Online exam
-
డీఎస్సీ సిలబస్తో డీలా!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఇదిగో డీఎస్సీ.. అదిగో డీఎస్సీ అంటూ ఆరు నెలలుగా ఊరిస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం డీఎస్సీ సిలబస్ను మాత్రమే విడుదల చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సిలబస్తో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పరీక్షకు ఎప్పుడూ లేని రీతిలో ఇంటరీ్మడియెట్ వరకు సిలబస్ను ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ అభ్యర్థులు 3–10 తరగతుల సిలబస్ను మాత్రమే చదవాలని చెబుతూనే.. స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ఇంటర్ సిలబస్ను ఇవ్వడం అభ్యర్థులను కలవరపెడుతోంది. 2018 డీఎస్సీలోనూ ఇలాగే చెప్పిందొకటి, పరీక్షకు ఇచ్చిన సిలబస్ మరొకటి కావడంతో నాడు చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. మరోసారి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తుండటంతో మరోసారి నష్టపోక తప్పదని అభ్యర్థులు వాపోతున్నారు. 2014 డీఎస్సీలోనూ ఇదే విధానం అనుసరించడంతో అభ్యంతరాలు వ్యక్తమైనా నాటి టీడీï³ సర్కారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్లో డీఎస్సీ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేసినప్పుడే సిలబస్పై సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని పలువురు అభ్యర్థులు, విద్యారంగ నిపుణులు ప్రభుత్వాన్ని కోరారు. హైసూ్కల్ బోధనకు ఇంటర్ సిలబస్ ఇవ్వడం సరికాదన్నారు. అలాగే పరీక్షల నిర్వహణపైనా విజ్ఞప్తులు చేశారు. బోధించే తరగతులకు మించి సిలబస్..టెట్ సిలబస్సే డీఎస్సీ పరీక్షలకు కూడా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 3 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ ఉంటుందని తాజాగా డీఎస్సీ సిలబస్లో ప్రకటించారు. కానీ, సిలబస్ వివరణలో మాత్రం ఇంటర్మీడియెట్ వరకు ప్రశ్నలు ఉంటాయని మెలిక పెట్టారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధన చేస్తుండగా, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. బోధించే తరగతులకు అనుగుణంగా అంతవరకే గతంలో డీఎస్సీ సిలబస్ ఉండేది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు మూడో తరగతి నుంచి 8వ తరగతి వరకు, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులకు 6 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మాత్రమే ఉండేది. దీన్ని ఆధారం చేసుకునే ప్రశ్నపత్రాలను రూపొందించేవారు. కానీ, 2014, 2018 డీఎస్సీల్లో మాత్రం సిలబస్ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనూహ్యంగా పెంచేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు బోధించే తరగతులకు మించి సిలబస్ ఇవ్వడంపై డీఎస్సీ అభ్యర్థులు, విద్యా రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఊస్టింగేనా?ఎస్జీటీ, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు పాఠశాల విద్యా శాఖ సిలబస్ను ప్రకటించింది. కానీ హైసూ్కళ్లల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సిలబస్ను ప్రకటించలేదు. అంటే ఈ విభాగంలో పోస్టులు లేవని ప్రభుత్వం చెబుతున్నట్టుగానే భావించాల్సి వస్తోంది. 2018 ఫిబ్రవరి స్పెషల్ డీఎస్సీలో ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో దాదాపు 852 పోస్టులను గుర్తించి సుమారు 602 పోస్టులు భర్తీ చేశారు. కానీ ఈసారి వారికి అవకాశం లేకపోవడంతో డిగ్రీతో పాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ విద్యావిధానం–2020 నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఆన్లైన్ పరీక్షపైనా అభ్యంతరాలు..జూలైలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మాదిరిగానే డీఎస్సీని కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం అభ్యర్థులకు నష్టం చేస్తుందనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సెషన్లలో రోజుల తరబడి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే నష్టం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ.. జిల్లా స్థాయిలో టీచర్ పోస్టుల భర్తీకి చేపట్టే పరీక్ష కాబట్టి పరీక్షను కూడా ఉమ్మడి జిల్లాలవారీగా ఆఫ్లైన్లోనే నిర్వహించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై గతంలో అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను అభ్యర్థించారు. నాడు సానుకూలంగా స్పందించిన మంత్రి ఇప్పుడు మాత్రం ఆన్లైన్లో అది కూడా టెట్ మాదిరిగా ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పది రోజులు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
ఫెడరల్ బ్యాంక్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రాం
ముంబై: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ త్వరలో ప్రారంభించే ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో చేరేందుకు అర్హత గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం (ఎఫ్ఐపీ) పేరిట నిర్వహించే ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లుగా ఉంటుంది. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ (ఎంఏజీఈ)తో కలిసి ఈ కోర్సును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. కోర్సు పూర్తయిన తర్వాత మణిపాల్ అకాడెమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్టిఫికెట్ అందుకోవచ్చని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. అంతేకాదు ప్రొబేషనరీ ఆఫీసర్గా ఫెడరల్ బ్యాంక్లోనే అవకాశాలు దక్కవచ్చు కూడా. ఈ ప్రోగ్రాంలో చేరే అభ్యర్థులు ఏటా రూ. 5.70 లక్షల దాకా ఆర్జించే అవకాశాలు ఉంటాయని పేర్కొంది. దరఖాస్తు చేసుకోవాలంటే.. ► ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ► పదో తరగతి, ఇంటర్(ఫ్లస్ టూ), గ్రాడ్యుయేషన్.. ఏదైనా సరే 60 శాతం మార్కులకు పైబడి ఉండాలి ► 2021 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థి వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు. ► దరఖాస్తు సమర్పించడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 23 ►నవంబర్ 11న ఆన్లైన్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి కింద లింక్ను క్లిక్ చేయండి.. https://www.federalbank.co.in/federal-internship-program -
ఆన్లైన్లో వచ్చే ప్రశ్నాపత్రం.. అరగంటలో లీక్.. మూడు రోజులుగా..
సాక్షి, బోధన్ (నిజామాబాద్): తెలంగాణ వర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. వర్సిటీ ఉన్నతాధికారుల నిఘా కరువైంది. కరోనా నిబంధల పేరుతో పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన కనీస నిబంధన చర్యలను పట్టించుకోకపోవడంతో ప్రైవేటు డిగ్రీ కళాశాలల పరీక్షా కేంద్రాల వారికి అనుకూలంగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అరగంట ఆలస్యంలోనే కిటుకు.. పోటీపరీక్షల్లో అమలుచేసే నిమిషం ఆలస్యం నిబంధన సాధారణ పరీక్షల్లో అమలు చేయకపోవడం కొందరు విద్యార్థులకు అనుకూలంగా మారింది. అరగంట ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను అనుకూలంగా తీసుకుని పరీక్షా కేంద్రాల్లోని పలువురు అబ్జర్వర్లు విద్యార్థులకు మాల్ప్రాక్టీస్ను పోత్రహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్లో ప్రశ్నాపత్రం.. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు పరీక్షా కేంద్రాలకు ఆన్లైన్లో ప్రశ్నాపత్రం పంపిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రానికి పంపించే ప్రశ్నాప్రతాలపై ప్రత్యేకమైన కోడ్ వేస్తారు. నిర్వాహకులు డౌన్లోడ్ చేసుకుని పరీక్ష సమయానికి 5 నిమిషాలు ముందుగా సబ్జెక్టుల వారీగా విద్యార్థుల గదులకు చేరవేస్తారు. అబ్జర్వర్స్ ఈ ప్రక్రియను తమకు అనుకూలంగా మా ర్చుకుంటున్నారు. కొందరు తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్ల ద్వారా ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి బయటకు చేరవేయగా విద్యార్థులు వాటి జవాబులను మైక్రో జిరాక్స్ తీసుకుని ఎగ్జామ్ హాల్కు వచ్చి మాల్ప్రాక్టీస్కు పాల్పడుతున్నారు. బోధన్లో ప్రశ్నాపత్రం లీక్.. బోధన్లో 5 పరీక్షా కేంద్రాలుండగా, ఒకటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, 4 ప్రైవేట్లో ఉన్నాయి. 3 రోజుల నుంచి పేపర్ లీకేజీ జరుగుతున్నట్లు సమాచారం. శనివారం నాలుగో సెమిస్టర్ డాటాబేస్ మేనేజ్ మెంట్ ప్రశ్నపత్రం బయటకు లీక్ చేశారు. దీంతో ఓ జిరాక్స్ సెంటర్ వద్ద విద్యార్థులు గుంపులుగా చేరి లీకేజైన ప్రశ్నల జవాబులు మైక్రో జిరాక్స్లు తీసుకుని పరీక్ష రాసినట్లు తెలిసింది. -
జీ మ్యాట్ ఆన్లైన్ పరీక్షలో మరో విభాగం
న్యూఢిల్లీ: గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) ఆన్లైన్ పరీక్షా విధానంలో గతంలో తొలగించిన అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్(ఏడబ్ల్యూఏ) విభాగాన్ని తిరిగి చేర్చారు. పరీక్షార్థులకు అదనపు సౌలభ్యాన్ని అందించడంతోపాటు, వాస్తవ పరీక్షా కేంద్రం అనుభూతినిచ్చేందుకు చేపట్టిన పలు చర్యల్లో ఇది కూడా ఒకటని జీమ్యాట్ను నిర్వహించే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్(జీమ్యాక్) తెలిపింది. వేగంగా మారుతున్న మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా ఏడబ్ల్యూఏ వంటి జీమ్యాట్లోని కొన్ని అంశాలను ప్రారంభ ఆన్లైన్ పరీక్షలో తొలగించినట్లు జీమ్యాక్ అధికారులు తెలిపారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా జీమ్యాట్ను ఆన్లైన్ ద్వారా జీమ్యాక్ చేపడుతోంది. ఇప్పటి వరకు 150 దేశాలు, ప్రాంతాల్లో 45 వేలకుపైగా పరీక్షలు చేపట్టినట్లు జీమ్యాక్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,300 బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాలకు జీమ్యాట్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎంబీఏ ప్రవేశాలు ప్రతి పదింటిలో తొమ్మిదింటికి జీమ్యాట్ స్కోరే ఆధారం. జీమ్యాక్ అనే లాభాపేక్ష లేని సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 223 గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూళ్లున్నాయి. చదవండి: పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే! ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు? -
విజ్ఞాన్ వర్సిటీ ఆన్లైన్ పరీక్ష ఫలితాలు విడుదల
చేబ్రోలు (పొన్నూరు): గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ నిర్వహించిన బీటెక్ చివరి సంవత్సరం రెండో సెమిస్టర్ ఆన్లైన్ పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు వర్సిటీ వీసీ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. విద్యార్థులకు ఆన్లైన్లో రియల్ టైం వీడియో మానిటరింగ్ సిస్టంతో పరీక్షలు నిర్వహించామని, వారం రోజుల్లోనే ఫలితాలను వెల్లడించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్, డీన్ పీఎంవీ రావు తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు శుభవార్త.. ఒకే ఆన్లైన్ పరీక్ష
న్యూఢిల్లీ: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై ఒకే ఆన్లైన్ పరీక్ష ద్వారా నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అధ్వర్యంలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రవేశ పెట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అనేక పరీక్షలు రాయాల్సి వచ్చేదని, తాజా నిర్ణయం వల్ల నిరుద్యోగులకు సమయం, డబ్బులు ఆదా అవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో అన్ని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు కలిపి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరీక్షలో తెచ్చుకున్న మార్కులను ఏ నాన్ గెజిటెడ్ ఉద్యోగానికైనా మూడేళ్ల వరకు పరిగణలోకి తీసుకుంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను ఎక్కువగా స్టాఫ్ సెలక్షన్ కమీషన్(ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), ఐబీపీఎస్లు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. ముఖ్యంగా విద్యా విధానం, ఉద్యోగ కల్పనలో కేంద్ర ప్రభుత్వం మార్పులను చేపట్టిన విషయం విదితమే. చదవండి: బంగారు బాతును చంపేస్తారా? -
ప్రధానితో కలిసి చంద్రయాన్-2 చూసొద్దామా..!
ఇస్రో నుంచి ఉపగ్రహాలను పంపించడం సాధారణంగా మాధ్యమాల్లో చూస్తుంటాం. ఇటీవల మన దేశం చంద్రయాన్–2ను పంపించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అలాంటిది ఇస్రో కార్యాలయంలోనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి చంద్రయాన్–2 మిషన్ చంద్రుడిపై దిగడం ప్రత్యక్షంగా చూసే అవకాశం కొంత మంది విద్యార్థులకు దక్కనుంది. ఇందుకు గాను 8 నుంచి 10 వతరగతి చదివే విద్యార్థులు ఇస్రో నిర్వహించే ఆన్లైన్ పరీక్షల్లో ప్రతిభ చూపితే సరిపోతుంది.ఈ నెల 20వ తేదీ వరకే గడువు ఉంది. సాక్షి, తిరుపతి : భారత సాంకేతిక ఎదుగుదలపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇస్రో మై గౌ’ పేరుతో ఆన్లైన్ ప్రతిభా పాటవ పోటీలను నిర్వహిస్తోంది. దీనికి ఎనిమిది నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ చూపితే సరిపోతుంది. ఈ నెల 10 నుంచి ఆన్లైన్ క్విజ్ ద్వారా పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రతిభ చూపి, ఎంపికైన విద్యార్థులు చంద్రయాన్–2 చంద్రుడిపై దిగే క్రమాన్ని స్వయంగా వీక్షించేందుకు బెంగళూరులోని ఇస్రో కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 10నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులు మిగతా రాష్ట్రాల విజేతలతో పాటు ప్రధాని మోదీతో కలిసి చంద్రయాన్–2 మిషన్ చంద్రుడిపై దిగే అపురూ పన్నివేశాన్ని వీక్షించవచ్చు. పోటీ ముగిశాక విజేతల వివరాలు వెల్లడిస్తారు. తగు ఆధారాలు, ద్రువపత్రాలతో ఇస్రోను సంప్రదిస్తే విజేతలకు ఆహ్వానం పంపిస్తారు. పోటీ ఇలా.. కంప్యూటర్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లో ఇంటర్నెట్ను అనుసంధానం చేసుకుని IrsomYgov వెబ్సైట్లోకి వెళ్లగానే.. అక్కడ వివరాలు వస్తాయి. వీటిలో మొదటి కాలమ్గా వివరాలు, నియమ నిబంధనలు ఉంటాయి. రెండో కాలమ్గా లాగిన్ టు ప్లేక్విజ్ వస్తుంది. దీనిపై క్లిక్ చేసి, కావాల్సిన వివరాలు నమోదు చేస్తే ఆన్లైన్లోనే ప్రశ్నలు ప్రారంభమవుతాయి. పది నిమిషాల వ్యవధిలో 20ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. ఒక్కసారి పోటీ ప్రారంభమయ్యాక మధ్యలో ఆపకూడదు. స్క్రీన్పై కనిపించిన ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వాలి. తెలియకపోతే తప్పుకుని తరువాత వచ్చే ప్రశ్న తెలుసుకునే వెసులుబాటు ఉంది. విద్యార్థికి పెద్ద వారు సహకరించవచ్చు. కానీ ఏకంగా వారే సమాధానాలు ఇవ్వకుండా నైతికత పాటించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి 11.59గంటల వరకు ఆన్లైన్లో క్విజ్ పోటీల్లో పాల్గొనవచ్చు. ఎంపిక ఎలాగంటే.. వేగం, కచ్చితత్వంతో పాటు స్పందించే మనస్తత్వం ఉన్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరేసి ప్రతిభావంతులను గుర్తిస్తారు. విజేతల సంఖ్య ఎక్కువగా ఉంటే అతి తక్కువ వ్యవధిలో సరైన సమాధానాలు నమోదు చేసిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒకరికి సర్టిఫికెట్ను అందిస్తారు. సువర్ణావకాశం సద్వినియోగం చేసుకోవాలి చంద్రయాన్–2ను ప్రత్యక్షంగా సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్రమోదీతో కలసి చూసే సువర్ణావకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. 8వతరగతి నుంచి 10వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఇటువంటి ఆన్లైన్ పోటీల్లో పాల్గొంటే విద్యార్థులకు మేధోశక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు ఈ అవకాశాన్ని కల్పించే విధంగా సహాయ సహకారాలు అందించాలి. ఆర్.మణికంఠన్, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్, తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ -
తెలంగాణలో ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నెల 3, 4, 6 తేదీ ల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను రెండు గంటల ముందునుంచే పరీక్ష కేంద్రంలోకి, గంటన్నర ముందునుంచి పరీక్ష హాల్లోకి అనుమతి ఇస్తారు. తెలంగాణలోని 83 కేంద్రాల్లో, ఏపీలోని 11 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో ఇంజనీరింగ్ విద్యార్థులు 1,42,218 మంది ఉండగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 74,981 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్ష హాల్లో కి హాల్టికెట్, పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులైతే అటెస్ట్ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేపర్లు, సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ నిషేధం. -
నేటి నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 3, 4, 6 తేదీ ల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షలు జరగునున్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థులను 2 గంటల ముందునుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని, గంటన్నర ముందునుంచి పరీక్ష హాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. తెలంగాణలోని 83 కేంద్రాల్లో, ఏపీలోని 11 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో ఇంజనీరింగ్ విద్యార్థులు 1,42,218 మంది ఉండగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 74,981 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్ష హాల్లో కి హాల్టికెట్, పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులైతే అటెస్ట్ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేపర్లు, సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ నిషేధం. -
లా ప్రవేశ పరీక్షలు మళ్లీ ‘ఆఫ్లైన్’లోకి!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల పరిధిలోని లా కళాశాలల అడ్మిషన్ల కోసం వరుసగా గత నాలుగేళ్లుగా ‘ఆన్లైన్’లో నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మళ్లీ ఆఫ్లైన్లోకి వెళతాయా? 2018 సంవత్సరానికి మే 13వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన లా ప్రవేశ పరీక్షల్లో చోటు చేసుకున్న సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. దేశంలోని 19 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల పరిధిలోని లా కళాశాలల్లో అడ్మిషన్లకోసం ఏటా ఆన్లైన్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏటా ఓ యూనివర్శిటీ ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను తీసుకుంటున్నాయి. కేరళలోని కొచ్చీ న్యాయ విశ్వవిద్యాలయం ‘నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ అడ్వాన్డ్స్ లా స్టడీస్’ ఈసారి ‘క్లాట్–18’ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 258 కేంద్రాల్లో ఈ ఏడాది నిర్వహించిన లా ప్రవేశ పరీక్షలకు మొత్తం 54,465 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో దాదాపు మూడోవంతు అంటే, 19, 983 మంది అభ్యర్థులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. కంప్యూటర్ స్క్రీన్ స్తంభించి పోవడం వల్ల లేదా ప్రశ్న స్క్రీన్ మీది నుంచి అదృశ్యం అవడం వల్ల అభ్యర్థులు ఒక్కసారికన్నా ఎక్కువ సార్లు లాగిన్ కావాల్సి వచ్చింది. ఫలితంగా వారి విలువైన సమయం వృధా అయింది. సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్న వారిలో 612 మంది కనీసం ఐదుసార్లు, 14 మంది కనీసం పదిసార్లు, అంతకన్నా ఎక్కువ, మరో దురదృష్ట అభ్యర్తి ఏకంగా 19 సార్లు కంప్యూటర్కు లాగిన్ కావాల్సి వచ్చింది. తద్వారా వారంతా పది నిమిషాలు, అంతకన్నా ఎక్కువ సమయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై పలువురు హైకోర్టులో, సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కమిటీ ఏర్పాటు ఈ సాంకేతిక సమస్యలపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 27వ తేదీన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాన్పూర్లోని ఐఐటీకి చెందిన మణింద్ర అగర్వాల్, ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన అశోక్ కుమార్ జార్వల్, లక్నోలోని ఐఐఎంకు చెందిన నీరజ్ ద్వివేది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషిలతో ఈ కమిటీని వేశారు. ఈ సారి క్లాట్ పరీక్షను నిర్వహించిన కొచ్చీ లా యూనివర్శిటీకి పూర్తి సాంకేతిక సహకారాన్ని అందించిన ‘సైఫీ టెక్నాలజీ లిమిటెడ్’ కంపెనీని కూడా కమిటీ విచారించింది. స్థానికంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించిన ప్రొవైడర్ వద్ద సరైన నెట్వర్క్ సామర్థ్యం లేకపోవడం వల్ల సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావచ్చని సైఫీ అనుమానం వ్యక్తం చేసింది. అసలు సమస్యేమిటో ఇంతకాలం కనుక్కోక పోవడం వల్ల కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అధిక ఫీజు పట్ల కమిటీ దిగ్భ్రాంతి కొచ్చి లా ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి మొత్తం 2.6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అభ్యర్థుల నుంచి పరీక్ష ఫీజు కింద వచ్చిన మొత్తం ఏకంగా 27.5 కోట్ల రూపాయలు. అభ్యర్థి నుంచి నాలుగు వేల రూపాయలను ఫీజు కింద వసూలు చేయడం పట్ల కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఫీజును 1500 రూపాయలుగా నిర్ధారించాలని సూచించింది. పరీక్ష ఫీజు కింద వచ్చిన మొత్తంలో సగాన్ని పరీక్ష నిర్వహించిన లా యూనివర్శిటీ తీసుకొని మిగతా సగాన్ని మిగతా అన్ని లా విశ్వవిద్యాలయాలన్నింటికి పంచాల్సి ఉంటుంది. అనుభవ రాహిత్యమూ కారణమే ప్రతి ఏటా ఓ న్యాయ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలను నిర్వహించడం వల్ల ఆ యూనివర్శిటీ బిడ్డింగ్ పద్ధతిలో సాంకేతిక సంస్థను ఎంపిక చేస్తోంది. అలా ప్రతి యూనివర్శిటీ ప్రతి ఏటా ఒక్కో కొత్త సాంకేతిక సంస్థను ఎంపిక చేయడం వల్ల సాంకేతిక లోపాలు పునరావృతం అవుతున్నాయని కమిటీ అభిప్రాయపడింది. అందుకని సాంకేతిక సంస్థను కనీసం రెండేళ్లు పరీక్షల నిర్వహణకు కొనసాగించేలా, మరో ఏడాది పొడిగించుకునేలా ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. లేదా దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు నిపుణులతో కూడిన సాంకేతిక సంస్థను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు ఆఫ్లైన్లో పరీక్షలను నిర్వహించడమే సమంజసమని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ మంగళవారం నాడు సుప్రీం కోర్టుకు సమర్పించిన ఈ నివేదికను కోర్టు ఇంకా పరిశీలించాల్సి ఉంది. ఆ తర్వాత సుప్రీం కోర్టు స్పందననుబట్టి కేంద్రం స్పందించాల్సి ఉంది. -
తొలిసారిగా ఆన్లైన్లో ఎంసెట్ పరీక్ష
-
నేడు ఎంసెట్ నోటిఫికేషన్
-
నేడు ఎంసెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఎంసెట్ పూర్తిస్థాయి షెడ్యూల్ ఖరారైంది. దీనిపై మంగళవారం నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 2 నుంచి 7వ తేదీ వరకు (6వ తేదీ మినహా.. ఆరోజున నీట్ పరీక్ష ఉంది) ఆన్లైన్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తారు. ఈ మేరకు సోమవారం జేఎన్టీయూలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నా రు. సమావేశం అనంతరం పాపిరెడ్డితోపాటు ఎంసెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, కన్వీనర్ యాదయ్య వివరాలను వెల్లడించారు. తొలిసారిగా ఆన్లైన్లో.. బీఈ/బీటెక్, బయోటెక్, బీటెక్ డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మసీ, బీఎస్సీ హానర్స్, అగ్రికల్చర్/బీఎస్సీ (హానర్స్), హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, ఫార్మ్–డి కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్–2018ను నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని.. రోజూ రెండు సెషన్లలో, ఒక్కో సెషన్లో 25 వేల మందికి పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్కో సెషన్కు ఇచ్చే ప్రశ్నలు వేర్వేరుగా ఉం టాయి కనుక విద్యార్థుల మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ నేతృత్వంలో దానిని ఖరారు చేశామని, అవగాహన కోసం దానిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈసారి తెలుగు, ఇంగ్లిషుతోపాటు ఉర్దూ మీడియంలోనూ ప్రశ్నలు ఇస్తామని, వారికి ఇచ్చే ప్రశ్నలు ఉర్దూ, ఇంగ్లిషు రెండు భాషల్లో ఉంటాయని చెప్పారు. మెయిల్ ఐడీ తప్పనిసరి ఆన్లైన్ పరీక్షల నిర్వహణలో సమస్యలు రాకుండా పక్కా చర్యలు చేపడుతున్నామని, పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. ఈసారి దరఖాస్తుకు మెయిల్ఐడీ తప్పనిసరి చేశామని, ఏ సమాచారమైనా మెయిల్కే పంపిస్తామని వెల్లడించారు. మే 9న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, అదేరోజున ఆన్లైన్ పరీక్ష జవాబు పత్రం (రెస్పాన్స్ షీట్) మెయిల్ ఐడీకే పంపుతామని చెప్పారు. ఆన్లైన్ పరీక్షల కోసం హైదరాబాద్లోని ఐదు జోన్లతోపాటు కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నిజమాబాద్, వరంగల్, ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో ప్రాంతీయ కేంద్రాలు ఉంటాయని తెలిపారు. ఆన్లైన్ పరీక్షలకు ప్రాక్టీస్ కోసం ్ఛ్చఝఛ్ఛ్టి. ్టటఛిజ్ఛి.్చఛి.జీn వెబ్సైట్లో మాక్ టెస్టుల లింకులను అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా ఈసారి ఆన్లైన్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష ఫీజులు పెంచుతున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. గతేడాది ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా ఉన్న ఫీజు ఈసారి రూ.400కు.. బీసీ, జనరల్ విద్యార్థులకు రూ.500 నుంచి రూ.800కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇదీ షెడ్యూల్ 27–2–2018: ఎంసెట్ నోటిఫికేషన్ 4–3–2018 నుంచి 4–4–2018 వరకు: ఆన్లైన్లో దరఖాస్తులు 6–4–2018 నుంచి 9–4–2018 వరకు: దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం 11–4–2018 వరకు: రూ.500 ఆలస్య రుసుముతో; 18వ తేదీ వరకు రూ.1,000; 24వ తేదీ వరకు రూ.5 వేలు; 28వ తేదీ వరకు రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులు 20–4–2018 నుంచి 1–5–2018 వరకు: హాల్టికెట్ల డౌన్లోడ్కు అవకాశం 2–5–2018, 3–5–2018: అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు (ఉదయం సెషన్ 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి 6 గంటల వరకు) 4–5–2018, 5–5–2018, 7–5–2018: ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్ష -
అర్హత పరీక్ష!
ఈమె పేరు కళావతి. బత్తలపల్లి మండలం జ్వాలాపురం గ్రామానికి చెందిన టెట్ అభ్యర్థినికి పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాన్ని కేటాయించారు. ఉదయం 9 గంటలకే కేంద్రానికి చేరుకుంది. గురువారం రోజునే ఎంటెక్ విద్యార్థులకు పరీక్ష ఉండటంతో విద్యార్థులు కళాశాలఆవరణలోనే నిరీక్షిస్తున్నారు. వారంతా టెట్కే వచ్చారని భ్రమించిన కళావతి 9.45గంటలు దాటినా అక్కడే ఉండిపోయింది. చివరకు అనుమానంతో విచారించగాఅసలు విషయం తెలుసుకొనిపరీక్ష హాలులోకి వెళ్లగా అప్పటికే సమయం మించిపోవడంతో నిర్వాహకులు ససేమిరాఅన్నారు. ‘సార్.. కాళ్లుపట్టుకుంటా అనుమతించండి’అని వేడుకున్నా ఫలితం లేకపోయింది. అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రెండవ రోజు గురువారం కూడా అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. జిల్లా కేంద్రంలోని పీవీకేకే కళాశాల కేంద్రంలో ఆలస్యం కారణంగా ఓ విద్యార్థినిని పరీక్షకు అనుమతించలేదు. రెండో రోజు 63 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అనంతపురం, బెంగళూరు కేంద్రాల్లో మొత్తం 1,468 మంది అభ్యర్థులకు గాను 1,405 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దనాచార్యులు పీవీకేకే, షిర్డీసాయి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాలను పరిశీలించారు. అలాగే జిల్లా పరిశీలకులు జనార్దనరెడ్డి, ఆయా కేంద్రాల పరిశీలకులు కేంద్రాలను తనిఖీ చేశారు. బెంగళూరులో పరిశీలకులు సాయిబాబా వివిధ సెంటర్లను పరిశీలించారు. రెండోరోజూ ఆ కేంద్రాల్లో అభ్యర్థులు లేరు జిల్లాలో ఆరు కేంద్రాలు ఉండగా రెండోరోజూ రెండు కేంద్రాలకు అభ్యర్థులను కేటాయించలేదు. రాప్తాడు మండలం హంపాపురం వద్దనున్న ఎస్వీఐటీ కళాశాల, గుత్తి గేట్స్ కళాశాల కేంద్రాల్లో ఒక్క అభ్యర్థీ రాయలేదు. అలాగే షిర్డీసాయి ఇంజినీరింగ్ కళాశాలలోనూ రెండు పూటలా కేవలం 71 మందిని మాత్రమే కేటాయించారు. వెంటాడిన సాంకేతిక సమస్య హిందూపురం సప్తగిరి కళాశాలలో రెండో రోజూ సాంకేతిక సమస్య తలెత్తింది. 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11.15 గంటలకు మొదలైంది. అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. ఆన్లైన్ నిర్వహణపై అవగాహన లేకనే ఈ పరిస్థితి తలెత్తిందంటూ అభ్యర్థులు వాపోయారు. -
బిక్కమొహం
టెట్ అభ్యర్థులంతా బిక్కమొహం వేశారు. తొలిసారిగా ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడంతో అవగాహన లేనివారంతా ఇబ్బందులు పడ్డారు. చాలా మందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. ఇక హిందూపురం కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటన్నర ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది. అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) బుధవారం ప్రారంభమైంది. జిల్లాలో ఆరు కేంద్రాలతో పాటు బెంగళూరు నగరంలోని 9 కేంద్రాలను జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తోంది. తొలిరోజు 79 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1,639 మంది అభ్యర్థులకు గాను 1,560 మంది హాజరయ్యారు. వీరిలో అనంతపురం జిల్లాలో 703 మందికి గాను 681 మంది హాజరయ్యారు. 22 మంది గైర్హాజరయ్యారు. అలాగే బెంగళూరులో 936 మందికి గాను 879 మంది హాజరయ్యారు. 57 మంది గైర్హాజరయ్యారు. హిందూపురంలో గంటన్నర ఆలస్యంగా... హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాల కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కొందరి విద్యార్థులు గంటన్నర ఆలస్యంగా పరీక్ష మొదలు పెట్టారు. అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వీరికి గడువు సమయం పొడిగించి రాయించారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దనాచార్యులు, జిల్లా పరిశీలకులు జనార్దన్రెడ్డి, కేంద్రాల పర్యవేక్షులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ వివిధ సెంటర్లను పరిశీలించారు. రెండు కేంద్రాల్లో అభ్యర్థులు లేరు జిల్లాలో ఆరు కేంద్రాలుండగా తొలిరోజు రెండు కేంద్రాల్లో అభ్యర్థులనే కేటాయించలేదు. రాప్తాడు మండలం హంపాపురం వద్దనున్న ఎస్వీఐటీ కళాశాల, గుత్తి గేట్స్ కళాశాల కేంద్రాల్లో ఒక్క అభ్యర్థీ పరీక్ష రాయలేదు. షిర్డీసాయి ఇంజినీరింగ్ కళాశాలలోనూ కేవలం 50 మందిని మాత్రమే కేటాయించారు. -
తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, వరంగల్: ఐసెట్-2018 షెడ్యూల్ను బుధవారం విడుదల చేశారు. తొలిసారి ఆన్లైన్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కన్వీనర్ సుబ్రహ్మణశర్మ తెలిపారు. మార్చి 6 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 30 అని వెల్లడించారు. మే 23, 24 తేదీల్లో ఐసెట్ పరీక్ష జరుగుతుందన్నారు. జూన్ 6 న ఫైనల్ కీ, అదే నెలలో ఫలితాలు విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్లో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. -
సెక్టోరియల్ పోస్టులకు 21న ఆన్లైన్ పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్ : సర్వశిక్షాభియాన్ (ఎస్ఎస్ఏ) పరిధిలోని సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టుల భర్తీకి ఈనెల 21న కడపలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి 1 గంట వరకూ ఈ పరీక్ష ఉంటుంది. అయితే పరీక్షా కేంద్రం ఇంకా ఖరారు కాలేదు. రాయలసీమ జిల్లాలు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు నాలుగు జిల్లాలకు కడపలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 106 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. -
ఏపీ లాసెట్-2017 నోటిఫికేషన్ విడుదల
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లాసెట్–2017 నోటిఫికేషన్ విడుదలయింది. మూడేళ్లు-ఐదేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు యూనివర్శిటీ వెబ్సైట్ ద్వారా ఈ నెల 18 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 18. అపరాధ రుసుము రూ.500తో మార్చి 27 వరకు, రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఏప్రిల్ 5 వరకు, రూ.1500తో ఏప్రిల్ 14 వరకు, రూ.5 వేలతో ఏప్రిల్ 17 (సాయంత్రం 5 గంటల వరకు) వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్ష ఫీజు రూ.700, ఎల్ఎల్ఎంకు రూ.800గా నిర్ధారించారు. హాల్టికెట్లు ఏప్రిల్ 14 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న రాత పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని చెప్పారు. -
ఏప్రిల్ 24 నుంచి ఏపీ ఎంసెట్
♦ ఫిబ్రవరి 15 నుంచి మాక్టెస్ట్లు ♦ విద్యార్థులకు ఉపయుక్తంగా యాప్ ఏర్పాటు ♦ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల చేసిన మంత్రి గంటా ఏయూక్యాంపస్ (విశాఖ): ఆంధ్రప్రదేశ్ ఎంసెట్తో పాటు ఇతర సెట్ల తేదీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 24 నుంచి ఎంసెట్ ప్రారంభమవుతుంది. ఈసారి ఆన్లైన్ పరీక్ష కావడంతో ఇంజినీరింగ్ పరీక్షను 24 నుంచి 27 వరకూ నిర్వహించనున్నారు. సంయుక్త ప్రవేశ పరీక్షల తేదీలను సోమవారం సాయంత్రం స్థానిక ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ మందిరంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల తేదీలు వెల్లడించారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షల నిర్వహణ బాధ్యత ఏపీ ఆన్లైన్కు ఇచ్చామని, ఏపీటీఎస్, టీసీఎస్ సంయుక్తంగా ఐటీ అండ్ సీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియను చేపడతాయని చెప్పారు. అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ ఆన్లైన్ విధానంలో రాదన్నారు. ఆన్లైన్ పరీక్షలపై విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘గైడ్లైన్స్ టు ద స్టూడెంట్’ పేరుతో నియమావళిని రూపొందించి వెబ్సైట్లో పొందుపరుస్తామని, ఆన్లైన్ టెస్ట్లు జరిగే విధానాన్ని వీడియో రూపంలో వెబ్సైట్లో విద్యార్థుల అవగాహన కోసం ఉంచుతామని పేర్కొన్నారు. 15 నుంచి మాక్ టెస్ట్లు విద్యార్థులు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మాక్ టెస్ట్లు తమ ఇంటి నుంచే సాధన చేయవచ్చని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంత, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా మాక్టెస్ట్లతో కూడిన సీడీలు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఉపయుక్తంగా ప్రత్యేకంగా మొబైల్ యాప్ను రూపొందిస్తున్నామని, పరీక్ష కేంద్రం వివరాలు, హాల్టికెట్ డౌన్లోడ్ వంటివి యాప్ సహాయంతో చేసుకోవచ్చని వెల్లడించారు. హాల్టికెట్ పరీక్ష కేంద్రం రూట్మ్యాప్ ముద్రిస్తామన్నారు. జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ ఇంటర్ ప్రాక్టికల్స్ను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని, దీనిపై విద్యార్థులు ఎటువంటి అపోహ పడవద్దన్నారు. -
ఏపీ గ్రూప్స్ పరీక్ష విధానం ఖరారు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూప్ పరీక్షలకు సంబంధించి పరీక్షా విధానం ఖరారు అయింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష విధానాన్ని వెల్లడించింది. ఈ మేరకు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్ష విధానాలపై ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. గ్రూప్-2, 3లకు రెండు పరీక్షలు, ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మెయిన్స్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ఆన్లైన్ ‘పరీక్ష’లో విజయానికి...
ఎగ్జామ్ టిప్స్ ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది.. అన్ని విభాగాల మాదిరిగానే చదువు, పోటీ పరీక్షలు కూడా ‘ఆన్లైన్’ బాటలో నడుస్తున్నాయి. ఐబీపీఎస్, ఆర్ఆర్బీ వంటి ఉద్యోగ నియామక పరీక్షలతో పాటు క్యాట్, గేట్ వంటి ప్రవేశ పరీక్షలూ ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఆన్లైన్ పరీక్షల వల్ల ఉపయోగాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. వీటిని అధిగమించడానికి మార్గాలు.. అభ్యర్థులు మొదట ఆన్లైన్ పరీక్ష విధానంపై అవగాహన పెంపొందించుకోవాలి. దరఖాస్తు విధానం, పరీక్ష కేంద్రాలు, స్లాట్ బుకింగ్, ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్, పరీక్ష విధానం తదితరాల గురించి ముందే తెలుసుకోవాలి. లేకుంటే పరీక్ష రోజు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్లు కీలకం వీలైనన్ని ఎక్కువ ఆన్లైన్ మాక్టెస్ట్లు రాయాలి. దీనివల్ల ఆన్లైన్ పరీక్షపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. పరీక్ష సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్, ఎస్సే... ప్రశ్నలకు ఆన్లైన్లో సమాధానాలు ఎలా రాయాలో తెలుస్తుంది. తరచూ ఎలాంటి తప్పులు చేస్తున్నామో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవచ్చు. ప్రాక్టీస్ చేసేటప్పుడు సమయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సెక్షన్ల వారీగా సమయాన్ని నిర్దేశించుకుని, ప్రాక్టీస్ చేయాలి. వేగం, కచ్చితత్వం అవసరం ప్రాక్టీస్ సమయంలోనే ప్రశ్నను వేగంగా చదివి అర్థం చేసుకుని తక్కువ సమయంలో కచ్చితమైన సమాధానం గుర్తించేలా సాధన చేయాలి. లేకపోతే ప్రశ్న పెద్దగా, క్లిష్టంగా ఉన్నప్పుడు సమయం వృథా అవ డమే కాక చివర్లో సమయం సరిపోక ఇబ్బంది పడేలా చేస్తుంది. మ్యాథమెటిక్స్, డేటా అనాలసిస్ వంటి సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే క్రమంలో.. వీలైనంతలో పెన్-పేపర్ అవసరం లేకుండా ప్రాక్టీస్ చేయాలి. మార్గదర్శకాలు చదవాలి పరీక్ష ప్రారంభానికి ముందు తప్పనిసరిగా గైడ్లైన్స్ చదవాలి. దీని వల్ల సమయం ఆదా చేయడం, పరీక్ష విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. పరీక్ష రాసేటప్పుడు టైం కీలక పాత్ర పోషిస్తుంది. తెలివిగా ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. పేజీ పైభాగంలో కనిపించే కౌంట్డౌన్ డిస్ప్లే గమనిస్తూ పరీక్ష రాయాలి. దీని వల్ల ఏ సెక్షన్కు ఎంత సమయం కేటాయిస్తున్నామో తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు. కంప్యూటర్ విషయంలో జాగ్రత్తలు * పరీక్ష సమయానికి ముందే పరీక్షహాలుకు చేరుకుని నెట్ కనెక్షన్, కంప్యూటర్ను చెక్ చేసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే యాజమాన్యానికి తెలియజేయాలి. వైర్లెస్ ఇంటర్నెట్ కంటే కేబుల్ నెట్ కనెక్షన్కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. * పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి నావిగేషన్ బటన్లను (బ్యాక్, హోం, ఫార్వోడ్, రీఫ్రెష్, రీలోడ్) ఉపయోగించకూడదు. * పేజీ పూర్తిగా లోడ్ అయ్యే వరకు వేచి ఉండాలి. పేజీ పూర్తిగా లోడ్ కాకుండానే పరీక్ష రాయడం ప్రారంభిస్తే కొన్ని ప్రశ్నలు మిస్ అయ్యే అవకాశం ఉంది. * ప్రతి ప్రశ్నకు సమాధానం క్లిక్ చేశాక సేవ్ చేయడం మరచిపోవద్దు. * పరీక్ష రాయడం పూర్తయితే, అన్ని ప్రశ్నలను ఒకసారి చెక్ చేసుకొని, అప్పుడు సబ్మిట్ బటన్ నొక్కాలి. * సబ్మిట్ చే సేటప్పుడు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా కొంచెం ముందుగానే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక కన్ఫర్మేషన్ పాస్వర్డ్ వచ్చే వరకు వేచి ఉండాలి. కన్ఫర్మేషన్ పాస్వర్డ్ రాకపోతే సబ్మిట్ కాలేదని అర్థం. వెంటనే ఇన్విజిలేటర్కి తెలియజేసి, సరిగా సబ్మిట్ అయ్యేలా చూసుకోవాలి. -
రేపు ‘వ్యవసాయ’ పోస్టులకు పరీక్ష
26 కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్ష హాజరుకానున్న 7,645 మంది అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విస్తరణ అధికారి (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శనివారం పరీక్ష నిర్వహించనుంది. హెచ్ఎండీఏ పరిధిలో ఏర్పాటుచేసిన 26 కేంద్రాల్లో 7,645 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా ఆన్లైన్లో పరీక్షకు ఏర్పాట్లు చేశామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ గురువారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 పరీక్ష (జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 (అగ్రికల్చర్) పరీక్ష జరగనుంది. అభ్యర్థులను నిర్దేశిత సమయం కన్నా గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరని పార్వతి సుబ్రమణియన్ తెలిపారు. -
ఏఎంవీఐ పోస్టులకు నేడు ఆన్లైన్ పరీక్ష
-
ఏఎంవీఐ పోస్టులకు నేడు ఆన్లైన్ పరీక్ష
కమాండ్ సెంటర్కు రానున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ పరీక్ష తీరును పరిశీలించనున్న కర్ణాటక బృందం సాక్షి, హైదరాబాద్ : అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఆదివారం ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుంది. హెచ్ఎండీఏ పరిధిలో ఏర్పాటుచేసిన 15 కేంద్రాల్లో మొత్తం 6,053 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే.. టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న ఆన్లైన్ సీఆర్బీటీ పరీక్షల విధానాన్ని అధ్యయనం చేసేందుకు శనివారం కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆరుగురు సభ్యుల బృందం హైదరాబాద్కు వచ్చింది. టీఎస్పీఎస్సీ భవన్లో సుమారు 2గంటల పాటు ఆన్లైన్ పరీక్ష విధానాన్ని పరిశీలించిన కర్ణాటక బృందం, ఆదివారం జరగనున్న ఏఎం వీఐ పరీక్ష నిర్వహణనూ పలు కేంద్రాలకు వెళ్లి పరిశీలించనుంది. కర్ణాటక నుంచి వచ్చిన బృందంలో ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు డాక్టర్ మహదేవ, హెచ్డీ పాటిల్, నాగభాయ్, రఘునందన్, గోవిం దయ్య, మైఖేల్ సైమన్ ఉన్నారు. అలాగే, ఆదివారం జరగనున్న ఆన్లైన్ పరీక్షా విధానాన్ని పరిశీలించేందుకు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ టీఎస్పీఎస్సీ భవన్కు వస్తున్నారని, టీఎస్పీఎస్సీ భవన్లో ఏర్పాటు చేసిన కమాండ్ సెంటర్ను ఆయన సందర్శిస్తారని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ తెలిపారు. ఏఈ రాత పరీక్షకు 64 శాతం హాజరు వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకోసం శనివారం టీఎస్పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షకు 64 శాతం మంది హాజరైనట్లు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ తెలిపారు. ఐదు జిల్లాల్లో 101 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. పరీక్షకు మొత్తం 63 వేలమంది దరఖాస్తు చేసుకోగా, అధికంగా హైదరాబాద్/రంగారెడ్డి నుంచి 82 శాతం, కరీంనగర్ నుంచి 71.36 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. -
ప్రారంభమైన AEE ఆన్లైన్ పరీక్ష