Power consumption
-
డిసెంబర్లో భారీగా విద్యుత్ వినియోగం
దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలలో విద్యుత్ వినియోగం (power consumption) గణనీయంగా పెరిగింది. 6 శాతం పెరిగి 130.40 బిలియన్ యూనిట్లుగా నమోదైంది. 2023 డిసెంబర్ నెలలో వినియోగం 123.17 బిలియన్ యూనిట్లుగా ఉంది. రోజువారీ గరిష్ట సరఫరా (గరిష్ట డిమాండ్) 224.16 గిగావాట్లుగా నమోదైంది.2024 మే నెలలో 250 గిగావాట్లు ఇప్పటి వరకు గరిష్ట రోజువారీ రికార్డుగా ఉంది. 2024 వేసవి సీజన్కు గరిష్ట రోజువారీ డిమాండ్ 260 గిగావాట్లకు చేరుకోవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ అంచనా వేయడం గమనార్హం. ఇక 2025 వేసవి సీజన్కు గరిష్ట డిమాండ్ 270 గిగావాట్లకు చేరుకోవచ్చని భావిస్తోంది.రూమ్ హీటర్లు, వాటర్ హీటర్లు, గీజర్ల వాడకం డిసెంబర్లో విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి చేరుకునే అవకాశాలతో విద్యుత్ వినియోగం జనవరిలోనూ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
‘వినియోగం’ గణనీయంగా తగ్గింది!
దాదర్: ముంబైలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గత వారం దాకా ఉక్కపోతతో సతమతమైన ముంబైకర్లకు ఇప్పుడు చలి కారణంగా కొంతమేర ఊరట లభించినట్లైంది. పగలు కొంత ఉక్కపోత భరించలేకపోయినప్పటికి రాత్రుల్లో వాతావరణంలో ఆకస్మాత్తుగా మార్పులు జరుగుతున్నాయి. ఫలితంగా ఇళ్లలోని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం చాలా శాతం వరకు తగ్గింది. దీంతో ముంబైలో గత వారం కిందట మూడు వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఇప్పుడది 2,500 మెగావాట్లకు పడిపోయింది. చలికాలం ప్రారంభంలోనే సుమారు 500 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. మరికొద్ది రోజుల్లో ఇది 1,500 మెగావాట్లకు చేరడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. వేసవికాలంలో 4,550 మెగావాట్లపైనే.... వేసవి కాలంలో ఎండలు మండిపోవడంతో ఉదయం 10 గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనాలు జంకుతారు. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, వ్యాపార, వాణిజ్య సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులు ఉక్కపోత భరించలేక సతమతమవుతారు. నిరంతరంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పనిచేసినప్పటికీ వాతావరణం చల్లబడదు. దీంతో వేసవి కాలంలో ముంబైలో విద్యుత్ వినియోగం ఏకంగా 4,500 మెగావాట్లకు పైనే చేరుకుంటుంది. ఏటా విద్యుత్ వినియోగం రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంటుంది. వేసవి కాలం మినహా మిగిలిన సీజన్లలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇళ్లు, షాపులు, కార్యాలయాల్లో విశ్రాంతిలేకుండా ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడంతో రెండు రోజుల కిందట విద్యుత్ వినియోగం 2,500 మెగావాట్లకు చేరుకుంది. టాటా పవర్ నుంచి 382 మెగావాట్లు, అదాణీ డహాణు విద్యుత్ కేంద్రం నుంచి 288 మెగావాట్లు, ముంబై ఎక్చేంజ్ నుంచి 1,971 మెగావాట్లు విద్యుత్ సరఫరా జరిగింది. ముంబైలో భిన్నంగా... ఇదిలాఉండగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైనప్పటికీ అనేక జిల్లాల్లో వాతావరణం ఇంకా వేసవి ఎండలు తలపిస్తున్నాయి. రోజు ఏకంగా 31,001 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో మహానిరి్మతి కంపెనీ నుంచి 6,252 మెగావాట్లు, ప్రైవేటు కంపెనీల నుంచి 8,728 మెగావాట్లు, ఎక్చేంజి నుంచి సుమారు 8 వేల మెగావాట్లు విద్యుత్ సేకరించి ఈ డిమాండ్ను పూరిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ ప్రధాన నగరాలతో పోలిస్తే ముంబైలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్ధలు అధికంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. వీటితోపాటు జంక్షన్ల వద్ద, ప్రధాన రహదారులపై, పర్యాటక ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార ప్రకటనల బోర్డులు, హోర్డింగులు అడుగడుగున ఉంటాయి. వీటిలో కొన్ని ఎల్రక్టానిక్, డిజిటల్ బోర్డులుంటాయి. రాత్రుల్లో వాటికి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సాధారణ బోర్డులకు ప్లడ్ లైట్లు వెలుగుతాయి. దీంతో రాత్రి వాతావరణం చల్లిబడినప్పటికి విద్యుత్ వినియోగం పగలు మాదిరిగానే జరుగుతుంది. అయితే కొద్ది నెలల కిందట ఘాట్కోపర్లోని చడ్డానగర్ జంక్షన్ వద్ద భారీ హోర్డింగ్ కూలడంతో సుమారు 17 మంది చనిపోగా 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనతో అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు, బోర్డుల అంశం తెరమీదకు వచి్చంది. వివిధ రంగాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కళ్లు తెరచిన ప్రభుత్వం, బీఎంసీ పరిపాలన విభాగం తనిఖీలు ప్రారంభించింది. అక్రమంగా ఏర్పాటుచేసిన హోర్డింగులు, సైన్ బోర్డులతోపాటు వాటికి విద్యుత్ సరఫరా చేస్తున్న కనెక్షన్లను కూడా తొలగిస్తున్నారు. ఆ ప్రకారం ముంబైలో కొంత శాతం విద్యుత్ వినియోగం తగ్గాలి. కానీ ఇవేమీ విద్యుత్ వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. -
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలం రావడంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీ, మోటర్ల వినయోగంతో విద్యుత్ డిమాండ్ ఎక్కువవుతోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్లో రికార్డు స్థాయిలో వినియోగం జరిగింది. గురువారం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధిగమించిది. 2023 ఏప్రిల్ 18న గరిష్ఠ డిమాండ్ 3,471 మెగావాట్లు కాగా గతేడాదితో పోల్చితే ప్రస్తుతం 582 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. అయితే విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ అధికారులు ఏలాంటి అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా చేశారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న విద్యుత్ శాఖ, సిబ్బందిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. మే నెలలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ సిబ్బంది, అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే సేవలందించి వినియోగదారుల మన్ననలు పొందాలని సూచించారు. -
డిమాండ్కు తగ్గట్లు కరెంట్ కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది అనడానికి నిదర్శనంగా కనిపించే సూచికల్లో విద్యుత్ వినియోగం కూడా ఒకటి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఏపీలో విద్యుత్ డిమాండ్ ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 2022లో తలసరి విద్యుత్ వినియోగం 1,234 యూనిట్లు ఉంటే 2023లో అది 1,357 యూనిట్లకు పెరిగింది. ఇలా ఏ ఏటికాయేడు కిందటి ఏడాదికి మించి కరెంటు రికార్డులు నమోదు చేస్తూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 236.73 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. ఇది గతేడాది ఇదే సమయానికి జరిగిన వినియోగం 231.05 మిలియన్ యూనిట్ల కంటే 2.46 శాతం ఎక్కువ. పగలు పీక్ డిమాండ్ 11,926 మెగావాట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 11,358 మెగావాట్లు ఉండేది. అంటే 5 శాతం పెరిగింది. ఈ ఏడాది వేసవి ఆరంభం కాకముందే ఎండలు ముదిరినప్పటికీ.. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరత రాకుండా, కోతలు విధించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రజలకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాయి. కొనుగోలుకు వెనుకాడకుండా.. రాష్ట్ర ప్రజలకు విద్యుత్ అందించేందుకు ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 94.427 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.528 మి.యూ, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.419 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 31.868 మి.యూ, సెయిల్, హెచ్పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 29.849 మి.యూ, సోలార్ నుంచి 21.635 మి.యూ, విండ్ నుంచి 20.535 మిలియన్ యూనిట్లు చొప్పున సమకూరుతోంది. నెల రోజుల్లో పవన విద్యుత్ ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయ్యింది. దీనితో పాటు బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.754 చొప్పున రూ. 20.634 కోట్లతో 30.211 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్(ఏఐ) సాంకేతికతను వినియోగిస్తున్నారు. డిమాండ్ ఫోర్కాస్ట్ విధానం ద్వారా ప్రతి పదిహేను నిమిషాలకూ విద్యుత్ డిమాండ్ను అంచనా వేయగలిగే సామర్థ్యం మన విద్యుత్ సంస్థలకు ఉంది. దాని సాయంతో షార్ట్టెర్మ్ టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కోసం ముందస్తు బిడ్లు దాఖలు చేస్తున్నాయి. తద్వారా అప్పటికప్పుడు ఏర్పడే విద్యుత్ కొరత నుంచి బయటపడుతున్నాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ ఇలాంటి ఏర్పాటు లేదు. గత ప్రభుత్వంలో అత్యవసర సమయాల్లో కరెంటు కొనేవారే కాదు. అనవసరంగా చేసుకున్న దీర్ఘకాల విద్యుత్ ఒప్పందాల వల్ల ఒరిగేదేమీ ఉండేది కాదు. ఫలితంగా రాష్ట్రంలో అన్ని కాలాల్లోనూ ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడిపోయేవారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు ప్రణాళికల కారణంగా విద్యుత్ వినియోగదారులకు అప్పటి ఇబ్బందులు ఇప్పుడు ఎదురవ్వడం లేదు. -
రికార్డు స్థాయిలో కరెంట్ వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగంతో ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 238.79 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి వినియోగం 166.97 కంటే 43.01 శాతం ఎక్కువ. రోజులో పీక్ డిమాండ్ 12,802 మెగావాట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే సమయానికి 7,997 మెగావాట్లు మాత్రమే ఉంది. అంటే 60.09 శాతం పెరిగింది. అయినప్పటికీ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, డిమాండ్కు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంట్ సరఫరా చేస్తున్నాయి. ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా.. గత సంవత్సరం వేసవిలో మన రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 265 మిలియన్ యూనిట్లకు చేరుకుని రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఆ రికార్డు బ్రేక్ అవుతుందని అంచనా. దీనికి తగ్గట్టు విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. కృష్ణపట్నంలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో గతేడాది 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఇబ్రహింపట్నంలోని ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్–8లోనూ ఉత్పత్తి ముందుగానే ప్రారంభించారు. అలాగే వీటీపీఎస్లో రోజుకి 32,186 మెట్రిక్ టన్నులు, ఆర్టీపీపీలో 16,443 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 23,632 మెట్రిక్ టన్నులు, హిందూజాలో 14,277 మెట్రిక్ టన్నులు చొప్పున బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. కొనుగోలుకు వెనుకాడని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యుత్ లోటు రాకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 91.081 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.920 మి.యూ, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.269 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 35.925 మి.యూ, సెయిల్, హెచ్పీసీఎల్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 32.213 మి.యూ, సోలార్ నుంచి 20.647 మి.యూ, విండ్ నుంచి 12.359 మిలియన్ యూనిట్లు చొప్పున సమకూరుతోంది. అయితే ఇది మాత్రమే సరిపోవడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి రోజుకు యూనిట్ సగటు రేటు రూ. 8.764 చొప్పున రూ. 35.253 కోట్లతో 40.224 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా డిమాండ్ను అందుకోలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జార్ఖండ్, ఉత్తరాఖండ్, బిహార్, హిమాచల్ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మన దగ్గర కంటే తక్కువ విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ కొరత ఏర్పడింది. -
పెరిగిన విద్యుత్ వినియోగం కనపడదా!?
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు నిరంతరం కోతలు లేకుండా సరఫరా చేయడం కూడా తప్పే అన్నట్లుగా ఉంది రామోజీ తీరు చూస్తుంటే. ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం.. దానివల్ల విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిన విషయం కళ్లకు కనిపిస్తున్నా ఆయన ఇవేమీ పట్టనట్లు అడ్డగోలుగా రాసిపారేస్తూ జనం మెదళ్లను కలుషితం చేసేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఈ పెరుగుదల వ్యవసాయ, గృహ విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయినా.. ‘ప్రజలపై మరో రూ.1,723 కోట్ల భారం’ అంటూ ఆదివారం ఈనాడు పెట్టిన రంకెల్లో ఎప్పటిలాగే ఏమాత్రం పసలేకపోగా అదంతా పూర్తి ఊహాజనితమని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ. పృథ్వితేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు కొట్టిపడేశారు. ఈ మేరకు వారు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. వర్షాభావంతో అదనంగా వినియోగం.. నిజానికి.. ఈ ఏడాది వాతావరణంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితులవల్ల వర్షాభావం, తీవ్ర ఎండ, ఉక్కపోతతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ పెరుగుదల వ్యవసాయ విద్యుత్ రంగంలోను, గృహ విద్యుత్ రంగంలోను స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు వినియోగం దాదాపు 10–31 శాతం వరకు ప్రతి నెలా అదనంగా నమోదవుతోంది. అలాగే, గతేడాది మార్చి నుంచి అక్టోబరు కాలానికి జల విద్యుదుత్పత్తి దాదాపు 3 వేల మిలియన్ యూనిట్లు ఉంటే ఈ సంవత్సరం అది కేవలం 1,260 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంది. ఇది దాదాపు 60 శాతం తక్కువ. సాధారణంగా ఏటా వినియోగం 7–8 శాతం వరకూ పెరగవచ్చని భావించి ముందస్తు విద్యుత్ సేకరణ ప్రణాళిక తయారుచేస్తారు. కానీ, డిమాండ్ అనుకున్న దానికంటే ఎక్కువగా పెరగడం, దీర్ఘకాలిక వనరులనుంచి లభ్యత అనుకున్నంత రాకపోవడంవల్ల విద్యుత్ కొనుగోళ్లు అనివార్యమయ్యాయి. సర్కారు ముందుచూపు.. ఇలా నెలవారీ విద్యుత్ డిమాండ్లో మునుపెన్నడూ లేనంత పెరుగుదలను గమనించి రాబోయే 7నెలల కాలానికి (సెపె్టంబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు) వెయ్యి మెగావాట్ల కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆ«దీనంలోని డీప్ ఈ–బిడ్డింగ్ పోర్టల్ ద్వారా ఆగస్టులోనే టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియలో రివర్స్ ఆక్షన్ కూడా పూర్తయ్యాక మనకు కావలసిన విద్యుత్ పరిమాణం లభించేంత వరకు అంటే బిడ్లలో పిలిచిన వెయ్యి మెగావాట్ల వరకు నిబంధనల ప్రకారం వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, ట్రేడర్లకు కొనుగోలు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నెలలో మొత్తంగా ఒకశాతం వరకు విద్యుత్ కొనుగోలును తగ్గించుకునే అవకాశం ఈ టెండర్లలో ఉంది. ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా నిబంధనలకు లోబడి చేపట్టారు. ఎవరైనా సరే ఈ వివరాలు పోర్టల్ వెబ్సైట్ ద్వారా కానీ, దరఖాస్తు ద్వారా కానీ పొందవచ్చు. పరిమితులు, నియంత్రణ లేవు ఇక స్వల్పకాలిక కొనుగోళ్లకు సంబంధించి ప్రతీ యూనిట్కు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి ఉంది. మండలి నిర్దేశించిన ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు నిబంధన నియమావళి ప్రకారం.. ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి ఈ అదనపు వ్యయం సర్దుబాటు ఏదైనా ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం పూర్తయ్యాక విద్యుత్ కొనుగోలులో ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించి జరిగిన అదనపు విద్యుత్ కొనుగోలు వ్యయం లెక్కించి ఆ నివేదికను ప్రభుత్వానికి పంపుతారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం మొత్తం విద్యుత్కు కటకటలాడుతుండగా రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రం వినియోగదారులకు ఎలాంటి వినియోగ పరిమితి, నియంత్రణలు అమలుచేయకుండా వారి డిమాండ్కు తగినట్లుగా సరఫరా చేస్తున్నాయి. కానీ, రామోజీకి ఇవన్నీ తెలియనివి ఏమీకాదు. తన ఆత్మబంధువు చంద్రబాబును ఉన్నపళంగా సీఎం కుర్చిలో కూర్చోబెట్టడమే ఆయన లక్ష్యం. అందుకే రోజూ సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై తన విషపుత్రిక ఈనాడులో నిత్యం విషం కక్కుతున్నారు. అంతే..! ఇవ్వకపోతే అలా.. ఇస్తే ఇలానా రామోజీ..? ఎప్పుడైనా ఒకసారి కరెంట్ ఇవ్వకపోతే కోతలు ఎక్కువైయ్యాయంటూ గగ్గోలు పెడతారు. అదే నిరంతరాయంగా సరఫరా చేస్తే అధిక మొత్తం పెట్టి కొనేస్తున్నారంటూ నానా యాగీ చేస్తారు. ఇదెక్కడి నీతి రామోజీ. నిజానికి.. మార్కెట్లో విద్యుత్ రేటు ఎంత ఉంటే అంతకు కొనితీరాల్సిందే. ఏ రాష్ట్రానికైనా ఇదే పరిస్థితి. ఎక్కువ రేటు, తక్కువ రేటు అన్నది మన చేతిలో ఉండదు కదా.. అవసరమైనప్పుడు ఎవరైనా మార్కెట్ రేటును చెల్లించి కొనాల్సిందే.. అదే అవసరంలేనప్పుడు ఎవరూ కొనరు. టెండర్లు కూడా చాలా పారదర్శకంగా నిర్వహిస్తారు. మన ఒక్కరి కోసం రేట్లు పెంచడం లేదా తగ్గించడం అనేది ఉండదు. ఇదంతా మీకు తెలీదా!? చంద్రబాబు అధికారంలో లేడన్న ఒకే ఒక్క కారణంతో ఇంత అడ్డగోలుగా.. దారుణంగా పిచ్చి రాతలు రాసిపారేస్తారా ఏంటి రామోజీ..? 22% పెరిగిన గ్రిడ్ విద్యుత్ వినియోగం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత, ఆదేశాల ప్రకారం.. ఇంతటి క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో కూడా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలనే భావనతో, స్వల్పకాలిక మార్కెట్లో నిబంధనలకు లోబడి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత నవంబరులో కూడా రికార్డు స్థాయిలో రోజువారీ విద్యుత్ వినియోగం 220 మిలియన్ యూనిట్ల వరకు నమోదవుతోంది. కిందటి ఏడాది నవంబరులో ఇదే కాలానికి సరాసరి విద్యుత్ వినియోగం దాదాపు 180 మిలియన్ యూనిట్లుగా వుంది. అలాగే, కిందటి సంవత్సరంతో పోలిస్తే గ్రిడ్ విద్యుత్ వినియోగం పెరుగుదల దాదాపు 22 శాతం. ఈ పరిస్థితుల్లో కూడా రోజుకి దాదాపు 50 మిలియన్ యూనిట్లను స్వల్పకాలిక మార్కెట్ నుండి కొనాల్సి వస్తోంది. ఇందులో దాదాపు 20 మిలియన్ యూనిట్లు ఆగస్టులో చేపట్టిన టెండర్ల ప్రక్రియ ద్వారా సమకూరుతోంది. ఇలా దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ కొరత పరిస్థితుల కారణంగా వాటిని అధిగమించడానికి తమిళనాడు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా ముందస్తుగా ఈ స్వల్పకాలిక ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాయి. రోజువారీ వివిధ వనరుల నుంచి అందుబాటులో వున్న విద్యుత్ను గ్రిడ్ డిమాండ్కు అనుగుణంగా డిస్కంలు బేరీజు వేసుకుంటున్నాయి. గ్రిడ్ డిమాండ్ బాగా పడిపోయిన రోజుల్లో రోజువారీగా దాదాపు 50శాతం వరకు విద్యుత్ సేకరణ నిలుపుదల, బ్యాక్డౌన్ చేసి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి. విద్యుత్ ఎక్సే్చంజీల్లో విద్యుత్ కొంటే ఈ బ్యాక్డౌన్ సౌకర్యం అందుబాటులో ఉండదు. -
ఏపీలో ఆల్టైమ్ రికార్డ్ స్థాయికి విద్యుత్ వాడకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అత్యంత గరిష్ట స్థాయికి చేరింది. రాష్ట్రంలో శుక్రవారం 263.237 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదైంది. రాష్ట్ర విభజన తర్వాత ఎనిమిదేళ్లలో విద్యుత్ వాడకం ఇదే ఎక్కువ కావడం గమనార్హం. విద్యుత్ వినియోగం అధికారుల అంచనాలను మించి ఆల్టైమ్ రికార్డులను సృష్టిస్తోంది. ఈ మేరకు ఇంధన శాఖ శనివారం విద్యుత్ సరఫరా బులిటెన్ను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ గతేడాది కంటే 28.24 శాతం ఎక్కువగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 205.266 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగం జరిగింది. రోజులో పీక్ డిమాండ్ 12,738 మెగావాట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే సమయానికి 9,960 మెగావాట్లు మాత్రమే. అంటే రోజువారీ పీక్ డిమాండ్ కూడా 27.89 శాతం పెరిగింది. పగటి పూట సగటు పీక్ డిమాండ్ 10,968 మెగావాట్లు కాగా.. సాయంత్రం వేళల్లో 9,786 మెగావాట్లకు చేరింది. ఇంత భారీ స్థాయిలో విద్యుత్ వాడకం జరుగుతున్నప్పటికీ గృహ, వ్యవసాయ విద్యుత్కు ఇబ్బంది లేకుండా, డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంట్ సరఫరా చేస్తున్నాయి. రాష్ట్ర అవసరాలకు ఏపీ జెన్కో అత్యధికంగా థర్మల్ విద్యుత్ను ఉత్పత్తి చేసి ఆదుకుంటోంది. దీని నుంచి 98.082 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 5.470 మి.యూ, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.592 మి.యూ, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 38.058 మి.యూ, సెయిల్, హెచ్పీసీఎల్, గ్యాస్ వంటి ఇతర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి 27.531 మి.యూ, పవన విద్యుత్ ద్వారా 50.125 మి.యూ, సౌర విద్యుత్ నుంచి 22.507 మిలియన్ యూనిట్లు సమకూరుతోంది. బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.6.606 చొప్పున రూ.14.505 కోట్లతో 21.956 మిలియన్ యూనిట్ల విద్యుత్ను రోజుకు కొనుగోలు చేస్తున్నారు. బిహార్లో 5.53 మి.యూ, మహారాష్ట్రలో 2.07 మి.యూ, జార్ఖండ్లో 2.22 మి.యూ, హరియాణాలో 6.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి లోటు లేకుండా, అవసరం మేరకు బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి మరీ వినియోగదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
గ్రేటర్ ‘పవర్’ఫుల్..!
ఐటీ, అనుబంధ సంస్థల రాకతో నగరవాసుల ఆదాయం గణనీయంగా పెరిగింది. ధనిక, పేద తేడా లేకుండా ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు, టీవీలు, వాటర్ హీటర్లు, ఐరన్ బాక్స్లు, మిక్సీలు, గీజర్లు సర్వ సాధారణమయ్యాయి. ఫలితంగా తలసరి కరెంట్ వినియోగం కూడా భారీగా పెరిగింది. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 2,261 యూనిట్లకు చేరడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: నగరం శరవేగంగా విస్తరిస్తోంది. కోర్సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ, వాణిజ్య, పారిశ్రామిక భవనాలు వెలుస్తున్నాయి. నెలకు సగటున 2500–3000 వరకు కొత్త విద్యుత్ కనెక్షన్లు జత చేరుతున్నాయి. ఫలితంగా ఏటా విద్యుత్ వినియోగం రెండు నుంచి మూడు శాతం అధికంగా నమోదవుతున్నట్లు అంచనా. ఇక విద్యుత్ గృహోపకరణాల సంఖ్యా అదేస్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవుతుండటంతో సిటీజనాలు ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా ఆన్ చేసి ఉంచుతున్నారు. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ పీక్కు చేరుకుంది. రికార్డు స్థాయిలో డిమాండ్ రాష్ట్రం ఏర్పాటు సమయంలో గ్రేటర్ పీక్ సీజన్ డిమాండ్ 48 నుంచి 49 మిలియన్ యూనిట్లు (ఎంయూ) నమోదు కాగా... ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. మే 19న డిస్కం చరిత్రలోనే అత్యధికంగా 80 ఎంయూలు నమోదైంది. గత ఏడాది ఏప్రిల్ 28న 71.09 ఎంయూల విద్యుత్ వినియోగం నమోదు కాగా, ఈ సారి ఏకంగా ఎనిమిది ఎంయూలకు పైగా వినియోగం నమోదు కావడం గమనార్హం. రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో ఇంజనీర్లు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతుండటం, ఆయిల్ లీకేజీల కారణంగా బస్తీల్లోని పలు డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవుతుండటం, గంటల తరబడి సరఫరా నిలిచిపోతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు అప్రమత్తమై.. ఎప్పటికప్పుడు ఆయా సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. -
థర్మల్ ఉత్పత్తిలో ‘కోత’ లేదు
సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుదుత్పత్తిని సామర్థ్యంలో 50 శాతానికి తగ్గించాలని ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్ (ఐఈజీసీ) నిబంధనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల అవసరాల మేరకు థర్మల్ పవర్ స్టేషన్లు సగటున 73 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 240 నుంచి 255 మిలియన్ యూనిట్లు ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) రోజుకు సమారు 100 నుంచి 105 మిలియన్ యూనిట్లను గ్రిడ్కు సరఫరా చేస్తోంది. అంటే రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 నుంచి 45 శాతం వరకు ఏపీ జెన్కో నుంచే సమకూరుతోంది. అలాగని సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించడానికి లేదు. దీంతో పర్యావరణ హితం కోరి పవన, సౌరవిద్యుత్ వినియోగానికి ‘మస్ట్ రన్ స్టేటస్’ కింద అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇష్టానుసారం ఆపలేం సాధారణంగా లోడ్ డిస్పాచ్ సెంటర్ ఫ్రీక్వెన్సీని బట్టి గ్రిడ్కు విద్యుత్ను సరఫరా, స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. గ్రిడ్కు మనం ఎంత విద్యుత్ సరఫరా చేస్తామో అంత తీసుకోవచ్చు. ఎక్కువ (ఓవర్ డ్రా) తీసుకుంటే ఆ మేరకు చెల్లించాలి. అపరాధరుసుం భరించాలి. తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకుంటే దక్షణాది రాష్ట్రాల రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ హెచ్చరికలు జారీచేస్తుంది. తరచూ ఇలా చేస్తే గ్రిడ్ కనెక్షన్ తప్పిస్తుంది. మన అవసరాలకు మించి గ్రిడ్కు సరఫరా చేస్తే డిమాండు లేనప్పుడు అదనపు విద్యుత్కు పైసా రాదు. దీంతో విద్యుత్ డిమాండు ఎప్పుడు ఎలా ఉంటుందో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) ద్వారా అధికారులు నిత్యం పరిశీలిస్తుంటారు. డిమాండుకు తగ్గట్టు సరఫరా పెంచాలో, తగ్గించాలో వారు సూచిస్తారు. అయితే డిమాండు లేని సమయాల్లో థర్మల్ ప్లాంట్లను షట్డౌన్ చేసి డిమాండు పెరగ్గానే లైటప్ చేయడం వీలుకాదు. అందువల్ల ప్లాంట్లను ఆన్లోనే ఉంచాలి. అందుకే 55 శాతం సామర్థ్యంతో పనిచేసేలా ప్లాంట్లను సిద్ధంగా ఉంచడానికి ఏయే చర్యలు తీసుకోవాలో సూచనలు, సలహాలు, సాంకేతిక సహకారం ఇచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ ఏపీ జెన్కో ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) దరఖాస్తులు ఆహ్వానించింది. దుష్ప్రచారాలను నమ్మవద్దు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 45 శాతానికి, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్)లో 55 శాతానికి విద్యుదుత్పత్తిని తగ్గించి, రాష్ట్ర అవసరాలకు బయట కొనుగోలు చేసే ఎత్తుగడలో ప్రభుత్వం ఉందని కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి దుష్ప్రచారాలను ఎవరూ నమ్మనవసరం లేదు. సౌర, పవన విద్యుత్ అందుబాటులో ఉంటే దానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇది పర్యావరణపరంగా మంచిదైనందున పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయేతర విద్యుత్కు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. – కె.విజయానంద్, చైర్మన్, ఏపీ జెన్కో -
ఏపీలో ఆల్టైమ్ రికార్డు దాటిన కరెంట్ వినియోగం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగం ఆల్టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. తీవ్ర ఎండలతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 251 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఎనిమిదేళ్లలో ఇంత రికార్డు స్ధాయిలో విద్యుత్ వినియోగం జరగలేదు. ఎన్నడూ లేని విధంగా 12,660 మెగావాట్లకి పైగా విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో 255 మిలియన్ యూనిట్ల వరకు అత్యధిక వినియోగం పెరగవచ్చని విద్యుత్ శాఖ చెబుతోంది. మరో వారం రోజులపాటు ఇదే విధంగా విద్యుత్ డిమాండ్ కొనసాగనున్నట్లు విద్యుత్శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ తెలిపారు. అయితే ఊహించని డిమాండ్ ఏర్పడినా కూడా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతో బహిరంగ మార్కెట్ లో పదిరూపాయిలుండే యూనిట్ విద్యుత్ను 6.40 రూపాయిల నుంచి 7 రూ. లోపు కొంటున్నామని తెలిపారు.విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో రోజూ 30 నుంచి 40 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఆయన మాట్లాడుతూ..‘అత్యధిక డిమాండ్ కారణంగా ఉభయగోదావరి జిల్లాలలోని కొన్ని లైన్లలో వచ్చిన సాంకేతిక సమస్యలని సరిచేస్తున్నాం. నున్న- గుడివాడ విద్యుత్ లైన్కు ఏర్పడిన సమస్యలని పరిష్కరిస్తున్నాం. ఏపీలో ఇంత విద్యుత్ డిమాండ్ ఉన్నా కోతలు విధించలేదు. సాధారణంగా ఏప్రియల్ నెలలోనే విద్యుత్ డిమాండ్ ఉంటుంది. కానీ మే నెలలో ఎండలు తీవ్రంగా ఉండటంతో ఊహించని డిమాండ్ ఏర్పడింది. మే నెలలో 215 మిలియన్ యూనిట్ల వరకే వినియోగం ఉంటుందనుకున్నాం కానీ విద్యుత్ వినియోగం రికార్డుస్ధాయిలో 250 మిలియన్ యూనిట్లు దాటేసింది’ అని వెల్లడించారు. చదవండి: కోతల్లేని కరెంట్.. ప్రభుత్వ ముందు చూపు వల్లే సాధ్యం -
విద్యుత్ బిల్లులు భారం కాకుండా ఉండాలంటే.. ఇదొక్కటే మార్గం!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో చార్జీలు పెరగకుండా.. విద్యుత్ బిల్లులు భారం కాకుండా ఉండాలంటే.. కరెంటు వినియోగంలో పొదుపు ఒక్కటే మార్గమని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు. రాష్ట్రంలో పీక్ విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే వేళల్లో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గరిష్టంగా యూనిట్కు రూ.12 ధరతో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరుపుతున్నాయి. దీంతో డిస్కంల విద్యుత్ కొనుగోళ్ల వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఈ వ్యయభారాన్ని చివరకు వినియోగదారులపై బిల్లులను మరింతగా పెంచి బదిలీ చేయకతప్పదని ఆయన స్పష్టం చేశారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలకు ఈ బిల్లులు మోయలేని భారంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, విద్యుత్ పొదుపు చర్యలను పాటించి సలువుగా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అవసరం లేకున్నా విద్యుత్ను వృథాగా వినియోగిస్తుండడంతోనే బిల్లులు అధికంగా వస్తున్నాయని, విద్యుత్ పొదుపుపై రాష్ట్రంలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఈఆర్సీ తరఫున వినియోగదారులకు సూచనలు, సలహాలతో ఆదివారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తన్నీరు శ్రీరంగారావు -
తెలంగాణ చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మంగళవారం ఉదయం 10.03 నిమిషాలకు 15254 మెగా వాట్ల విద్యుత్ అత్యధిక ఫీక్ డిమాండ్ నమోదు అయ్యింది. రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరగడం, పారిశ్రామిక అవసరాలు పెరగడంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు వెల్లడించారు. మొత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానికే వినియోగింపబడుతోంది. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా, రెండో స్థానంలో తెలంగాణ ఉంది.నిన్న 14 138 మెగా వాట్లు కాగా రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 15254 మెగా వాట్లు రికార్డ్ స్థాయిలో నమోదు ఇదే. గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా, ఈసారి డిసెంబర్ నెలలోనే గత సంవత్సరం రికార్డ్ను అధిగమించి ఈ నెలలోనే 14750 మెగా వాట్ల ఫీక్ విద్యుత్ వినియోగం దాన్ని అధిగమించి 15254 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదైంది. ఈ ఏడాది వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఎంత డిమాండ్ వచ్చిన సరఫరాకు అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ప్రభాకర్రావు తెలిపారు. మార్చి నెలలో 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుందని ముందే ఉహించాం. అందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా కు ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర రైతాంగంకు,అన్ని రకాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎండీ అన్నారు. చదవండి: TSPSC: మరో సంచలనం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్.. ఆ పేపర్ కూడా లీక్ అయ్యిందా? -
ఏపీ ‘పవర్’ఫుల్.. పెరిగిన తలసరి విద్యుత్
ఏ రాష్ట్రంలో అయినా పౌరులకు సరిపడినంత స్థాయిలో విద్యుత్ అందుబాటులో ఉందంటే ఆ రాష్ట్రంలో ఉత్పాదకత, జీవన ప్రమాణాలు మెరుగైన స్థితిలో ఉన్నాయని అర్థం. ఆర్థిక అభివృద్ధికి విద్యుత్ వినియోగాన్ని సైతం ప్రామాణికంగా తీసుకుంటారు. అలాంటి అత్యుత్తమ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని మరోసారి రుజువైంది. రాష్ట్రంలో తలసరి విద్యుత్ లభ్యత పెరుగుదలే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. 2018లో తలసరి విద్యుత్ లభ్యత 1,180.3 యూనిట్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడది 1,378.6 యూనిట్లకు పెరిగింది. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహం, బలపడుతున్న విద్యుత్ వ్యవస్థల కారణంగానే ఇది సాధ్యమైంది. సాక్షి, అమరావతి: వినియోగదారులకు అత్యధిక విద్యుత్ను అందుబాటులో ఉంచేందుకు ఏపీ ట్రాన్స్కో మెరుగైన నెట్వర్క్ మెయింటెనెన్స్, మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టింది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) అంతర్గత డిమాండ్ అంచనా నమూనాను అభివృద్ధి చేసింది. ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీ ఎస్ఎల్డీసీ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి మరింత అధునాతన అంతర్గత ఎనర్జీ ఫోర్ కాస్టింగ్ మోడల్ను అభివృద్ధి చేసింది. తద్వారా ఎప్పటికప్పుడు అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేయగలుగుతోంది. మరోవైపు పంపిణీ వ్యవస్థను డిస్కంలు మెరుగుపరుచుకుంటున్నాయి. దీంతో 2018–19లో 16.36 శాతంగా ఉన్న యాగ్రిగేట్ టెక్నికల్, కమర్షియల్ (ఏటీసీ) నష్టాలు 2021–22లో 11.21 శాతానికి తగ్గాయి. 5.15 శాతం తగ్గుదలతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు దేశంలోనే అత్యుత్తమమని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రకటించింది. మున్ముందు మరింత మెరుగ్గా.. రాష్ట్రంలోని 1.92 కోట్ల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు డిస్కంలు ‘కన్సూ్యమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ నివేదికలో ఇప్పటికే ‘ఏ’ గ్రేడ్ సాధించాయి. రానున్న రోజుల్లో సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ‘లాస్ డిడక్షన్ వర్క్స్’ పేరుతో ఏపీ ఈపీడీసీఎల్లో రూ.2,617.54 కోట్లు, ఏపీ సీపీడీసీఎల్లో రూ.1,498.5 కోట్లు, ఏపీ ఎస్పీడీసీఎల్లో రూ.5,160.64 కోట్లు వెచ్చించాలని భావిస్తున్నాయి. విద్యుత్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దానివల్ల ప్రజలు, విద్యుత్ సిబ్బంది ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు కూడా విద్యుత్ సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. భద్రతా చర్యలలో భాగంగా స్ప్రింగ్ చార్జ్ బ్రేకర్స్ స్థానంలో సాంకేతికంగా మెరుగైన ‘ఫాస్ట్ యాక్టింగ్ పర్మినెంట్ మాగ్నెట్ యాక్యుయేటర్’ మెకానిజం టైప్ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లతో భర్తీ చేయాలని డిస్కంలు ఇప్పటికే ప్రతిపాదించాయి. ప్రభుత్వ ప్రోత్సాహం గడచిన మూడేళ్లలో డిస్కంలకు ప్రభుత్వం రూ.40 వేల కోట్లకుపైగా ఆర్థిక సాయం అందించింది. దీంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి పరుచుకుంటున్నాం. మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నాం. ఆధునిక సాంకేతికతతో వినియోగదారులకు అధిక విద్యుత్ను అందుబాటులో ఉంచుతున్నాం. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ మనమే ఆదర్శం విద్యుత్ కొరత ఏర్పడితే బహిరంగ మార్కెట్ నుంచి అత్యధిక ధరకు కొనైనా సరే వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వమే ఆర్థికంగా చేయూతనిస్తోంది. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అత్యాధునిక సబ్స్టేషన్లు నిర్మిస్తున్నాం. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, మరమ్మతులను తరచుగా నిర్వహిస్తున్నాం. – జె.పద్మాజనార్దనరెడ్డి, సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్ -
ఇంధన పొదుపులో ఏపీనే లీడర్
సాక్షి, విశాఖపట్నం: ఇంధన సామర్థ్య నిర్వహణలో అన్ని రాష్ట్రాలకు ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఏపీఎస్ఈసీఎం) లీడర్గా వ్యవహరిస్తోందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సెక్రటరీ రాకేష్ కే రాయ్ వెల్లడించారు. ఎనర్జీ ఎఫిషియన్సీలో మిగిలిన రాష్ట్రాలకు ఏపీని బ్రాండ్గా చూపిస్తున్నామని తెలిపారు. ఇంధన పొదుపునకు ప్రత్యేకంగా స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ (ఎస్డీఏ)లు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని చెప్పారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు. వాటిలో ప్రధానమైనవి.. ఏపీలో ఏటా రూ.3,500 కోట్లు ఆదా ఇంధన సామర్థ్య చర్యల్ని పటిష్టంగా అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉంది. అన్ని రాష్ట్రాలకూ ఏపీఎస్ఈసీఎం ఆదర్శంగా నిలుస్తోంది. ఇందుకోసం ఏపీలో ప్రత్యేకంగా ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్, స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ఏపీ అనుసరిస్తున్న విధానాల్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయించాం. దేశంలో తొలిసారిగా రాష్ట్రపతి అవార్డుని ఏపీఎస్ఈసీఎం దక్కించుకోవడం ఇంధన పొదుపుపై ఏపీ విధానాలకు నిదర్శనం. ఇప్పటికే పవర్ ప్లాంట్స్, సిమెంట్, టెక్స్టైల్స్, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఇలా.. రాష్ట్రంలోని మొత్తం 53 గుర్తింపు పొందిన భారీ పరిశ్రమలు బీఈఈ ప్రమాణాలకు అనుగుణంగా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేస్తున్నాయి. దీని ద్వారా 3,430 మిలియన్ యూనిట్లు ఆదా చేస్తున్నాయి. దీని ద్వారా పెర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ (ప్యాట్) అమలులో ఏపీ ఇప్పటికే అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. ఏపీలోని పరిశ్రమల్లో ఇంధన పొదుపు ద్వారా ఏటా రూ.3,500 కోట్లు ఆదా అవుతోంది. ఏపీలో 12 వేల ఎనర్జీ క్లబ్లు ఏర్పాటు ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీఈఈ విభిన్న కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్తు వారధులైన విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలని భాగస్వామ్యం చేస్తూ దేశవ్యాప్తంగా లక్ష ఎనర్జీ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో 12 వేల క్లబ్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి క్లబ్కు ఏటా రూ.10 వేలు నిధులు సమకూరుస్తాం. ఈ క్లబ్లు విద్యార్థుల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తాయి. త్వరలో వలంటరీ కార్బన్ ట్రేడ్.. బీఈఈ అడ్మినిస్ట్రేటర్గా ఈ ఏడాది నుంచి వలంటరీ కార్బన్ ట్రేడింగ్ ఫ్రేమ్ వర్క్కు సిద్ధమవుతున్నాం. ఇంధన పొదుపు పాటించే ప్రతి పరిశ్రమకు కర్బన ఉద్గారాల నియంత్రణకు సంబంధించి బీఈఈ ఈ ట్రేడ్ ధ్రువపత్రం అందిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ మరో 1.5 డిగ్రీలు దాటితే మరింత కర్బన ఉద్గారాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే రుతుపవనాల రాకలో కూడా తీవ్రమైన మార్పులుంటాయి. దీనిని నియంత్రించడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశంలో 2030 నాటికి కర్బన ఉద్గారాలు 45 శాతం తగ్గించే లక్ష్యంతో రోషనీ అనే కార్యక్రమాన్ని బీఈఈ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంధన సామర్థ్య సాంకేతికత సాయంతో విద్యుత్, ఇతర ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించేందుకు నిర్మాణాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో కర్బన ఉద్గారాల నియంత్రణలో భారత్ దిక్సూచిగా మారబోతోంది. మనం ఆదా చేసే విద్యుత్ శ్రీలంక సరఫరాతో సమానం ఇంధన సామర్థ్యం విషయంలో భారత్.. మిగిలిన దేశాలతో పోలిస్తే.. అద్భుతంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో తలెత్తబోయే ప్రమాదాలను ముందే పసిగట్టిన ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు.. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలోని 13 రంగాలకు చెందిన పరిశ్రమలు ఇంధన సామర్థ్యాల్ని అమలు చేస్తుండటం వల్ల ఏటా రూ.48 వేల కోట్లు ఆదా విద్యుత్ వినియోగం అవుతోంది. ఇది శ్రీలంక వంటి దేశాలకు విద్యుత్ సరఫరాతో సమానం. ఈ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. -
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. ఫ్యాన్లు గిరాగిర, కూలర్లు, ఏసీలు ఆన్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు బ్రేక్ పడింది. కానీ.. పక్షం రోజులుగా పొడి వాతావరణం, ఎండలు మండుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిరుజల్లులు, మబ్బులతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఫలితంగా ఉక్కపోతకు తట్టుకోలేక సిటీజనులు అల్లాడిపోతున్నారు. ఉపశమనం కోసం మళ్లీ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఆన్ చేస్తున్నారు. దీంతో నగరంలో విద్యుత్ డిమాండ్ అన్యూహ్యంగా పెరిగింది. వారం రోజుల క్రితం వరకు గ్రేటర్ సగటు విద్యుత్ డిమాండ్ 52–55 మిలియన్ యూనిట్లుగా ఉండగా, తాజాగా 61 ఎంయూలకు పైగా నమోదవుతుండటం విశేషం. ఉక్కపోత కారణంగా కరెంట్ వినియోగం రెట్టింపవడంతో మీటర్లు గిర్రున తిరుగుతూ స్లాబ్రేట్లు మారి భారీగా బిల్లులు చేతికి అందుతుండటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. హీటెక్కుతున్న పీటీఆర్లు ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరగడం, పగటి ఉష్ణోత్రలు కూడా భారీగా నమోదవుతుండటంతో సబ్ స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఒత్తిడిని తట్టుకోలేక ఫీడర్లు తరచూ ట్రిప్పవుతుండటంతో సరఫరాలో అంతరాయం తప్పడంలేదు. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు ఇంట్లో కరెంట్ కూడా లేకపోవడం, బహుళ అంతస్తుల సముదాయాల్లో ఏర్పాటు చేసిన జనరేటర్లు కూడా చాలా వరకు వినియోగంలో లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మంచినీటి మోటార్లు, లిఫ్ట్లు పని చేయకపోవడంతో మీటర్ రీడింగ్ నమోదు, బిల్లుల జారీ కోసం ఆయా నివాసాలకు వెళ్లిన సిబ్బంది ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈ సీజన్లో అత్యధికం విద్యుత్ వినియోగం సాధారణంగా వేసవిలో మాత్రమే 60 ఎంయూలు దాటుతుంది. వర్షాకాలం, చలికాలంలో చాలా తక్కువ వాడకం నమోదవుతుంది. కానీ ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గత రెండు రోజుల నుంచి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది ఇదే రోజు 2392 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా తాజాగా శుక్రవారం 2984, శనివారం 2998 మెగావాట్లు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం నగరంలో డెంగీ కారక దోమలు విజృంభిస్తున్నాయి. రాత్రి పూట కరెంట్ లేకపోవడంతో ఉక్కపోతకు తోడు దోమలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆకస్మిక విరామం వల్లే శుక్రవారం నగరంలో 32.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శనివారం 34 డిగ్రీలకు చేరింది. రుతుపవనాల మధ్య విరామమే ఆకస్మిక ఉక్కపోతకు కారణం. ప్రస్తుతం వర్షాకాలమే అయినా రుతుపవనాలు బలహీన పడటం వల్ల అల్పపీడనాలు ఏర్పడడం లేదు. పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడి వేడి పెరిగింది. గాలిలో తేమ తగ్గిపోవడం వల్ల అధిక ఉక్కపోత నమోదవుతోంది. రుతుపవనాల మధ్యలో ఆకస్మిక విరామం వస్తే ఈ తరహా పరిస్థితి ఉత్పన్నమవుతుంది. – కె. నాగరత్న, ఐఎండీ డైరెక్టర్ -
AP: మళ్లీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. అసని తుపాను ప్రభావంతో తగ్గిన డిమాండ్.. మళ్లీ పెరుగుతోంది. విద్యుత్ డిమాండ్ గత నెలతో పోల్చితే ప్రస్తుతం భారీగా తగ్గింది. ఏప్రిల్లో అత్యధికంగా రోజుకు 235 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వరకూ చేరిన వినియోగం కొద్ది రోజుల క్రితం అసని తుఫాను ప్రభావం వల్ల తగ్గుముఖం పట్టింది. చదవండి: ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ? వాతావరణం చల్లబడటంతో ఈ నెల 11వ తేదీన 151.43 మిలియన్ యూనిట్లకు తగ్గింది. దీంతో వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో విద్యుత్ అందిస్తూనే, పరిశ్రమలపై ఉన్న ఆంక్షలను దాదాపు ఎత్తేశారు. కానీ అంతలోనే పెరగడం మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 172.86 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. కొనుగోలుకు రూ.2,687.81 కోట్లు ఖర్చు దేశవ్యాప్తంగా ఏర్పడ్డ బొగ్గు సంక్షోభం కారణంగా ఏర్పడ్డ విద్యుత్ కొరతకు ఏప్రిల్ నెల ప్రారంభంలో రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ తోడైంది. ఫలితంగా కొద్ది రోజులు వినియోగదారులు విద్యుత్ కోతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వెంటనే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించింది. పరిశ్రమల విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించింది. గృహాలు, వ్యవసాయానికి ఆటంకం లేకుండా సరఫరా చేసింది. ఇందుకోసం మొదట్లో బహిరంగ మార్కెట్లో రోజుకు సుమారు రూ.70 కోట్లు, ఆ తరువాత రోజుకి రూ.40 కోట్లు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేసింది. మార్చి నుంచి ఇప్పటివరకూ బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకే రూ.2,687.81 కోట్లు వెచ్చించింది. ఫలితంగా నేటికీ ఉత్తరప్రదేశ్లో రోజుకు 1.34 ఎంయూ, బీహార్లో 1.44 ఎంయూ, జార్ఖండ్లో 2.03 ఎంయూ, రాజస్థాన్లో 0.65 ఎంయూ కొరత ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. అందుబాటులో 208.63 మిలియన్ యూనిట్లు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల నుంచి జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి డిమాండ్ కంటే ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం (ఈ నెల 13న) ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి 78.45 ఎంయూ, ప్రైవేటు థర్మల్ కేంద్రాల నుంచి 10.75 ఎంయూ, సెంట్రల్ గ్యాస్ స్టేషన్లు నుంచి 39.62 ఎంయూ, హైడ్రో స్టేషన్ల నుంచి 5.48 ఎంయూ, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ (ఐపీపీ) నుంచి 8.74 ఎంయూ, పవన విద్యుత్ 27.85 ఎంయూ, సౌర విద్యుత్ 17.65 ఎంయూ సమకూరుతోంది. 20.09 ఎంయూ బయటి నుంచి కొన్నారు. మొత్తం 208.63 ఎంయూ అందుబాటులో ఉంది. ప్రస్తుత వినియోగం 172.86 ఎంయూ మాత్రమే ఉంది. దీంతో ఒప్పందాల మేరకు సుమారు 35 ఎంయూను ఇతరులకు విక్రయించారు. మళ్లీ విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో మరికొద్ది రోజులు జాగ్రత్త అవసరమని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. -
అమ్మో! ఎండ వేడి...రికార్డు స్థాయిలో విద్యుత్ వాడకం.. ఇదే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. గ్రేటర్ జిల్లాల వాసులు ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇంట్లోని కరెంట్ మీటరు గిరగిరా తిరుగుతోంది. కేవలం వ్యక్తిగత వినియోగం మాత్రమే కాదు గ్రేటర్ సగటు విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. తాజాగా శనివారం 64.5 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఇప్పటికే డిస్కం గృహ విద్యుత్ వినియోగంపై యూనిట్కు 50 పైసలు, వాణిజ్య విద్యుత్ వినియోగంపై యూనిట్కు రూపాయి చొప్పున పెంచింది. ఏప్రిల్ నెల నుంచి పెంచిన బిల్లులను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఫీడర్లు, డీటీఆర్లపై ఒత్తిడి.. ►గ్రేటర్లోని మూడు జిల్లాల పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 55 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 45.50 లక్షలు గృహ, 7.30 లక్షల వాణిజ్య, 44 వేల పారిశ్రామిక, 1.40 లక్షల వ్యవసాయ, 45 వేల వీధి దీపాల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2019 మే 30న అత్యధికంగా 73.9 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. 2021 మే నెలలో అత్యధికంగా 68 ఎయూలు నమోదైంది. ►ఐటీ అనుబంధ రంగాలతో పాటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. కేవలం గృహ విద్యుత్ విని యోగం మాత్రమే కాకుండా వాణిజ్య, పారిశ్రామిక వినియోగం కూడా రెట్టింపైంది. ఫలితంగా ప్రస్తుతం రోజు సగటు విద్యుత్ వినియోగం 60 యూనిట్లు దాటింది. ఏప్రిల్ చివరి నాటికి 75– 80 ఎంయూలకు చేరే అవకాశం లేకపోలేదు. చదవండి: హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో.. -
సక్సెస్ స్టోరీ: యంగ్ అండ్ ఎనర్జిటిక్
కరెంటు బిల్ అనే మాట వినబడగానే... కొండంత భయం ఎదురొచ్చి నిలుచుంటుంది. ఆ కొండను కోడిగుడ్డు స్థాయికి తగ్గించలేమా? కరెంటు బిల్లు అనేది పెద్ద ఖర్చు కాదు. విద్యుత్ వృథాను అరికడితే ‘బిల్’ మనల్ని కనికరిస్తుంది. ‘వెరీగుడ్’ అని వెన్నుతట్టేలా చేస్తుంది. మరి విద్యుత్ వృథాను అరికట్టాలంటే? 26 సంవత్సరాల గోకుల్ శ్రీనివాస్ సక్సెస్ స్టోరీని తెలుసుకోవాల్సిందే... ఒకప్పటి మాదిరిగా ఇంట్లో లైట్ వెలగడానికి మాత్రమే మనం కరెంట్ను ఖర్చు చేయడం లేదు. ఇస్త్రీ పెట్టె, ఫ్యాన్, మిక్సీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ వోవెన్, కంప్యూటర్... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. విద్యుత్ వినియోగానికే పరిమితమైన మనం ‘వృథా’ను అంతగా పట్టించుకోవడం లేదు. లేదా అవగాహన ఉండడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చిందే ‘మినియన్’ డివైజ్. దీని సృష్టికర్త గురించి... హైస్కూల్ రోజుల్లో గోకుల్ శ్రీనివాస్కు ‘హాకీ’ అంటే ప్రాణం. ఈ ఆటలో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని కలలు కన్నాడు. అయితే ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అతని కలలు అవిరైపోయాయి. హాకీ గట్టిగా ఆడలేని పరిస్థితి. కట్ చేస్తే... చదువు పూర్తయిన తరువాత అమెజాన్ ఐటీలో ఉద్యోగం వచ్చింది. సంవత్సరం పూర్తయిన తరువాత ‘ఇది మనకు సెట్ అయ్యే జాబ్ కాదు’ అనిపించింది. తనకు ‘ఎలక్ట్రానిక్స్’ అంటే చా...లా ఇష్టం. రకరకాల డివైజ్లు తయారుచేశాడు. అలా తయారు చేసిందే మినియన్ (మిని+ఆన్) సంప్రదాయ విధానాల్లో ‘ఎనర్జీ మానిటరింగ్’ అనేది సంక్లిష్టమైన విషయం.‘మినియన్’ డివైజ్తో మాత్రం విద్యుత్ వాడకానికి సంబంధించి మానిటరింగ్, ఎనాలసిస్ చేయడం సులభం. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఎంఎల్ (మెషిన్ లెర్నింగ్) వైర్లెస్ డివైజ్ ‘మినియన్’అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజ్లో ఉంటుంది. వృథాను అరికట్టడం మాత్రమే కాదు... ఏదైనా విద్యుత్ ఉపకరణాన్ని రిపేర్ చేయించాల్సిన పరిస్థితి వస్తే అలర్ట్ చేస్తుంది. ‘మినియన్ ల్యాబ్స్’ పేరుతో బెంగళూరులో అంకుర సంస్థను మొదలుపెట్టాడు శ్రీనివాస్. ఇది అంతర్జాతీయ స్థాయిలో హిట్ అయింది. ఇళ్లు, ఆఫీసు, ఫ్యాక్టరీ...లలో ఇంధన వృథాను గణనీయంగా అరికడుతూ ప్రశంసలు అందుకుంటోంది. ‘విద్యుత్ వృథాను అరికట్టడం అనేది వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు సామాజిక బాధ్యత కూడా’ అంటారు. యువత ‘మినియన్’లాంటి ఇంధన వృథాను అరికట్టే పరికరాలను మరిన్ని తయారుచేస్తే ఆ బాధ్యత నెరవేర్చడం సులువవుతుంది. -
Power Saving Tips: ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లులు తక్కువ రావడం ఖాయం!
Power Saving Tips For House: ఎండా కాలం, చలి కాలం, వానా కాలం.. ఇలా సీజన్లతో సంబంధం లేకుండా కరెంట్ బిల్లులు సామాన్యుడికి గుబులు పుట్టిస్తున్నాయి. ఈమధ్య కాలంలో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ చాలామంది గగ్గోలు పెడుతూ.. కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండడం చూస్తున్నాం. మరి కరెంట్ వినియోగం కూడా అదే స్థాయిలో ఉంటోంది కదా!. అందుకే ఆదా చేసే మార్గాలు ఉన్నప్పుడు.. కరెంట్ బిల్లులను తగ్గించుకోవడం మన చేతల్లోనే ఉంటుందని గుర్తు చేస్తున్నారు నిపుణులు. పైగా అవి సింపుల్ చిట్కాలే!. వ్యాంపైర్ అప్లియెన్సెస్.. కరెంట్ను జలగల్లా పీల్చేస్తాయి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. కాబట్టే వీటికి వ్యాంపైర్ అని పేరు పెట్టారు. విశేషం ఏంటంటే.. ఆఫ్లో ఉన్నా కూడా ఇవి ఎంతో కొంత కరెంట్ను లాగేస్తుంటాయి కూడా. సెల్ఫోన్ ఛార్జర్ల మొదలు.. వైఫై రూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ఐరన్బాక్స్లు, వాషింగ్మెషీన్, ల్యాప్ట్యాప్లు.. ఇలా ఫ్లగ్గులో ఉండి కూడా ఆఫ్లో ఉన్నప్పుడు కరెంట్ను తీసుకుంటాయి. అందుకే వినియోగించనప్పుడు వాటిని ఫ్లగ్ల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఈరోజుల్లో స్టాండ్బై మోడ్ ఆప్షన్తో వస్తున్నా.. అవి ఎంతో కొంత వాట్లలో పవర్ను లాగేస్తున్నాయి. కాబట్టి, వీటి విషయంలో ఈ చిన్న సలహా పాటిస్తే బెటర్. సంబంధిత కథనం: ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసా? కెపాసిటీకి తగ్గట్లు.. వాషింగ్ మెషిన్, గ్రీజర్-వాటర్ హీటర్, ఏసీలు.. ఇలా హెవీ అప్లయెన్సెస్ ఏవి వాడినా కరెంట్ బిల్లు ఎక్కువగానే వస్తుంటుంది. కానీ, వాటిని వాడే విధానంలో తేడాల వల్లే బిల్లులు అంతలా వస్తుంటాయని తెలుసా?. కాబట్టి, ఒక పద్దతిలోనే వాటిని వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు వాషింగ్ మెషిన్ను ఫుల్ కెపాసిటీతో కాకుండా తక్కువ కెపాసిటీతో ఉపయోగించడం. అంటే తక్కువ బట్టలు వేసి.. రెగ్యులర్గా ఉతకడం. దీనివల్ల ఫుల్ కెపాసిటీ టైంలో పడే లోడ్ పడి కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. వాషింగ్ మెషిన్లు మాత్రమే కాదు.. ఏసీలు, హీటర్లు, గ్రీజర్లు.. ఇలా ఏవైనా సరే వాటి లెవల్కు తగ్గట్లుగా స్మార్ట్గా ఉపయోగించడం వల్ల కరెంట్ బిల్లులను తగ్గించుకున్న వాళ్లు అవుతాం. ఇక కొత్తగా అప్లియెన్సెస్ కొనాలనుకుంటే.. వాటి రేటింగ్ను పరిగణనలోకి తీసుకోవడం అస్సలు మరవద్దు. తద్వారా కరెంట్ కన్జంప్షన్ తగ్గుతుంది. కరెంట్ సేవింగ్లో ఇదే ముఖ్యం బల్బులు, సీలింగ్ ఫ్యాన్లు ఇంటి ప్రాథమిక అవసరాలు. అలాగే కరెంట్ బిల్లుల విషయంలో వీటి భాగస్వామ్యం కూడా ఎక్కువే!. చివరికి కరెంట్ తక్కువ లాగుతాయనుకునే.. సీఎల్ఎఫ్, ఎల్ఈడీ బల్బులు సైతం ఆఫ్ కరెంట్ను ఎక్కువే తీసుకుంటాయి. కాబట్టి, అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయడం, తక్కువ స్పేస్లో పని చేస్తున్నప్పుడు ఫోర్టబుల్ ల్యాంపులు, స్టడీ ల్యాంపులు ఉపయోగించడం బెటర్. పాతవి ఎక్కువే.. పాత అప్లియెన్సెస్.. కొత్తగా వస్తున్నవాటికన్నా ఎక్కువ ఎనర్జీని లాగేస్తాయి. అందుకు కారణం.. ఆప్టియం ఏజ్. అంటే కాలం చెల్లడంలాంటిదన్నమాట. అందుకే పాత అప్లియెన్సెస్ను మార్చేసి.. మంచి రేటింగ్ ఉన్న అప్లియెన్సెస్ను ఉపయోగించాలి. మాటిమాటికీ అక్కర్లేదు.. మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, దోమల బ్యాట్లు, ఛార్జింగ్ లైట్లు.. అవసరం లేకున్నా ఛార్జింగ్ పెట్టడం కొందరికి ఉండే అలవాటు. ముఖ్యంగా సెల్ఫోన్ ఛార్జింగ్ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, దీనివల్ల కరెంట్ అడ్డగోలుగా కాలుతుంది. అందుకే అత్యవసం అయితేనే ఛార్జింగ్ పెట్టాలి. అవసరం లేనప్పుడు ఫ్లగ్ల నుంచి ఛార్జర్లను తొలగించాలి మరిచిపోవద్దు. కరెంట్ బిల్లులు మోగిపోవడానికి, మీటర్ గిర్రున తిరగడం ఒక్కటే కారణం కాదు. ఎంత ఉపయోగిస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ, చిన్న చిన్న జాగ్రత్తలు, టిప్స్ పాటిస్తూ కరెంట్ను ఆదా చేయడంతో పాటు జేబుకు చిల్లుపడకుండా చూసుకోవచ్చు. -
ఏపీలో పెరిగిన సగటు విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. బొగ్గు సంక్షోభంలోనూ డిమాండ్కు తగినట్టుగా విద్యుత్ అందిస్తూ రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నాయి. తీవ్ర బొగ్గు కొరత వల్ల అక్టోబర్లో అనేక రాష్ట్రాలు ఇబ్బందులు పడినా.. ఏపీలో మాత్రం జాతీయ సగటు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం నమోదయ్యింది. సంక్షోభంలోనూ రికార్డు.. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి, వినియోగదారుల సంక్షేమానికి.. నిరంతరం విద్యుత్ సరఫరా అందించటం కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగినట్లే విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇంధన శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా జాతీయ సగటు విద్యుత్ వినియోగం అక్టోబర్లో 4.8 శాతం పెరిగితే, ఏపీలో ఏకంగా 17.2 శాతం పెరిగింది. గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 4,972 మిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది అక్టోబర్లో 5,828 మిలియన్ యూనిట్లకు చేరింది. దేశంలో గతేడాది అక్టోబర్లో 109.17 బిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది 114.37 బిలియన్ యూనిట్లకు చేరింది. ఇక గతేడాది అక్టోబర్ 31న రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ వినియోగం 8,820 మెగావాట్లుగా ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్ 19న గరిష్ట విద్యుత్ వినియోగం 9,865 మెగావాట్లుగా నమోదైంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాజీ లేదు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన, చౌక విద్యుత్ అందించే విషయంలో ప్రభుత్వం రాజీపడదని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ చెప్పారు. విద్యుత్ డిమాండ్పై ఏపీ ట్రాన్స్కో, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ విభాగాలతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. చౌక విద్యుత్ సరఫరాలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని సీఎం జగన్ లక్ష్యమని శ్రీకాంత్ తెలిపారు. భవిష్యత్లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు వంద శాతం నమ్మకమైన, నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు అవసరమైన కృషి జరగాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. సమావేశంలో ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇమ్మడి పృథ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డైరెక్టర్ కె.ప్రవీణ్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వినియోగదారులకు నాణ్యమైన చౌక విద్యుత్ను అందించేందుకు, రాష్ట్రానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు ఇంధన శాఖ అధికారులు చేస్తున్న కృషిని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభినందించారు. -
ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసుకోండి
టెక్ ఏజ్లో సాంకేతికతకు పవర్ తోడైతేనే రోజువారీ పనులు జరిగేది. విచ్చల విడిగా వాడేస్తూ.. నెల తిరిగే సరికి కరెంట్ బిల్లును చూసి కళ్లు పెద్దవి చేసేవాళ్లు మనలో బోలెడంత మంది. అయితే మనకు తెలియకుండానే కరెంట్ను అదనంగా ఖర్చు చేస్తున్నామని తెలుసా?.. అదీ ఆఫ్ చేసినప్పటికీ!. యస్.. మొత్తం పవర్ బిల్లులలో మినిమమ్ 1 శాతం.. పవర్ ఆఫ్ చేసిన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వల్ల వస్తుందని ఇండియన్షెల్ఫ్ ఓ కథనం ప్రచురించింది. టెలివిజన్ సెట్స్.. చాలామంది టీవీలు చూస్తూ రిమోట్ ఆఫ్ చేసి వేరే పనుల్లో మునిగిపోతారు. లేదంటే రాత్రిళ్లు పడుకునేప్పుడు టీవీలను స్విచ్ఛాఫ్ చేయకుండా వదిలేస్తారు. ఇలా చేయడం స్టాండ్బై మోడ్లోకి వెళ్లే టీవీ.. రోజుకి 24 వాట్ల పవర్ను తీసుకుంటుంది. ఇది తక్కువే అనిపించినా.. రోజుల తరబడి లెక్క ఎక్కువేగా అయ్యేది!. సెల్ఫోన్ ఛార్జర్.. చాలామంది నిర్లక్క్ష్యం వహించేది దీని విషయంలోనే. ఫోన్ ఛార్జింగ్ అయ్యాకో, మధ్యలో ఫోన్ కాల్ వస్తేనో స్విచ్ఛాఫ్ చేయకుండా ఫోన్ నుంచి పిన్ తీసేస్తుంటారు. కానీ, పవర్ బటన్ను ఆఫ్ చేయడమో, సాకెట్ నుంచి ఛార్జర్ను తీసేయడమో చేయరు. ఛార్జర్ సగటున రోజుకి 1.3 వాట్ల పవర్ను లాగేసుకుంటుంది. అంతేకాదు ఛార్జర్ పాడైపోయే అవకాశం.. ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వైఫై మోడెమ్.. స్విచ్ఛాఫ్ చేయకుండా ఉంచే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఇదే. ఇంటర్నెట్ను ఉపయోగించినా లేకున్నా, వైఫై పరిధి నుంచి మొబైల్స్, తదితర డివైజ్లు దూరంగా వెళ్లినా సరే.. 24/7 వైఫైలు ఆన్లోనే ఉంటాయి. ప్రత్యేకంగా ఇది ఎంత కరెంట్ కాలుస్తుందనేది ప్రత్యేకంగా చెప్పలేకపోయినా.. ఉపయోగించనప్పుడు, బయటికి వెళ్లినప్పుడు ముఖ్యంగా రాత్రిళ్లు పడుకునేప్పుడు ఆఫ్ చేసి ఫ్లగులు తీసేయడం బెటర్. మైక్రో ఓవెన్స్.. ఇది తక్కువ మంది ఇళ్లలో ఉండొచ్చు. కానీ, చాలామంది వీటిని పూర్తిగా ఆఫ్ చేయకుండా వదిలేస్తుంటారు. కానీ, మైక్రో ఓవెన్స్, ఓవెన్స్లు ఒకరోజులో 108 వాట్ల పవర్ను లాగేస్తాయి. సో.. వాడనప్పుడు వాటిని అన్ఫ్లగ్ చేయడం ఉత్తమం. మరికొన్ని.. పెద్దసైజులో ఉండే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లు వాషింగ్ మెషిన్స్, ఫ్రిడ్జ్(పెద్దగా పాడయ్యే సామాన్లు లేనప్పుడు)లతో పాటు డ్రైయర్స్, మిక్సర్లు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, టేబుల్ ఫ్యాన్లు, బ్లూటూత్ స్పీకర్లు ఆఫ్ చేయడం ముఖ్యంగా అన్ఫ్లగ్ చేయడం మంచిది. వర్క్ ఫ్రమ్ హోంలో చాలామంది ల్యాప్టాప్లను సిచ్ఛాఫ్ చేసినా అన్ఫ్లగ్ చేయరు. అడిగితే చాలామంది టైం ఉండదంటూ సాకులు చెప్తుంటారు. లేదంటే పరధ్యానంలో మరిచిపోతుంటారు. ఇంకొందరు ఓస్ అంతే కదా అని బద్ధకిస్తుంటారు. కానీ, పవర్సేవింగ్ను ఒక బాధ్యతగా గుర్తిస్తే.. కరెంట్ను ఆదా చేయడం, అప్లయన్సెస్ను పాడవకుండా కాపాడుకోవడంతో పాటు ఖర్చుల్ని తగ్గించుకున్నవాళ్లు అవుతారు. -సాక్షి, వెబ్డెస్క్ -
విద్యుత్లో తెలంగాణ నయా రికార్డు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: విద్యుత్ సరఫరాలో తెలంగాణ మరోసారి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఉమ్మడి ఏపీలో సైతం ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈ సీజన్లో అత్యధిక వినియోగం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి చివరి వారం (23న) అత్యధికంగా 13,162 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఈ నెల మొదటి వారంలో ఒక్క తెలంగాణలోనే 13,141 మెగావాట్ల వినియోగం జరగడం రికార్డుగా విద్యుత్ సరఫరా సంస్థలు ప్రకటించాయి. వాతావరణం చల్లబడి, వరి కోతలు చేపడుతున్న సమయంలో శుక్రవారం కూడా భారీగా విద్యుత్ వినియోగం అయినట్లు నమోదైంది. ఈ సీజన్లో ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్), దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) విద్యుత్ సరఫరా చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఏటా పెరుగుతున్న విద్యుత్ వినియోగం టీఎస్ ఎన్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీఎల్ పరిధిలో ఏటేటా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన విద్యుత్ వినియోగం వివరాలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ప్రకటించాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2021’ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2016-17లో తెలంగాణలో 9,187 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవగా 2017-18లో అది 10,284 మెగావాట్లకు చేరింది. అలాగే 2018-19లో 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదుకాగా 2019–20లో డిమాండ్ 11,703 మెగావాట్లకు చేరింది. దేశ సగటు వృద్ధి శాతం 3.44గా నమోదవగా తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 8.18 శాతంగా నమోదైంది. పంపుసెట్లకు నిరంతర ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో కీలకమైనది వ్యవసాయానికి ఉచిత, నాణ్యమైన విద్యుత్ సరఫరా. 2018 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంపు సెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 19 లక్షలకుపైగా పంపు సెట్లు ఉంటే ఇప్పుడు 24 లక్షలకుపైగా కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా మరో 4.20 లక్షల వరకు ఉంటాయని అధికారుల అంచనా. అలాగే రాష్ట్రం ఏర్పడే నాటికి 1.10 కోట్ల వరకు వివిధ రకాల విద్యుత్ కనెక్షన్లు ఉండగా ఈ ఏడాది మార్చి 31 నాటికి వాటి సంఖ్య 1.55 కోట్లు దాటింది. ఈ లెక్కన విద్యుత్ కనెక్షన్లలో 38.62 శాతం వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఇదే స్థాయిలో సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు కూడా పెరిగాయి. కాగా వీటితో పాటు 2014 వరకు 680 మెగావాట్ల విద్యుత్ ఎత్తిపోతల పథకాలకు వినియోగించగా, కాళేశ్వరం లాంటి భారీ పథకాలు తోడవడంతో ప్రస్తుతం 2,100 మెగావాట్లకు చేరినట్లు అధికరుల గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే రెండేళ్లలో మరిన్ని ఎత్తిపోతల పథకాలు పూర్తి కానుండగా, వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. మహబూబ్నగర్, మెదక్, కరీంనగర్లో భారీగా యాసంగి పంటలు కోతకు వచ్చినా విద్యుత్ వినియోగం ఆగడం లేదు. గురు, శుక్రవారాల్లోనూ గతేడాది ఇదే సమయంతో పోలిస్తే విద్యుత్ గణనీయంగా వినియోగమైంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో గత ఏడాది 2,584 మెగావాట్లు కాగా, ఇప్పుడు 3,081 మెగావాట్లుగా, ఎస్పీడీసీఎల్ పరిధిలో గతేడాది ఇదే సమయంలో 4,575 మెగావాట్లు కాగా, శుక్రవారం 6,665 మెగావాట్లు విద్యుత్ వినియోగం నమోదైంది. ఈ రెండు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని పూర్వ కరీంనగర్ జిల్లాలో 1,029 మెగావాట్లు వినియోగం కాగా, ఎస్పీడీసీఎల్ పరిధిలోని మెదక్లో 1,443, మహబూబ్నగర్లో 1,126 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. -
పుంజుకుంటున్న పారిశ్రామిక విద్యుత్
సాక్షి, అమరావతి: పారిశ్రామిక విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల్లో పురోగతి కనిపిస్తున్నా.. ఎగుమతులు, దిగుమతులపై ఆధారపడే భారీ పరిశ్రమలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది. ఫెర్రో అల్లాయిస్ పారిశ్రామిక వేత్తలు ఇటీవల ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లిని కలిశారు. ఆ రంగానికి విద్యుత్ రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం పురోగతిని ఇంధన శాఖ సమీక్షించింది. ఆ వివరాలివీ.. అది గడ్డుకాలమే! రాష్ట్రంలో 2019 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 3,975.66 మిలియన్ యూనిట్లు ఉంటే.. ఈ ఏడాది అదే త్రైమాసికంలో 2,754.14 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దాదాపు 31 శాతం డిమాండ్ తగ్గింది. ఈ కాలంలో పారిశ్రామిక విద్యుత్ రెవెన్యూ వసూళ్లు 32 శాతం తగ్గి విద్యుత్ రంగం గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. జూలై, ఆగస్టు నెలల్లో విద్యుత్ వినియోగం తిరిగి వేగం పుంజుకుని 1,444.75 మిలియన్ యూనిట్లకు చేరింది. పరిశ్రమలకు ప్రభుత్వ అండ కోవిడ్ సమయంలోనూ పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఫెర్రో అల్లాయిస్ పారిశ్రామిక వేత్తలు రాయితీలు కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి -
తగ్గిన విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా పారిశ్రామిక కార్యకలాపాలు మందగించడంతో ఏప్రిల్–జూన్ మధ్య రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 2,106.6 మిలియన్ యూనిట్లు తగ్గింది. మరోవైపు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో గృహ విద్యుత్తు వినియోగం మాత్రం 11.27 శాతం పెరిగింది. వ్యవసాయ విద్యుత్ వాడకం మే నెలలో మాత్రమే 5 శాతం మేర పెరిగింది. పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ ఎన్నడూ లేని విధంగా 30.72 శాతం పడిపోయింది. విద్యుత్తు వినియోగంపై తొలి త్రైమాసికం నివేదికను ఇంధనశాఖ గురువారం మీడియాకు వెల్లడించింది. ఏపీఈఆర్సీకి గతంలో సమర్పించిన అంచనాలు తలకిందులు కావడంతో వాస్తవ చిత్రాన్ని సమర్పించనున్నారు. గతేడాది తొలి త్రైమాసికంలో అన్ని విభాగాల విద్యుత్ వినియోగం 15,262.64 మిలియన్ యూనిట్లు కాగా ఈ ఏడాది ఇదే సమయంలో 13,156.04 మిలియన్ యూనిట్లు (13.80 శాతం తక్కువ) నమోదైంది. 2019 ఏప్రిల్లో 5,221.37 ఎంయూలుగా ఉన్న ఉన్న డిమాండ్ ఈ ఏడాది 4,076.95 ఎంయూలకు పడిపోయింది. లాక్డౌన్ నేపథ్యంలో రైల్వే సర్వీసులన్నీ ఆగిపోవడం విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో 390.83 మిలియన్ యూనిట్లున్న విద్యుత్ డిమాండ్ ఈ ఏడాది 262.77 ఎంయూలకు పడిపోయింది. ఒక్క మే నెలలోనే 42.71 శాతం పడిపోయింది. -
స్లాబు ప్రకారమే విద్యుత్ బిల్లులు: జగదీష్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్తో ప్రజలు ఇళ్లలో ఉండటంతో విద్యుత్ వినియోగం పెరిగిందని మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్లాబుల్లో ఉన్న విధంగా బిల్లులు వస్తున్నాయని.. వాడిన దాని కంటే ఎక్కువ బిల్లులు ఎక్కడా రాలేదని జగదీష్రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఏడాది సాధారణంగా వేసవిలో 35-40 శాతం వరకు విద్యుత్ వాడకం పెరుగుతుందని, లాక్డౌన్ కారణంగా 10-15 శాతం పెరిగిందని వివరించారు. గతంలో కంటే ఎక్కువగా బిల్లు వచ్చిందన అనుమానం ప్రజల్లో ఉందని.. కానీ వాడిన దానికంటే ఎక్కువ బిల్లు రాలేదన్నారు. తుంగతుర్తి, హుజూర్నగర్ ఎమ్మెల్యేలు కూడా బిల్లులు ఎక్కువ వచ్చాయని తన దృష్టికి తీసుకొచ్చారని, కానీ వారు వాడుకున్న మేరకే బిల్లులు వచ్చాయని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. -
వినియోగం మేరకే బిల్లు
సాక్షి, అమరావతి: లాక్డౌన్ సందర్భంగా ఏప్రిల్, మే నెల విద్యుత్ వినియోగం గత ఏడాదితో పోలిస్తే 7 శాతం పెరిగిందని ఇంధనశాఖ సోమవారం వెల్లడించింది. సామాన్య, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వినియోగదారుల టారిఫ్ పెరిగిందనే ప్రచారంలో నిజం లేదని వివరించింది. కరోనా కారణంగా లాక్డౌన్ అమలు కావడం వల్ల ఏప్రిల్ నెలలో మీటర్ రీడింగ్ తీయలేదు. మార్చి నెలలో వచ్చిన బిల్లునే ఏప్రిల్లోనూ చెల్లించాలని అధికారులు ఆదేశించారు. తర్వాత మే నెలలో రీడిండ్ తీసినప్పటికీ మార్చి, ఏప్రిల్, మే నెలలో రోజులను విడివిడిగానే లెక్కించారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్ రేట్లు పెరిగాయన్న వదంతులు వ్యాపించాయి. క్షేత్రస్థాయి వివరాలు సేకరించిన విద్యుత్ శాఖ ఇవన్నీ అపోహలేనని గణాంకాలతో పేర్కొంది. పెరిగిన వినియోగం మేరకే బిల్లులు వచ్చాయని రుజువు చేసే ప్రయత్నం చేసింది. -
‘విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలి’
సాక్షి హైదరాబాద్ : లాక్డౌన్ కాలంలో విద్యుత్ సిబ్బంది నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని విద్యుత్శాఖ మంత్రి జగదీష్రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడ కూడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. సోమవారం విద్యుత్సౌధ వద్ద మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న ప్రజలకు ఇబ్బంది లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇటీవల అకాల వర్షాలు వచ్చినప్పటికీ ఎక్కడా ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది రాలేదన్నారు. బిల్లులకు సంబంధించి రీడింగ్ తీసే అవకాశం లేనందున తమ సిబ్బంది ఇళ్లలోకి వెళ్లలేన్నారు. అయితే విద్యుత్ వినియోగానికి సంబంధించి బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలని కోరారు. మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానంలోనే తాము కూడా ఈ బిల్ ఇస్తున్నామన్నారు. (సెలబ్రిటీలు, ఇది కరోనా పార్టీ కాదు ) ఈఆర్సీ రెగ్యులేటరీ ఏ విధానం అయితే ఉంటుందో అదే పద్దతిలో.. గత సంవత్సరం మార్చి నెల వచ్చిన బిల్ ఆధారంగా బిల్ పే చేయాలి అన్నారు. అయితే గత మార్చి నెలతో పోల్చితే ఈ మార్చి నెలలో 15, 20 శాతం ఎక్కుకాగానే వస్తాయని, కానీ ఈఆర్సీ ప్రకారమే చెల్లించాలన్నారు. ఇప్పటికే బిల్లులను ప్రజలకు పంపడం జరిగిందని, వాటని దయచేసి కట్టాలని కోరారు. ఈ నెలలోని వ్యత్యాసాలను వచ్చే నెలలో ఇస్తామని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకొమన్నారు. (కరోనా: ఆయన రాజీనామా చేయాల్సిందే! ) ఎస్పీడీసీఎల్ పరిధిలో 40 శాతం పైగా వినియోగదారులు ఆన్లైన్లోనే పే చేస్తున్నారని, 10700 కమర్షియల్స్లో అసలు రీడింగ్ తీసుకొని బిజినెస్ సంస్థలకు బిల్ ఇచ్చామని తెలిపారు. కమర్షియల్ కూడా గత సంవత్సరంలో 50 శాతం బిల్ కట్టాలని, ఒకవేళ ఎక్కువ బిల్ కట్టినా.. వచ్చే బిల్లో సరిచేస్తామన్నారు. గత మార్చ్లో 8900 డిమాండ్ ఉండేదని.. ఈ మార్చ్లో 7800 డిమాండ్ ఉందన్నారు. ఇక కరోరా వైరస్ లేకుంటే 13500 మెగా వాట్స్ డిమాండ్ వస్తుందనుకున్నామని అన్నారు. ఈనెల బిల్ డిమాండ్ టీఎస్ఎస్పీడీసీఎల్లో ఎల్టీకి రూ. 620 కోలు, ఎన్పీడీసీఎల్లో రూ. 203 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలు ప్రతీసారి అత్యవసర సమయంలో పని చేస్తున్నారని, ఇలాంటి క్లిష్టమైన పనిచేస్తున్న వైద్యుల సేవలను సైతం మంత్రి జగదీష్ ఈ సందర్భంగా కొనియాడారు. (లాక్డౌన్పై రేపు ప్రధానమంత్రి కీలక ప్రకటన ) -
కరోనా: ‘పవర్’ ఫుల్ లాక్డౌన్
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి ప్రజలపైనే కాదు.. విద్యుత్ వినియోగంపైనా తన ప్రభావాన్ని చూపింది. కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత నెల 23 నుంచి విధించిన లాక్డౌన్తో జిల్లాలో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. మార్చి 22న ప్రధాన మంత్రి మోదీ పిలుపుతో జనతా కర్ఫ్యూ జిల్లా అంతటా పాటించారు. మరుసటి రోజు కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. మొదటి రెండు, మూడు రోజులు జిల్లాలో సీరియస్గా తీసుకోలేదు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతూ కనిపించారు. కరోనా పాజిటివ్ కేసుల వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేసింది. జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు ప్రజల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. తొలి విడత ఉదయం ఆరు నుంచి 11 గంటలు, మలి విడత ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటలకు కూడా నిత్యావసరాల కోసం సడలింపు ఇచ్చారు. మొదట రాజమహేంద్రవరం వీరభద్రనగర్లో ఒకే ఒక పాజిటివ్ కేసు అదీ కూడా లండన్ బాయ్కు వచ్చింది. ఆందోళన మొదలై చివరకు ఢిల్లీ నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారితో రెండు, మూడు రోజుల వ్యవధిలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 11కి చేరడంతో కరోనాను నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. తాజాగా ఆ సంఖ్య గురువారం నాటి కత్తిపూడి పాజిటివ్ కేసుతో 12కు చేరుకోవడం ఆందోళనకర పరిస్థితే. నిబంధనలతో సాధారణ కుటుంబాల నుంచి సంపన్న కుటుంబాల వరకు ఏ ఒక్కరూ ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటిస్తూ ఎవరి ఇంటిలో వారు ఉండటమే సేఫ్ అంటూ పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమమే నడుస్తోంది. ఉదయం లేచిన తరువాత ఎవరి పనులపై వారు బయటకు పోతుంటారు. లాక్డౌన్ నేపథ్యంలో అత్యవసర ఉద్యోగులు తప్ప మిగిలిన వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ను ధిక్కరించి బయటకు వస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన 2,253 మందిని పోలీసులు అరెస్టు చేసి 1254 కేసులు నమోదు చేశారు. 815 వాహనాలు కూడా స్వాదీనం చేసుకున్నారు. లాక్డౌన్ ప్రకటించిన గత నెల 23 నుంచి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఇంటిలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రతి ఇంటా విద్యుత్ దీపాలు వెలుగుతూ, గదిలో ఫ్యాన్లు తిరుగుతూ, ఏసీలు, విద్యుత్ ఉపకరణాలు, టీవీలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. సీబీఎస్ఈ మినహా స్టేట్ సిలబస్ 10వ తగరతి పరీక్షలు, జేఈఈ అడ్వాన్స్ మెయిన్, క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇలా పలు పరీక్షలు పెండింగ్లో పడటంతో విద్యార్థులు, యువత వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి రాత్రనక, పగలనక చదువుతున్నారు. ఇలా కుటుంబం అంతా 24 గంటలు ఇంటిలోనే గడపాలంటే విద్యుత్ లేకుండా నడవదు. ఈ కారణంగా విద్యుత్ వినియోగం పెరిగింది. లాక్డౌన్ పూర్తయ్యే సమయానికి మరింత పెరగనుంది. కరోనా భయంతో గత మార్చి 23 నుంచి ఇప్పటి వరకూ మొత్తంగా 18 రోజులు జిల్లాలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో గృహ విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. ఈ నెల 14 వరకూ లాక్డౌన్ అమలులో ఉండడంతో ఈ మేరకు గృహ విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుందని ఏపీఈపీడీసీఎల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో గృహ విద్యుత్ వినియోగదారులే ఉన్నారు. కరోనా ప్రభావంతో గృహ విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. ఈ పెరుగుదల మిగిలిన రోజుల్లో వినియోగం కంటే 15 శాతం ఎక్కువగా నమోదైంది. గతంలో ఎప్పుడూ ఇంతటి పెరుగుదల చూడలేదంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు పనిచేయకపోవడంతో ఆ కేటగిరీలలో విద్యుత్ వినియోగం 20 శాతం పడిపోయింది. గృహ విద్యుత్ వాడకం పెరిగింది కరోనా నిరోధానికి దేశ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంది. ఈ కారణంగా గృహ విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం వినియోగం తగ్గింది. కరోనా నేపథ్యంలో వినియోగదారుల క్షేమం కోరి మీటర్ రీడర్స్ వినియోగదారుల ఇళ్లకు వెళ్లి మీటర్ రీడింగ్ తీసి బిల్లులు జారీ చేసే పరిస్థితి లేదు. మార్చి నెల విద్యుత్ బిల్లునే ఏప్రిల్ నెల బిల్లుగా చెల్లించాలి. ఏప్రిల్ నెల బిల్లుగా చెల్లించవలసిన విద్యుత్ బిల్లును ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారులకు తెలిపాం. వినియోగదారులు బిల్లు నుంచి 15 రోజులు లోపు చెల్లించాలి. వినియోగదారులు ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్లో, పీటీయు యాప్ ద్వారా, యూపీఐబీమ్ యాప్ ద్వారా నెట్ బ్యాంకింగ్, గూగుల్పే, ఎయిర్టెల్మనీ, ఫోన్పే, ఐసీఐసీఐ ఈజీసీ, భారత్బిల్పే, జియోమనీ ఆఫ్ ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. రాజీవ్ ఈపీడీసీఎల్ సెంటర్లలో, ఏటీపీ మిషన్స్ వద్ద ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు. సీహెచ్ సత్యనారాయణరెడ్డి, ఏపీఈపీడీసీఎల్, ఎస్ఈ -
కరెంటుపై కరోనా ఎఫెక్ట్
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగంపైనా కరోనా ప్రభావం పడింది. గృహ విద్యుత్ వినియోగంలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. శీతల ప్రాంతాల్లో ఉంటే వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందనే ప్రచారం నేపథ్యంలో ఏసీల వాడకం చాలా వరకూ తగ్గించారు. గ్రామీణ ప్రజలైతే మిట్ట మధ్యాహ్నం తప్ప మిగిలిన సమయాల్లో ఇంటి ఆవరణలో చెట్ల కిందే ఉంటున్నారని అనంతపురం జిల్లా ఎలక్ట్రికల్ ఏఈ చక్రధర్ తెలిపారు. అక్కడక్కడా ఫ్రిజ్లు కూడా ఆపేశారు. చల్లటి పదార్థాలు, కూలింగ్ వాటర్కు సైతం దూరంగా ఉంటున్నారు. దేశమంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. లాక్డౌన్ నాటి నుంచీ.. ► రాష్ట్రంలో విద్యుత్ వినియోగం సాధారణంగా రోజుకు 170 మిలియన్ యూనిట్లు కాగా.. ఏప్రిల్, మే నెలల్లో గరిష్టంగా 210 మిలియన్ యూనిట్లు దాటుతుందని అంచనా. ► కానీ.. ప్రస్తుతం రోజుకు సగటున 160 మిలియన్ యూనిట్లు దాటడం లేదు. గృహ వినియోగం 20 శాతం పైగా తగ్గింది. ► రాష్ట్రంలో 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. ఇందులో 92.24 లక్షల మంది గృహ వినియోగదారులే. ► గృహ విద్యుత్ వినియోగం రోజుకు 58 మిలియన్ యూనిట్లు ఉంటుంది. ఇందులో చాలా ఇళ్లల్లో నెలవారీ విద్యుత్ వినియోగం 100 యూనిట్ల లోపే. ► నెలకు 225 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు 43.56 లక్షల వరకు ఉండగా.. కుటీర పరిశ్రమలు సైతం ఇందులోనే ఉన్నాయి. ► కుటీర పరిశ్రమలు కూడా నడవడం లేదు కాబట్టి ఈ కేటగిరీ విద్యుత్ వాడకం తగ్గింది. ► పరిశ్రమలు, వాణిజ్య వినియోగ కనెక్షన్లు 10 లక్షల వరకూ ఉన్నాయి. ఈ రెండు కేటగిరిల్లో వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. డిమాండ్ పడిపోతోంది ఏప్రిల్లో రోజుకు 210 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేశాం. పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోగా.. గృహ విద్యుత్ వినియోగం తగ్గింది. అన్ని కేటగిరీల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. – శ్రీకాంత్ నాగులాపల్లి,విద్యుత్ శాఖ కార్యదర్శి -
పవర్ పంచ్!
సాక్షి, హైదరాబాద్: ఏసీలో కూర్చొంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాలి కానీ.. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగం చూస్తే విద్యుత్ ఇంజనీర్లకు అప్పుడే ముచ్చెమటలు పడుతున్నాయి. కొత్త విద్యుత్ కనెక్షన్లకు తోడు పగటి ఉష్ణోగ్రతలు రెట్టింపు అవుతుండటంతో విద్యుత్ వినియోగం కూడా అదే స్థాయిలో రికార్డు అవుతోంది. గత నెలలో రోజు సగటు విద్యుత్ వినియోగం 42 ఎంయూలు ఉండగా, ప్రస్తుతం 49 ఎంయూలకు చేరింది. మార్చి చివరి నాటికి 60 ఎంయూలు దాటే అవకాశం ఉంది. ఒత్తిడిని తట్టుకోలేక ఇప్పటికే పలు ఫీడర్లు తరచూ ట్రిప్పవుతూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. అనధికారిక కోతలపై ముందస్తు సమాచారం లేకపోవడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి మరెలా ఉండనుందోనని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 54 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం వీటిలో 44 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 7 లక్షలకుపైగా వాణిజ్య కనె క్షన్లు ఉన్నాయి. మరో 50 వేలకుపైగా పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. లక్షకుపైగా వీధి దీపాల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 33/11కేవీ సబ్స్టేషన్లు 306, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ 96882, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ 802పైగా, 33కేవీ, 11కేవీ, ఎలీ్టలైన్స్ 52142 కిమిపైగా ఉన్నాయి. రాజేంద్రనగర్, హబ్సిగూడ, సరూర్నగర్, సైబర్సిటీ, మేడ్చల్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్స్ కొత్తగా ఏర్పడ్డాయి. శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండటం, కొత్త నిర్మాణాలు, పరిశ్రమలు వెలుస్తుండటం వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 2006లో నగరంలో 24.12 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 1538 మెగవాట్ల విద్యుత్ వినియోగం ఉండేది. అంతే కాదు ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలో మాత్రమే కని్పంచే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ సర్వసాధారమయ్యాయి. కొత్త కనెక్షన్లకు తోడు పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతుండటంతో వినియోగం రెట్టింపైంది. గృహ వినియోగమే అధికం ఇదిలా ఉంటే గతంతో పోలిస్తే ఈసారి పారిశ్రామిక వినియోగం తగ్గింది. గృహ వినియోగం పెరిగింది. గ్రేటర్లో 24 పారిశ్రామిక వాడలు ఉండగా, వీటిలో సుమారు 4 లక్షల యూనిట్లు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం డిస్కం పరిధిలో 150 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరుగుతుండగా, జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు సగటున 48 నుంచి 49 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. దీనిలో 45 నుంచి 50 శాతం అంటే సుమారు 24 ఎంయూల విద్యుత్ పరిశ్రమలు వినియోగిస్తున్నట్లు సమాచారం. మిగిలినది గృహ, ఇతర వాణిజ్య అవసరాలకు ఖర్చు అవుతుంది. గత ఏడాదితో పోలిస్తే నగరంలో ప్రస్తుతం చలి తీవ్రత తగ్గడం, రాత్రి పూట ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో ఉపశమనం కోసం సిటిజన్లు ఏసీలు, ఫ్యాన్లను వాడుతున్నారు. ఉ దయం వేడినీళ్ల కోసం వాటర్ హీటర్ల, గ్రీజర్ల వినియోగం పెరిగింది. నిజానికి ఈ లెక్కన విద్యుత్ వినియోగం గతంతో పోలిస్తే మరింత పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం తక్కువ వినియోగానికి పారిశ్రామిక, వాణిజ్య కరెంట్ వినియోగం తగ్గడమే ఇందుకు కారణమని డిస్కం ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. -
‘విద్యుత్’పై శ్వేతపత్రం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ సంస్థల కొనుగోళ్లు, ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల అవకతవకతలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తే ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ అంటోందని, సమాఖ్య వ్యవస్థలో ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్రంగంపై శుక్రవారం ఇక్కడ బీజేపీ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించింది. తెలంగాణ సర్కార్ విద్యుత్ కొనుగోళ్ల కోసం ఓపెన్ బిడ్డింగ్లకు వెళ్లకుండా, బయటి మార్కెట్ నుంచి నేరుగా రూ.4.50 – 5.50లకు యూనిట్ చొప్పున స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకుందని లక్ష్మణ్ ఆరోపించారు. రెండేళ్లుగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ పని చేయడంలేదని అన్నారు. రాష్ట్ర సర్కార్ అవినీతిపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని, స్పందన లేకుంటే కేంద్ర హోంమంత్రిని, రాష్ట్రపతిని కలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారులకు 10 నెలలుగా ఈ సర్కార్ ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకపోవడం ఏమిటని ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. -
ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ రాజకీయాలలో విద్యుత్తు ఎల్లప్పుడూ కీలకాంశంగానే ఉంటోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చారిత్రక విజయం లభించడం వెనుక కూడా ‘బిజ్లీ హాఫ్’ హామీ ముఖ్యపాత్ర పోషించింది. సబ్సిడీ రేట్లకు విద్యుత్తు ఇస్తామన్న తమ ïహామీ తమ విజయానికి ముఖ్య కారణాలలో ఒకటన్న విషయాన్ని ఆప్ కూడా మరచిపోలేదు. అందుకే గత నాలుగున్నర సంవత్సరాలలో విద్యుత్తు చార్జీలు పెరగకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమీçపిస్తున్న తరుణంలో 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసి ఓటర్లపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ సమ్మోహనాస్త్రం అసెంబ్లీ ఎన్నికలలో ఆప్కు ఓట్ల జల్లు కురిపించే అవకాశం ఉంది. చదవండి: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాయి. ఆప్ ప్రయోగించిన ఈ మాస్టర్ స్ట్రోక్ తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలో పడ్డాయి. ప్రతిపక్ష పార్టీలు గత కొద్ది నెలలుగా ఫిక్స్డ్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఫిక్స్డ్ చార్జీలను 84 శాతం తగ్గించడమే కాక 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసి ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు. షీలాదీక్షిత్ సర్కారు పరాజయం వెనుక పెరిగిన విద్యుత్తు చార్జీల ప్రభావం ఉందన్నది కాదనలేని అంశం. కేజ్రీవాల్ 2013 నుంచే పెరిగిన విద్యుత్తు చార్జీలను ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. ఈ విషయమై ఆయన అప్పట్లో 15 రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేశారు.ఆ తరువాత బిజ్లీ హాఫ్ పానీ మాఫ్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చి ఈ హామీని అమలు చేశారు. ఇప్పుడు ఆప్ సర్కారు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసిç ³హలే హాఫ్ అబ్ మాఫ్ నినాదంతో ఓట్లు రాబట్టాలనుకుంటోంది. -
గిర్రా.. గిర్రా.. గిర్రా..తిరుగుతోంది మీటర్
సాక్షి, విజయనగరం : వేసవి ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత కాలు బయటపెట్టేందుకు వెనుకాడే పరిస్థితి. పగలూ, రాత్రీ తేడా లేకుండా ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం కోసం ప్రజలు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం రోహిణీ కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రారంభమైనా ఉక్కపోత కొనసాగుతుండడంతో విద్యుత్ వినియోగం అదే స్థాయిలో పెరుగుతోంది. మీటర్ గిరాగిరా తిరుగుతోంది. విద్యుత్ బిల్లులు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. జిల్లాలో విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయిలో పెరుగుతోంది. గడిచిన మూడు నెలల వ్యవధిలో సుమారు 10 లక్షల యూనిట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. ఫిబ్రవరి నెల మొదటి వారంలో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులు 6.5 మిలియన్ యూనిట్లు (65 లక్షల యూనిట్లు) విద్యుత్ను గరిష్టంగా వినియోగించగా.. ప్రస్తుత పరిస్థితులు ఆ వినియోగం 7.8 మిలియన్ యూనిట్లు (78 లక్షల యూనిట్లకు) పెరిగిపోయింది. మే నెలలో పరిశీలిస్తే సగటున 7.5 మిలియన్ యూనిట్లు (75 లక్షల యూనిట్లు) విద్యుత్ వినియోగమైనట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 7 లక్షల 22వేల 229 విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో చీపురుపల్లి ఆర్ఈసీఎస్ పరిధిలో 61వేల 281 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. మొత్తం సర్వీసుల్లో ఎల్టీ, హెచ్టీ, కమర్షియల్ సర్వీసులు ఈ ఏడాది గణనీయంగా విద్యుత్ వినియోగం పెరిగింది. గతేడాది సగటును రోజుకు 6 ఎంయూ (60 లక్షల యూనియట్లు) విద్యుత్ను వినియోగించే వారు. అదే వేసవిలో అయితే 6.5 ఎంయూ యూనిట్లు (65 లక్షల యూనిట్ల) వినియోగం జరిగినట్లు అంచనా. ఈ ఏడాది గతం కంటే విద్యుత్ వినియోగం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీనికి వినియోగదారులు సౌకర్యాల్లో శీతలగృహోపకరణాల వినియోగానికి ప్రాధాన్యమివ్వడమే కారణంగా తెలుస్తోంది. మరో వైపు ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు వాడకం విద్యుత్వినియోగం పెరుగుదలకు ఊతమిస్తున్నట్టు అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఆ సమయంలోనే అధిక వినియోగం... రోజుకో విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భానుడి ఉగ్రరూపం నుంచి రక్షణ పొందేందుకు ఏసీలు, ఫ్రిజలు, కూలర్లు తదితర శీతల గృహోపకరణ వస్తువులు వినియోగం గణనీయంగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మరల రాత్రి 8 నుంచి 11 గంటల సమయంలో ఎక్కువగా విద్యుత్ వినియోగం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమయాల్లో ప్రజలు ఇళ్లల్లో ఎక్కువగా ఉంటారు. దీంతో విద్యుత్ వినియోగం అధికంగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో వినియోగదారులకు అవసరమయ్యే విద్యుత్ కన్నా 10 లక్షల యూనిట్లు తక్కువ కేటాయింపులు ఉన్నా అధికారులు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో విద్యుత్ సరఫరాకు సంబంధించి మాచ్ఖండ్, సీలేరు, సింహాచలం, వీటీపీఎస్, కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ కేటాయింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఆటంకాలు లేవని, ఈ ఏడాది వేసవిలో నిరంతరాయ సరఫరా ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. వినియోగం గణనీయంగా పెరిగింది.. పరిస్థితుల ప్రభావంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతీ ఒక్కరు కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్లు వినియోగిస్తున్నారు. వినియోగదారులు కోరే డిమాండ్ను ఎదుర్కొనగలిగే సామర్థ్యం ఉంది. వినియోగదారులు అవసరంలేని సమయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పొదుపు పాటించాలి. – వై.విష్ణు, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్ -
ప్రైవేటు ‘పవన’ంపైనే ధ్యాస!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. వారం క్రితం వరకూ రోజుకు 187 మిలియన్ యూనిట్లున్న డిమాండ్ శుక్రవారం 157 మిలియన్ యూనిట్లకు తగ్గింది. వినియోగం పరిస్థితి ఇలా ఉంటే.. పవన విద్యుత్ ఉత్పత్తి మాత్రం అనూహ్యంగా పెరిగింది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మాత్రం అత్యధిక ధర చెల్లించి ప్రైవేటు పవన విద్యుత్నే కొనేందుకే మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల చౌకగా అందే ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ను తగ్గించాల్సిన పరిస్థితేర్పడింది. సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నందున పవన, సౌర విద్యుత్ను తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే వినియోగంలో కేవలం 5 శాతమే ఈ విద్యుత్ను తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగా పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. ఇందుకోసం ఏపీజెన్కో థర్మల్ యూనిట్లలో ఉత్పత్తికి అనివార్యంగా కోత పెడుతున్నారు. వారంక్రితం రోజుకు 15 మిలియన్ యూనిట్లున్న పవన విద్యుత్.. శుక్రవారం 50 మిలియన్ యూనిట్లకు చేరగా.. మరోవైపు సౌరవిద్యుత్ 10 మిలియన్ యూనిట్ల వరకు అందుతోంది. కేంద్ర విద్యుత్ వాటాలో ప్రస్తుతం 25 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ లభిస్తోంది. ఇంకోవైపు దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాలున్న స్వతంత్ర విద్యుత్ సంస్థలు(ఐపీపీ) 30 మిలియన్ యూనిట్ల వరకు అందిస్తున్నాయి. మొత్తం కలిపి 115 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో డిమాండ్కు అవసరమైన మిగిలిన 42 మిలియన్ యూనిట్లను మాత్రమే థర్మల్ విద్యుత్ను ప్రోత్సహిస్తున్నారు. థర్మల్ ఉత్పత్తికి కోత.. ఈ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కోత పెట్టారు. 1,600 మెగావాట్ల సామర్థ్యమున్న కృష్ణపట్నంలోని ఒక యూనిట్లో ఉత్పత్తి పూర్తిగా తగ్గించగా.. మరో యూనిట్లో అరకొర ఉత్పత్తి జరుగుతోంది. ఈ కేంద్రం నుంచి రోజుకు 45 మి. యూనిట్లు అందే వీలుంది. కానీ 20 మిలియన్ యూనిట్లు కూడా తీసుకోవట్లేదు. విజయవాడ, కడప థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ ఉత్పత్తికి భారీగా కోత విధించారు. ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ 105 మిలియన్ యూనిట్లు అందే వీలున్నా.. కేవలం 42 మిలియన్ యూనిట్లే తీసుకుంటున్నారు. జెన్కో విద్యుత్ ధర యూనిట్ సగటున రూ.4 ఉంటుంది. ప్రైవేటు సోలార్ విద్యుత్ ధర యూనిట్ రూ.5.25 వరకూ ఉంది. నిబంధనల ప్రకారం ముందుగా తక్కువ ధర ఉన్న విద్యుత్ ప్లాంట్లకే ప్రాధాన్యమివ్వాలి. ప్రైవేటు విద్యుత్కోసం అడ్డగోలుగా వ్యవహరించడం వల్ల థర్మల్ ప్లాంట్లు ఆర్థిక నష్టాల్లోకి వెళ్లే వీలుందని, అంతిమంగా వినియోగదారులపైనా భారం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
‘రికార్డు’ కరెంటు!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో విద్యుత్ వినియోగం రికార్డుస్థాయిలో నమోదైంది. ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం అనూహ్యంగా పెరిగింది. గత రెండురోజుల నుంచి విద్యుత్ వినియోగం రెట్టింపైంది. గతేడాది ఇదే సీజనల్లో 60 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం నమోదు కాగా, ఈ ఏడాది మార్చి 28న 61 మిలియన్ యూనిట్లు నమోదైంది. తాజాగా బుధవారం 62.5 మిలియన్ యూనిట్లు నమోదైంది. డిస్కం చరిత్రలో విద్యుత్ వినియోగం ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. రోజురోజుకు పెరుగుతున్న ఈ విద్యుత్ డిమాండ్ వల్ల ఒత్తిడిని తట్టుకోలేక అండర్ గ్రౌండ్ కేబుళ్లు కాలిపోతుండగా, సబ్స్టేషన్లలోని ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. ముఖ్యంగా పీక్ అవర్లో ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నం అవుతోంది. సాధారణంగా వాతావరణంలో తేమ 50 శాతం ఉండాల్సి ఉంది. కానీ గురువారం 36 శాతమే నమోదైంది. గతవారంతో పోలిస్తే నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. వాతవరణంలో తేమశాతం తక్కువగా నమోదు అవుతుండటం వల్ల ఉక్కపోత ఉంటుంది. ఈ ఉక్కపోతను తట్టుకోలేక వినియోగదారులు రోజంతా ఏసీలోనే గడుపుతుండటమే వినియోగం పెరగడానికి కారణమని డిస్కం ప్రకటిస్తుంది. ట్రిప్పవుతున్న ఫీడర్లు.. నిలిచిపోతునన్న సరఫరా చంపాపేట్ సర్కిల్ నందనవనం సబ్స్టేషన్ పరిధిలోని శ్రీరమణ కాలనీ ఫీడర్ ఓవర్లోడ్ వల్ల గత నాలుగైదు రోజుల నుంచి రోజుకు నాలుగైదుసార్లు ట్రిప్పవుతుంది. ఫలితంగా తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. రంగారెడ్డి నార్త్ సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి సబ్డివిజన్ సబ్స్టేషన్ జివికాస్ సబ్స్టేషన్ కోకకోలా ఫీడర్ పరిధిలో యూజీ కేబుల్ దగ్ధమైంది. దీంతో ఆ ఫీడర్ పరిధిలోని కాలనీల్లో రెండు గంటల పాటు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కందికల్గేట్ సబ్స్టేషన్ ఆషామాబాద్ ఫీడర్ పరిధిలో ఆర్ఎంయూలో సాంకేతికలోపం తలెత్తడం వల్ల సుమారు గంటన్నర పాటు సరఫరా నిలిచిపోయింది. ఆస్మాన్ఘడ్ డివిజన్లోని చంచల్గూడ సబ్స్టేషన్ ఆనందర్నగర్ ఫీడర్ ఏబీస్విచ్ సహా జంపర్ కట్ అయింది. ఫలితంగా ఆయా కాలనీల్లో గంటకు పైగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. చార్మినార్ డివిజన్ కిలావత్సబ్స్టేషన్ పరిధిలోని టెలిఫోన్ ఎక్సే్చంజ్ సమీపంలో కేబుల్ ఫాల్ట్ వల్ల రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతకు తోడు విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో ఒత్తిడి తట్టుకోలేక ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. ఫలితంగా ఆయా ఫీడర్ల పరిధిలోని కాలనీలు అర్థరాత్రి అంధకారంలో మగ్గాల్సి వస్తుంది. అసలే ఉక్కపోత..ఆపై ఇంట్లో ఫ్యాన్లు కూడా తిరుగక పోవడంతో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రేటర్లో విద్యుత్ వినియోగదారుల సంఖ్య ఇలా 2006 24.12 లక్షలు 2010 29.75 లక్షలు 2013 34 లక్షలు 2015 38 లక్షలు 2016 40 లక్షలు 2018 51 లక్షలు విద్యుత్ డిమాండ్ ఇలా.... 2006లో 1538 మెగావాట్లు 2010లో 1881 2013లో 2000 21015 2300 2017 2600 2018 2900 -
హైదరాబాద్ @ 39.2 డిగ్రీలు
నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు సాక్షి, హైదరాబాద్: వేడి గాలులు నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్లో 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 48 గంటల పాటు హైదరాబాద్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని, వేడిగాలులు కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలో బయటికి వెళ్లేవారు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విద్యుత్ వినియోగం పైపైకి... నగరంలో ఉష్ణోగ్రతలు అనుహ్యంగా పెరగడం తో విద్యుత్ వినియోగం కూడా రెట్టిపైంది. గ్రేటర్లో గత 2 రోజుల్లో విద్యుత్ వినియోగం 53.8 మిలియన్ యూనిట్లు నమోదైంది. మార్చి లోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మేలో విద్యు త్ వినియోగం 60 ఎంయూలు దాటే అవకాశం ఉందని డిస్కం అంచనా వేస్తోంది. పెరుగుతు న్న విద్యుత్ ఒత్తిడిని తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్ప వుతూ సరఫరాకు అంతరాయం కలిగిస్తు న్నా యి. ఒత్తిడిని తట్టుకునేవిధంగా ఇప్పటికే సరఫ రా వ్యవస్థను తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి.. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్నగర్, నల్లగొండ, నిజామా బాద్, రామగుండంలలో 40 డిగ్రీల చొప్పున, హన్మకొండ, ఖమ్మం, మెదక్లలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 48 గంటలు రాష్ట్రంలో సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరా బాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పెరిగిన విద్యుత్ డిమాండ్... ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగింది. గత మార్చిలో 148.73 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ కాస్తా ఈ మార్చిలో ఏకంగా 184.11 మి.యూనిట్లకు పెరిగింది. వడదెబ్బతో నలుగురి మృతి నెట్వర్క్: వడదెబ్బతో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం యల్లాపురంలో గడగోజు దుర్గాచారి(51), రంగుండ్లలో ఆంగోతు రవి నాయక్, ఇదే జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో నక్క చంద్రమ్మ (70), మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గొల్ల నర్సింలు (56) వడదెబ్బతో మృతి చెందారు. -
విద్యుత్ వినియోగం పైపైకి..
గ్రేటర్లో 47.48 మిలియన్ యూనిట్లకు చేరిన విద్యుత్ వాడకం మార్చి చివరినాటికి 60 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం వేసవిలో నిరంతరాయ సరఫరా కోసం ముందస్తు ఏర్పాట్లు సిటీబ్యూరో: గ్రేటర్లో విద్యుత్ వినియోగం రోజురోజుకు మరింత పెరుగుతోంది. రెండు రోజుల క్రితం సిటీజనులు 47.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు. ఫిబ్రవరి మొదటి వారంలో 40–42 మిలియన్ యూనిట్లు ఉన్న విద్యుత్ వినియోగం..మూడో వారం నాటికి అదనంగా ఐదు మిలియన్ యూనిట్లు పెరిగింది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది వేసవిలో గరిష్టంగా 52–55 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈసారి 60 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉంది. భవిష్యత్తు డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని డిస్కం ఇప్పటికే సర్కిళ్ల వారిగా విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఒత్తిడిని తట్టుకునేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేశారు. మార్చి తొలినాటికి పునరుద్ధరణ పనులన్నీ పూర్తి చేసి, ఆ తర్వాత విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని నిర్ణయించారు. ఒత్తిడి తట్టుకునేలా... హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ ఈస్ట్, రంగారెడ్డి సౌత్, రంగారెడ్డి నార్త్ సర్కిళ్ల పరిధిలో సుమారు 42 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 34 లక్షల గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉండగా, మిగిలినవి చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. వచ్చే వేసవిలో వీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చాలంటే రోజుకు సగటున 60 మిలియన్ యూనిట్లకుపైగా అవసరం. రాబోయే ఒత్తిడిని తట్టుకుం టూ ఫీడర్లలో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మేరకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల పునరుద్ధరణ, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల నరికివేత, ఆయిల్ లీకేజీలను అరికట్టడం వంటి పనుల కోసం రూ.25 కోట్లకుపైగా ఖర్చు చేస్తుంది. ఇప్పటికే సగం పనులు కూడా పూర్తి చేసినట్లు డిస్కం అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని చెబుతున్నారు. -
ఇది ఆల్టైమ్ రికార్డ్
ఒక్క రోజు.. 54.74 మిలియన్ యూనిట్లు గ్రేటర్ డిస్కం చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ప్రచండ భానుడి ప్రతాపం.. మరోవైపు ఉక్కపోత.. వడగాడ్పులు.. దీంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు చలిగాలులతో ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఈ మహానగరం రోజురోజుకూ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో తల్లడిల్లిపోతోంది. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగం రెట్టింపైంది. విద్యుత్ పంపిణీ సంస్థ చరిత్రలోనే అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన 54.74 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఏడాది మే 26న రికార్డు స్థాయిలో 53.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగగా, ఈ ఏడాది నెల రోజుల ముందే ఆ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇది 58 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ చూస్తే విద్యుత్ అధికారులకే ముచ్చెమటలు పడుతున్నాయి. ఉడుకుతున్న కేబుళ్లు.. గ్రేటర్ పరిధిలో 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 32.5 లక్షలు గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు మరో 40 వేలకుపైగా ఉన్నాయి. వీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన విద్యుత్ ఉన్నా పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఒక్కసారిగా వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో ట్రాన్స్ఫార్మర్లపై తీవ్ర భారం పడుతోంది. సూర్యుని ప్రతాపానికి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ వైర్లు కరిగి సాగిపోతున్నాయి. భూగర్భ కేబుళ్లు వేడికి ఉడికిపోయి జాయింట్స్ వద్ద కాలిపోతున్నాయి. ఇలా ప్రతిరోజూ రెండు, మూడు ఫీడర్ల పరిధిలో ఈ సమస్య తలెత్తుతోంది. మరోవైపు ఆయిల్ లీకేజీలకు తోడు ఓవర్ లోడ్ వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటి స్థానంలో కొత్త వాటిని అమర్చి విద్యుత్ పునరుద్ధరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు అత్యవసర లోడ్ రిలీఫ్ల పేరుతో కోతలు అమలు చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. 24 గంటలు విద్యుత్ సరఫరా.. వేసవి డిమాండ్పై ముందే ఓ అంచనాకు వచ్చాం. ఇప్పటికే లైన్స్ను పునరుద్ధరించాం. పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశాం. రూ.240 కోట్లు ఖర్చు చేసిసరఫరా వ్యవస్థను అభివృద్ధి చేశాం. ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మినహా కోతలు అమలు చేయడం లేదు. విద్యుత్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్, ఆపరేషన్స్, టీఎస్ఎస్పీడీసీఎల్ -
బట్టీల్లో బాల్యం
♦ బుగ్గి అవుతున్న భవిష్యత్తు ♦ పెద్దలతో పాటే పిల్లలూ పనుల్లో.. ♦ యథేచ్ఛగా ఇటుక బట్టీల నిర్వహణ ♦ చోద్యం చూస్తున్న అధికారులు ♦ యథేచ్ఛగా విద్యుత్ వినియోగం మెదక్ : ఇటుక బట్టీల్లో బాల్యం బుగ్గి అవుతోంది. బాలల హక్కుల చట్టం ప్రకారం వారిని కాపాడి, ఇటుక బట్టీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన కార్మికశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఇటుక బట్టీల నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. జిలాల్లో వందలాది ఇటుక బట్టీలు వెలిశాయి. ఈ బట్టీల్లో వేలాది మంది బాలకార్మికులలు పనులు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి పనులు చేయిస్తుంటారు. దీంతో కార్మికులతో పాటు వారిపిల్లలు సైతం బట్టీల్లో పనులు చేయాల్సిందే. ఇంత తతంగం అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా, పట్టించుకున్న పాపానపోవటంలేదు. అంతేకాకుండా రైతాంగం అబివృద్ధి కోసం ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఇస్తే దాన్ని సైతం బట్టీలకు వాడుకుంటూ ట్రాన్స్కోను నిలువునా ముంచుతున్నారు. కలపను విచ్చలవిడిగా బట్టీలకింద కాల్చటం, రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వ్యవసాయపొలాల్లో బట్టీలు నిర్వహిస్తూ వాల్టాచట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఈ బట్టీలను రోడ్లపక్కనే ఏర్పాటు చేస్తుండటంతో వాహనదారులు కళ్లలో దుమ్ముధూళిపడి అనేక ఇబందులు పడుతున్నారు. తరుచూరోడ్డు ప్రమాదాలకు గురికావల్సి వస్తోంది. బట్టీలను నిర్వహించాలంటే ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతులు తప్పనిసరి. ఇందుకోసం కొంత డబ్బును చలాన్రూపంలో చెల్లించాలి. అలాగే నీటిని వాడుకోవటానికి విద్యుత్తు శాఖకు రూ. 10వేల డిడిని చెల్లించాలి. బట్టీల కిందకు కలపను ఎక్కడినుండి సమకూర్చుకునే విషయమై ముందుగానే ఫారెస్టుఅధికారుల అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా బట్టీల్లో 14 ఏళ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టుకోకూడదు. ఇన్నిరకాల అనుమతులు పొందాకనే బట్టీలను నిర్వహించాలి. కానీ జిల్లాలో నిర్వహించిన వందలాది బట్టీల్లో ఎక్కువశాతం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అధికారులకు ముడుపులు ముట్టజెప్పి నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మెదక్ మండలంలో గంగాపూర్, తొడిట, పిల్లికొటాల్, హవేళిఘణపూర్, శివారుల్లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల్లో వందలాది మంది బాలకార్మికులు పనులు చేస్తున్నారు. వీరి కోసమైనా ప్రత్యేకం గా బడులు ప్రారంభించాల్సి ఉంది. అధికారి వివరణ: ఈ విషయంపై ఎంఈఓ నరేష్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. రోజుకు రూ.400 నుంచి 500 సంపాదిస్తున్నాం మాది మహరాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం. నెల క్రితం ఇటుకలు చేసేందుకు మెదక్ మండలం రాయిన్చెర్వు గ్రామానికి భార్యపిల్లలను వెంటతీసుకొని వచ్చాం. రోజుకు సుమారు 1000 ఇటుకలు తయారు చేస్తున్నాం. ఇందుకు మాకు రూ.400 నుండి 500ల వరకు వస్తుంది - దశరథం, నాందేడ్. పనిచేసేచోట బడులు లేవు పొట్ట చేతబట్టుకొని రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చాం. ఇక్కడ పనిచేసేచోట పాఠశాలలు ఏర్పాటుచేసి మాలాంటి వారి పిల్లలకు చదువులు చెప్పిస్తారట. కాని ఇక్కడ అలాంటివేవి అందుబాటులోలేవు. మా పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. - లక్ష్మణ్, నాందేడ్ మా రాష్ట్రంలో పని దొరకడంలేదు.. మా సొంతరాష్ట్రంలో ఏం పనులు దొరకడం లేదు. దీంతో ఇక్కడకు వచ్చాం. పనిచేసేచోటనే చిన్నపాటి గుడిసెలు వేసుకొని పనులు చేస్తున్నాము. నాతోపాటు నాభర్త, పిల్లలు ఉన్నారు. - శ్యామ్బాయి, నాందేడ్ -
అప్పుడే షాక్!
గ్రేటర్లో మండుతున్న ఎండలు రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 51.88 మిలియన్ యూనిట్లు దాటిన వైనం లోడ్ రిలీఫ్ పేరిట కోతలు వినియోగదారుల్లో ఆందోళన సిటీబ్యూరో: మహా నగరంలో గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సోమవారం గరిష్టంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. ఈ ప్రభావం విద్యుత్ వినియోగంపై పడుతోంది. ఉక్కపోత నుంచి ఉపశమనానికి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం పెరగడంతో విద్యుత్ వినియోగం రెట్టింపైంది. మార్చి మొదటి వారంలో 42 మిలియన్ యూనిట్ల లోపే ఉండగా... ప్రస్తుతం (శనివారం) రికార్డు స్థాయిలో 51.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. రానున్న వేసవిలో గ్రేటర్ విద్యుత్ డిమాండ్ 58 ఎంయూలు దాటే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా. ఎల్ఆర్ పేరుతో ‘కోత’లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 32.5 లక్షలు గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మరో 40 వేలకుపైగా ఉన్నాయి. వీటి అవసరాలు తీర్చేందుకు సరిపడే విద్యుత్ ఉన్నా...పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుండటం వల్ల ట్రాన్స్ఫార్మర్లపై భారం పెరుగుతోంది. వీటివల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే ప్రమాదం ఉంది.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ప్రతి రెండు గంటలకోసారి 15 నిమిషాల పాటు అత్యవసర లోడ్ రిలీఫ్ పేరిట కోత విధిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే... ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గరిష్టం..40.3 డిగ్రీలు.. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం గరిష్టంగా 40.3, కనిష్టంగా 23.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొందరు వాహనదారులు, పాదచారులు సొమ్మసిల్లారు. లస్సీ, కొబ్బరి బోండాలు, పండ్ల రసాలతో సేదదీరారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని, ఈ నెలాఖరుకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. ఆరేళ్ల తరవాత నగరంలో ఈ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఎండకు బయటికి వెళ్లేటప్పుడు కళ్లు, చర్మ సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారులు ఎండ దెబ్బకు గురికాకుండా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆందోళన అవసరం లేదు గత ఏడాది మార్చి 2న గ్రేటర్లో 38.06 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తే... ప్రస్తుత మార్చి 2న 46.38 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గత ఏడాది 2,086 మెగవాట్ల డిమాండ్ ఉంటే ప్రస్తుతం 2,240 మెగవాట్లకు చేరింది. పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లు, డిమాండ్కు దీటుగా రూ.240 కోట్లు ఖర్చుతో సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేశాం. అత్యవసర పరిస్థితుల్లో మినహా కోతలు అమలు చేయడం లేదు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డిమాండ్ను తట్టుకునే విధంగా సరఫరా వ్యవస్థను మెరుగుపరిచాం. -శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్, ఆపరేషన్స్, టీఎస్ఎస్పీడీసీఎల్ -
వేటుపడింది
► గ్రానైట్కు అక్రమ విద్యుత్ వ్యవహారంఇద్దరు సెస్ ఉద్యోగుల సస్పెన్షన్ ► విచారణ అధికారిగా ఏడీ రాజిరెడ్డినాయకుల ఒత్తిళ్లతో ఉద్యోగులు బలి ► వారిపైనా చర్యలు తీసుకోవాలి ఎంప్లాయూస్ సంఘం డిమాండ్ వేములవాడ రూరల్ : వేములవాడ మండలం సంకెపల్లి గ్రామ శివారులోని గ్రానైట్ క్వారీలో అక్రమ విద్యుత్ వినియోగం వ్యవహారం విషయంలో ఇద్దరు సెస్ ఉద్యోగులపై వేటుపడింది. సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడంతో సెస్ ఎండీ నాంపల్లిగుట్ట వేములవాడ రూరల్ ఏఈ తిరుపతి, సంకెపల్లి అసిస్టెంట్ హెల్పర్ దేవయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంకా ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయూన్ని తేల్చేందుకు ఏడీ రాజిరెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. గ్రానైట్ క్వారీ యజమాని ఎలాంటి అనుమతి లేకుండా ఏకంగా 12 స్తంభాలు వేసుకొని విద్యుత్ను అక్రమంగా వినియోగించుకుంటున్నాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో సెస్ ఎండీ నాంపల్లిగుట్ట గురువారం క్వారీని పరిశీలించారు. క్వారీ యజమాని ఎలాంటి అనుమతి లేకుండా విద్యుత్ను అక్రమంగా వాడుకుంటున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో శుక్రవారం ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గని చైర్మన్ సెస్ ఉద్యోగులపై వేటు వేయకుండా ఉండేట్లు చూడాలని, ఈ ఇద్దరిని కూడా సస్పెండ్ చేయవద్దని అధికార పార్టీ నాయకులు, సెస్ పాలకవర్గంలో ఉన్న కొంతమంది నాయకులు ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ చైర్మన్ లక్ష్మారెడ్డి మాత్రం తలొగ్గలేదు. నూతన పాలకవర్గంపై మచ్చపడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకోక తప్పలేదు. ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా వెళ్లడంతో చైర్మన్ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. వీరిద్దరే కాకుండా మరికొందరిపైనా వేటు వేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎంప్లాయిస్ యూనియన్లో వ్యతిరేకత.. అక్రమ విద్యుత్ వ్యవహారంలో సెస్ ఉద్యోగులపై వేటు వేయడాన్ని ఎంప్లాయిస్ యూనియన్ తీవ్రంగా పరిగణిస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల మేరకే వారు క్వారీ యజమానికి సహకరించారని, వారిపై చర్యలు తీసుకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూనియన్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. నాయకుల ఒత్తిళ్లకు ఉద్యోగులు తలొగ్గారని, వారిని బలిపశువులుగా చేయడం ఎంతవరకు సమంజసమని అధికారుల తీరుపై మండిపడ్డట్లు సమాచారం. విద్యుత్ అక్రమానికి సంబంధం ఉన్న సెస్ డెరైక్టర్పై, క్వారీ యజమానిపై చర్యలు తీసుకున్నాకే ఉద్యోగులపై వేటు వేయాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఉద్యోగులకేనా వేటు..? అక్రమ విద్యుత్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన సెస్ అధికారులు, పాలకవర్గం దానికి బాధ్యులైన క్వారీ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని చర్చించుకుంటున్నారు. క్వారీ యజమానిపై కేసు పెడుతారా? లేక జరిమానాతోనే వదిలివేస్తారా? అనేది చర్చనీయూంశమైంది. ఒకవేళ ఈ ఉద్యోగులను మాత్రమే బలిచేసి, క్వారీ యజమానిపై, దానికి సంబంధమున్న నాయకునిపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే... చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఉద్యోగ సంఘం నాయకులు చ ర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. -
స్విచ్చేస్తే షాక్
విద్యుత్ వినియోగదారులకు చార్జీల మోత జిల్లాపై నెలకు సగటున రూ.20 కోట్ల భారం యూనిట్కు సగటున 5 నుంచి 7 శాతం చార్జీల పెంపు చార్జీల పెంపుపై మండిపడుతున్న రాజకీయ పార్టీలు విజయవాడ : వేసవికి విద్యుత్ చార్జీల భారం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న జిల్లా ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మరింత భారం మోపేందుకు నిర్ణయించింది. విద్యుత్ శాఖ అధికారులు చార్జీలు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించారు. యూనిట్కు సగటున 25 నుంచి 40 పైసల చొప్పున చార్జీలు పెంచారు. దీంతో జిల్లా వాసులపై సగటున రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. వ్యవసాయ కనెక్షన్లు, కుటీర , చక్కెర, పౌల్ట్రీ పరిశ్రమలకు మాత్రం చార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. గృహ వినియోగదారులపై చార్జీల మోత సాధారణ గృహ కనెక్షన్లకు, హైటెన్షన్ కనెక్షన్లకు చార్జీలు పెరిగాయి. జిల్లాలో గృహ వినియోగదారులపై సగటున రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు అదనపు భారం పడగా, హెచ్ లైన్ వినియోగదారులకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు అదనపు భారం పడుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలకే విద్యుత్ చార్జీలు పెంచటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో విద్యుత్ వినియోగం ఇలా... జిల్లాలో విద్యుత్ శాఖ డివిజన్లు ఏడు ఉండగా, వాటి పరిధిలో 13 లక్షల 67 వేల 121 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో కేటగిరి-1 (గృహ వినియోగం)లో సుమారు 13.30 లక్షలు, కేటగిరి-2 (వాణిజ్య కనెక్షన్లు) 26 వేలు, కేటగిరి-3 (పరిశ్రమలు) 6 వేల కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిని విద్యుత్ శాఖ హెచ్టీ (హైటెన్షన్ లైన్), ఎల్ కనెక్షన్ (లోటెన్షన్ లైన్)గా విభజించి నెలవారీ విద్యుత్ వాడకానికి అనుగుణంగా ఆయా కేటగిరీలను బట్టి బిల్లులను నిర్ణయిస్తారు. ఈ క్రమంలో గత నెలలో జిల్లాలో మొత్తం విద్యుత్ బిల్లు డిమాండ్ రూ.360 కోట్లుగా ఉంది. ఏడాది మొత్తం సగటున రూ.330 కోట్ల నుంచి రూ.380 కోట్ల మధ్యలో విద్యుత్ బిల్లు డిమాండ్ వస్తోంది. దీనిలో గృహ వినియోగ కనెక్షన్లకు సంబంధించి రూ.170 కోట్ల నుంచి రూ.200 కోట్ల మధ్య బిల్లు డిమాండ్ రాగా, వాణిజ్య కనెక్షన్లు, పరిశ్రమలకు ఇచ్చే కనెక్షన్లు, హైటెన్షన్ కనెక్షన్లకు సంబంధించి రూ.160 కోట్ల నుంచి రూ.180 కోట్ల వరకు ఉంటుంది. గృహ కనెక్షన్లకు చార్జీల పెంపుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గత నెలలో విద్యుత్ చార్జీల పెంపు యోచనలో భాగంగా విద్యుత్ శాఖ కొన్ని జిల్లాల్లో నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సగటు వినియోగం 200 యూనిట్ల పైనే 200 యూనిట్ల లోపు వారికి పెంచిన చార్జీలు వర్తించకపోయినా.. జిల్లాలో సాధారణ గృహాల్లో సగటు విద్యుత్ వినియోగం 200 యూనిట్ల పైనే ఉంటుంది. జిల్లాలో 13.30 లక్షల కనెక్షన్లలో 40 శాతం వినియోగదారులు 200 యూనిట్లు పైనే విద్యుత్ వినియోగించేవారే కావడం గమనార్హం. దీంతో చార్జీల పెంపు మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారాలు ఇలా... విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే ఇప్పటివరకు యూనిట్కు రూ.6.38 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలు రూ.6.70కి పెరగనున్నాయి. 250 యూనిట్లు దాటితే రూ.6.88 గా ఉన్న యూనిట్ ధర 7.22కు పెంచుతూ నిర్ణయించారు. 300 యూనిట్లు దాటితే ఇప్పటివరకు రూ.7.38గా ఉన్న ధర రూ.7.75కు పెరగనుంది. 400 యూనిట్లు దాటితే ఇప్పటివరకు రూ.7.88గా ఉన్న ధర ఇప్పుడు రూ.8.27కి చేరుతుంది. 500 యూనిట్లు దాటితే రూ.8.38గా ఉన్న ధర రూ.8.80కి పెరుగుతుంది. విద్యుత్ శాఖ నష్టాలను భర్తీ చేసుకోవటానికి, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా స్వల్పంగానే చార్జీలను పెంచిందని విద్యుత్శాఖ ఎస్ఈ మోహన్కృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
ఇలా చేయండి..బిల్లు తగ్గించండి
ప్రతి ఇంటా విద్యుత్ వినియోగం తప్పనిసరి. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కరెంటు వాడకం ఎంతో అవసరం. దీంతో రోజురోజుకూ ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పైసాను పొదుపు చేస్తే సంపాదించినట్లే. ఈ విషయం విద్యుత్కు కూడా వర్తిస్తుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎంతో విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా బిల్లుల భారంకూడా తగ్గుతుంది. - సాక్షి, ఆదిలాబాద్ ఫ్యాన్ వినియోగంలో .. {బాండెడ్ కంపెనీల ఫ్యాన్లనే వాడాలి. గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేయాలి. ఫ్యాన్ తిరిగేటప్పుడు శబ్దం ఎక్కువగా వస్తే బేరింగులు దెబ్బతిన్నట్లు గమనించాలి. వెంటనే రిపేర్ చేయించాలి. చౌక ధరలకు దొరికే ఫ్యాన్లను వాడకూడదు. కిటికిటీలు, తలుపులు తెరిచి ఉంచితే ఫ్యాన్ల అవసరం అంతగా ఉందడు. ఐరన్ బాక్స్ వాడకంలో.. టీవీ చూస్తూ, కబుర్లు చెపుతూ ఇస్త్రీ చేస్తే బిల్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఐరన్ బాక్స్ కొనేటప్పుడు తక్కువ బరువు, ఆటోమెటిక్గా పని చేసే వాటిని ఎంపిక చేసుకోవాలి. ఇస్త్రీ మధ్యలో ఆపి చేయటం వల్ల వేడి వృథా అవుతుంది. ఎలక్ట్రిక్ కుక్కర్ వంట చేసేటప్పుడు వార్మ్లో పడగానే స్విచ్ ఆపేసిన అన్నం ఉడుకుతుంది. విద్యుత్ కుక్కర్ కంటే గ్యాస్ స్టౌవ్పై అన్నం వండితే ఖర్చు తగ్గుతుంది. కుక్కర్ మూత పగిలితే చాలా మంది ప్లేట్లు వాడతారు. ఆవిరి నష్టం ఎక్కువై కరెంటు వినియోగం అధికమవుతుంది. తద్వారా బిల్లు భారం అవుతుంది. వాషింగ్ మిషన్ వాడకంలో.. {yయ్యర్ సౌకర్యాన్ని వాడకుండా బట్టలను బయట ఆరవేస్తే విద్యుత్ ఆదా అవుతుంది. లోడ్కు సరిపడ బట్టలున్నప్పుడే వాషింగ్ మిషన్ను వాడాలి. ఇంట్లో వాడే పరికరాలన్ని ఐఎస్ఐ మార్క్ కల్గి ఉండాలి. లైట్ల వాడకంలో... ట్యూబ్లైట్లు, కంపాక్ట్ ఫ్లూరోసెంట్ బలుబులే వాడాలి, పగలు వీలైనంత వరకు లైట్లను వినియోగించరాదు. కిటికీలు తలుపులు తీసి ఉంచితే వెలుతురు వస్తుంది. లైట్లను నెలకొక సారి తడిగుడ్డతో తుడిస్తే కాంతివంతంగా వెలుగుతాయి. 40 వాట్ల ఫిలమెంట్ బల్బు ఇచ్చే వెలుతురును 15 వాట్ల కంపాక్ట్ బల్బులు ఇస్తాయి. గీజ ర్ వాడకంలో.. గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే కరెంటు వినియోగం తగ్గుతుంది. గీజర్ కంటే సోలార్ వాటర్ హీటర్ వాడితే విద్యుత్ ఆదా చేసుకోవ చ్చు. అందరు వెనువెంటనే స్నానం చేస్తే గీజ ర్ను ఎక్కువ సేపు ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. కరెంటు వినియోగం తగ్గుతుంది. ఫ్రిజ్ వాడకంలో డోర్ను సాధ్యమైనంత వరకు తక్కువ సార్లు తీయాలి. ఒక్కసారి డోర్ తెరిస్తే అరగంట కూలింగ్ పోతుంది. {ఫిజ్ పై ఎండ పడకుండా చూసుకోవాలి. {ఫిజ్ వెనక భాగానా గాలి తగిలేలా చూసుకోవాలి. గది చల్లబరచడానికి కొందరు ఫ్రిజ్ డోర్ తీస్తారు. ఇది సరైంది కాదు. -
భారీగా విద్యుత్ వినియోగం
సాక్షి, ముంబై: ఈ వేసవిలో ముంబైకర్లు రికార్డుస్థాయిలో విద్యుత్ను వినియోగించారు. పగలూ రాత్రి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడంతో 3,365 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. గత సంవత్సరం వేసవిలో 3,212 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. ఇది రికార్డుస్థాయి వినియోగమని అప్పుడు అధికారులు ప్రకటించారు. ఈ రికార్డును కూడా 2014 తిరగరాసిందని విద్యుత్ సరఫరాశాఖ అధికారులు ప్రకటించారు. ఈసారి వేసవి ప్రారంభంకాకముందే ఎండలు మండిపోవడం మొదలయ్యాయి. ఏప్రిల్, మేలో పరిస్థితి దారుణంగా మారింది. ఉక్కపోత భరించలేక నిరంతరం కూలర్లు, ఫ్యాన్లు, ఏసీ వినియోగించారు. జూన్ మొదటి వారంలో వర్షాలు పడతాయని, ఉక్కపోత నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుందని ముంబైకర్లు భావించారు. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. వర్షాలు ఆలస్యం కావడం, దీనికి తోడు ఉక్కపోత మరింత పెరిగిపోవడంతో అంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. దీని ఫలితంగా విద్యుత్ వినియోగం ఒక్కసారిగా రికార్డుస్థాయిలో పెరిగిపోయింది. ముంబైకి రిలయన్స్ ఇన్ఫ్రా, టాటా పవర్, బెస్ట్, మహావితరణ్ సంస్థలు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఈ ఏడాది మే 10 నుంచి జూన్ 10 వరకు నాలుగు కంపెనీలు వినియోగదారులకు 3,365 మెగావాట్ల కరెంటును సరఫరా చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఐదు శాతం ఎక్కువ విద్యుత్ వాడినట్టు వెల్లడయింది. ఇందులో అత్యధిక శాతం అంటే 1,771 మెగావాట్ల విద్యుత్ రిలయన్స్ కంపెనీ శివారు ప్రాంతాలకు సరాఫరా చేసింది. ఆ తరువాత స్థానంలో టాటా, బెస్ట్, మహావితరణ్ ఉన్నాయి. ముంబైకర్లకు విద్యుత్ సరఫరాచేసే హైటెన్షన్ వైర్లను ఇటీవల మార్చివేశారు. దీంతో డిమాండ్కు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు మార్గం సుగమమయింది. -
లోడ్.. రిలీఫ్
తగ్గుముఖం పట్టిన వ్యవసాయ విద్యుత్ వినియోగం గత నెలతో పోలిస్తే రెండు మిలియన్ యూనిట్లు తగ్గుదల ఊపిరి పీల్చుకుంటున్న అధికార యంత్రాంగం క్రమంగా పెరుగుతున్న గృహ విద్యుత్ వినియోగం పరిశ్రమలకు పవర్ హాలిడే నుంచి మినహాయింపు నల్లగొండ, న్యూస్లైన్ : రబీ గండం గట్టెక్కింది. వ్యవసాయానికి విద్యుత్ వినియోగం రోజురోజుకూ తగ్గుతుండడంతో ట్రాన్స్కో ఊపిరి పీల్చుకుంది. వారం రోజులుగా నాన్ ఆయకట్టులో వరికోతలు ఊపందుకోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గత వారం రోజుల్లో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం సగానికి సగం పడిపోయింది. ఏప్రిల్ 30వ తేదీన జిల్లాలోని అన్ని అవసరాలకు 14.57 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా అది కాస్తా శుక్రవారానికి 12.67 మిలియన్ యూనిట్లకు చేరింది. వారం రోజుల వ్యవధిలో రెండు మిలియన్ యూనిట్లు మేరకు విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. ఇదిలా ఉంటే పంటల సాగుకోసం జిల్లాలో ఏడు మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించే పరిస్థితి నుంచి క్రమేణా సగానికి తగ్గిపోయింది. రబీ సీజన్లో రోజుకు 17.62 మిలియన్ యూనిట్ల విద్యుత్ కేటాయించినా ఎటూ సరిపోకపోవడంతో కోతలు విధించిన విషయం తెలిసిందే. దీంతో రైతులు పంటలు కాపాడుకునేందుకు రేయింబవళ్లు శ్రమించాల్సి వచ్చింది. మార్చి, ఏప్రిల్లో పరిశ్రమలకు కోత విధించి వ్యవసాయానికి వీలైనన్ని ఎక్కువ గంటలపాటు విద్యుత్ సరఫరా చేసే ప్రయత్నాలతో పెద్దగా వివాదాలేవీ లేకుండానే సీజన్లో పంటలను కాపాడగలిగారు. ఇదిలా ఉంటే ఓ వైపు వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిపోతుండగా, మరోవైపు గృహ విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం... ప్రస్తుతం జిల్లాలో విద్యుత్ వినియోగం పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పొ చ్చు. వ్యవసాయానికి విద్యుత్ వాడకం తగ్గిపోవడంతో గృహ అవసరాలకు ఎలాంటి కోతలు పెట్టడం లేదు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే పై నుంచి కోత విధిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు ఎలాంటి కోతలు లేకుండానే విద్యుత్ సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో పరిశ్రమలకు ప్రతి శుక్రవారం పవర్ హాల్డే అమలుచేశారు. కానీ ప్రస్తుతం విద్యుత్ వాడకం తగ్గిపోవడంతో ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కోత విధిస్తున్నారు. దీనిని 8వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. అంతకుముందు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కోత అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. తగ్గిన విద్యుత్ వినియోగం.. గత నెలతో పోలిస్తే ఈ నెలలో విద్యుత్ వినియోగం భారీగా తగ్గిపోయింది. ఏప్రిల్లో జిల్లాకు రోజూ 17.62 మిలియన్ యూనిట్లు కేటాయించగా 16.62 మిలియన్ యూనిట్లు వినియోగించారు. ఈ నెల మొదటి, రెండో వారాల్లో కేటాయించిన కోటాకు మించి కూడా విద్యుత్ వాడకం జరిగింది. కానీ వ్యవవసాయ పనులు పూర్తయ్యే చివరి వారంలో మాత్రం విద్యుత్ వాడకం 15 నుంచి 14.57 మిలియన్ యూనిట్లకు చేరింది. ఇక వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టడంతో ఈ నెల మొదటి వారంలో 13 మిలియన్ యూనిట్లకు చేరింది. రోజురోజుకూ విద్యుత్ వాడకం తగ్గుతుండడంతో శుక్రవారం నాటికి 12.67 మిలియన్ యూనిట్లకు చేరింది. వేసవి ఉక్కుపోత ఎక్కువగా ఉండడంతో గృహవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది. ఎండలు భరించలేక ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండీషనర్ల వాడకం పెరిగింది. గతంతో పోలిస్తే ఈ సీజన్లో విద్యుత్ కొరత సమస్యలు పెద్దగా తలెత్తలేదని చెప్పొచ్చు. -
పట్టణాలకు ఊరట పల్లెలకు తప్పని కోత
మోర్తాడ్, న్యూస్లైన్: రబీ సీజన్ వరి కోతలు మొదలు కావడంతో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం తగ్గింది. అయినా పల్లెలకు విద్యుత్ కోతల నుంచి విముక్తి తప్పడం లేదు. ఇందుకు ప్రత్యేక ఫీడర్లు లేకపోవడమే కారణం. కాగా నాలుగు రోజుల నుంచి మండల కేంద్రాలు, పట్టణాలు, సబ్స్టేషన్లు ఉన్న గ్రామాలలో గృహావసరాలకు పగటి పూట ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. గతంలో పట్టణాల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాలలో ఆరు గంటలు, సబ్స్టేషన్ కేంద్రాలలో ఎనిమిది గంటల పాటు విద్యుత్ కోతలను అమలు చేశారు. ప్రత్యేక ఫీడర్లు లేని గ్రామాలలో ఏకంగా 12 గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేసేవారు. అంతేకాక అర్ధరాత్రి మరో రెండు గంటల పాటు విద్యుత్ కోతను విధించేవారు. విద్యుత్ కోతల వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మండల కేంద్రాలు, పట్టణాల్లో పగటి పూట విద్యుత్ కోతల వల్ల వ్యాపారాలు సాగక అవస్థలు పడ్డారు. వర్షా కాలంలో భారీ వర్షాలు కురియడంతో భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయి. దీంతో బోరు బావుల కింద వరి సాగు విస్తీర్ణం రైతులు పెంచారు. వరి పంటకు సాగు నీరు రోజు అందించాల్సి ఉండటంతో విద్యుత్ వినియోగం పెరిగింది. వ్యవసాయానికి విద్యుత్ వినియోగం పెరగడం వల్ల గృహావసరాలకు కోతలు తప్పలేదు. ప్రస్తుతం పట్టణాలు, మండల కేంద్రాలు, సబ్స్టేషన్ కేంద్రాల్లో కోతలను అధికారులు ఎత్తివేయడంతో ప్రజలకు ఊరట లభించింది. అయితే ప్రత్యేక ఫీడర్లు లేని గ్రామాలలో మాత్రం కోతలను అధికారులు ఇంకా అమలు చేస్తున్నారు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు గాను 250 గ్రామాలలో సబ్స్టేషన్లు ఉన్నాయి. 468 గ్రామాలకు ప్రత్యేక ఫీడర్లను సబ్స్టేషన్ల నుంచి ఏర్పాటు చేయాల్సి ఉన్నా నిధుల కేటాయింపు జరగలేదు. ఫలితంగా ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరా సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతోంది. ప్రత్యేక ఫీడరులు లేని కారణంగా కోతలు తప్పడం లేదు. అయితే రోజుకు 12 గంటలకు బదులు తాజాగా 9 గంటల పాటు కోతలు విధించాలని అధికారులు నిర్ణయించారు. ఈ లెక్కన ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. వేసవి కారణంగా ఉక్కపోత అధికంగా ఉండటంతో పల్లెలకు కూడా నిరంతరం విద్యుత్ను సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ట్రాన్స్కో పై ‘ఉచిత’ భారం!
బొబ్బిలి, న్యూస్లైన్ : ఎస్సీ, ఎస్టీలు 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే.. ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పాలకులు ఏడు నెలల క్రితం ప్రకటించారు. ఈ మేరకు గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల్లో ఎంతమంది 50 యూనిట్లు వాడుతున్నారు... దీని వల్ల ఎంత భారం అవుతుందన్న లెక్కలను ట్రాన్స్కో అధికారులు కట్టారు. జిల్లాలో ఉచిత విద్యుత్కు అర్హత ఉన్న వారిలో ఎస్సీల్లో 17,300 మంది, ఎస్టీల్లో 34,450 ఉన్నట్టు గుర్తించారు. వీరందరికీ ట్రాన్స్కో అధికారులు ఏప్రిల్ నెల నుంచే ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఆ భారాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ట్రాన్స్కోకు పైసా కూడా చెల్లించలేదు. జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా ఎస్సీ లబ్ధిదారులు వినియోగించిన విద్యుత్కు రూ. 25 లక్షలు, ఎస్టీ లబ్ధిదారులు వినియోగించిన దానికి రూ. 15 నుంచి రూ. 17 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంది. గత ఏడాది నవంబరు నాటికి ఈ బకారుు రూ. 3.50 కోట్ల వరకూ ఉన్నట్టు ఆ శాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పుడు ఈ రెండు నెలలకు దాదాపు మరో కోటి రూపాయలు అదనంగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అసలు ఈ మొత్తం ప్రభుత్వం నుంచి ట్రాన్స్కోకి జమ అవుతుందా లేదా అన్న సందేహం ఉద్యోగుల్లో కలుగుతోంది. ప్రతినెలా ఎస్సీ వర్గానికి చెందిన వారికి ఉచిత విద్యుత్ వల్ల ప్రభుత్వం ఎంత కట్టాలన్నది ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్కు, ఎస్టీల కోసం వెచ్చించిన దానిపై ఐటీడీఏ పీఓకు విద్యుత్ శాఖాధికారులు లేఖలు రాస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నామంటూ ఇలా కోట్ల రూపాయలు నిధులు బకాయిలు ఉంచడంతో ప్రభుత్వం పథకాలు ఎన్నాళ్లు సాగుతాయోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.