Pro Kabaddi 2019
-
సెమీస్లో బెంగళూరు, ముంబా
అహ్మదాబాద్: ఆరంభంలో తడబడినా... పవన్ అసాధారణ పోరాటంతో ఓడాల్సిన మ్యాచ్ను డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ గెలిచింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఫలితం కోసం అదనపు సమయం వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7లో సోమవారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 48–45తో యూపీ యోధపై విజయం సాధించి సెమీస్లో అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 36–36తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ఆరు నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. అదనపు సమయంలో వవన్ సూపర్ రైడ్తో చెలరేగడంతో బెంగళూరు బుల్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. పవన్కు సుమిత్ సింగ్ (7 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) సహకరించారు. రెండో ఎలిమినేటర్ మ్యాచ్లో యు ముంబా 46–38తో హరియాణా స్టీలర్స్పై విజయం సాధించింది. బుధవారం జరిగే సెమీఫైనల్స్లో బెంగళూరు బుల్స్తో దబంగ్ ఢిల్లీ; యు ముంబాతో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
ప్లే ఆఫ్స్కు చేరువగా ముంబా
పంచకుల: ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ ప్లే ఆఫ్స్కు యు ముంబా మరింత చేరువైంది. సోమవారం జరిగిన మ్యాచ్లో మాజీ చాంపియన్ ముంబా 36–32తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. దీంతో 59 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది. ముంబై రైడర్ అభిషేక్ సింగ్ సూపర్ ‘టెన్’తో ఆకట్టుకున్నాడు. తలైవాస్ రైడర్ అజిత్ (16 పాయింట్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. యు ముంబాకు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో... ఒక్క మ్యాచ్ గెలిచినా ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ బెర్తును సొంతం చేసుకుంటుంది. ఒక వేళ రెండు మ్యాచ్లు ఓడితే మాత్రం ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మరో మ్యాచ్లో బెంగాల్ 42–33తో దబంగ్ ఢిల్లీపై నెగ్గింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్కు చేరాయి. -
ప్రదీప్ 26, తలైవాస్ 25
కోల్కతా: పట్నా పైరేట్స్ రైడర్ ప్రదీప్ నర్వాల్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 26 పాయింట్లు సాధించి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. దీంతో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7లో సోమవారం జరిగిన మ్యాచ్లో పట్నా 51–25తో తమిళ్ తలైవాస్ను చిత్తు చేసింది. పట్నా సాధించిన మొత్తం పాయింట్లల్లో ప్రదీప్ సాధించిన పాయింట్లు సగం ఉండటం విశేషం. అంతే కాకుండా ప్రత్యర్థి సాధించిన పాయింట్ల కంటే ప్రదీప్ సాధించిన పాయింట్లే ఎక్కువ. అంతకుముందు జరిగిన మ్యాచ్లో యూపీ యోధ 33–26తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై విజయం సాధించింది. గుజరాత్ రైడర్ సచిన్ సూపర్ టెన్తో రాణించినా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. -
యు ముంబా సిక్సర్...
బెంగళూరు: రైడర్ అభిషేక్ సింగ్ (13 పాయింట్లు), డిఫెండర్ ఫజల్ అత్రాచలి (6 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శనతో ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో యు ముంబా జట్టు జయాపజయాలను సమం చేసింది. స్థానిక కంఠీరవ స్టేడియంలో శనివారం మ్యాచ్లో యు ముంబా 47–21తో జైపూర్ పింక్ పాంథర్స్ను చిత్తుగా ఓడించి ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఇప్పటివరకు 12 మ్యాచ్లాడిన ముంబా 6 మ్యాచ్ల్లో గెలిచి మరో ఆరింటిలో ఓడినట్లయింది. అభిషేక్ సింగ్ 18 సార్లు రైడింగ్కు వెళ్లి 10 సార్లు సఫలమయ్యాడు. మరో 7 పర్యాయాలు పాయింట్లేమీ తీసుకురాకుండా, ఒకసారి మాత్రం ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోయాడు. మరో రైడర్ అర్జున్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. హరేంద్ర ఐదుగురిని పట్టేసి ఐదు పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లలో రైడింగ్లో నితిన్ రావల్ (5 పాయింట్లు), ట్యాకిల్లో అమిత్ హుడా (3 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 32–23తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. విజేత జట్టులో సౌరభ్ (8 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) రాణించారు. బెంగళూరు జట్టులో సచిన్, జీబీ మోరే చెరో 5 పాయింట్లు సాధించారు. నేడు యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్తో తమిళ్ తలైవాస్ ఆడతాయి. -
హరియాణాను గెలిపించిన వికాశ్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 36–33తో బెంగాల్ వారియర్స్ను కంగుతినిపించింది. హరియాణా రైడర్ వికాశ్ కండోలా 11 పాయింట్లతో చెలరేగాడు. మరో రైడర్ వినయ్ 9 పాయింట్లతో వికాశ్కు చక్కని సహకారం అందించాడు. బెంగాల్ వారియర్స్ రైడర్ మణీందర్ సింగ్ 15 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్గా నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 35–30తో పుణేరి పల్టన్పై నెగ్గింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
టైటాన్స్ మూడో విజయం
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ మూడో విజయాన్ని సాధించింది. ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 24–21తో జైపూర్ పింక్ పాంథర్స్కు షాకిచ్చింది. డిఫెండర్ విశాల్ భరద్వాజ్ 8 టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థిని పట్టేయడంలో సఫలం అయ్యాడు. చివర్లో టైటాన్స్ సారథి అబొజర్ తన అనుభవంతో ప్రత్యర్థిని పట్టేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో ఆతిథ్య ఢిల్లీ దబంగ్ 33–31తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. నేటి మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగళూరు బుల్స్; యూపీ యోధతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
వారియర్స్ విజయం
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో బెంగాల్ వారియర్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 35–26తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. రైడర్ మణీందర్ సింగ్ సూపర్ ‘టెన్’తో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి డిఫెండర్ రింకు నర్వాల్ (5 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. పట్నా తరఫున ఒంటరి పోరాటం చేసిన ప్రదీప్ నర్వాల్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా... సహచరులు రాణించకపోవడంతో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మ్యాచ్ లో బెంగాల్ ప్రత్యర్థిని 4 సార్లు ఆలౌట్ చేయగా... పట్నా రెండు సార్లు ఆలౌట్ చేసింది. ఈ విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్తో యు ముంబా తలపడతాయి. -
తమిళ్ తలైవాస్ ఓటమి
చెన్నై: సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్ పరాభవాన్ని మూటగట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ ఎడో సీజన్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 21–32తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. తలైవాస్ స్టార్ ఆటగాళ్లు రాహుల్ చౌదరి, మంజీత్ చిల్లర్, అజయ్ ఠాకూర్లు పూర్తిగా విఫలమయ్యారు. బెంగళూరు ఆటగాడు పవన్ షెరావత్ సూపర్ ‘టెన్’ (మొత్తం 11 పాయింట్లు)తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీల మ్యాచ్ చివరకు 30–30తో ‘టై’గా ముగిసింది. దబంగ్ ఢిల్లీ ఆటగాడు ప్రవీన్ కుమార్ 11 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్గా నిలిచాడు. -
యు ముంబా విజయం
అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7 మ్యాచ్లో యు ముంబా 34–30తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. యు ముంబా రైడర్ రోహిత్ బలియాన్ 9 పాయింట్లతో జట్టుకు విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 22–19తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై విజయం సాధించింది. జైపూర్ రైడర్ దీపక్ నివాస్ హుడా 7 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి చెన్నైలో పోటీలు జరుగుతాయి. తొలి రోజు తమిళ్ తలైవాస్తో బెంగళూరు బుల్స్; బెంగాల్ వారియర్స్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
జైపూర్ విజయాల బాట
అహ్మదాబాద్: జైపూర్ పింక్ పాంథర్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. తమ చివరి మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ చేతిలో అనూహ్యంగా ఓడిన పింక్ పాంథర్స్ ఆ షాక్ నుంచి త్వరగానే తేరుకున్నట్లు కనిపించింది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 33–25తో పుణేరి పల్టన్ను ఓడించింది. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ నివాస్ హుడా మరో సూపర్ ‘టెన్’తో చెలరేగాడు. పుణే తరఫున పంకజ్ మోహిత్ 8 పాయింట్లతో రాణించాడు. ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జైపూర్... ఎక్కడా తడబాటుకు గురికాలేదు. తమ రైడింగ్తో ప్రత్యర్థి డిఫెన్స్ను ఛేదిస్తూ... అలాగే పుణే రైడర్లను పట్టేస్తూ దూసుకెళ్లింది. ఇదే జోరులో పుణేని ఆలౌట్ చేసి 17–11తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. రెండో అర్ధ భాగంలోనూ దూకుడును కొనసాగించిన జైపూర్ సీజన్లో 5 విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. నేటి మ్యాచ్ల్లో యూ ముంబాతో పట్నా పైరేట్స్; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
వారియర్స్తో ‘టై’టాన్స్
అహ్మదాబాద్: గుజరాత్పై విజయంతో ఇక తెలుగు టైటాన్స్ గాడిలో పడిందని అనుకుంటే... ఆ దూకుడు కేవలం ఒక విజయానికి మాత్రమే పరిమితమైంది. సోమవారం బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్ను టైటాన్స్ 29–29తో ‘టై’ చేసుకుంది. ఈ సీజన్లో టైటాన్స్కిది రెండో ‘టై’ కావడం విశేషం. ఆట ఆరంభంలోనే సిద్ధార్థ్ దేశాయ్ తన రైడ్తో పాయింట్ తెచ్చి జట్టు ఖాతా తెరిచాడు. మ్యాచ్ మొదటి భాగంలో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవడంతో తెలుగు టైటాన్స్ 13–11తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టైటాన్స్ 17–12తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే ఆధిక్యంలో ఉన్నామన్న అతివిశ్వాసం జట్టును దెబ్బతీసింది. ప్రతి రైడర్ను పట్టేయాలని డిఫెండర్ విశాల్ భరద్వాజ్ చూపించిన అనవసరపు దూకుడు అతడిని పలుమార్లు కోర్టును వీడేలా చేసింది. అప్పటి వరకు నిలకడగా రాణించిన సిద్ధార్థ్ దేశాయ్, సూరజ్ దేశాయ్ల రైడింగ్ లయ తప్పడంతో ప్రత్యర్థులకు సులభంగా దొరికిపోయారు. ఒక్కో పాయింట్ సాధిస్తూ వచ్చిన వారియర్స్ టైటాన్స్ను ఆలౌట్ చేసి 23–21తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే చివర్లో పుంజుకున్న టైటాన్స్ స్కోర్ను సమం చేసి ఊపిరి పీల్చుకుంది. టైటాన్స్ రైడర్ సూరజ్ దేశాయ్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం జరిగిన మరో మ్యాచ్లో యూపీ యోధ జట్టు 35–33తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. యూపీ రైడర్ పవన్ శెరావత్ అటు రైడింగ్లో, ఇటు ప్రత్యర్థిని పట్టేయడంలోనూ చెలరేగాడు. మొత్తం 15 పాయింట్ల (6 రైడ్, 3 టాకిల్, 6 బోనస్)తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధతో హరియాణా స్టీలర్స్; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
జెర్సీ మారింది... బోణీ కొట్టింది
అహ్మదాబాద్: మారిన జెర్సీ రంగు తెలుగు టైటాన్స్ జట్టుకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్లో అందని ద్రాక్షలా ఉన్న గెలుపు ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ను పలకరించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 30–24తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ను ఓడించి ఈ లీగ్లో తొలి విజయాన్ని అందుకుంది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్, విశాల్ భరద్వాజ్లు చెరో ఏడు పాయింట్లతో జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. మ్యాచ్ మొత్తంలో 16 టాకిల్ పాయింట్లు, 11 రైడ్ పాయింట్లతో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసిన తెలుగు జట్టు గెలుపు బోణీ కొట్టింది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ పసుపు రంగు జెర్సీతో బరిలో దిగిన టైటాన్స్... గుజరాత్తో మ్యాచ్లో మాత్రం నల్ల రంగు జెర్సీతో ఆడింది. కొత్త జెర్సీ రంగు ఏం అదృష్టం తెచ్చిందో ఏమో కానీ.. ప్రత్యర్థి జట్టును ఆట ఆరంభమైన ఏడో నిమిషంలోనే ఆలౌట్ చేసింది. మొదటి అర్ధ భాగంలో సిద్ధార్థ్ రైడింగ్లో చెలరేగితే... రెండో అర్ధ భాగంలో విశాల్ భరద్వాజ్ తన పట్టుతో ప్రత్యర్థి రైడర్లను పట్టేశాడు. దీంతో గుజరాత్ సొంత మైదానంలో వరుసగా రెండో ఓటమిని నమోదు చేసింది. అంతకుముందు జరిగిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 30–33తో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓడింది. హరియాణా రైడర్ వికాస్ ఖండోలా 12 పాయింట్లతో రాణించాడు. నేటి మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్; యూపీ యోధతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
వారెవ్వా వారియర్స్
పట్నా: పేరుకు తగ్గట్టే బెంగాల్ వారియర్స్ అసలైన వారియర్లా పోరాడింది. ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు 5 పాయింట్ల అంతరాన్ని పూడ్చి విజేతగా నిలిచింది. ఒత్తిడి సమయాన ఎలా ఆడాలో మిగతా జట్లకు నేర్పింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 32–30తో యు ముంబాను ఓడించింది. అదిరే ఆరంభం లభించినా... దానిని సద్వినియోగం చేసుకోలేని యు ముంబా సీజన్లో నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుంది. యు ముంబా రైడర్ అర్జున్ దేశ్వాల్ సూపర్ ‘టెన్’తో చెలరేగినా... వారియర్స్ సమష్టి కృషి ముందు అది ఏ మాత్రం నిలవలేదు. వారియర్స్ డిఫెండర్లయిన మణీందర్ సింగ్, బల్దేవ్ సింగ్లు చెరో 5 టాకిల్ పాయింట్లతో మెరిశారు. ముంబా... విజయం ముంగిట... మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో యు ముంబా ఆడిన తీరు చూస్తే ఆ జట్టు ఖాతాలో మరో విజయం ఖాయమన్నట్లు కనిపించింది. విరామ సమయానికి ఆ జట్టు 16–11తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే సూపర్ రైడ్తో చెలరేగిన వారియర్ రైడర్ ప్రపంజన్ కుమార్ యు ముంబా ఆధిక్యాన్ని 14–16కు తగ్గించాడు. అనంతరం మరో నాలుగు పాయింట్లు సాధించిన బెంగాల్ జట్టు 18–17తో ముందంజ వేసింది. ప్రత్యర్థి ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్లు కనిపించిన ముంబై జట్టు వరుసగా పాయింట్లు సాధించి 26–21తో మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇటువంటి ఒత్తిడి సమయంలో ముంబైని తమ పట్టుతో పట్టేసిన బెంగాల్ డిఫెండర్లు ఆ జట్టును ఆలౌట్ చేసి... అనంతరం ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకున్నారు. సొంత మైదానంలో పట్నా పైరేట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన పట్నా... చివరి మ్యాచ్లో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 41–20తో యూపీ యోధపై ఘన విజయం సాధించింది. పట్నా తరపున ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి గుజరాత్ అంచె పోటీలు అహ్మదాబాద్లో ఆరంభం కానున్నాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్; పుణేరి పల్టన్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
పరాజయాల టైటాన్స్
పట్నా: ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ ఇప్పట్లో బోణీ కొట్టేలా కనిపించడం లేదు. గురువారం బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచ్లో 47–26తో ఓడిన టైటాన్స్ సీజన్లో మరో పరాభవాన్ని మూటగట్టుకుంది. టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 11 పాయింట్లతో తొలిసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచినా... బుల్స్ రైడర్ పవన్ కుమార్ (17 పాయింట్లు) రైడింగ్ ముందు నిలబడలేకపోయాడు. దీంతో సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఐదింటిలో ఓడి, ఒక దాంట్లో ‘టై’తో సరిపెట్టుకున్న టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. నేడు జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్తో యూపీ యోధ తలపడతాయి. -
హరియాణా స్టీలర్స్ గెలుపు
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో హరియాణా స్టీలర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో హరియాణా 35–26 స్కోరుతో పట్నాపై నెగ్గింది. స్టీలర్స్ జట్టులో రైడర్ వికాస్ (10) చక్కని ప్రదర్శన కనబరిచాడు. వినయ్ (6) కూడా రైడింగ్లో మెరువగా... డిఫెండర్లు రవి కుమార్ (4), సునీల్ (4), ధర్మరాజ్ చేరలతన్ (3) ప్రత్యర్థుల్ని అద్భుతంగా టాకిల్ చేయడంతో విజయం సులువైంది. పట్నా జట్టులో ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు. జట్టు సాధించిన స్కోరులో సగం కంటే ఎక్కువ పాయింట్లు ఇతనివే అయినా... సహచరుల వైఫల్యంతో జట్టు పరాజయం చవిచూసింది. యూపీ, తమిళ్ మ్యాచ్ టై... అంతకుముందు యూపీ యోధ, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య ఉత్కంఠ రేపిన మ్యాచ్ చివరకు 28–28తో టై అయింది. తలైవాస్ స్టార్ రాహుల్ చౌదరి (5 పాయింట్లు) ఆటలు సాగలేదు. నేడు జరిగే మ్యాచ్లో బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. -
తమిళ్ తలైవాస్ విజయం
పట్నా: తమిళ్ తలైవాస్ ఖాతా ఆలస్యంగానే తెరిచింది. పుంజు కుంది ఆలస్యంగానే... చివరకు గెలిచింది మాత్రం దర్జాగా! రాహుల్ చౌదరి (14 పాయింట్లు) రైడింగ్ ప్రదర్శనతో... ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 35–28తో హరియాణా స్టీలర్స్పై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి హరియాణా స్టీలర్స్ ధాటికి 19–10 స్కోరుతో తలైవాస్ వెనుకబడింది. కానీ ద్వితీయార్ధంలో అటు రైడింగ్, ఇటు టాకిల్స్తో తమిళ్ జట్టు వేగం పెంచి గెలిచింది. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 20–41తో పుణేరి పల్టన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆట మొదలై పది నిమిషాలైనా... ప్రత్యర్థి పుణేరి 14 పాయింట్లు చేసినా... పట్నా మాత్రం ఖాతా తెరువలేకపోయింది. రెండుసార్లు ఆలౌటై భారీ తేడాతో మూల్యం చెల్లించుకుంది. పుణేరి తరఫున అమిత్ 9, పంకజ్ 8, మన్జీత్ 6 పాయింట్లు చేసి జట్టును గెలిపించారు. -
టైటాన్స్ నాన్ టెక్నికల్ టై
ముంబై: తెలుగు టైటాన్స్ ఆటగాళ్ల అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. సాధారణంగా మ్యాచ్ ముగిశాక రిఫరీ వేసే లాంగ్ విజిల్ కంటే ముందుగా కబడ్డీ కోర్టు వెలుపల ఉన్న సహచర ఆటగాళ్లు గెలిచామనే ఆనందంతో కోర్టులోకి దూసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన రిఫరీలు యూపీ యోధకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్ కేటాయించడంతో... టైటాన్స్కు ఈ సీజన్లో దక్కాల్సిన తొలి విజయం కాస్తా ‘టై’గా ముగిసింది. ముంబై వేదికగా శుక్రవారం ముగిసిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్, యూపీ యోధ జట్లు నిర్ణీత సమయానికి 20–20తో సమంగా నిలిచాయి. దీంతో ప్రొ కబడ్డీ సీజన్ – 7లో తొలి ‘టై’ నమోదైంది. టైటాన్స్ తరపున సిద్ధార్థ్ దేశాయ్ (5 పాయింట్లతో) ఫర్వాలేదనిపించాడు. చేజేతులా... ఎలాగైనా విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో బరిలో దిగిన టైటాన్స్ మొదట ఆధిక్యాన్ని ఆ తర్వాత గెలుపుని చేజేతులా జారవిడుచుకుంది. మొదట 7–3తో ఆధిక్యంలో ఉన్న సమయంలో అలసత్వం ప్రదర్శించడంతో యూపీ వరుస పాయింట్లను సాధించి స్కోర్ను సమం చేసింది. మళ్లీ చివరి నిమిషంలో అదే అలసత్వం ప్రదర్శించి గెలుపును వదులుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో కూతకెళ్లిన టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ పాయింట్ సాధించి జట్టును 20–19తో ఆధిక్యంలో నిలిపాడు. దీంతో గెలిచామనే ఆనందంలో టైటాన్స్ జట్టు సభ్యులు రిఫరీ లాంగ్ విజిల్ వేశాడా..? లేదా... అనేది చూసుకోకుండా కోర్టులోకి దూసుకురావడంతో రిఫరీలు యూపీ జట్టుకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్ను కేటాయించారు. దీనిపై టైటాన్స్ సమీక్షకు వెళ్లగా... టీవీ అంపైర్ రిఫరీల నిర్ణయానికే కట్టుబడటంతో గెలవాల్సిన మ్యాచ్ కాస్త టైగా ముగిసింది. ఆఖరి పంచ్ ముంబైదే.. ముంబై వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో ఆఖరి పంచ్ ముంబై కొట్టింది. గుజరాత్ ఫార్చున్ జెయింట్స్పై 20–32తో ముంబై గెలిచి వరుస పరాజయాలకు పుల్స్టాప్ పెట్టింది. ముంబై ఆటగాళ్లు సురీందర్ సింగ్ 9 పాయింట్లతో, అభిషేక్ సింగ్ 6 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్; బెంగాల్ వారియర్స్తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
దబంగ్ ఢిల్లీకి కళ్లెం
ముంబై: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీకి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ కళ్లెం వేసింది. ముంబైలోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు 31–26తో ఢిల్లీని కంగుతినిపించింది. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం కీలక సమయంలో ఒత్తిడిని జయించిన ఫార్చూన్ జెయింట్స్నే వరించింది. దీంతో లీగ్లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన మోరే 9 పాయింట్ల(4 రైడ్ పాయింట్లు, 4 టాకిల్ పాయింట్లు, ఒక బోనస్ పాయింటు)తో గుజరాత్కు విజయాన్ని అందించాడు. అతనికి రోహిత్ గులియా (8 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. దబంగ్ రైడర్ నవీన్ కుమార్ సూపర్ ‘టెన్’ సాధించినా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్లో యూపీ యోధతో తెలుగు టైటాన్స్; యు ముంబాతో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ తలపడతాయి. -
ఒక్క క్లిక్తో క్రీడా వార్తలు
ప్రపంచకప్లో పటిష్ట జట్లపై ప్రతాపం చూపిన బంగ్లాదేశ్ నెలతిరిగే లోపే చేవలేని శ్రీలంక చేతిలో ‘జీరో’ అయ్యింది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్ను మంగళవారం ప్రకటించింది.ఇలాంటి మరిన్ని క్రీడా విశేషాలు మీ కోసం. -
గట్టెక్కిన పట్నా పైరేట్స్
ముంబై: ఉత్కంఠభరిత మ్యాచ్లకు వేదికగా మారిన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్ నమోదైంది. విజయం కోసం చివరి వరకు పోరాడిన తమిళ్ తలైవాస్ కేవలం ఒక పాయింట్ తేడాతో పట్నా పైరేట్స్ ముందు తలవంచింది. సోమవారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్లో పట్నా పైరేట్స్ 24–23 తేడాతో తమిళ్ తలైవాస్పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. వరుసగా తానాడిన రెండు మ్యాచ్లలో విజయం అంచుల వరకు వచ్చి ఓడిపోవడంతో తలైవాస్ డీలా పడింది. పైరేట్స్ డిఫెండర్ జైదీప్ 5 టాకిల్ పాయింట్లతో పాటు కీలక సమయంలో రైడ్కు వెళ్లి రెండు బోనస్ పాయింట్లు తెచ్చి హీరోగా నిలిచాడు. మోను 5 పాయింట్లతో అతనికి తన వంతు సాయం చేశాడు. రాహుల్ చౌదరి (5 పాయింట్లు), మంజీత్ చిల్లర్ (4 పాయింట్లు) ఆకట్టుకోలేకపోయారు. తడబడి నిలబడి... పట్నా పైరేట్స్ ఆటను అంత గొప్పగా ఆరంభించలేదు. మరోవైపు తలైవాస్ మొదటి మూడు నిమిషాల్లోనే నాలుగు పాయింట్లు సాధించి 4–0తో అధిక్యంలోకెళ్లింది. అయితే తరువాతి నిమిషంలో రాహుల్ని సూపర్ టాకిల్ చేసిన పట్నా రెండు పాయింట్లు సాధించి ఖాతా తెరిచింది. ఆ వెంటనే రైడ్కు వెళ్లిన ఇస్మాయిల్ రాన్ సింగ్ను ఔట్ చేయడంతో పాటు బోనస్ పాయింట్ను సాధించి స్కోరును సమం చేశాడు. తర్వాత ఇరు జట్లు సమానంగా పాయింట్లను సంపాదించడంతో విరామ సమయానికి 11–11తో సమంగా నిలిచాయి. చివరి మూడు నిమిషాల్లో... ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా తలైవాస్ 18–22తో వెనుకబడింది. ఈ దశలో రాహుల్, రాన్ సింగ్లు తమ రైడ్లతో మూడు పాయింట్లు తెచ్చారు. అదే సమయంలో పైరేట్స్ రెండు పాయింట్లను సాధించడంతో స్కోరు 21–24కు వెళ్లింది. చివరి రైడ్కు వెళ్లిన ప్రదీప్ను సూపర్ టాకిల్ చేసిన తలైవాస్కు రెండు పాయింట్లు వచ్చినా అది విజయాన్ని అందించలేకపోయింది. బెంగాల్ ఘనవిజయం రెండో మ్యాచ్లో బెంగాల్వారియర్స్ 43–23తో పుణేరి పల్టన్ను బోల్తా కొట్టించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో బెంగాల్ ముందు పుణేరి ఏమాత్రం నిలబడలేకపోయింది. బెంగాల్ తరపున మణీందర్ సింగ్ సూపర్ ‘టెన్’ (మొత్తం 14 పాయింట్లు)తో అదరగొట్టాడు. అతనికి ఇస్మాయిల్ నబీబ„Š (8 పాయింట్లు) సహకారం తోడవడంతో బెంగాల్ రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన పుణేరి ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. దీంతో పాయింట్ల పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. మంగళవారం విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో యూపీ యోధ తలపడతాయి. ప్రొ కబడ్డీలో 900 పాయింట్లను సాధించిన తొలి రైడర్గా రాహుల్ చౌదరి చరిత్ర సృష్టించాడు. మంజీత్ చిల్లర్ 300 టాకిల్ పాయింట్ల మార్క్ను అందుకున్నాడు. అజయ్ ఠాకూర్ రైడింగ్లో 600 పాయింట్లను సాధించాడు. -
బెంగాల్ చేతిలో పుణెరి చిత్తుచిత్తుగా..
ముంబై : బెంగాల్ వారియర్స్ దూకుడుకు పుణెరి పల్టన్ కుదేలైంది. మ్యాచ్ ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్ ఆడిన బెంగాల్.. ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇక బెంగాల్ ఆటగాళ్ల దూకుడైన ఆటకు పుణెరి ఆటగాళ్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. సోమవారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 43-23 తేడాతో పుణెరి పల్టాన్పై ఘన విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్ రైడర్ మణిందర్ సింగ్(14) హోరెత్తించగా.. మహ్మద్ నబిబక్ష్(8), రింకూ నర్వాల్(5) రాణించారు. ఆ జట్టు స్టార్ రైడర్ ప్రపంజన్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక పుణెరి ఆటగాళ్లలో ఏ ఒక్కరూ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. సారథి సుర్జీత్ సింత్ చేతులెత్తేయగా.. పంకజ్ మోహితె(6) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఇక డిఫెండర్ గిరీష్ ఎర్నాక్(3) ప్రత్యర్థి రైడర్లను కట్టడి చేయలేకపోయాడు. ఓవరాల్గా బెంగాల్ వారియర్స్ 22రైడ్, 12 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. పుణెరి జట్టు 13 రైడ్, 9 టాకిల్ పాయింట్లతో అందుకోలేకపోయింది. దీంతో పుణెరి ఖాతాలో హ్యాట్రిక్ ఓటమి పడింది. -
తమిళ్ తలైవాస్కు పట్నా షాక్
ముంబై : దబాంగ్ ఢిల్లీపై విజయంతో మంచి జోరు మీదున్న తమిళ్ తలైవాస్కు పట్నా పైరేట్స్ షాక్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఒక్క పాయింట్ తేడాతో తమిళ్ తలైవాస్ జట్టు ఓటమి చవిచూసింది. ఆ జట్టు స్టార్ రైడర్లు రాహుల్ చౌదరి(5) ఓ మోస్తారుగా రాణించినప్పటికీ.. సారథి అజయ్ ఠాకూర్(1)లు పూర్తిగా నిరాశపరిచాడు. సోమవారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తమిళ్ జట్టు 23-24 తేడాతో పట్నాపై పోరాడి ఓడిపోయింది. ఇరుజట్టు ఆది నుంచి ఆచితూచి ఆడాయి. దీంతో పాయింట్లు సాధించడం కష్టంగా మారింది. తొలి అర్దభాగం ముగిసే సరికి 11-11తో సమంగా నిలిచాయ. అయితే రెండో అర్దభాగం మొదట్లో తమిళ్ జట్టు పొరపాట్లు చేయడంతో మూల్యం చెల్లించుకుంది. ఇక చివర్లో తమిళ్ జట్టు పోరాడినప్పటికీ అదృష్టం కలిసిరాక ఓటమిచవిచూసింది. పట్నా స్టార్ రైడర్, సారథి పర్దీప్ నర్వాల్(1)ను కట్టడి చేసిన తమిళ్ ఢిఫెండర్లు.. జైదీప్(7)ను మాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇక ఈ మ్యాచ్లో పట్నా 7 రైడ్, 17 టాకిల్ పాయింట్లను సాధించగా.. తమిళ్ తలైవాస్ 9 రైడ్, 10 టాకిల్ పాయింట్లను సాధించింది. ఇరుజట్లు చెరో నాలుగు ఎక్సట్రా పాయింట్లను సాధించాయి. -
దబంగ్ ఢిల్లీ హ్యాట్రిక్
ముంబై : ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో దబంగ్ ఢిల్లీ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఆదివారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 41–21 పాయింట్లతో హరియాణా స్టీలర్స్ను చిత్తు చేసింది. ఢిల్లీ రైడర్లు చంద్రన్ రంజిత్ (11 పాయింట్లు), నవీన్ కుమార్ (10 పాయింట్లు)లు అదరగొట్టారు. వీరికి సయిద్ ఘఫారి డిఫెన్స్ అండ దొరకడంతో ఢిల్లీకి విజయం ఖాయమైంది. మ్యాచ్లో 22 రైడ్ పాయింట్లు, 9 టాకిల్ పాయింట్లతో రెండు సార్లు ఆలౌట్ చేసిన ఢిల్లీ ముందు 16 రైడ్ పాయింట్లు, 4 టాకిల్ పాయింట్లతో హరియాణా నిలబడలేకపోయింది. హరియాణా తరపున నవీన్ 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మెరిసిన చంద్రన్... మ్యాచ్ ఆరంభంలో ఒకే రైడ్లో రెండు పాయింట్లు తెచ్చిన చంద్రన్ రంజిత్ ఢిల్లీకి మంచి ఆరంభాన్నిచ్చాడు. దీనికి సమాధానంగా హరియాణా జట్టు కూడా ఒక రైడ్ పాయింట్ సాధించి ఖాతా తెరిచింది. స్కోర్ 10–9తో ఉండగా ఢిల్లీ సూపర్ టాకిల్ చేసి రెండు పాయింట్లు సాధించింది.తర్వాత మరో మూడు పాయింట్లను సాధించి 15–10తో ఆధిక్యంలోకి నిలిచింది. విరామం అనంతరం మరింత దూకుడు పెంచిన ఢిల్లీ వరుస రైడ్, టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థికి అందకుండా దూసుకెళ్లింది. మ్యాచ్లో ఢిల్లీ డిఫెండర్ ధర్మరాజ్ చేరాలథన్ ప్రొ కబడ్డీ లీగ్లో 400 పాయింట్ల మార్కును అందుకోగా... అతని సహచరుడు నవీన్ కుమార్ తన రైడ్లో విక్రమ్ కండోరా, కుల్దీప్ సింగ్లను ఔట్ చేయడం ద్వారా లీగ్లో 200 పాయింట్లను దాటాడు. బుల్స్ జోరు.. ఆద్యంతం నువ్వా నేనా అన్నట్టు సాగిన యు ముంబా, బెంగళూరు బుల్స్ మ్యాచ్లో బుల్స్ విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మద్దతు లభించినా చివరి నిమిషాల్లో ఒత్తిడికి లోనైన ముంబై 26–30తో ఓటమి పాలైంది. బెంగళూరు రైడర్ పవన్ షెరావత్ సూపర్ ‘టెన్’ (మొత్తం 11 పాయింట్లు)తో జట్టును గెలిపించగా... ముంబా జట్టు కెప్టెన్ ఫజేల్ అత్రాచలి (3 పాయింట్లు) నిరాశ పరిచాడు. మ్యాచ్లో రెండు జట్లు చిత్రంగా ఖాతా తెరిచాయి. ఇరు జట్ల రైడర్లు తమను తామే ఔట్ చేసుకుని ప్రత్యర్థి జట్లకు పాయింట్లను సమర్పించుకున్నారు. మొదట రైడ్కు వెళ్లిన ముంబా జట్టు రైడర్ అభిషేక్ సింగ్ ప్రత్యర్థి ఆటగాళ్లను ఔట్ చేసే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయి ఎల్లో లాబీని తొక్కాడు. అదే విధంగా బెంగళూరు రైడర్ పవన్ షెరావత్ కూడా ఔటయ్యాడు. ‘షేర్’వత్ స్కోర్ 23–19తో ముంబై ఆధిక్యంలో ఉన్నప్పుడు బుల్స్ రైడర్ సింహంలా చెలరేగాడు. వరుస రైడ్లలో పాయింట్లను తెచ్చి జట్టు స్కోర్ను 23–23తో సమం చేశాడు. అనంతరం ప్రత్యర్థిని కీలక సమయంలో ఆలౌట్ చేసిన బుల్స్ నాలుగు పాయింట్ల తేడాతో గేమ్ను గెలిచింది. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
గెలుపు ముంగిట బోర్లా పడిన బెంగాల్
ముంబై : బెంగాల్ వారియర్స్ విజయం ముంగిట బోల్తాపడింది. యూపీ యోధపై భారీ విజయంతో ఊపు మీదున్న బెంగాల్కు జైపూర్ పింక్ పాంథర్స్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రొ కబడ్డీ సీజన్ 7లో భాగంగా జైపూర్ పింక్ పాంథర్స్ 27-25 తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో బెంగాల్ నాలుగు పాయింట్లతో లీడింగ్లో ఉంది. కనీసం ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నా బెంగాల్ విజయం సాధించేదే. కానీ జైపూర్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన.. బెంగాల్ ఆటగాళ్ల తొందరపాటుతో గెలుపు సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. జైపూర్ విజయంలో సారథి దీపక్ హుడా, డిఫెండర్ సందీప్ దుల్లు కీలకపాత్ర పోషించారు. మ్యాచ్ను ఘనంగా ఆరంభించిన బెంగాల్.. ప్రత్యర్థి జట్టును తొలి నాలుగు నిమిషాలు పాయింట్ల ఖాతాను తెరవనివ్వలేదు. దీంతో 0-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రపంజన్(7), మణిందర్ సింగ్(6), బల్దేవ్ సింగ్(6)లు రాణించడంతో తొలి అర్ద భాగం ముగిసే సరికి బెంగాల్ 14-10తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో అర్దభాగంలోనూ బెంగాల్ ఆటగాళ్లు ఆచితూచి ఆడారు. అయితే చివర్లో తడబడటంతో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. జైపూర్ ఆటగాళ్లు సందీప్ దుల్(8), దీపక్ హుడా(6), దీపక్ నర్వాల్(4) కీలక సమయంలో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఓవరాల్గా జైపూర్ 12 రైడ్, 10 టాకిల్ పాయింట్లు సాధించగా.. బెంగాల్ 13 రైడ్, 11 టాకిల్ పాయింట్లను సాధించింది. అయితే బెంగాల్ను ఓ సారి ఆలౌట్ చేయడం, మూడు ఎక్సట్రా పాయింట్లు సాధించడం జైపూర్కు కలిసొచ్చింది. -
పుణెరీని బోల్తా కొట్టించిన యు ముంబా
ముంబై: సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో యు ముంబా అదరగొట్టింది. సుర్జీత్ సింగ్ సారథ్యంలోని పుణెరీ పల్టన్ను యు ముంబా బోల్తా కొట్టించి విజయం సాధించింది. శనివారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యు ముంబా 33-23 తేడాతో పుణెరీ పల్టన్పై విజయాన్ని అందుకుంది. దీంతో పుణెరి ఖాతాలో రెండో ఓటమి పడింది. తొలి మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆరంభంలో ధాటిగా ఆడిన పుణెరి ఆటగాళ్లు.. మ్యాచ్ జరిగే కొద్దీ ఢీలా పడ్డారు. ప్రత్యర్థి జట్టుకు దాసోహమయ్యారు. రైడింగ్లో, టాకిల్లో పూర్తిగా విఫలమయ్యారు. తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఆచితూచి ఆడటంతో పాయింట్ల వేగం తగ్గింది. అయితే రెండో అర్ద భాగంలో యు ముంబా ఆటగాళ్లు విరుచుకపడ్డారు. ఇక ఈ మ్యాచ్లో యు ముంబా ఆటగాళ్లు ఒకరిపై ఆధారపడకుండా సమిష్టిగా ఆడారు. రైడర్లు అభిషేక్ సింగ్(5), రోహిత్ బలియాన్(4) రాణించగా.. డిఫెండర్లు సురిందర్ సింగ్(4), సందీప్ నర్వాల్(4), ఫజల్ అత్రచలి(4) పుణెరి పని పట్టారు. ఇక పుణెరీ ఆటగాళ్లలో సారథి సుర్జీత్ సింగ్(4) ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. ఆ జట్టు స్టార్ డిఫెండర్ గిరీష్ ఎర్నాక్ పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్క టాకిల్ కూడా చేయలేకపోయాడు. ముంబా జట్టు 15 రైడ్, 12 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. పుణెరి జట్టు 12 రైడ్, 11 టాకిల్ పాయింట్లు మాత్రమే సాధించింది. యు ముంబా ధాటికి పుణెరి పల్టాన్ జట్టు రెండు సార్లు ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరైన భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. -
టైటాన్స్ది అదే కథ.. అదే వ్యథ
హైదరాబాద్: ప్రో కబడ్డీ సీజన్-7లో తెలుగు టైటాన్స్ వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. హ్యాట్రిక్ ఓటమి అనంతరం కూడా టైటాన్స్ ఆటగాళ్ల తీరు మారలేదు. గత రెండు మ్యాచ్ల్లో కనీస పోరాట పటిమను ప్రదర్శించిన టైటాన్స్ ఆటగాళ్లు పట్నా పైరేట్స్ మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యారు. పట్నా డిఫెండింగ్ ధాటికి టైటాన్స్ రైడర్లు పూర్తిగా తేలిపోయారు. టైటాన్స్ స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ ఓ మోస్తారుగా రాణించగా.. గత మ్యాచ్ హీరో సూరజ్ దేశాయ్ పూర్తిగా నిరాశపరిచాడు. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 34-22 తేడాతో టైటాన్స్ను చిత్తు చేసింది. పట్నా స్టార్ రైడర్, సారథి పర్దీప్ నర్వాల్ 7 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. డిఫెండర్ జైదీప్ 6 పాయింట్లతో టైటాన్స్ పనిపట్టాడు. పట్నా ధాటికి టైటాన్స్ తొలి రెండు నిమిషాలు ఖాతానే తెరవలేదు. దీంతో 0-4తో వెనుకంజలో ఉంది. అయితే ఈ సమయంలో విశాల్ భరద్వాజ్ సూపర్ టాకిల్తో టైటాన్స్కు రెండు పాయింట్లు అందించి ఖాతా తెరిచాడు. ఈ ఆనందం కూడా టైటాన్స్ అభిమానుల్లో ఎంతసేపు నిలువలేదు. పట్నా ఆటగాళ్లు అటాకింగ్ ఆడటంతో టైటాన్స్ ఆటగాళ్లు విలవిల్లాడారు. దీంతో తొలి ఆర్ధభాగం ముగిసే సరికి టైటాన్స్ జట్టు 9-23 తేడాతో భారీ వెనుకంజలో ఉంది. ఇక రెండో అర్థభాగంలో సిద్దార్థ్ దేశాయ్ ఒంటరి పోరాటంతో స్కోర్ అంతరాన్ని తగ్గించాడు కానీ ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. పట్నా జట్టు 12 రైడ్, 16 టాకిల్ పాయింట్లతో దడదడలాడించగా.. టైటాన్స్ జట్టు 10 రైడ్, 8 టాకిల్ పాయింట్లు మాత్రమే సాధించింది. -
యూపీ యోధ మరోసారి చిత్తుచిత్తుగా..
హైదరాబాద్: ప్రొ కబడ్డీ సీజన్ ఏడులో యూపీ యోధ వరుసగా రెండో మ్యాచ్లోనూ ఘోరంగా ఓటమిపాలైంది. ఆ జట్టు స్టార్ రైడర్ మోను గోయత్ దారుణంగా విఫలమవడం, సమిష్టి వైఫల్యంతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యూపీ యోధ 19-44 తేడాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైంది. గుజరాత్ ఆటగాళ్లు ఆరంభం నుంచి ఆటాకింగ్ ఆడారు. ముఖ్యంగా ఆ జట్టు రైడర్లు రోహిత్ గులియా(11), సచిన్(6) రెచ్చిపోయారు. దీంతో తొలి అర్దభాగంలోనే గుజరాత్ జట్టు 19-9తో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక గుజరాత్ ఢిఫెండర్లు పర్వేష్ బైన్సాల్(6), మోరె(5) కూడా ఓ చేయి వేయడంతో యూపీ జట్టు పనిపట్టారు. యూపీ రైడర్ శ్రీకాంత్ జాదవ్(5) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. యూపీ స్టార్ రైడర్ మోనూ గోయత్ ఎనిమిది సార్లు రైడ్కు వెళ్లి కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించాడు. ఇది యూపీపై పెద్ద ప్రభావం చూపింది. గుజరాత్ జట్టు 23 రైడ్ పాయింట్లు, 14 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. యూపీ జట్టు 14 రైడ్ పాయింట్లు, 5 టాకిల్ పాయింట్లతో అందుకోలేకపోయింది. అంతేకాకుండా యూపీ జట్టును ఆలౌట్ చేసి మరో మూడు పాయింట్లను గుజరాత్ తన ఖాతాలో వేసుకుంది. -
తలైవాస్ చేజేతులా..
హైదరాబాద్: ప్రొ కబడ్లీ లీగ్ సీజన్-7లో మరో హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఇరుజట్ల మధ్య విజయం దోబుచూలాడింది. విజేత ఎవరో తేలడానికి చివరి కూత వరకు వేచిచూడాల్సి వచ్చింది. చివరికి దబాంగ్ ఢిల్లీదే విజయం కాగా.. తమిళ్ తలైవాస్ చేజేతాలా ఓటమిపాలైంది. గురువారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో తమిళ్ తలైవాస్పై 30-29 తేడాతో దబాంగ్ ఢిల్లీ విజయాన్ని అందుకుంది. బుధవారం తెలుగు టైటాన్స్పై కూడా ఢిల్లీ ఒకే ఒక పాయింట్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందన్న వరకూ మంచి ఆధిక్యంలో ఉన్న తలైవాస్ జట్టు.. చివర్లో అనవసరపు తప్పిదాలతో ఓటమి మూటగట్టుకుంది. మ్యాచ్ విజేతన డిసైడ్ చేసే చివర కూతలో మంజీత్ చిల్లర్ బాక్స్ దాటడంతో తలైవాస్ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. దబాంగ్ ఢిల్లీ 13 రైడ్ పాయింట్లు, 9 టాకిల్ పాయింట్లతో అదరగొట్టగా.. తలైవాస్ జట్టు 12 రైడ్ పాయింట్లు, 11 టాకిల్ పాయింట్లతో అందుకోలేకపోయింది. -
టైటాన్స్ హ్యాట్రిక్ ఓటమి..
హైదరాబాద్ : ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ ఓటమిని నమోదు చేసింది. తొలి రెండు మ్యాచ్ల్లో యు ముంబా, తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమిపాలైన టైటాన్స్ జట్టు దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ నిరాశపర్చింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 33-34 తేడాతో ఢిల్లీ చేతిలో ఓటమి చవిచూసింది. టైటాన్స్ రైడర్ సూరజ్ దేశాయ్ 18 పాయింట్లతో రెచ్చిపోయినప్పటికీ ఢిల్లీ చేతిలో ఓటమిని తప్పించలేకపోయాడు. సూరజ్ దేశాయ్ తొలి రైడ్లోనే రెండు పాయింట్లతో టైటాన్స్కు మంచి శుభారంభాన్ని అందించాడు. ఆరంభం నుంచి ఆచితూచి ఆడిన ఇరుజట్లు తొలి అర్ధభాగం ముగిసేసరికి 14-13తేడాతో టైటాన్స్ స్వల్ప ముందంజలో నిలిచింది. అయితే రెండో అర్థభాగంలో కూడా ఇరుజట్లు చాలా జాగ్రత్తగా ఆడాయి. దీంతో చివరి కూత వరకు ఇరుజట్ల మధ్య విజయం నీదా నాదా అన్నట్లు సాగింది. అయితే ఢిల్లీ రెండు ఎక్సట్రా పాయింట్లు సాధించడం, టైటాన్స్ జట్టు ఓ సారి ఆలౌట్ అవ్వడంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అయితే చివరి రైడ్లో టైటాన్స్ విజయానికి మూడు పాయింట్లు అవసరం కాగా సిద్దార్థ్ దేశాయ్ ఒక్కటే సాధించాడు. దీంతో టైటాన్స్ ఓడిపోయింది. దబాంగ్ ఢిల్లీ 23 రైడ్ పాయింట్లు, 7 టాకిల్ పాయింట్లు సాధించగా.. తెలుగు టైటాన్స్ 27 రైడ్ పాయింట్లు, 6 టాకిల్ పాయింట్లు సాధించింది. టైటాన్స్ ఆటగాళ్లలో సూరజ్ దేశాయ్తో పాటు సిద్దార్థ్ దేశాయ్(8), విశాల్ భరద్వాజ్(4) ఫర్వాలేదనిపించారు. ఇక ఢిల్లీ ఆటగాళ్లలో నవీన్ కుమార్(14), చంద్రన్ రంజిత్(6), జోగిందర్ నర్వాల్(4) ఆకట్టుకున్నారు. -
గర్జించిన బెంగాల్.. కుదేలైన యూపీ
హైదరాబాద్: ప్రో కబడ్డీ సీజన్ లీగ్-7 తమ తొలి మ్యాచ్లోనే బెంగాల్ వారియర్స్ జూలు విదిల్చింది. బెంగాల్ దెబ్బకు యూపీ యోదా చిత్తుచిత్తుగా ఓడింది. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఏకపక్షపోరులో యూపీ యోధాపై బెంగాల్ వారియర్స్ 48-17 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో బెంగాల్ను ప్రతిఘటించిన యూపీ యోధా.. మ్యాచ్ జరిగే కొద్ది పట్టు విడిచింది. తొలుత పాయింట్ల ఖాతా తెరిచిన యూపీ 4-0తో మంచి లీడింగ్లో ఉంది. అనంతరం తొలిహాఫ్ ముగిసే సరికి యూపీ 8-11తో స్పల్ప వెనుకంజలో నిలిచింది. రెండో అర్ధభాగం ప్రారంభమయ్యాక బెంగాల్ వారియర్స్ అసలు ఆట ప్రారంభమైంది. బెంగాల్ ఆటగాళ్ల దూకుడుతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అటాకింగ్ గేమ్తో విరుచుకపడటంతో యూపీ ఆటగాళ్లకు ఏం చేయాలో పాలు పోలేదు. యూపీ స్టార్ రైడర్ మోనూ గోయత్(6) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. బెంగాల్ ఆటగాళ్లలో మహ్మద్ నబిబక్ష్ 10 పాయింట్లతో రెచ్చిపోయాడు. అతడికి తోడుగా మనిందర్ సింగ్(8), బల్దేవ్ సింగ్(7), ప్రపంజన్(5) ఆకట్టుకున్నారు. ఓవరాల్గా బెంగాల్ 24 రైడ్ పాయింట్లు, 14 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. యూపీ యోధా 10 రైడ్ పాయింట్లతో, 5 టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థి జట్టును అందుకోలేకపోయింది. ఇక బెంగాల్ ధాటిక యూపీ జట్టు నాలుగు సార్లు ఆలౌటవ్వడం గమనార్హం. -
జైపూర్ పింక్ పాంథర్స్ పంజా
సాక్షి, హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ మాజీ చాంపియన్స్ జైపూర్ పింక్ పాంథర్స్ ఏడో సీజన్ను ఘనవిజయంతో ప్రారంభించింది. ఆరంభ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ను ఓడించి దూకుడు మీదున్న యు ముంబా ఆటలు జైపూర్ పింక్ పాంథర్స్ ముందు సాగలేదు. సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పింక్ పాంథర్స్ 42–23 తేడాతో యు ముంబాను ఓడించింది. జైపూర్ జట్టు 25 రైడ్ పాయింట్లు, 11 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా... యు ముంబా 18 రైడ్ పాయింట్లు, 5 టాకిల్ పాయింట్లతో పాంథర్స్ను అందుకోలేకపోయింది. పాంథర్స్ తరపున దీపక్ హుడా 11 పాయింట్లతో మెరిశాడు. అతనికి నితిన్ (7 పాయింట్లు), దీపక్ (6 పాయింట్లు), అమిత్ హుడా (5 పాయింట్లు) చక్కని సహకారం అందించారు. యు ముంబా తరపున అభిషేక్ (7 పాయింట్లు), డాంగ్ జీన్ లీ (6 పాయింట్లు) పర్వాలేదనిపించారు. దడదడలాడించిన దీపక్... ఆట ఆరంభం నుంచి దూకుడును ప్రదర్శించిన పాంథర్స్ ఏ దశలోనూ యు ముంబాకు కోలుకునే అవకాశాన్నివ్వలేదు. ముఖ్యంగా దీపక్ హుడా తన రైడ్లతో ప్రత్యర్థిని దడదడలాడించాడు. తన తొలి రెండు రైడ్లలో మూడు పాయింట్లు సాధించి జైపూర్కు మంచి ఆరంభాన్నిచ్చాడు. ఖాతా తెరవడానికే 4 నిమిషాల సమయం తీసుకున్న యు ముంబా ఏ దశలోనూ జైపూర్ డిఫెన్స్ను ఛేదించలేకపోయింది. మొదటి అర్ధ భాగం ముగిసే సరికి జైపూర్ 22–9 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. రెండో భాగంలోనూ పింక్ పాంథర్స్ ఇదే దూకుడును చివరి వరకు కొనసాగించింది. ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసిన పాంథర్స్ ఒక్క సారి కూడా ఆలౌట్ కాలేదు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ జట్టు 34–24తో పుణేరి పల్టన్పై గెలుపొందింది. హరియాణా జట్టు స్టార్ రైడర్ నవీన్ 14 పాయింట్లతో ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించాడు. మంగళవారం మ్యాచ్లకు విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్; దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
యు ముంబా చిత్తుచిత్తుగా
హైదరాబాద్ : ప్రొ కబడ్డీ సీజన్-7లో భాగంగా జైపూర్ పింక్ పాంథర్స్తో జరిగిన మ్యాచ్లో యు ముంబా చిత్తయింది. తెలుగు టైటాన్స్పై విజయంతో ఊపుమీదున్న యూ ముంబా జట్టుకు జైపూర్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. సోమవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యు ముంబా 23-42 తేడాతో జైపూర్ చేతిలో చిత్తుగా ఓడింది. తొలి రైడ్లోనే దీపక్ హుడా రెండు పాయింట్లతో జైపూర్కు శుభారంభాన్ని అందించాడు. అక్కడి నుంచి జైపూర్ అటాకింగ్ గేమ్ ఆడి ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి 22-9తో జైపూర్ భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యు ముంబా ఆటగాళ్లు ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయారు. ఫజల్ అత్రచెలీతో సహా అందరూ విపలమయ్యారు. జైపూర్ స్టార్ రైడర్స్ దీపక్ హుడా 11 పాయింట్లతో రెచ్చిపోగా.. నితిన్ రావల్ 7 పాయింట్లతో, దీపక్ నర్వాల్ 6 పాయింట్లతో రాణించారు. యు ముంబా రైడర్ అభిషేక్ సింగ్ ఒక్కడే 7 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు. -
తొలి వేట యు ముంబాదే..
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో యు ముంబా శుభారంభం చేసింది. సొంత మైదానంలో జరుగుతున్న సీజన్ ఆరంభపు మ్యాచ్లో తెలుగు టైటాన్స్ చేతులెత్తేసింది. శనివారం హైదరాబాద్ వేదికగా తెలుగు టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 31-25 తేడాతో యు ముంబా ఘనవిజయం సాధించింది. ముంబై ఆటగాడు అభిషేక్ సింగ్ పది రైడింగ్ పాయింట్లతో చెలరేగగా.. డిఫెండర్స్ రోహిత్ బలియాన్, సందీప్ నర్వాల్ తలో నాలుగు ట్యాకిల్ పాయింట్లతో టైటాన్స్ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. టైటాన్స్ ఆటగాళ్లలో రజ్నిష్ 8 రైడింగ్ పాయింట్లతో ఆకట్టుకున్నప్పటికీ మిగతా వారి నుంచి సహకారం అందలేదు. సారథి అబోజర్ నాలుగు సార్లు ట్యాకిల్లో విఫలమవడం టైటాన్స్ను తీవ్రంగా దెబ్బతీసింది. -
సైరా కబడ్డీ...
ఆరు సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న కబడ్డీ ఆరు నెలలకే మళ్లీ వచ్చేసింది. ఐపీఎల్ తర్వాత అంతటి ఊపును తీసుకొచ్చిన ప్రొ కబడ్డీ లీగ్ కూత మరోసారి మోత మోగించనుంది. 12 జట్లు... 92 రోజులు... 137 మ్యాచ్లు... ఇక వినోదానికి లోటేముంది. నేటి నుంచి జరిగే సీజన్–7తో కబడ్డీ ... కబడ్డీ... కబడ్డీ అంటూ శ్రుతి కలిపేందుకు మీరు సిద్ధమేనా...? సాక్షి, హైదరాబాద్ ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్కు రంగం సిద్ధమైంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం లీగ్ తెరపైకి వచ్చి అనూహ్యంగా సూపర్ సక్సెస్గా నిలిచిన ఈ టోర్నీ విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 5న ఆరో సీజన్ ఫైనల్ జరగ్గా అదే జోరులో 2019లో రెండో సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్, యు ముంబా మధ్య జరిగే మ్యాచ్తో ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 19న గ్రేటర్ నోయిడాలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గత సీజన్లాగే ఈసారి కూడా 12 జట్లు బరిలోకి దిగుతున్నాయి. హైదరాబాద్ అంచె పోటీలు ఈనెల 26 వరకు జరుగుతాయి. కొత్త ఫార్మాట్తో 137 మ్యాచ్లు... ప్రొ కబడ్డీ లీగ్–7కు సంబంధించి ప్ర«ధాన మార్పు ఫార్మాట్ విషయంలో జరిగింది. ఇంతకుముందు రెండు వేర్వేరు జోన్లు, వాటిలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు తర్వాతి దశ, ఆపై చివరి దశ అంటూ గందరగోళంగా షెడ్యూల్ కనిపించింది. దాంతో దీనిని పూర్తిగా మార్చి అభిమానులకు ఆసక్తి రేపేలా చేశారు. ► ఐపీఎల్ తరహాలో ప్రతీ జట్టు మరో టీమ్తో రెండేసి సార్లు తలపడుతుంది. అంటే ఒక్కో టీమ్ కనీసం 22 లీగ్ మ్యాచ్లు ఆడుతుంది. సొంత వేదికపై మాత్రం గరిష్టంగా నాలుగు మ్యాచ్లకు మించి ఏ జట్టుకూ ఆడే అవకాశం రాదు. లీగ్ దశ అనంతరం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లు బరిలో నిలిస్తే...తర్వాతి ఆరు జట్లు టోర్నీనుంచి తప్పుకుంటాయి. ► తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు జట్లు రెండు ఎలిమినేటర్ మ్యాచ్లు ఆడి విజయం ద్వారా సెమీస్లో అడుగు పెట్టే అవకాశం ఉంది. సరిగ్గా మూడు నెలల సాగే ఈ లీగ్లో ఏకంగా 137 మ్యాచ్లు జరుగుతుండటం విశేషం. ప్రతీసారి ఏదో ఒక స్లోగన్ను లీగ్కు ఆకర్షణగా తెస్తున్న నిర్వాహకులు ఈసారి ‘ఇస్ సే టఫ్ కుచ్ నహీ...(ఇంతకంటే క్లిష్టం మరోటి లేదు)’ పేరుతో లీగ్కు ప్రచారం నిర్వహించారు. వేదికలు... 12 జట్లు తమ సొంత వేదికలను ఎంచుకున్నాయి. గత సీజన్లో తెలంగాణలో ఎన్నికల కారణంగా వైజాగ్లో హోం మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ ఈసారి హైదరాబాద్నే సొంత వేదికగా తీసుకుంది. దీంతో పాటు ముంబై, పట్నా, అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, పుణే, జైపూర్, పంచకుల, గ్రేటర్ నోయిడాలలో మ్యాచ్లు జరుగుతాయి. ప్రతీ అంచె మ్యాచ్లు శనివారం ప్రారంభమవుతాయి. ప్రతి మంగళవారం మ్యాచ్లకు విశ్రాంతి దినం. శని, ఆది, బుధ, శుక్రవారాల్లో హోం జట్లు తమ మ్యాచ్లను ఆడతాయి. పట్నాదే జోరు... లీగ్లో ఆరు సీజన్లలో పట్నా పైరేట్స్ జట్టు దూకుడు కొనసాగింది. ఏకంగా మూడు సార్లు ఆ జట్టు విజేతగా నిలవడం విశేషం. జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా ఒక్కోసారి టైటిల్ గెలుచుకున్నాయి. గత సీజన్లో ట్రోఫీ అందుకున్న బెంగళూరు బుల్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్... కబడ్డీ అంటే కుర్రాళ్లు మాత్రమే కాదు మేం కూడా ఆడగలమంటూ కొందరు వయసులో నిమిత్తం లేకుండా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. వీరిలో జోగీందర్ నర్వాల్ (37 ఏళ్లు–ఢిల్లీ), జీవకుమార్ (38 ఏళ్లు–బెంగాల్), ధర్మరాజ్ చేరలతన్ (43 ఏళ్లు–హరియాణా) ఆటపై అందరి దృష్టి ఉంది. కెన్యా నుంచి కూడా... లీగ్లో భారత ఆటగాళ్లతో పాటు పెద్ద సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అందరిలోకి అగ్రభాగం ఇరాన్దే. టైటాన్స్ కెప్టెన్ అబోజర్ సహా మొత్తం 15 మంది ఇరాన్ ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, కొరియా, శ్రీలంక, థాయ్లాండ్కు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. అమెరికన్ ఫుట్బాల్ (రగ్బీ) ఆడే డెవిట్ జెన్నింగ్స్ను టైటాన్స్ తమ జట్టులోకి తీసుకున్నా... చివరి నిమిషంలో వేరే కారణాలతో అతడిని తప్పించింది. లీగ్ టాపర్స్ అత్యధిక పాయింట్లు: రాహుల్ చౌదరి (876) అత్యధిక రైడ్ పాయింట్లు: పర్దీప్ నర్వాల్ (858) అత్యధిక టాకిల్ పాయింట్లు: మన్జీత్ ఛిల్లర్ (302) ఎక్కువ సార్లు ప్రత్యర్థిని ఆలౌట్: పట్నా పైరేట్స్ (165) మాజీ చాంపియన్స్ సీజన్ విజేత 2014 జైపూర్ పింక్ పాంథర్స్ 2015 యు ముంబా 2016 పట్నా పైరేట్స్ (జనవరి; జూన్) 2017 పట్నా పైరేట్స్ 2018–19 బెంగళూరు బుల్స్ నేటి మ్యాచ్లు తెలుగు టైటాన్స్ X యు ముంబా రాత్రి గం. 7.30 నుంచి బెంగళూరు బుల్స్ X పట్నా పైరేట్స్ రాత్రి గం. 8.30 నుంచి సీజన్–7 కెప్టెన్లు వీరే... ► మణీందర్ సింగ్ (బెంగాల్ వారియర్స్) ► జోగీందర్ నర్వాల్ (దబంగ్ ఢిల్లీ) ► సునీల్ కుమార్ (గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్) ► రోహిత్ కుమార్ (బెంగళూరు బుల్స్) ► దీపక్ హుడా (జైపూర్ పింక్ పాంథర్స్) ► పర్దీప్ నర్వాల్ (పట్నా పైరేట్స్) ► సుర్జీత్ సింగ్ (పుణేరీ పల్టన్) ► అజయ్ ఠాకూర్ (తమిళ్ తలైవాస్) ► అబోజర్ మొహాజిర్ మిగాని (తెలుగు టైటాన్స్) ► నితీశ్ కుమార్ (యూపీ యోధ) ► ఫజల్ అత్రచలి (యు ముంబా) ► ధర్మరాజ్ చేరలతన్ (హరియాణా స్టీలర్స్) -
ప్రొ కబడ్డీ లోగో ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్కు సంబంధించిన ఏర్పాట్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ప్రొ కబడ్డీ లీగ్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం హుస్సేన్సాగర్ వేదికగా జరిగింది. సాగర్లోని బుద్ధుని విగ్రహం వద్ద లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు టైటాన్స్ కెప్టెన్ అబోజర్తో పాటు జట్టు సభ్యులు, డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ సారథి రోహిత్ కుమార్, సినీ హీరో సందీప్ కిషన్ పాల్గొన్నారు. ఈ సీజన్ తొలి అంచె పోటీలకు నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. 20వ తేదీ నుంచి జరిగే ఈ టోర్నీ తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్తో యు ముంబా జట్టు తలపడుతుంది. -
యుముంబా కెప్టెన్ ఫజల్ అట్రాచలీ
ముంబై : ప్రపంచకప్ ముగియడంతో క్రీడా అభిమానులను అలరించడానికి ప్రొ కబడ్డీ సీజన్-7 సిద్ధమైంది. జులై 20న హైదరాబాద్ వేదికగా ఈ మెగాఈవెంట్ ప్రారంభంకానుంది. ఇప్పటికే కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకున్న ఆయా ఫ్రాంచైజీలు.. టైటిల్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. యుముంబా తమ జట్టు సారథిగా ఫజల్ అట్రాచలీ(ఇరాన్)ని కొనసాగిస్తూ.. వైస్ కెప్టెన్గా సందీప్ నర్వాల్ను ప్రకటించింది. యు ముంబా కబడ్డీ జట్టు సారథ్య బాధ్యతలు మరోసారి అప్పగించడం సంతోషంగా ఉందని, జట్టును విజయం దిశగా తీసుకెళ్తానని ఫజల్ అట్రాచలీ మీడియా సమావేశంలో తెలిపాడు. వ్యూహాలు, క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనివ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నాడు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేసిన సందీప్ నర్వాల్.. వ్యూహాలు రచించడం ఆటలో కీలకమని అభిప్రాయపడ్డాడు. వైస్ కెప్టెన్గా వ్యూహాలు రచించడంలో ముందుంటానని, ఆదిశగా సాధన చేస్తానని తెలిపాడు. ఇక యుముంబా జులై 20న హైదరాబాద్ వేదికగా తెలుగు టైటాన్స్తో జరిగే మ్యాచ్తో తన క్యాంపైన్ ప్రారంభించనుంది. పుణెరి పల్టాన్ కెప్టెన్గా సుర్జీత్ సింగ్ పుణెరి పల్టాన్ తన కెప్టెన్గా సుర్జీత్ సింగ్ను ప్రకటించింది. జట్టును నడిపించే సత్తా సుర్జీత్కు ఉందని కోచ్ అనూప్ కుమార్ ధీమా వ్యక్తం చేశాడు. నితిన్ తోమర్చ గిరిష్ ఎర్నాక్, పవన్ కుమార్, దర్శన్ కడియన్లతో పుణెరి పల్టాన్ పటిష్టంగా ఉంది. -
కూతేస్తే.. కేకలే
క్రికెట్ ప్రపంచకప్ పండుగ ముగిసింది. కప్పు గెలిచిన ఇంగ్లండ్ సంబరాల్లో ఉండగా, అదృష్టం వెక్కిరించి గెలుపుగీతను దాటని న్యూజిలాండ్ దుఃఖ సాగరంలో మునిగింది. మూడోసారి జగజ్జేతగా నిలవాలనుకున్న భారత్ సెమీస్లోనే ఓడి ఇంటి ముఖం పట్టింది. ఈ పరాజయంతో నైరాశ్యంలో మునిగిన క్రీడాభిమానులను అలరించడానికి మట్టిలో పుట్టిన గ్రామీణ క్రీడ ‘కబడ్డీ’ సమాయత్తమవుతోంది. ఆటగాళ్ల అద్భుత రైడింగ్ విన్యాసాలు, అదిరిపోయే ఉడుంపట్టు డిఫెన్స్ మెరుపులతో క్షణక్షణం ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రొ కబడ్డీ సీజన్–7 సిద్ధమైంది. పల్లె క్రీడకు కార్పొరేట్ సొబగులద్దడంతో ప్రొ కబడ్డీ రూపంలో పిల్లాడి నుంచి పండు ముసలి వరకు, గ్రామం, పట్టణం, నగరాలనే తేడాల్లేకుండా అనతి కాలంలోనే క్రికెటేతర క్రీడల్లో కబడ్డీ అగ్రగామిగా మారింది. తమ అద్భుతమైన ఆటతో గత కొన్ని సీజన్లుగా వీక్షకుల మనసులు దోచిన కొందరు కూతగాళ్ల గురించి తెలుసుకుందాం.. డుబ్కీ వీరుడు పర్దీప్: ప్రొ కబడ్డీలో అందరికంటే ఎక్కువగా 858 రైడ్ పాయింట్లను అతి తక్కువ మ్యాచుల్లో (85) పర్దీప్ నర్వాల్ సాధించాడు. ‘డుబ్కీ కింగ్’ అని ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే పర్దీప్ ప్రొ కబడ్డీలో బెంగళూరు జట్టు నుంచి అరంగేట్రం చేశాడు. కానీ అతడికి ఎక్కువ అవకాశాలిచ్చింది మాత్రం పట్నా జట్టు. పట్నా పైరేట్స్ మూడుసార్లు టైటిల్ గెలవడంలో డుబ్కీ కింగ్ కీలకపాత్ర పోషించాడు. హాదీ ఓస్తరక్, జాంగ్ కున్ లీ, సురేందర్ నాడా, మహ్మద్ మగుసొద్లూ లాంటి సీనియర్ ఆటగాళ్ల కలబోతతో ఉన్న పట్నా పైరేట్స్ను పర్దీప్ టైటిల్ రేసులో నిలపడానికి తొడగొడుతున్నాడు. ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతున్న పర్దీప్ నర్వాల్ రైడ్ మెషీన్ రాహుల్: ప్రొ కబడ్డీలో పర్దీప్ నర్వాల్ తర్వాత అత్యధిక రెడింగ్ పాయింట్లను రాహుల్ చౌదరి నమోదు చేశాడు. అభిమానులు రాహుల్ను ముద్దుగా ‘ప్రొ కబడ్డీ పోస్టర్ బాయ్’, ‘రైడ్ మెషీన్’ అంటుంటారు. తొలి సీజన్ నుంచి తెలుగు టైటాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన రాహుల్.. రైడింగ్లో సూపర్ సక్సెస్ అయినా జట్టుకు కప్పు సాధించడంలో విఫలమయ్యాడు. ఈసారి జట్టు మారిన అతడు తమిళ్ తలైవాస్ టీమ్లో అజయ్ ఠాకూర్తో కలసి ఆడబోతున్నాడు. తెలుగు టీమ్కు కప్పు తీసుకురాలేకపోయిన రాహుల్ తమిళ టీమ్తోనైనా కప్పు గెలిచి తన కోరికను తీర్చుకోవాలని కసిగా ఉన్నాడు. హ్యాండ్ టచ్ యత్నంలో రాహుల్ చౌదరి సొగసరి అజయ్ ఠాకూర్: భారత కబడ్డీ జట్టుకు అజయ్ ఠాకూర్ సారథనే విషయం తెలిసిందే. సంప్రదాయ ఆటతీరుతో అజయ్ ఆటతీరు సొగసుగా ఉంటుందంటుంటారు విశ్లేషకులు. అజయ్ రన్నింగ్ హ్యాండ్ టచ్లకు పేరున్న డిఫెండర్లు కూడా ఔటవ్వాల్సిందే. ప్రొ కబడ్డీలో గత రెండు సీజన్లుగా తమిళ్ తలైవాస్ టీమ్ను కెప్టెన్గా ముందుండి నడిపిస్తున్న అజయ్ ఆయా సీజన్లలో యువ ఆటగాళ్లను బాగా ప్రోత్సహించాడు. శక్తివంచన లేకుండా పోరాడిన అజయ్ సారథ్యంలోని తలైవాస్ జట్టు చాలా మ్యాచుల్లో చివరి నిమిషాల్లో గెలిచింది. అజయ్ అద్భుత ఆటతో ఈ గెలుపులు సాధ్యమయ్యాయి. రాహుల్ చౌదరీ, షబ్బీర్ బాబు. మంజీత్ చిల్లర్ లాంటి ప్రముఖ ఆటగాళ్ల రాకతో ఇటు రైడింగ్, అటు డిఫెన్స్ దుర్బేధ్యంగా తయారైన తలైవాస్ను విజేతగా నిలపాలని అజయ్ ఠాకూర్ ఉవ్విళ్లూరుతున్నాడు. రన్నింగ్ హ్యాండ్ టచ్కు ప్రయత్నిస్తున్న అజయ్ ఠాకూర్ ఆల్రౌండర్కు మారుపేరు మంజీత్: వన్ మ్యాన్ ఆర్మీగా మంజీత్ చిల్లర్ కబడ్డీ ప్రేక్షకులకు సుపరిచితం. మొదటి రెండు సీజన్లలో బెస్ట్ డిఫెండర్, మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్గా నిలిచిన మంజీత్.. తొలుత బెంగళూరుకు ఆడినా రెండేళ్ల క్రితం తమిళ్ తలైవాస్ జట్టుకు మారాడు. మంజీత్ ఫామ్లో ఉంటే ఎదుటి జట్టుకు చెమటలు పట్టడం ఖాయం. డిఫెన్స్లో కీలకంగా ఉండే మంజీత్ రైడర్లను ఒడిసిపట్టడంలో, డ్యాష్లతో భయపెట్టడంలో సిద్ధహస్తుడు. మంజీత్ది ఉడుంపట్టని అనొచ్చు. కుస్తీతో కూడిన అతడి డిఫెన్స్కు ఎంతటి రైడరైనా పట్టు చిక్కాల్సిందే. రైడర్ను నిలువరిస్తున్న మైటీ మంజీత్ చిల్లర్ వణుకు పుట్టించే అట్రాచలి: ఇరాన్ ఆటగాడైన ఫజల్ అట్రాచలి ప్రొ కబడ్డీలో చురుకైన డిఫెన్స్ స్కిల్స్తో తన మార్క్ చాటుకున్నాడు. లెఫ్ట్ కార్నర్లో ఆడే ఫజల్ నుంచి పాయింట్లు రాబట్టడం రైడర్లకు అంత సులువు కాదు. ఈసారి సందీప్ నర్వాల్, రాజ్గురు సుబ్రహ్మణ్యం, సురేందర్ సింగ్ లాంటి అనుభవజ్ఞుల అండతో డ్యాష్, యాంకిల్ హోల్డ్, బ్లాక్ లాంటి దాడులు చేస్తూ, ప్రత్యర్థులను కట్టడి చేయడానికి ఫజల్ తన డిఫెన్స్ బృందంతో సంసిద్ధమవుతున్నాడు. రైడర్ను పట్టుకోవడానికి పోరాడుతున్న ఫజల్ అట్రాచలి యూపీ యోధుడు రిషాంక్: యూపీ యోధాస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రిషాంక్ దేవడిగా రైడర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యూ–ముంబాకు ఆడినప్పుడు వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందుకున్న రిషాంక్ మూడో సీజన్లో 115 పాయింట్లు సాధించాడు. ఆ ప్రదర్శనతోనే యూపీ జట్టుకు కెప్టెన్గా అవకాశం అందుకున్నాడు. ఐదో సీజన్లో యూపీ తరఫున చెలరేగిన రిషాంక్ 170 పాయింట్లతో అందరి మనసులూ గెలుచుకున్నాడు. డూ ఆర్ డై స్పెషలిస్ట్గా పేరున్న రిషాంక్తోపాటు మోనూ గోయత్, శ్రీకాంత్ జాదవ్, మోసెన్ మొక్సూదులూతో యూపీకి కీలకం అవనున్నారు. కలసికట్టుగా ఆడితే ఏ జట్టునైనా చిత్తుచేయగల సామర్థ్యమున్న యూపీ కప్పు కలను రిషాంక్ మోయనున్నాడు. టో–టచ్ ప్రయత్నంలో రిషాంక్ దేవడిగా విరుచుకుపడే విశాల్: ప్రొ కబడ్డీలో విశాల్ భరద్వాజ్ ప్రస్థానం తెలుగు టైటాన్స్తో మొదలైంది. ఇప్పుడు అదే జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 5వ సీజన్లో 71 డిఫెండింగ్ పాయింట్లతో విశాల్ అందరి దృష్టిలో పడ్డాడు. రాహుల్ చౌదరీని కోల్పోయినా బిడ్డింగ్లో గత సీజన్ హీరో సిద్ధార్థ్ దేశాయ్ను దక్కించుకోవడంతో ఈసారి టైటాన్స్ జట్టు కప్పుపై ఆశలు పెంచుకుంది. అబోజర్ మిఘానీ, సి.అరుణ్ వంటి వారితో బలమైన డిఫెన్స్ బృందంతో రైడర్లపై విరుచుకుపడటానికి సమాయత్తమవుతున్న విశాల్ ఈ యేడు ఎలాగైనా తెలుగు ప్రేక్షకుల కప్పు కలను నెరవేర్చుతాననే నమ్మకంతో ఉన్నాడు. రైడర్ను లాఘవంగా ఒడిసిపడ్తున్న విశాల్ భరద్వాజ్ సిసలైన బుల్ రోహిత్: పట్నా జట్టుతో రోహిత్ కుమార్ ప్రొ కబడ్డీ ప్రయాణం మొదలైంది. గత మూడు సీజన్లుగా బెంగళూరు బుల్స్కు ఆడుతున్న అతడు, గతేడాది జరిగిన సీజన్–6లో బెంగళూరును చాంపియన్గా నిలిపాడు. రోహిత్, పవన్ షెరావత్ రైడింగ్లో చెలరేగితే అడ్డుకోవడం ప్రత్యర్థులకు కత్తి మీద సామే. పవన్ షెరావత్, ఆశిశ్ కుమార్, వినోద్ కుమార్, మోహిందర్ సింగ్లతో మంచి సమతూకంతో ఉన్న బుల్స్ జట్టును మళ్లీ విజేతను చేయడానికి రోహిత్ వ్యూహాలు రచిస్తున్నాడు. డిఫెండర్లపై దూసుకొస్తున్న రోహిత్ కుమార్ నిప్పులు చెరిగే నితిన్: యూపీ బాహుబలిగా పిలుచుకునే నితిన్ తోమర్ మూడో సీజన్తో ప్రొ కబడ్డీలో అడుగుపెట్టాడు. బెంగాల్, యూపీ, పట్నాలకు ప్రాతినిధ్యం వహించాడు. ఐదో సీజన్లో పుణెరి తరఫున నితిన్ ఆడుతూ 177 పాయింట్లతో అందరిని ఆకర్షించాడు. ఎస్కేప్, రన్నింగ్ టచ్ హ్యాండ్, కీలక సమయాల్లో బోనస్, టర్నింగ్ స్కిల్స్తో నితిన్ చెలరేగిపోతుంటే అవతలి జట్టుకు ఆపడం కష్టతరమే. పవన్ కుమార్, గిరీష్ ఎర్నాక్, సుర్జీత్ సింగ్లతో కూడిన పుణేరి పల్టన్ జట్టును టైటిల్ వేటలో ముందుంచడానికి ఉరిమే ఉత్సాహంతో నితిన్ సిద్ధమవుతున్నాడు. రైడ్ చేస్తున్న నితిన్ తోమర్ - నిధాన్ సింగ్ పవార్