orange
-
రామ్చరణ్తో పోటీపడేంతవాడివా సిద్ధూ...
సిద్ధు జొన్నలగడ్డ చిన్నస్థాయి నుంచి సినీ పరిశ్రమలో స్టార్ బాయ్గా ఎదగడం సినీ పరిశ్రమలోని ఔత్సాహిక నటీనటులకు పెద్ద ప్రేరణ. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో హోదా సాధించాడు. అయితే ఇదేమీ అలవోకగా సాధించేసింది కాదు. దాదాపుగా దశాబ్ధంన్నర పాటు పడిన కష్టం దీని వెనుక ఉంది. సీనియర్ హీరో రవితేజలాగా అత్యంత చిన్న స్థాయి పాత్రలు వేస్తూ పెద్ద స్టార్గా ఎదిగిన వర్ధమాన హీరోల్లో సిద్ధూ ముందు వరుసలో ఉంటాడు.డీజే టిల్లు 1, 2 భాగాలు సిద్ధూని ఒకేసారి పెద్ద స్టార్గా మార్చేశాయి. అతని తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లు ద్వారా పూర్తిగా వన్మ్యాన్ షో చేశాడని చెప్పాలి. ఆ సినిమాలో వెరైటీ మాడ్యులేషన్తో యాక్షన్, కామెడీని పండించి సరికొత్త హీరోయిజాన్ని రుచి చూపించిన సిద్ధూ ఆ సినిమాకి కధారచయితగా కూడా వ్యవహరించడం విశేషం. జోష్ సినిమాలో చిన్నపాత్రతో మొదలైన సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్ తర్వాత కూడా డాన్ శీను, భీమిలి కబడ్డి జట్టు..లాంటి పలు చిత్రాల్లో అలాంటి పాత్రలతోనే కొనసాగింది. ఆ తర్వాత ఈ యువ హీరో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్లో తొలిసారిగా ప్రధాన పాత్రలో అరంగేట్రం చేసిన సిద్ధూ హీరోగా మారి గుంటూరు టాకీస్ వంటి ఎ సర్టిఫైడ్ చిత్రాల ద్వారా హిట్స్ దక్కించుకున్నాడు. అదే విధంగా తను నటించిన చిత్రాల్లో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా కోవిడ్ సమయంలో ధియేటర్లలో విడుదలకు నోచుకోలేక కేవలం ఓటీటీలో మాత్రమే విడుదలైంది.పెద్దలకు మాత్రమే అన్నట్టుగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో రొమాంటిక్ మూవీగా హిట్ టాక్ తెచ్చుకుంది కూడా. ఆ తర్వాత మారిన పరిణామాల్లో సిధ్దూకి డిజె టిల్లు తెచ్చిపెట్టిన క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందనుకున్నారు. యూత్లో సిధ్దూకి ఉన్న ఫాలోయింగ్ని దృష్టిలో ఉంచుకుని వాలెంటైన్స్ డే సందర్భంగా ధియేటర్లలో విడుదల చేసేశారు కూడా. ఇక్కడ గమనించాల్సిన విశేషం ఏమిటంటే అదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రం రీ రిలీజ్ కూడా ఉండడం.అప్పట్లో ఆరెంజ్ సినిమా కు విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ కమర్షియల్గా ఫ్లాప్ చిత్రంగానే నిలిచింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా రీ రిలీజ్ అదే రోజు సిద్ధూ జొన్నలగడ్డ సినిమా రీ రిలీజ్ ఉండడం సినీ వర్గాల్లో ఆసక్తి నింపాయి. మరో చెప్పుకోదగ్గ విశేషం... నాటి ఆరెంజ్ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సైతం సంతోష్ అనే చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమాలో హీరో రామ్ చరణ్కి పోటీగా హీరోయిన్ ని ప్రేమలో పడేలా చేసే ముగ్గురు అబ్బాయిల్లో ఒకడిగా చేశాడు. ఆసక్తికరంగా... సిద్ధూ ఆరెంజ్ చిత్రాన్ని రూపొందించిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోనే తదుపరి జాక్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ వారం ఆసక్తికరంగా, సిద్ధు ’ఇట్స్ కాంప్లికేటెడ్’ (కృష్ణ అండ్ అతని లీల) పేరుతో ఆరెంజ్కి పోటీగా విడుదలైంది. ఓ యువ హీరో సినిమా రీ రిలీజ్కు నోచుకోవడం కూడా ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ముందూ వెనుకా చూసుకోకుండా సిద్ధూ తన సినిమాని రామ్చరణ్ సినిమా రీ రిలీజ్ రోజునే విడుదల చేయడంతో ఇప్పుడు వీరిద్దరిని పోలుస్తూ కామెంట్ చేయడం మొదలైంది. మరోవైపు రీరిలీజ్లో సిద్ధూ చిత్రం పూర్తిగా చతికిలబడగా రామ్ చరణ్ ఆరెంజ్ అనూహ్యంగా భారీ కలెక్షన్లు సాధించింది.తెలుగు చిత్రసీమలో సిద్ధూ ఎదుగుదల ప్రశంసించదగ్గదే. స్థిరత్వం అంకితభావంతో సినీ పరిశ్రమలో ఒక నటుడి జీవితం ఎలా మారుతుందో చెప్పడానికి సిద్ధూ ఒక ఉదాహరణ. అయితే పెద్దగా అండదండలు లేని హీరోల స్టార్ డమ్ ఎప్పుడూ నిలకడగా ఉండడం తెలుగు చిత్రసీమలో సాధ్యం కాదని సిధ్దూ గుర్తించాలి. అన్ని రకాలుగా తమకన్నా పెద్ద హీరోలతో పోటీ పడే విషయంలో యువ హీరోలు కాస్త వివేకంతో వ్యవహరించాలని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. -
రామ్ చరణ్ ఫ్యాన్స్కు లవర్స్ డే కానుక.. రొమాంటిక్ చిత్రం రీ రిలీజ్
రామ్ చరణ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా గ్లోబల్ స్టార్ అభిమానులను రొమాంటిక్ ఎంటర్టైనర్ అలరించనుంది. రామ్ చరణ్- జెనీలియా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ఆరెంజ్ ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆరెంజ్ సినిమా (Orange Movie) రీ రిలీజ్ కానుంది. ఆరెంజ్ సినిమా (Orange Movie) వచ్చి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ఫిబ్రవరి 14న థియేటర్లలో సినీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. హరీశ్ జయరాజ్ సంగీతం అందించాడు.ఈ చిత్రంలో షాజాన్ పదమ్సీ, ప్రభు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాగ బాబు కీలక పాత్రల్లో నటించారు.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ16 పేరుతో మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ మూవీతో సినీ ప్రియులను అలరించాడు చెర్రీ. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. -
ప్రేమలో పడ్డ 'ఆరెంజ్' హీరోయిన్.. ప్రియుడు ఎవరంటే? (ఫొటోలు)
-
నిశ్చితార్థం చేసుకున్న రామ్ చరణ్ 'ఆరెంజ్' హీరోయిన్
రామ్ చరణ్ 'ఆరెంజ్' సినిమాలో హీరోయిన్గా చేసిన షాజన్ పదమ్సీ నిశ్చితార్థం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న ఆశిష్ కనాకియ అనే బిజినెస్మ్యాన్తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త లైఫ్ మొదలుపెట్టేందుకు ఆగలేకపోతున్నా అని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.(ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)ముంబైకి చెందిన షాజన్.. 2009లో 'రాకెట్ సింగ్' సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాతి ఏడాది తెలుగులో రామ్ చరణ హీరోగా నటించిన 'ఆరెంజ్' మూవీలో రూబా అనే పాత్రలో కనిపించించింది. ఫ్లాష్ బ్యాక్లో ఈమె కనిపిస్తుంది. దీని తర్వాత వెంకటేశ్-రామ్ 'మసాలా' సినిమాలోనూ నటించింది. ఈ రెండు ఫ్లాప్ కావడంతో తెలుగులో మరో ఛాన్స్ ఈమెకు రాలేదు.కెరీర్ మొత్తంలో 6-7 సినిమాలు మాత్రమే చేసిన షాజన్... ప్రస్తుతం జీఓఏటీస్ అనే టీవీ షో చేస్తోంది. ఇప్పుడు 'మూవీ మ్యాక్స్' థియేటర్లకు సీఈఓ అయిన ఆశిష్ కనాకియాతో పెళ్లికి సిద్ధమైంది. వీళ్లిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో వీళ్లిద్దరి పెళ్లి ఉండే అవకాశముంది.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్తో నయనతార గొడవ) -
ఆరెంజ్ గింజలతో లాభాల గురించి తెలిస్తే, అస్సలు వదలరు!
ఆరోగ్యం కోసం నారింజ పండ్లను తింటాం. తొందరగా శక్తి రావాలంటే ఆరెంజ్ జ్యూస్ తాగుతాం. ఎందుకంటే ఇందులో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఏ విటమిన్, మినరల్, ఫైబర్ కూడా లభిస్తాయి. అలాగే నారింజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని సున్నిపిండిలో వాడతాం. హెర్బల్ టీలో కూడా వాడతామని మనకు తెలుసు. కానీ నారింజ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు న్నాయని మీకు తెలుసా? తెలుసుకుందాం రండి!ఆరెంజ్ పండ్ల మాదిరిగానే, దాని గింజలు కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి మన శరీరాన్ని హైడ్రేటెడ్, తాజాగా ఉంచుతాయి. మొత్తం ఆరోగ్యాన్ని ఇవి మేలు చేస్తాయి. ఆరెంజ్ గింజల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. రోజుకు మనకు కావాల్సిన దాంట్లో 116.2శాతం వీటిల్లో లభిస్తాయట. విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు కేన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్,అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యల నివారణలో ఉపయోగపడతాయి.ఎనర్జీ బూస్టర్ నారింజ గింజలలో పాల్మిటిక్, ఒలీక్, లినోలిక్ ఆమ్లాలు ఉండటం వల్ల మానవ కణాలలో ఎక్కువ కాలం శక్తిని నిల్వ ఉంచుతుంది. శరీరంలో శక్తి స్థాయిని వేగవంతం చేస్తాయి.గుండె ఆరోగ్యానికి మంచిది: ఆరెంజ్ గింజల్లో మోనోఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.జుట్టు: ఆరెంజ్ గింజల నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ నూనెను జుట్టుకు కండీషనర్గాపనిచేస్తుంది. నారింజ గింజలలో విటమిన్ సి, బయో-ఫ్లేవనాయిడ్స్కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. నారింజ గింజలలో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)చర్మానికి మెరుపు: వీటిల్లో పుష్కలంగా లభించే విటమిన్ సీ చర్మానికి మేలు చేస్తుంది. సహజమైన మెరుపునిస్తుంది. అంతేకాదు ముడతలు, మచ్చలు తగ్గుతాయి. కంటి ఆరోగ్యం: వీటిల్లో కెరోటినాయిడ్స్, విటమిన్ ఎ కళ్లలోని శ్లేష్మ పొరలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వయస్సు-సంబంధిత కండరాల క్షీణతను నివారిస్తుంది. బీపీ నియంత్రణ: ఆరెంజ్ గింజల్లో విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును అదుపు చేయడంలో కీలక ప్రాత పోషిస్తుంది. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)కేన్సర్: ఆరెంజ్ గింజలు ప్రతిరోజు తినడం వల్ల చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్తో పోరాడడంలో సహాయ పడతాయి. ఇంట్లో చెడువాసన పోవాలంటేనారింజ గింజల నీటిని, కేక్ ఐసింగ్కు వాడతారు. అంతేకాదు సిట్రస్ సువాసన కోసం బాత్టబ్కు దీని ఆయిల్ వాడవచ్చు. ఇంట్లో అసహ్యకరమైన వాసనను పోగొట్టేందుకు డిఫ్యూజర్ నూనెగా కూడా దీన్ని వినియోగించుకోవచ్చు.ఆరెంజ్ విత్తనాలను ఎలావాడాలి?చిరు చేదుగా ఉండే ఆరింజ గింజల నూనె, పొడి రూపంలో వాడుకోవచ్చు. ఇవి మార్కెట్లో లభిస్తాయి. -
అబ్బా.. తొక్కేం కాదు! నారింజ పుట్టగొడుగు!!
నేల మీద ఎవరో నారింజ తొక్కలను పడేసినట్లుగా ఉంది కదూ! నారింజ తొక్కలేమీ కాదు, ఇవి పుట్టగొడుగులు. నారింజ తొక్కల్లా కనిపించడం వల్ల ఈ పుట్టగొడుగులు ‘ఆరెంజ్ పీల్ ఫంగస్’గా పేరు పొందాయి. ఈ పుట్టగొడుగుల శాస్త్రీయ నామం ‘అల్యూరియా ఆరాంటియా’.చక్కని నారింజ రంగులో, అప్పుడే వలిచిన తజా నారింజ తొక్కల్లా కనిపించే ఈ అరుదైన పుట్టగొడుగులు ఉత్తర అమెరికాలోను, యూరోప్లోని కొన్ని ప్రాంతాల్లోను, చిలీ దక్షిణ ప్రాంతంలోను ఆగస్టు నుంచి నవంబర్ నెలల మధ్య కాలంలో కనిపిస్తాయి. ఈ పుట్టగొడుగులు కొద్దిపాటి తేమ ఉన్న మట్టి నేలల్లో పెరుగుతాయి. ఈ పుట్టగొడుగులు తినడానికి పనికి వస్తాయి.ఇవి చదవండి: దస్తూరి అయాచిత వరం! -
గుజరాత్లో వర్ష బీభత్సం
భారీ వర్షాలు గుజారాత్ను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని గిర్ సోమనాథ్, అమ్రేలి, ఖేడా, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, మహిసాగర్, భరూచ్, నర్మద, సూరత్, ఛోటా ఉదేపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న సుమారు 300 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆగస్టు 28న సౌరాష్ట్రలోని కచ్, జామ్నగర్, రాజ్కోట్, దేవభూమి ద్వారక, జునాగఢ్ పోర్బందర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. Gujarat Rain: Sardar Sarovar Dam Water Level Rises, all the Gates Opened; Coastal Villages on High Alert…Whereas Vadodara city & district is on high alert because Ajwa Lake and Vishwamitri River crossed danger mark, causing widespread flooding in the city. pic.twitter.com/6zHM5T5428— ~ Mr_Perfect ~ (@HadkulaTiger1) August 26, 2024 -
14 ఏళ్ల క్రితం సంఘటనలు.. మళ్లీ అక్కడ గుర్తుచేసుకున్న రామ్ చరణ్
అస్ట్రేలియాలో రామ్ చరణ్ దంపతులు సందడి చేస్తున్నారు. మెల్బోర్న్ వేదికగా 'ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్' 15వ ఎడిషన్కు గౌరవ అతిథిగా రామ్చరణ్ హజరయ్యారు. మెల్బోర్న్లోని ఫెడరేషన్ స్క్వేర్ కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో ఉపాసనతో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రామ్ చరణ్ చేసిన సేవలకుగాను ‘ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్’ గా ఆ వేదికపై అవార్డును అందుకున్నారు.ఆగస్టు 15 నుంచి 25 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ‘ఆర్ట్ అండ్ కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్’గా ఎంపికైనవారు ఈ అంతర్జాతీయ వేదకపై గౌరవ అతిథిగా పాల్గొంటారు. ఈ క్రమంలో ఆ అదృష్టం రామ్చరణ్ని వరించింది. దీంతో ఆయన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. అవార్డ్ అందుకున్న అనంతరం రామ్చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.సుమారు 14 ఏళ్ల క్రితం విడుదలైన తన ఆరెంజ్ సినిమా విషయాలను అక్కడి అభిమానులతో చరణ్ మరోసారి పంచుకున్నారు. మెల్బోర్న్లో 30రోజుల పాటు తన ఆరెంజ్ షూటింగ్ జరిగిందని ఆయన తెలిపారు. అది తన మూడో సినిమా అని కూడా చరణ్ గుర్తుచూసుకున్నారు. అయితే, సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇండియాకు తిరిగి వెళ్లాల్సిన సమయంలో చాలా బాధ అనిపించిందని అన్నారు. ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమను తాను ఇప్పటికీ మర్చిపోలేకున్నానని చరణ్ చెప్పారు. మెల్బోర్న్లో ఇంతమంది భారతీయులను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భారతీయ చిత్రపరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అనేదే ఎన్ఆర్ఐల వల్లే అని ఆయన అన్నారు. అలా 14 ఏళ్ల క్రితం మెల్బోర్న్లో జరిగిన పలు ఆసక్తికరమైన విషయాలను చరణ్ పంచుకున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
వాతావరణశాఖ అలర్ట్: ఐదు రాష్ట్రాలకు రెడ్.. 16 రాష్ట్రాలకు ఆరెంజ్
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అసోంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అసోం పొరుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా భారత వాతావరణశాఖ ఐదు రాష్ట్రాలకు రెడ్, 16 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. అలాగే దక్షిణ మధ్య భారతదేశంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.జమ్ముకశ్మీర్, రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో వాతావరణం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో వాతావరణం సామాన్యంగా ఉండనుంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్తో పాటు ఉత్తర భారత్లోని రాష్ట్రాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం 9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సోమవారం, మంగళవారాల్లో ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ జాబితాలో మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, అరుణాచల్ప్రదేశ్ ఉన్నాయి. -
కేరళలో భారీ వర్షాలు.. విద్యాసంస్థల మూసివేత
కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణశాఖ పలు హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు కేరళ మీదుగా మరికొన్ని రోజులు కొనసాగనున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.మహారాష్ట్ర-కేరళ తీరాల వెంబడి సముద్ర మట్టంలో ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మధ్య గుజరాత్ పరిసర ప్రాంతాలలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. కేరళ తీరంలో గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపధ్యంలో కేరళలోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పతనంతిట్ట, కొట్టాయం, అలప్పుజ, ఇడుక్కి, ఎర్నాకుళం, వయనాడ్లలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావం
ప్రపంచంలో నారింజ పండ్ల దిగుబడి తగ్గుతుంది. ఆరెంజ్ జ్యూస్లో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న బ్రెజిల్లో ఈ ఏడాది భారీగా పంటనష్టం జరిగింది. గత 36 ఏళ్లలో ఎప్పుడూలేని విధంగా ఈసారి ఏర్పడిన వేడిగాలులతో తీవ్రంగా పంటనష్టం వాటిల్లినట్లు పరిశోదనా బృందం ఫండెసిట్రస్ తెలిపింది.ఏటా ఏప్రిల్ ప్రారంభం నుంచి ఆరెంజ్ పండ్ల సీజన్ మొదలవుతుంది. బ్రెజిల్లో ఈ సీజన్లో ఇప్పటివరకు 232.4 మిలియన్ బాక్సుల ఆరెంజ్ పండ్ల ఉత్పత్తి జరిగినట్లు ఫండెసిట్రస్ నివేదిక తెలిపింది. ఇందులో ఒక్కో బాక్స్ బరువు 90 పౌండ్లు(40.8 కిలోలు) ఉంటుంది. ఈసారి నమోదైన ఉత్పత్తి గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 24 శాతం క్షీణించింది.ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లు రిజస్టరైన ఐసీఈ ఫ్యూచర్స్ యూఎస్లో ఈ ఏడాది 26 శాతం లాభపడింది. గడిచిన మూడు నెలల వ్యవధిలో ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లు అత్యధికంగా 5 శాతం పెరిగాయి. హీట్వేవ్ కారణంగా ఉత్పత్తి తగ్గడంతో భవిష్యత్తులో ఆశించిన ఫలితాలు రావని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది సెప్టెంబరు-నవంబర్ మధ్య ఆరెంజ్ పంట సాగుకు సిద్ధమైతే ఈ సమయం వరకు సమృద్ధిగా పంట చేతికి వచ్చేది. కానీ వేడిగాలుల వల్ల పంటకాలం ఆలస్యమైంది. దాంతో సరైన దిగుబడి రాదని నివేదిక చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నారింజ రసం సరఫరాలో బ్రెజిల్ మొదటిస్థానంలో ఉంది. దేశం మొత్తం పానీయాల ఎగుమతుల్లో 70 శాతం వాటా ఆరెంజ్ జ్యూస్దే అవ్వడం గమనార్హం. -
‘హలో ఫ్రెండ్స్.. హెలికాప్టర్లో ఆరంజ్ పార్టీ’ ఇప్పుడేమంటారో..
పాట్నా: హెలికాప్టర్లో ‘ఫిష్ పార్టీ’ వీడియో వివాదం తర్వాత మరో వీడియోను షేర్ చేశారు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్. హెలికాప్టర్లో వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముఖేష్ సాహ్నితో కలిసి ఫిష్ పార్టీ వివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా తేజస్వి యాదవ్ గురువారం మరో వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో వీరిద్దరూ బత్తాయి పండ్లను ఆస్వాదించడాన్ని చూడవచ్చు. "హలో ఫ్రెండ్స్, ఈ రోజు హెలికాప్టర్లో ఆరెంజ్ పార్టీ జరుగుతోంది. వారు (బీజేపీ నేతలు) ఆరెంజ్ రంగుపై వివాదం చేయరు కదా?" అంటూ బీజేపీకి చురకలు అంటిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో రాసుకొచ్చారు. ఇంతకు ముందు షేర్ చేసిన వీడియోలో తేజస్వి యాదవ్ చేపలు తింటూ కనిపించడంపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. నవరాత్రుల వేళ మాంసాహార భోజనమా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. హెలికాప్టర్ లోపల చిత్రీకరించిన ఈ వీడియోలో వీఐపీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి ముఖేష్ సాహ్నితో కలిసి తేజస్వి యాదవ్ భోజనం చేస్తూ కనిపించారు. బీజేపీ విమర్శలపై తేజస్వి యాదవ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియో నవరాత్రి ఉత్సవాలకు ముందు రికార్డ్ చేసిందని, తనను విమర్శించేవారికి "తక్కువ ఐక్యూ" ఉందని ఆరోపించారు. हैलो फ्रैंड्स, आज हेलीकॉप्टर में नारंगी पार्टी हुई। Orange के रंग से तो वो नहीं ना चिढ़ेंगे? #TejashwiYadav #Trending #Viral pic.twitter.com/FlhuyMhM6f — Tejashwi Yadav (@yadavtejashwi) April 10, 2024 -
'ఆరెంజ్ మార్మాలాడే' రెసిపీ చేసిన సోనియా, రాహుల్!
ఈ రోజుతో 2023 ముగిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి ఆదివారాన్ని ఆరెంజ్ మార్మలాడే(ప్రిజర్వ్డ్ ఫ్రూట్ జామ్) అనే రెసీపీ ప్రీపరేషన్తో గడిపారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్. ఈ వంటకం రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు ఇష్టమైనదట. అందుకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లోగోతో కూడిన తన యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. సోనియా, రాహుల్ ఇద్దరు కలిసి కిచెన్ గార్డెన్లోకి వెళ్లి పండ్లను తెచ్చి ఒక బుట్టలో వేసుకుని వస్తారు. ఈ రెసిపీ కోసం పూర్తిగా పండినవే కోయాలని సోనియా చెప్పగా, రాహుల్ నవ్వుతూ.. అవే ఎందుకు కోయాలంటూ చిలిపిగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఇద్దరు వంటగదిలోకి వచ్చి వాటిని శుభ్రం చేసి నారింజ జ్యూస్ తీశారు. ఆ జ్యూస్ని, చక్కెరని అల్యూమినియం పోసి స్టవ్పై ఉంచి ఉడికించారు. రాహుల్ ఆ మిశ్రమాన్ని కలుపుతూ అమ్మా బీజేపీ వాళ్లు ఈ జామ్ కావాలంటే..వాళ్లకు కూడా ఇద్దామా! అని సరదాగా అన్నారు రాహుల్. అందుకు ప్రతిగా సోనియా మనపైకే తిరిగి విసిరేస్తారు అని నవ్వుతూ సెటైర్ వేశారు. మంచిది అప్పుడు ఆ జామ్ మొత్తం మనకే సొంతం అని రాహుల్ అనడంతో ఇరువురి ముఖాల్లో పెద్దగా నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా సోనియా గాంధీ దశాబ్దాల క్రితం భారతీయ వంటకాలకు తాను అలవాటు పడటానికి ఎల ఆ కష్టపడ్డానో వివరించారు. ముఖ్యంగా భారతీయ రుచుల్లో మిరపకాయలకు అడ్జెట్ అవ్వడానికి చాలా టైం పట్టిందని సోనియా చెప్పుకొచ్చారు. ఇక ఈలోగా మార్మాలాడే రెసీపీ తయారవ్వడంతో ఆ మిశ్రమాన్ని గాజు సీసాల్లో తల్లి కొడుకులు ఇరువురు సర్ధి వాటి మూతలతో క్లోజ్ చేసి పైన ఒక లవ్ సింబల్ ఆకారంలోని కార్డుని ఉంచారు. ఆ కార్డుపై ప్రేమతో మీ సోనియా, రాహుల్ అని రాశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: రోబొటిక్ పెట్ని ఆవిష్కరించిన 12 ఏళ్ల చిన్నారి! పెంపు జంతువులకు ప్రత్యామ్నాయంగా..) -
ఖాళీ కడుపుతో నారింజ తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
చలికాలంలో వచ్చే సాధారణ సమస్యలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బొంగురుపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. అయితే చలికాలంలో రోజూ పండ్లు తింటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అదీ పుల్లటి నారింజ పండు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. అదెలాగో చూద్దామా.. అసలే చలికాలం కదా... నారింజ తింటే జలుబు వస్తుందనే భయంతో ఎక్కువ మంది తినడం లేదు. అయితే చలికాలంలో నారింజ పండ్లు తినడం చాలా మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. జలుబు–దగ్గు మొదలైన వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులలో కఫం ఉంటే నారింజ మీకు ఔషధం.శీతాకాలంలో నారింజ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శరీరం లోపల నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రతిరోజూ రెండు నారింజలను తింటే, మీ రోజువారీ మోతాదుకు తగ్గ విటమిన్ సి లభిస్తుంది. ఫలితంగా శరీరం లోపల బలం పెరుగుతుంది. ఇది కాకుండా, నారింజలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ శరీరంలో మంట లేదా ఇన్ఫెక్షన్ వంటి వాటికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. నారింజ పండ్లను తినడం వల్ల ముఖం, ముఖంపై ఉండే మొటిమలు మాయమవుతాయి. ఇది శరీరాన్ని ఎక్కువసేపు తేమగా ఉంచుతుంది. ముఖంపై పగుళ్లు, పొడిబారడం వంటి సమస్యలను ఇది సరిచేస్తుంది. నారింజ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. ఇది మీ శరీరంలో ఎసిడిటీకి దారితీస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మధ్యాహ్నం పూట ఈ పండును తినడం మంచిది. అయితే మంచిది కదా అని రోజుకు రెండు పండ్ల కంటే ఎక్కువ తినకూడదు. అలా తినడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. -
పరోక్షంగా పార్టీ ప్రచారం కూడా జరుగుతుంటుంది!
పరోక్షంగా పార్టీ ప్రచారం కూడా జరుగుతుంటుంది! -
నారింజ తొక్కలను తీసిపారేయకుండా ఇలా చేయండి
సిట్రస్ ఫ్రూట్స్లో నారింజ పండు చాలా ప్రత్యేకం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వీటిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.. ఇలా నారింజ పండుతో బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయన్నది తెలిసిందే. అయితే నారింజ పండ్లను తినేసి తొక్కే కదా తీసిపారేస్తాం.కానీ ఇప్పట్నుంచి అలా చేయకండి. నారింజ తొక్కలతో మంచి సువాసన భరితమైన కొవ్వత్తులను తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. తయారీకి కావాల్సిన పదార్థాలు నారింజ తొక్కలు కత్తి లేదా టేబుల్ స్పూన్ నూనె(వెజిటెబుల్, ఆలివ్, ఏదైనా) నారింజ పండును ముందుగా రెండు భాగాలుగా కట్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సహాయంతో గుజ్జును వేరు చేయండి. కొవ్వొత్తిని తయారుచేయడానికి లోపలున్న విక్ను అలాగే ఉంచండి. ఇప్పుడు ఆ నారింజ పండులో వెజిటెబుల్ ఆయిల్ లేదా కరిగించిన మైనాన్ని జాగ్రత్తగా పోసి ఆరనివ్వండి. ఆ తర్వాత విక్ను వెలిగించండి..అంతే మీ ఆరెంజ్ క్యాండిల్ రెడీ అయినట్లే. నారింజలోని సిట్రస్ వల్ల క్యాండిల్ వెలిగించినప్పుడు ఇంట్లో మంచి సువాసనను వెదజల్లుతుంది. -
Summer Care: టొమాటో జ్యూస్, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అయితే!
వేసవి వచ్చేసింది. చలికాలంలో లాగే వేసవిలో కూడా చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎందుకంటే, వేసవిలో చర్మం ట్యానింగ్, నిగారింపు కోల్పోవడం, పొడిగా మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే రోజూ ఈ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోవల్సిందే. వీటివల్ల చర్మకాంతి పెరిగి యౌవనంగా కనిపిస్తారు. ఆరెంజ్ జ్యూస్ చర్మకాంతిని పెంచే విటిమిన్ సి సమృద్ధిగా ఉండేవాటిలో నారింజ లేదా కమలా పండ్లు ముందుంటాయి. నారింజ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది కాబట్టి క్రమం తప్పకుండా ఆరంజ్ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. టొమాటో జ్యూస్ టొమాటోలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధకత శక్తిని కలిగిస్తాయి. రోజూ టొమాటో జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం యౌవనంగా, కాంతిమంతంగా ఉంటుంది. టొమాటోను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి అద్భుత ఔషధం బీట్రూట్ జ్యూస్. ప్రతిరోజూ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు సమృద్ధిగా ఉండేది దానిమ్మలోనే. అందువల్ల రోజూ దానిమ్మ జ్యూస్ సేవించడం ద్వారా చర్మంలో నిగారింపు వస్తుంది. ముఖంలో కాంతి వస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్థులు కూడా దానిమ్మ జ్యూస్ తీసుకోవచ్చు. అయితే అందులో రుచికి పంచదార కలుపుకోకూడదు. గ్రీన్ టీ కేవలం బరువు తగ్గించేందుకే కాకుండా చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది గ్రీన్ టీ. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. చదవండి: ఒత్తిడికి దూరంగా ఉండాలంటే..? -
కొబ్బరి పాలతో స్క్రబ్.. వేపాకులు వేసిన నీటితో స్నానం చేస్తే..
చర్మ యవ్వనంగా కనిపించాలని.. మేని మెరిసిపోవాలని కోరుకునే వారు ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి. కొబ్బరి పాలతో.. ►కొబ్బరి పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనివల్ల ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ►కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖానికి, మెడకు రుద్దుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ►ఇలా యాంటీ ఏజింగ్ ప్యాక్స్ను వారానికి రెండు నుంచి మూడు సార్లు వేసుకోవడం ద్వారా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు. మేనికాంతికి ఉసిరి.. నిమ్మ... నారింజ తేమను తరచూ మన ముఖానికి రాసుకుంటూ ఉంటే, ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి. తేనెతో పెదవులకు మసాజ్ చేస్తే మృదువుగా, అందంగా కనిపిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మెరిపించడంలో విటమిన్ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందువల్ల విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిని అది దొరికినంతకాలం విరివిగా తీసుకోవాలి. నిమ్మకాయ, నారింజలోనూ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉసిరి దొరకనప్పుడు వీటిని తరచూ తీసుకోవడం వల్ల కూడా అందంగా మారవచ్చు. అలాగే, వేపాకులు వేసిన నీటితో స్నానం చేయడం, తరచు ముఖాన్ని కడుక్కోవడం, ద్రవపదార్థాలు సమృద్ధిగా తీసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు లేకుండా మేని చర్మం మెరుపులీనుతూ ఉంటుంది. చదవండి: Beauty: అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే డివైజ్! ధర ఎంతంటే! -
Health: ప్రతి రోజూ ఓట్స్ తింటున్నారా? గుండెకు సంబంధించి ఈ విషయాలు తెలిస్తే
Heart Healthy Foods- Diet Tips In Telugu: అప్పటిదాకా నచ్చిన రుచులన్నీ కడుపునిండా తిన్న వారికి ఏ డయాబెటిస్సో, గుండెజబ్బో, కొలెస్టరాలో వచ్చిందంటే పాపం! వారి బాధ చెప్పనలవి కాదు. ఎందుకంటే అటు నోరుకట్టుకోనూలేరు, ఇటు ఇష్టం వచ్చినవన్నీ తినడానికీ లేదు. అలాగని పూర్తిగా చప్పిడి తిండే తినమంటే మరీ నీరసించి పోతారు. ఇంతకీ మీరు చెప్పేదేమిటీ అనుకుంటున్నారా? కాస్త ఓపిక పట్టండి మరి! నోటికి రుచికరంగా ఉంటూనే, గుండెకు బలం చేకూరేలా, ఆరోగ్యానికి ఏమాత్రం హాని కలగకుండా కాపాడుకునేలా కొన్ని రకాలైన ఆహార పదార్థాలను సూచిస్తున్నారు వైద్యులూ, పోషకాహారనిపుణులూ. అవేమిటో తెలుసుకుందామా? ఆకుపచ్చని కూరలు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలన్నీ గుండెకు బలాన్నిఇస్తాయి. ముఖ్యంగా బచ్చలి కూర గుండెకు చాలా మంచిది. బచ్చలికూరతో పప్పు వండుకోవచ్చు. సెనగపప్పు వేసి పప్పు కూర చేసుకోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు. అయితే నూనె, ఉప్పు, కారం పరిమితంగానే వాడాలి. టొమాటల్లోని లైకోపిన్ వల్ల టొమాటోలలో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెకు చాలా మంచిది. టొమాటోలలో రక్తపోటును నియంత్రించే పొటాషియం కూడా ఉంటుంది. కాబట్టి పుల్లపుల్లగా, తియ తియ్యగా ఉండే టొమాటోలను విరివిగా తినచ్చు. చేపలు తింటే చేపలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సాల్మన్ ఫిష్ లాంటివి మరింత ఆరోగ్యకరం. గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువ. అందుకే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు తింటే మేలు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది. స్ట్రా బెర్రీలతో స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, బాదం, ఎండు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ గుప్పెడు తింటే గుండెకు చాలా మంచిది. అలాగే ద్రాక్షపండ్లు కూడా గుండెకు సత్తువనిస్తాయి. అయితే ద్రాక్షను రసం తీసి కాకుండా నేరుగా తినడం మేలు. ఎందుకంటే ద్రాక్షరసంలో చక్కెర కలుపుకోవడం అనివార్యం కదా! డార్క్ చాక్లెట్లు తింటే డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు. కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన డార్క్ చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు తగ్గడంతో పాటు రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల మాత్రం గుండెకు మేలు చేకూరకపోగా ముప్పే. అలాగని డార్క్ చాక్లెట్లను కూడా మితిమీరి తినకూడదు. గుండెకు మేలు చేసే 5 ఆహార పదార్థాలు వేరుశెనగ గుండెకు వేరుశెనగ ఎంతో మంచిది. మంచి కొవ్వును కలిగి ఉన్న వేరుశెనగలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. అవి గుండె భేషుగ్గా ఉండటానికి సహకరిస్తాయి. అలాగే వేరుశెనగలో ఉండే ఖనిజాలు గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి. నారింజ గుండె ఆరోగ్యానికి నారింజ పండు చాలా మంచిది. పొటాషియం అధికంగా ఉండే నారింజలో ఎలక్ట్రోలైట్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు కూడా గుండె జబ్బులను నివారించడంలో తోడ్పడతాయి. అవకాడో విటమిన్–ఈతో పాటు అనేక ఇతర పోషకాలు అవకాడోలో సమృద్ధిగా లభిస్తాయి. దీనికితోడు మోనో అన్ –శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఈ పండు గుండెకు చాలా మంచిది. అవకాడోను రోజూ తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండెపోటుతో సహా గుండె సంబంధిత వ్యాధులు నుంచి బయటపడవచ్చు. వాల్నట్స్ రోజూ క్రమం తప్పకుండా కాసిని వాల్నట్స్ను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్కు చెక్ పెట్టొచ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే వాల్నట్స్ హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంతోపాటు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఓట్స్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఓట్స్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఓట్స్లో ఒమేగా 3 ఆమ్లాలు కూడా ఉన్నాయి, ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ప్రతీ రోజూ ఓట్స్ తినడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సరైన పరిష్కారం పొందవచ్చు. చదవండి: Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. Cinnamon Health Benefits: దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? అయితే Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్, షుగర్ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా.. -
గణేష్ ఉత్సవాన్ని ఆరెంజ్ గణపతితో జరుపుకుంటుంది..
-
ప్రకాశం బత్తాయి ఒడిశాకు..
యర్రగొండపాలెం: కరోనా ఉధృతి ప్రారంభం నుంచే బత్తాయి రైతులకు గడ్డుకాలం దాపురించింది. వైరస్ ప్రబలకుండా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో రైతులు విలవిల్లాడారు. కోతకొచ్చి మంచి ధర పలుకుతున్న సమయంలో రవాణా సౌకర్యం ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. లాక్డౌన్ సందర్భంగా ప్రజలు బయట తిరగకపోవడంతో పండ్ల మండీలు మూతవేశారు. ఈ తరుణంలో టన్ను రూ.55 నుంచి రూ.60 వేల మేరకు ధర పలకాల్సిన బత్తాయి రూ.8 వేలకు పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఉద్యాన శాఖ అధికారులు అప్రమత్తమై చెట్టు నుంచి కాయలు కోయకుండా రైతులకు అవగాహన కలిగించారు. చెట్టు నుంచి రాలిపడిన కాయలు మాత్రం స్థానికంగానే అమ్మకాలు జరిపారు. వీరికి వైఎస్సార్ క్రాంతి పథం – డీఆర్డీఏ శాఖ చేయుతనిచ్చింది. కాయలు కొనుగోలు చేసి డ్వాక్రా గ్రూపుల ద్వారా అమ్మకాలు జరిపించింది. 4 నెలలుగా ఆటు పోట్లకు గురైన బత్తాయి ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఒడిశా మార్కెట్లో మంచి డిమాండ్.. జిల్లాలో మొత్తం 21,250 ఎకరాల్లో బత్తాయి తోటలను పెంచుతున్నారు. ఎకరాకు 8 నుంచి 10 టన్నుల మేర దిగుబడి వస్తుంది. సరాసరిన ఎకరాకు 8 టన్నుల ప్రకారం లెక్కలు వేసుకుంటే 1.70 లక్షల టన్నులు బత్తాయి కాపు కాస్తుంది. టన్ను రూ.35 వేల ప్రకారం బత్తాయి తోటలు పెంచే రైతులకు రూ.595 కోట్ల రాబడి ఉంటుంది. ప్రభుత్వం లాక్డౌన్ సడలించిన తరువాత బత్తాయికి ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరిగింది. జిల్లాలో పండిన బత్తాయి పంట ఒడిశాకు ఎక్కువగా రవాణా అవుతుంది. వారం రోజుల క్రితం టన్ను రూ.32 వేలు ధర పలకగా ఒడిశా మార్కెట్ తెరుచుకున్న తరువాత బత్తాయికి రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం బత్తాయి ధర టన్ను రూ.40 వేల వరకు ఉందని పలువురు రైతులు తెలిపారు. ఇప్పుడిప్పుడే దేశంలో పండ్ల మండీలు తెరుచుకుంటున్నాయి లాక్డౌన్ కారణంగా పండ్ల ఉత్పత్తులకు మార్కెటింగ్ లేకపోయింది. ఇప్పుడిప్పుడే దేశంలో మండీలు తెరుచుకుంటున్నాయి. దీని వలన బత్తాయికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం టన్ను బత్తాయి రూ.40 వేల వరకు పలుకుతోంది. రానున్న రోజుల్లో బత్తాయి ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం టన్ను రూ.60 వేల వరకు అమ్ముడుపోయింది. ఈ సంవత్సరం రూ.70 వేల వరకు అమ్ముడుపోయే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు.– షేక్.నబీరసూల్, ఉద్యానశాఖాధికారి, వైపాలెం -
సత్తువకు బత్తాయి
హాస్పిటల్లో ఉన్న రోగులకూ, కోలుకుంటున్న వ్యక్తులకూ ఇచ్చే పళ్ల రసం సాక్షాత్తూ బత్తాయి రసమే తప్ప మరోటీ ఇంకోటీ కాదు. బత్తాయితో ఒనగూరే ఆరోగ్యప్రయోజనాల గురించి చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలదూ! బత్తాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇంకా అనేకం ఉన్నాయి. విటమిన్–సి పుష్కలంగా ఉండే బత్తాయితో రోగనిరోధక శక్తి సమకూరుతుందన్న సంగతి తెలిసిందే. రోగులకు దీనిని ఇచ్చేందుకు మరో కారణమూ ఉంది. గ్లూకోజ్తో తేలిగ్గా కలిసిపోయే ఇందులోని లిమోనాయిడ్స్ అనే పోషకాలు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. బత్తాయిలోని జీవరసాయనాలు జీర్ణశక్తిని పెంపొందించి జీర్ణవ్యవస్థ కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి. అజీర్తి, పేగుల కదలికలు సక్రమంగా లేకపోవడం (ఇర్రెగ్యులర్ బవెల్ మూవ్మెంట్స్) వంటి సమస్యలను బత్తాయి సమర్థంగా చక్కదిద్దుతుంది. ఒంట్లోని విషపదార్థాలను బయటకు సమర్థంగా పంపడంలో బత్తాయి బాగా తోడ్పడుతుంది. అందుకే దీన్ని శక్తిమంతమైన డీ–టాక్సిఫైయింగ్ ఏజెంట్గా పరిగణిస్తారు. బత్తాయిలోని విటమిన్–సి ఇన్ఫ్లమేషన్నూ (నొప్పి, మంట, వాపు)లను తేలిగ్గా తగ్గిస్తుంది. బత్తాయిలోని ఈ గుణం వల్లనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కోసం పళ్ల రసాన్ని ఇస్తుంటారు. బత్తాయి రసంలో కొలెస్ట్రాల్ పాళ్లను అదుపు చేసే స్వభావం ఉంది. అలాగే దీనిలో పోటాషియమ్ కూడా పుష్కలంగా ఉంది. ఈ కారణంగా బత్తాయికి రక్తపోటును నివారించే గుణమూ ఉంది. బత్తాయిలోని పొటాషియమ్ మూత్రపిండాల్లోని అనేక విషాలను బయటకు నెట్టేస్తుంది. బ్లాడర్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇందులోని విటమిన్–సి యూరినరీ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అందుకే ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని క్యాల్షియమ్ ఎముకలకు మేలు చేస్తుంది. అంతేకాదు... ఇదే క్యాల్షియమ్ ప్రత్యేకంగా గర్భవతుల్లో పిండం అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. మెదడూ, నాడీవ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి బత్తాయి బాగా సహాయపడుతుంది. -
నెరవేరిన రైతుల కల
నకిరేకల్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బత్తాయి, నిమ్మ మార్కెట్ల ప్రారంభ కల నెరవేరనుంది. తెలంగాణ ప్రభుత్వం నల్లగొండలోని గంధంవారిగూడెంలో బత్తాయి, నకిరేకల్లో నిమ్మ మార్కెట్ను ఏర్పాటు చేసింది. వీటిని ఆదివారం మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి ప్రారంభించనున్నారు. కొన్ని దశాబ్దాలుగా నిమ్మకు సరైన మద్దతు ధర లేకపోవడం, దళారుల ప్రమేయంతో సంబంధిత రైతులు తీవ్ర నష్టాన్ని సవిచూస్తున్నారు. ఇకపై ఆ సమస్యల చెక్ పడనుంది. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి నిమ్మ మార్కెట్ జిల్లాలోని నకిరేకల్లో ఏర్పాటు చేశారు. రూ.3.07 కోట్లతో నిమ్మ మార్కెట్ను సర్వాంగ సుందరంగా నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల ముందు ప్రజ లకు ఇచ్చిన హామీలో భాగంగా మార్కెట్ను మం జూరు చేయించారు. çనకిరేకల్లోని చీమలగడ్డ శివారులో అన్ని సౌకర్యాలతో ఆ మార్కెట్ను నిర్మించారు. దీనిని ఆదివారం ఉదయం 10 గం టలకు మంత్రులు ప్రారంభించనున్నారు. ఏటా రూ.750 కోట్ల వ్యాపారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏటా రూ.750 కోట్ల నిమ్మ వ్యాపారం సాగుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాపారం అంతా అనధికారికంగా దళారులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే నిమ్మకాయల వ్యాపారానికి ప్రసిద్ధిగాంచిన నకిరేకల్ ప్రాంత రైతులు నిమ్మ మార్కెట్ లేకపోవడంతో దళారులను ఆశ్రయిస్తూ నిండా మునుగుతున్నారు. దాంతో 2016 ఆగస్టు 3న మార్కెట్ నిర్మాణానికి రూ.3.07 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 అక్టోబర్ 24వ తేదీన నకిరేకల్ పెద్ద చెరువు వద్ద నిమ్మ మార్కెట్, మినీ ట్యాంక్బండ్ నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి శిలాపలకాలను ఆవిష్కరించారు. 2017 మే 15న స్థల సేకరణ సమస్య పరిష్కారమైంది. తిప్పర్తిరోడ్డులోని చీమలగడ్డ సర్వే నంబర్ 459లో 9.39 ఎకరాల స్థలాన్ని మార్కెట్ నిర్మాణం కోసం ఎంపిక చేశారు. ఈ స్థలంలోని 10 మంది భూ నిర్వాసితులకు రూ.39.90 లక్షల పరిహారం మంజూరు చేసింది. 2017 జూన్ 6న చీమలగడ్డలో ఎమ్మెల్యే వేముల వీరేశం భూమి పూజ చేశారు. రూ. కోటితో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో జర్మనీ దేశం నుంచి తెప్పించిన మెటీరియల్తో గ్రేడింగ్ కవర్డ్ ఫ్లాట్ఫారమ్ను నిర్మించారు. రూ.75లక్షలతో వ్యాపారుల కోసం 25 దుకాణ సముదాయం, రూ.17లక్షలతో నిమ్మ మార్కెట్ కార్యాలయ భవనం నిర్మించారు. రైతులకు మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కూడా కల్పిస్తున్నారు. యార్డులో అంతర్గత సీసీ రహదారి నిర్మాణం కూడ కొంత మేర పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో నిమ్మసాగు ఇలా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30 వేల హెక్టార్లకు పైగా నిమ్మ తోటలు సాగవుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే హెక్టార్కు 10టన్నుల దిగుబడి వస్తుంది. నిమ్మకు మంచి ధర ఉంటే క్వింటాకు సరాసరి రూ. 2వేల ధర పలుకుతుంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో ఏటా రూ. 750 కోట్ల నిమ్మ వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారం అంతా అణధికారికంగా గత మూడు దశాబ్దాల నుంచి కొనసాగుతుంది. నూతనంగా నిర్మించబోయే ఈ నిమ్మ మార్కెట్ ప్రారంభమైతే మా ర్కెట్ ఫీజుల రూపంలో ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుంది. నేడు బత్తాయి మార్కెట్ ప్రారంభం సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని బత్తాయి రైతుల ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెంలో రూ.1.80 కోట్ల వ్యయంతో గత ఏడాది నిర్మాణ పనులు మొదలైన బత్తాయి మార్కెట్ పూర్తయింది. బత్తాయి మార్కెట్ నిర్మాణ పనులకు గతేడాది రాష్ట్ర సాగునీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కాగా, ఏడాది వ్యవధిలోనే మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయించి తానే మార్కెట్ను ప్రారంభిస్తామని మంత్రి హరీశ్రావు నాడు ప్రకటించారు. ఆ విధంగానే ఆదివారం సాయంత్రం 3 గంటలకు బత్తాయి మార్కెట్ను ప్రారంభించనున్నారు. రైతులకు ఎంతో వెసులుబాటు జిల్లాలోని బత్తాయి రైతులు తమ పంటను విక్రయించుకోవడానికి పూర్తిగా దళారులపైనే ఆధారపడుతున్నారు. కర్నూలు తదితర జిల్లాల నుంచి వచ్చే దళారులు తోటలపైనే బత్తాయికి రేటు మాట్లాడుకుని అరకొరగా రైతులకు చెల్లించి వారు లాభాలు పొందుతున్నారు. ఒక వేళ ఎవరైనా రైతు స్వయంగా మార్కెట్లో బత్తాయి అమ్ముకోవడానికి వెళితే హైదరాబాద్ కొత్తపేట మార్కెట్లో దళారుల చేతుల్లో పడి నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు స్థానికంగానే బత్తాయి మార్కెట్ను ఏర్పాటు చేయాలని బలంగా డిమాండ్ చేశారు. కాగా మార్కెట్ మంజూరుకావడం , ఏడాదిలోగా నిర్మాణం పనులు పూర్తయి అందుబాటులోకి వస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మార్కెట్లో ఎనిమిది మంది కమీషన్ ఏజెంట్లు, నలుగురు ట్రేడర్స్ లైపెన్స్ పొందారు. ఆదివారం నుంచి బత్తాయిలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అధికార పార్టీ ఏర్పాట్లు మరో వైపు మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి హరీశ్రావు మార్కెట్ను ప్రారంభించనుండగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నల్లగొండ ఇన్చార్జి కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. బత్తాయి మార్కెట్ను ప్రారంభించాక గంధంవారి గూడెం నుంచి బైకు ర్యాలీ ద్వారా మంత్రిని స్థానిక బీట్ మార్కెట్కు తీసుకువస్తారు. అనంతరం మార్కెట్లోనే బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. శనివారం నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కరీంపాష , డైరెక్టర్ గార్లపాటి శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి మధు బత్తాయి మార్కెట్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. -
రంగు పడింది
తెల్లగా వెండిలా మెరిసిపోవాల్సిన మంచుకొండలు నారింజ రంగు పులుముకున్నాయి. రష్యా, ఉక్రెయిన్, బల్గేరియా,రుమేనియాలతోపాటు తూర్పు యూరప్ అంతటా ఇదే తీరు! భూమ్మీద కాకుండా అరుణగ్రహంపై ఉన్నామా? అనేంత నారింజ రంగు! ఎందుకిలా? పోటెత్తిన పర్యాటకులకు వచ్చినా.. సమాధానం మాత్రం నాసా తీసిన ఫోటోల ద్వారా శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి ఎగసిన ఇసుక గాలులే ఈ మార్పునకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. అక్కడి దుమ్ము, ధూళి, ఇసుక రేణువులు మంచుకొండల్ని చుట్టేయడంతో అవి నారింజ రంగులోకి మారిపోయాయని చెబుతున్నారు. యూరప్లో ఇలా జరగడం ఇదే మొదటి సారి. దీంతో పర్వతారోహకులు, మంచులో స్కేటింగ్ చేసే వాళ్లు ఈ అరుదైన కొండల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇది సర్వసాధారణమైన విషయమని ప్రతీ అయిదేళ్లకు ఒకసారి ఇలా జరుగుతుందని చెబుతున్నారు. ఒక ప్రాంతంలో ఎగిసిపడే దుమ్ము, ధూళి ఇంకో ప్రాంతంలో వాతావరణంపై ప్రభావం చూపించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2007లో దక్షిణ సైబీరియాలోనూ ఇలాగే మంచు ఆరెంజ్ రంగులోకి మారిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. -
‘ఆరెంజ్ పాస్పోర్ట్’.. బీజేపీ వివక్షే: రాహుల్
న్యూఢిల్లీ: ఇమిగ్రేషన్ చెక్ అవసరం ఉన్న పాస్పోర్ట్ హోల్డర్లకు ఆరెంజ్ రంగు పాస్పోర్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ వివక్షాపూరిత ఆలోచనా ధోరణిని ఇది సూచిస్తోందని విమర్శించారు. ‘వలస కార్మికులను రెండో తరగతి పౌరులుగా బీజేపీ పరిగణించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ చర్యలు బీజేపీ వివక్షాపూరిత ఆలోచన ధోరణిని సూచిస్తున్నాయి’ అని ధ్వజమెత్తారు. -
బత్తాయి భారం
► నిమ్మ సాగుపై అనాసక్తి ► రాయితీలకు స్వస్తి పలికిన ఉద్యానశాఖ ► సాగుకు దూరమవుతున్న రైతులు ► పంట కాపాడుకునేందుకు ఏటా రైతుల భగీరథ ప్రయత్నం ► 250 అడుగుల లోతుకు బోర్లు వేసినా కనిపించని నీటి చెమ్మ ► రానున్న కాలంలో పంట కనుమరుగయ్యే ప్రమాదం ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఒకప్పుడు సిరులు కురిపించిన బత్తాయి, నిమ్మ తోటలు ఆదరణ కోల్పోతున్నాయి. రైతులు ఈ పండ్ల తోటల పట్ల ఆసక్తి చూపడం మానేస్తున్నారు. గత నాలుగేళ్ళుగా జిల్లాలో వర్షాలు లేకపోవడం.. వాతావరణ పరిస్థితులు సక్రమంగా ఉండకపోవడం.. పంట కోతల సమయంలో మార్కెట్లో ధరలు పతనమవడం.. వంటి కారణాలు రైతులను వెం టాడుతున్నాయి. దీనికి తోడు భూగర్భజలాలు అడుగంటి.. బోర్లలో నీళ్ళు రాకపోవడం కూడా ప్రధాన కారణంగా రైతులు ఈ పండ్ల తోటలను వదిలేయాల్సిన పరిస్థితి వస్తోంది. గత రెండేళ్ళలో చాలా తోటలు ఎండిపోవడంతో రైతులు వాటిని కొట్టేయాల్సిన దుస్థితి వచ్చింది. దీంతో గత పదేళ్ళ క్రితం కనిగిరి ప్రాంతంలో విస్తారంగా కనిపి ంచే బత్తాయి, నిమ్మ తోటలు ఆదరణ కోల్పోతున్నాయి. రానురాను తోటల కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో బత్తాయి, నిమ్మ తోటలు 2,782 హెక్టార్లకు పైగా సాగవుతాయి. గత పదేళ్లకు ముందు ఈ పండ్ల తోటలు విస్తీర్ణం పెరిగేది. ఎక్కువగా ఈ తోటలు మార్కాపురం, కనిగిరి ప్రాంతంలో విస్తారంగా కనిపించేవి. కొనకనమిట్ల మండలంలోని చినారికట్లలో ప్రధాన సాగు నిమ్మతోటలే. 1200 ఎకరాలలో రైతులు సాగు చేస్తారు. ముఖ్యంగా నిమ్మతోటలకు కనిగిరి ప్రసిద్ధి. ఎకరాకు ఎరువులు, పురుగుమందులు, ఇతర ఖర్చులతో కలిపి మొత్తం రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు పెట్టుబడి అయ్యేది. అలాంటిది గత నాలుగేళ్లుగా జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనలు సకాలంలో రావడంలేదు. వర్షాలు కురవడం గగనమయింది. దీంతో భూగర్భజలాలు దారుణంగా పడిపోతున్నాయి. పంట రాగానే ధరల పతనం.. పశ్చిమప్రాంతంలో 200 నుంచి 250 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీటి చెమ్మ కనిపించని స్థితికి భూగర్భజలాలు పడిపోయాయి. దీంతో వేసవి కాలంతో పాటు వర్షాకాలంలో కూడా పండ్ల తోటలను కాపాడుకోవడానికి ఏటా రైతులు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తోంది. గత యేడాది కరువు విలయతాండవం చేయడంతో వందల ఎకరాల్లో పండ్లతోటలను రైతులు వదిలేశారు. కొన్ని ప్రాంతాలలో అష్టకష్టాలు పడి తోటలను కాపాడుకున్నారు. ఈ పరిస్థితిలలో పంట దిగుబడి మార్కెట్లో రాగానే నిమ్మ ధరలు పతనమయ్యాయి. సాధారణంగా ఎకరాకు 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ప్రతికూల వాతావరణం వల్ల సగానికి దిగుబడి పడిపోయింది. అయినా.. కనిగిరి మార్కెట్ నుంచి ఆయా సీజన్లలో రోజుకి 70 నుంచి 85 టన్నుల వరకు కాయలు ఎగుమతి అయ్యేవి. అలాంటి పరిస్థితి నుంచి రానురాను నిమ్మ రైతులు నష్టాలతో పాటు కష్టాలను ఎదుర్కొనే దుస్థితి వచ్చింది. గత డిసెంబర్లో ప్రారంభంలో కిలో నిమ్మకాయలు రూ.5 నుంచి రూ.10 వరకు పలికింది. తరువాత కిలో రూపాయికి చేరింది. ఒక దశలో అర్ధరూపాయికి కూడా పడిపోయింది. మార్కెట్కు 50 కిలోల బస్తా తెస్తే కేవలం రూ.20 నుంచి రూ.30 మిగిలాయి. ఈ పరిస్థితులలో కోతకు వచ్చిన కాయలను కూడా చెట్లకే రైతులు వదిలేశారు. ఈ పరిస్థితులలో జిల్లాను ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించింది. పండ్లతోటలు ఎక్కువ విస్తీర్ణంలో ఎండిపోయాయి. రాయితీ నిలిపివేత.. జిల్లాలోని పరిస్థితిని గమనించిన జిల్లా ఉద్యానశాఖ అధికారులు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పండ్లతోటలపై సమీక్షించారు. ఈ ఏడాది నుంచి బత్తాయి, నిమ్మ తోటల సాగును ప్రోత్సాహించవద్దని ఆదేశించారు. ఆ పండ్ల తోటలకు ఇచ్చే 50 శాతం రాయితీని నిలిపివేయాలని సూచించారు. వాటి స్థానంలో విషయాన్ని యాపిల్బెర్, దానిమ్మ, నేరెడు, జామ తోటలను ప్రోత్సాహించాలని ఆదేశించారు. వీటికి రాయితీలను ప్రోత్సాహించి ఉద్యాన రైతులను అటువైపు మళ్లించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. దీంతో పాటు ప్రతి ఐదెకరాలకి ఒక ఫాంపాండ్ (నీటికుంట)ను ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు రాయితీ ఇవ్వాలని ఉద్యాన అధికారులకు తెలిపారు. ముఖ్యంగా ఉద్యాన పంటలకు కూడా 100 శాతం డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు జిల్లాను వెంటాడుతున్న ప్రతికూల వాతావరణం కూడా తోడవడంతో రానున్న కాలంలో జిల్లాలో బత్తాయి, నిమ్మ తోటల సాగుకు రైతులు దూరమయ్యే అవకాశం ఉంది. తోటలు కూడా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి రాబోతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వీటిపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు ఇతర మార్గాలను ఎంచుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలవైపు వెళుతున్నారు. -
నిశ్చింతగా నారింజ తినవచ్చు...
నారింజపండు కాస్త పుల్లగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల పుల్ల తేన్పులతో కనిపించే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు ఈ పండు తినరు. కానీ స్టాన్ఫోర్డ్ సంస్థ అధ్యయనం ప్రకారం ఈ విషయానికి తగిన ఆధారాలు దొరకలేదు. కాబట్టి పులితేన్పులను ఈ పండు ఎక్కువ చేస్తుందనే అపోహ వీడి హాయిగా తినవచ్చు. ఇక నారింజలో పీచు కూడా ఎక్కువే. అయితే దీన్ని పండుగా తింటేనే పీచు మనకు లభ్యమవుతుంది. అయితే జ్యూస్ తీసినప్పుడు పీచును చాలావరకు కోల్పోయే అవకాశాం ఉంది. కాబట్టి దీన్ని పండుగా తినడమే మంచిది. అదీగాక మిగతా పండ్లలో ఉండే చక్కెర వేగంగా విడుదల అవుతుందేమోగాని... నారింజ పండు తిన్నవారిలో దీనివల్ల లభ్యమయ్యే చక్కెర చాలా మెల్లగా శరీరంలోకి విడుదల అవుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందుకే చక్కెరవ్యాధి గ్రస్తులు సైతం నిరభ్యంతరంగా దీన్ని తినవచ్చు. వాళ్లకూ ఇది సురక్షితమైన పండు అని చెప్పవచ్చు. -
బొమ్మరిల్లు భాస్కర్కు మరో ఛాన్స్
బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న భాస్కర్, ఆ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా ఆరెంజ్ సినిమాతో భారీ ప్లాప్ రావడంతో భాస్కర్ కెరీర్ తిరగబడింది. ఆ తరువాత ఎన్నో ఆశలతో తెరకెక్కించిన ఒంగోళుగిత్తకు కూడా ఫ్లాప్ టాక్ రావటంతో తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. లాంగ్ గ్యాప్ తీసుకున్న భాస్కర్, ఇటీవల బెంగళూర్ డేస్ తమిళ రీమేక్తో మరోసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. మరోసారి తెలుగులో దర్శకుడిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయాత్నాలు ప్రారంభించిన భాస్కర్కు మెగా ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇస్తున్నాడట. ఇప్పటికే మెగా హీరోస్తో పరుగు, ఆరెంజ్ సినిమాలను తెరకెక్కించిన భాస్కర్, ఈ సారి అల్లు అరవింద్ నిర్మాణంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే లైన్ ఓకె చేసిన అరవింద్, పూర్తి కథతో రమ్మన్నాడట. కథ రెడీ అయ్యాక నటీనటుల ఎంపిక జరుగనుంది. అయితే మరోసారి మెగా హీరోతోనే సినిమా చేస్తాడా..? లేక.. లో బడ్జెట్లో చిన్న హీరోతో సినిమాను చేస్తారా..? అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. -
ప్రకృతి... ప్యాకింగ్!
హ్యూమర్ ప్లస్ ప్రాడక్ట్ ఎంత బాగున్నా ప్యాకింగ్ మరింత బాగుండాలి. లేకపోతే ఆ ఉత్పాదనకు తగినంత క్రేజ్ రాదు. అందుకే లోపల ఉండే అసలు వస్తువు కంటే, పైన ఉండే ప్యాకింగ్ బాగుండేలా శ్రద్ధ తీసుకుంటాయి కార్పొరేట్ కంపెనీలు. ఈ ప్యాకింగ్ గుట్టుమట్లన్నింటినీ ప్రకృతినుంచే అవి నేర్చుకున్నాయని పండిపోయిన బిజినెస్ పండితులు చెప్పే మాట. తొక్కలోది ప్యాకింగ్ ఏముందండీ... లోపలి సరుకు బాగుండాలని కొందరు అంటుంటారు. కానీ కమలాపండు చూడండి. తొక్క చాలా అందంగా ఉండేలా కమలాలను కమనీయంగా ప్యాక్ చేసి ఉంచుతుంది ప్రకృతి. అందుకే కొన్ని సార్లు ప్యాకింగ్ చూసి టెంప్ట్ అయి, పండు తింటారు కొందరు. సదరు ప్యాకింగ్తో మోసపోయి పళ్లుకరచుకుంటారు. పైన ప్యాకింగ్ చూస్తే పక్వానికి వచ్చినదానిలా అనిపిస్తుంది. కానీ లోపల పండు రుచిచూస్తే అది పుల్లగా ఉంటుంది. అందుకే ప్రకృతిలోనూ కొన్ని ప్యాకింగ్లు పైకి ఎఫెక్టివ్గా కనిపిస్తూ, లోపల డిఫెక్టివ్గా ఉండవచ్చు. ఆరెంజ్ విషయంలోనూ కమలాలాంటి అరేంజ్మెంటే జరిగిపోయింది. అదే కుటుంబానికి చెందినదే అయినా కమలాపండు కంటే బత్తాయి ప్యాకింగ్ కాస్త టైట్గా ఉంటుంది. కమలాలతో పోలిస్తే దీని ప్యాకింగ్ అంత తేలిగ్గా విప్పడం సాధ్యం కాదనేనేమో తినడం కంటే రసం తీసుకుని తాగేస్తూ ఉంటారు మనుషులు. ఇక అరటిపండు ప్యాకింగ్ను అలవోకగా విప్పేయవచ్చు కాబట్టే తోపుడుబండ్లలో వాటి అమ్మకమే ఎక్కువ. కోన్ ఐస్క్రీమ్ల విషయానికి వద్దాం. లోపల నింపిన బటర్స్కాచ్, వెనిల్లా వంటి ఫ్లేవర్కూ పైనున్న కరకరలాడే బిస్కెట్కోన్ ఒక ప్యాకింగ్ అనుకుందాం. ద్రాక్షపండులాగే సదరు కోన్నూ ప్యాకింగ్తో సహా తినేయవచ్చు. ఇలా తొక్కతో పాటూ తినేసే సౌలభ్యం విషయంలో ద్రాక్షకు ఆపిల్ జోడీగా వస్తుంది. తోడుగా ఉంటుంది. ఇక పుచ్చకాయ వంటి ప్యాకింగ్లను అంత తేలిగ్గా విప్పడం సాధ్యం కాదు. అందుకే ముక్కలు ముక్కలు చేసేసి, మధ్యలోని గుజ్జు తినేసి, పండుపైనున్న ప్యాకింగ్ను పారేస్తూ ఉంటారు. అయితే ఎర్రటి గుజ్జు ఉన్న అసలు ప్రాడక్ట్తో పాటు పైన ప్యాకింగ్లోని తెల్లభాగానికీ కాస్త మహత్యాన్ని ఇచ్చిందట ప్రకృతి. కేవలం రుచిగా ఉండే అసలుతో పాటు ప్యాకింగ్లోని కొసరు కూడా తింటే ఆరోగ్యం అంటుంటారు విజ్ఞులు. పనసకాయ విషయంలో ప్యాకింగ్ విప్పాలంటే దానికి కత్తిలాంటి నైపుణ్యం కూడా కావాలంటారు పెద్దలు. కొబ్బరికాయను చాలా ఎత్తుమీద ఉండేలా చూసింది కాబట్టి... గభాల్న అంతెత్తునుంచి కింద పడిపోతే కొబ్బరికి దెబ్బతగలకుండా లోపల పీచూ, టెంక వంటి వాటితో పకడ్బందీ ప్యాకింగ్ చేసింది ప్రకృతిమాత. ఇక కూరగాయల్లో బెండ, దొండ, వంకాయ వంటి వాటికి ప్యాకింగ్ ఏదీ లేకుండా అను గ్రహించిందట శాకంబరీదేవత. టొమాటోపైన పల్చటి పొర లాంటిది ఉన్నా దాన్ని గబుక్కున తొలగించడానికి అంతగా వీల్లేకుండా చేసిందట. దాంతో పాటు బీరకాయ, పొట్లకాయ వంటి కొన్ని కూరగాయలకు పైనున్న పలచటి ప్యాక్నూ వంటకు ఉపయోగించాల్సిందేనని కూరల అధిదేవతఅయిన శాకంబరీదేవి ఆదేశం అట. అందుకే వాటిని శుభ్రంచేయడానికి కత్తిని ఉపయోగించినా చెక్కుతీసినట్టుగా కాస్త పైపైన అటు ఇటు కదిలిస్తారు అనుభవజ్ఞులు. ప్రకృతి ప్యాకింగ్ను మరింత ఆకర్షణీయం చేయడానికీ కార్బైడ్లాంటివి ఉపయోగించడం అంటే... లేని లాభాలతో బ్యాలెన్స్షీట్లను అందంగా అలంకరించడం లాంటిదట. పండంటిబిడ్డలా ఆరోగ్యమూ పదికాలాల పాటు కళకళలాడాలంటే కార్పొరేట్ ఉత్పాదనలకూ, కార్బైడ్లకూ కాస్త దూరంగా ఉండాలన్నది పెద్దలు చెబుతున్న మాట. - యాసీన్ -
‘నారింజ’పై నిర్లక్ష్యమేలా?
నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ‘నారింజ’ ప్రాజెక్టు నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. ప్రాజెక్టు కింద ఉన్న భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు వీలుగా కాలువల నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.5.77 కోట్లు మంజూరయ్యాయి. ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేనప్పుడు కాలువల నిర్మాణంతో ప్రయోజనమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోనే ప్రధాన నీటి వనరుగా నారింజ ప్రాజెక్టు ఉంది. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వృథాగా తరలిపోతున్న నీటిని జహీరాబాద్ ప్రాంత రైతులు వినియోగించుకునేందుకు వీలుగా బీదర్ రోడ్డుపై రోడ్డు-కం-బ్యారేజీని నిర్మించి భూములను సాగులోకి తీసుకురావాలని అప్పట్లో ప్రతిపాదించారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో నారింజ బ్యారేజీని నిర్మించారు. 1970 డిసెంబర్ 20న అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రెగ్యులేటర్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 1971లో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిధారెడ్డి కాలువ తూమును ప్రారంభించారు. కాగా ఈ పథకం ప్రారంభోత్సవానికే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా ప్రయోజనం చేకూరలేదు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం వల్లే గత నాలుగు దశాబ్దాలుగా నారింజ జలాలు పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని రైతులు అంటున్నారు. ఎక్కడ పుట్టింది... నారింజ వాగు కోహీర్ మండలం బిలాల్పూర్ గ్రామంలో పుట్టింది. అక్కడి నుంచి జహీరాబాద్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఈ వాగుపై వరద ప్రాంత వైశాల్యం 143.8 స్క్వార్ మైల్స్గా గుర్తించారు. గరిష్ట వరద ప్రవాహం 41.800 క్యూసెక్కులుగా గుర్తించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు నిర్మించారు. దీనికింద ప్రధాన కాలువలు తవ్వించినా, వాటికి అనుబంధంగా చిన్న చిన్న కాలువలు తవ్వించక పోవడంతో ప్రాజెక్టు నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ పొలాల్లో తవ్వి వదిలేసిన కాలువలను అప్పట్లోనే రైతులు పూడ్చేసి పంటలను సాగు చేసుకుంటున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 85 మిలియన్ క్యూబిక్ ఫీట్స్(ఎంసీఎఫ్టీ)గా ఉంది. పూడిక తీస్తేనే మేలు.. ప్రాజెక్టులో పూడిక తీస్తేనే మేలు జరుగుతుందని పరిసర గ్రామాల రైతులంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఒక్క భారీ వర్షానికే నిండుతుందని, మిగతా నీరంతా వృథాగా కర్ణాటక వెళ్తుందని వారంటున్నారు. పూడిక తీయిస్తే మరింత అధికంగా నీరు నిల్వ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా భూమిలోకి అవసరం మేరకు నీరు ఇంకిపోయి పరిసర గ్రామాల్లోని భూగర్భ జలాలు మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు. తద్వారా వ్యవసాయ బావులు, బోర్లలో పుష్కలంగా నీరు వచ్చి ఆశించిన మేర పంటలు సాగయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. పూడికతీతకే మొదటి ప్రాధాన్యత నివ్వాలని వారంటున్నారు. అడ్డుకున్న రైతులు గతంలో తమకు పరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు పరిహారం చెల్లించి కాలువలు తవ్వాలని బూర్దిపాడ్ గ్రామ రైతులు అంటున్నారు. గ్రామంలో 26 మంది రైతులు కాలువల కింద పోతున్నాయి. దీంతో వారు కాలువ తవ్వకం పనులను నిలిపి వేయించారు. సాగులో ఉన్న చెరకు పంటలో నుంచి కాలువను తవ్వడంతో తాను నష్టపోయానని రైతు సంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాజెక్టు స్వరూపం ప్రాజెక్టు : నారింజ ఆయకట్టు : 3వేల ఎకరాలు కుడి కాలువ పొడవు : 2.కి.మీటర్లు కుడి కాలువ కింద ఎకరాలు : 550 ఎకరాలు కుడి కాలువ కింద గ్రామాలు : న్యాల్కల్ మం: మిర్జాపూర్(బి), మల్కాపూర్, జహీరాబాద్ మం : కొత్తూర్(బి) ఎడవ కాలువ పొడవు : 13 కి.మీటర్లు ఎడమ కాలువ కింద ఎకరాలు : 2,450 ఎకరాలుగా ఎడవ కాలువ కింద గ్రామాలు : జహీరాబాద్ మం: కొత్తూర్(బి), బూర్దిపాడ్, సత్వార్, బూచనెల్లి, చిరాగ్పల్లి, మాడ్గి పరిహారం ఇప్పించాలి.. గతంలో మాకు పరిహారం అందలేదు. పరిహారమిచ్చిన తరువాతే కాలువలను తవ్వే పనులు చేపట్టాలి. పెద్ద కాలువల కోసం మేం అధికంగా భూములను కోల్పోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం సాగులో ఉన్న చెరకు తోటల్లో నుంచి కాలువలు తవ్వుతున్నందున పంటకు కూడా పరిహారం అందించాలి. - కమాల్రెడ్డి, రైతు, బూర్దిపాడ్ నారింజ ప్రాజెక్టు... లక్ష్యం ఘనం... ఫలితం శూన్యం అన్నట్టుగా ఉంది. నాలుగు దశాబ్దాలైనా ఈ ప్రాజెక్టు నీటితో సెంటు భూమి తడవలేదు. ప్రస్తుతం పూడికతో నిండిపోవడంతో నీరు నిలిచే పరిస్థితి లేదు. ఒక్క వర్షానికే మిగతా నీరంతా పక్క రాష్ట్రానికి పోతుంది. పూడిక తీయాల్సిన పాలకులు కాలువలు తవ్వుతూ నిధులు, విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. రైతుల మొరను ఆకలించరు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి దుస్థితి నెలకొంది. -జహీరాబాద్ -
ఆరెంజ్ తో ఓ రెంజ్ లో
ఫుడ్ n బ్యూటీ ఆరెంజ్ని తింటే ఆరోగ్యాన్నిస్తుంది.ముఖానికి రాసుకుంటే సౌందర్యాన్ని పెంచుతుంది. కాస్మొటిక్ స్కిన్ కేర్లకు దీటుగా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ ‘సి’ చర్మానికి నిగారింపును పెంచుతుంది. ఆరెంజ్తో ఫేస్ప్యాక్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం... కమలాపండు రసాన్ని రెండు టీ స్పూన్ల పెరుగుతో కలిపి పేస్ట్లా చేసుకొని ముఖానికి, మెడకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చన్నీటితో ముఖం కడిగితే... మార్పు మీకే అర్థం అవుతుంది. రెండు టీస్పూన్ల ఆరెంజ్జ్యూస్కు కొద్దిగా నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి ఆరాక చన్నీటితో కడగాలి. ఆరెంజ్ జ్యూస్, ముల్తానీ మట్టి, పాలు కలిపి ముఖానికి పట్టించి ఆరాక వేడి నీటితో కడగాలి. ఈ ప్యాక్ వేస్తే ముఖం ప్రకాశవంతమవుతుంది. ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని, ఆ పొడిని రోజ్ వాటర్తో కలిపి ముఖానికి రాసుకుంటే కొత్త కళ వస్తుంది. -
తొక్కే కదా అని తీసి పారేస్తే..!
పండు తినడం, తొక్క పారేయడం సహజమే. అయితే నారింజ, బత్తాయి, కమలాఫలం తొక్కల్ని మాత్రం పారేయవద్దు అంటున్నారు నిపుణులు. ఎందుకూ అంటే... ఈ తొక్కలు మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయట ఇవి క్యాన్సర్ కారకాలను నిరోధించడంలో పెద్ద పాత్రే పోషిస్తాయి గుండె మంటను తగ్గించడానికి దోహదపడతాయి వీటిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జలుబు, దగ్గు, ఫ్లూ, ఆస్త్మా వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ఈ తొక్కలు మంచి మందు శారీరక దుర్వాససను పోగొట్టే లక్షణం ఉంది వీటికి. అందుకే వీటిని పర్ఫ్యూమ్స్ తయారీలో ఉపయోగిస్తారు వీటితో పళ్లు రుద్దుకుంటే ముత్యాల్లా మెరుస్తాయి. అప్పుడప్పుడూ చిన్న ముక్కను నములుతూంటే... చిగుళ్ల సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కాబట్టి ఇంకెప్పుడూ తొక్కే కదా అని పారేయకండి. తప్పకుండా తీసుకోండి. ఎలా అంటే ఎండబెట్టి పొడి చేసి వంటల్లో వాడొచ్చు. లేదంటే నీళ్లలో మరిగించి ఆ నీటిని సేవించవచ్చు. మీ ఇష్టం! -
కిన్నో ఆరెంజ్, మాల్టా జఫ్ఫా ప్రత్యేకతలేమిటి?
‘కొత్త బత్తాయి లోకం..!’ శీర్షికన గత వారం సాగుబడిలో ప్రచురించిన ప్రకృతి వ్యవసాయదారుడు సత్యారెడ్డి విజయగాథకు విశేష స్పందన లభించింది. ఇప్పటికి దాదాపు 2 వేల ఫోన్ కాల్స్కు సమాధానం చెప్పారు. బత్తాయి, కిన్నో ఆరెంజ్, మాల్టా జఫ్ఫా పండ్ల జాతుల మధ్య తేడాలపై రైతులు ప్రశ్నలు అడుగుతున్నారని సత్యారెడ్డి తెలిపారు. మరికొన్ని అంశాలు ఆయన మాటల్లోనే: కినో ఆరెంజ్ పండ్లు చెట్టుకు మధ్య, కింద భాగాల్లో గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. కూలీల ఖర్చు, జీవామృతం తయారీకి బెల్లం, శనగపిండి ఖర్చు తప్ప మరే ఖర్చూ లేదు. బత్తాయికి, కిన్నో ఆరెంజ్కి మధ్య తేడా ఏమిటి? బత్తాయిల నుంచి తీసిన రసం రెండు, మూడు గంటల్లో రుచి తేడా వస్తుంది. సహజ పద్ధతిలో సాగైన బత్తాయిల రసమైతే మరికొన్ని గంటలపాటు రుచిలో మార్పు లేకుండా ఉంటుంది. రసాయన పద్ధతిలో పండించిన కిన్నో ఆరెంజ్ పండ్ల రసం 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే సహజ పద్ధతిలో పండించిన కినో ఆరెంజ్ పండ్ల రసం దాదాపు నెల వరకు రుచిలో మార్పుండదు.బత్తాయిపై తోలు గట్టిగా ఉంటుంది. కిన్నో తోలు మెత్తగా ఉంటుంది. బత్తాయి పులుపు, తీపి కలిపిన రుచితో ఉంటే, ఇది పూర్తి తియ్యగా ఉంటుంది.కిన్నో ఆరెంజ్ సాగుకు ఎర్రనేలలు అనుకూలం. దీనికి రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. దీన్ని పంజాబ్లో విరివిగా సాగుచేస్తున్నారు. కిన్నో ఆరెంజ్కి, మాల్టా జఫ్ఫాకి మధ్య తేడా? మాల్టా జఫ్ఫాలో గుజ్జు ఎక్కువగా ఉంటుంది. కినో ఆరెంజ్ కంటే ఎక్కువ తియ్యగా ఉంటుంది. కిన్నో ఆరెంజ్ చెట్టు ఏడాదికి ఒకసారి కాపుకు వస్తే జఫ్ఫా ఏడాదికి 2, 3 సార్లు కాపుకు వస్తుంది. కిన్నో ఆరెంజ్లో 12 నుంచి 25 వరకు విత్తనాలుంటాయి. జఫ్ఫాలో విత్తనాలు తక్కువగా ఉంటాయి. రసం ఎక్కువగా ఉంటుంది. మాల్టా బ్లడ్రెడ్ పండు పైకి బత్తాయిలా పచ్చగా ఉండి, లోపల బాగా ఎర్రగా ఉంటుంది. ‘పొలంలో గడ్డిని తగలబెడితే నీ తల్లి చీరను తగలబెట్టినట్టే’ అంటారు పాలేకర్. అది నిజం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో గడ్డిని క్రాస్ కట్టర్ ద్వారా కత్తిరిస్తారు. దాంతో గడ్డి భూమిలో కలిసిపోయి సేంద్రియ ఎరువుగా మారుతుంది. పశువులను తోటలోకి వదిలి గడ్డి మేపుతున్నాను. దీని వల్ల గడ్డి కత్తిరించిన తోట కన్నా నా తోట అందంగా కనిపిస్తోంది. -
కమలాఫలాలతో కొట్టి చంపారు!
కమలాఫలాలతో కొట్టి ఓ వ్యక్తిని చంపిన ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. గ్రామీణ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేపింది. వ్యవసాయ కూలీని ఇద్దరు వ్యక్తులు కమలాఫలాలతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. వీరి మధ్య గొడవ తలెత్తడంతో కమలాపళ్లు సేకరించి ఈ దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. తమ వద్దనున్న కమలాలు అయిపోయే వరకు అతడిపై విసిరారు. దీంతో వ్యవసాయకూలీ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మొండి తెగుళ్లకు ‘జీవ’ చికిత్స!
పండ్ల తోటల్లో యాంటీ బయోటి క్స్కు లొంగని మొండి తెగుళ్లను సమర్థవంతంగా నిలువరిస్తున్న ప్రోబయోటిక్స్ దానిమ్మ, బత్తాయి, నిమ్మ, మామిడి.. అంతా బాగుంటే రైతుకు అధికాదాయాన్నిచ్చే ఉద్యాన పంటలు. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులపై అతిగా ఆధారపడి ఈ పంటలను సాగు చేసే రైతుల ఆశలు వమ్ము అవుతున్న సందర్భాలు తరచూ తారసపడుతున్నాయి. మందులకు తట్టుకునే శక్తిని పెంచుకుంటూ మొండికేస్తున్న బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్లే ఈ దుస్థితికి కారణం. ఈ తెగుళ్ల నివారణకు వాడుతున్న శిలీంద్ర నాశక మందు మోతాదు పెంచుతున్న కొద్దీ తెగుళ్ల తీవ్రత పెరుగుతోంది తప్ప ఫలితం ఉండడం లేదు. విసిగిపోయిన రైతులు కొందరు తోటలు తీసేయాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. రైతుల ఆశలను కూలదోస్తున్న ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఉంది! యాంటీ బయోటిక్ రసాయనానికి బదులుగా.. జీవామృతం, పంచగవ్య వంటి ప్రోబయోటిక్స్ వాడి, తక్కువ ఖర్చుతో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని ప్రొ. శ్యాం సుందర్రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అసాధారణ వాతావరణ పరిస్థితులుంటే తప్ప జీవామృతంతో ఈ తెగుళ్లు పత్తాలేకుండా పోతాయంటున్నారు. దానిమ్మ దిగుబడిని ఆంత్రాక్నోస్, బ్యాక్టీరియా మచ్చ తెగులు 50-100% వరకు దెబ్బతీస్తున్నది. ఆకులపై మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోవడం, కాయలపై కూడా మచ్చలు ఏర్పడడంతో సమస్య జటిలంగా మారింది. నెలకోసారి, తెగులు ఉధృతిని బట్టి వారానికోసారి కూడా దీన్ని పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి ఏడాదికి రూ. 30 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు పెట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. దానిమ్మ సాగులో అపారమైన అనుభవం కలిగిన, వనరులకు కొరత లేని రైతులకు తప్ప సాధారణ రైతులు, కొత్తగా సాగు ప్రారంభించిన వారికి ఆంత్రాక్నోస్, బ్యాక్టీరియా మచ్చ తెగుళ్లు శాపంగా మారి.. తోటలు తీసేయాల్సిన పరిస్థితి వస్తోంది. బత్తాయి/ నిమ్మ తోటల్లో గజ్జి తెగులు బత్తాయి, నిమ్మ తోటల్లో గజ్జి తెగులు సమస్యగా ఉంది. దీన్ని అరికట్టడానికి యాంటీబయోటిక్ మందును 3-5 సార్లు పిచికారీ చేస్తున్నారు. యాంటీబయోటిక్ వాడకం వల్ల నష్టాలు: యాంటీబయోటిక్స్, శిలీంద్రనాశకాలను చెట్లపై చల్లడం వల్ల తెలుగు కారక సూక్ష్మజీవులతోపాటు, ఆకుల ఉపరితలంపై ఉండి రక్షణ కల్పించే మేలు చేసే సూక్ష్మజీవులు సైతం చనిపోతాయి. ఈ మందు చల్లినప్పుడు, వర్షం పడినప్పుడు ఆకుల మీద నుంచి కారి భూమి మీద పడినప్పుడు నేలలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. బ్యాక్టీరియాలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. తెగులు విజృంభిస్తుంది. ఇవీ ప్రోబయోటిక్స్: జీవామృతం, పంచగవ్య(2-5% అంటే.. వంద లీటర్ల నీటిలో 2 నుంచి 5 లీటర్ల పంచగవ్య కలిపి పిచికారీ చేయాలి), కునప జలం(2-5% పిచికారీ చేయాలి). ఇవన్నీ చీడపీడలను అరికట్టడంతోపాటు పంటలకు పోషకాలను అందించే ప్రోబయోటిక్సే. జీవామృతం ఎలా వాడాలి? పంటలపై జీవామృతాన్ని 10,15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. జీవామృతాన్ని 1:4 మోతాదులో నీటిలో కలిపి చెట్టు పూర్తిగా తడిచి నీరు కారేంత వరకు పిచికారీ చేయాలి. ముందు నుంచే పిచికారీ చేస్తే ఆకుమచ్చ, శిలీంద్రపు తెగుళ్లు పంటల దరిచేరవు. ఈ తెగుళ్లు సోకిన చెట్లపై జీవామృతాన్ని వడకట్టి పిచికారీ చేస్తే సమర్థవంతంగా అదుపులోకి వస్తాయి. ఆకులపై ఏర్పడిన మచ్చలు పోతాయి. దానిమ్మ, మామిడి, పసుపు వంటి పంటలకు ఆశించే ఆంత్రాక్నోస్ అనే శిలీంద్రపు తెగులు వల్ల మచ్చలు ఏర్పడిన ఆకులు, కాయలు కుళ్లిపోతాయి. జీవామృతాన్ని పిచికారీ చేస్తే ఇది కూడా పోతుంది. జీవామృతం తయారీ ఇలా.. 200 లీటర్ల నీరు + 10 కిలోల నాటు ఆవు పేడ + 10 లీటర్ల నాటు ఆవు మూత్రం + కిలో బెల్లం + కిలో ఏవైనా పప్పుల పిండి + గట్టు మట్టి గుప్పెడు.. వీటిని డ్రమ్ము/ తొట్టిలో పోసి కుడి వైపునకు (గడియారపు ముల్లు తిరిగే విధంగా) తిప్పాలి. డ్రమ్మును ఎండ తగలకుండా నీడన ఉంచాలి. ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కర్రతో కుడి వైపునకు కలియ తిప్పుతూ ఉండాలి. కలిపిన 48 గంటలకు జీవామృతం వాడకానికి సిద్ధం అవుతుంది. అప్పటి నుంచి 7 రోజుల్లోగా వాడేయాలి. జీవామృతంలో నేలకు, చెట్లకు మేలు చేసే కోటానుకోట్ల సూక్ష్మజీవుల సముదాయం, సూక్ష్మపోషకాలు, అమైనో ఆమ్లాలుంటాయి. దీన్ని పిచికారీ చేసినా, నేలపైన పోసినా చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. సేంద్రియ ఎరువులూ వాడాలి జీవామృతం ద్వారా 100% ఫలితాలను పొందాలంటే.. భూమిలో సేంద్రియ కర్బనం బాగుండాలి. ఇందుకోసం సేంద్రియ ఎరువులు కూడా విధిగా వాడాలి. ఎకరానికి 10-20 టన్నుల చివికిన పశువుల ఎరువు లేదా 2-5 టన్నుల వర్మీ కంపోస్టు లేదా టన్ను మేరకు కానుగ / ఆముదం / వేప పిండి వేయాలి. రసాయనిక నత్రజని ఎరువులు అతిగా వాడితే బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్ల ఉధృతి పెరుగుతుందే గానీ తగ్గదు. ఒకవేళ రసాయనిక ఎరువులు అనివార్యంగా వాడాల్సి వస్తే.. అతితక్కువ మోతాదులో, విడతల వారీగా వాడుకోవాలి. 10 రోజులకోసారి కిలో వాడేకన్నా.. రోజుకో వంద గ్రాములు వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మల్చింగ్తో సాగునీటి ఆదా, కలుపు సమస్యకు చెక్! జీవామృతం, సేంద్రియ ఎరువులతోపాటు గడ్డిని, రొట్టను నేలపై ఆచ్ఛాదన(మల్చింగ్)గా వేయడం వల్ల చెట్లకు మేలు కలిగించే సూక్ష్మజీవులు భూమిలో వృద్ధి చెందడానికి అనుకూలమైన సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది. మల్చింగ్ వల్ల సాగునీరు ఆదా కావడమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. నేలపై వేసిన గడ్డి కుళ్లి, మంచి ఎరువుగా మారి నేలను సారవంతం చేస్తుంది. వరి గడ్డి, వరి పొట్టు, జంబుగడ్డి, చెరకు ఆకు, కొబ్బరి పీచు, అడవి చెట్ల నుంచి సేకరించిన ఆకులు.. తదితరాలను మల్చింగ్గా ఉపయోగించవచ్చు. అధిక మోతాదులో మల్చింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రైతులు ఎవరికివారు తమ పొలంలోని 10-20% విస్తీర్ణంలో జనుము, జీలుగ, మొక్కజొన్న, అలసంద వంటి పచ్చిరొట్ట పైర్లను విత్తుకొని.. ప్రతి 45 రోజులకోసారి కోసి మల్చింగ్ కోసం వాడుకోవచ్చు. జనుము 65 రోజులు పెరిగిన తర్వాత కోసి.. మల్చింగ్గా వాడుకోవడం మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ మామిడిపై బ్యాక్టీరియా ఆకుమచ్చ బనేషాన్ మామిడి చెట్ల ఆకులపై బ్యాక్టీరియా మచ్చలు ఏర్పడుతున్నాయి. ఆకులు పండుబారి రాలిపోతాయి. ఆకులు తక్కువ ఉండడం వల్ల కాయలు సరిగ్గా పెరగవు. ఎండ నేరుగా పడడం వల్ల కాయలు పసుపు పచ్చగా మారుతుంటాయి. దీన్ని ఎవరూ అంతగా గుర్తించడం లేదు. దానిమ్మ పూత, పిందె దశలో జీవామృతం పిచికారీ చేయొద్దు! దానిమ్మ తోట పూత, పిందె దశలో ఉన్నప్పుడు జీవామృతం పిచికారీ చేయరాదని, అలా చేస్తే పూత, చిన్న పిందెలు రాలిపోతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని ప్రొ. శ్యాంసుందర్రెడ్డి తెలిపారు. పూత, పిందె ఏర్పడుతున్న ఆ నెల రోజులపాటు జీవామృతాన్ని పిచికారీ చేయరాదని, నీటిలో కలిపి నేల మీద పోయవచ్చు. తోట లేతగా ఉన్నప్పుడు, కాపు వద్దను కున్నప్పుడు పూత, పిందెలను తీసెయ్యడానికి జీవామృతం పిచికారీ చేయొచ్చు. జీవామృతంతో నీటిని 1:1 నుంచి 1:4 పాళ్లలో కలిపి పిచికారీ చేస్తే వాటంతట అవే రాలిపోతాయన్నారు. రైతుకు కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా.. రాలినవి త్వరగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారతాయన్నారు. జీవామృతంతో అద్భుత ఫలితాలు! ఉద్యాన పంటల్లో జీవామృతం, పంచగవ్య, కుణపజలం, ఉపయుక్త సూ క్ష్మజీవులు(ఈఎంలు), స్థానిక ఉపయుక్త సూక్ష్మజీవులు (ఐఎంవోలు), బయోడైన మిక్ ద్రావణాలు, పులిసిన కల్లు, పులిసిన మజ్జిగ.. చేప, కోడిగుడ్ల అమైనో ఆమ్లాలు తదితర ప్రోబయోటిక్స్తో ఐఐఐటీ(హైదరాబాద్)లో, రైతుల తోటల్లో విస్తృత ప్రయోగాలు చేస్తున్నాం. జీవామృతం అందరూ సులభంగా, తక్కువ సమయంలో తయారుచేసుకోగలిగినది. ఆకులపై ఆశించే బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్లను ఇది ఎంతో సమర్థ వంతంగా అరికట్టగలుగుతున్నది. జీవామృతం వాడు తున్న తోటల్లో సూక్ష్మపోషక లోపాలు కనిపించడం చాలా అరుదు. పంచగవ్య కూడా ఆకుమచ్చ తెగుళ్ల నివారణలో అద్భుత ఫలితాలనిస్తున్నది. - ప్రొఫెసర్ జి. శ్యాంసుందర్రెడ్డి, రైతు, సస్య వైద్యుడుః ఐఐఐటీ - హైదరాబాద్, మొబైల్: 99082 24649. shyamiiit@gmail.com -
విజయాల బాటలో...!
అ అమ్మాయి పేరు సుమన స్నిగ్ధ... ఆరెంజ్, గ్రీన్, బ్రౌన్ బెల్టులు దాటి బ్లాక్బెల్ట్కు చేరింది.ఇటీవల బ్లాక్బెల్ట్లో రెండో రౌండ్ పూర్తి చేసింది... మూడో రౌండ్లో పోటీ పడడానికి సిద్ధమే అంటోంది... కానీ అందుకు ఇంకా మూడేళ్లు ఆగాలంటున్నాయి నిబంధనలు. మన రాష్ట్రంలో పన్నెండేళ్లలోపు వయసులో బ్లాక్బెల్ట్లో రెండవ లెవెల్కు చేరిన తొలి అమ్మాయి స్నిగ్ధ. ఐదేళ్ల పాపాయిగా ఉన్నప్పుడు మొదలు పెట్టిన కరాటే సాధనలో ఇప్పటికి ఆమె సాధించిన బంగారు పతకాలు పందొమ్మిది. వీటికి తోడు రజత, కాంస్య పతకాలు అన్నీ కలిసి పాతిక దాకా ఉంటాయి. స్నిగ్ధ డైలీ రొటీన్ ఇలాగ! ఉదయం నాలుగుంపావుకి నిద్ర లేచింది మొదలు రాత్రి తొమ్మిదింటికి నిద్రపోయే వరకు స్నిగ్ధ టైమ్టేబుల్లో ఏమాత్రం ఖాళీ కనిపించదు. ఐదున్నరకు తల్లితో కలిసి వాకింగ్, ఆరు నుంచి ఏడుగంటల ఇరవై ఎనిమిషాల వరకు కరాటే సాధన చేస్తుంది. తర్వాత స్కూలు మొదలవుతుంది, మధ్యాహ్నం మూడు యాభైకి ఇంటికి వస్తుంది. మరో గంటలో ట్యూషన్కెళ్లి రాత్రి ఏడున్నరకు ఇంటికి వస్తుంది. హోమ్వర్కు, భోజనం తర్వాత తొమ్మిదికి ఎట్టిపరిస్థితుల్లోనూ నిద్రకుపక్రమించేలా చూస్తారు స్నిగ్ధ తల్లి సుధ. ఆదివారం ఈ రొటీన్ మొత్తానికీ సెలవు ప్రకటించేసి టీవీ చూడడం, బయటకు వెళ్లడంలో గడిపేస్తారు. గోల్కొండ, చార్మినార్లతోపాటు నగరంలో చారిత్రక ప్రదేశాలన్నింటినీ చూపిస్తున్నానంటారు సుధ. వేసవి సెలవులకు తప్పనిసరిగా అందరూ కలిసి కేరళ, ఊటీలాంటి ప్రదేశాలకు టూర్కి వెళ్తారు. పుస్తకాలే నేస్తాలు! ‘‘స్మార్ట్ ఫోన్ వాడడం, ల్యాప్టాప్, ఫేస్బుక్లో గడపడం అంటే అమ్మకు చిరాకు. ఇ-మెయిల్, ఇంటర్నెట్ వంటి వాటిని అవసరాలకు మాత్రమే అనుమతిస్తుంది. బుక్స్ మాత్రం అడిగినవన్నీ కొనిస్తుంది. బుక్ఫెయిర్లకు తీసుకెళ్తుంది. కొన్నింటిని నేను అడగకపోయినా సరే ‘ఇవి చాలా బాగుంటాయి పెద్దయ్యాక చదువు’ అని మాల్గుడి డేస్ వంటి ఆర్కె నారాయణ్ పుస్తకాలు కొనిచ్చింది. ఇలాంటివి నా రూమ్లో నాలుగు ర్యాక్ల నిండా పుస్తకాలున్నాయి’’ అన్నది స్నిగ్ధ డ్రాయింగ్రూమ్లో ఉన్న బుక్ రాక్ని చూపిస్తూ. స్నిగ్ధని విజేతను చేయడంలో తల్లి సుధపాత్ర అపారం. ‘‘పిల్లలు ఏదైనా సాధించాలంటే తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లల కోసమే అంకితం కావాలి. అందుకే ఇంటర్నేషనల్ స్కూల్లో ఆపరేషన్స్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేశాను. టీవీ ముందు కూర్చోవడానికి నేను వ్యతిరేకిని. టీవీ ముందు కాలం గడపడం పిల్లలకు అలవాటు కాకూడదని ఏదో ఒక పనిలో నిమగ్నం చేయాలనుకున్నాను. దీనికి తోడు స్నిగ్ధ చిన్నప్పుడు బొద్దుగా ఉండేది. శరీరానికి శ్రమను కలిగిస్తూ ఆత్మరక్షణకు కూడా దోహదం చేసే యాక్టివిటీ అయితే మంచిదని కరాటేలో చేర్చాను. కరాటేలో ఇంతగా రాణిస్తుందని ఊహించి కానీ, రాణించాలని ఆశించి కానీ చేర్చలేదు. కానీ స్నిగ్ధ పాల్గొన్న ప్రతి పోటీలోనూ బంగారు, రజత పతకాలు తెచ్చుకోసాగింది. దాంతో ఈ రంగంలో కొనసాగిద్దామనే ఆలోచన కలిగింది. కొంతకాలం బాడ్మింటన్లో శిక్షణ తీసుకుంది. కానీ తాను కరాటేలోనే బాగా రాణిస్తున్నట్లు అనిపించింది. దాంతో బాడ్మింటన్ శిక్షణ కొనసాగించలేదు. స్నిగ్ధ రక్షణరంగంలో కానీ ఐపిఎస్గా కానీ దేశానికి సేవ చేయాలని, మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకోవాలని నా కోరిక. నేను చేయలేకపోయాను, తనైనా చేస్తే బావుండని ఆశ. అయితే ఇంత చిన్న వయసులోనే తన వృత్తి గురించి ఆలోచించడం సరి కాదేమో! అలాగే నా అభిప్రాయాన్ని, నా ముచ్చటను తన మీద రుద్దను. స్నిగ్ధ కూడా కోరుకుంటే దానికి తగిన కోచింగ్ ఇప్పించడంతోపాటు నేను చేయగలిగినంత సపోర్టునిస్తాను’’ అంటారు స్నిగ్ధ తల్లి సుధ. కరాటే ఫీజులు తక్కువే కానీ..! ‘‘కొన్ని పాఠశాలలు విద్యేతరకార్యక్రమాల్లో భాగంగా కరాటే క్లాసులు నిర్వహిస్తుంటాయి. అలా కాకుండా విడిగా కోచింగ్ తీసుకోవడం అంటే ఖర్చుతోకూడిన అంశం అనుకుంటారు. కానీ కరాటే శిక్షణకు నెలకు వెయ్యి రూపాయలు చాలు. అసలు ఖర్చు టోర్నమెంట్లకు హాజరుకావడంలోనే ఉంటుంది. పిల్లలతో తల్లి కానీ తండ్రి కానీ వెళ్లాలి, కోచ్తోపాటు పంపించవచ్చు కానీ నేనింత వరకు అలా పంపలేదు’’ అన్నారు సుధ. కరాటేలో వెపన్ ట్రైనింగ్, కటాస్, కుమితే విన్యాసాలన్నింటిలో మంచి పట్టు సాధించి డాన్ టెన్ స్థాయిని చేరడమే తన లక్ష్యం అంటోంది స్నిగ్ధ. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న తండ్రి ప్రోత్సాహం, అడుగడుగునా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న తల్లి సహకారంతో స్నిగ్ధ కోరుకున్న శిఖరాలను చేరుతుందని ఆశిద్దాం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, ఫొటోలు: లావణ్యకుమార్ -
పెప్సికో ఉచిత టాక్టైమ్ ఆఫర్
న్యూఢిల్లీ: పెప్సికో కంపెనీ 20-20 క్రికెట్ సీజన్ సందర్భంగా ఉచిత టాక్టైమ్ ఆఫర్ను అంది స్తోంది. తమ ఆహార పానీయాలు, ఆహారోత్పత్తుల కొనుగోళ్లపై ఈ ఉచిత టాక్టైమ్ ఆఫర్ను పొందవచ్చని పెప్సికో ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) దీపికా వారియర్ తెలిపారు. పెప్సీ, సెవెనప్, మిరిండా ఆరెంజ్, మౌంటెన్ డ్యూ, స్లైస్లపై; కుర్కురే(రూ. 30 ప్యాక్), లేస్(రూ.35 ప్యాక్)లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. వీటి లేబుల్ వెనక గానీ, ప్యాక్ లోపల గానీ ఒక కోడ్ ఉంటుందని, ఆ కోడ్ను 9818181234కు ఎస్ఎంఎస్ చేస్తే రూ.10 టాక్టైమ్ పొందవచ్చన్నారు. లేదా పేటైమ్డాట్కామ్లో కోడ్ను ఎంటర్ చేస్తే రూ.15 టాక్టైమ్ లభిస్తుందని తెలిపారు. ఆఫర్ ప్రి పెయిడ్(ఎస్ఎంఎస్ లేదా ఆన్లైన్ రీచార్జ్), పోస్ట్ పెయిడ్(ఆన్లైన్ రీచార్జ్ మాత్రమే) కనెక్షన్లకు వర్తిస్తుందని పేర్కొన్నారు. -
లవ్ ట్రాక్ మారింది!
సినిమాలకు ప్రేమను మించిన గొప్ప సాఫ్ట్వేర్ లేదు. తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచీ చూస్తే... ఈ 82 ఏళ్లల్లో వేల చిత్రాలు చ్చాయి. వాటిల్లో అధికశాతం చిత్రాలకు ముడిసరుకు ప్రేమ అంటే అతిశయోక్తి కానే కాదు. సినిమా మేకింగ్ పరంగా రకరకాల మార్పులు వచ్చినట్టుగానే, ఎన్నెన్నో ట్రెండ్లు వచ్చినట్టుగానే ప్రేమ కథల్లో కూడా రకరకాల పరిణామాలు టుచేసుకున్నాయి. మొదట్లో చాలా సున్నితంగా ఉండే ప్రేమకథలు రాన్రానూ పక్కా కమర్షియల్ అయిపోయాయి. అసలు ప్రస్తుతం ప్రేమకథల పరిస్థితి ఏంటి? ‘ప్రేమికుల రోజు’ సందర్భంగా ఇప్పటి లవ్ సినిమాల ట్రెండ్ గురించి... ‘‘పన్నెండేళ్ల నుంచి ప్రేమిస్తున్నా తనని. ఇదిగో తను చిన్నప్పుడు వాడిన పట్టీలు, ఇదిగో తను మొట్టమొదట జడవేసుకున్నప్పుడు పెట్టుకున్న తలపిన్ను...’’ అంటూ ఓ కుర్రాడు జాబితా చెబుతుంటాడు. అప్పుడు ఆ కుర్రాడు ప్రేమించిన అదే అమ్మాయిని తను ఎన్నాళ్లు ప్రేమిస్తాడో తనకే తెలీదనే మరోయువకుడు, అతని స్నేహితుడు కలిసి ‘‘వీడో కలెక్షన్ కింగ్రా’’ అంటూ ఆటపట్టిస్తారు. ‘ఆరెంజ్’ సినిమాలోని ఈ సన్నివేశంలో... ఒకప్పుడు ఆర్ద్రత పొంగిపొర్లే సిసలైన ప్రేమికుడికి చిహ్నమైన కుర్రాడు కాస్తా కమెడియన్ అయిపోయాడు. భావం పోయి... వేగం మిగిలి... సినిమా ప్రేమలు అంతకంతకూ కరకు దేలుతున్న వైనానికి ఇలాంటి సన్నివేశాలెన్నో అద్దం పడతాయి. ఓ అందమైన, అపురూపమైన భావోద్వేగంగా గొప్పగొప్పవాళ్లు పేర్కొన్న ఆ అనుభూతిలో వేగాన్ని మాత్రమే మిగిల్చి భావాన్ని మాయం చేసిన ఆనవాళ్లెన్నో కళ్లకు కడతాయి. కొంత కాలం క్రితం వచ్చిన ఇడియట్ సినిమాలో హీరో రోడ్డు మీద వెళుతున్న అమ్మాయి నచ్చగానే ఐలవ్యూ చెబుతాడు. తాజాగా అదే పూరి జగన్నాథ్ తీసిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో హీరో రోడ్డు మీద కనపడిన అమ్మాయిని ‘‘ప్రేమించనుగానీ ఓ ముద్దివ్వు’’ అనడుగుతాడు. ఆ అమ్మాయి ముద్దు పెట్టి వెళ్లిపోయిన కొన్నిరోజులకి తను ఆమెని ప్రేమించిన విషయం హీరోగారికి జ్ఞానోదయం అవడం ఫైనల్ టచ్. సినిమా ప్రేమల్లో శరవేగంగా వస్తున్న మార్పులకు ఇదో ఉదాహరణ. సారీ ఫర్ శాక్రిఫైస్... ప్రేమంటే ఎదుటివారి సుఖం కోరుకోవడం లేదా ప్రేమించిన మనిషి కోసం త్యాగాలకు సిద్ధపడడం. ఈ మాట ఇప్పటి సినీప్రేమలకు ఏ మాత్రం నప్పని విషయం. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలో హీరో ఓ అమ్మాయిని చూసి ఫ్లాటైపోతాడు. ఆ అమ్మాయనుకుని ఇంకో అమ్మాయికి ఫోన్లు చేస్తాడు. తర్వాత మొదటి అమ్మాయి తన ఫ్రెండ్నే ప్రేమిస్తోందని తెలుసుకుని ఫ్రెండ్ నుంచి ఆమెని దూరం చేయడానికి నానా తంటాలూ పడతాడు. దానికోసం అన్ని హద్దులూ దాటేసి చీప్గా ప్రవర్తిస్తాడు. మరోవైపు ఎవరో అమ్మాయనుకుని అనవసరంగా తనను డిస్ట్రబ్ చేశాడని తెలిసిన హీరోయిన్ అప్పటిదాకా ఫీలైన ప్రేమంతా తూచ్ అని తుడిచేసుకుని హీరో మీద పగతీర్చుకోవడానికి అతనికి బాస్గా మారుతుంది. ప్రేమ కోసం చంపు లేదా చావు అనేంతటి మూర్ఖత్వం ఆ అందమైన భావనలోని సున్నితత్వానికి సమాధి కడుతోంది. ‘ఆర్య-2’ సినిమాలో తన ఫ్రెండ్ని ప్రేమిస్తున్న అమ్మాయిని తనకి దగ్గర చేసుకోవడానికి హీరో అన్ని రకాలుగా తెగిస్తాడు. ఓ రకంగా చెప్పాలంటే తన ఫ్రెండ్ విషయంలో హీరోయిన్ మనసులో విషబీజాలు నాటి మరీ తనవైపు తిప్పుకుంటాడు. ముందైనా...పసందే... ప్రేమించుకున్నవారు పరిధుల్లో ఉండాల్సిన అవసరం ఏ మాత్రం లేదని నేటి సినిమాలు తేల్చిచెబుతున్నాయి. ్ర‘పేమకథా చిత్రమ్’ సినిమాలో చచ్చిపోదామనుకున్న హీరో మనసును మార్చడానికి హీరోయిన్ శారీరక సంబంధానికి సైతం ఓకే అనేస్తుంది. ఇక ఆ మధ్య వచ్చిన ‘తీన్మార్’ సినిమాలో హీరో, హీరోయిన్లు ‘అంతా అయిపోయే’ వరకూ ఒకరి పేర్లు ఒకరు తెలుసుకోకపోవడం ఈ ధోరణికి పరాకాష్ఠ. చిత్రాల్లో విచిత్రంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఎన్నో సినిమాల్లో తమ మధ్య ఉన్నది ప్రేమా, స్నేహమా అనేది తెలియకపోవడం... ప్రస్తుత ప్రేమల్లోని అయోమయానికి నిదర్శనంగా నిలుస్తుంది. పరిణితి తక్కువ...ప్రణయం ఎక్కువ... ఆధునిక ప్రేమల్లో పబ్లిగ్గా ఒకరి మీద ఒకరు వాలిపోయేంత వ్యామోహం ఎంత ఎక్కువ కనపడుతుందో, ఒకరి కష్టాన్ని ఒకరు మోసే ఓర్పు అంత తక్కువ కనపడుతుంది. ఈ వాస్తవానికి అద్దం పడుతున్న రీల్ లవ్లూ లేకపోలేదు. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాలో హీరో హీరోయిన్లు తమ ప్రేమ మీద తమకే నమ్మకం కలగక ‘కాపురం పరీక్ష’కు సిద్ధమవుతారు. అనుబంధం కోసం అణువంత సమస్యను కూడా భరించలేక... పెళ్లి కాని తమ కాపురం విఛ్చిన్నం చేసుకునేదాకా వెళతారు.నేటి లివిన్ (సహజీవనం) జంటల మనస్తత్వాలకు ఇది దగ్గరగా ఉంటుందీ చిత్రం. ఇక ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే వారిని కలపాలనుకున్న కొందరు స్నేహితుల జీవితాలను ఆ ఒక్క ఆలోచన ఎంతలా తలకిందులు చేస్తుందో, ఇంతా చేస్తే ఆ ఇద్దరూ ఎంత తేలిగ్గా తమ ప్రేమను చంపేసుకుంటారో ‘శంభో శివ శంభో’ సినిమా చూపుతుంది. సినిమా సమాజాన్ని నడుపుతుందా, సమాజపోకడలపై ఆధారపడి సినిమా నడుస్తుందా అనే వాదోపవాదాలు అలా ఉంచితే... బయట అసాధారణంగా జరిగే ఒకటీ అరా సంఘటనల ఆధారంగానే సినిమాలు రూపుదిద్దుకుంటాయని, అవి అత్యంత సాధారణంగా జరిగేవిగా చూపిస్తాయనేది నిజం. ఈ నిజాన్ని అర్థం చేసుకుంటే జీవితం... అందు లోని అత్యంత అపురూప అనుభవం అయిన ప్రేమ అబద్ధం కాకుండా ఉంటాయనేది కూడా నిజం. - ఎస్.సత్యబాబు -
చుక్కల నంటిన పండ్ల ధరలు
దేవరపల్లి, న్యూస్లైన్: నూతన సంవత్సరం సందర్భంగా పండ్లు, పూల బొకేల ధరలు చుక్కల నంటాయి. పెరిగిన పండ్ల ధరలను చూచి ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఏపండు కొందామన్నా అందుబాటులో లేవని వినియోగదారులు వాపోతున్నారు. ఇలాంటి ధరలు ఎప్పుడూ చూడలేదని వినియోగదారులు అంటున్నారు. గత ఏడాదితో పోల్చుకొంటే పండ్ల ధరలు 25 నుండి 30 శాతం పెరిగాయి. పూల బొకేల ధరలు కూడా పెరిగాయి. గత ఏడాది యాపిల్ ధర రూ. 10 నుండి 15 ధర పలకగా ఈ ఏడాది రూ. 25 నుండి 30 పలుకుతున్నాయి. ప్రస్తుతం పండ్ల ధరలు ఈ విధగంగా ఉన్నాయి. దానమ్మ కాయ రూ. 40 నుండి 50, కమలాలు డజను రూ. 120 నుండి 150 ధర పలుకుతున్నాయి. పూల బొకేల ధరలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాయి. పచ్చిపూల బొకే రూ. 50, ప్లాస్టిక్ బొకే రూ. 100 నుండి 250 పలుకుతున్నాయి. ఈ ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవటం వల్ల నిరూత్సహపడుతున్నారు. కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం 2013 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2014 నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇళ్ల ముందు రంగురంగుల రంగవెల్లులతో సుందరంగా అలంకరించారు. బాణసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకొన్నారు. యువత వీధుల్లో తిరుగుతూ సందడి చేశారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. నూతన సంత్సరానికి స్వాగతం పలికారు. బార్లు, హోటళ్లు సాయంత్రం 5 గంటల నుండే కిక్కిరిసాయి. మాంసాహార వంటకాలతో రోడ్లు ప్రక్కన స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయాలు జరిపారు. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. కౌజుపిట్ట, పీత, చేప, రొయ్య వంటి రుచికరమైన వంటకాలను తయారు చేసి విక్రయించారు. కానరాని సందడి నల్లజర్లరూరల్: నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సమయం ఆసన్నమైంది. నల్లజర్ల జంక్షన్లో ఆసందడేమి కనపడటం లేదు. గతంలో పది రోజుల ముందు నుంచే గ్రీటింగ్ కార్డులు, ముగ్గులు, అలంకరణ సామగ్రి షాపుల వద్ద విద్యార్థులు ఉద్యోగులుతో సందడిగా ఉండేది. కాని ఈ ఏడాది కొనేవారు లేక షాపులు వెలవెలబోతున్నాయి. ప్రతి వ్యక్తికి వ్యక్తి గతంగా సెల్ఫోన్లు ఉండటం సంక్షిప్త సమాచారం వాటి పంపే వీలుండటంతో అందరూ పరస్పరం సెల్ఫోన్ల ద్వారానే పంపడానికి ఇష్టపడుతున్నారు. దీంతో గ్రీటింగ్ కార్డుల అమ్మకం పూర్తిగా తగ్గిపోయిందని వ్యాపారి వినాయక్ వాపోయాడు. నూతన సంవత్సరంలో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకునేటప్పుడు ,పెద్దల వద్దకు వెళ్ళెటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకుండా పండ్లు, ఫ్లవర్ బొకేలు తీసుకెళ్ళడం ఆనవాయితీ. ఈ ఏడాది పెరిగిన ధరలతో ఏ పండు పట్టుకుందామన్నా చేతులు కాలే పరిస్థితి. చిన్న యాపిల్కూడా రూ.20కి పైనే ఉంది. ఇవి సామాన్యుడికి ప్రియంగా మారాయి. దీంతో పండ్ల వ్యాపారులు తక్కువ మొత్తంలో పళ్ళు అమ్మకానికి పెట్టారు. వీటితో పాటు పూల అలంకరణ, రంగుల దుకాణాలు వినియోగదారులు లేక వెలవెలబోతున్నాయి. నూతన సంవత్సరం మరికొన్ని గంటలలో రానున్నా సందడి మాత్రం కానరావడం లేదు. -
దీని దుంప తెగ...ఎన్ని పోషకాలో!
డుంబ్రిగుడ, న్యూస్లైన్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు చిలకడ (ఎర్ర)దుంపలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ దుంపల్లో బీటా కెరిటన్ అనే విటమిన్ అధికంగా ఉండడం వల్ల దృష్టి లోపం నుంచి గట్టెక్కవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ చెందిన కొంత మంది చిలకడ దుంపల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు స్థానిక వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏడాది క్రితం సొవ్వా, దేముడువలస, లోగేలి గ్రామాల్లో పర్యటించి ప్రయోగాత్మకంగా ఈ దుంపల సాగును ప్రోత్సహించారు. ఏజెన్సీలోని చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందక, వ్యాధి నిరోధక శక్తి తగ్గి మత్యువాత పడుతున్నారు. చాలాచోట్ల అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు కూడా సరైన పౌష్టికాహారం అందడం లేదు. ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్నట్టు పలు స్వచ్ఛంద సంస్థలు సర్వేల ద్వారా గుర్తించాయి. పౌష్టికాహార లోపాన్ని నివారించడంలో చిలకడ దుంపలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నందున శాస్త్రవేత్తలు వీటి సాగును ప్రోత్సహిస్తున్నారు. చిన్నారులను ఆకర్షించేలా క్యారట్ రంగులో ఆరెంజ్, స్వీట్ ప్లేవర్లలో ఈ దుంపలు లభిస్తున్నాయి. దీని సాగు లాభదాయకంగా ఉండడంతో గిరిజనులు సాగువిస్తీర్ణం గణనీయంగా పెంచుతున్నారు. గత ఏడాది 30 ఎకరాల్లో పండించిన పంట ఈ ఏడాదిలో 70 ఎకరాలకు విస్తరించారు. 50 కిలోల చిలకడ దుంపల బస్తా రూ.1100 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు దుంపలను కొనుగులో చేసి విశాఖ, రాజమండ్రి, తుని తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రైతులకు ఆర్థిక ఆసరా... జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేస్తున్న చిలకడ దుంపలు గిరిజన రైతులకు ఆర్థిక ఆసరా అందిస్తోంది. ఈ దుంపల సాగుకు ఇక్కడ భూములు అనుకూలంగా ఉండడంతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో స్వల్ప కాల వ్యవధిలో పంట చేతికి వ స్తుండడంతో ఈ దుంపల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. పంట పక్వానికి రావడంతో తవ్వి వెలికి తీసి, శుభ్రం చేసి మార్కెట్కు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు. గిటుబాటు ధర లభిస్తుండడంతో హర్షం వ్యక్తంచేస్తున్నారు.