panama papers
-
Pandora Papers: రహస్య లావాదేవీల కుంభకోణం.. సచిన్కు క్లీన్చిట్!
Pandora Papers 2021 Sachin Name: లక్షల మంది ప్రముఖుల గోప్యపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ‘పండోరా పేపర్స్-2021’ స్కాండల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశ అధ్యక్షుల మొదలు.. సినీ తారల దాకా లక్షల మంది విదేశీ రహస్య ఆస్తులు, లావాదేవీలకు సంబంధించిన రహస్య డాక్యుమెంట్లను ఇంటర్నేషనల్ కన్సోర్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖులకు డాక్యుమెంట్లలో క్లీన్చిట్ దక్కగా.. ఆ పేర్లలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఉన్నారు. Pandora Papers 2021 వ్యవహారంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు పరోక్షంగా క్లీన్చిట్ ఇచ్చింది ఐసీఐజే నివేదిక. సచిన్ విదేశీ పెట్టుబడులు సక్రమేనని, ఈ విషయాన్ని ఇన్కమ్ట్యాక్స్ అధికారులు సైతం ధృవీకరించినట్లు ఆయన తరపు అటార్నీ స్టేట్మెంట్ను పండోరా పేపర్స్ నివేదిక స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు కేవలం సచిన్ పేరును మాత్రమే పత్రాల్లో పేర్కొన్నామని, ఆయన రహస్య లావాదేవీలకు సంబంధించి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని తెలిపింది . ఇక పాప్ సింగర్ షకీరా, సూపర్ మోడల్ మిస్ షిఫ్ఫర్లకు సైతం క్లీన్ చిట్ లభించింది. ఏమిటీ పనామా పేపర్స్.. నల్ల ధనవంతుల గుట్టురట్టు! ఇమ్రాన్ సర్కార్పై విమర్శలు మరోవైపు అధికారికంగా వెల్లడించని ఆర్థిక లావాదేవీల వివరాలతో కూడిన పండోరా పేపర్స్ ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. నేతలు, మాజీ నేతలు, అధికారులు, ఇతరత్ర సెలబ్రిటీల పేర్లు మొత్తంగా 91 దేశాల నుంచి(భారత్ నుంచి 300 మంది పేర్లు) అందులో పేర్కొని ఉన్నాయి. మొత్తం పద్నాలుగు రంగాల్లో, దాదాపు 956 కంపెనీల్లో వీళ్లంతా రహస్య పెట్టుబడులు పెట్టడం లేదంటే ఆస్తుల్ని కలిగి ఉన్నట్లు సమాచారం. భారత్ నుంచి ఆరుగురు, పాక్ నుంచి ఏడుగురు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ నివేదిక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఇరకాటంలో పడేసింది. ఆయన సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు, ఆయన కేబినెట్ మంత్రులకు కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నాయని పండోరా పేపర్స్ వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్కు అత్యంత సన్నిహితుడు, పీఎంల్–క్యూ పార్టీ నేత చౌదరి మూనిస్ ఎలాహీకి అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉందని పత్రాల్లో బహిర్గతమైంది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాకే దర్యాప్తునకు ముందుకెళ్తామని పాక్ ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలు, 150 మీడియా ఔట్లెట్స్, 600 మంది జర్నలిస్టుల నుంచి సమగ్ర దర్యాప్తు చేపించుకుని ఈ వివరాలను సేకరించి బట్టబయలు చేసినట్లు ప్రకటించుకుంది ఇంటర్నేషనల్ కన్సోర్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్. ధనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించిన 12 మిలియన్ల (1.20 కోట్లు) పత్రాలను తాము సేకరించినట్లు ఐసీఐజే వెల్లడించింది. పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ తదితర దేశాల్లో వారు నల్ల ధనాన్ని దాచుకోవడానికి, రహస్యంగా ఆస్తులు పోగేసుకోవడానికి డొల్ల కంపెనీలను సృష్టించారని తెలిపింది. ఇదిలా ఉంటే పండోరా పేపర్స్ వివరాలు కేవలం ఆరోపణలు మాత్రమే. వీటిపై దర్యాప్తు చేయించడం, చేయించకపోవడం సంబంధిత ప్రభుత్వాల ఇష్టం. -
పనామా పేపర్లు : మళ్లీ సంచలనం
న్యూఢిల్లీ : పనామా పేపర్ల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండేళ్ల తర్వాత లా కంపెనీ మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన మరికొన్ని పరిశోధనాత్మక పత్రాలు బయటకు వచ్చాయి. దాదాపు 12 లక్షలకు పైగా సరికొత్త పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) అధ్యాయనం చేసిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం బయటపెట్టిన పత్రాలన్నింటిని దక్షిణ జర్మనీ వార్తాపత్రిక సేకరించింది. వీటిలో దాదాపు 12 వేల పత్రాలు భారతీయులకు సంబంధించినవి కావడం గమనార్హం. 2016లో దాదాపు 500 మంది భారతీయుల పేర్లు మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన పత్రాల్లో ఉన్నాయి. వీటిపై విచారణ జరిపేందుకు భారత ప్రభుత్వం మల్టీ ఏజెన్సీ గ్రూప్(ఎమ్ఏజీ)ను ఏర్పాటు చేసింది. 2016 లీక్ల ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఎమ్ఏజీ గుర్తించింది. కొత్త లీక్లో ఉన్న విషయాలేంటి..? కొత్త పత్రాల్లో భారత్కు చెందిన పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయి. వీరి పేర్లు 2016 లీక్స్లో లేవు. - పీవీఆర్ సినిమా యజమాని అజయ్ బిజ్లీ, ఆయన కుటుంబ సభ్యులు - సునీల్ మిట్టల్ కుమారుడు, హైక్ మెసేంజర్ సీఈవో, భారతీ ఎయిర్టెల్ సీఈవో కవిన్ భారతి మిట్టల్ - ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ అశ్విన్ దాని కుమారుడు జలాజ్ అశ్విన్ దాని వీరికి లింక్లు ఉన్నాయని తేలింది.. పనామా పేపర్లలో తమ పేర్లు రావడాన్ని ఖండించిన కొందరు ప్రముఖుల పేర్లు మళ్లీ బయటకు వచ్చాయి. వీరికి ఆఫ్ షోర్ కంపెనీలతో బిజినెస్ లింక్స్ ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలను ఐసీఐజే జర్నలిస్టులు సంపాదించారు. సదరు ప్రముఖుల పేర్లు ఇవే.. - శివ్ విక్రమ్ ఖేమ్కా - నటుడు అమితాబ్ బచ్చన్ - మాజీ సొలిసిటర్ జనరల్ తనయుడు జహంగీర్ సోరబ్జీ - డీఎల్ఎఫ్ గ్రూప్కు చెందిన కేపీ సింగ్, ఆయన కుటుంబం - అనురాగ్ కేజ్రీవాల్ - మెహ్రాసన్స్ జ్యువెల్లర్స్కు చెందిన నవీన్ మెహ్రా - అండర్ వరల్డ్ డాన్ ఇక్బాల్ మిర్చి భార్య హజ్రా ఇక్బాల్ మెమన్ -
విండోస్ 2017
కొన్ని తీపి గురుతులు.. మరికొన్ని చేదు గుళికలు.. ఎన్నో మధుర స్మృతులు.. మరెన్నో పీడ కలలు.. మొత్తంగా 2017 ఎన్నో జ్ఞాపకాలను మిగులుస్తూ వీడ్కోలుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో 2017కి వీడ్కోలు పలికి 2018 సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ తరుణంలో గడిచిన 2017లో దేశంలోనూ, ప్రపంచంలోనూ చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు, పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ మేలో ప్రపంచాన్ని వాన్నాక్రై వణికించింది.150 దేశాల్లో విండోస్ ఓఎస్ ఉపయోగించే కంప్యూటర్లు, సంస్థలు లక్ష్యంగా సైబర్ దాడులు సాగాయి. ఈ కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని తిరిగి ఇచ్చేందుకు బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీతో చెల్లింపులు చేయాలని బెదిరింపులకు పాల్పడ్డారు. వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తరకొరియా సైనిక పాలకుడు కిమ్ జోంగ్–ఉన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ చర్యలతో ట్రంప్, కిమ్ మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. ట్రంప్ హెచ్చరికలు.. కిమ్ ప్రతి హెచ్చరికలతో ఇరుదేశాల మధ్యా యుద్ధ వాతావరణం నెలకొంది. జనవరి 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. అమెరికాను మరోసారి శక్తివంతమైన, సంపన్న దేశంగా మారుస్తానంటూ వాగ్దానం చేశారు. అధికారాన్ని చేపట్టిన కొద్ది కాలంలోనే తన వ్యవహారశైలి, మాట్లాడే ధోరణి, ముఖ్యమైన సమస్యలపై స్పందించే తీరుతో ట్రంప్ అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. 37 ఏళ్ల పాటు జింబాబ్వే అధ్యక్షుడిగా ఉన్న రాబర్ట్ ముగాబేకు రాజకీయ చరమాంకంలో చేదు అనుభవం ఎదురైంది. సైనిక తిరుగుబాటు ద్వారా ఆయన బలవంతంగా రాజీనామా చేసే వరకు పరిస్థితులు దారితీశాయి. తన భార్య గ్రేస్ ముగాబేను తొలుత ఉపాధ్యక్షురాలిని చేసి, తన తర్వాత అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టాలని ముగాబే చేసిన ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత దీనికి కారణమైంది. ఆరురోజుల పాటు దిగ్బంధం ఫలితంగా ఆ దేశ తర్వాతి అధ్యక్షుడిగా ఎమార్సన్ నాన్గాగ్వా బాధ్యతలను స్వీకరించారు. పనామా పేపర్ల పేరిట జర్మనీ వార్తాపత్రిక విడుదల చేసిన లక్షలాది పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తల సందేహాస్పద ఆర్థిక వ్యవహారాలు బయటకు వచ్చాయి. ఈ వివాదాల్లో చిక్కుకున్న వారిలో ఎలిజబెత్ రాణి–2 మొదలుకుని, బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఐర్లాండ్కు చెందిన పాల్ డేవిడ్ హ్యూసన్(బోనో) తదితరులున్నారు. ఆగస్టు చివర్లో మయన్మార్లో రోహింగ్యాలపై అక్కడి సైన్యం హత్యాకాండతో బంగ్లాదేశ్ తదితర దేశాలకు పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా దాడుల బారిన పడిన తెగగా రోహింగ్యాలను పరిగణిస్తున్నారు. రోహింగ్యా శరణార్థుల సమస్యకు ఇంకా ఎలాంటి పరిష్కారం లభించలేదు. దేశ 14వ రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్ జూలై 17న, 13వ ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు ఆగస్ట్ 5న ఎన్నికయ్యారు. వారు వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులు మీరాకుమార్, గోపాలకృష్ణ గాంధీని ఓడించారు. బీజేపీ నేపథ్యమున్న మొదటి రాష్ట్రపతిగా కోవింద్(72) చరిత్రకెక్కారు. బిహార్ గవర్నర్గా పనిచేసిన కోవింద్కు 65 శాతం ఓట్లు లభించాయి. వరుసగా దాదాపు 19 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన వెంకయ్య ఆ సభకే అధ్యక్షుడయ్యారు. 1997లో నాసా ప్రయోగించిన కాసిని అంతరిక్షనౌక 2004లో శనిగ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. నాలుగున్నర లక్షల ఉపగ్రహ చిత్రాల ద్వారా విలువైన సమాచారాన్ని అందించింది. 2017 సెప్టెంబర్ 15న సేవలు చాలించింది. అక్టోబర్ 1న లాస్వేగాస్లో ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకుని స్టీఫెన్ పాడాక్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 58 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్ష ప్రకటన. దాదాపు 7 దశాబ్దాల పాటు అగ్రరాజ్యం అనుసరించిన వైఖరికి భిన్నంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో పశ్చిమాసియాలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాను ‘హరికేన్ హార్వే’ అల్లాడించింది. దీని ధాటికి టెక్సాస్ తదితర ప్రాంతాల్లో 90 మంది వరకు చనిపోవడంతో పాటు దాదాపు 200 బిలియన్ డాలర్లపై చిలుకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఏడాది బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. గోవా, మణిపూర్లో సగానికన్నా ఎక్కువ సీట్లు రాకున్నా కొద్ది రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. పంజాబ్లో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి కష్టం మీద మెజారిటీ సంపాదించింది. ఐదేళ్ల కాంగ్రెస్ పాలన సాగిన హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జూలై 1న ఏకీకృత పన్నుల విధానం జీఎస్టీ అమలులోకి వచ్చింది. ప్రధాని మోదీ ‘గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్’ అని పిలిచిన జీఎస్టీ కేంద్ర, రాష్ట్రాలు వసూలు చేస్తున్న 15 రకాల పన్నులు, సుంకాల స్థానంలో జీడీపీని పెంచే సాధనంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో దాదాపు రెండు దశాబ్దాలు కొనసాగిన సోనియాగాంధీ ఆరోగ్య కారణాలతో వైదొలిగారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సోనియా కుమారుడు రాహుల్గాంధీ పోటీ లేకుండా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేపట్టిన నెహ్రూ–గాంధీ కుటుంబంలో ఆయన ఆరో సభ్యుడిగా చరిత్రకెక్కారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్తో రాజకీయ బంధం తెంచుకున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేసిన వెంటనే అప్పటి వరకూ శత్రువైన బీజేపీతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కొన్ని నెలలుగా ఈ పరిణామం జరుగుతుందని ఊహించినా నితీశ్ చూపిన తెగువ, వేగం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ముస్లిం సమాజంలో మహిళలకు వారి భర్తలు ఇచ్చే ముమ్మారు తలాక్ పద్ధతి చెల్లదని ఈ ఏడాది ఆరంభంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సంచలనం సృష్టించిన ఈ తీర్పు అమలుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ముమ్మారు తలాక్ను రద్దు చేస్తూ ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లు రూపొందించింది. లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా మెజారిటీ సభ్యుల ఆమోదం పొందాక చట్టం కావడానికి అడ్డంకులేవీ ఉండవు. 1962లో యుద్ధానికి దిగిన ఆసియా పెద్దన్నలు ఇండియా, చైనా మధ్య జూన్ 16 నుంచి కొన్ని నెలలపాటు పశ్చిమ భూటాన్లోని వివాదాస్పద ప్రాంతమైన డోక్లామ్ పీఠభూమిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తత ముదిరి రెండోసారి రెండు పెద్ద దేశాల మధ్య పోరుకు దారితీస్తుందేమోననే భయాందోళనలు తలెత్తాయి. డోక్లామ్ ప్రాంతంలోకి చైనా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఈ వివాదం రాజుకుంది. చివరికి నిర్మాణం ఆపేసిన చైనాకు, భారత్కు మధ్య ఉద్రిక్తత సడలించడానికి ఆగస్ట్ 28న అవగాహన కుదిరింది. ఇస్రోకు మరిచిపోలేని విజయాలు అందించిన సంవత్సరం ఇది. ఇస్రో తన ఉపగ్రహవాహక నౌక(పీఎస్ఎల్వీ) ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఫిబ్రవరి 15న 714 కిలోల ఉపగ్రహం కార్టోస్టాట్–2ను మరో 103 ఉపగ్రహాలతోపాటు ఇస్రో ప్రయోగించింది. బెంగళూరుకు చెందిన ప్రసిద్ధ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్య దేశంలో కుచించుకుపోతున్న భావ ప్రకటనా స్వాతంత్య్రానికి, పత్రికా స్వేచ్ఛకు అద్దం పట్టింది. సెప్టెంబర్ 5 సాయంత్రం ఇంటి దగ్గరే గౌరిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అవినీతి, నియంతృత్వ పోకడలను ప్రతిఘటించే గౌరీ లంకేశ్ పత్రిక నడుపుతున్నారు. వివిధ రంగా ల్లో ప్రముఖులు తమ కింద పనిచేసే మహిళలపై సాగించిన లైంగిక వేధింపులు, దోపిడీకి వ్యతిరేకంగా పాశ్చాత్య ప్రపంచం లో ఆలిసా మిలానో అనే స్త్రీ ప్రారంభించిన ‘నేను సైతం’ ఉద్యమంలో వేలాది మంది భారత మహిళలు పాల్గొన్నారు. -
సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు
వివాదస్పద వ్యాఖ్యలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచే బీజేపీ ఫైర్ బ్రాండు, సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. పనామా పేపర్లలో ప్రముఖ టాటా సన్స్ డైరెక్టర్లలో చాలా మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. తనకు సమయమిస్తే, అందరి వివరాలను ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. ట్విట్టర్ ద్వారా సుబ్రహ్మణ్యస్వామి ఈ ఆరోపణలు చేశారు. పనామా పేపర్ల లీక్ ప్రపంచాన్నే కుదిపేసిన సంగతి తెలిసిందే. విదేశాల్లో నల్లధనం దాచుకున్న నల్ల కుబేరుల జాబితాను ఈ పేపర్లు బయటపెట్టాయి. చాలా మంది ప్రముఖులే ఈ పేపర్లలో ఉన్నారు. ఇటీవల పనామా పేపర్ల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన పదవివే పోగొట్టుకున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో, ప్రభుత్వ పదవులు చేపట్టకుండా ఆయనపై ఆ దేశ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. నేడు సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. Many prominent Tata&Sons Directors figure in Panama Papers. Will publish details when time permits — Subramanian Swamy (@Swamy39) December 16, 2017 -
‘ప్యారడైజ్ పేపర్స్’పై బిగ్ బి స్పందన
న్యూఢిల్లీ : పనామా పేపర్లలో, బోఫోర్స్ కుంభకోణంలో తాజాగా ప్యారడైజ్ పేపర్స్లో తన పేరు వెలుగులోకి రావడంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ స్పందించారు. తాను ఎల్లవేళలా వ్యవస్థకు సహకరిస్తానని, కానీ ఈ వయసులో తనని ఒంటరిగా వదిలివేయాలని కోరారు. తన బ్లాగ్లో అమితాబ్ ఓ బాధాకరమైన పోస్టును పెట్టారు. '' రేపు మరింత ఎక్కువుంటుంది. ఈ ప్రక్రియకు సహకారం అందిస్తుంటా..'' అని తెలిపారు. పన్నులను తప్పించుకుంటూ విదేశాల్లో అక్రమంగా సొమ్మును దాచుకుంటున్న కుబేరుల బండారాన్ని ప్యారడైజ్ పేపర్స్ పేరుతో ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లీకేజీల్లో 714 మంది భారతీయులున్నారని వెల్లడైంది. వారిలో అమితాబ్ పేరు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ ప్యారడైజ్ పేపర్లలో తన పేరు ఉన్నట్టు అమితాబ్కు తెలుసో? లేదో? ఇంకా స్పష్టత లేదు. అమితాబ్ పోస్టు చేసిన బ్లాగ్లో కేవలం అక్రమంగా ప్రాపర్టీని నిర్మించినందుకు గాను బీఎంసీ జారీచేసిన నోటీసులు, పనామా పేపర్లలో తన పేరు, బోఫోర్స్ కుంభకోణాన్ని మాత్రమే ప్రస్తావించారు. ప్యారడైజ్ పేపర్లలో తన పేరు ఉన్నట్టు వచ్చిన వార్తలపై ఆయన స్పందించలేదు. ఈ వయసులో, ఈ సమయంలో తనకు శాంతి, స్వేచ్ఛను మాత్రమే కోరుకుంటున్నానని తెలిపారు. నాకోసం, నా జీవితం కోసం గడపడానికి కొన్ని సంవత్సరాలు వదిలి పెట్టాలంటూ అమిత్ తన పోస్టులో అభ్యర్థించారు. ఇటీవల కాలంలో పనామా పేపర్లలో మరోసారి తన పేరు వచ్చిందన్నారు. తన పేరును దుర్వినియోగం చేసినందుకు వెనువెంటనే సమాధానమిచ్చానని, అయినప్పటికీ ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 6 సమన్లను అందుకున్నానని, ఇంకా వస్తున్నాయని బాధాకరం వ్యక్తంచేశారు. -
మాల్యాకు మరో చిక్కు: పనామాతో లింకులు
ముంబై : బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో నక్కిన విజయ్ మాల్యాకు చిక్కుల మీద చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఆయన అప్పగింత కేసును మరింత బలోపేతం చేస్తూ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయ్మాల్యా ప్రమోటెడ్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, పనామా పేపర్లో ఉన్న లిబేరియన్కు చెందిన రెండు కంపెనీలతో లావాదేవీలు జరిపినట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టు చేసింది. 2,14,488పైగా ఆఫ్సోర్ కంపెనీల ఫైనాన్సియల్, అటార్ని క్లయింట్ సమాచారానికి చెందిన 11.5 మిలియన్ లీక్డ్ డాక్యుమెంట్లే ఈ పనామా పేపర్లు. తాజా విచారణలో భాగంగా ఓ రెండు సంస్థలు, ప్రస్తుతం పనిచేయని దేశీయ క్యారియర్లో వాటాలు కలిగి ఉన్నట్టు తెలిసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు(సీఎఫ్ఐఓ) నిర్వహించిన తాజాగా విచారణల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ రెండు సంస్థలు మారిసస్కు చెందిన ఐక్యూ బ్రిడ్జ్ లిమిటెడ్, తన దేశీయ సబ్సిడరీ ఐక్యూ బ్రిడ్జ్ లిమిటెడ్, బెంగళూరు అని తెలిసింది. వీటిని విజయ్మాల్యా, యూబీ గ్రూప్ తన ఆధీనంలో నడిపించేదని తేలింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, డెక్కన్ ఏవియేషన్లో విలీనం కాకముందు ఈ రెండు సంస్థలు 15 లక్షలు, 52 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్టు రిపోర్టు పేర్కొంది. 2007-08 కాలంలో ఐక్యూ బ్రిడ్జ్ మారిసస్లో ఉన్న 99 షేర్లలో మాల్యా 89ని లిబేరియా రిజిస్ట్రేషన్ కలిగి లోమ్బార్డ్ వాల్ కార్పొరేట్ సర్వీసెస్ ఇంక్కు ట్రాన్సఫర్ చేసినట్టు సీఎఫ్ఐఓ నివేదికలో తెలిసిందని ఇండియన్స్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. అంతేకాక యూనైటెడ్ బెవరీస్ హోల్డింగ్ లిమిటెడ్కు చెందిన ఓవర్సీస్ సబ్సిడరీ యూబీ ఓవర్సీస్ లిమిటెడ్, కింగ్ఫిషర్కు చెందిన 1.67 కోట్ల షేర్లను కొనుగోలుచేసినట్టు కూడా విచారణ నివేదికలు పేర్కొన్నాయి. వీటి విలువ రూ.50.02 కోట్లు. -
ప్రధానమంత్రి కుమార్తెకు సమన్లు
ఇస్లామాబాద్: పనామా పత్రాలపై విచారణకు గాను పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె సమన్లు అందుకున్నారు. మనీలాండరింగ్ కేసులో జూలై 5వ తేదీన విచారణకు రావాల్సిందిగా కోరుతూ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం(జేఐటీ) నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్కు సమన్లు జారీ చేసింది. కుమార్తె చదువుకుంటున్న యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గాను మరియం ప్రస్తుతం లండన్లో ఉన్నారు. జూన్ 15వ తేదీన ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా జేఐటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇలాంటి విచారణకు హాజరైన మొదటి ప్రధాని ఆయనే. ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్ కూడా జూలై 3, 4 తేదీల్లో జేఐటీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. పెద్ద కుమారుడైన హసన్ను ఇప్పటికే ఐదు సార్లు జేఐటీ విచారించింది. వీరితోపాటు నవాజ్ షరీఫ్ బంధువు తారిఖ్ షఫీను కూడా రెండోసారి జూలై 2 వ తేదీన విచారణకు రావాల్సిందిగా జేఐటీ సమన్లు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన జేఐటీ జూలై 10వ తేదీన సుప్రీంకోర్టుకు విచారణ నివేదిక సమర్పించాల్సి ఉంది. మనీలాండరింగ్ ద్వారా అక్రమంగా విదేశాలకు తరలించిన డబ్బుతో నవాజ్ షరీఫ్ కుటుంబం లండన్ నగరం పార్క్లేన్ ఏరియాలో నాలుగు అపార్టుమెంట్లు కొనుగోలు చేసినట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. ఏప్రిల్ 20 వ తేదీన ఈ కేసును విచారణకు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ప్రధానమంత్రితో పాటు ఆయన కుమారులను.. ఇంకా సంబంధం ఉన్న ఇతరులను కూడా విచారించే అధికారం కల్పిస్తూ జేఐటీని ఏర్పాటు చేసింది. -
పనామా లీక్స్ నిందితులకు పేపర్ జైలు
ఏమిటీ షిప్పు.. ఏమిటీ డిజైన్.. కాసింత వెరైటీగానే ఉంది కదూ..ఇది వెరైటీయే.. ఎందుకంటే ఇది ఓ జైలు డిజైన్. ఎవరి కోసమో తెలుసా? గతేడాది సంచలనం సృష్టించిన పనామా పేపర్ల నిందితుల కోసమట! 1.1 కోట్ల పత్రాలు లీకైన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన సంపన్నులు పన్నులు ఎగ్గొట్టి.. తమ సంపదను దాచుకున్న వైనమూ వెల్లడైంది. అలాంటి ఆర్థిక నేరస్తుల కోసమే ఈ జైలు అని దీన్ని రూపొందించిన డిజైనర్లు(ఫ్రాన్స్) చెబుతున్నారు. అందుకే ఈ నౌకకు పనామా పేపర్స్ జైలు అని పేరు పెట్టారు. అంతేకాదు.. పై భాగంలో గడుల్లా కనిపిస్తున్నవి జైలు గదులన్నమాట. వీటిని తయారుచేసేది కూడా పేపర్స్తోనే.. అంటే కాగితంతో.. మొత్తం 3300 మంది ఖైదీలను ఉంచొచ్చు. ఈ నౌకలో సముద్రపు నీళ్లను రీసైకిల్ చేసి.. వినియోగించుకునే సదు పాయంతోపాటు జిమ్, వర్క్షాపులు, పంటలను పండించే ఏర్పాట్లు ఉంటా యట. పనామా సిటీకి దగ్గర్లోని సముద్రపు జలాల్లో తిరుగుతూ ఉంటుందట. వన్వీక్ వన్ ప్రాజెక్ట్ అనే వెబ్సైట్ ప్రతి వారం ఓ వినూత్నమైన కాన్సెప్ట్ను విడుదల చేస్తుంది. అందులో భాగంగా ఈ డిజైన్ను విడుదల చేసింది. -
పాక్ ప్రధానికి వ్యతిరేకంగా సుప్రీంకు ఆధారాలు!
ఇస్లామాబాద్: పనామా పత్రాల వివాదంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు ఉచ్చుబిగుస్తోంది. ఈ వ్యవహారంలో ఆయనకు వ్యతిరేకంగా తాజాగా మాజీ క్రికెటర్, ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పించారు. 1988 నుంచి షరీఫ్ కుటుంబం అక్రమ వ్యాపారాలు చేస్తూ, పన్ను ఎగ్గొడుతూ రూ. 14.5 కోట్ల సొమ్మును మనీలాండరింగ్ చేసిందని పత్రాలు న్యాయస్థానానికి అందజేశారు. షరీఫ్ కుటుంబానికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు, రుణాలను ఎగ్గొట్టిన వివరాలను తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు సమర్పించిన పత్రాలను విశ్లేషించిన పాక్ పత్రిక డాన్.. 1988 నుంచి షరీఫ్ కుటుంబం పన్నులు ఎగ్గొట్టి హవాలా వ్యాపారం ద్వారా విదేశాలకు రూ. 145 మిలియన్ల సొమ్మును తరలించిందని తెలిపింది. ఈ కాలంలో షరీఫ్ కుటుంబం కేవలం రూ. 897 పన్నును మాత్రమే చెల్లించిందని పేర్కొంది. ప్రధాని షరీఫ్ ఆస్తులపై జర్నలిస్టు అసద్ ఖరాల్ రాసిన పుస్తకంలోని వివరాలను కూడా ప్రతిపక్షనేత ఇమ్రాన్ఖాన్ సుప్రీంకోర్టుకు సమర్పించారు. -
పాక్ ప్రధాని షరీఫ్ కు షాక్
ఇస్లామాబాద్: పనామా పేపర్ల కేసులో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబసభ్యులకు ఆ దేశ సుప్రీం కోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. షరీఫ్ అవినీతికి పాల్పడ్డారని, విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కలిగివున్నారని ఆయన ప్రధానమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ పార్టీ లీడర్ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ సైతం కోర్టు విచారణకు స్వీకరించింది. పనామా పేపర్ల లీక్ అనంతరం షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ధనాన్ని విదేశాలకు తరలించినట్లు, యూకేలో ఆస్తులు కూడా ఉన్నట్లు ఇమ్రాన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. షరీఫ్ తో పాటు ఆయన తనయ మార్యామ్, తనయులు హాసన్, హుస్సేన్, మేనల్లుడు మొహమ్మద్ సఫ్దార్, ఆర్ధిక శాఖ మంత్రి ఇషాక్ దార్, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్, ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ చైర్మన్, అటార్నీ జనరల్ లకు కోర్టు నోటీసులు పంపింది. కాగా పిటిషన్లపై ప్రాథమిక విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి అన్వర్ జహీర్ జమాలీ, జస్టిస్ జాజుల్ అషాన్, జస్టిస్ ఖిజి ఆరిఫ్ హుస్సేన్ లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. -
అమితాబ్ తప్ప ఎవరూ దొరకలేదా?
పనామా పేపర్ల వ్యవహారంలో అపప్రథకు గురైన అమితాబ్ బచ్చన్ను ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణకు వ్యాఖ్యాతగా పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మోదీ సర్కారు రెండేళ్ల పాలన ముగిసిన సందర్భంగా ఇండియాగేట్ వద్ద శనివారం నిర్వహించే మెగా కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ను వ్యాఖ్యాతగా ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. నల్లధనాన్ని వెనక్కి తెస్తానని, ఆ వ్యవహారంలో ఎవరున్నా శిక్షిస్తానని ప్రధాని మోదీ గతంలో చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదేమని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. మనీలాండరింగ్లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలొచ్చిన వ్యక్తికి అంత పెద్దపీట వేయడం దర్యాప్తు సంస్థలకు ఎలాంటి సంకేతాన్ని పంపుతుందని నిలదీశారు. అమితాబ్ను మంచి నటుడిగా, పెద్దమనిషిగా దేశంలోని అందరూ ప్రేమిస్తారని, అయితే.. ఆయన పేరు పనామా పేపర్లలో ఉందన్న విషయం మాత్రం మర్చిపోకూడదని అన్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి ఇప్పటివరకు ప్రత్యక్ష ప్రసారం చేసిన కార్యక్రమాల్లో ఇదే అతి పెద్దదని చెబుతున్నారు. ఈ కార్యక్రమం చివర్లో మోదీ పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి 'ఓ కొత్త ఉదయం' అని పేరుపెట్టారు. ఇందులో అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, జూహీ చావ్లా లాంటి బాలీవుడ్ ప్రముఖులు పలువురు పాల్గొంటారు. అయితే.. కాంగ్రెస్ ఆరోపణలను అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఖండించారు. తన తండ్రి ఏమీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని, ఇండియాగేట్ వద్ద జరిగే కార్యక్రమంలో బాలికల విద్య ఆవశ్యకత మీద మాత్రమే ఆయన మాట్లాడతారని, దీన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు. -
పనామా దెబ్బ..
- హెరిటేజ్కు మోటపర్తి రాజీనామా సాక్షి, హైదరాబాద్: తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డెరైక్టర్గా ఉన్న మోటపర్తి శివరామ వరప్రసాద్కు విదేశాల్లోని అనుమానాస్పద కంపెనీలతో ఉన్న లింకుల్ని పనామా పత్రాలు వెల్లడించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు నష్టనివారణ చర్యలకు దిగారు. మోటపర్తితో తక్షణం పదవికి రాజీనామా చేయించారు. ఆఫ్రికా ఖండంలోని ఘనా, టోగో దేశాల్లో ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్ లిమిటెడ్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్కెమీ వెంచర్స్ వంటి ఆఫ్షోర్ కంపెనీలతో ప్రసాద్కున్న లింకుల్ని పనామా పత్రాలు వెల్లడించడం రాష్ట్ర రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించడం తెలిసిందే. మనీలాండరింగ్ కోసం, పన్నుల ఎగవేతకోసం ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న కంపెనీలపై పనామా పేపర్స్ లీకులిస్తున్న విషయం విదితమే. ఈ వరసలోనే హెరిటేజ్లో డెరైక్టర్గా ఉన్న మోటపర్తి శివరామ వరప్రసాద్ అల్లిబిల్లి కంపెనీల వ్యవహారం కూడా వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో.. కుటుంబసభ్యులతోసహా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన మోటపర్తితో హెరిటేజ్ డెరైక్టర్ పదవికి హుటాహుటిన రాజీనామా చేయించారు. మోటపర్తి గురువారం తన పదవికి రాజీనామా చేశారని హెరిటే జ్ కంపెనీ కార్యదర్శి ఉమాకాంత్ బారిక్ ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు రాసిన లేఖలో తెలిపారు. ఈనెల 23న జరిగే కంపెనీ డెరైక్టర్ల సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదిస్తామని కూడా అందులో పేర్కొన్నారు. బాబుతో అత్యంత సాన్నిహిత్యం..: చంద్రబాబుకు, మోటపర్తి శివరామ వరప్రసాద్కు మధ్య ఎంతోకాలం నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. చంద్రబాబుతో మోటపర్తి అనేక సందర్భాల్లో సమావేశమయ్యారు. 2014, జూన్లో చంద్రబాబు రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే మోటపర్తిని ఐదేళ్ల కాలానికి హెరిటేజ్ ఫుడ్స్కు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డెరైక్టర్గా నియమించారు. ఈ నేపథ్యంలో పనామా పత్రాల్లో మోటపర్తి పేరు వెలుగులోకి రావటం ఏపీ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. -
పనామా పేపర్స్లో మరో హీరోయిన్!
లాస్ఎంజిల్స్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న పనామా పేపర్స్ లీకేజీ వ్యవహారంలో మరో హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ పేరు ఈ జాబితాలో కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా 'హ్యారీపోటర్ అండ్ ద గొబ్లెట్ ఆఫ్ ఫైర్'లో నటించిన బ్రిటీష్ నటి ఎమ్మా వాట్సన్(26) పేరు పన్ను ఎగవేత కోసం విదేశాల్లో సంస్థలను స్థాపించిన వారి జాబితాతో కూడిన పనామా పత్రాల లీకేజీలో ఉన్నట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. దీనిపై ఎమ్మా ప్రతినిధి మాట్లాడుతూ.. సంస్థను నెలకొల్పిన విషయం వాస్తవమే అని తెలిపాడు. అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయలేదని తెలిపాడు. అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల కన్సార్టియం(ఐసీఐజే) తాజాగా 2 లక్షలకు పైగా విదేశీ సంస్థల వివరాలను తన వెబ్సైట్లో ఉంచింది. ఇందులో వివిధ కంపెనీలు, ట్రస్ట్లు, ఫౌండేషన్స్కు సంబంధించిన వివరాలున్నాయి. వివిధ విదేశీ సంస్థలకు సంబంధించిన నెట్వర్క్ను సైతం ఐసీఐజే వెల్లడించింది. -
పనామా లీకుల్లో హెరిటేజ్ 'లింకు'
- అనుమానాస్పద కంపెనీలతో హెరిటేజ్ ఫుడ్స్ ఇండిపెండెంట్ డెరైక్టర్ మోటపర్తి శివరామ వరప్రసాద్కు సంబంధాలు - ప్రసాద్కు చిన్న దేశాల్లో పలు కంపెనీలు, కొన్ని బినామీలతో నడుస్తున్నాయని పనామా పేపర్స్ అభియోగాలు - చంద్రబాబు సీఎం అయిన నెలరోజులకే హెరిటేజ్ డెరైక్టర్గా మోటపర్తి నియామకం - ఘనాలో ఉంటున్న ఎన్నారై ప్రసాద్ను డెరైక్టర్గా నియమించడంపై విస్మయం - బాబుకు అత్యంత సన్నిహితుడు, ఏపీ బ్రాండ్ అంబాసిడర్ అజయ్దేవ్గణ్ పేరు పనామాలో వచ్చిన వారానికే ఇప్పుడీ ప్రసాద్ పేరు రావడంపై చర్చ సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పనామా పేపర్స్ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్లో ఇండిపెండెంట్ డెరైక్టర్ అయిన మోటపర్తి శివరామ వరప్రసాద్కు అనుమానాస్పద కంపెనీలతో వున్న లింకుల్ని వెల్లడించింది. పన్నులు ఎగవేసేందుకు చిన్న చిన్న దేశాల్లో, ద్వీపాల్లో నెలకొల్పుతున్న కంపెనీల భాగోతాల్ని, బినామీల పేర్లతో నెలకొంటున్న కంపెనీల గుట్టురట్టుల్ని విప్పిచెపుతున్న పనామా పేపర్స్ తాజాగా బయటపెట్టిన ప్రసాద్ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల రాజకీయవర్గాలు ఒక్కసారిగా నివ్వెరపోయాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ మోటపర్తి ప్రసాద్ పేరును తాజా పనామా పత్రాల్లో మూడు దఫాలు ప్రస్తావించారు. ఆఫ్రికా ఖండంలోని ఘనా, టోగో దేశాల్లో ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్ లిమిటెడ్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్కెమీ వెంచర్స్ వంటి ఆఫ్షోర్ కంపెనీలతో ఆయనకున్న లింకుల్ని పనామా పేపర్స్ వెల్లడించింది. నామమాత్రపు కంపెనీల పేర్లమీద పన్నులు ఎగవేసారన్న అభియోగాల్ని మోపింది. బ్రిటిష్ వర్జిన్ ఐలెండ్స్, ఈక్వడార్, ఘనా, పనామా దేశాల్లో రిజిష్టర్ అయి వున్న పలు కంపెనీల్లో ప్రసాద్కు వాటాలున్నాయి. ఎన్నెన్నో అనుమానాలు... పనామా పత్రాల వ్యవహారం తొలిసారిగా బయటపడ్డపుడే ప్రసాద్ పేరు ప్రస్తావనకు వచ్చింది. టోగో దేశంలోని వాసెమ్ అనే కంపెనీ గురించి పనామా పేపర్స్ విస్త్రతంగా కథనాలు వెలువరించింది. వాసెమ్ యజమానుల గురించి పనామా పేపర్స్లో ప్రస్తావిస్తూ దానిలో బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కెన్లెమ్ లిమిటెడ్కు 40 శాతం వాటా వున్నట్లు పేర్కొంది. ఆ కెన్లెమ్ యజమాన్యంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ అసలు వ్యక్తుల పేర్లు యజమానులుగా ఆ కంపెనీ చూపించడం లేదని, బినామీ పేర్లతో నడుస్తోందన్న అభియోగాల్ని పనామా పేపర్స్ మోపింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... మోటపర్తి ప్రసాద్కు కెన్లెమ్లో 24 శాతం వాటా వుంది. అలాగే కెన్లెమ్లో మరో 17 శాతం వాటా రఫెల్ హోల్డింగ్స్కు వుంది. ఈ రఫెల్ హోల్డింగ్స్ అసలు యజమానులు కూడా వేరే వ్యక్తులని పనామా పేపర్స్ వెల్లడించింది. టోగోలోని వాసెమ్ సిమెంటు కంపెనీలో 89 శాతం షేర్లు ఆ దేశానికి చెందినవారికి కావు. ఈ కంపెనీ ప్రధాన వాటాదారుల్లో మోటపర్తి ప్రసాద్ ఒకరు. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే.... హెరిటేజ్ ఫుడ్స్ ఇండిపెండెంట్ డెరైక్టర్గా 2014 జూలై నెలలో ఐదేళ్ల కాలానికి ప్రసాద్ నియమితులయ్యారు. ఆయన కంపెనీకి ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా వ్యవహరిస్తున్నారని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. 2014 జూన్ నెలలో కొత్త ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. బాబు పదవిలోకి వచ్చిన నెలరోజులకే ప్రసాద్కు హెరిటేజ్ ఫుడ్స్లో డెరైక్టర్గా కూర్చోబెట్టడంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఘనా, టొగో తదితర దేశాల్లో పలు కంపెనీలు స్థాపించిన ప్రసాద్ ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆయన దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నపుడు చంద్రబాబు నిర్వహించే ప్రతి సమావేశంలో పాల్గొనే వారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఆయన హెరిటేజ్లో ఉన్నతోద్యోగి అని చెప్తుండేవారని, చంద్రబాబుకు, ఆయనకు మధ్య ఇంత పెద్ద వ్యాపార, బినామీ సంబంధాలున్నాయని తమకు తెలియదని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నా యి. అయితే ఇండిపెండెంట్ డెరైక్టర్గా ఈ దేశంలో వుండే ఒక వృత్తినిపుడినో, పారిశ్రామికవేత్తనో ఎంచుకోకుండా, ఎక్కడో ఘనా దేశంలో వుంటున్న ఒక ఎన్నారైని నియమించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్లోనూ ఎన్నో కంపెనీలు ప్రసాద్కు హైదరాబాద్లో సైతం పలు రిజిష్టర్డ్ కంపెనీలున్నాయి. చాలా కంపెనీలకు ఆయన చైర్మన్గా, డెరైక్టరుగా, భాగస్వామిగా ఉంటున్నారు. డిజైన్ ట్రయిబ్, విండ్సర్ ఎడిఫిసెస్, వోల్టా ఫ్యాషన్స్, వోల్టా ఎస్టేట్స్ , వోల్టా ఇంపాక్స్, తోషాలి సిమెంట్స్, ప్రకృతి సిమెంట్స్, పేపర్ ఇంజనీరింగ్ సర్వీసెస్, దక్కన్ ఆటో, పృధ్వీ అసెట్ రీకన్స్ట్రక్షన్స్ వీటిలో కొన్ని. ఇందులో చాలావరకూ హైద రాబాద్ సంజీవరెడ్డి నగర్లోని హౌస్ నంబర్ 123/3, మూడో ఫ్లోర్లో వున్నట్లు ఆల్ కంపెనీ డేటా.కామ్ సైట్ వెల్లడిస్తోంది. అయితే ఆ భవనంలో ఇప్పుడు అవేవీ లేవు. మరో కార్పొరేట్ గ్రూప్ కంపెనీలు అక్కడ వుండటం గమనార్హం. పనామా పేపర్స్లో ఆయన పేరు ప్రస్తావనకు రావడంపై ప్రసాద్ స్పందిస్తూ ఘనా, టోగో దేశాలతో సహా పలు దేశాల్లో తనకు పలు కంపెనీలున్నాయని, అవన్నీ హోల్డింగ్ కంపెనీలని, చట్టబద్దమైనవేనన్నారు.తాను హెరిటేజ్ ఫుడ్స్లో ఇండిపెండెంట్ డెరైక్టర్నని ఆయన పేర్కొన్నారు. మోటపర్తి ప్రసాద్ కుమారుడు సునీల్ అమెరికా, హైదరాబాద్ల్లోని స్టార్టప్ కంపెనీల్లో దాదాపు రూ. 40 కోట్లు పెట్టుబడి చేశారు. ఎవరీ ప్రసాద్... కృష్ణాజిల్లాకు చెందిన మోటపర్తి ప్రసాద్ చాలా కాలం క్రితం ఆఫ్రికా దేశాలకు వెళ్లి వ్యాపారాలతో బాగా సంపాదించారు. వరంగల్ నిట్లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. ముంబై, గుజరాత్ల్లో ఇనుము, ఉక్కు ఫౌండ్రీల నిర్వహణకు సంబంధించి అనుభవం సంపాదించారు. 1985లో పటాన్చెరు వద్ద మార్టోపెరల్ అల్లాయిస్ అనే కంపెనీని స్థాపించి, దాని టర్నోవర్ను నాలుగేళ్లలో రూ. 5 కోట్లకు తీసుకెళ్లారంటూ ఆయన ఛైర్మన్గా వ్యవహరించే వోల్టాస్ ఫ్యాషన్ ప్రొఫైల్లో వివరించారు. అటుతర్వాత సిమెంటు తదితర రంగాల్లోకి ప్రవేశించి, పలు దేశాల్లో వివిధ కంపెనీలను నిర్వహిస్తున్నట్లు ఆ ప్రొఫైల్లో వివరించారు. దీని సంగతి పక్కనబెడితే...ఆయన చంద్రబాబునాయుడుకి సన్నిహితుడంటూ పారిశ్రామిక, రాజకీయ వర్గాలు చెపుతుంటాయి. అందుకే ఘనా దేశంలో వుంటున్న ఎన్నారైను ఏరికోరి తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్లో డెరైక్టరుగా నియమింపచేశారని చెప్పుకుంటుంటారు. ప్రసాద్ కుమారుడికి రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ దివిస్ లేబరోటరీస్ యజమాని మురళీ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. అజయ్ దేవ్గణ్ తర్వాత.... ఆంధ్రప్రదేశ్తో ఏ విధమైన సంబంధం, అనుబంధం లేని బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ను ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపికచేసుకున్న కొద్దిరోజులకే ఆ హీరో పేరు పనామా పేపర్స్లో ప్రముఖంగా వెల్లడయ్యింది. హిందీ సినిమాల విదేశీ ప్రదర్శనా హక్కుల్ని పొందేందుకు బ్రిటిష్ వర్జిన్ ఐలెండ్స్లో ఒక కంపెనీని నెలకొల్పడంపై జరిగిన భాగోతాన్ని పనామా పేపర్స్ ఈ నెల మొదటివారంలో బయటపెట్టింది. ఇది జరిగి వారం తిరక్కుండానే బాబు కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ డెరైక్టర్ ప్రసాద్ పేరు పనామాలో పొక్కడంపై రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. -
అవును.. ఆయన మా డైరెక్టరే
పనామా పేపర్లలో ప్రస్తావనకు వచ్చిన ఎం.శివరామప్రసాద్ తమ సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టరని హెరిటేజ్ ఫుడ్స్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. 2014 జూలై 30వ తేదీన ఆయనను ఐదేళ్ల కాలానికి డైరెక్టర్గా నియమించామన్నారు. అయితే ఆయనకు హెరిటేజ్ ఫుడ్స్లో ఎలాంటి ఆర్థికపరమైన ఆసక్తి లేదని చెప్పారు. ఆయనకు కంపెనీలో షేర్లు గానీ, పెట్టుబడులు గానీ ఏమీ లేవన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు, ఆయన సొంత కంపెనీలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమీ లేవని కూడా సాంబశివరావు చెప్పారు. -
పనామాలో బాబు బినామీ
పనామా పేపర్స్ తాజాగా విడుదల చేసిన జాబితాతో టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ మోటపర్తి శివరామ వర ప్రసాద్ (67) పేరు బయటపడింది. (చదవండి...పనామా లీకుల్లో హెరిటేజ్ 'లింకు') ఈయన వృత్తిరీత్యా వ్యాపారి. ప్రవృత్తి రీత్యా చంద్రబాబు అనుయాయుడు. ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలతో సంబంధం ఉన్నట్లు తేలింది. పనామాలో మూడుసార్లు ప్రసాద్ పేరు ప్రస్తావవకు వచ్చింది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, పనామా, ఈక్వెడార్లో మూడు కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా పన్నులు ఎగవేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలతో సంబంధమున్న ఆయన పేరు పనామా పేపర్స్లో మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. వర ప్రసాద్ పేరు బయటకు రావడంతో... చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితిలో పడ్డారు. వరప్రసాద్ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపితే.... ఆయన బినామీ ఎవరో తెలిసే అవకాశం ఉంటుంది. అటు వరప్రసాద్ పేరు బయటకు రావడంతో... టీడీపీ నేతల్లోనూ ఆందోళన మొదలైనట్లు సమాచారం. ప్రసాద్ కుమారుడు సునీల్ కూడా బిట్ కెమీ వెంచర్స్లో పెట్టుబడులు పెట్టినట్లు పనామా వెల్లడించింది. సునీల్.. అమెరికా, హైదరాబాద్లో స్టార్టప్ కంపెనీల్లో ఈ డబ్బును ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రసాద్ ప్రవాస భారతీయుడు కాగా... హైదరాబాద్లో కొన్ని కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇటు ఘనా, టోగో, అమెరికాలో ప్రసాద్కు వ్యాపారాలు ఉన్నాయి. ప్రసాద్ 2014 నుంచి హెరిటేజ్ ఫుడ్స్కు కూడా డైరెక్టర్గా ఉన్నారు. పనామా లిస్ట్లో తన పేరు రావడంపై ప్రసాద్ స్పందించారు. తాను ప్రవాస భారతీయుడునని... గత 30 ఏళ్లుగా విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్లో కూడా కంపెనీలు ఉన్నాయన్నారు. పనామా వ్యవహారం గురించి తనకు తెలియదన్నారు. ఈ వ్యవహారాన్ని కంపెనీ సిబ్బంది, లాయర్లు చూసుకొంటారని చెప్పారు. తన వ్యాపార లావాదేవీలన్నీ చట్టబద్దంగా ఉన్నాయన్నారు. కాని పనామా ప్రకటించిన లిస్ట్లో మాత్రం పన్ను ఎగవేసే కంపెనీలతో సంబంధం ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. కాగా ఈ వ్యవహారంపై శివరామ వరప్రసాద్ కుమారుడు సునీల్ మాట్లాడుతూ తమ కంపెనీలు చట్టబద్దమైనవని తెలిపారు. -
ఇక ఆన్ లైన్ లో పనామా 'నల్ల' పేర్లు!
పనామా సిటీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్లు తాజాగా ప్రజలకు ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో గొప్ప స్థానాల్లో ఉన్న కొందరి అక్రమాలను పనామా పేపర్లు బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఇన్వేస్టిగేటివ్ జర్నలిజంలో ముఖ్య పాత్ర పోషించిన ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వేస్టిగేటివ్ జర్నలిజం (ఐసీఐజే) కోటికిపైగా ఉన్న ఈ డాక్యుమెంట్లన్నింటినీ డిజిటల్ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చేసేవిధంగా నిర్ణయించింది. భారతకాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆరుగంటల నుంచి పనామా పేపర్లన్నీ ఆఫ్ షోర్ లీక్స్.ఐసీఐజే.ఓఆర్జీ లో అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో సంపద కలిగి ఆఫ్ షోర్ కంపెనీలను కలిగివున్న 2,00,000 మంది పేర్లను ఇందులో వెల్లడించనున్నట్లు ఐసీఐజే తెలిపింది. ఇప్పటివరకు కేవలం పెద్ద ప్రొఫెల్ ఉన్న వ్యక్తుల వివరాలను(ఐస్ ల్యాండ్ ప్రధానమంత్రి, బ్రిటన్ ప్రధాని, రష్యా ప్రెసిడెంట్, అర్జెంటీనా ప్రధానమంత్రి, చైనా రాజకీయ నాయకులు) మాత్రమే న్యూస్ పేపర్ల ద్వారా బయటపెట్టిన ఐసీఐజే తాజాగా తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరుల జాబితా బయటకు రానుంది. అయితే, సమాచారాన్ని ప్రజలకు తెలియజేయండం తప్పంటూ మొస్సాక్ ఫోన్సెకా ఐసీఐజే మీద పిటిషన్ దాఖలు చేసేందుకు లాయర్ ను నియమించుకుంది. దీనికి సంబంధించి ఐసీఐజే ఎటువంటి ప్రకటనా చేయలేదు. డాక్యుమెంట్లను బయటపెట్టడంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. -
అమితాబ్ నన్ను అప్పుడే హెచ్చరించాడు!
ముంబై: పనామా ప్రకంపనల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అజయ్ దేవగణ్ చిక్కడం హిందీ సినీ పరిశ్రమను కుదిపేసింది. పన్ను ఎగవేతకు స్వర్గధామల్లాంటి దేశాల్లో బోగస్ కంపెనీలు తెరిచి.. అక్రమంగా డబ్బు దాచుకునేందుకు పనామాలోని 'మోసాక్ ఫొన్సెకా' అనే లా కంపెనీ సేవలు వీరు వాడుకున్నారన్నది ప్రధాన అభియోగం. అయితే ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, తన పేరును దుర్వినియోగం చేసి విదేశాల్లో బోగస్ కంపెనీలు తెరిచినట్టు కనిపిస్తున్నదని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై ఇటీవల ఒకప్పటి బిగ్ బీ సన్నిహితుడు, యూపీ రాజకీయ నేత అమర్సింగ్ ఒకింత ఆగ్రహంగా స్పందించారు. అమితాబ్ పనామా పత్రాల వివాదంలో చిక్కుకోవడంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడుగగా.. 'రెండురోజుల కిందటే నేను పబ్లిగ్గా చెప్పాను. ఐశ్వర్య గానీ, అభిషేక్గానీ నా పట్ల అమితమైన గౌరవం చూపుతారు. అమితాబ్ తోనూ నాకెలాంటి గొడవ లేదు. నిజానికి ఆయనే నన్ను ఓసారి హెచ్చరించాడు. జయాబచ్చన్కు స్థిరచిత్తం ఉండదని, ఆమెను మీ రాజకీయాల్లోకి (పార్టీలోకి) తీసుకోవద్దని సూచించాడు. కానీ, నేను ఆయన ఉదాత్తమైన సలహాను వినలేదు. జయ అలవాట్లు, అస్థిరమైన ధోరణి కారణంగా ఆమె నుంచి ఎలాంటి కచ్చితత్వాన్ని ఆశించవద్దని అమితాబ్ నన్ను హెచ్చరించాడు. ఆమె తరఫున నాకు ఆయన క్షమాపణలు చెప్పాడు కూడా. అక్కడితో ఈ విషయం ముగిసిపోయింది. కానీ ఆ తర్వాత అనిల్ అంబానీ నివాసంలో డిన్నర్ సందర్భంగా జయాబచ్చన్ వల్ల ఓ గొడవ జరిగింది. ఈ వివాదంలో బచ్చన్ కూడా తలదూర్చారు. కాబట్టి (పనామా వివాదంపై) ప్రశ్నలను అరుణ్ జైట్లీని అడగండి. లేదా ఈ వివాదాన్ని దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలను అడగండి. అదీ కుదరకపోతే అమితాబ్నే నేరుగా అడగండి. నన్ను వదిలేయండి. అమితాబ్ ప్రసక్తి లేకుండా శాంతియుతంగా ఉండనివ్వండి' అని అమర్ చెప్పుకొచ్చారు. -
పనామా పేపర్లలో మరో బాలీవుడ్ నటుడు
ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన మోసాక్ ఫోనెస్కాకు చెందిన పనామా పేపర్స్ తాజాగా మరో బాలీవుడ్ నటుడి వ్యవహారం బయటపెట్టాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ బ్రిటన్లోని వర్జిన్ ఐలాండ్ కు చెందిన మేరిలిబోన్ ఎంటర్ టైన్మెంట్ అనే సంస్థలో దాదాపు వెయ్యి షేర్లు కొనుగోలు చేశారని పనామా బయటపెట్టింది. అజయ్ తన కంపెనీ నిసా యుగ్ ఎంటర్ టైన్ మెంట్ పేరిట ఈ షేర్లు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ కంపెనీలో ఆయన భార్య కాజల్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ కంపెనీకి అజయ్ 2013లో డైరెక్టర్ గా ఉండి.. 2014లో రాజీనామా చేశారు. పనామా బయటపెట్టిన వివరాలపై ఆయన స్పందిస్తూ.. తాను ఆర్బీఐ మార్గదర్శకాలు పాటించే విదేశాల్లోని ఆ కంపెనీలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టానని చెప్పారు. చట్ట ప్రకారం చేయాల్సిన ట్యాక్స్ రిటర్న్స్ కూడా చేశామని, వాటి వివరాలు తన కుటుంబం ఇప్పటికే తెలియజేసిందని అన్నారు. -
‘పనామా’పై సిట్ సమీక్ష
న్యూఢిల్లీ: నల్లధనాన్ని వెలికితెచ్చే విషయమై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం సమావేశమైంది. పన్ను ఎగవేత, మనీ ల్యాండరింగ్ కేసులను సమీక్షించింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘పనామా పేపర్స్’పై ప్రధానంగా చర్చించింది. సిట్ చైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) ఎంబీ షా నేతృత్వంలో జరిగిన భేటీలో ‘పనామా పేపర్స్’పై ఆదాయ పన్ను శాఖ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ), ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమర్పించిన నివేదికలపై సమీక్ష నిర్వహించారని అధికారులు తెలిపారు. పనామా పేపర్స్, రూ. 6 వేల కోట్ల బ్యాంక్ ఆఫ్ బరోడా (ఢిల్లీ బ్రాంచ్) స్కాం కేసుల రికార్డులు, స్థాయీ నివేదిక సమర్పించిన దర్యాప్తు సంస్థలు.. తాము తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. దాదాపు 500 మంది భారతీయుల పేర్లున్న పనామా పేపర్స్ జాబితా లీకేజీ నేపథ్యంలో ఇంటర్నేషనల్ కన్సోర్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్, ఓ జాతీయ దినపత్రిక వెలువరించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేయాలని పలు దర్యాప్తు సంస్థలను సిట్ ఆదేశించిన విషయం తెలిసిందే. -
పనామా ప్రకంపనలపై నోరువిప్పిన ఐశ్యర్య!
పనామా పత్రాల వివాదంపై బాలీవుడ్ హీరోయిన్, అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్యర్యరాయ్ తాజాగా స్పందించింది. పన్ను ఎగ్గొట్టేందుకు విదేశాల్లో బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసిన వ్యవహారంలో ఐశ్యర్య, ఆమె తల్లి తరఫు కుటుంబసభ్యుల పేర్లు ఉన్నట్టు ఇటీవల పనామా పత్రాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించి సహకరిస్తున్నట్టు ఆమె తెలిపారు. 'ఇప్పటికే ఈ విషయమై ఓ ప్రకటన చేశాను. ఈ విషయంలో కుటుంబపరంగా, వ్యక్తిగతంగా కూడా ప్రకటన చేశాం. మీడియాకు కూడా మా వైఖరి తెలియజేశాం. ఇక ఈ విషయంలో అన్ని ప్రశ్నలకు ప్రభుత్వానికి సమాధానం ఇస్తున్నాం. థాంక్యూ' అంటూ ఆమె పేర్కొన్నారు. ఆమెను మంగళవారం విలేకరులు పనామా పత్రాల విషయమై ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చారు. పనామాకు చెందిన మొసాక్ ఫోన్సెకా కంపెనీ ద్వారా విదేశాల్లో బోగస్ కంపెనీలు స్థాపించిన 500 మంది భారతీయ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, ఐశ్యర్యరాయ్ కూడా ఉన్నారని ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన పేరును దుర్వినియోగం చేసి ఈ కంపెనీలు స్థాపించారని, వీటి గురించి తనకు తెలియదని అమితాబ్ వివరణ ఇచ్చారు. ఐశ్యర్య అధికార ప్రతినిధి కూడా ఆమెపై వచ్చిన ఆరోపణలను గతంలో తోసిపుచ్చారు. -
పాకిస్థాన్ కుబేరుడు ఎవరో తెలుసా?
ఇస్లామాబాద్: ఇటీవల పనామా పత్రాల్లో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పేరు వెలుగు చూడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే దేశంలో అత్యంత సంపన్నులైన రాజకీయ నాయకుల జాబితాను పాకిస్థాన్ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఊహించినట్టుగానే ఈ జాబితాలో రూ. 200 కోట్ల ఆస్తులతో ప్రధాని షరీఫ్ మొదటిస్థానంలో నిలిచారు. గత నాలుగు ఏండ్లలో ఆయన ఆస్తులు రూ. వందకోట్లు పెరిగి రూ. 200 కోట్లకు చేరడం గమనార్హం. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది రాజకీయ నాయకులు తమ ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు 2015లో తాను, తన భార్య ఆస్తుల వివరాలను షరీఫ్ వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం విదేశాల్లో ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు. 2011లో రూ. 166 మిలియన్లుగా ఉన్న ఆయన ఆస్తుల విలువ.. 2015కు వచ్చేసరికి ఏకంగా 2 బిలియన్లకు చేరుకుంది. ఆయనకు అత్యధిక మొత్తం విదేశాల్లోని ఆయన కొడుకు హుస్సేన్ నవాజ్ నుంచే అందుతుండటం గమనార్హం. 2015లో నవాజ్ తండ్రికి రూ. 215 మిలియన్లు పోషక ధనంగా పంపించారు. పాక్ పార్లమెంటులో అత్యధిక ఆస్తులున్న రాజకీయ నాయకుడిగా షరీఫ్ మొదటి స్థానంలో ఉండగా, ఆయన తర్వాతి స్థానాల్లో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి షాహిద్ ఖాఖాన్ అబ్బాసి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఎంపీలు ఖయాల్ జమన్, సాజిద్ హుస్సేన్ ఉన్నారు. ఇక ప్రధాని షరీఫ్ ఆస్తుల్లో ఓ టయోటా లాండ్ క్రూజర్ ఉంది. దీనిని గుర్తుతెలియని వ్యక్తులు కానుకగా ఇచ్చారు. అలాగే రెండు మెర్సిడెజ్ వాహనాలు కూడా షరీఫ్ కలిగి ఉన్నారు. నల్లడబ్బును దాచుకోవడానికి విదేశాల్లో బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసిన రాజకీయ నాయకుల జాబితా షరీఫ్ కూడా ఉన్నట్టు పనామా పత్రాలు వెల్లడించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
పనామా ఎఫెక్ట్: 'బ్రాండ్' నుంచి బిగ్ బీ ఔట్!
ముంబై/న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి, ఒకటిరెండు దేశాల్లో ప్రభుత్వాలను సైతం కూలదోసింది పనామా పేపర్ల లీకేజీ వ్యవహారం. ఆ సమాచారాన్నిబట్టి పన్ను ఎగ్గొట్టి నల్లధనాన్ని విదేశాలకు విదేశాలకు తరలించిన 500 మంది భారతీయుల్లో సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. అయితే ఆ వార్తలను ఖండించిన అమితాబ్ 'నా పేరును తప్పుగా వాడి ఉంటారు' అని ప్రకటించారు. అంతటితో సమస్య సమసిపోలేదు.. పనామా పేపర్లలో పేరు వెల్లడయినందుకు అమితాబ్ బచ్చన్ భారీ మూల్యం చెల్లించుకోనున్నారా? తప్పుచేయలేదన్నబింగ్ బీ ప్రకటనతో కేంద్రప్రభుత్వం సంతృప్తి చెందలేదా? అందుకే ఆయనను ఇంకా చేపట్టని ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ హోదా కోల్పోనున్నారా? గడిచిన కొద్ది గంటలుగా జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలివి. ఇంక్రెడిబుల్ బ్రాండ్ హోదాను అమితాబ్ కు కట్టబెట్టే విషయంలో కేంద్రం పునరాలోచనలో పడిందని, మరో సెలబ్రిటీని ఆ హోదాలో నియమించనుందని పలు సంస్థలు వార్తలు ప్రచారం చేశాయి. వీటిపై బిగ్ బీ కూడా ఘాటుగానే స్పందించారు. 'నిజానికి ఆ హోదా (ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్అంబాసిడర్)లో కొనసాగమని నాన్నెవరూ సంప్రదించలేదు. అంబాసిడరేకాని నన్ను ఆ హోదా నుంచి తొలిగించారని మీడియాలో వార్తలు రావటం విడ్డూరం'అని అమితాబ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియా ఊహాగాలు విన్నతర్వాత స్పష్టత ఇచ్చేందుకే ఈ ప్రకట చేస్తున్నట్లు బచ్చన పేర్కొన్నారు. పనామా పేపర్ల వ్యవహారంపై స్పందిస్తూ తాను నేరం చేసిందీ లేనిదీ తేల్చాల్సింది చట్టమేకాని, మీడియా కదని, ఏదో తప్పు జరిగినందువల్లే అమితాబ్ ను బ్రాండ్ హోదా నుంచి తొలిగించారని ప్రచారం చేయటం సరికాదన్నారు. విదేశీ టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ ప్రారంభించిన 'ఇంక్రెడిబుల్ ఇండియా' ప్రచారానికి మొదట్లో ఆమిర్ ఖాన్ అంబాసిడర్ గా ఉన్నారు. అసహనంపై వ్యాఖ్యల అనంతరం ఆమిర్ ను తప్పించిన కేంద్ర ఆ హోదాను అమితాబ్ కు కట్టబెట్టాలనుకుంది. అయితే అధికారికంగా తుదినిర్ణయం ఇంకావెలువడాల్సిఉంది. అంతలోనే పనామా పేపర్లలో బిగ్ బితోపాటు ఆయన కోడలు ఐశ్వర్య పేరు వెలుగులోకి రావటంతో కేంద్రం పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. -
‘పనామా’ ఫొన్సెకాలో సోదాలు
అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పనామా సర్కారు పనామా సిటీ: సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ లీకేజీకి కేంద్రబిందువైన న్యాయ సలహా సంస్థ మొసాక్ ఫొన్సెకా కార్యాలయంలో పనామా పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రపంచంలోని ప్రముఖుల విదేశీ కంపెనీలు, సంపదకు సంబంధించిన రహస్యాల లీకేజీపై ఆర్గనైజ్డ్ క్రైమ్ పోలీసులు ఫొన్సెకా కార్యాలయంతోపాటు ఇతర కార్యాలయాలనూ తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ సంస్థ అక్రమంగా కార్యక్రమాలు చేపట్టిందని నిరూపించే ఆధారాల కోసం వెతుకుతున్నామని వెల్లడించారు. అయితే..తాము తప్పేమీ చేయలేదని, న్యాయబద్ధంగానే కంపెనీలు ఏర్పాటుచేశామని.. తమ కంపెనీ వెబ్సైట్ హ్యాక్ అవటంతోనే పలు పత్రాలు లీక్ అయ్యాయని రామన్ ఫొన్సెకా తెలిపారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి, బ్లాక్లిస్టులో పెట్టిన ఫ్రాన్స్ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలోనే పనామా పోలీసులు ఈ సోదాలు నిర్వహించినట్లు అర్థమవుతోంది. ఏడాదిపాటు దీనిపై పనిచేసిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) 40 ఏళ్లుగా మొసాక్ ఫొన్సెకా కంపెనీ న్యాయ సలహాతో నడుస్తున్న 2.14లక్షల విదేశీ కంపనీల రహస్యాల గుట్టు విప్పిన సంగతి తెలిసిందే. -
మొసాక్ ఫోన్సెకా ప్రధాన కార్యాలయంపై దాడి
పనామా పేపర్లు సృష్టించిన సంచలనంతో.. మొసాక్ ఫోన్సెకా సంస్థ ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు. అక్కడి నుంచే భారీ మొత్తంలో వివరాలు లీకవుతుండటంతో పోలీసులు స్పందించారు. పన్నులు ఎగ్గొట్టడానికి విదేశాల్లో ఉన్న బినామీ కంపెనీలలో పెద్దమొత్తంలో నిధులు పెట్టుబడిగా చూపించినవాళ్ల జాతకాలను 'పనామా పేపర్స్' ద్వారా బయటపెట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆ సంస్థ వాదిస్తోంది. తాము హ్యాకింగ్ బాధితులమని, సమాచారాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతోంది. తమ విదేశీ ఆర్థిక పరిశ్రమ విషయంలో మరింత పారదర్శకత తెచ్చేందుకు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని పనామా ప్రెసిడెంట్ జువాన్ కార్లోస్ వారెలా హామీ ఇచ్చారు. వ్యవస్థీకృత నేరాల విభాగం అధికారులతో కలిసి పోలీసులు ఈ దాడి చేశారు. వివిధ పత్రికలలో ప్రచురితమైన కథనాలకు సంబంధఙంచిన సమాచారం, పత్రాలను స్వాధీనం చేసుకోడానికే ఈ దాడులు చేసినట్లు అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది. సంస్థకు చెందిన ఇతర కార్యాలయాల్లో కూడా దాడులు చేస్తామన్నారు. తాము అధికారులకు పూర్తిగా సహకరిస్తామని మొసాక్ ఫోన్సెకా సంస్థ ఒక ట్వీట్ ద్వారా తెలిపింది. విదేశాల్లో ఉన్న సెర్వర్ల ద్వారా తమ కంపెనీని ఎవరో హ్యాక్ చేశారని, దీనిపై ఇప్పటికే తాము పనామా అటార్నీ జనరల్ కార్యాలయంలో ఫిర్యాదుచేశామని మొసాక్ ఫోన్సెకా సంస్థ భాగస్వామి రామన్ ఫోన్సెకా తెలిపారు. ఈయన గతంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేశారు. -
మొసాక్ ఫోన్సెకా గూఢచర్యం
బెర్లిన్: మిలియన్ల కొద్దీ డాక్యుమెంట్ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనానికి సృష్టించిన పనామా పేపర్ల లీక్ వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.వందమందికి పైగా సభ్యులుగా ఉన్న పరిశోధనాత్మక పాత్రికేయుల అంతర్జాతీయ కూటమి(ఐసీఐజే) పనామా కేంద్రంగా పనిచేస్తున్న పనామా పేపర్స్ మరో విషయాన్ని తేట తెల్లం చేసింది. మొసాక్ ఫోన్సికా వివిధదేశాల్లోని ప్రస్తుత, మాజీ ఉన్నత స్థాయి అధికారుల సేవలను ఏజెంట్లుగా వినియోగించుకున్నట్టు ఒక జర్మన్ వార్తాపత్రిక తెలిపింది. అనేక దేశాల గూఢచారులను మొసాకా విస్తృతంగా ఉపయోగించినట్టు మ్యూనిచ్ ఆధారిత వార్తాపత్రిక వెల్లడించింది. దాదాపు మూడు దేశాలకు చెందిన సీక్రెట్ ఏజెన్సీ అధికారులను వాడుకున్నట్టు తెలిపింది. సౌది అరేబియా, కొలంబియా, రువాండా లాంటి దేశాల అత్యున్నత అధికారులను తమ రహస్య సేవలకు వినియోగించుకున్నట్టు ఈ కథనంలో పేర్కొంది. అనేక దేశాలలో,సీఐఎ వారి మధ్యవర్తుల సహాయంతో పనిచేస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా 1990 లో మరణించిన సౌది ఇంటిలిజెన్స చీఫ్ షేక్ కమల్ అదాం 1970 లలో ఫోన్సెకా కు బాగా సహకరించినట్టు తెలిపింది. వివిధ సీక్రెట్ ఏజెంట్లు, వారి ఇన్ ఫార్మర్ల సేవలను సంస్థ వినియోగించుకున్నట్టు తెలిపింది. కాగా ఈ పనామా పేపర్స్ వెల్లడించిన అంశాలతో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయంగా పెను దుమారాన్ని రాజేసింది. విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రపంచంలోనే ధనిక, శక్తివంతమైన పలు రాజకీయ నేతల జాబితాను ప్రకటించింది. దీంతో ఐస్ లాండ్ ప్రధాని రాజీనామా చేసిన సంగతి తెలిసింది. -
15 రోజుల్లో నివేదిక
♦ ‘పనామా’పై అధికారులకు ప్రధాని మోదీ ఆదేశం ♦ ఏప్రిల్ 4నే అధికారులతో భేటీ న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘పనామా పేపర్స్’ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే స్పందించినట్లు తెలిసింది. మూడుదేశాల పర్యటన ముగించుకుని ఏప్రిల్ 4న భారత్ వచ్చిన మోదీ.. వెంటనే ఆర్థికశాఖ ముఖ్య అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న ప్రధాని మోదీ.. ఈ వివాదంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా దర్యాప్తు జరిపి 15రోజుల్లో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రధాని అధికారులను ఆదేశించారని అధికారవర్గాలు శనివారం వెల్లడించాయి. అయితే దీన్ని నల్లధనంపై వేసిన సిట్కు అనుసంధానం చేయకుండా.. కొందరు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ వివాదాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని.. వాస్తవాలను వీలైనంత త్వరగా తనకు తెలియజేయాలనిసూచించారు. ఐస్లాండ్ సర్కారుకు తప్పిన అవిశ్వాసం పనామా వివాదానికి సంబంధించి ఐస్లాండ్ ప్రభుత్వంపై విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంట్ తోసిపుచ్చింది. మరోవైపు, పనామా పేపర్స్ లీక్నేపథ్యంలో ఎల్ సాల్వెడార్లోని మొసాక్ ఫొన్సెకా కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. కాగా, పనామా పేపర్స్ లీక్ నేపథ్యంలో ఏప్రిల్ 5 నుంచి జిన్పింగ్పై వ్యతిరేక వార్తలు రాస్తున్నారనే కారణంతో ఎకనమిస్ట్, టైమ్స్ వెబ్సైట్లపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ద న్యూయార్క్ టైమ్స్, ద ఇండిపెండెంట్, బీబీసీ వంటి ప్రముఖ సైట్లపై చైనాలో నిషేధం కొనసాగుతోంది. ఈ సైట్ల మొబైల్యాప్లతోపాటు ట్విట్టర్, ఎఫ్బీ అకౌంట్లనూ రద్దుచేసింది. -
పనామా పేపర్లలో మాల్యా!
న్యూఢిల్లీ: సుమారు రూ. 9000 కోట్ల బకాయిలతో వివాదంలో ఇరుక్కున్న లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా పేరు పనామా పేపర్లలో ప్రముఖంగా నిలిచింది. స్వదేశంలో పన్నులు ఎగవేస్తూ విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్న 500 మంది భారతీయుల్లో విజయ్ మాల్యా పేరు కూడా చేరింది. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) దశలవారీగా విడుదల చేస్తున్న పనామా పేపర్స్ తాజా వివరాల్లో మాల్యా బండారాన్ని బహిర్గతం చేసింది. మిగిలినవాళ్లలో చాలామంది పరోక్ష సంబంధాలే కలిగి ఉండగా.. మాల్యా మాత్రం ప్రత్యక్షంగా ఆయా సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఫిబ్రవరి 15, 2006 నుంచి పనిచేస్తున్న బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ సంస్థ వెంచర్ న్యూ హోల్డింగ్ లిమిటెడ్ సంస్థతో, విజయ్ మాల్యాకు ప్రత్యక్షంగా సంబంధాలున్నాయని ప్రకటించి మరో సంచలనానికి తెరతీసింది. దాదాపు రూ. 4వేల కోట్ల తన సొంత డబ్బును ఆయన ఈ సంస్థలో డైరెక్టుగానే పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఆయన ఇంటి చిరునామా నంబర్ 3, విఠల్ మాల్యా రోడ్, బెంగళూరు పేరుతో రిజిస్టరై ఉన్న సంస్థ కార్యాలయం ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఆయన పోర్టికులస్ ట్రస్ట్ నెట్ అనే మరో కంపెనీలో డైరెక్టుగా పెట్టుబడులు పెట్టారు. ఐసీఏజె అందించిన సమాచారం ప్రకారం ఈ పోర్టికులస్ ట్రస్టులో విదేశీ దొంగఖాతాల కోసం 'వన్ స్టాప్ సొల్యూషన్' సెటింగ్ ఉందని తెలిపింది. దీంతోపాటు మాల్యా పేరు బయటకు రానీయకుండా ఫోన్సెకా ఎన్నో జాగ్రత్తలు తీసుకుందని కూడా తెలుస్తోంది. దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని ప్రముఖమైన కుక్ దీవుల్లో పోర్టికులస్ ట్రస్ట్ మూలాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఆయన ఇతర కంపెనీలు దేనికీ వెంచర్ న్యూ హోల్డింగ్స్ తో సంబంధం లేకపోవడం మరో ట్విస్ట్. -
పనామా జాబితాలో బాలీవుడ్ తారలు
సైఫ్, కరీనాలతో పాటు కరిష్మా కపూర్ కూడా * పత్రాల్లో వీడియోకాన్ వేణుగోపాల్ ధూత్ పేరు * మరో సీఏ, ఆస్ట్రేలియా మైనింగ్ వ్యాపారి కూతురుకూ విదేశీ కంపెనీలు * తాజా జాబితాలో కొందరు మధ్యతరగతి వ్యాపారులు న్యూఢిల్లీ: పనామా పేపర్స్ తాజా జాబితాలో మరో ముగ్గురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనా కపూర్, కరిష్మా కపూర్తోపాటు వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ ధూత్లు విదేశీ కంపెనీలతో జతకట్టినట్లు తెలిసింది. ముంబైలోని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, ఓ టైర్ల కంపెనీ ఓనర్, వస్త్ర దుకాణ యజమాని, ఆస్ట్రేలియా మైనింగ్ వ్యాపారి కూతురు, వస్త్ర ఎగుమతి దారుడు, ఇంజనీరింగ్ కంపెనీ యజమానితోపాటు పలువురు పారిశ్రామికవేత్తల పేర్లు గురువారం విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి. సైఫ్, కరీనా, కరిష్మా, వేణుగోపాల్ ధూత్ 2010లో ఐపీఎల్ పుణె ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు పుణెలోని ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థ చోర్డియా గ్రూపు, వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ అవధూతతోపాటు పలువురు బాలీవుడ్ నటులు ఓ కన్సార్షియం (పీ-విజన్ స్పోర్ట్స్)గా ఏర్పడ్డారు. ఈ కన్సార్షియంలో సైఫ్కు 9 శాతం, కరీనా, కరిష్మాలకు చెరో 4.5శాతం వాటాలుండగా.. ధూత్కు 25 శాతం, చోర్డియా కుటుంబానికి 33 శాతంతోపాటు బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్కు చెందిన అబ్డ్యురేట్ లిమిటెడ్ కంపెనీకి 15 శాతం వాటా ఉందని తేలింది. వేలంలో పుణె ఫ్రాంచైజీ దక్కకపోవటంతో.. ‘పీ-విజన్ స్పోర్ట్స్’ కంపెనీని వెంటనే మూసేశారని పేపర్స్లో వెల్లడైంది. అయితే.. ఈ కన్సార్షియంలో 25 శాతం వాటా తీసుకున్న మాట వాస్తవమేనని అయితే.. అబ్డ్యురేట్ లిమిటెడ్ సంగతి తనకు తెలియదని ధూత్ వ్లెడించారు. ఫొన్సెకాతో ‘కోనేరు’ ఉత్తరప్రత్యుత్తరాలు పనామాకు చెందిన మొసాక్ ఫోన్సెకాతో ట్రైమెక్స్ గ్రూపునకు చెందిన తెలుగు వ్యాపారవేత్త కోనేరు మధు (దుబాయ్ కేంద్రంగా పలు కంపెనీలు నడుపుతున్నారు) ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు తాజా పత్రాల్లో వెల్లడయింది. ఈ కంపెనీ సహకారంతో బీవీఐలో 12 కంపెనీలను కోనేరు రిజిస్టర్ చేశారు. కాగా, 2012లో హైదరాబాద్లో దాఖలైన ఎమ్మార్ కేసుకు సంబంధించిన (కేసు నమోదు, బెయిల్ వంటి) వివరాలను కూడా ఫోన్సెకా ప్రతినిధులకు ఎప్పటికప్పుడు మధు వెల్లడించినట్లు ఈ లేఖల్లో ఉంది. దీనిపై మధు తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘మధు నిబంధనలను పాటించే వ్యక్తి. ఆయన చట్టబద్ధంగానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు’ అని పేర్కొన్నారు. లోకేశ్ శర్మ, టీసీఎం గ్రూపు తాజా జాబితాలో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ట్వంటీఫస్ట్ సెంచరీ మీడియా (టీసీఎం) గ్రూపు చైర్మన్ లోకేశ్ శర్మ పేరు కూడా ఉంది. లోకేశ్కు బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లో మూడు కంపెనీలున్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. అయితే డీడీసీఏ వివాదంలో జైట్లీతోపాటు టీసీఎం యజమాని లోకేశ్పైనా ఆప్ విమర్శలు చేసింది. కాగా, ఢిల్లీకి చెందిన ఉదయ్ ప్రతాప్ సింగ్కు బీవీఐలో స్టీల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనే కంపెనీలో వాటాలున్నట్లు వెల్లడైంది. ఢిల్లీ వ్యాపారి అలోక్ భాటియా, ఆయన భార్య సిల్వియా భాటియాలకు రెండు కంపెనీలున్నాయి. ఆస్ట్రేలియా మైనింగ్ వ్యాపారి కూతురైన సిల్వియా.. ఈ కంపెనీల్లో వచ్చిన లాభాలను కోల్ పీటీవై లిమిటెడ్ (ఆస్ట్రేలియా)కు బదిలీ చేసినట్లు వెల్లడైంది. పురుషుల ఫ్యాషన్ దిగ్గజం జేఎం కంపెనీ యజమాని జానీ మంగ్లానీకి బీవీఐతోపాటు సిప్రస్లోనూ పలుకంపెనీలున్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. అయితే.. దీనిపై మంగ్లానీ స్పందిస్తూ.. ‘నేను సింగపూర్లో ఉంటున్నాను. నాకు ఏ కంపనీల గురించీ తెలియదు. నా వ్యాపారం (వస్త్ర) నేను చేసుకుంటున్నాను. సింగపూరియన్లను వదిలిపెట్టి అవినీతికి పాల్పడుతున్న భారతీయులు, అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్న వారిపై గురిపెట్టండి’ అనిసూచించారు. ఆన్లైన్ రిటైలర్ మింత్రా.కామ్ మాజీ వైస్ప్రెసిడెంట్ నిష్ భుటానీకీ బీవీఐలో ఆర్ట్స్ అలయెన్స్ మీడియా లిమిటెడ్ కంపెనీలో వాటాలున్నాయి. ఢిల్లీ వ్యాపారవేత్త వినయ్ కృష్ణన్ చౌదరీకి బీవీఐ కేంద్రంగా పనిచేసే రెండు కంపెనీల్లో భాగస్వామ్యం ఉండగా. ముంబైకి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దిలీప్ జయంతీలాల్ ఠక్కర్కు బహమాస్లో కన్సు కార్పొరేషన్ కంపెనీ ఉందని వెల్లడైంది. ఫొన్సెకా కంపెనీల్లో మూడోవంతు చైనావే మొసాక్ ఫొన్సెకా వ్యాపారంలో మూడోవంతు చైనా కంపెనీలేనని ఇంటర్నేషనల్ ఐసీఐజే వెల్లడించింది. ఎంఎఫ్ సలహాతో నడుస్తున్న వాటిలో 16,300 కంపెనీలు చైనా, హాంకాంగ్ దేశస్తులవేనని తెలిపింది. మరోవైపు, బ్యాంకులు షెల్ కంపెనీల యజమానులను సులభంగా గుర్తించేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. వీటి ద్వారా బ్యాంకింగ్ రంగంలోని లొసుగులను గుర్తించి.. జాగ్రత్తపడొచ్చని భావిస్తోంది. మరోవైపు, పనామా పేపర్స్ వివాదంలో యూఈఎఫ్ఏ కార్యాలయాల్లో సిట్జర్లాండ్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ‘పనామా’పై న్యాయ విచారణకు డిమాండ్ పనామా పేపర్స్ వివాదంలో వెల్లడవుతున్న భారతీయుల పేర్లపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్, ఆప్ డిమాండ్ చేశాయి. అయితే.. విదేశాల్లో అక్రమంగా కంపెనీలున్న వారు ఇకపై నిద్రలేని రాత్రులు గడపాల్సిందేనని అరుణ్జైట్లీ అన్నారు. కాగా, ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్ కుమారుడు, బీజేపీ ఎంపీ అభిషేక్ సింగ్కూ విదేశీ కంపెనీల్లో వాటాలున్నాయని.. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. వీటిని అభిషేక్ ఖండించారు. పనామా జాబితాలో వెల్లడైన 500 మంది భారతీయుల ఆస్తులు దర్యాప్తు చేసేందుకు కేంద్రం వివిధ విభాగాల అధికారులతో ఏర్పాటుచేసిన దర్యాప్తు బృందం గురువారం ఢిల్లీలో సమావేశమైంది. సామాన్యులకూ కంపెనీలు చెన్నైలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన షణ్ముగ సుందరపాండియన్కు పనాసియా స్టార్ లిమిటెడ్, విర్ ఫ్యాషన్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలున్నట్లు తేలింది. సుందరపాండియన్ సోదరుడు చెన్నైలో జర్నలిస్టుగా ఉన్నారు. కేరళలోని కొబ్బరికాయల చిరు వ్యాపారైన దినేశ్ పరమేశ్వరన్ నాయర్కు ఓ విదేశీ కంపెనీలో భాగస్వామ్యం ఉందని తేలింది. -
'అది ఉంటే.. వారికి నిద్ర పట్టదు'
న్యూ ఢిల్లీ: విదేశాల్లో అక్రమంగా డబ్బు దాచుకున్న వారికి రాత్రిళ్లు నిద్రపట్టదని భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. పనామా పేపర్స్ లీకేజ్ అంశంపై గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న భారతీయుల ఆర్థిక వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే ఈ నల్ల కుభేరుల బండారం అందరికీ తెలుస్తోందని అరుణ్ జైట్లీ వెల్లడించారు. విదేశాల్లో కంపెనీలు స్థాపించి పెట్టుబడులు పెట్టినవారిలో ఎంతమంది భారత చట్టాలకు లోబడి నడుచుకున్నారో విచారణ జరుపుతామన్నారు. 'ఆర్బీఐ అనుమతి తీసుకొని విదేశాల్లో కంపెనీలు పెడితే అది చట్టబద్ధం అని, లేనిచో అది చట్టవిరుద్ధం' అని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా జైట్లీ గుర్తుచేశారు. గత నాలుగు రోజులుగా పనామా పేపర్స్ లీకేజ్ అంశంపై మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పలువురు దేశాధినేతలు సైతం ఈ వ్యవహారంలో తలలు పట్టుకుంటున్నారు. అయితే దీంతో ప్రమేయమున్న 500 మంది భారతీయుల్లో ఎంతమంది చట్టబద్ధంగా ఆర్బీఐ అనుమతితో లావాదేవీలు జరిపారనే విషయం తేలాల్సి ఉంది. -
పనామా పేపర్స్ లో బాలీవుడ్ జంట సంచలనం
న్యూఢిల్లీ: అవినీతి చక్రవర్తుల బాగోతాల గట్టురట్టు చేస్తూ పనామా పేపర్లు సృష్టిస్తున్న ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా పెను రాజకీయ దుమారాన్ని రాజేసిన పనామా పేపర్స్ జాబితాలో తాజాగా ఓ బాలీవుడ్ జంట పేర్లు దర్శనమిచ్చాయి. హీరో సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పేర్లు ఇందులో ఉండడం మరో సంచలనానికి దారితీసింది. వీరితోపాటు, కరీనా సోదరి కరిష్మా కపూర్, పారిశ్రామికవేత్త, వీడియో కాన్ వేణుగోపాల్ ధూత్కు చెందిన సంస్థలు, పుణే కు చెందిన రియల్లర్ చోర్దియా కుటుంబం ఓ విదేశీ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. గురువారం బయటపడిన ఈ జాబితాలో మరో పది పేర్లు దర్శనమిచ్చాయి. 2010లో ఐపీఎల్ పుణె ఫ్రాంచైజీని సొంతం చేసుకునేందుకు వీడియోకాన్, పంచశీల గ్రూప్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్ లు జట్టుకట్టిన వేళ, వీరితో పాటు బీవీఐ (బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్)లో రిజిస్టరైన కంపెనీ ఓడ్బురేట్ లిమిటెడ్ కూడా భాగమైంది. మొత్తం 10 మంది కలిసి పీ-విజన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ కన్సార్టియంను ఏర్పాటుచేసి పుణె ఫ్రాంచైజీ కోసం బిడ్ వేయగా, ఈ సంస్థ విఫలమైంది. తాజాగా మోసాక్ ఫోన్సెకా నుంచి బహిర్గతమైన పత్రాల్లో పీ-విజన్, ఓడ్బురేట్ పేర్లు ఉన్నాయి. పీ-విజన్లో ఈ క్రీడల కన్సార్టియంలో చోర్దియా కుటుంబం 33 శాతం అతి పెద్ద వాటాతో ఉండగా.. కరీనా, కరిష్మా 4.5 శాతం, సైఫ్, ముంబై నివాసి మనోజ్ ఎస్ జైన్ 9 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. దీంతోపాటు వేణుగోపాల్ ధూత్ రెండు గ్రూప్ కంపెనీల ద్వారా 25 శాతం, పంచశీల గ్రూప్ కు 33 శాతం వాటాలున్నాయి. అప్పట్లో జట్టును దక్కించుకోవడంలో విఫలమైన పీ-విజన్ కు పెట్టుబడులు పెట్టిన ఓడ్బురేట్ వెనుక ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబరు 2009లో ప్రారంభమైన ఓడ్బురేట్, మార్చి 4, 2010న ఐపీఎల్ బిడ్డింగ్ పేపర్లపై సంతకాలు చేసిందని, జట్టు దక్కకపోవడంతో, ఆ వెంటనే మూతపడిందని మోసాక్ ఫోన్సెకా పత్రాల్లో ఉంది. ఇదే విషయమై వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ ను ప్రశ్నించగా, పీ-విజన్ లో 25 శాతం వాటా గురించి మాత్రమే తనకు తెలుసునని, ఓడ్బురేట్ సహా ఇతర సభ్యులు, వాటాదారుల వివరాలు తెలియవని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వార్తలపై స్పందించడానికి సైఫ్ దంపతులతో పాటు మిగిలినవారు అందుబాటులో లేనట్టు సమాచారం. పనామా పేపర్స్ గురువారం బహిర్గతం చేసిన నల్ల కుబేరుల జాబితాలో ఇంకా ఢిల్లీకి చెందిన టైర్ డీలర్, ఒక దుకాణం యజమాని, ఒక ఆస్ట్రేలియన్ గని బిలియనీర్ కుమార్తె, ఒక వస్త్రాల ఎగుమతిదారుడు, ఇంజనీరింగ్ కంపెనీ యజమాని, లోహాలు సంస్థ డైరెక్టర్లు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారు. -
మమ్మల్ని బలిచేయొద్దు
♦ పేపర్ల లీకేజీపై పనామా ♦ అన్ని దేశాలకూ ఇందులో భాగస్వామ్యముంది పనామా సిటీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘పనామా పేపర్స్’ వివాదంలో తమను ‘బలిపశువు’ చేయటాన్ని ఒప్పుకునేది లేదని పనామా ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘థర్డ్పార్టీలు తమ చర్యలతో పనామాను బలిపశువును చేసే ప్రయత్నాలను ఒప్పుకునేది లేదు. ఈ ఆర్థిక అవకతవకల్లో ప్రతి దేశానికీ భాగస్వామ్యం ఉంది. మమ్మల్ని తొక్కేద్దామని జరిగే ప్రయత్నాలను సహించం’ అని పనామా మంత్రి అల్వారో అలెమాన్ తెలిపారు. మీడియా కూడా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నాకే స్పందించాలన్నారు. పాత పరిస్థితులను మార్చి, కొత్త సంస్కరణలు తీసుకొస్తున్న విషయాన్ని విస్మరించకూడదన్నారు. కాగా, తాజా లీకేజీ నేపథ్యంలో పనామాను పన్ను ఎగవేత దారుల అడ్డాగా గుర్తించి అక్రమపన్ను ఎగవేతదారుల కేంద్రంగా హిట్లిస్టులో పెట్టిన ఫ్రాన్స్.. ఓఈసీడీ(ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్)ను ఇదే తరహా నిర్ణయం తీసుకోవాలంది. యూఏఈ అధ్యక్షుడికీ ఆస్తులు యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్కూ.. బ్రిటన్లోని ఓ కంపెనీలో 1.7 బిలియన్ డాలర్ల (రూ. 1130 కోట్ల) పెట్టుబడులున్నాయని ‘గార్డియన్’ పత్రిక వెల్లడించింది. సెంట్రల్ లండన్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈయన షేర్లు పెద్దసంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. గతేడాది బ్రిటన్ ప్రధాని కామెరాన్ చెప్పిన వివరాల ప్రకారం లండన్లో 36వేల ఆస్తులు విదేశీయులు, విదేశీ కంపెనీల అధీనంలోనివేనని తెలిసింది. మొత్తం ఇంగ్లండ్, వేల్స్లో కలిపి వీటి విలువ 122 బిలియన్ పౌండ్లు(రూ.11.45వేల కోట్లు) ఉంటుందని ఆయన తెలిపారు. ఐస్ల్యాండ్లో ‘పైరేట్స్’ హవా వివాదం నేపథ్యంలో ఐస్ల్యాండ్ ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఎన్నికలు జరిపితే విపక్ష ‘పైరేట్ పార్టీ’ 42 శాతం ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. 2012లో స్థాపించిన ఈ పార్టీ రాజకీయాల్లో పారదర్శకత, ఇంటర్నెట్ ఫ్రీడమ్లపై ప్రజాఉద్యమాలు నిర్వహించి జనాల్లోకి వెళ్లింది. వివాదం నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని గునలాగ్సన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పిన నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్లో మంట రాజుకుంది పనామా పేపర్స్ వివాదంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యుల పేర్లు వెల్లడి కావటంతో.. ఆ దేశంలో వివాదం రాజుకుంది. షరీఫ్ కుంటుంబం ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపేందుకు సిట్టింగ్ జడ్జిల నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటుచేయాలని పాక్ విపక్షాలు మూకుమ్మడిగా డిమాండ్ చేశాయి. -
పనామా ప్రకంపనలు: ఆ ముగ్గురు తెలుగోళ్లు!
పన్ను స్వర్గధామలైన విదేశాల్లో బోగస్ కంపెనీలు పెట్టి.. నల్లడబ్బు దాచుకున్న కుబేరుల బాగోతం ప్రపంచాన్ని కుదిపేస్తూనే ఉంది. 'పనామా పత్రాల' లీకైన వ్యవహారానికి సంబంధించి తాజాగా మూడో జాబితా విడుదలైంది. ఈ మూడో జాబితాలో ముగ్గురు తెలుగువాళ్లతోపాటు పలువురు భారతీయ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. తెలుగువాళ్లు ఎవరంటే..? మోతూరి శ్రీనివాస్ ప్రసాద్ విదేశీ కంపెనీలు: నాలుగు స్థలం: బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ) హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ ప్రసాద్ కనీసం నాలుగు విదేశీ కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నట్టు ఫొన్సెకా పత్రాల ద్వారా వెల్లడైంది. 2011లో బీవీఐలో ఈ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ప్రసాద్ నందన్ క్లీన్ టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండటంతోపాటు సికా సెక్యూరిటీస్ లిమిటెడ్ కు కో ఓనర్ గా కొనసాగుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద బయోచమురు ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పినట్టు ఘనత తెచ్చుకున్న ప్రసాద్ పేరిట మరో 12 కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే, బయోడీజిల్ ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై 2012 ఏప్రిల్ 2న ఆయన అరెస్టయి.. ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు. ప్రసాద్ వివరణ: కేవలం ఒక డాలర్ తో ఈ కంపెనీలు స్థాపించాం, విదేశాల్లో వ్యాపారం చేద్దామనే ఆశతో వీటిని పెట్టినప్పటికీ అది కుదరకపోవడంతో ప్రస్తుతం ఆ కంపెనీలన్నీ పనిచేయడం లేదు. వీటిని ప్రస్తుతం మేం నడుపడం లేదు. భావనాసి జయకుమార్ విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజిస్ లిమిటెడ్, యెస్ డీ వెంచర్స్ ఎస్ఏ,గ్రాండ్ బే కేనాల్ లిమిటెడ్ తదితరాలు స్థలం: బీవీఐ హైదరాబాద్ కు చెందిన భావనాసి జయకుమార్ ఈ కంపెనీల్లో ప్రసాద్, వోలం భాస్కర్ రావులతో కలిసి డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇందులో నందన్ టెక్నాలజీస్ ను 2008లో స్థాపించగా, గ్రాండ్ బే కెనాల్ లిమిటెడ్ ను 2015లో స్థాపించారు. నందన్ టెక్నాలజీస్ కు అనుబంధంగా ఉన్న ఆరు కంపెనీల్లోనూ జయకుమార్ డైరెక్టర్ గా ఉన్నాడు. జయకుమార్ వివరణ: 'నందన్ టెక్నాలజీస్, ఎస్ డీ వెంచర్స్,గ్రాండ్ బే కెనాల తదితర విదేశీ కంపెనీలతో నాకెలాంటి సబంధం లేదు. వీటిని వోలం భాస్కర్ రావు మేనేజింగ్ డైరెక్టర్ గా నిర్వహిస్తున్నారు' వోలం భాస్కర్ రావు విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజీస్, అనుబంధం సంస్థలు నందన్ టెక్నాలజీస్, దాని అనుబంధం సంస్థలు ఆరింటికి భాస్కర్ రావు ఎండీగా కొనసాగుతున్నారు. అలాగే సికా సెక్యూరిటీస్ లిమిటెడ్ కు సహ యజమానిగా, నందన్ క్లీన్ టెక్ లిమిటెడ్ కు ప్రమోటర్ గా, 2008 ఏప్రిల్ నుంచి ఎండీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వ్యాపారాల నుంచి రిటైరైన ఆయన ప్రస్తుతం ఎక్కువకాలం బ్రిటన్ లో గడుపుతున్నారు. ఆయన తరఫున ఆయన కొడుకు వోలం సందీప్ వివరణ ఇస్తూ.. తన తండ్రి రిటైరైన నేపథ్యంలో ఈ కంపెనీలన్నింటినీ మోతూరి శ్రీనివాస్ ప్రసాద్ టేకోవర్ చేసుకున్నారని, విదేశాల్లో వ్యాపార ఉద్దేశంతో ఈ కంపెనీలు పెట్టినా.. ఇవి ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిపారు. ఇంకా 'పనామా పేపర్స్' మూడో జాబితాలో మోదీ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సతీష్ మోదీ, ప్రీతం బోథ్రా, శ్వేత గుప్తా, బండారి అశోక్ రాందయాల్ చంద్ తదితర వ్యాపారవేత్తల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. -
బద్దలైన నీరా రాడియా బండారం !
నీరా రాడియా.. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో దేశాన్ని కుదిపేసిన పేరు ఇది. కార్పొరేట్ లాబీయిస్ట్ అయిన ఆమె రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, లాబీయిస్టులతో జరిపిన టెలిఫోన్ సంభాషణలు లీకవ్వడం దుమారం రేపింది. తన క్లయింట్లయిన కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు ఆమె యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులతో లాబీ నడిపింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, రతన్ టాటాకు చెందిన టాటా టెలిసర్వీసెస్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఆమె క్లయింట్లుగా ఉన్నాయి. తమకు అనుకూలురైన వ్యక్తులను కేంద్ర కేబినెట్ లో నియమించేందుకు ఆమె నడిపిన లాబీ వ్యవహారం 'రాడియాగేట్'గా ప్రసిద్ధికి ఎక్కింది. 2జీ స్పెక్ట్రం కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరుపుతుండటంతో ఆమె పేరు ఇటీవల అంతగా వినిపించడం లేదు. కానీ, తాజాగా 'పనామా పేపర్స్' లీక్ తో బద్దలవుతున్న కుబేరుల బండారంలో నీరా రాడియా పేరు కూడా చేరింది. పనామాకు చెందిన మొస్సాక్ ఫొన్సెకా కంపెనీ పత్రాల్లో ఆమె పేరు కూడా ఉందని తాజాగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక వెల్లడించింది. దాదాపు పది దేశాల్లో నీరా రాడియాకు అక్రమ ఆస్తులు ఉన్నట్టు ఐటీ దర్యాప్తు సంస్థలు భావిస్తుండగా.. తాజాగా ఆమెకు విదేశాల్లో ఓ కంపెనీ ఉన్నట్టు 'పనామా పత్రాల' ద్వారా వెల్లడైంది. క్రోన్ మార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ లిమిటెడ్ పేరిట 1994లో ఓ అంతర్జాతీయ వ్యాపార కంపెనీని రాడియా పేరిట బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లో ఫొన్సెకా ఏర్పాటుచేసింది. 2004 జూన్ వరకు ఈ కంపెనీ పత్రాల్లో నీరా రాడియా సంతకాలు చేసినట్టు పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఫొన్సెకా రిజిస్టర్ లో ఈ కంపెనీకి సంబంధించిన రికార్డులు 2009, మార్చ్ 2012నాటివి ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన మొత్తం 232 పత్రాలు లీకయ్యాయి. ఇందులో ఇన్ కార్పొరేషన్ డాక్యుమెంట్స్, రాడియా సహా డైరెక్టర్ల పేరిట ఉన్న షేర్ సర్టిఫికెట్లు సైతం ఉన్నాయి. ఈ పత్రాల్లో రాడియాను బ్రిటిష్ పౌరురాలిగా పేర్కొన్నారు. ఇంకా ఆశ్ఛర్యకరమైన విషయమేమిటంటే క్రౌన్ మార్ట్ ఇంటర్నేషనల్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ పేరిట ఆమె లండన్ లో కూడా ఓ వ్యాపార సంస్థను ఏర్పాటుచేసింది. 'జనరల్ బిజినెస్' కోసం అంటూ ఏర్పాటుచేసిన ఈ రెండు కంపెనీల్లో ప్రస్తుతం రాడియా కుటుంబసభ్యులు యజమానులుగా ఉండగా, ఆమె ప్రధాన షేర్ హోల్డర్ గా కొనసాగుతున్నారు. 1992లో ఏర్పాటుచేసిన క్రౌన్ మార్ట్ ఇండియా కంపెనీలో రాడియా తండ్రి ఇక్బాల్ నరైన్ మీనన్ కు ఒక శాతం వాటా ఉండగా, 1995లో లక్ష పౌండ్ల అప్పు కారణంగా ఈ కంపెనీ దివాళా తీసినట్టు ప్రకటించారు. ఈ కంపెనీలో రాడియా కొడుకులు అక్షయ్, ఆకాశ్, కరణ్ లు కూడా వాటాదారులుగా ఉన్నారు. కాగా, నీరా రాడియా బ్రిటిష్ పౌరురాలు అన్న విషయం వాస్తవమేనని, ఆమెకు ప్రస్తుతం యూకే పాస్ పోర్టు కూడా ఉందని ఆమె కార్యాలయం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. కొసమెరుపు! జ్యోతిష్యుల సలహా ప్రకారం నీరా రాడియా తన పేరులో ఆంగ్ల అక్షరం 'ఐ'ని అదనంగా ఇటీవల చేర్చుకున్నారు. కానీ ఫొన్సెకా పత్రాల్లో మాత్రం ఆమె పేరు గతంలో ఉన్న మాదిరిగానే నమోదైంది. గతంలో ఉన్నట్టు (Nira Radia)గానే ఆమె పేరు ఈ పత్రాల్లో కనిపిస్తోంది. -
పనామాలో తెలుగువాళ్లు...
హైదరాబాద్ : పనామా సెగ తెలుగు గడ్డనూ తాకింది. సెంట్రల్ అమెరికాలో ఉవ్వెత్తున ఎగిసిన పనామా పేపర్స్ సునామీలో పలువురు తెలుగువాళ్ల పేర్లు తెరమీదకు వచ్చాయి. నల్ల ధన కుబేరుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మోటూరి శ్రీనివాస ప్రసాద్, వోలం భాస్కరరావు, భావనాశి జయకుమార్ పేర్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మోన్సాక్ ఫోన్సెకా బయటపెట్టిన ఈ జాబితాలో మోటూరి శ్రీనివాస ప్రసాద్ 2011లో నమోదైన నాలుగు సంస్థల్లో విదేశీ డైరెక్టర్లుగా కొనసాగుతోంటే, మరో ఇద్దరు వోలం భాస్కరరావు, భావనాశి జయ కుమార్లు ఎస్డి వెంచర్స్, సికా సెక్యురిటీస్, భాసు కేపిటల్స్, బీపీ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లో వాటాదారులుగా పేర్కొంది. అయితే వీరు చట్టబద్ధంగా తమ ధనాన్ని దాచుకున్నారా? లేక అది నల్లధనమా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా పనామాలో తెలుగోళ్ల పేర్లు బయటకురావటం హైదరాబాద్ వ్యాపారవర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమ దేశాలను వదిలి పన్ను స్వర్గాల్లాంటి విదేశాల్లో డమ్మీ కంపెనీలు పెట్టి, వాటిలోకి ఇన్వెస్ట్మెంట్లు తరలించిన వ్యవహారంలో భారతీయులకు సంబంధించి నిన్న రెండో జాబితా బయట పడిన విషయం తెలిసిందే. -
అక్రమ నిధులకు అయస్కాంతం
పనామా సిటీ: అటు పసిఫిక్... ఇటు అట్లాంటిక్. ఆ రెండింటినీ కలిపే పనామా కాలువ చుట్టూ విస్తరించిన కరీబియన్ దేశం. దశాబ్ద కాలంగా ఈ దేశం సగటున 8.5% వృద్ధిని సాధిస్తోంది. దేశ జీడీపీలో80 శాతం వచ్చేది సర్వీసులపైనే. వాటిలోనూ ఆగ్రస్థానం బ్యాంకింగ్, బీమా, పర్యాటకాలదే. దీన్ని బట్టే ఇక్కడికి విదేశీ డబ్బు ఎంత వస్తోందో, ఎలా వస్తోందో ఒక అంచనాకు రావచ్చు. నిజానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ స్థాయి వృద్ధిని సాధించలేకపోతున్నాయి. విదేశాలనుంచి ప్రముఖుల డబ్బు వరదలా వెల్లువెత్తడంతో పనామా సిటీ లాటిన్ అమెరికా దేశాల దుబాయ్గా మారిపోయింది. అసలిన్ని నిధులు పనామాకు ఎలా వస్తున్నాయ్? ఎప్పటి నుంచి ఈ దేశం ఇలాంటి ‘అక్రమ’ కార్యక్రమాలకు కేంద్రమైంది? 1980ల్లోనే మొదలు... పనామాలో ఇలాంటి పరిస్థితులు కొత్తకాదు. 1980ల్లోనే ఇది మనీ లాండరింగ్కు కేంద్రం. అప్పటి నియంత జనరల్ మాన్యుల్ నోరెగా.. కొలంబియా డ్రగ్ ఉత్పతిదారులకు ఎర్రతివాచీతో స్వాగతం పలికాడు. అప్పటినుంచి అక్రమ డబ్బుకు ఇదో అయస్కాంతంగా మారిపోయింది. డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కావడంతో ఆర్జించిన సొమ్మును డాలర్లలో దాచుకునే వెసులుబాటుంది. ఇక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థయిన అమెరికాకు చేరువలో ఉండడం కూడా పనామాకు కలిసొచ్చింది. అలాగని ఇక్కడున్న కంపెనీలన్నీ ‘అక్రమ’ కేంద్రాలు కావు. న్యాయబద్ధంగా నడుస్తున్న కంపెనీలూ పనామాలో ఉన్నాయి. అమెరికా 3.. పనామా 13 నిజానికి షెల్ కంపెనీలకు పనామా ఒక్కటే కేంద్రం కాదు. పన్నులు తక్కువగా ఉన్న పలు దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ‘ద వాచ్ డాగ్ గ్రూప్’ వెల్లడించిన ఫైనాన్షియల్ సీక్రెసీ సూచీలో అమెరికా 3వ స్థానంలో ఉండగా పనామా స్థానం 13. లండన్లోని ట్యాక్స్ జస్టిస్ నెట్వర్క్ అంచనా ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా 21 ట్రిలియన్ డాలర్ల (రూ.138 కోట్ల కోట్లు) నుంచి 32 ట్రిలియన్ డాలర్ల (రూ.210 కోట్ల కోట్లు) పన్ను ఎగవేసిన లేదా స్వల్పంగా పన్ను చెల్లించిన సంపద ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో ‘గ్లోబల్ షెల్ గేమ్స్’ పేరిట కొందరు ఆర్థిక వేత్తలు విడుదల చేసిన పుస్తకంలో పన్నులు ఎగవేసే వారికి ఆశ్రయమిచ్చే దేశాలు, షెల్ కంపెనీల ఏర్పాటుకు 182 అనువైన ప్రాంతాలు, ఇందుకు సహకరించే 3700 కార్పొరేట్ సర్వీస్ ప్రొవైడర్ల గురించి సవివరంగా పేర్కొన్నారు. ఈ పుస్తకంలో వివరాలు దిమ్మతిరిగే వాస్తవాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇలాంటి అక్రమ కంపెనీల్లో పనామా వాటా 29 శాతం. ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఫొటో గుర్తింపుకార్డు, కంపెనీ యజమానిగా గుర్తించేందుకు కావాల్సిన ఇతర పత్రాలుంటే చాలు. ఇట్టే కంపెనీకి డెరైక్టర్ అయిపోవచ్చు. ఇలాంటి కంపెనీల్లో 25 శాతానికి అమెరికా, 6 శాతానికి డెలావర్ ఆశ్రయమిస్తున్నాయి. నిష్పాక్షిక విచారణ పనామా పేపర్స్ లీకేజీ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపనున్నట్లు తెలిపింది. దేశ, విదేశాల్లోని మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ ఘటనలో జరిగిన తప్పొప్పుల విచారణకు ప్రభుత్వం తరపున కావాల్సిన సహాయసహకారాలు అందుతాయని పనామా అధ్యక్షుడు జువాన్ కార్లోస్ వరేలా తెలిపారు. పనామా ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏ పనినీ ఉపేక్షించబోమన్నారు. మనీ లాండరింగ్ కేంద్రం అనే ముద్ర వేయటం సరికాదన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టినవారంతా అక్రమార్కులు కారన్నారు. హవ్వ! ఇంత జరుగుతుందా? పనామా పేపర్స్ లీక్ నేపథ్యంలో ప్రపంచం ముక్కున వేలేసుకుంటే.. పనామా ప్రజలూ ఆశ్చర్యపోతున్నారు. తమ దేశం ఇన్నాళ్లూ పన్ను ఎగవేతదారులు, అవినీతి తిమింగలాలు, డ్రగ్ డీలర్లకు స్వర్గధామంగా మారిన సంగతి తమకు తెలియదనే చెబుతున్నారు. మొసాక్ ఫోన్సెకా కంపెనీ సహ వ్యవస్థాపకుడు రొమాన్ ఫోన్సెకా మాట్లాడుతూ... ఆర్థికమాంద్యం నేథ్యంలో ధనవంతులు పనామాకు రావటం తట్టుకోలేక కొందరు కావాలనే ఈ పత్రాలను విడుదల చేశారని, ఇది అన్యాయమని చెప్పారు. -
పనామా పార్ట్ 2
♦ పనామా పేపర్లలో మరిన్ని కొత్త పేర్లు.. ♦ రెండో జాబితా వెల్లడించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమ దేశాలను వదిలి పన్ను స్వర్గాల్లాంటి విదేశాల్లో డమ్మీ కంపెనీలు పెట్టి, వాటిలోకి ఇన్వెస్ట్మెంట్లు తరలించిన వ్యవహారంలో భారతీయులకు సంబంధించి మంగళవారం మరో జాబితా బయట పడింది. ఈ దర్యాప్తు సాగించిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే)లో భాగంగా ఉన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఈ రెండో జాబితాను ప్రచురించింది. దీన్లో నగల వర్తకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వారి వివరాలు చూస్తే... అశ్వనీ కుమార్ మెహ్రా మెహ్రాసన్స్ జ్యుయలర్స్ సంస్థ ఓనరు. 1999 నుంచి బహమాస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లలో పీటీసీ గ్రూప్, మ్యాక్స్హిల్ హోల్డింగ్స్ తదితర ఏడు సంస్థలను ఆయన కుటుంబం రిజిస్టరు చేసింది. రెండు కంపెనీల్లో తమకు వాటాలున్నది వాస్తవమేనని, అయితే ఇవి చట్టబద్ధమేనని మెహ్రా కుటుంబం పేర్కొంది. అనురాగ్ కేజ్రీవాల్ లోక్సత్తా పార్టీ ఢిల్లీ విభాగం మాజీ అధ్యక్షుడు. స్టింగ్ ఆపరేషన్తో బహిష్కార వేటు పడింది. కేజ్రీవాల్ అనురాగ్ ఇంటెక్స్ తదితర తదితర మూడు సంస్థల్లో డెరైక్టరుగా ఉన్నారు. విదేశాల్లో బీవీఐ, పనామాల్లో 3 సంస్థల్లో ఈయన డెరైక్టరుగా ఉన్నారు. మరో 2 ప్రైవేట్ ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు. అయితే, సమస్యలు తలెత్తవచ్చన్న ఆలోచనతో 3 సంస్థలను 2010లోను, ఫౌండేషన్లను ప్రారంభించిన కొన్నాళ్లకే మూసివేసినట్లు కేజ్రీవాల్ తెలిపారు. సతీష్ గోవింద్ సమ్తాని, విష్లవ్ బహాదుర్, హరీష్ మోహ్నాని బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లోనిరెండు విదేశీ సంస్థల్లో ఈ ముగ్గురూ డెరైక్టర్లు. వీటిలో ఒకటైన ట్రైలియోన్ను 2012లో తొలగించగా, మరొకటి డిజైన్ అండ్ క్వాలిటీని ఈ ఏడాది ఏప్రిల్లో తొలగించనున్నారు. బహాదుర్ ప్రస్తుతం వీఎన్ఎస్ కార్పొరేషన్ సంస్థను నడిపిస్తుండగా, మోహ్నానీ... బీఎస్ఈలో లిస్టయిన ప్రొ అపారెల్ డివిజన్కు ఎండీగా ఉన్నారు. దుస్తుల ఎగుమతుల లావాదేవీల కోసం నిబంధనల ప్రకారమే రెండు విదేశీ సంస్థలు ప్రారంభించామని, కానీ తర్వాత వాటిని మూసివేశామని బహాదుర్ తెలిపారు. ముగ్గురూ విడిపోయి వేర్వేరు సంస్థల్లో ఉన్నామని పేర్కొన్నారు. గౌతమ్ సీన్గాల్ ఈయన ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, ఐటీ కన్సల్టెంటు. దాదాపు 400 మిలియన్ డాలర్ల ప్రైవేట్ ఈక్విటీ ఫండ్తో తనకు లింకు ఉందని ఆయన చెప్పినట్లు ఫోన్సెకా రికార్డులు చూపుతున్నాయి. ఈయన పేరిట బీవీఐలో రెండు సంస్థలు ప్రారంబించారు. ఈ కంపెనీలన్నీ తన తండ్రికి చెందినవేనని, కుటుంబ విభజన తర్వాత వాటితో తనకే సంబంధమూ లేదని గౌతమ్ పేర్కొన్నారు. తనకు గుర్గావ్, ఢిల్లీ, మొహాలీలో కార్యాలయాలు ఉన్నట్లు తెలిపారు. ప్రభాస్ సంఖ్లా ఈయన మధ్యప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగి. మూడేళ్ల క్రితం భార్య మరణం తర్వాత నుంచి ఇండోర్లో ఒంటరిగా ఉంటున్నారు. సంఖ్లా, ఆయన కుమార్తె, అల్లుడు డెరైక్టర్లుగా పనామాలో లోటస్ హొరైజన్ పేరిట సంస్థ ఉంది. తన అల్లుడు వ్యాపారవేత్త అని చెబుతున్న సంఖ్లా... సదరు సంస్థలో తాను కేవలం గౌరవ డెరైక్టరును మాత్రమేనని పేర్కొన్నారు. అవసరమైతే తన పేరును తొలగించమని వారిని కోరతానన్నారు. వినోద్ రామచంద్ర జాదవ్ పుణెకి చెందిన సవా హెల్త్కేర్ సంస్థకు చైర్మన్. 2010-15 మధ్య బీవీఐ కేంద్రంగా ఏర్పాటైన పలు సంస్థల్లో డెరైక్టరుగానో లేదా షేర్హోల్డరుగానో ఆయన పేరు కనిపిస్తోంది. తన డెరైక్టర్షిప్లు, ఆదాయాలన్నీ ప్రతీ ఏటా నియంత్రణ సంస్థలకు తెలియజేస్తున్నట్లు జాదవ్ చెప్పారు. గౌతమ్, కరణ్ థాపర్ 1999లో థాపర్ గ్రూప్ విభజన అనంతరం... క్రాంప్టన్ గ్రీవ్స్ సంస్థ బ్రిజ్ మోహన్ థాపర్ కుమారులైన గౌతమ్, కరణ్ థాపర్ల చేతికి వచ్చింది. 2005లో చార్ల్వుడ్ ఫౌండేషన్ను గౌతమ్, నికోమ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ను కరణ్ ప్రారంభించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే చార్ల్వుడ్ను గౌతమ్ ఏర్పాటు చేయలేదని, ఆయన భార్య స్టెఫానీ దీని లబ్ధిదారుల్లో ఒకరని గౌతమ్ తరఫు వర్గాలు తెలిపాయి. అశోక్ మల్హోత్రా ఈయన కోల్కతాకు చెందిన వ్యాపారవేత్త. 2008లో బీవీఐలో ఏర్పాటైన ఈఅండ్పీ ఆన్లుకర్స్ సంస్థ డెరైక్టరు, వాటాదారు. సందీప్ రస్తోగీ అనే మరో డెరైక్టరు పేరిట ఉన్న అయిదు షేర్లు మల్హోత్రకు బదిలీ అయ్యాయి. అనంతరం 2010లో దీని కార్యకలాపాలు ఆగిపోయాయి. రస్తోగీ తన మిత్రుడేనని, అయితే షేర్ల లావాదేవీల గురించి పెద్దగా గుర్తు లేదని మల్హోత్ర వివరించారు. రంజీవ్ దహుజా, కపిల్ సైన్ గోయల్ ఈఇద్దరు బెర్కిలీ ఆటోమొబైల్స్ను నిర్వహిస్తున్నారు. ఎంఎఫ్ రికార్డుల ప్రకారం 2012లో వీరు బీవీఐలో బియాల్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ను చెరి 5,000 షేర్లతో ప్రారంభంచారు. 2013లో ఇది మూతపడింది. లాభాల గురించి తమకు ఎవరో తప్పు సలహాలివ్వడంతో దాన్ని ప్రారంభించామని, కానీ ఎప్పుడూ ఆపరేట్ చేయనే లేదని గోయల్ తెలిపారు. వివేక్ జైన్ మధ్యప్రదేశ్లో వ్యవసాయ పరికరాల స్టోర్ నిర్వహిస్తున్నారు. బీవీఐలో 2010లో ఏర్పాటైన సక్వినామ్ గ్లోబల్లో డెరైక్టరుగాను, హాంకాంగ్లో రిజిస్టరయిన రేడియంట్ వరల్డ్ హోల్డింగ్స్లో వాటాదారుగాను ఆయన పేరు ఉంది. అయితే సదరు సంస్థల గురించే తనకు తెలియదని జైన్ తెలిపారు. వాటిలో వాటాదారుగా ఉన్న నహర్ సోదరులు తనకు బంధువులేనని, వారితో కొన్నాళ్ల క్రితం దాకా మంచి వ్యాపార సంబంధాలు ఉండేవని పేర్కొన్నారు. వారు ఇటువంటి కార్యకలాపాలు చేస్తారని తాను ఊహించలేదన్నారు. అంతా చట్టబద్ధమే అమితాబ్ బచ్చన్ ముంబై: పనామా పేపర్స్ వ్యవహారంలో తన పేరు బయటకు రావటంపై బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ నోరు విప్పారు. తన సంపాదనకు అనుగుణంగా పన్నులు చెల్లించానని, విదేశాలకు పంపించిన ప్రతి రూపాయీ చట్టబద్ధంగానే పంపానని స్పష్టంచేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొన్న కథనంలో కూడా ఎక్కడా తాను అక్రమాలకు పాల్పడ్డట్టుగానీ, నల్లధనం కలిగి ఉన్నట్టుగానీ లేదని తెలియజేశారు. నాలుగు విదేశీ షిప్పింగ్ కంపెనీలకు తాను డెరైక్టర్గా ఉన్నట్లు వచ్చిన వార్తలను మాత్రం ఖండించారు. ‘‘ఇండియన్ ఎక్స్ప్రెస్లో పేర్కొన్న ఆ నాలుగు కంపెనీల్లో ఏ ఒక్కటీ నాకు తెలియదు. వీటిలో వేటికీ నేను డెరైక్టర్ను కాను. నా పేరును తప్పుగా వాడి ఉంటారు’ అని అమితాబ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చట్టబద్ధతపై విచారణ: రఘురాం రాజన్ ముంబై: విదేశాల్లో ఖాతాలుండేందుకు నిజమైన కారణాలుండాలని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. పనామా పేపర్స్ లీకేజీ ఘటనలో వెల్లడైన దాదాపు 500 మంది భారతీయ సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తల అకౌంట్ల చట్టబద్ధతను వివిధ ఏజెన్సీల ద్వారా దర్యాప్తు చేస్తామని తెలిపారు. ‘ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా విదేశాలకు డబ్బులు పంపే అవకాశం ఉంది. అయితే... ఇందులో చట్టబద్ధంగా పంపిన వాళ్లెందరు? చట్ట విరుద్ధంగా పంపిన వాళ్లెందరు? అనేది చూడాలి’ అని రఘురాం రాజన్ చెప్పారు. ప్రస్తుత చట్టాల ప్రకారం ఏడాదికి 2.5 లక్షల డాలర్లను విదేశాలకు పంపే వీలుంటుంది. కాగా, ఈ ఘటనలో రెండు, మూడు విషయాలు మిళితమై ఉన్నాయని.. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్చార్ ఖాన్ తెలిపారు. ఫెమా కింద కొన్ని నిబంధలనలు వర్తిస్తాయని.. ఇవన్నీ విచారణలోనే తేలుతాయన్నారు. అయితే.. పనామా పేపర్స్ వివాదాన్ని తామే విచారిస్తామని నల్లధనంపై ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. -
బాబు పాపాల పుట్ట బద్దలవుతుంది
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం సాక్షి, హైదరాబాద్: నల్లధనంపై పనామా పత్రాలు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాల పుట్ట కూడా త్వరలో బద్దలవుతుందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. విదేశాల్లో నల్లధనాన్ని దాచిపెట్టుకోవడంలో చంద్రబాబు ఘనుడనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. 20 ఏళ్లుగా ఆయన విదేశాల్లో తిరుగుతూ ఈ పని చేశారని ఆరోపించారు. వాసిరెడ్డి పద్మ మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పనామా పత్రాలపై ‘సిట్’ బృందంతో దర్యాప్తు జరిపిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్యను తమ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తోందని అన్నారు. పనామా పత్రాల్లో దేశ విదేశీ ప్రముఖుల బాగోతాలు వెల్లడయ్యాయని, తీగ లాగుతున్నారు కనుక డొంకంతా కదిలి చంద్రబాబు పేరు కూడా బయటకు వస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం నోరు విప్పాలి : కృష్ణా, గోదావరి నదులపై భారీస్థాయిలో ప్రాజెక్టులు కట్టబోతున్నామని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమే కాక, అన్ని పత్రికల్లో ప్రకటనలు జారీ చేసిందని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ ప్రాజెక్ట్లపై ఏపీ వైఖరి ఏమిటనే దానిపై చంద్రబాబు నోరు విప్పడం లేదని విమర్శించారు. -
చట్టబద్దంగా డబ్బు అందుకుంటున్నా: అమితాబ్
ముంబై: తాను ఎటువంటి ఆర్థిక అక్రమాలకు పాల్పడలేదని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తెలిపారు. పనామాలో తాను పెట్టుబడులు పెట్టినట్టు పేర్కొన్న కంపెనీల గురించి తనకేమీ తెలియదని చెప్పారు. ఇటువంటి కంపెనీలకు తాను డైరెక్టర్ గా లేనని స్పష్టం చేశారు. తాను చట్టబద్దంగా పన్నులు చెల్లిస్తున్నానని అన్నారు. విదేశాల నుంచి నిబంధనలకు అనుగుణంగా డబ్బు అందుకుంటున్నానని, సుంకాలు చెల్లిస్తున్నానని చెప్పారు. తన పేరును దుర్వినియోగం చేయడానికి ఇదంతా చేస్తున్నారని బిగ్ బి ఆవేదన వ్యక్తం చేశారు. పనామా పత్రాల్లో తన గురించి పేర్కొన్నదంతా అసత్యం, అభూత కల్పన అని అమితాబ్ కోడలు ఐశ్వర్యరాయ్ సోమవారం ప్రకటించారు. డబ్బులు అక్రమంగా దాచడానికి మొస్సాక్ ఫోన్సెకా అనే సంస్థ ద్వారా విదేశీ ప్రముఖులు పనామాలో 2,14,000 కంపెనీలు ఏర్పాటు చేసిటనట్టు కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) వెల్లడించింది. ఈ జాబితాలో అమితాబ్, ఐశ్వర్యారాయ్, డీఎల్ఎఫ్ కేపీ సింగ్, నాయకులు, కార్పొరేట్లు సహా 500 మంది భారతీయుల పేర్లు ఉన్నట్టు తెలిపింది. -
ఈ ముద్దు గుమ్మల పేరిట డబ్బు దాచారు
పనామా: పన్నుపోటులేని స్వర్గసీమగా వాసికెక్కిన పనామాలో వందల కోట్ల రూపాయల నల్లడబ్బును దాచుకున్న వివిధ రంగాల ప్రముఖుల గుట్టురట్టవుతున్న విషయం తెలిసిందే. వీరిలో సినీ నటులు, క్రీడా ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలతోపాటు దేశాధినేతలు కూడా తమ భార్యల పేరిట నల్లడబ్బును దాచుకున్నారు. కొంత మంది ప్రేయసిల పేరిట కూడా డబ్బుదాచారు. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలయేవ్ భార్య షాంపేన్ లవింగ్ సోషలైట్ మెహ్రిబాన్ అలియేవ పేరిట, గినియా అధ్యక్షుడు మమాడి టూర్ భార్య లాన్యానా కాంట్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ భార్య, ప్రొఫెషనల్ ఐస్ డేన్సర్ తతియాన నావ్కా, ఐస్లాండ్ ప్రధాన మంత్రి సిక్ముందర్ డేవిడ్ భార్య అన్నా సికుర్లాగ్ పేరిట కోట్లాది రూపాయల నల్లడబ్బును దాచారు. భార్య నుంచి విడాకులు పొందే సమయంలో ఈ డబ్బు భార్యకు దక్కకుండా భర్త తన పేరు మీదకు మార్చుకునే వెసలుబాటును కూడా న్యాయ సహాయక సంస్థ మొసాక్ ఫోన్సేకా కల్పిస్తోంది. దీనికి చేయాల్సిందల్లా విడాకులు తీసుకోవాలనుకున్న సమయంలో భర్త చిన్న దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రేయసి పేరు మీదున్న సొమ్మును కూడా బదిలీ చేసుకునే అవకాశం ట్రస్టుల ద్వారా కల్పిస్తుండడంతో ఎక్కువ మంది ప్రముఖులు ప్రేయసిల పేరుతో కూడా నల్ల డబ్బు ఖాతాలను తెరిచారు. -
'పనామా లీక్స్'లో ఓ ఇండియన్ క్రికెటర్!
పలువురి కార్పొరెట్ల బాగోతం రట్టు విదేశాల్లో బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసి నల్లడబ్బు దాచుకున్న ప్రముఖుల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో 'పనామా పేపర్' లీక్ కు సంబంధించి మరింతమంది భారతీయుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ పత్రాల్లో ఉన్న పలువురు భారతీయుల జాబితాను ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక మంగళవారం వెల్లడించింది. ఈ రెండో జాబితాలో పలువురు పారిశ్రామికవేత్తలతోపాటు ఓ భారతీయ క్రికెటర్ కూడా ఉన్నాడు. నల్లధనానికి స్వర్గధామలైన దేశాల్లో విదేశీ కంపెనీలు స్థాపించిన భారతీయుల్లో మెహ్రాసన్స్ జెవెలర్స్ అధినేత అశ్వినీకుమార్ మెహ్రా, పారిశ్రామికవేత్తలు గౌతం, కరణ్ థాపర్, సతీష్ గోవింద సంతాని, విష్లవ్ బహదూర్, హరీశ్ మొహ్నాని, మధ్యప్రదేశ్ రిటైర్డ్ ప్రభుత్వాధికారి ప్రభాష్ సంఖ్లా తదితరులు ఉన్నారు. పుణెకు చెందిన సవా హెల్త్కేర్ చైర్మన్ వినోద్ రామచంద్ర జాదవ్, మాజీ క్రికెటర్ అశోక్ మల్హోత్రా, రాజీవ్ దహుజా, బెల్లాస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కు చెందిన కపిల్ సెయిన్ గోయల్, వ్యవసాయ పనిముట్లు అమ్మే వివేక్ జైన్ తదితరుల పేర్లు కూడా లీకైన 'పనామా పత్రాల్లో' ఉన్నట్టు వెల్లడైంది. వీరు పన్ను ఎగ్గొట్టేందుకు పలు బోగస్ కంపెనీల్లో డైరెక్టర్లు, షేర్ హోల్డర్లుగా ఉన్నారని తెలిసింది. మరోవైపు 'పనామా పేపర్స్' లీకైన వ్యవహారంపై తాము కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు అమెరికా కూడా తాజాగా వెల్లడించింది. పనామాలోని మొస్సాక్ ఫోన్సెకా అనే లా కంపెనీకి చెందిన 1.15 కోట్ల పత్రాలు లీకవ్వడంతో పలువురు మనీలాండరింగ్ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. క్రికెటర్.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లో కంపెనీ క్రికెటర్ అశోక్ ఓం ప్రకాశ్ మల్హోత్రా 1982-86 మధ్యకాలంలో భారత్ తరఫున 7 టెస్టులు, 20 వన్డేలు ఆడాడు. గతంలో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా ఆయన పేరిట రికార్డు ఉంది. ప్రస్తుతం కోల్కతాలో ఓ క్రికెట్ అకాడమీ నడుపుతున్న ఆయన.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లో 2008 సెప్టెంబర్ 5న ఈ అండ్ పీ ఆన్లుకర్స్ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించి డైరెక్టర్గా, షేర్ హోల్డర్గా కొనసాగుతున్నారు. -
ప్రపంచవ్యాప్తంగా పనామా ప్రకంపనలు!
లండన్: 'పనామా పేపర్స్' ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సంపన్నులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, తాజా మాజీ దేశాధ్యక్షులు.. ఇలా చాలామంది పన్ను ఎగ్గొట్టి విదేశాల్లో అక్రమంగా నల్లడబ్బు దాచినట్టు వెలుగులోకి వచ్చిన వివరాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విచారణ ప్రారంభించాయి. పనామాలోని ఓ లా కంపెనీకి చెందిన 1.15 కోట్ల పత్రాలు లీకవ్వడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ సన్నిహితులు, బ్రిటన్ ప్రధాని కామెరాన్, చైనా ప్రధాని జింగ్పింగ్ బంధువులు, పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కొడుకులు, ఉక్రెయిన్ ప్రధాని కుటుంబసభ్యులు అక్రమంగా విదేశీ బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసినట్టు వెల్లడైంది. వీరితోపాటు ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖుల నల్లడబ్బు లోగుట్టు కూడా వెలుగుచూసింది. నల్లడబ్బును దాచేందుకు బోగస్ కంపెనీలు సృష్టించడంలో పనామాకు చెందిన మొసాక్ ఫొనెస్కా లా కంపెనీ దిట్ట. ఆ కంపెనీ ఇప్పటివరకు వివిధ ప్రముఖుల కోసం 2.40 లక్షల బోగస్ కంపెనీలు సృష్టించింది. అనేకమంది ప్రముఖులు ఈ కంపెనీల్లో నల్లడబ్బును దాచినట్టు వెలుగులోకి వస్తున్నది. లియోనల్ మెస్సీ, జాకీచాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉండటం కలకలం రేపుతున్నది. ఈ నేపథ్యంలో రష్యా మొదలు బ్రిటన్ వరకు అన్ని దేశాలు ఈ బాగోతంపై స్పందించాయి. పుతిన్ సన్నిహితుల నల్లడబ్బు వ్యవహారంపై రష్యా స్పందిస్తూ.. ఇందులో కొత్తదనంకానీ, సమగ్ర ఆధారాలుకానీ లేవని కొట్టిపారేసింది. ప్రధాని డేవిడ్ కామెరాన్ దివంతగ తండ్రికి కూడా ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నట్టు వచ్చిన వార్తలపై స్పందించడానికి బ్రిటన్ ప్రభుత్వం నిరాకరించింది. ఇది ప్రైవేటు మ్యాటర్ కాబట్టి స్పందించబోమని పేర్కొంది. తన సన్నిహితుల పేర్లు 'పనామా పేపర్స్'లో ఉండటంపై ఐస్లాండ్ ప్రధాని సిగ్ముందర్ గున్లలగ్సన్ నోరువిప్పలేదు. తన కుటుంబసభ్యులు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వివరణ ఇచ్చారు. ఇక తమ దేశాల ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్వీడన్, నెదర్లాండ్ తదితర దేశాలు విచారణకు ఆదేశించాయి. మరోవైపు పనామా దేశం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద లీక్ బాగోతంగా భావిస్తున్న ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించింది. -
ఈ జగదేక శ్రీమంతులు నలుపా.. తెలుపా?
సంచలన విషయాలు బయటపెట్టిన ఐసీఐజే విదేశాల్లో ప్రముఖులకు చెందిన 2,14,000 కంపెనీల గుట్టురట్టు ► విదేశాల్లో ప్రముఖులకు చెందిన 2,14,000 కంపెనీల గుట్టురట్టు ► డబ్బులు దాచడానికి గుట్టల కొద్దీ పుట్టుకొచ్చిన కంపెనీలు ► ‘పనామా’లో మొస్సాక్ ఫోన్సెకా సంస్థ ద్వారా ఏర్పాటు ► యజమానుల పేర్లు రహస్యంగా ఉంచటమే ఈ సంస్థ పని ► మొస్సాక్ ఫోన్సెకాకు చెందిన 1.15 కోట్ల రహస్య పత్రాలు వెల్లడి ► జాబితాలో అమితాబ్, ఐశ్వర్యారాయ్, డీఎల్ఎఫ్ కేపీ సింగ్ ► నాయకులు, కార్పొరేట్లు సహా 500 మంది భారతీయుల పేర్లు ► ప్రపంచవ్యాప్తంగా 140 మంది రాజకీయ నాయకులు ► రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా డజను మంది ప్రస్తుత, మాజీ దేశాధినేతలు ► అమెరికా నిషేధించిన డ్రగ్ గ్యాంగులు, టైస్టు సంస్థలదీ ఇదే తీరు ► మే తొలి వారంలో మొత్తం జాబితా బయట పెడతామన్న ఐసీఐజే పన్ను స్వర్గాల్లోని కుబేరుల గుట్టు బయటపడింది. చట్టాలకు, పన్నులకు అతీతంగా ఉండే దేశాల్లో గుట్టలకొద్దీ కంపెనీలను ఏర్పాటు చేసి డబ్బులు తరలించిన శ్రీమంతుల రహస్యాలు మరోసారి వెలుగుచూశాయి. వీరిలో ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలతోపాటు బాలీవుడ్ స్టార్లు అమితాబ్, ఐశ్వర్యారాయ్, పలువురు క్రీడాకారులు... ఒకరేమిటి!! చివరకు మాఫియా డాన్లు, దొంగలు, మాదకద్రవ్యాల స్మగ్లర్లు, అవినీతి రాజకీయ నేతలు, పన్ను ఎగవేతదారులు సైతం చాలామందే ఉన్నారు. వీళ్లే కాదు. ఉగ్రవాదం ఆరోపణలపై అమెరికా గతంలో నిషేధించిన సంస్థలు, రోగ్ దేశాలుగా పేర్కొన్న దేశాల నేతలదీ ఇదే తీరు. దాదాపు 120 దేశాల్లోని జర్నలిస్టులు, మీడియా సంస్థలతో కూడిన ‘కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) ఈ గుట్టు బయటపెట్టింది. ఈ కన్సార్షియంలో మన దేశం నుంచి ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రిక ఉంది. దర్యాప్తులో భాగంగా 2,14,000 విదేశీ కంపెనీలకు చెందిన 2.6 టెరాబైట్ల డేటాను... 1.15 కోట్లకుపైగా పత్రాల్ని ఐసీఐజే చేజిక్కించుకుంది. వీటిలో ఈ-మెయిల్స్, పాస్పోర్టులు, బ్యాంకు ఖాతాలు, క్లయింట్ల రికార్డులు... చాలానే ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ పనామా కేంద్రంగా పనిచేస్తున్న న్యాయ సేవల సంస్థ ‘మొస్సాక్ ఫోన్సెకా’కు చెందినవి. వీళ్లందరి పేరిటా గుట్టలకొద్దీ రహస్య కంపెనీలు ఏర్పాటు చేసిన సంస్థ ఇదే. దాదాపు 40 ఏళ్ల పాటు.. అంటే 1977 నుంచి 2015 డిసెంబర్ వరకు ఉన్న డేటాను పరిశీలించి ఈ వివరాల్ని ఐసీఐజే బయటపెట్టింది. జాబితాలోని అందరి పేర్లనూ మే మొదటివారంలో వెల్లడిస్తామని ఐసీఐజే స్పష్టంచేసింది. పారిస్/న్యూఢిల్లీ దేశ, విదేశాల్లో పనామా పేపర్లు పెను సంచలనం సృష్టించాయి. రహస్య డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైన అంశాలు అనేక ప్రశ్నలను తెరపైకి తెచ్చాయి. ఇంతకీ ఆ పేపర్లు బయటపెట్టిందేంటి? ఇదేమైనా మోసమా? మనీ లాండరింగా? ఒకసారి చూద్దాం... మొస్సాక్ ఫోన్సెకా: ఈ కంపెనీ తమ క్లయింట్ల రహస్యాలకు కాపలాదారు లాంటిది. దీని క్లయింట్లలో మాఫియా డాన్లు, మాదకద్రవ్యాల స్మగ్లర్లు, పన్ను ఎగవేతదారులు, అవినీతి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. క్లయింట్ల విదేశీ రహస్యాలను కాపాడే ప్రపంచంలోని 5 అతిపెద్ద కంపెనీల్లో ఫోన్సెకా ఒకటి. 500 మందికిపైగా ఉద్యోగులు, సహాయకులు ఉన్న ఈ సంస్థకు... ప్రపంచవ్యాప్తంగా 40 కార్యాలయాలున్నాయి. వీటిలో స్విస్లో 3, చైనాలో 8 ఉండటం గమనార్హం. ఇదేం చేస్తుందంటే... పన్ను స్వర్గాల్లాంటి దేశాల్లో ఎవరైనా డబ్బులు దాచుకోవాలంటే... వారి రహస్యాలు బయట పడకుండా ఈ సంస్థ అల్లిబిల్లి కంపెనీలను సృష్టిస్తుంది. ఒకవేళ ఆయా దేశాల్లో చట్టాలు గనక మారితే... వెంటనే క్లయింట్లను అప్రమత్తం చేసి, అక్కడి సంస్థల్ని ఆగమేఘాల మీద వేరే దేశాలకు తరలిస్తుంది. అసలు యజమానుల పేరు బయటకు తెలియకుండా... వారి తరఫున ఫోన్సెకా నమోదు చేసిన కంపెనీ పేరే ఎక్కడైనా కనపడుతుంది. ఇది తనకు చెందిన పలువురు డ మ్మీలను నామినీ డెరైక్టర్లుగా నియమిస్తుంది. దీంతో వీళ్లపేర్లే బయటకు కనిపిస్తాయి. ఇక క్లయింట్లు ఇచ్చే సొమ్మును బట్టి రకరకాల దేశాల్లో, రకరకాల కంపెనీలను ఇది సృష్టిస్తుంది. దీంతో దర్యాప్తు చేసేవారి తలప్రాణం తోకకొస్తుంది. పనామాలో ఫోన్సెకా సంస్థ క్లయింట్ల తరఫున ప్రైవేట్ ఫౌండేషన ్లను ఏర్పాటు చేస్తోంది. ఎందుకంటే పనామాలో వీటిపై పన్నులు లేవు. అక్కడి చట్టప్రకారం వీటి వ్యవస్థాపకుల, లబ్ధిదారుల పేర్లు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఇదికాక... క్లయింట్లు ఇరుక్కున్నపుడు డాక్యుమెంట్లకు వెనకటి తేదీలు వేయటంతో పాటు, ఆస్తుల్ని దాచుకోవటానికి వీలుగా క్లయింట్ల పేరిట ఫౌండేషన్లు ఏర్పాటు చేసి, వాటి లబ్ధిదారుగా తొలుత ఏదైనా స్వచ్ఛంద సంస్థను పేర్కొనటం, తరవాత లబ్ధిదారును మార్చేయటం చేస్తోంది. ఇదీ... ఇండియా కథ ప్రపంచవ్యాప్తంగా ఇలా కంపెనీలు పెట్టి, డబ్బు దాచుకున్న వారిలో 500కు పైగా భారతీయుల పేర్లూ బయటపడ్డాయి. వీరిలో బాలీవుడ్ స్టార్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు చాలామందే ఉన్నారు. అయితే ఇక్కడ అందరికీ తలెత్తే ప్రశ్న ఒక్కటే!!. వీరిలా డబ్బులు దాచుకోవటం నేరమా? విదేశాల్లో కంపెనీలు పెట్టడం తప్పా? ఇది చట్ట సమ్మతమేనా... కాదా? ఈ ప్రశ్నలకు జవాబులు చూద్దాం... మనదేశంలో పన్నులు చాలా ఎక్కువే. దీంతో మనవాళ్లు కొందరు విదేశాల్లో సంపాదించే డబ్బుల్ని అక్కడే ఉంచుకోవటానికి ఇష్టపడుతున్నారు. నిజానికి 2004 వరకు భారతీయులు తమ రూపాయల్ని విదేశీ కరెన్సీలోకి మార్చుకుని విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆర్బీఐ అనుమతించేది కాదు. అయితే కంపెనీలకు ఇవి వర్తించేవి కావు. అవి ఆర్బీఐ, ప్రభుత్వ అనుమతితో విదేశాల్లో కంపెనీల్ని కొనుగోలు చేసేందుకు వీలుండేది. దీంతో వ్యక్తులు విదేశాల్లో ట్రస్టులు ఏర్పాటు చేసి, పవరాఫ్ అటార్నీ తమపేరున పెట్టుకునేవారు. ఇలాంటి ట్రస్టుల్ని ఫోన్సెకాా ఏర్పాటు చేసేది. ఇదీ నేరం... ఇక్కడ గమనించాల్సిందేమిటంటే... 2004 వరకు తమ రూపాయలు విదేశీ కరెన్సీలోకి మార్చుకుని విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ వ్యక్తికీ ఆర్బీఐ అనుమతి లేదు. ఈ లెక్కన చూస్తే... 2004కు ముందు విదేశాల్లో తమ పేరిట ఖాతాలు తెరిచిన భారతీయులంతా చట్ట విరుద్ధంగా చేసినట్లే. అది నేరమే. 2004లో ఆర్బీఐ అనుమతి... రిజర్వుబ్యాంకు 2004 ఫిబ్రవరిలో సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను ఆర్బీఐ ప్రకటించింది. దీనిప్రకారం ఎవరైనా ఒక ఏడాదిలో 25,000 డాలర్లు విదేశాలకు తీసుకెళ్లొచ్చు. ఆ మొత్తాన్ని మెల్లగా పెంచగా ఇపుడది 2.5 లక్షల డాలర్లకు చేరింది. దీన్ని వైద్య ఖర్చులు, విరాళాలు, కాలేజీ ఫీజు, షేర్ల క్రయవిక్రయాలకు వినియోగించవచ్చని ఆర్బీఐ పేర్కొంది. దేనికి వాడకూడదో మాత్రం చెప్పలేదు. షేర్లు కొనొచ్చని ఉంది కదా అనే సాకుతో... కొందరు వ్యక్తులు ‘పేపర్’ కంపెనీల్లో షేర్లను కొన్నారు. ఈ పేపర్ కంపెనీల్నే పెట్టుబడి గొట్టాలుగా మార్చారు. పేపర్ కంపెనీల్లో షేర్లను అమ్మటం ఫోన్సెకా పని. 2010లో మళ్లీ ఆర్బీఐ సవరణలు... రెమిటెన్స్ స్కీము దుర్వినియోగమవుతోందని భావించిన ఆర్బీఐ 2010లో వివరణిచ్చింది. భారతీయులు వ్యక్తిగతంగా విదేశాల్లో కంపెనీలను ఏర్పాటు చేయకూడదని తేల్చింది. కానీ నిపుణులు దీనికో భాష్యం చెప్పారు. ‘‘కంపెనీలు ఏర్పాటు చేయొద్దన్నారు గానీ... కంపెనీల్ని టేకోవర్ చెయ్యకూడదనలేదుగా?’’ అని లొసుగు వెతికారు. దీంతో షెల్ కంపెనీల్ని ఏర్పాటు చేసి వాటిని విక్రయించటం మొదలెట్టింది ఫోన్సెకా. 2013లో మరోసారి సవరణ... దేశంలో ఉన్న సంస్థలకు నూరుశాతం అనుబంధ సంస్థలైతే విదే శాల్లో ఏర్పాటు చేసుకోవచ్చంటూ 2013లో ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఓడీఐ) ద్వారా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవచ్చని కూడా తెలిపింది. దీంతో సాంకేతికంగా... 2013కన్నా ముందు భారతీయులు విదేశాల్లో ఏర్పాటు చేసిన కంపెనీలు నిబంధనల్ని ఉల్లంఘించినట్లేనని ఐసీఐజే చెబుతోంది. ఐసీఐజే అంటే... ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు(ఐసీఐజే)లో 60 దేశాలకు చెందిన 160 మంది రిపోర్టర్లు ఉన్నారు. వీరు పరిశోధనాత్మక కథనాల కోసం పనిచేస్తున్నారు. దీన్ని 1997లో ఏర్పాటు చేశారు. ఖండాతర నేరాలు, అవినీతి వ్యవహారాలు, స్కాంలు వెలికితీస్తూ ‘వాచ్డాగ్’ జర్నలిజాన్ని అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వార్తా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఇలా చేస్తే మోసం చేసినట్టే ► 2004 కన్నా ముందు వ్యక్తులు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసినా నేరమే. ► 2013కన్నా ముందు వ్యక్తులు విదేశాల్లో కంపెనీలు పెట్టినా నేరమే. ► మరో కీలకమైన అంశమేంటంటే ‘వెల్లడి ఒప్పందం’. వ్యక్తులు గనక ప్రభుత్వానికి, ఆర్బీఐకి చెప్పి.. దాని ప్రకారం ఇన్వెస్ట్ చేసి ఉంటే పెద్ద ఇబ్బందులుండవు. కానీ వీరెవరికీ విదేశాల్లోని తమ ఆస్తుల గురించి చెప్పకుండా ఉంటే మాత్రం... మనీలాండరింగ్, ఫెమా వంటి రకరకాల కేసులు వర్తిస్తాయి. ► విదేశాల్లో సంపాదించిన డబ్బును కూడా భారతీయులు అధికారులకు తెలియజేయాలి. వాటిని గనక ఫోన్సెకా ద్వారా అక్కడే వివిధ కంపెనీల్లో దాచి ఉంటే... పన్నులు ఎగవేసినట్టే. వారిని ప్రాసిక్యూట్ చేసే అవకాశముంటుంది. అందుకని మున్ముందు బయటపడాల్సిన అంశం ఇదే. ఇదో చిత్రమైన మెయిల్ ఫోన్సెకా కంపెనీ అధికారి నుంచి అమెరికా బిలియనీర్కు అందిన ఈ-మెయిల్ను ఐసీఐజే బయటపెట్టింది. దీన్లో... బ్యాంకును ఎలా మోసగిస్తారో సమగ్రంగా వివరించారు. ఖాతాదారుడికి బదులు వేరే వ్యక్తుల్ని బ్యాంకులకు పరిచయం చేస్తామని... అందువల్ల అసలు వ్యక్తి పేరు బయటకు రాదని, ఫీజు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని ఈ-మెయిల్లో పేర్కొన్నారు. నిజానికి ఈ కంపెనీ క్లయింట్కు కావాల్సిన సేవల్ని బట్టి ఫీజులు వసూలు చేస్తోంది. ఫొన్సెకాలో కంపెనీ తెరిచేందుకు కావాల్సిన పత్రాలు 1. పాస్పోర్ట్ ఫొటోకాపీ 2. బ్యాంకు రిఫరెన్స్ ఉత్తరం 3. ఫ్రొఫెషనల్ రిఫరెన్స్ ఉత్తరం 4. ఏదైనా నెలవారీ వినియోగదారుల స్టేట్మెంట్ దర్యాప్తు బృందం ఏర్పాటు భారత్కు చెందిన 500 మంది విదేశాల్లో సొమ్ము దాచుకున్నట్లు పనామా పేపర్స్ ద్వారా వె ల్లడి కావడంతో దీనిపై కేంద్రం స్పందించింది. ఇందులో వెలుగుచూసిన అంశాలను పరిశీలించి దర్యాప్తు చేసేందుకు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ మంగళవారం వెల్లడించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ తనతో చర్చించారని, ఆయన సూచన మేరకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సీబీడీటీ, ఆర్బీఐ, ఎఫ్ఐయూ(ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్) విభాగాల ఉన్నతాధికారులతో ఈ బృందం ఏర్పాటైంది. ఈ వివరాల ఆధారంగా తాము కూడా దర్యాప్తు చేపడతామని నల్లధనంపై ఏర్పాటైన సిట్ వెల్లడించింది. మా దేశంపై దాడి: మొసాక్ ఫోన్సెకా తమ సంస్థకు చెందిన రహస్య పత్రాలను వెల్లడించడంపై పనామాలోని మొసాక్ ఫొన్సెకా మండిపడింది. ‘‘ఇది నేరం. మోసం. మా దేశంపై దాడి. మా దేశం అనేక కంపెనీలను ఆకర్షించడం జీర్ణించుకోలేని కొన్ని దేశాలు కుట్రతో ఇదంతా చేశాయి’’ అని ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు రామన్ ఫొన్సెకా అన్నారు. హ్యాకింగ్ చేసి అక్రమంగా డాక్యుమెంట్లు సంపాదించారని ఆరోపించారు. లీకైన పత్రాల్లో చాలావరకు నిజమైనవేనన్నారు. 40 ఏళ్ల నుంచి కంపెనీ నడుపుతున్నామని, ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. బ్యాంకుల్ని మోసగించడానికి ఎలాంటి సేవలు అందించలేదని తెలిపారు. మన దేశంలో ఎవరెవరు? ఐశ్వర్యారాయ్ ఐశ్వర్యారాయ్, ఆమె తల్లిదండ్రులు బృందా కృష్ణరాజ్ రాయ్, కృష్ణరాజ్, సోదరుడు ఆదిత్య రాయ్ డెరైక్టర్లుగా 2005లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లోని ఓ కంపెనీ ఏర్పాటైంది. దాని పేరు ఆమిక్ పార్టనర్స్ లిమిటెడ్. 2008లో ఆ కంపెనీ మూతపడే వరకు ఐశ్వర్యారాయ్ ఆ కంపెనీ షేర్హోల్డర్గా ఉన్నారు అమితాబ్ బచ్చన్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్తోపాటు బహమాస్లో 1993లో ఏర్పాటు చేసిన నాలుగు షిప్పింగ్ కంపెనీలకు డెరైక్టర్గా పనిచేశారు. ఈ కంపెనీల ద్వారా మిలియన్ డాలర్ల వ్యాపారం చేశారు. కేపీ సింగ్ ప్రముఖ భవన నిర్మాణాల సంస్థ డీఎల్ఎఫ్ ప్రమోటర్ ఈయన. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో 2010లో నమోదైన ఓ కంపెనీని తన భార్య ఇందిరాసింగ్తో కలిసి కొనుగోలు చేశారు. ఈయన తనయుడు రాజీవ్సింగ్, కూతురు పియాసింగ్ పేరిట 2012లో మరో రెండు కంపెనీలు నెలకొల్పారు. వీటి విలువ సుమారు కోటి డాలర్లు ఉంటుందని అంచనా. గర్వారే కుటుంబం వ్యాపార దిగ్గజం గర్వారే కుటుంబానికి చెందిన అశోక్, ఆయన కుమారుడు ఆదిత్య, భార్య సుష్మ గర్వారేలకు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లో ఏర్పాటైన రాండార్ ఓవర్సీస్ సహా పలు విదేశీ సంస్థల్లో వాటాలున్నాయి. 1996 మేలో రాండార్ ఏర్పాటైంది. ఆదిత్య, సుష్మలకు పలు పనామా సంస్థల్లో పవర్ ఆఫ్ అటార్నీలున్నాయి. 10,000 డాలర్ల ఆస్తులతో గర్వారేలు 2010లో ఫుజియామా టీమ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇంకా పలు పనామా సంస్థల్లో ఆదిత్య, సుష్మలకు పవర్ ఆఫ్ అటార్నీలు ఉన్నాయి. వీటిలో చాలా మటుకు సంస్థలు 2014లో మూతపడ్డాయి. విదేశీ మిత్రులతో కలిసి ఏర్పాటు చేసిన కొన్ని సంస్థల ప్రధానోద్దేశం భారత్లో పెట్టుబడులు పెట్టడమేనని, అది నెరవేరకపోవడంతో చాలా మటుకు సంస్థలు మూతబడ్డాయని, వీటితో గర్వారే కుటుంబసభ్యులకు ఎటువంటి ప్రమేయమూ లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇండియా బుల్స్ దేశీ రియల్టీ దిగ్గజాల్లో ఒకైటె న ఈ సంస్థ సమీర్ గెహ్లాట్, ఆయన సోదరుడు నాగేంద్ర, తండ్రి బల్వాన్ సింగ్ల సారథ్యంలో ఉంది. 2012లో కుటుంబ ఆస్తుల నిర్వహణ కోసం ఎస్జీ ఫ్యామిలీ ట్రస్ట్ ఏర్పాటైంది. దీనికి పర్పెచ్యువల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ సంస్థ ట్రస్టీగా ఉంది. ఎస్జీ ట్రస్టు ఆధ్వర్యంలోని క్యాలేయిస్ ఇన్ఫ్రాకు క్లైవ్డేల్ ఓవర్సీస్ అనే అనుబంధ సంస్థ ఉంది. ఈ క్లైవ్డేల్కు బహమాస్, మారిషస్, బ్రిటన్ దేశాల్లో పలు అనుబంధ సంస్థలున్నాయి. ఈ సంస్థల్లో చాలా వాటి గురించి నియంత్రణ సంస్థలకు ట్రస్ట్ వెల్లడించినప్పటికీ.. బ్రిటన్ లావాదేవీల గురించి మాత్రం వెల్లడించలేదు. క్లైవ్డైల్కు లండన్లో మూడు ప్రాపర్టీలున్నాయి. వీటిలో విలాసవంతమైన అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతోంది. శిశిర్ కె బజోరియా ఆరు దేశాల్లో ఉక్కు రిఫ్రాక్టరీ యూనిట్లున్న ఎస్కే బజోరియా గ్రూప్ ప్రమోటరు. ఈయన కోల్కతాకి చెందిన పాత తరం వ్యాపార కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)కి చెందిన హాప్టిక్ (బీవీఐ) సంస్థ యజమానిగా ఫస్ట్ నేమ్స్ గ్రూప్, బజోరియా పేర్లున్నాయి. దీని ఆస్తులు మిలియన్ డాలర్ల పైగా ఉన్నాయి. తమ కుటుంబం ఫస్ట్ నేమ్స్ గ్రూప్కి క్లయింట్లు మాత్రమేనని, హాప్టిక్తో ఎటువంటి సంబంధం లేదని శిశిర్ ప్రకటించారు. ఓంకార్ కన్వర్ టైర్ల తయారీలో ఉన్న అపోలో గ్రూప్ చైర్మన్. కన్వర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు బీవీఐలో జేఅండ్ఎస్ సిస్టమ్స్ కార్పొరేషన్ను, రెండు ట్రస్టులను ఏర్పాటు చేశారు. జేఅండ్ఎస్కు మెర్కామ్ ఆయిల్ శాండ్స్లో మిలియన్ షేర్లతో పాటు బార్క్లేస్ బ్యాంక్, కేమాన్ నేషనల్ బ్యాంక్ అండ్ ట్రస్ట్ కంపెనీలో ఖాతాలు ఉన్నాయి. 2014 నవంబర్ 30 నాటికి కేమాన్ ఖాతాలో 3,65,478 పౌండ్ల బ్యాలెన్స్ ఉంది. కన్వర్ కుటుంబం భారత చట్టాలకు అనుగుణంగానే విదేశీ పెట్టుబడులు పెట్టిందని అపోలో టైర్స్ వివరణ ఇచ్చింది. హరీశ్ సాల్వే ప్రముఖ లాయరు. 1999-2002 మధ్య సొలిసిటర్ జనరల్గా కూడా వ్యవహరించారు. సాల్వే కుటుంబం బీవీఐలో క్రెస్ట్బ్రైట్, పెబుష్ గ్రూప్, ఎడెన్వాల్ సంస్థలను ఏర్పాటు చేసింది. బ్రిటన్లో తన పెట్టుబడుల నిర్వహణ కోసం చట్టబద్ధంగా 2012లో క్రెస్ట్బ్రైట్ను ఏర్పాటు చేసినట్లు, ప్రస్తుతం ఏ కంపెనీకి ఆస్తులు, ఆదాయం లేవని సాల్వే పేర్కొన్నారు. జహంగీర్ ఎస్ సొరాబ్జీ మాజీ టార్నీ జనరల్ సోలి సొరాబ్జీ తనయుడు, బోంబే హాస్పిటల్లో గౌరవ కన్సల్టెంటు. బీవీఐలో 2010 నవంబర్లో ఏర్పాటైన మూన్గ్లో ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్లో ఏకైక షేర్హోల్డరు. ఆర్బీఐ స్కీము ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్మెంటు కోసం పంపిన నిధులను కంపెనీ అందుకుందని, తన ఐటీ రిటర్నుల్లో కూడా వివరాలన్నీ పొందుపర్చడం జరిగిందని జహంగీర్ తెలిపారు. మోహన్లాల్ లోహియా ఇండో రమా సింథటిక్స్ గౌరవ చైర్మన్. 2007లో బీవీఐలో రిజిస్టరయిన వెంటన్ గ్రూప్కు ఫస్ట్ డెరైక్టర్ కూడా. సహజసిద్ధంగా ఇది మూతబడేలా వదిలేయాలని 2012లో ఫోన్సెకాకు ఈమెయిల్ ద్వారా సందేశం పంపారు. 2010లో లోహియా చారిటబుల్ ఫౌండేషన్ను 10,000 డాలర్ల కార్పస్తో ఏర్పాటు చేశారు. జవారే పూనావాలా కోటీశ్వరుడు సైరస్ పూనావాలా సోదరుడైన జవారే.. రాయల్ వెస్టర్న్ ఇండియా టర్ఫ్ క్లబ్ మేనేజింగ్ కమిటీకి సారథి. రియల్టీ, ఆతిథ్య తదితర రంగాలకు చెందిన నాలుగు సంస్థల బోర్డుల్లో ఉన్నారు. 2013లో బీవీఐలో ఏర్పాటైన స్టాలాస్ట్లో జవారే, ఆయన భార్య బెహ్రోజ్, ఇద్దరు కుమార్తెలు డెరైక్టర్లుగా ఉన్నారు. ఇందిరా శివశైలం, మల్లికా శ్రీనివాసన్ అమాల్గమేషన్స్ గ్రూప్ చైర్మన్ అనంతరామకృష్ణన్ శివశైలం సతీమణి అయిన ఇందిర 2008లో కన్ను మూశారు. ప్రస్తుతం టాఫే చైర్మన్గా ఉన్న మల్లికా శ్రీనివాసన్ ఈమె కుమార్తె. 1999లో బీవీఐలో ఏర్పాటైన స్టాన్బ్రిడ్జ్ కంపెనీ షేర్హోల్డరుగా ఇందిర పేరుంది. తర్వాత ఆ వాటాలు కుమార్తెలకు అందాయి. స్టాన్బ్రిడ్జ్కి తనకు ఎటువంటి సంబంధం లేదని మల్లికా శ్రీనివాసన్ వివరణిచ్చారు. అబ్దుల్ రషీద్ మీర్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎక్స్పొజిషన్ (సీఐఈ) వ్యవస్థాపకుడు, సీఈవో. పనామాలో 2002లో మాండేల్ ఎస్ఏను 10,000 డాలర్ల అథీకృత మూలధనంతో ఆయన ప్రారంభించారు. కంపెనీలో వాటాలను మీర్ కుమారుడు ముజీబ్కు దఖలుపర్చడం జరిగింది. ముజీబ్ 2005లో హత్యకు గురికావడంతో రషీద్ మీర్, తబసుమ్ మీర్లు మాండేల్ ఎస్ఏ అదనపు డెరైక్టర్లుగా నియమితులయ్యారు. తబసుమ్ మీర్ 17 భారత కంపెనీల్లో డెరైక్టరుగా ఉన్నారు. ముజీబ్ మరణానంతరం ట్రస్టును మూసివేసి, వచ్చిన వాటిని కుటుంబ సభ్యులకు పంచేయడం జరిగిందని, భారత ప్రభుత్వానికీ వివరాలు సమర్పించామని తబసుమ్ పేర్కొన్నారు. ప్రపంచ నేతల్లో ఎవరెవరంటే.. 50 దేశాల్లోని సుమారు 140 మంది రాజకీయ నేతలు విదేశాల్లో కంపెనీలు పెట్టి పెద్దఎత్తున సొమ్మును పోగేసుకున్నారు. వారిలో 12 మంది ప్రస్తుత, మాజీ దేశాధ్యక్షులతోపాటు ప్రముఖ సినీనటుడు జాకీచాన్ వంటి వారున్నారు. వారిలో ముఖ్యుల వివరాలివీ.. వ్లాదిమిర్ పుతిన్ (రష్యా అధ్యక్షుడు) ఈయన నేరుగా కంపెనీలు ఏర్పాటు చేయకపోయిన తన సన్నిహితుల ద్వారా ఇబ్బడిముబ్బడిగా నెలకొల్పారు. ఇలా అనేక దేశాల్లో ఏర్పాటైన కంపెనీల విలువ 200 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. జిన్పింగ్ (చైనా అధ్యక్షుడు) వర్జిన్ ఐలాండ్స్లో ఈయన బావమర్ది పేరిట 2 కంపెనీల్లో పెద్దఎత్తున షేర్లున్నాయి. సిగ్మున్దుర్ డేవిడ్ గన్లాగ్సన్ (ఐస్ల్యాండ్ ప్రధాని) విదేశాల్లో భార్య పేరిట అనేక కంపెనీలు ఏర్పాటు చేశారు. పెట్టుబడుల కోసం అందులో పెద్దఎత్తున సొమ్ము దాచారు. పీట్రో పొరోషెంకో (ఉక్రెయిన్ అధ్యక్షుడు) విదేశాల్లో పలు కంపెనీల్లో మెజారిటీ వాటాలు కలిగి ఉన్నారు. వీటి విలువ కోట్లలో ఉంటుంది. నవాజ్ షరీఫ్ (పాక్ ప్రధాని) తన కుటుంబీకుల పేరిట బ్రిటన్లో పలు కంపెనీలు, ఆస్తులున్నాయి డేవిడ్ కామెరూన్ (బ్రిటన్ ప్రధాని) కామెరాన్ తండ్రి పనామాలో ఓ కంపెనీ ఏర్పాటు చేశారు. పన్నులు ఎగ్గొటేందుకు అనేక మార్గాలు చూపిచండం ఈ కంపెనీ ప్రత్యేకత. మాక్రి (అర్జెంటీనా అధ్యక్షుడు) ఈయన తండ్రి, సోదరుడు విదేశాల్లో అనేక కంపెనీలు నడుపుతున్నారు -
చట్ట ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ మెంట్స్
స్పష్టం చేసిన ‘పనామా పేపర్స్’ కంపెనీలు న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ చట్టాల ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని ‘పనామా పేపర్స్’లో పేర్లున్న కార్పొరేట్ కంపెనీలు స్పష్టం చేశాయి. పన్నులు ఎగ్గొట్టి విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్నామని తమపై వచ్చిన వార్తలు సరికాదని డీఎల్ఎఫ్, అపోలో టైర్స్, ఇండియాబుల్స్ సంస్థలు స్పష్టం చేశాయి. ఆర్బీఐ పరిమితికి లోబడే ఇన్వెస్ట్మెంట్స్... ఆర్బీఐ, ఫెమా, ఆదాయపు పన్ను శాఖ నియమ నిబంధనల ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని డీఎల్ఎఫ్ సీఈఓ రాజీవ్ తల్వార్ చెప్పారు. డీఎల్ఎఫ్ ప్రమోటర్ కుటుంబం బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో కొన్ని కంపెనీలు ఏర్పాటు చేశాయని, కోటి డాలర్ల వరకూ నల్లధనాన్ని పోగేసుకున్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. 2004లో ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని, బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో తమ ప్రమోటర్ గ్రూప్లు ఒక్క కంపెనీని కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. వివరాలన్నీ ప్రతి ఏటా ఆదాయపు పన్ను విభాగానికి నివేదిస్తునే ఉన్నామని, డీఎల్ఎఫ్ వార్షిక నివేదికలోనూ పొందుపరుస్తామని వివరించారు. అంతా నిబంధనల ప్రకారమే... విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించే చట్టాల ప్రకారమే అపోలో టైర్స్ గ్రూప్ చైర్మన్ ఓంకార్ కన్వర్, ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశారని అపోలో గ్రూప్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని వివరించారు. అపోలో గ్రూప్ చైర్మన్ కుటుంబ సభ్యులు చాలా మంది ఎన్నారైలని, ఇతర దేశాల చట్టాల ప్రకారమే వారు పెట్టుబడులు పెట్టారని వివరించారు. భారత దేశ ఆదాయపు పన్ను చట్టం, ఆర్బీఐ నియమనిబంధనలు, ఆంక్షలు వారికి వర్తించవని స్పష్టం చేశారు. భారత్లో పూర్తిగా పన్నులు చెల్లించిన తర్వాతనే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని ముంబైకి చెందిన ఇండియాబుల్స్ సంస్థలకు చెందిన సమీర్ గెహ్లాట్ పేర్కొన్నారు. -
అది పూర్తిగా అబద్ధం: ఐశ్వర్యరాయ్
ముంబై: విదేశాల్లో తనకు ఎటువంటి అక్రమ ఆస్తులు లేవని బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేర్కొన్నారు. పనామాలో తాను నల్లధనం దాచినట్టు వచ్చిన వార్తలను ఆమె తోసిపుచ్చారు. బయటకు లీకైన పనామా పత్రాల్లో ఉన్నట్టు చెబుతున్న సమాచారం అసత్యం, అబద్దమని ఐశ్వర్యరాయ్ మీడియా సలహారుదారు పేర్కొన్నారు. పన్ను ఎగ్గొటి తమ నల్లడబ్బును దాచుకునేందుకు విదేశాల్లో బూటకపు కంపెనీలు, ఫౌండేషన్లు, ట్రస్టులు ఏర్పాటు చేసినవారిలో 500 మంది భారతీయుల పేర్లు ఉండడంతో సంచలనం రేగింది. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ సహా పలువురు ప్రముఖులు పేర్లు ఉన్నట్టు 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' వెల్లడించింది. దీనిపై అమితాబ్ బచ్చన్ ఇంకా స్పందించలేదు. -
అమితాబ్ టు ఐశ్వర్య.. నల్లడబ్బు గుట్టురట్టు!
జెనీవాలోని హెచ్ఎస్బీసీలో 1100 మంది భారతీయులకు రహస్య ఖాతాలు ఉన్నట్టు గత ఏడాది లీకైన స్వీస్ పత్రాలు వెల్లడించి, సంచలనం సృష్టించగా తాజాగా వెల్లడైన పనామా పత్రాలు పెనుదుమారం రేపుతున్నాయి. దాదాపు 500 మంది భారతీయుల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నాయి. వారు పన్ను ఎగ్గొటి తమ నల్లడబ్బును దాచుకునేందుకు విదేశాల్లో బూటకపు కంపెనీలు, ఫౌండేషన్లు, ట్రస్టులు ఏర్పాటుచేసినట్టు వెల్లడైంది. నల్లడబ్బుకు స్వర్గధామమైన పనామాలోని మొసాక్ ఫొన్సెకాకు చెందిన కోటి11 లక్షల పత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విదేశీ కంపెనీలు ఏర్పాటు చేయడంలో దిట్టగా పేరొందిన ఈ లా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. నల్లడబ్బు సర్గధామలైన దేశాల్లో కంపెనీలు స్థాపించి.. తద్వారా పన్ను ఎగ్గొట్టేందుకు ఈ కంపెనీకి పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు డబ్బు చెల్లించినట్టు ఈ పత్రాల్లో వెల్లడైంది. ఇందులో 500 మంది భారతీయుల పేర్లు ఉండగా, 234 మంది భారతీయులు ఈ కంపెనీల ఏర్పాటు కోసం తమ పాస్పోర్టులను కూడా సమర్పించినట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఈ పత్రాలను పరిశీలించి వెల్లడించింది. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఐశ్యర్యరాయ్ తోపాటు, డీఎల్ఎఫ్ ప్రమోటర్ కేపీ సింగ్, ఇండియా బుల్స్ యజమాని సమీర్ గుప్తా, ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ పెద్ద సోదరుడు వినోద్ అదానీ, పశ్చిమ బెంగాల్ రాజకీయ నేత శిశిర్ బజోరా, ఢిల్లీ లోక్సత్తా చీఫ్ అనురాగ్ కేజ్రీవాల్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉండటం కలకలం రేపుతోంది. అలాగే ముంబై గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చితోపాటు పంచుకులా, డెహ్రాడూన్, వడోదర, మంద్సౌర్కు చెందిన పలువురు పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఐశ్వర్యరాయ్.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లోని కంపెనీ ఐశ్యర్య రాయ్, ఆమె తండ్రి రమణరాజ్ కృష్ణరాయ్, తల్లి విందాకృష్ణ రాజ్ రాయ్, సోదరుడు ఆదిత్య రాయ్ డైరెక్టర్లుగా 2005లో ఎమిక్ పార్టనర్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది. మొదట ఈ కంపెనీకి ఐశ్యర్య డైరెక్టర్గా ఉండగా, తర్వాత షేర్ హోల్డర్గా మారిపోయారు. 2008లో ఈ కంపెనీ రద్దయింది. అమితాబ్.. బహమస్ కంపెనీలు కనీసం విదేశీ నాలుగు షిప్పింగ్ కంపెనీల్లో అమితాబ్ బచ్చన్ డైరెక్టర్గా ఉన్నట్టు ఈ పత్రాలు వెల్లడించాయి. ఇందులో ఒకటి బీవీఐలో ఉండగా, మరో మూడు బహమస్లో ఉన్నట్టు తేలింది. 1993లో స్థాపించిన ఈ కంపెనీల మూలధనం కేవలం 5వేల నుంచి 50వేల డాలర్లు కాగా, ఇవి చేసే ఓడల వ్యాపారం కోట్ల డాలర్లలో ఉండేది.