికి దేవస్థానం వారు రకరకాల కొలతలతో వంటవారికి రకరకాల ‘దిట్టం’ అందచేశారు. ఆ దిట్టం ప్రకారం ప్రసాదాలు తయారు చేసి, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు రుచి చూపించి, వారి సలహాలు తీసుకున్నారు. అందరి దగ్గర నుంచి వచ్చిన సూచనల మేరకు కొత్త ‘దిట్టం’ అనుసరిస్తున్నారు. కొత్త కొలతలు ఎండోమెంట్స్ కమిషనర్ కొత్తగా స్థిరపరచిన దిట్టం ప్రకారం 516 లడ్లు తయారు చేయడానికి (ఒక్కో లడ్డు బరువు 80 గ్రా.) ఆరు కేజీల నెయ్యి, పది కేజీల సెనగ పిండి, 20 కేజీల పంచదార, 750 గ్రా. జీడిపప్పు, అర కేజీ కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష, 75 గ్రా. ఏలకులు, 15 గ్రా. జాజికాయ, 15 గ్రా. పచ్చ కర్పూరం ఉపయోగిస్తున్నారు. పులిహోరకు సంబంధించి స్థిరపరచిన దిట్టం ప్రకారం పది కిలోల బియ్యం, అర కేజీ సెనగ పప్పు, అర కేజీ చింతపండు, 200 గ్రా. ఎండు మిర్చి, 15 కేజీల నూనె, 60 గ్రా. బెల్లం ఉపయోగించి 230 ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్టు బరువు 150 గ్రా.) తయారు చేస్తున్నారు. లడ్లు సులువుగా తయారు చేయడానికి కూడా దేవస్థానం చిన్న చిన్న మార్పులు చేసింది. గతంలో ఒక కడాయిలో 730 లడ్డూలు తయారుచేసేవారు. ఇప్పుడు 516 లడ్లు మాత్రమే తయారు చేస్తున్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీమహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం సాయంత్రం 6.05 గంటలకు సంప్రదాయ దుస్తుల్లో ఇంద్రకీలాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రికి దుర్గగుడి ఈవో ఎం.వీ.సురేష్, ప్రధాన అర్చకులు ఎల్.డీ ప్రసాద్, స్థానాచార్య వి.శివప్రసాద్శర్మ తదితరులు పూర్ణకుంభంతో, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పట్టుచీర తదితరాలతో కూడిన వెండి పళ్లెంను ముఖ్యమంత్రి జగన్ తన శిరస్సుపై ఉంచుకుని దుర్గమ్మ సన్నిధికి చేరుకుని వాటిని అమ్మవారికి సమర్పించారు. జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ సీఎం పేరిట అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి ఈవో శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందచేశారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందచేశారు. సీఎం వెంట దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యేలు తదితరులున్నారు. అమ్మవారిని సీఎం జగన్ దర్శించుకునే సమయంలో సాధారణ, రూ.100 టికెట్ క్యూలైన్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీమహాలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారు.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఐశ్వర్యప్రాప్తి, విజయాన్ని అందించే శ్రీమహాలక్షి్మని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. -
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి అలకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం వైఎస్ జగన్ వెంట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. అంతకుమందు ప్రకాశం బ్యారేజ్ మీదుగా దుర్గగుడికి చేరకున్న సీఎం వైఎస్ జగన్ను.. అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయంలోకి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ, రూ. 100 టికెట్ క్యూలైన్లలోని భక్తులు యథావిధిగా అమ్మవారిని దర్శించుకునే సౌకర్యం కల్పించారు. వీఐపీ క్యూలైన్లను మాత్రం కొద్దిసేపు నిలిపివేశారు. కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ : (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
క్యూలైన్లో దుర్గమ్మ భక్తురాలి నగలు చోరీ
సాక్షి, విజయవాడ : దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులనే లక్ష్యంగా చేసుకుని వారి దగ్గర ఉండే బంగారు నగలు, నగదు చోరీకి కొందరు పాల్పడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై ఆదివారం ఉదయం నుంచి భక్తుల రద్దీ ఏర్పడింది. రద్దీ అధికంగా ఉండటంతో అమ్మవారి దర్శనం ఆలస్యం అవుతుంది. దీంతో క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న దొంగలు భక్తుల బంగారు వస్తువులతో పాటు నగదును చాకచక్యంగా తస్కరిస్తున్నారు. ఆదివారం రాయగడ నుంచి విచ్చేసిన మాధురి అనే భక్తురాలి హ్యాండ్ బ్యాగ్లో భద్రపరిచిన 22 గ్రాముల బంగారపు నెక్లెస్తో పాటు రెండు చిన్న సైజు ఉంగరాలు అపహరణకు గురయ్యాయి. మహా మండపం దిగువన బ్యాగ్లను తనిఖీ చేసే సమయంలో వస్తువులను భద్రపరిచిన బాక్స్ ఉందని, క్యూలైన్లోకి వచ్చిన తర్వాత అది మాయమైనట్లు గుర్తించింది. దీంతో ఆలయ ప్రాంగణంలోని పోలీస్ ఔట్ పోస్టుకు వెళ్లి నగల చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే మరో ఇద్దరు భక్తులు తమ జేబులోని పర్సులు మాయం అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం, పండుగలు, సెలవు దినాల్లో రద్దీ సమయంలో ఇటువంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. -
కనకదుర్గమ్మ దుర్గ గుడిలో వైఎస్ జగన్ పూజలు
-
వైఎస్ జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దుర్గ గుడి ఈవో, ఆర్చకులు
-
దుర్గమ్మ సన్నిధిలో వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: కొలిచెడి వారికి కొంగు బంగారంగా భావించే బెజవాడ కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో కోటేశ్వరమ్మతో పాటు వేదపండితులు జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనతో పాటు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పొట్లూరి వరప్రసాద్ తదితరులు ఉన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం జగన్ గవర్నర్ను కలిశారు. ఆ తర్వాత తాడేపల్లి బయల్దేరి వెళ్లారు. గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో ఆంధ్రప్రదేశ్ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడ గేట్ వే హోటల్లో ఉన్న గవర్నర్ను ఇవాళ సాయంత్రం కలిశారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్ అనంతరం కడప పెద్దదర్గాలో, సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి మహానేత ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడ నుంచి నేరుగా బెజవాడ దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కనకదుర్గమ్మ దుర్గ గుడిలో వైఎస్ జగన్ పూజలు -
స్త్రీలోక సంచారం
‘ఇప్పుడే వస్తాను బిడ్డను పట్టుకో’ అని చెప్పిన వెళ్లిన తల్లి మళ్లీ తిరిగి రాలేదు. బిడ్డ ఏడుస్తోంది. బిడ్డను ఎత్తుకున్న ఆ మగ మనిషికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇంటికి తీసుకెళ్లాడు. ప్యాకెట్ పాలు పట్టబోయాడు. పాప తాగలేదు. దగ్గరల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో పాపను అప్పగించి తనూ వెళ్లిపోయాడు. పాప ఏడుపు ఆపడం లేదు. డ్యూటీలో ఉన్న కాదిస్టేబుల్కు ఏం చేయాలో తోచలేదు. ఇంటికి ఫోన్ చేశాడు. ‘పాల కోసం ఏడుస్తున్నట్లుంది. ఇంటికి తీసుకురండి’ అంది ఆయన భార్య. ‘ఆ పాపను మనమే మన సొంత కూతురిలా పెంచుకుందాం’ అని కూడా చెప్పింది. అప్పటికే ఆ దంపతులకు ఒక మగబిడ్డ. ‘‘అలా చేయలేం’’ అని చెప్పాడు. వెంటనే ఆమె తన బిడ్డను చంకనేసుకుని భర్త పని చేస్తున్న పోలీస్స్టేషన్కు వచ్చింది. చంకలోని బిడ్డను భర్తకు ఇచ్చి, స్టేషన్లో ఉన్న బిడ్డను చంకేసుకుని తన పాలు పట్టించింది. కడుపులో పాలు పడగానే పాప ఏడుపు మానింది. పాలు పట్టిన ఆ తల్లి కూడా కాన్స్టేబులే! పాప తల్లి చిత్తుకాగితాలు ఏరుకునే మనిషి అని పాపను పోలీస్స్టేషన్లో ఇచ్చి వెళ్లినతను చెప్పినదాన్ని బట్టి తెలుస్తోంది. పోషణలేక పాప బలహీనంగా ఉంది. ఆ పసికందుకు ఒక సురక్షితమైన ఆశ్రయం కల్పించే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడా కానిస్టేబుల్ దంపతులు. ఈ సంఘటన ఏడాది చివరి రోజు హైదరాబాద్లో జరిగింది. కేరళ ప్రభుత్వం జనవరి 1 సాయంత్రం తలపెట్టిన 630 కిలోమీటర్ల పొడవైన ‘మహిళాహారం’ (వనితామతిల్) విజయవంతం అయింది. ఉత్తర కేరళలోని కాసర్గడ్ జిల్లా నుంచి దక్షిణ కేరళలోని తిరువనంతపురం వరకు జాతీయ రహదారి వెంబడి దాదాపు 20 లక్షల మంది మహిళలు చేయీచేయి కలిపి మహిళాహారాన్ని నిర్మించారు. ‘‘లైంగిక సమానత్వ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యకర్తలంతా మద్దతు ఇస్తున్నట్లు ప్రముఖ నటి, యాక్టివిస్టు మాలా పార్వతి తెలిపారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో జనవరి 1 నుంచి వస్త్రధారణ నిబంధన అమల్లోకి వచ్చింది. ప్రధానంగా మహిళా భక్తుల కోసం ఉద్దేశించిన ఈ నిబంధన ప్రకారం దర్శనానికి, ఆర్జిత సేవలకు వచ్చేవారు చీర, లెహంగా వంటి సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించవలసి ఉంటుంది. ఆలయ పవిత్రతను, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాల కార్యనిర్వాహక అధికారి కోటేశ్వరమ్మ తెలిపారు. అయితే ఈ నిబంధన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉందని ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్’ ఎ.పి. శాఖ కార్యదర్శి పి.దుర్గాభవాని వ్యాఖ్యానించారు. -
భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
-
ఈవో Vs చైర్మన్!
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయమైన దుర్గగుడిలో అధికారవర్గం.. పాలకవర్గం విభేదాలపై పెడుతున్న శ్రద్ధ.. భక్తులకు మెరుగైన సేవలు అందించే అంశంపై పెట్టలేకపోతున్నారనేది అమ్మ భక్తులకు అర్థమవుతున్న విషయం. భక్తులు మెచ్చేలా.. అందరికీ నచ్చేలా నిర్ణయాలతో ముందడుగువేయాల్సిన తరుణంలో ఆధిపత్య పోరు ఆందోళన కలిగిస్తోంది. కనకదుర్గమ్మ ఆలయ అధికారవర్గం.. పాలకవర్గం మధ్య విభేదాలు పాలక మండలి సమావేశం సాక్షిగా మరోమారు బహిర్గతమయ్యాయి. ఎడముఖం.. పెడముఖంగా ఈవో, చైర్మన్ వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించి ఎవరి ధోరణిలో వారు మాట్లాడటం భక్తులను విస్మయపరుస్తోంది. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమం) : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈఓ, పాలక మండలి చైర్మన్ మధ్య విభేదాలు మరోమారు బయటపడ్డాయి. దుర్గగుడి పాలక మండలి సమావేశం శనివారం దేవస్థానానికి చెందిన మాడపాటి సత్రంలోని బోర్డు మీటింగ్ హాల్లో జరిగింది. చైర్మన్ గౌరంగబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈఓ వి.కోటేశ్వరమ్మ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఈఓ కోటేశ్వరమ్మ మాత్రమే మీడియాతో ప్రసంగించి ముగించారు. దుర్గగుడిలో దసరా ఉత్సవాల తర్వాత నలుగురు సిబ్బందిపై వేటు వేయడంపై పాలక మండలి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే ఉద్యోగుల వ్యవహారం దేవస్థాన అడ్మినిస్ట్రేషన్కు చెందిందని ఈఓ సర్ది చెప్పారు. ఈ విషయంలో పాలక వర్గం ఆగ్రహంగా ఉంది. పాలక వర్గ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల గురించి ఈఓ మీడియాకు వివరించి సమావేశాన్ని హడావుడిగా ముగించేశారు. అయితే సమావేశం గురించి, ఉద్యోగులపై వేటు వ్యవçహారం గురించి చైర్మన్ను వివరణ కోరగా, ఆయన మరోమారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పాలక వర్గం, ఈఓ మధ్య చోటు చేసుకున్న విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనేది అర్థమవుతోంది. దత్తత ఆలయాల నిర్వహణపై దృష్టి : ఈఓ దుర్గగుడి దత్తత ఆలయాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించామని ఆలయ ఈఓ వి.కోటేశ్వరమ్మ విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్ని దత్తత ఆలయాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేందుకు పాలక మండలి ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. అన్ని దత్తత ఆలయాల్లో దుర్గగుడి దేవస్థానం సిబ్బందిని నియమించాలని నిర్ణయించామన్నారు. ఇటీవల ఓ ఆలయాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో గర్భగుడిని అపరిశుభ్రంగా ఉంచడమే కాకుండా ధూపదీప నైవేద్యాలను సరిగా నిర్వహించడం లేదని గుర్తించి అర్చకుడిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీంతో ఆ ఆర్చకుడు ఈఓ, ఏఈఓతో పాటు వైదిక కమిటీపై సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేశామని వివరించారు. దుర్గాఘాట్లో పూజా సామగ్రి విక్రయించే చిరు వ్యాపారుల లైసెన్సులు రెన్యువల్ చేయాలని నిర్ణయించామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం దుర్గాఘాట్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. భవానీ దీక్ష విరమణ మహోత్సవాలకు అవసరమైన ఇంజినీరింగ్ పనులకు ఆమోదం తెలిపామన్నారు. ఘాట్ రోడ్డులో పార్కింగ్ సదుపాయాన్ని మరింత పెంచాలని నిర్ణయించామని, అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన బంగారం, వెండిని మింట్ ద్వారా కరిగించి గోల్డ్ బాండ్లుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గొల్లపూడిలోని దేవస్థానానికి చెందిన స్థలంలో కాటేజీలు నిర్మించేందుకు పాలకవర్గం ఆమోద ముద్ర వేసిందన్నారు. త్వరలోనే వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి విధి విధానాలను వచ్చే పాలక వర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని చెప్పారు. బస్టాండ్లో దేవస్థాన ప్రసాదాల కౌంటర్ను ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదాలతో పాటు క్యాలెండర్లను విక్రయించనున్నామన్నారు. పాలకవర్గాన్ని పట్టించుకోవడం లేదు : చైర్మన్ పాలక మండలి సమావేశంలో చర్చించిన అంశాలను ఈఓ మీడియాకు వివరించారు. ఇంతలో దేవస్థానానికి హైకోర్టు న్యాయమూర్తులు వస్తున్నారంటూ ఈఓ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. దీంతో చైర్మన్ గౌరంగబాబు మీడియాతో మాట్లాడకుండానే సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. ఇటీవల ఆలయంలో చోటుచేసుకున్న వ్యవహారాలపై చైర్మన్, పాలక మండలి సభ్యులను మీడియా ప్రశ్నించగా ఆయన మాట్లాడేందుకు అంగీకరించారు. దేవస్థానంలో నలుగురు ఉద్యోగులపై చర్యలు అంశంపై పాలక మండలిలో చర్చించేందుకు సభ్యులు ప్రతిపాదన చేశారని, అయితే అది దేవస్థాన అడ్మినిస్ట్రేషన్కు చెందిన వ్యవహారంగా ఆలయ ఈఓ పేర్కొన్నారని తెలిపారు. దసరా ఉత్సవాలకు ఎంత వెచ్చించారని చైర్మన్ను ప్రశ్నించగా, గత ఏడాది దసరా ఉత్సవాల్లో మొత్తం రూ.6.65 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ ఈఓ తమకు రికార్డు పూర్వకంగా వివరాలను తెలిపారని పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.8.40 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారన్నారు. అయితే గత ఏడాది దసరా ఉత్సవాల్లో సుమారు రూ.16 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ ఈఓ వి.కోటేశ్వరమ్మ పలుమార్లు పేర్కొనడం జరిగిందని, ఈ వ్యవహారంలో పాలక మండలిపై కావాలనే ప్రచారం చేయడం ఎంత వరకు సబబని పాలక మండలి సభ్యులు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో పలువురు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
బాలా త్రిపురసుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం
-
విజయవాడలో కేసీఆర్ ఫ్యాన్స్ హల్చల్!
సాక్షి, విజయవాడ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ పర్యటన నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై టీఆర్ఎస్ అధినేత అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు హల్చల్ చేస్తున్నారు. గురువారం విజయవాడ దుర్గమ్మకు మొక్కలు సమర్పించుకునేందుకు కేసీఆర్ కుటుంబసమేతంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులులు ‘జై కేసీఆర్.. జై జై కేసీఆర్..’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమాన నేత, తెలంగాణ సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకుంటున్నారు. సీఎం కేసీఆర్కు స్వాగతం చెబుతూ నగరంలో కేసీఆర్, టీఆర్ఎస్ నేతల బ్యానర్లు, పార్టీ ఫ్లెక్సీలు దర్శనమివ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. మరోవైపు కేసీఆర్ రాక సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడితే కానుకలు సమర్పించుకుంటానని గతంలో మొక్కుకున్న కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి విజయవాడలో పర్యటిస్తున్నారు. కేసీఆర్కు ఘనస్వాగతం కాగా, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇంచార్జ్ కలెక్టర్ విజయ కృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలంగాణ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి ప్రత్యేక కాన్వాయ్ వాహనాల్లో కేసీఆర్ కుటుంబం దుర్గగుడికి వెళ్లి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారన్న విషయం తెలిసిందే. -
బెజవాడ కనకదుర్గ దేవస్థానంలో క్షురకుల ఆందోళన
-
గంటన్నర ఆలస్యంగా దుర్గగుడి మూసివేత
సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై తాంత్రిక పూజలు జరిగాయని ఆరోపణలు వచ్చిన డిసెంబరు 26వ తేదీన రాత్రి గంటన్నర ఆలస్యంగా దుర్గగుడిని మూసివేసినట్లు నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. సాధారణంగా ప్రతిరోజు రాత్రి 10 గంటలకు గుడిని మూసివేస్తారు. డిసెంబర్ 26న మాత్రం రాత్రి 11.30 గంటలకు మూసివేసినట్టు తమ పరిశీలనలో వెల్లడైందని నిజనిర్ధారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంపై విచారణను పూర్తి చేసిన ఈ కమిటీ సభ్యులు రఘునాథ్, శ్రీరామశర్మ తమ నివేదికను శనివారం ఉదయం దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధకు అందజేశారు. అనంతరం ఈ మొత్తం వ్యవహారంపై ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసి దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, కమిషనర్ అనూరాధ, నిజనిర్ధారణ కమిటీ సభ్యులు శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు. భద్రతాపరమైన లోపమేనట! ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా డిసెంబర్ 26న రాత్రి ఆలయాన్ని గంటన్నర ఆలస్యంగా ఎందుకు మూసివేయాల్సి వచ్చిందన్న దానిపై అర్చకులు, ఆలయ సిబ్బందిని నిజనిర్ధారణ కమిటీ ప్రశ్నించింది. భద్రతా సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. భద్రతాపరమైన లోపం కారణంగానే ఆలయాన్ని గంటన్నర ఆలస్యంగా మూసివేశారంటూ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో దేవాదాయశాఖ స్పష్టం చేసినట్లు సమాచారం. అంటే భద్రతాపరమైన లోపం అనే చిన్న కారణం చూపి, తాంత్రిక పూజల వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు దేవాదాయ శాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
నా మీద చాలామంది కోపంగా ఉన్నారు..
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. తాంత్రిక పూజల వ్యవహారంపై ఆమె బుధవారం ప్రెస్మీట్ లో మాట్లాడుతూ.. తాంత్రిక పూజలు అంటే ఏంటో తనకు తెలియదని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామన్నారు. అలాగే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఈవో తెలిపారు. గత నెల 26వ తేదీ రాత్రి సాధారణంగా చేసే అలంకారమే జరిగిందని, అందుకు సంబంధించిన సామాగ్రిని మాత్రమే లోనికి వెళ్లిందని ఆమె పేర్కొన్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 14మందికి నోటీసులు ఇచ్చామన్నారు. అలాగే సీసీ టీవీ ఫుటేజ్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈవో స్పష్టం చేశారు. బదిలీకి సంబంధించి తనకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఆమె తెలిపారు. నా మీద చాలామంది కోపంగా ఉన్నారు.. ‘గుడిలో నా మీద చాలామందికి కోపం ఉంది. పాలకమండలికి, నాకు మధ్య కొంత దూరం ఉంది. పాలకమండలి కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ వింగ్ ప్రారంభించాం. గుడిలో వంద గ్రూపులు ఉన్నాయి. నా మీద కొంత ఒత్తిడి వచ్చింది. కానీ నిబంధనల ప్రకారమే పని చేశాం. బయోమెట్రిక్ పెట్టడం, పని సక్రమంగా చేయడం, కొత్త పూజలు ప్రవేశ పెట్టడం కూడా కొందరికి నచ్చలేదు. హుండీ 20శాతం, టిక్కెట్ ఆదాయం 80శాతం పెరిగింది. సుమారు 130 కోట్ల వరకు డిపాజిట్ లు వున్నాయి. ఒక్క కార్తీకమాసంలో కోటి రూపాయల ఆదాయం పెరిగింది. ఇక గుడిలో పూజలకు సంబంధించి ఎస్పీఎఫ్, దేవాదాయ సిబ్బంది, ఓపిడిఎస్ స్టాఫ్ ను ఆలయ ఈఈ వెంకటేశ్వర రాజు విచారిస్తున్నారు. పాలకమండలి కూడా రెండు రోజుల కిందటే సీసీ టీవీ ఫుటేజీ చూసింది. బయటి వ్యక్తులు ఎలా వచ్చారని పాలకమండలి సభ్యులు ప్రశ్నించారు.’ అని అన్నారు. కాగా ఈ వివాదం నేపథ్యంలో ఈవో సూర్యకుమారిపై వేటు పడింది. ఆమెను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. సూర్యకుమారి స్థానంలో ఇన్చార్జ్ ఈవోగా రామచంద్ర మోహన్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సింహాచలం దేవాలయ ఈవోగా ఉన్న ఆయనను వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. -
బయట వ్యక్తులు అంతరాలయం వద్ద ఉన్నది నిజమే!
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఎంతో పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో రహస్యంగా తాంత్రికపూజలు నిర్వహించిన వ్యవహారం వెలుగుచూడటం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఓ యువనేత పదవి కోసమే ఈ తాంత్రిక పూజలు నిర్వహించినట్టు ఆరోపణలు వస్తుండటం రాజకీయ దుమారం రేపుతోంది. గత నెల 26న అర్ధరాత్రి శాంతస్వరూపినిగా ఉన్న దుర్గమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి.. భైరవీ పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. భైరవీ పూజలు నిర్వహిస్తే శక్తులు వస్తాయనే నమ్మకముంది. ఈ నేపథ్యంలో భైరవీ పూజలు నిర్వహించి.. అనంతరం మళ్లీ దుర్గామాతగా అలంకారాన్ని మార్చినట్టు సమాచారం. బయట వ్యక్తులు అంతరాలయం వద్ద ఉన్నది వాస్తవమే! దుర్గగుడిలో తాంత్రిక పూజల కేసులో లీగల్ తీసుకొని.. ఆ ప్రకారం నడుచుకుంటామని విజయవాడ వన్టౌన్ సీఐ కాశీ విశ్వనాథ్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు పూజారులను విచారించామని తెలిపారు. దుర్గగుడి అంతరాయలం వద్ద బయట వ్యక్తులు ఉన్నది వాస్తవమేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ పూజలకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు. దుర్గగుడిలో ఎవరి కోసం పూజలు నిర్వహించారనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్నారు. ఈవో సూచనల మేరకే తాము అర్ధరాత్రి పూజలు నిర్వహించినట్టు పూజారులు చెప్తున్నారు. మరోవైపు కిందిస్థాయి పూజారులపై నెపం నెట్టేసి.. ఈ వ్యవహారాన్ని ముగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, అధికార పార్టీ నేతల అండ లేనిదే ఆలయంలో ఇంతటి అపచారం జరగదని పరిశీలకులు అంటున్నారు. ఈవోపై వేటు.. ఈ వివాదం నేపథ్యంలో కనకదుర్గ ఆలయం ఈవో సూర్యకుమారిపై వేటు పడింది. ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో ఇన్చార్జ్ ఈవోగా రామచంద్రమోహన్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సింహాచలం దేవాలయ ఈవోగా ఉన్న ఆయనను వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దుర్గగుడిలో తాంత్రికపూజల పేరిట అర్ధరాత్రి జరిగిన అపచారంపై హిందువులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన, రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన దుర్గమ్మ సన్నిధిలో ఇలాంటి అపచారం జరగడమేమిటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందువులు, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా, ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా తాంత్రిక పూజలు నిర్వహించారని, ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టకూడదని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
బెజవాడ దుర్గమ్మ గుడిలో అలజడి
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దేవస్థానంలో అపచారం జరిగినట్టు తెలుస్తోంది. ప్రవిత్రమైన అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించినట్టు ఆరోపణలు రావడంతో అలజడి రేగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి సూర్యకుమారి ఆధ్వర్యంలో గత నెల 26న అర్ధరాత్రి ఈ తంతు జరిగినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో దేవస్థానం పాలక మండలి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించింది. డిసెంబర్ 26న అమ్మవారి గర్భాలయం వద్ద అర్చకులు బదులు అపరిచిత వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రధాన అర్చకుడిని ఆదేశించారు. అయితే ఆలయంలో ఎటువంటి తాంత్రిక పూజలు జరగలేదని ఈవో తెలిపారు. ఆలయంలో అలజడిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్భగుడిలో తాంత్రిక పూజలు జరిగాయన్న ప్రచారంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అమ్మవారి గుడిలో తాంత్రిక పూజలు అరిష్టమని హిందూ పరిరక్షణ సమితి పేర్కొంది. ఈ వ్యవహారంపై దేవాలయ అధికారులు వివరణ ఇవ్వాలని, లేకుంటే పీఠాధిపతుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. అతడి వల్లే వివాదం: మంత్రి దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగలేదని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ప్రధాన అర్చకుడు విశ్వనాథపల్లి బద్రినాథ్బాబు తన బంధువు రాజాను తీసుకెళ్లడం వల్లే అనుమానాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. అనుమతి లేకుండా బయటివ్యక్తిని గర్భగుడిలోకి తీసుకెళ్లం నేరమవుతుందని వెల్లడించారు. బెజవాడ దుర్గమ్మ గుడిలో అలజడి -
అమ్మవారి తాళిబొట్టు తాకట్టు పెట్టారు
-
అమ్మవారి తాళిబొట్టు తాకట్టు పెట్టారు
సాక్షి, విజయవాడ : విజయవాడ కనకదుర్గ ఆలయ ప్రాంగణంలో అపచారం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయంలో అర్చకుడిగా వ్యవహరిస్తున్న బ్రహ్మణుడు శ్రీ వల్లి అమ్మవారి మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు గుట్టు చప్పుడు కాకుండా తాకట్టు నుంచి మంగళసూత్రాన్ని విడిపించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
కనుల విందుగా గాజుల పండువ
-
దుర్గగుడి పాలక మండలి నియామకం
అమరావతి: విజయవాడ శ్రీ దుర్గమలేశ్వర స్వామి వార్ల దేవస్థానం(దుర్గ గుడి) కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 16 మందిని పాలక మండలి సభ్యులుగా నియమించిన ప్రభుత్వం వారందరి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సమావేశమై తమలో ఒకరిని చైర్మనుగా ఎన్నుకోవాల్సి ఉంది. పాలక మండలి సభ్యులుగా యలమంచలి గౌరంగ బాబు, వెలగపూడి శంకరబాబు, బి. ధర్మారావు, కోడెల సూర్య లత కుమారి, ఈడి సాంబశివరావు, చెన్నుమోలు సాంబ సుశీల దేవి, పామర్తి విజయశేఖర్, జి. పద్మా శేఖరరావు, విశ్వనాథపల్లి పాప, సీహెచ్ లక్ష్మీ నరసింహరావు, బీరక పూర్ణ మల్లి రాంప్రసాద్, ఇట్టా పెంచలయ్య, డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, పెద్దిరెడ్డి రాజా, వీరమాచినేని రంగ ప్రసాద్లను సభ్యులుగానూ, ఆలయ ప్రధాన అర్చకుడు ఎల్. దుర్గాప్రసాద్ను ఎక్స్ ఆఫిషియో సభ్యునిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఇన్చార్జి) డి. సాంబశివ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండలిలో సభ్యులుగా నియమించిన వారు రెండేళ్ల పాటు ఆ బాధ్యలలో కొనసాగుతారుని ఉత్తర్వులో పేర్కొన్నారు. -
‘దుర్గమ్మ భూములు కూడా వదలడంలేదు’
-
వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
-
ఇంద్రకీలాద్రి పై నవరాత్రి మహోత్సవాలు
-
అభివృద్ధికి అమ్మ నిధులే..!
పుష్కరాల నాటికి దుర్గగుడి అభివృద్ధి కోసం రూ.50 కోట్ల కేటాయింపు ఈ నిధులు అమ్మవారి ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి తీసుకోవాలంటున్న ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు పుష్కరాల నాటికి దుర్గమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం రూ.50 కోట్లు కేటాయిస్తామని చెప్పింది. ఇది విన్న వారంతా అమ్మవారి ఆలయంపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అనుకున్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి అమ్మవారి ఖాతాలో నిధులే ఉపయోగించుకోవాలంటూ సెలవిచ్చింది. దీంతో భక్త జనం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులివ్వాలని డిమాండ్ చేస్తోంది. విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అభివృద్ధి పేరుతో అమ్మవారి డిపాజిట్లను మంచినీళ్లులాగా ఖర్చు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పుష్కరాల నాటికి రూ.50 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ పనులకు దేవస్థానం ఫిక్స్డ్ డి పాజిట్లను ఉపయోగించుకుంటామని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. ప్రస్తుతం అమ్మవారికి ప్రధాన ఖాతాలో రూ.130 కోట్లు, అన్నదానం ఖాతాలో రూ.35 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. ఈ నిధులను మాత్రం అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా వినియోగిస్తే సహించేది లేదని భక్తులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదా? తెలంగాణలో యాదాద్రి వంటి ముఖ్య దేవాలయాల అభివృద్ధిని అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించింది. ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉగాది పండుగ, రాజధాని శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు దుర ్గగుడి నిధుల్ని వినియోగిస్తోంది. రాజధాని ప్రాంతంలో ఉన్న దేవాలయానికి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తే.. అమ్మవారి డిపాజిట్లు తీయాల్సిన అవసరం ఉండబోదని ధార్మిక సంఘాలు చెబుతున్నాయి. భక్తుల నుంచి విరాళాలు...? అమ్మవారి ఆలయ అభివృద్ధికి విరాళాలిచ్చేందుకు భక్తులు ముందుంటారు. గతంలో రాజగోపురంపై స్వర్ణ కలశాల ఏర్పాటుకు రూ.90 లక్షలు భక్తులే అందించారు. స్వర్ణ శిఖరం నిర్మాణానికి సహకరించారు. ఇప్పుడు కనకదుర్గా నగర్లో భవన నిర్మాణం, కోనేరు నిర్మాణం, ఇంద్రకీలాద్రి రక్షణ గోడపై నిర్మించే చిత్రాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు భక్తుల నుంచి విరాళాలు స్వీకరించవచ్చు. అవసరమైతే దాతల పేరు ఆయా ప్రదేశాల్లో రాయవచ్చు. అందుకు భిన్నంగా అమ్మవారి ఫిక్స్డ్ డిపాజిట్లు ఖర్చు చేయడమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇతర దేవాలయాలతో పోల్చితే.. ద్వారకా తిరుమల, సింహాచలం వంటి దేవాలయాలకు ఆదాయం వచ్చినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు వేయకుండా భూములు కోనుగోలు చే శారు. దీంతో ఆయా దేవాలయాలకు వందల ఎకరాల భూములు ఉన్నాయి. గతంలో దుర్గ గుడి ఈవోలు పని చేసిన వారు వచ్చిన ఆదాయాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. దీంతో ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ప్రైవేటు భూముల్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. అలా కాకుంటే ఆస్తులు ఉన్న చిన్న దేవాలయాలు, సత్రాలను దత్తత తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దేవస్థానం ఖర్చుల భారం పెరుగుతోంది. గతంలో అమ్మ వారి సొమ్ముతో విజయవాడ ప్రభుత్వాసుపత్రినిఅభివృద్ధి చేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని భక్తులు న్యాయస్థానంలో అడ్డుకుని అమ్మ వారి డిపాజిట్లు కాపాడారు. అమ్మవారి డి పాజిట్లు జోలికి వెళ్లినందుకు గతంలో ఈవోలు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. మంత్రి ఉమా స్పందన ఏమిటి...? గతంలో దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గిరిప్రదక్షిణ, ఆందోళనలు చేశారు. ఇంద్రకీలాద్రిపై అధికారుల్ని నిలదీశారు. ఇప్పుడు ఏకంగా అమ్మవారి ఫిక్స్డ్ డిపాజిట్లకే అధికారులు ఎసరు పెడుతుంటే ఆయన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే...! -
దుర్గగుడిపై మూడు స్తంభాలాట..?
నర్సింగరావుకు మద్దతుగా ఓ వర్గం హైదరాబాద్ ప్రయాణంపై అలజడి విజయవాడ : సెలవుపై వెళ్లిన దుర్గగుడి ఈవో నర్సింగరావు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో మూడు స్తంభాల ఆటలా మారినట్లు కనిపిస్తోంది. నర్సింగరావుకు మద్దతుగా ఓ వర్గం హైదరాబాద్ ప్రయాణమయితే అర్చకులు దీనికి వ్యతిరేకంగా ఆలయ ప్రాంగణంలో సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసుల ఆంక్షలతో కట్టుదిట్టం చేశారు. అర్చకుడు సుబ్బారావు హాస్పటల్ పాలు కావడంతో ప్రారంభమైన వివాదం రెండు రోజులపాటు అర్చకులు, ఆలయ సిబ్బంది నిరసన దీక్షలు చేసే వరకు వెళ్లింది. అయితే ఇన్ఛార్జి ఈవోగా ఆజాద్ను నియమించడంతో పాటు కొన్ని పరిణామాల మధ్య వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. కీలక మలుపు ఓ అర్చకుడి ఇంటిలో బుధవారం సాయంత్రం దుర్గగుడి అర్చకులు కొంతమంది సమావేశం కావడంతో కీలక మలుపు చోటు చేసుకుంది. నర్సింగరావుకు మద్దతుగా హైదరాబాద్ వెళుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ అర్చకులు దుర్గగుడిపై సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ధర్మ ప్రచార సమితి రాష్ర్ట అధ్యక్షుడు జగన్మోహనరాజు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఈవో అనుమతి లే కుండా అర్చకులు, సిబ్బంది మీడియాతో మాట్లాడితే వారిపై చర్యలు తీసుకుంటామనే ఆదేశాలుండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
దుర్గగుడి ఈవో వేధింపులపై ఆగ్రహం
అర్చకుల నిరసనలు ఆర్జిత సేవలు రద్దు నేడు ఏపీలోని13 జిల్లాల నుంచి అర్చకుల రాక విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఆలయ అర్చకులు, సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్న విజయవాడ కనకదుర్గ గుడి ఈవో నర్సింగరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేస్తూ ఆలయ ప్రాంగణంలో గురువారం నుంచి నిరసన దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈవో నర్సింగరావు వేధింపుల కారణంగా ఆలయ అర్చకుడు మంగళంపల్లి సుబ్బారావు ఆస్పత్రిపాలు కావడంతో ఆలయ అర్చకులు, సిబ్బంది నిరసనకు దిగారు. అర్చకులు, వేద పండితులు, వివిధ శాఖలకు చెందిన ఆలయ అధికారులు, సూపరిండెంటెంట్లు, ఏఈవోలు, రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు మొదలైన దీక్ష రాత్రి వరకు కొనసాగింది. అమ్మవారికి నిత్యం జరిగే శ్రీచక్ర నవార్చన, చండీయాగం, కుంకుమార్చన, శాంతి కల్యాణాలను నిలిపేశారు. దీక్ష చేపట్టిన అర్చకుల్లో రాజకొండ గోపీకి ఎండ తీవ్రత కారణంగా ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దీక్షలకు మద్దతుగా 13 జిల్లాలకు చెందిన పలు అర్చక సంఘాలు, సమాఖ్యల వారు శుక్రవారం వస్తున్నట్లు దుర్గగుడి అర్చకులు తెలిపారు. అధికారుల వేధింపుల కారణంగానే అర్చకుడు మంగళపల్లి సుబ్బారావు (37) అనారోగ్యం పాలయ్యారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విధులు సరిగా నిర్వర్తించనందునే జరిమానా వేశానని, సుబ్బారావును ఎవరూ వేధించలేదని ఈవో చెప్పారు. అరసవల్లిలో అర్చకుల ఆందోళన శ్రీకాకుళం సిటీ: విజయవాడ కనకదుర్గ ఆలయ ఈవో నర్సింగరావును సస్పెండ్ చేయాలని నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంఘం ప్రతినిధులు కొత్తలంక మురళీకృష్ణ, శ్రీనివాసదీక్షితులు డిమాండ్ చేశారు. వారు గురువారం శ్రీకాకుళ ం జిల్లా అరసవల్లిలో ఆందోళన చేపట్టారు. కాగా ఈవో సీహెచ్ నర్సింగరావు సెలవుపై వెళ్లారు. తన కుమారుడు వివాహం ఉన్నందున ఈ నెల 30వరకు తాను సెలవు పెట్టినట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. తాత్కాలిక ఈవోగా కాకినాడ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్కు బాధ్యతలు అప్పగించారు. -
ఎన్హెచ్-9పై వాహనాల దారి మళ్లింపు
కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో... ఆదివారం ఉదయం నుంచి అమలు విజయవాడ సిటీ(కృష్ణా): విజయవాడ కనకదుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని 9వ నంబర్ జాతీయ రహదారిపై వచ్చే భారీ వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నారు. జాతీయ రహదారిపై సీతమ్మవారి పాదాల నుంచి భవానీపురం లారీ స్టాండ్ వరకు ఫై ్లఓవర్ నిర్మాణం కోసం శనివారం పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ మీదుగా 9వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను మళ్లిస్తున్నట్టు పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి వాహనాల మళ్లింపు నిబంధనలు అమలులోకి వస్తాయని సీపీ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, కోల్కత్తా వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట మీదుగా ఖమ్మం-సత్తుపల్లి, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, దేవరపల్లి మీదుగా రాజమండ్రి వైపు, చిల్లకల్లు నుంచి వైరా మీదుగా తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, దేవరపల్లి న్యూ బ్రిడ్జి మీదుగా రాజమండ్రి వైపు మళ్లించారు. హైదరాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి వద్ద మళ్లించి నల్గొండ మీదుగా మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ల, అద్దంకి మీదుగా ఒంగోలు వైపు మళ్లించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మేదరమెట్ల జంక్షన్ వద్ద మళ్లించి అద్దంకి, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడెం, నల్గొండ మీదుగా నార్కెట్ పల్లి నుంచి హైదరాబాద్ మళ్లించనున్నారు. విశాఖ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను దివాన్చెరువు మీదుగా న్యూ బ్రిడ్జి, దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం, సూర్యారావుపేట మీదుగా హైదరాబాద్ వైపు, గుండుగొలను మీదుగా పంగిడిగూడెం, కామవరపుకోట, అశ్వారావుపేట, వైరా మీదుగా ఖమ్మం వైపు, హనుమాన్జంక్షన్ మీదుగా నూజివీడు, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వైపు మళ్లిస్తున్నారు. గుంటూరు, తెనాలి, మంగళగిరి, బాపట్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను పేరేచర్ల మీదుగా సత్తెనపల్లి, పిడుగురాళ్ల నుంచి మళ్లించనున్నారు. -
దుర్గమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
-
దుర్గమ్మకు పట్టుచీర సమర్పించిన ఎమ్మెల్యే జలీల్
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను గురువారం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ఖాన్ దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన జలీల్ఖాన్కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద జలీల్ఖాన్ విలేకరులతో మాట్లాడారు. దుర్గగుడి తన నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సీఎంకు దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని కోరామని, ఎట్టకేలకు ఈ ఏడాది నుంచి దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భక్తులతో సిబ్బంది గౌరవంగా మెలగాలని ఎమ్మెల్యే సూచించారు. -
ఘనంగా ప్రారంభమైన శాకాంబరి ఉత్సవాలు
-
ఘనంగా ప్రారంభమైన శాకాంబరి ఉత్సవాలు
విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి పూజా కార్యక్రమాలతో అర్చక స్వాములు ఉత్సవాలను ప్రారంభించారు. గర్భగుడిలోని అమ్మవారి విగ్రహానికి, ఉత్సవ విగ్రహానికి చిక్కుడు, దొండ, బెండకాయలు, యాలకులు, జీడిపప్పులతో అలంకరించారు. ఉదయం 4 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. దర్శనానంతరం భక్తులకు కూరగాయలతో రూపొందించిన కదంబం ప్రసాదాన్ని అందజేస్తారు. ఉత్సవాల ముగింపు రోజైన శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో నర్సింగరావు పాల్గొన్నారు. -
29 నంచి దుర్గమ్మ ఉత్సవాలు
విజయవాడ: ఈ నెల 29 నుంచి మూడు రోజులపాటు కృష్ణా జిల్లాలోని బెజవాడ కనకదుర్గమ్మకు శాఖంబరి ఉత్సావాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నర్సింగరావు ఆదివారం తెలిపారు. ఈ ఉత్సవంలో భాగంగా ఆలయాన్ని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో అలంకరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన చెప్పారు. ఉత్సవాల ను ప్రతి రోజు లక్షమంది వీక్షించే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వివరించారు. దుర్గమ్మకు తెలంగాణ బోణాలు భాగ్యనగరానికి చెందిన బోనాల కమిటి ఆదివారం అమ్మవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా.. డప్పు చప్పుళ్లతో, మేళ తాళాలు, నృత్యాలతో విచ్చేసిన కమిటీకి ఆలయ ఈవో స్వాగతం పలికారు. -
దుర్గమ్మకు బోనాలు సమర్పించిన స్వామిగౌడ్
ప్రోటోకాల్ పాటించని ఆలయ అధికారులు విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ మండలి సభాపతి స్వామిగౌడ్ శనివారం బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఏటా దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటానన్నారు. ఈ ఏడాది సభాపతిగా బాధ్యతలు పెరగడంతో అమ్మవారి దర్శనం కాస్త ఆలస్యం అయిందన్నారు. తన కుటుం బం తరఫున అమ్మవారికి బోనాలు సమర్పించినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించకపోవడంతో కేంద్రం అన్యాయం చేసినట్లు అయిందన్నారు. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో చేయాలని కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపై ఉండేవని, ఉద్యమ నేపథ్యంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తామన్నారు. ఇదిలావుండగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన స్వామిగౌడ్ను ప్రధానగేటు నుంచి కాకుండా పక్కనే ఉన్న ప్రొవి జన్స్ స్టోర్స్ మీదుగా ఆలయానికి తీసుకువెళ్లడం విమర్శలకు దారి తీసింది. ప్రోటోకాల్ను పాటించకపోవడంపై దేవాదాయశాఖ మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. -
'రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని ప్రార్థించా'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వవైభవం రావాలని కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి తెలిపారు. దసరా పండగను రాష్ట్ర పండగగా నిర్వహిస్తామని చెప్పారు. శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గమల్లేశ్వరస్వామివారిని పల్లె రఘునాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ఎదుట పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు పల్లె రఘునాథ్రెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శరన్న నవరాత్రులు సందర్బంగా ఇంద్రకీలాద్రిపై భక్త జనం పోటెత్తింది. -
వీఐపీ దర్శనాలతో... సామాన్య భక్తులకు ఇక్కట్లు
విజయవాడ: శరన్న నవరాత్రులు ప్రారంభంతో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం శుక్రవారం భక్తులతో పోటెత్తింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతుంది. సామాన్య భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. అయితే వీఐపీ దర్శనం పేరుతో అమ్మవారి అంతరాలయంలోకి భక్తుల ప్రవేశాన్ని అధికారులు నిలిపివేశారు. దీంతో తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.