pictures
-
'కాంచన 3' నటి సీమంతం ఫంక్షన్ (ఫోటోలు)
-
Valentine's Day Special: టాలీవుడ్ బ్యూటిఫుల్ జోడీ రామ్చరణ్- ఉపాసన (ఫోటోలు)
-
కుమారుడితో కలిసి నటి పూర్ణ సందడి (ఫోటోలు)
-
వైట్ డ్రెస్ లో కియారా అద్వానీ.. కళ్లు చెదిరిపోయే క్లిక్స్
-
సంధ్యావేళ.. మహా కుంభమేళా
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. శనివారం మహాకుంభ్లో 42 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. ఇప్పటివరకు 7 కోట్ల 72 లక్షల మంది మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు.ఈ నేపధ్యంలో మహాకుంభ్ నగరానికి చెందిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఈ చిత్రాలలో వేదికలు, టెంట్లు, అద్భుతమైన లైట్లు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు చూపుతిప్పుకోలేనివిగా ఉన్నాయి.ఈ మహాకుంభ్ నగర దృశ్యాలు డ్రోన్ సాయంతో తీసినవి. కుంభ్ ప్రాంతంలో మిరిమిట్లుగొలిపే రంగురంగుల లైట్లు కూడా కనిపిస్తున్నాయి. దీనిలో సంగమం దగ్గరున్న అందమైన చెట్లు కూడా కనిపిస్తున్నాయి.మహా కుంభమేళా సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఏర్పాట్లను ఈ చిత్రాలలో వీక్షించవచ్చు. మహాకుంభ నగరం వెలుగుజిలుగుల మధ్య ఎంతో అందంగా కనిపిస్తోంది.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఎక్స్ హ్యాండిల్లో మహాకుంభ్ నగరపు అందమైన చిత్రాలను షేర్ చేశారు. ఈ దృశ్యాలను చూడటం ఆనందంగా ఉన్నదన్నారు.మహా కుంభమేళా సందర్భంగా శనివారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఎంపీ సుధాంశు త్రివేది కూడా పుణ్యస్నానం ఆచరించారు. సంగమంలో స్నానం చేసిన రక్షణ మంత్రి అనంతరం అక్షయవత్, పాతాళపురి, బడే హనుమాన్ ఆలయాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.జనవరి 22న మహా కుంభమేళాపై సమీక్షించేందుకు యూపీ మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు త్రివేణి సంగమంలో స్నానం చేయనున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయంతో.. -
అహో.. మైమరిపిస్తున్న మంచు అందాలు (ఫొటోలు)
-
కాశీలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న రాశీఖన్నా (ఫొటోలు)
-
‘ఇటాలియన్ మాఫియా’ : ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట (ఫొటోలు)
-
‘‘అందమైన లోకమని.. రంగు రంగులుంటాయని...’’ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
హైదరాబాద్ నగరంలో ఆకర్షణగా కళాత్మక చిత్రాలు
-
#Maldives : బుల్లి దేశం.. మంత్రముగ్ధం.. మాల్దీవులు (ఫొటోలు)
-
Karthika Nair-Rohit Menon: ఒంటి నిండా బంగారం.. వావ్ అనిపించేలా కార్తీక లుక్స్ (ఫోటోలు)
-
మోకా.. ‘చిరు’ చిత్రాలు కేక!
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): విశాఖపట్నానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్కుమార్ తీర్చిదిద్ధిన చిరుధాన్యాల చిత్రాలు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రధానుల సతీమణులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో భాగంగా ప్రగతి మైదానంలో భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించారు. మోకా విజయ్కుమార్ చిరుధాన్యాలతో తీర్చిదిద్ధిన భారతీయ రైతుల చిత్రాలు, వినాయకుడి ప్రతిమను ఉంచారు. ఆయన రెండు అడుగుల ఎత్తుతో తయారు చేసిన గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గణపతి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ ప్రారంభ ప్రదేశంలోనే ప్రదర్శనకు ఉంచడం విశేషం. విజయ్కుమార్ మిల్లెట్స్తో తయారు చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రపటాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా ఆమెకు ప్రదానం చేశారు. భారతీయ రైతుల కష్టాన్ని ప్రతిబింబిస్తూ మిల్లెట్స్పై ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా తాను ఈ చిత్రాలను తయారు చేసినట్లు విజయ్కుమార్ తెలిపారు. గతంలో విశాఖపట్నం, హైదరాబాద్లలో జరిగిన జీ–20 సదస్సుల్లో కూడా తన చిత్రాలను ప్రదర్శించినట్లు చెప్పారు. -
ప్లాంట్ మాన్ ప్రయోగం
‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి హారర్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు పన్నా రాయల్ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ప్లాంట్ మాన్’. డీఎం యూనివర్సల్ స్టూడియోస్ స్థాపించి కె. సంతోష్బాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు . పన్నా రాయల్. ‘‘సైంటిఫిక్ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఒక కొత్త తరహా ప్రయోగంతో పూర్తి వినోద ప్రధానంగా రూ΄పొందించాం’’ అన్నారు పన్నా రాయల్. ఇక ప్రస్తుతం పన్నా రాయల్ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ఇంటి నెం.13’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్లాంట్ మాన్ పొస్టర్ -
4 వేల ఏళ్ల నాటి ఎద్దు చిత్రం
సాక్షి, హైదరాబాద్/అడ్డాకుల: దాదాపు నాలుగు వందల అడుగుల ఎత్తులోని ఓ గుట్ట చిటారు గుండుపై రాయితో చెక్కిన ఎద్దు బొమ్మ ఇది. 4 వేల ఏళ్ల క్రితంనాటి చిత్రమిది. మహబూబ్నగర్కు చేరువలో ఉన్న మూసాపేట శివారులోని రామస్వామి గుట్టపైనున్న ఈ బొమ్మను ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. స్థానిక రామలింగేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి మాస్టర్ప్లాన్ తయారు చేసే పనిలో భాగంగా ఆదివారం ఆయన స్థానికులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న 400 అడుగుల ఎత్తున్న గుట్ట పైభాగానికి చేరుకోగా, అక్కడున్న గుండుపై ఈ చిత్రం కనిపించింది. 10 సెం.మీ. పొడవు, 8 సెం.మీ.ఎత్తుతో ఉన్న ఈ బొమ్మ దిగువన మరికొన్ని జంతువులు, మనుషుల చిత్రాలు కూడా ఉన్నాయి. వాతావరణ ప్రభావానికి గురై అవి కొంతమేర మసకబారిపోయాయని ఆయన తెలిపారు. గుట్టపై నాటి మానవుల్లో ఓ సమూహం నివాసంగా ఉండి ఉంటుందని, ఆ క్రమంలోనే నిత్యం కలిసి ఉండే పశువులను చూసి ఈ చిత్రాలు చిత్రించి ఉంటారని పేర్కొన్నారు. -
ఛాయా చిత్రాలు తీసిన ల్యాండర్లోని కెమెరా
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ చంద్రుడికి మరింత చేరువయ్యే సమయంలో ల్యాండర్ మాడ్యూల్లో అమర్చిన ‘‘ల్యాండర్ హారిజెంటల్ వెలాసిటీ కెమెరా’’(ఎల్హెచ్వీసీ) రెండు ఛాయా చిత్రాలను తీసి పంపింది. వాటిని ఇస్రో తన వెబ్సైట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈనెల 6న ఎల్హెచ్వీసీ ఇనుస్ట్రుమెంట్ చంద్రుడ్ని తీసిన వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా లూనార్ కక్ష్యలో నుంచి చంద్రుడ్ని వీడియోతో పాటు ఛాయా చిత్రాలు తీయడం విశేషం. ప్రయోగం రోజున అంటే గత నెల 14న ‘‘ల్యాండర్ ఇమేజర్ కెమెరా’’భూమిని తీసిన ఛాయాచిత్రాలను కూడా గురువారం విడుదల చేసింది. చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాల కంటే చంద్రయాన్–3 మిషన్లో అత్యంత హై రిజల్యూషన్ కెమెరాలను అమర్చినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు చాయా చిత్రాలతో పాటుగా 14 సెకన్లపాటు తీసిన వీడియో కూడా ఎంతో స్పష్టతతో కూడి ఉండడం విశేషం. మరో 13 రోజుల్లో చంద్రయాన్–3 మిషన్ చంద్రుడి ఉపరితలంపై దిగడంతో ప్రయాణం పూర్తవుతుంది. -
దేశంలో నెంబర్ 1 .. మద్రాస్ IIT ఎలా ఉంటుందో తెలుసా? (ఫొటోలు)
-
అయ్యో.. క్రికెట్ లెజెండ్స్ ఇలా మారిపోయారా?
-
డిఫరెంట్ లుక్స్లో టాప్ లీడర్స్: దిమ్మదిరిగే ఫోటోలు
-
మిల్లెట్స్తో మెరిసిన చిత్రాలు
విశాఖ (ఏయూ క్యాంపస్): గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పలువురి పారిశ్రామిక దిగ్గజాల ఛాయాచిత్రాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవన్నీ చిరుధాన్యాలతో తీర్చిదిద్దినవి కావడమే ఇక్కడ విశేషం. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలపై ప్రజల్లో ఆసక్తి, అవగాహన పెంచేందుకు విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్కుమార్ విభిన్నంగా ఛాయాచిత్రాలను రూపొందించారు. భారతీయ రైల్వేలో టెక్నీషియన్–1గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన చిరుధాన్యాలతో దేశం గర్వించే నాయకులు, దిగ్గజ పారిశ్రామికవేత్తల చిత్రాలను తయారు చేశారు. జీఐఎస్, జీ–20 సదస్సులలో ప్రదర్శించడంతో పాటు ప్రముఖులకు, పారిశ్రామిక దిగ్గజాలకు వాటిని బహూకరించే విధంగా నెలల పాటు శ్రమించారు. జొన్నలు, గంట్లు, అరికలు, రాగులు, నల్ల నువ్వులు వంటి వాటితో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు బిర్లా, అంబానీ, అదానీ, ఆనంద్ మహీంద్రా తదితరుల చిత్రాలను రూపొందించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్ గొలగాని హరి వెంకటకుమారిలకు గురువారం ఈ చిత్రాలను విజయ్కుమార్ చూపించారు. జీఐఎస్కు విచ్చేసే అతిథులు, ప్రముఖులకు వీటిని బహూకరించాలని కోరారు. వీటిని పరిశీలించిన మంత్రి అమర్నాథ్ చిత్రకారుడు విజయ్కుమార్ను అభినందించారు. వీటిని శుక్రవారం జరిగే సమ్మిట్లో హాజరయ్యే పారిశ్రామికవేత్తలకు బహూకరిస్తామని చెప్పారు. -
షావోమి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఫోటోలు లీక్, లుక్ మాములుగా లేవుగా!
సాక్షి,ముంబై: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షావోమీ తొలి ఎలక్ట్రిక్ కారుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్లోబల్గా అరంగేంట్రం చేయనున్న ఈ ఈవీకి సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. చైనాలో ఈవీ మార్కెట్ చాలా పోటీ ఉంది. దీంతో షావోమీ కారుకు మరింత ప్రాధాన్యతను సంతరించు కుంది. షావోమీ ఎంఎస్11 సెడాన్ పేరుతో తీసుకొస్తున్న సెడాన్ డిజైన్, లుక్ ఆకర్షణీయంగా మారింది. ఇది పోర్షే టైకాన్తో పోలి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రముఖ చైనీస్ ఆటో మొబైల్ సంస్థ బీవైడీకి చెందిన సియెల్ ఎలక్ట్రిక్ సెడాన్ తరహాలో షావోమి ఈవీ డిజైన్ ఉండనుందని అంచనా. అంతేకాదు కారు ముందు భాగంలో LiDAR సెన్సార్ ఆధారంగా ఇది అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యాలతో వస్తోందని కూడా భావిస్తున్నారు. షావోమీ 4 డోర్ ఎంఎస్11 చాలా ఆకర్షణీయమైన సెడాన్ అని సోషల్ మీడియా ప్రశంసిస్తోంది. స్పోర్టీగా కనిపించే 4-డోర్ల ఎలక్ట్రిక్ వాహనంలో విండ్షీల్డ్ పెద్దగా ఉండి, పైకప్పు మొత్తం ఒక సింగిల్ పేన్ గ్లాస్తో టెస్లా మోడల్లలో కని పిస్తుందని అంచనా వేస్తున్నారు. అల్లాయ్ వీల్స్ అమర్చింది. ఈ వీల్స్ మధ్యలో "షావోమీ’’ బ్రాండ్ లోగో కనిపిస్తోంది. తుదిమెరుగులు దిద్దుకున్న షావోమీ ఈవీ టెస్టింగ్ను కూడా చైనా రోడ్లపై ఇప్పటికే నిర్వహించిందట. రూ. 1.2కోట్ల ఫైన్..! అయితే తొలి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఫోటోలు ఆన్లైన్ లీక్ కావడంపై షావోమీ సీరియస్గా స్పందించింది. బీజింగ్కు చెందిన మోల్డింగ్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ అనే వెండర్ ద్వారా ఈ ఫొటోలు లీక్ అయినట్టు గుర్తించారు. ఈ లీక్ను ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని సీఈఓ లీ జున్ మండిపడ్డారు. అలాగే సెక్యూరిటీ బ్రీచ్కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించారు. సంస్థపై 1 మిలియన్ యువాన్ల ( దాదాపు. రూ.1.22కోట్లు) జరిమానా విధించనుందట షావోమీ. -
కుర్రకారును ఉర్రూతలూగిస్తోన్న పూజాహెగ్డే (ఫొటోలు)
-
మునుగోడులో నేతల సిత్రాలు..
-
షాకింగ్ ఘటన: మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలు... సీరియస్ అయిన మంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో చక్దేపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది విద్యార్థినులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్థానిక మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్డను శుభ్రం చేయమని బలవంతం చేశారంటూ వార్తలు గుప్పుమన్నాయి. వారంతా ఐదు, ఆరు తరగతులు చదువుతున్న విద్యార్థినులంటూ పలు కథనలు వచ్చాయి. ఐతే ఆ వార్తన్నింటిని జిల్లా విధ్యాధికారి సోనమ్ జైన్ ఖండించారు. విచారణలో ఆ బాలికలు తాము మరుగుదొడ్లు శుభ్రం చేయలేదని, వర్షాల కారణంగా మరుగుదొడ్లు మురికిగా ఉన్నందున చేతిపంపు నుంచి నీటిని తెచ్చిపోశామని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆ బాలికలు, వారి తల్లిదండ్రుల స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు జైన్ వెల్లడించారు. ఐతే ఈ ఘటనపై సీరియస్ అయిన రాష్ట్ర పంచాయతీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా ఈ విషయంపై గుణ జిల్లా కలెక్టర్ను విచారణ చేయమని ఆదేశించినట్లు సమాచారం. దీంతో పాఠశాల విదయాశాఖ బృదం పాఠశాలకు చేరుకుని ప్రత్యేక విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేగాతు ఈ ఘటనలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సిసోడియా పేర్కొన్నారు. यह तस्वीरें बेहद आपत्तिजनक है… मामाजी की सरकार में स्कूल में भाँजियो से शौचालय साफ़ करवाया जा रहा है.. तस्वीरें गुना ज़िले के बमोरी के चकदेवपुर के प्राथमिक- माध्यमिक स्कूल की है…. “ बेटी पढ़ाओ “ अभियान की हक़ीक़त… pic.twitter.com/UweK7emh8l — Narendra Saluja (@NarendraSaluja) September 22, 2022 (చదవండి: భారీ వర్షాలు..స్కూల్స్ బంద్, ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోం) -
మాజీ ప్రేయసితో ఎలాన్ మస్క్ ఫోటోలు, గిఫ్ట్స్ వేలం: వైరల్
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, ఎలాన్ మస్క్ ఫోటోలు, బహుమతుల వేలం అంశం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. మాజీ ప్రియురాలు జెన్నిఫర్ గ్విన్ పాత బహుమతులను, ఫోటోలను వేలానికిపెట్టింది. జంటగా ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు, కార్డులు, ఇతర దాదాపు 20 అంశాలను అమ్మకానికి పెట్టడం గమనార్హం. RR వేలం వెబ్సైట్లో లిస్ట్ అయిన ఈ వేలం సెప్టెంబర్ 14న ముగియనుంది. ఫోటోలతో పాటు, తన మాజీ ప్రియుడు, బిలియనీర్ మస్క్ సంతకం చేసిన పుట్టినరోజు కార్డును కూడా విక్రయిస్తోంది, 'హ్యాపీ బర్త్ డే బూ-బూ' లవ్ ఎలోన్" అని రాసి కార్డును ఆక్షన్కిపెట్టింది. మస్క్ 20 ఏళ్ల వయసులో జంటగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, మస్క్ సంతకం చేసిన 1 డాలర్ బిల్లుఈ వేలంలో అమ్మకానికి ఉన్నాయి. అలాగే పుట్టిన రోజున గ్విన్కి మస్క్ ఇచ్చిన 14కే గోల్డ్ నెక్లెస్ను కూడా విక్రయిస్తోంది. అలాగే మస్క్ రూంలో స్నేహితులతో కలిసినవి, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ క్యాంపస్ చుట్టూ సరదాగా గడిపిన పిక్స్ కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా 1995లో గ్విన్కి మస్క్ ఇచ్చిన పుట్టినరోజు కార్డు వేలం ఇప్పటికే 1,300 డాలర్లకు చేరుకుంది. దీని అంచనా విలువ 10వేల డాలర్లు. ప్రస్తుతం డాలర్ బిల్పై వేలం జోరుగానే నడుస్తోంది. ఇది 5వేల డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేస్తుందని అంచనా. అయితే సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే మస్క్ ఈ వేలం వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. కాగా గ్విన్ తన సవతి కొడుకు ట్యూషన్ ఫీజు కోసం డబ్బును సేకరించడానికి ఈ వస్తువులను వేలం వేస్తోంది. ప్రస్తుతం ఆమె సౌత్ కరోలినాలో అతనితో కలిసి నివసిస్తోంది. మస్క్ 1994 చివరిలో గ్విన్కి ఈ కార్డుతోపాటు బంగారు హారాన్ని ఇచ్చాడు. మస్క్ , గ్విన్ 1994-1995లో డేటింగ్ చేశారు. -
టీచర్ పాడు బుద్ధి.. విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపించి..
ధర్మారం(ధర్మపురి)జగిత్యాల జిల్లా: ఓ ఉపాధ్యాయుడే విద్యార్థినులకు సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపించిన ఘటన ధర్మారం మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. సదరు టీచర్ ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్డే సందర్భంగా విద్యార్థులకు సెల్ఫోన్లో సైన్స్ ప్రయోగాలు చూపించాడు. అయితే తమకు అశ్లీల చిత్రాలు చూపించాడని పేర్కొంటూ ఇద్దరు విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు తెలిపారు. అప్పటినుంచి పాఠశాలకు సెలవులు రావడంతో ఆ విషయాన్ని మర్చిపోయారు. అయితే సదరు ఉపాధ్యాయుడు గురువారం తొమ్మిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థినికి అశ్లీల చిత్రాలు చూపించాడు. చదవండి: ప్రేయసితో పెళ్లికి భార్య అంగీకరించలేదని.. దీంతో ఆమె ఇంటికెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కోపోద్రిక్తులైన వారు ఫోన్ చేసి, హెచ్ఎంకు ఫిర్యాదు చేశారు. తర్వాత గ్రామస్తులతో కలిసి పాఠశాలకు చేరుకొని, ఆ ఉపాధ్యాయుడిని గదిలో బంధించి, చితకబాదారు. టీచర్ను పోలీసులు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయురాలు డీఈవోకు తెలిపారు. డీఈవో ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడి నిర్వాకంపై ఆమె జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై శ్రీనివాస్ రాత్రి గ్రామానికి వెళ్లి, విచారణ జరిపినట్లు సమాచారం. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
చుక్..చుక్.. చిత్రాలెన్నో ! మారిన రైల్వేస్టేషన్ రూపు రేఖలు
సాక్క్షి, హైదరాబాద్(శేరిలింగంపల్లి): నగర శివారులోనే అతిపెద్దది అయిన లింగంపల్లి రైల్వేస్టేషన్ ఒకప్పుడు కళాహీనంగా ఉండేంది. నిత్యం ప్రయాణికులతో కళగా ఉండే ఈ స్టేషన్ ఇప్పుడు అభివృద్ధికి నోచుకుంది. స్టేషన్లోని గోడలకు వేసిన వివిధ చిత్రాలు వచ్చిపోయే ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. చిత్రం చెప్పే అర్థం.. జంతువులు..పక్షులు..పర్యావరణం..స్వచ్ఛభారత్..ఇలా ఎన్నెన్నో చిత్రాలు కొలువుదీరాయి. రైల్వేస్టేషన్లోని ప్రతి గోడకు రకరకాల జంతువులు, పక్షులతోపాటు రాజుల కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబించేలా ఆకట్టుకుంటున్నాయి. పులి, ఏనుగు, నెమలి, ఇతర పక్షుల చిత్రాలు అలరిస్తున్నాయి. గ్రామీణ వాతావరణంతోపాటు జలపాతాలు, పడవలు, సూర్యుడు ఉదయించే దృశ్యాలు ఇలా ఎన్నో చిత్రాలు ప్రయాణికుల హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. శివారులోనే అతిపెద్దది నగర శివారులోనే అతిపెద్ద రైల్వేస్టేషన్గా లింగంపల్లి స్టేషన్కు గుర్తింపు ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు ఇక్కడి నుంచే సాగుతాయి. పలు కొత్త రైళ్లు కూడా ఇక్కడి నుంచే ఆరంభించాలనే ఆలోచన కూడా ఉంది. ఎంఎంటీఎస్ ఇక్కడి నుంచే... ఎంఎంటీఎస్ రైళ్లను నగరంలోని నాంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాలకు ఇక్కడి నుంచే బయలుదేరతాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐటీ కారిడార్కు కేంద్రంగా ఈ ప్రాంతం మారడంతో రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. పలు ఐటీ సంస్థలు తమ సంస్థ ఉద్యోగుల కోసం లింగంపల్లి రైల్వేస్టేషన్కు ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాలు సైతం నడుపుతున్నాయి. నగర శివారులోనే అతిపెద్ద రైల్వేస్టేషన్గా లింగంపల్లి స్టేషన్ అభివృద్ధికి నోచుకుంది -
చిత్రం.. ఇది బొట్టో గీసిన విచిత్రం
చూడగానే వావ్..అనిపిస్తున్న ఈ వర్ణరంజిత చిత్రాలు ఏ చిత్రకారుడి కుంచెలోంచి జాలువారినవో కాదు సుమా! డిజిటల్ కాన్వాస్పై కృత్రిమమేధ (ఏఐ)సృష్టించిన అద్భుతాలివి. దేన్నైనా సృష్టించగలగడం మనిషికి మాత్రమే ఉన్న ప్రత్యేకత అని మనం ఇప్పటివరకూ అనుకుంటున్నాం కదా! కృత్రిమ మేధపుణ్యమా అని ఈ సరిహద్దు కూడా చెరిగిపోతోందని ఈ ఫొటోలను చూస్తే అనిపించకమానదు. ఇవి ఓ పికాసో.. ఓ వాన్గో.. ఎం.ఎఫ్.హుస్సేన్ల కుంచె చేసిన మహిమలని అనిపిస్తోంది కదూ! కానీ, బొట్టో అనే ఓ కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ గీసిన డిజిటల్ చిత్రాలివి. ఈ మధ్యనే జరిగిన ఓ వేలంలో 6 ‘బొట్టో’బొమ్మలకు దాదాపు రూ. 9.76 కోట్లు వచ్చాయి. బొట్టో.. ప్రతివారం 350 వరకూ చిత్రాలు గీస్తే, వాటిని చూసి ఏవి బాగున్నాయో? ఏవి బాగాలేవో? చెబుతూ చిత్రకళాప్రియులు ఓటేస్తారు. ఒక్కో చిత్రానికి వచ్చిన ఓట్లు, కామెంట్ల ఆధారంగా బొట్టో తన కళకు మెరుగులు దిద్దుకుంటుందన్నమాట. బొట్టో చిత్రాలకు మీరూ ఓటేయొచ్చు. కాకపోతే ఈ వ్యవహారమంతా క్రిప్టో కరెన్సీతో కూడుకున్నది. వివరాలు https://botto.comలో ఉన్నాయి. -
పానీపూరీలో ఉంగరం పెట్టి.. యువతికి వెరైటీ పెళ్లి ప్రపోజల్..
పానీ పూరీ.. తలుచుకోగానే నోట్లో నీరు ఊరని వారుండరు. పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరు పానీపూరీని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఇక్కడొక యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి చేయబోయే లవ్ ప్రపోజ్ కూడా పానీపూరీతోనే చెప్పాడు. ‘ఆ యువతికి గప్చుప్లంటే ప్రాణం.. ఆ గప్చుప్లో ఏదైన పెట్టి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు...’ ఆలోచన వచ్చిందో లేదో.. వెంటనే అమలులో పెట్టేయాలనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం ఆ యువతి దగ్గరకు వెళ్లి సరదాగా గప్చుప్ తినడానికి వెళదామని కోరాడు. ఈ క్రమంలో వారిద్దరు కలిసి గప్చుప్ షాపు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ, కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అయితే, అప్పటికే సదరు యువకుడు తన ప్లాన్తో సిద్ధంగా ఉన్నాడు. ఆ గప్చుప్ షాపువారు.. ఒక ప్లేట్లో కొన్ని గప్చుప్లు, మసాలా, బటానీ పెట్టిచ్చారు. ఇతను మాత్రం ఒక గప్చుప్లో బంగారు ఉంగరాన్ని ఉంచాడు. ఆ ప్లేటును ఆ యువతికి ఇచ్చాడు. అయితే, ఆ యువతి ఆ గప్చుప్ ప్లేటును తీసుకుంది. దానిలో మధ్యలో ఉన్న పానీపూరీ ఏదో మెరుస్తూ కనిపించింది. కాసేపు.. సరిగ్గా చూసేసరికి అది ఒక ఉంగరం అని గుర్తుపట్టింది. వెంటనే ఆ యువకుడిని చూసింది. అతగాడి ముఖం అప్పటికే ఏదో వెలిగి పోతుంది. ఆ యువకుడు, నవ్వుతూ.. తన మనసులో మాటను ఆ యువతికి తెలియజేశాడు. ఈ వెరైటీ సర్ప్రైజ్కి ఆ యువతి ఎంతో సంతోషించింది. ఆమె ఆనందంగా ఉండటం చూసిన యువకుడు.. ఇక క్షణం ఆలస్యం చేయకూడదని ‘ ఆ ఉంగరాన్ని చూపిస్తూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా..’ అంటూ ఆమెను ప్రపోజ్ చేశాడు. మొదట ఆశ్చర్యపోయినప్పటికి ఆ యువకుడి నిజాయితీకి ఆమె ఫిదా అయ్యింది. ఆ యువతి కూడా సరిగ్గా పానీపూరీ బండి దగ్గరే తన ప్రియుడి ప్రపోజల్కి ఒకే చెప్పేసింది. అయితే, ఇది ఎక్కడ జరిగిందో తెలియలేదు. ఈ క్లిప్పింగ్లను ట్విట్టర్లోని ‘మంత్లీ అందాజ్ ఇ జాన్’ అనే పేజీలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్నిచూసిన నెటిజన్లు ‘మీ.. ఐడియా సూపర్..’, ‘ పానీపూరీకి ఏ అమ్మాయి ‘నో’ చెప్పలేదు. మరి అలాంటి పానీపూరిలో రింగ్ పెట్టి ప్రపోజ్ చేస్తే.. ఆమె ‘నో’ అనగలదా? ’, ‘ ఆమె పానీపూరి చూడ కుండా తింటే ఏమై ఉండేదో..’, ‘ కొంత యువతులకు పానీపూరీని అమాంతం మింగేస్తారు.. ’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో -
ఒక చిత్రం వెయ్యి పదాలు.. కాదు వెయ్యి కావ్యాలు!
కొన్ని ఫొటోలను చూస్తుంటే, ఒక చిత్రం వెయ్యి పదాలు కాదు వెయ్యి కావ్యాలు అనిపిస్తుంది! సొసైటీస్ ఆఫ్ ఫొటోగ్రాఫర్స్ ‘ఫొటో ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ల కోసం పలు విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా వేలాది ఫొటోలు వచ్చాయి. వాటిని కాచి వడపోసిన తరువాత మిగిలిన ఫొటోలను చూస్తుంటే ఎవరికైనా సరే భావుకత్వం వరదలెత్తుతుంది. ‘న్యూ బార్న్’ విభాగంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ రాచెల్ బర్టన్ తీసిన బేబీ జాస్మిన్ ఫొటో ‘టాప్ ప్రైజ్’ గెలుచుకుంది. ‘వెడ్డింగ్’ విభాగంలో బంధుమిత్రులంతా కలిసి సంతోషంతో వధువును పైకి ఎగరేస్తున్న ఫొటో, ‘ఫ్యామిలీ’ విభాగంలో చల్లటి అనుబంధన చందనం ఉట్టిపడే తండ్రీకొడుకుల ఫొటోలు బహుమతులు గెలుచుకున్నాయి. -
డొనాల్డ్ ట్రంప్ స్పెషల్ ఫోటోలు
-
ఆర్ట్ఫుల్ గిఫ్ట్
-
చంద్రయాన్–2 జాబిల్లి చిత్రాలు విడుదల
చెన్నై: చంద్రయాన్–2లో భాగంగా జాబిల్లి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆర్బిటర్ తీసిన ఛాయాచిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం విడుదల చేసింది. జాబిల్లి నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరం నుంచి హై రెజల్యూషన్ కెమెరా ద్వారా ఆర్బిటర్ తీసిన చిత్రాలు.. బోగుస్లావ్స్కీ ప్రాంతానికి సంబంధించినవని ఇస్రో తెలిపింది. సుమారు 14 కిలోమీటర్ల వ్యాసం, మూడు కిలోమీటర్ల లోతు ఉన్న ఈ లోయను ఆర్బిటర్ తన చిత్రాల్లో బంధించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న ఈ లోయ చిత్రాల్లో పెద్ద పెద్ద రాళ్ల వంటి నిర్మాణాలతోపాటు చిన్న గుంతల్లాంటివి ఉన్నాయని ఇస్రో తెలిపింది. -
మట్టితో మాణిక్యం
అతడొక బిచ్చగాడు. మతిస్థిమితం కూడా లేకుండా తిరుగుతాడు. అతడి పేరు మాత్రం రాజు అని ఆ చుట్టుపక్కల వాళ్లు అనుకుంటున్నారు. పది రోజుల క్రితం అటుగా వెళ్తున్న కొందరు అక్కడ జరుగుతున్న ఓ సంఘటన చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయారు. జరుగుతున్నదంతా వారి వీడియోలలో బంధించారు. రాజుగా పిలవబడుతున్న ఆ బిచ్చగాడు ఎర్రమట్టి, బురద మట్టిని మట్టిగా కాకుండా, వాటర్ కలర్స్గా భావించాడు. గడ్డిని కుంచెగా మలిచాడు. గోడను క్యాన్వాస్గా భావించాడు.అంతే అంతటి మతి స్థిమితం లేని ఆ వ్యక్తి మెదడులో ఏం ఆలోచన బయలుదేరిందో ఏమో కానీ, అందమైన పెయింటింగ్ వేయడం ప్రారంభించాడు. పది నిమిషాలలో అద్భుతమైన పెద్ద పెయింటింగ్ సిద్ధమైపోయింది. విచిత్రమేమిటంటే తనొక చిత్రకారుడినని తనకు తెలియదు. అదే తెలిసి ఉంటే ఎం. ఎఫ్. హుస్సేన్ అంతటి వాడు అయి ఉండేవాడేమోనని ఆయన చిత్రాలను చూస్తున్నవారు భావిస్తున్నారు. అతడు పేజ్ త్రీ వ్యక్తి కూడా కాదు. కేవలం మట్టిమనిషి మాత్రమే. మట్టిలో మాణిక్యం దొరుకుతుందో లేదో తెలియదు కానీ, మట్టితో మాణిక్యాలను తయారుచేస్తున్నాడు ఈ బిచ్చ చిత్రకారుడు. – వైజయంతి -
క్రిస్మస్ జరుపుకునే జంతువులు
-
ఎఫ్ఎంబీ చిత్రపటాలతో భూముల కంప్యూటరీకరణ
ఎన్ఆర్ఎస్ఏ డైరెక్టర్ కృష్ణమూర్తి రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : గ్రామీణ, వ్యవసాయ భూముల ఎఫ్ఎంబీ చిత్రపటాలను కంప్యూటరీకరించే కార్యక్రమం ఏపీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఏపీఎస్ఏసీ) ద్వారా చేపడుతున్నారని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) డైరెక్టర్ డాక్టర్ వైవీఎన్వీ కృష్ణమూర్తి తెలిపారు. ఈ విలువైన సమాచారాన్ని డిజిటలైజేషన్ ద్వారా కంప్యూటర్లో నిక్షిప్తం చేసే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ‘డిస్సెమినేషన్ ఆఫ్ జియోస్పేషియల్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ’ అనే అంశంపై ఏపీఎస్ఏసీతో కలసి నన్నయ వర్సిటీ గురువారం నిర్వహించిన వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధిలో భాగంగా ‘జియో స్పేషియల్ టెక్నాలజీ’ ప్రాముఖ్యతను, వినియోగాన్ని సరళతరంగా విద్యార్థులకు తెలియజేసేందుకు, ఆ దిశగా ఉద్యోగావకాశాలపై అవగాహన పొందడానికి దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో రిమోట్ సెన్సింగ్, జియోస్పేషియల్ వంటి అధునాతన సాధనాలను ఉపయోగించి, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో నష్టాలను నివారించవచ్చన్నారు. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల విజ్ఞానాన్ని, టెక్నాలజీలో వస్తున్న ఆధునికతను జోడించి కొత్త విషయాలు కనుగొనవచ్చన్నారు. పరిశోధనలు, ఉద్యోగ రంగాలలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా యువతను తయారు చేయవచ్చన్నారు. ఏపీ అభివృద్ది కోసం అనేక రంగాలలో వినూత్న పథకాలను రూపొందించడంలో, వాటి కార్యాచరణ, అమలులో సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. అలాగే ఉపగ్రహ, సాంకేతిక విజ్ఞానాన్ని ఎక్కడెక్కడ ఏవిధంగా ఉపయోగించవచ్చునో ప్రజలకు, విద్యార్థులకు తెలియజేసేందుకు ఇటువంటి వర్క్షాపులు ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరులు వినియోగంలో ఏపీఎస్ఏసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభివృద్ధిని సాధించడంలో మన దేశానికి ఇస్రో, ఎన్ఆర్ఎస్ఏ వంటి జాతీయ సంస్థలు, ఏపీఎస్ఏసీ వంటి రాష్ట్ర స్థాయి సంస్థలు కీలకపాత్రను పోషిస్తున్నాయని నన్నయ రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు అన్నారు. ఏపీఎస్ఏసీ వైస్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నన్నయ వర్సిటీ డీన్ ఆచార్య ఎస్.టేకి, ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు, సహాయాచార్యులు డాక్టర్ కేవీ స్వామి, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆర్ట్ టచింగ్
మల్కాపురం : బొమ్మ గీస్తే అచ్చుగుద్దినట్టు ఉండాలి. జీవకళ ఉట్టిపడాలి. పోలికల్లో ఏ మాత్రం తేడా రాకూడదు. ఇదే లక్ష్యంతో ఆ బాలిక భళా అనిపించుకుంటుంది. అద్భుత చిత్రాలతో జాతీయస్థాయిలో రాణిస్తోంది. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన అన్వేష అద్భుత ప్రతిభతో సత్తా చాటుతోంది. జింక్ ప్రాంతంలోని ఎస్ఆర్ డీజీ పాఠశాల్లో అన్వేషిత తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆరో తరగతి చదువుతున్న సమయంలో పాఠశాల స్థాయి పెయింటింగ్ పోటీల్లో మహాత్మాగాంధీ చిత్రానికి ప్రశంసలు అందుకుంది. దీంతో చిత్రలేఖనంపై దష్టి సారించింది. ప్రముఖ చిత్రకారుడు చెల్లూరు భాస్కరరావు వద్ద శిక్షణ పొందుతోంది. తల్లిదండ్రులు,గురువు ప్రోత్సాహంతో జిల్లా,రాష్ట్ర స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని సుమారు వందకు పైగా సిల్వర్,బ్రాంజ్ మెడల్స్తో పాటు సర్టిఫికెట్లు అందుకుంది. జాతీయ పోటీలో... ఇటీవల నెల్లూరు,తెనాలి,విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి పెయింటింగ్ పోటీల్లో అన్వేషిత పాల్గొని బంగారు పతకాలు సాధించింది. ఈ ఏడాది సంక్రాంతిని సందర్భంగా విజయవాడలో జరిగిన జాతీయ స్థాయిపోటీలలో అన్వేషిత కు బంగారు పతకంతో పాటు ప్రోత్సాహక బహుమతి,సర్టిఫికెట్లు అందుకుంది. మరిన్ని చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలని భావిస్తున్నట్టు అన్వేషిత చెబుతోంది. -
మరువలేని ‘దృశ్యం’
బొమ్మలతో పాఠ్యాంశాల బోధన 1. 2 తరగతుల నుంచే సైన్స్ పరిచయం శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు శ్రీకారం కాకినాడ రూరల్ : దృశ్యం.. కంటి ద్వారా మెదడులోకి.. తద్వారా మనసులో నిక్షిప్తమయ్యే అద్భుత విశేషం. విన్న, చదివిన విషయం కన్నా చూసినది సుదీర్ఘకాలం గుర్తుంచుకుంటుంది మనసు. చూసిన బొమ్మని.. దాని విశేషాంశాలను మరచిపోదామనుకున్నా త్వరగా మరువలేము. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి విద్యా శాఖ ప్రభుత్వ పాఠశాలల్లో నూతన పాఠ్య ప్రణాళిక రూపొందిస్తున్నది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి అనుగుణంగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్ప«థం పెంపొందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ చరిత్రలో మొదటిసారిగా 1, 2 తరగతుల్లో ‘మనం–మన పరిసరాలు’ శీర్షికతో పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టింది. రాష్ట్ర విద్యాపరిశోధక శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ) రూపొందించిన ఈ పుస్తకాల్లో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో పదాలు, బొమ్మలు పొం దుపరిచారు. ఉపాధ్యాయులు ఎక్కువగా మాటల ద్వారానే విద్యార్థులకు పరిసరాల విజ్ఞానాన్ని బోధించే రీతిలో పుస్తకాలు ఉన్నాయి. ఇప్పటికే 1, 2 తరగతుల్లో ఉన్న తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్యాంశాలతో పాటు పరిసరాల విజ్ఞానం మరో సబ్జెక్టుగా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టడంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అలోచనా విధానం పెంచేలా పరిసరాల విజ్ఞానం పాఠ్యాంశాలు విద్యార్థుల జిజ్ఞాసను, విషయ పరిజ్ఞానం పెంచేలా, బోధనాంశం తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగేలా ఉన్నాయి. పాఠ్యాంశాలను పరిశీలిస్తే.. ఒకటో తరగతిలో నేను–నా కుటుంబం, నేను–నాశరీరం, పూలు, పండ్లు కూరగాయలు, మన నేస్తాలు, తిందాం.. తిందాం, నేను– మాఇల్లు, వ్యక్తిగ పరిశుభ్రత, ఊరికి పోదాం, మా ఇంట్లో వస్తువులు, పగలు–రాత్రి అంశాలు ఉన్నాయి, 2వ తరగతిలో నేను– మా బంధువులు, చూద్దాం–చేద్దాం, రకరకాల చెట్లు, గాలి, నీళ్లు, జంతు ప్రపంచం, ఆహారం, ఇల్లు–వసతులు, ఇల్లు–పరిశుభ్రత, మా ఇరుగుపొరుగు, మా ఆటలు, రవాణా సాధనాలు, కాలాలు–జంతువులు అనే పాఠాలు ఉన్నాయి. వీటిని నేర్చుకోవటం ద్వారా విద్యార్థిలో కుటుంబం, సమాజం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ఆహార పద్ధతులు, జీవరాశులు తదితర అంశాలు అవగతమవుతాయి. పై తరగతుల్లో సులభంగా నేర్చుకునేందుకు ఇవి దోహదపడతాయని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రైవేటుకు దీటుగా.. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లో ఈ విధానం అమల్లో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరహా బోధనా విధానం ఇప్పటి వరకు లేకపోవటంతో చాల వరకు విద్యార్థులు పై అంశాల గురించి పై తరగతుల్లో మాత్రమే నేర్చుకునే వారు. నూతనంగా ప్రవేశపెట్టిన పరిసరాల విజ్ఞానం పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు 1, 2 తరగతుల స్థాయిలోనే వీటి గురించి తెలుసుకునే చక్కని అవకాశం కల్పించినట్టయింది. ప్రత్యక్షానుభవం కలిగించేలా జాతీయ విద్యా ప్రణాళిక, విజ్ఞాన శాస్త్ర పాఠ్యప్రణాళిక రూపొందించేందుకు సజీవ ప్రపంచం, ఆహారం, సహజ వనరులు, వస్తువులు, అవి ఎలా పనిచేస్తాయి, కదిలే వస్తువులు, ప్రజల భావనల సహజ దృగ్విషయాల ఆధారంగా రూపొందించబడ్డాయి. పలు రకాల పద్ధతుల ద్వారా పాఠ్యాంశాలను తెలుసుకునే అవకాశం ఉంది. -
'నాకు నేను జంతువులా కనిపిస్తున్నాను'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్ తన ఫ్యాన్స్ పై మరోసారి మండిపడ్డాడు. ఇక వారితో ఏ మాత్రం ఫొటోలకు ఫోజు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. 22 ఏళ్ల ఈ పాటల దిగ్గజం ఇన్ స్టాగ్రమ్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. తన అభిమానులు వచ్చి అలా ఫొటోలు దిగుతుంటే తనకు తాను జూలో జంతువులా కనిపిస్తున్నానని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అంటూ ఎగబడటం.. వెంటనే ఫొటోల కోసం ఎగబడటం తనకు నచ్చలేదని చెప్పారు. తనను చూసిన వారు కనీసం గుర్తించరని హాయ్ కూడా చెప్పరని.. కేవలం ఫొటోలు మాత్రమే దిగుతారని.. దాంతో తాను జూలో జంతువుగా భావిస్తున్నాని చెప్పారు. అయితే, తన నిర్ణయం అభిమానులకు ఇబ్బంది పెడుతుందని తనకు తెలుసని అయినా తప్పదని చెప్పాడు. -
ఇరాక్ లో బయటపడ్డ పురాతన క్రైస్తవ క్షేత్రం!
ఉగ్ర భూతం కోరలు చాచిన యుద్ధభూమిలో చారిత్రక క్రైస్తవ క్షేత్ర మూలాలు వెలుగు చూశాయి. ఐఎస్ ఐస్ ఆక్రమిత ఇరాక్ మోసుల్ నగర శివార్లలో వందల ఏళ్ళనాటి పురాతన కట్టడాలు బయట పడినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. డైర్ మార్ ఎలియా గా పిలిచే ఆ ప్రాంతం ఇప్పుడు వందల ఏళ్ళ చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది. తుపాకులు, బాంబుల మోతలతో దద్దరిల్లుతున్న మోసుల్ నగర శివార్లలో బయటపడ్డ చారిత్రక అవశేషాలు.. అక్కడో క్రైస్తవ క్షేత్రం ఉండేదని నిరూపిస్తున్నాయి. భూమినుంచీ బయటపడ్డ ఆ పురాతన నిర్మాణాలు సుమారు పథ్నాలుగు వందల ఏళ్ళ క్రితం నాటివిగా శాటిలెట్ చిత్రాలద్వారా తెలుస్తోంది. సెయింట్ ఎలిజా గా పిలిచే ఆ నిర్మాణ ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన 'ఆల్ సోర్స్ అనాలసిస్' నిపుణల విశ్లేషణల ప్రకారం ఆ భారీ కట్టడాలు సహజంగానే కూలిపోయినట్లు తెలుస్తుండగా... ఆ కూల్చివేత ఉద్దేశ్య పూర్వకంగానే జరిగిందని మరి కొందరు నిపుణులు సూచిస్తున్నారు. 2014 సంవత్సరంలో ఆప్రాంతాన్ని పరిశీలించేందుకు ముందు, తర్వాత చిత్రాలను చూస్తే తెరమరుగైన చారిత్రక విషయాలెన్నో వెల్లడయ్యాయి. అప్పట్లో రాళ్ళు, ఇసుకతో ఆ నిర్మాణాలను చేపట్టినట్లుగా ఆల్ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. అక్కడ మనం ఎప్పుడూ చూడని సుమారు ఇరవై వెలకట్టలేని గొప్ప భవనాలు ఉండేవని, అవి యుద్ధసమయంలో నాశనమైనట్లు విశ్లేషణలు చెప్తున్నాయి. అయితే రెండోసారి తీసిన ఉపగ్రహ చిత్రాల్లో పరిశీలిస్తే ఆ భవనాలు అప్పట్లో బుల్డౌజర్ తో కూల్చివేసినట్లు కొన్ని ఆధారాలు తెలుపుతున్నాయి. కాగా ఐఎస్ ఐఎస్ ఈ కూల్చివేతలకు కారణంగా సూచించలేమని ఆల్ సోర్సెస్ చెప్తోంది. కాగా ఐఎస్ ఐఎస్ తీవ్రవాదులు మోసుల్ నగరాన్నిస్వాధీనం చేసుకున్న2014 జూన్ కు కొద్ది నెలల తరువాత అంటే సుమారు ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ మొదట్లో ఈ నాశనం జరిగి ఉండొచ్చని ఇమేజరీ పిన్ పాయింట్ విశ్లేషణలు తెలుపుతున్నాయి. -
ఈ వారం మేటి చిత్రాలు
-
ఫేస్బుక్ తెచ్చిన తంటా.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత
డెహ్రాడూన్: సదాశయంతో నెలకొల్పిన సోషియల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్బుక్ను కొందరు వ్యక్తులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి, తప్పుడు ప్రచారాలకు కూడా వాడుకుంటున్నారు. ఓ మత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఓ యువకుడు ఫేస్బుక్లో ఫొటోలను అప్లోడ్ చేశాడు. దీంతో ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లా రామ్నగర్ పట్టణంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఓ మతానికి చెందిన ప్రజలు ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వచ్చారు. శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వారని అడిషనల్ డీజీ రామ్ సింగ్ మీనా చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణలు కూడా జరగినట్టు తెలిపారు. కాగా ఈ సంఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదని చెప్పారు. ఫేస్బుక్లో 26 ఏళ్ల రాజీవ్ అనే వ్యక్తి ఫొటోలు ఉంచినట్టు గుర్తించారు. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెప్పారు. -
video
-
మరువలేని మహానేతకు చిత్రాంజలి...
కోటేశ్వరరావు ఇప్పటికి 25కి పైగా వైయస్ చిత్రాలను గీశారు. ఆ చిత్రాలలో వైయస్ జీవనరేఖలు కనిపిస్తాయి. రాజసంతో ఉట్టి పడే తేజస్సు, ఆయన ప్రవేశపెట్టిన పథకాల చల్లని వెలుగు కనిపిస్తుంది. సమాజంలోని అట్టడుగు వర్గాల సమస్యలపై చిత్రాలు గీసి వాటి తీవ్రతను తెలియజేస్తున్నారు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన చింతలపల్లె కోటేశ్వరరావు. ఆయన కుంచె నుండి రూపుదాల్చుకున్న ప్రతీ చిత్రం సందే శాత్మకమే. అవి సామాన్యుడిని సైతం ఆలోచింపచేసి, సామాజిక బాధ్యతను గుర్తుచేస్తాయి. ప్రతీరోజూ కుంచెపట్టుకొని బొమ్మ గీయకపోతే ఏమీ తోచదు. ఇప్పటికీ కొన్ని వందలకు పైగా కళాఖండాలను గీశారు. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. కోట్లాది ప్రజల హృదయాల్లో కొలువైవున్న మహా నేత వైయస్ రాజశేఖరరెడ్డి అంటే కోటేశ్వరరావుకు ఎంతో అభిమానం. ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో లబ్ధిపొందిన వారిలో కోటేశ్వరరావు కూడా ఒకరు. ఆ మహానేత మర ణాంతరం రాష్ట్రం అల్లకల్లోలంగా మారిపోయింది. ఆయన లేరన్నది ఇప్పటికీ జీర్ణించుకోలేని వాస్తవంగా మిగిలింది. ఆ వాస్తవాన్ని తాను గీసిన కొన్ని చిత్రాల్లో చిత్రించారు కోటేశ్వరరావు. ‘‘ఆయనది రాజసం ఉట్టి పడే రూపం. ఒక్కసారి చూస్తే శాశ్వతంగా మనసులో ముద్రించికుపోయే చిత్రం’’ అంటున్న కోటేశ్వరరావు ఇప్పటికి 25కి పైగా వైయస్ చిత్రాలను గీశారు. ఆ చిత్రాలలో వైయస్ జీవనరేఖలు కనిపిస్తాయి. రాజసంతో ఉట్టి పడే తేజసు, ఆయన ప్రవేశపెట్టిన పథకాల చల్లని వెలుగు కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో ‘అమ్మ ఆర్ట్ అకాడ మీ’ నిర్వహించిన పోటీల్లో కోటేశ్వరరావు గీసిన వైయస్ చిత్రాలకు జాతీయ చాంపియన్షిప్ అవార్డు దక్కింది. వైయస్ఆర్ వర్థంతి సందర్భంగా కోటేశ్వరరావు ఘటిస్తున్న చిత్రాంజలి ఇది. - నాగేష్