retired employees
-
ప్రభుత్వ ఉద్యోగులమైనా.. ఏం‘ప్రయోజనం’?
నల్లగొండ జిల్లాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మహిళా ఉద్యోగి ఒకరు అనారోగ్య కారణాలతో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) కింద విధుల నుంచి తప్పుకొన్నారు. తద్వారా అందే సొమ్ముతో తన ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోవచ్చని భావించారు. ఆమెకు గ్రాట్యుటీ, టీజీఎల్ఐసీ, లీవ్స్ ఎన్క్యాష్మెంట్, కమ్యూటేషన్ తదితర ప్రయోజనాల కింద మొత్తంగా రూ.60 లక్షల వరకు అందాల్సి ఉంది. కానీ ఏడాదిన్నర గడిచినా పెన్షన్ మినహా ఇతర ప్రయోజనాలేవీ అందలేదు. దీనితో తన ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభించలేదని ఆమె వాపోతున్నారు.రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన ఓ టీచర్ (స్కూల్ అసిస్టెంట్) ఈ ఏడాది ఏప్రిల్లో పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాలను ముందే లెక్కలు వేసుకుని.. జూన్లో కుమార్తె వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్లో రిటైర్ అయినా.. తర్వాతి రెండు నెలల్లో తనకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని భావించారు. కానీ పెళ్లి తేదీ సమీపిస్తున్నా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందలేదు. దీంతో రూ.20 లక్షల మేర అప్పులు చేసి కుమార్తె పెళ్లి చేశాడు. ప్రభుత్వం నుంచి సొమ్ము అందగానే అప్పులు తిరిగి కట్టేయవచ్చని అంచనా వేసుకున్నారు. కానీ ఇంకా అందలేదు. అప్పులపై ఇప్పటికే రూ.2 లక్షలకుపైగా వడ్డీలు కట్టారు. ప్రభుత్వం నుంచి సొమ్ము ఇంకెప్పుడు వస్తుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కేవలం నెలవారీ వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు తప్ప మిగతా ప్రయోజనాలేవీ అందడం లేదు. ఆయా బిల్లుల చెల్లింపును ఆర్థిక శాఖ నిలువరించడంతో వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. దీనితో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు, ఇల్లు కట్టుకోవడం సహా ముఖ్యమైన అవసరాలకు సొమ్ము అందక.. బయట అడ్డగోలు వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అన్నిరకాల ప్రయోజనాలూ ఆపేసి.. సాధారణంగా ఉద్యోగులకు ఏటా ఆర్జిత సెలవులను నగదు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా సుమారు ఒక నెల వేతనానికి సరిపడా సొమ్ము అందుతుంది. వైద్య చికిత్సలకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్మెంట్, ఉద్యోగుల జీవిత బీమా పథకం కింద బాండ్స్ మెచ్యూరిటీ అయితే అందాల్సిన సొమ్ము, పదవీ విరమణ పొందితే వచ్చే గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు రావాల్సి ఉంటుంది. కానీ సుమారు మూడేళ్లుగా ఉద్యోగులకు వేతనాలు, రిటైరైన వారికి పెన్షన్ డబ్బులు మినహా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పదవీ విరమణ పొందిన వారికి సంబంధించి వివిధ రకాల బిల్లులు కలిపి సుమారు రూ.3,800 కోట్ల మేర ప్రభుత్వం బకాయిపడినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల కింద అందేవాటిలో మెజారిటీ అంశాలు ఉద్యోగులు వ్యక్తిగతంగా జమ చేసుకున్నవే. ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి (జీపీఎఫ్), జీవిత బీమా (టీజీఎల్ఐ) పథకాల కింద నెలవారీ వేతనాల నుంచి నిధులు జమ అవుతాయి. ఇలా దాచుకున్న నిధి నుంచి అత్యవసర పరిస్థితిలో కొంత మేర రుణరూపంలో వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక జీవిత బీమా పథకానికి సంబంధించి ఉద్యోగి వయసు 58 సంవత్సరాలు నిండితే.. ఆ బాండ్ కాలపరిమితి పూర్తి కావడంతో అందుకు సంబంధించి ఆర్థిక ప్రయోజనం వెంటనే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లుగా ఉన్న నేపథ్యంలో... జీవితబీమా పథకం బాండ్లు మెచ్యూరిటీ అయిన ఉద్యోగుల సంఖ్య సుమారు 25 వేల మంది వరకు ఉంటుంది. వీరికి జీవిత బీమా పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు రూ.850 కోట్లుగా అంచనా. జీపీఎఫ్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రెండేళ్లుగా పైసా అందలేదు. ఇలా రూ.450 కోట్ల మేర చెల్లింపులు పెండింగ్లో ఉన్నట్లు ఉద్యోగ సంఘ నేతలు అంచనా వేస్తున్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ రావట్లేదు.. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి నగదు రహిత కార్డుల అంశం కొలిక్కి రాలేదు. దీంతో ఉద్యోగులు వారి వైద్య చికిత్సల కోసం చేసిన ఖర్చులను తిరిగి పొందేందుకు మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం కింద దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ బిల్లులు కూడా రెండున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఇందులో రూ.లక్ష లోపు ఉన్నవాటిలో కొ న్నింటిని కొత్త ప్రభుత్వంలో చెల్లించినా.. అంతకంటే ఎక్కు వ మొత్తంతో కూడిన బిల్లులు మాత్రం పరిష్కారం కాలేదు. తిప్పలు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులు 2021 ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. దానితో మూడేళ్లపాటు రిటైర్మెంట్లు ఆగిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు మొదలయ్యాయి. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి దాదాపు 9,500 మంది పదవీ విరమణ పొందారు. వీరిలో 90శాతం మంది ఉద్యోగులకు ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు. ఈ రూపంలో దాదాపు రూ.875 కోట్లు రావాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. వాస్తవానికి పదవీ విరమణ పొందిన నెలరోజుల్లోనే ఈ ప్రయోజనాలు ఉద్యోగులకు అందాలి. ఇలా సమకూరే నిధితో వారు తదుపరి జీవన ప్రణాళికను అమలు చేసుకుంటారు. కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అసంతృప్తి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంపై ఉద్యోగులలో అసంతృప్తి పెరుగుతోంది. డీఏ బకాయిలు, పీఆర్సీ అమల్లో జా ప్యంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు.. బిల్లుల చెల్లింపులన్నీ నిలిచిపోవడంతో సంఘాల నేతలను నిలదీస్తున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జిల్లాల వారీగా వివిధ ఉద్యోగ సంఘాల కార్యవర్గాల ఎన్నికల సమయంలో.. పోటీ చేసినవారంతా ఉద్యోగుల ఆర్థిక అంశాలే ఎజెండాగా ముందుకు సాగారని గుర్తు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుపై స్పందన లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని వరంగల్ జిల్లా ఉద్యోగ సంఘ నేత ఎ.జగన్మోహన్రావు పేర్కొన్నారు. జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలన్నా ఉద్యోగులు నిలదీసే పరిస్థితి ఉందని వాపోయారు.బిల్లులు చెల్లించకుంటే.. ఉద్యమిస్తాం ప్రభుత్వ ఉద్యోగుల చెల్లింపులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్) అమల్లోకి వచ్చిన తర్వాత నుంచీ సమస్యలు పెరిగాయి. అంతకు ముందు జిల్లా ఖజానా విభాగం(డీటీఓ) లేదా ఉప ఖజానా కార్యాలయాల (ఎస్టీఓ) పరిధిలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ వేగంగా జరిగేది. గత ప్రభుత్వంలో ఐఎఫ్ఎంఐఎస్ విధానాన్ని తెచ్చి, చెల్లింపులన్నీ కేంద్రీకృతం చేశారు. ఎలాంటి బిల్లును క్లియర్ చేయాలన్నా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల, రెండు నెలల్లో పరిష్కారం కావాల్సిన అంశాలు.. ఇప్పుడు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. అన్నింటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టడం వల్ల ఉద్యోగులకు చెల్లింపులు భారీగా పేరుకుపోయాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్ను కలసి ఉద్యోగుల సమస్యలను నివేదించాం. చిన్నపాటి బిల్లులు మాత్రమే క్లియర్ అయ్యాయి. ఈ నెలాఖరు కల్లా మెజార్టీ బిల్లులు పరిష్కరిస్తామన్నారు. లేకుంటే వచ్చే నెలలో జేఏసీ తరపున సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమిస్తాం. – ఏలూరి శ్రీనివాసరావు, టీజీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు -
జీతాల కోసం చకోర పక్షుల్లా..!
సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ నెలా ఒకటో తేదీన ఠంచన్గా ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందిస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం ఓ వైపు గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే గడిచిన ఐదు నెలల్లో ఏ ఒక్క నెలలోనూ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకటో తేదీన పూర్తిస్థాయిలో జమైన దాఖలాలు లేవు. ముఖ్యంగా వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చెందిన ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో అందకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. నవంబర్ మూడో వారం వచ్చినా..నవంబర్ మూడో వారం వచ్చినా.. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, యార్డుల్లో పనిచేస్తున్న మార్కెటింగ్ సిబ్బందికి జీతాలు అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా ఉన్న గ్రంథాలయాల్లో పనిచేస్తోన్న 2,500 మంది ఉద్యోగులకు జీతాలు పడలేదు. ఇదే శాఖకు చెందిన 600 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అలాగే మార్కెటింగ్ శాఖకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (ఎఎంసీ), యార్డుల్లో పనిచేస్తున్న వారికి సైతం జీతాలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అప్పులతో గ్రంథాలయ వారోత్సవాలుప్రతీ ఏటా నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ వారోత్సవాల నిర్వహణ కోసం గ్రేడ్–1 గ్రంథాలయాలకు రూ.15వేలు, గ్రేడ్–2 గ్రంథాలయాలకు రూ.12వేలు, గ్రేడ్–3 గ్రంథాలయాలకు రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేసేది. అలాంటిది ఈ ఏడాది ఒక్కపైసా కూడా విడుదల చేసిన పాపాన పోలేదు. సకాలంలో జీతాలు ఇవ్వకపోగా, వారోత్సవాలకు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రంథాలయాల సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా చేసేది లేక అప్పులు చేసి మరీ ఈ వారోత్సవాలను నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. తక్షణమే జీతాలు, పెన్షన్లు జమ చేయాలి నవంబర్ 17వ తేదీ దాటుతున్నా రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అనారోగ్యంతో బాధపడే పెన్షనర్లు ప్రభుత్వ పెన్షన్ అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే వేతనాలు, పెన్షన్లు విడుదల చేయాలి.– కళ్లేపల్లి మధుసూదనరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం -
ఇదో పెద్దకుటుంబం, ఏ ఆపద వచ్చినా..మేలిసంధ్య!
రిటైర్డ్ ఉద్యోగులు తమ మలివయసు జీవనం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ప్రశాంతంగా గడిచిపోవాలని కోరుకుంటారు. కానీ, ఆరోగ్యం సహకరించకపోవడంతో నలుగురిలో కలవలేకపోవడం, ఆనందకరమైన జీవనం గడపలేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటివి గుర్తించి హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్ర ప్రదేశ్ విశ్రాంత ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడ్డారు.వెయ్యికి పైగా ఉన్న ఈ సభ్యులు తమకు ఆత్మీయులు ఉన్నారనే భరోసాతో ఆనందాలను కలబోసుకుంటూ, ఆరోగ్యాల గురించి సమీక్షించుకుంటూమలివయసును ఉపయుక్తంగా మలుచు కుంటున్నారు. ఈ సంఘ సభ్యులను కలిసినప్పుడు అంతా ఒక జట్టుగా ఉంటే ఏ వయసు అయినా ఉల్లాసంగా గడిచిపోతుందనే ఆలోచనను పంచుకున్నారు.‘అసోసియేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్’ సంఘం హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంది. ఈ ఏడాది నాల్గవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ నాలుగేళ్లలో వెయ్యికి పైగా ఉన్న సభ్యులను ఒక తాటి మీదకు తీసుకువచ్చి, తమ సమస్యలను పరిష్కరించుకోవడమే కాదు, వారి పెన్షన్లో నుంచి కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఉల్లాసభరితమైన కార్యక్రమాల ఏర్పాటుతో కొత్త ఉత్సాహాన్ని పొందడానికి ప్రయతిస్తున్నారు.ఆరోగ్యంగా భరోసా! సంఘం కార్యదర్శి బుచ్చిరాజు మాట్లాడుతూ ‘‘మొన్నీమధ్య అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. సనత్నగర్లో ఉన్న మా సంఘ సభ్యుడు ఒకరికి హార్ట్ ఎటాక్ వచ్చింది. ‘ఏ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. హెల్త్ కార్డ్ ఎలా?’ అనే విషయంపై ఆ సభ్యుడి కూతురు ఆందోళనగా ఫోన్ చేసింది. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. సమీప హాస్పిటల్ వాళ్లకు ఫోన్ చేసి, అంబులెన్స్ను పంపించడంతో పాటు, వారికి సహాయంగా ఉండటం కోసం వారి దగ్గరలో ఉన్న మరొక సభ్యుడిని అలెర్ట్ చేశాం. మాకు పెద్ద కుటుంబం అండగా ఉందన్న భరోసాను ఆ కుటుంబానికి అందించాం. ఇదే విధంగా ఇంకో సభ్యుడి సమస్య. పిల్లలిద్దరూ విదేశాలలో ఉన్నారు. తండ్రి ఒక్కడే హైదరాబాద్లో ఒంటరిగా ఉంటాడు. ఆరోగ్య స్థితి బాగోక ఆపద సమయంలో మమ్మల్ని సంప్రదించాడు. మేం తోడున్నామనే భరోసాను అందించాం. విశ్రాంత జీవనంలో ఉండేవి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలే. పిల్లలు వారి పనుల్లో బిజీగా ఉంటారు. దీంతో ఒంటరితనంతో బాధపడుతుంటారు. కొన్ని విషయాల్లో పిల్లలు చెప్పింది వినరు. ఇలాంటప్పుడు ఏ వయసు వారిని ఆ వయసు వారితో కౌన్సెలింగ్స్ కూడా ఇప్పిస్తుంటాం..’’ అంటూ తామంతా ఒకే కుటుంబంగా ఎలా ఉంటున్నదీ వివరించారు.గాత్రంతో వీనుల విందు..కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా చేసి, రిటైర్డ్ అయిన కె.రామారావు మాట్లాడుతూ ‘‘మా సంఘ సభ్యులుగా ఉన్న ఔత్సాహిక గాయనీగాయకులను ప్రోత్సహించడం కోసం కల్చరల్ విభాగం ఏర్పాటు చేశాం. ఇప్పటికి 16 మంది కళాకారులు తమ గాత్రంతో సభ్యులకు వీనుల విందు చేస్తుంటారు. ఘంటసాల, బాలసుబ్రమణ్యంవర్ధంతి, జయంతి, సుశీల బర్త్డే సందర్భంగా సంగీత విభావరి నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా కళాకారులు అందరినీ సన్మానిస్తుంటాం. ఈ విభాగానికి కన్వీనర్గా ఉన్నందుకు, ఇలా కళాసేవ చేస్తున్నందుకు ఆనందంగా ఉంద’ని తెలియజేశారు.పెన్షన్ నుంచి సామాజిక సేవఆరోగ్య అవగాహన కల్పించడమే కాదు ఈ సంఘం సభ్యులు సామాజిక సేవలో పాల్గొంటూ తమ దాతృత్వాన్నీ చాటుకుంటున్నారు. నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా చేసిన విశ్రాంత ఉద్యోగి డి.మీరం శెట్టి మాట్లాడుతూ ‘‘ప్రతి మూడు నెలలకు ఒకసారి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఇటీవల నిలోఫర్ చిల్డ్రన్స్ హాస్పిటల్కు లక్ష రూపాయల విలువైన మెడికల్ పరికరాలను, సైఫాబాద్ లో గల వైదేహి అనాథ బాలికల ఆశ్రమానికి స్కూటీని, దమ్మాయిగూడలోని వేద పాఠశాలకు పుస్తకాలు, వంట సామాగ్రిని, ఆర్ఓ వాటర్ప్లాంట్ అందించాం. కోవిడ్ సమయంలో గాంధీ హాస్పిటల్ వైద్యులను, 700 మంది నర్సులను సన్మానించాం. రెండు నెలల కిందట మున్సిపల్ వర్కర్లకు, గాంధీ ఆసుపత్రి మెటర్నటీ వార్డులోని 400 మంది స్త్రీలకు చీరలు పంపిణీ చేశాం. ఆంధ్రప్రదేశ్లోని అన్నా క్యాంటీన్కు రెండు లక్షలు, ఇటీవల వరద బాధితుల సహాయార్థం రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశాం. ఆర్మీలో పనిచేస్తూ చనిపోయిన వారి కుటుంబాల సహాయార్థం రెండు లక్షల రూపాయలకు పైగా వితరణ చేశాం’’ అని వివరించారు. ఈ మొత్తాలను సంఘ సభ్యులే తమ దయా హృదయంతో విరాళంగా ఇస్తుంటారని, వాటితోనే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని తెలిపిన వీరు మలివయసును మహోన్నతంగా మలుచుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సంఘంలో చేరవచ్చుఆంధ్రప్రదేశ్ పెన్షన్ దారులు ఎవరైనా హైదరాబాద్లో స్థిరపడినవారుంటే ఈ సంఘంలో చేరి, తమ కంటూ మరో పెద్ద కుటుంబం ఉందన్న భరోసాతో ఆనందంగా జీవించవచ్చు. – టిఎంబి, బుచ్చిరాజుప్రధాన కార్యదర్శిమా సభ్యులకు వివిధ ప్రముఖ మెడికల్ ల్యాబ్ల నుండి, ఆసుపత్రుల నుండి ఫీజులో రాయితీ వచ్చేటట్లు కృషి చేస్తున్నాం. మా సభ్యుల సౌకర్యార్థం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సంఘానికి సంబంధించిన వివరాలతో త్రైమాసిక మ్యాగజైన్ని కూడా మా సభ్యులకు పంపుతున్నాం. – డి. మీరం శెట్టి, కన్వీనర్, ఆర్థిక సామాజిక సేవా విభాగంమహిళా బృందంవిశ్రాంత ఉద్యోగ మహిళలను, విశ్రాంత ఉద్యోగుల సతీమణులను చైతన్య పరచి, వారు వివిధ కార్యక్రమాలలో పాల్గొనేలా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఈ విభాగంలో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉత్సాహవంతులైన మహిళలతో కోలాట బృందాన్ని ఏర్పరచి వారికి శిక్షణను ఇచ్చి, వివిధ కార్యక్రమాలలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. – ఆర్ అనురాధ, కన్వీనర్, మహిళా విభాగం – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘డబుల్’ పెన్షన్పై ఆరా!
చుంచుపల్లి/సాక్షి, హైదరాబాద్ : రిటైర్డ్ ఉద్యోగులు, వారి మరణానంతరం కుటుంబ సభ్యులకు వచ్చే పెన్షన్ తీసుకుంటూ.. ఆసరా పింఛన్ సైతం పొందుతున్న వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా డబుల్ పెన్షన్లు పొందుతున్న సుమారు 200 మందిని సెర్ప్ సిబ్బంది గుర్తించి నోటీసులు అందజేశారు. చుంచుపల్లి మండలం బాబూ క్యాంపునకు చెందిన దాసరి మల్లమ్మ.. కూతురు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోవడంతో వచ్చే ప్రభుత్వ పెన్షన్తో పాటు ఆసరా పెన్షన్ కూడా పొందుతున్నట్లు గుర్తించిన అధికారులు రికవరీ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు.కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది.. అనే సామెతను ఉదహరిస్తూ.. ‘కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ప్రస్తుత సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి లాక్కునే వింత చేష్టలు మొదలుపెట్టింది’అని ఆరోపించారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు వెనక్కి పంపాలని ప్రభుత్వం నోటీసులు జారీచేస్తోందని, దాసరి మల్లమ్మకు ఆసరా కింద వచి్చన రూ.1.72 లక్షలు కూడా తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలికి నోటీసులు జారీ చేసి, కేసీఆర్ సర్కారు ఇచ్చిన పెన్షన్ సొమ్మును లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ పోస్ట్ నేపథ్యంలో విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో డీఆర్డీఓ ఎం.విద్యాచందన సూచనల మేరకు సెర్ప్ సిబ్బంది మల్లమ్మ ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె పొందుతున్న పెన్షన్ వివరాలు సేకరించారు. ఈ విషయమై డీఆర్డీఓ విద్యాచందనను సంప్రదించగా.. ఆమె రెండు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించామని, రికవరీపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. ‘డబుల్’వల్లనే మల్లమ్మ పింఛన్ నిలిపివేత కేటీఆర్ పోస్ట్ను తప్పుపట్టిన సర్కార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి ఆసరా పెన్షన్ కింద ఇచి్చన డబ్బులపై ప్రభుత్వం రికవరీ నోటీసు ఇచి్చందని.. ఇది అమానవీయమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేయడాన్ని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తప్పు పట్టింది. ఈ వ్యవహారం కూడా డబుల్ పెన్షన్ల జాబితాలోనే ఉందని ప్రకటించింది.దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఏఎన్ఎంగా పని చేసేవారని, 2010లో రాజేశ్వరి మరణించగా ఆమెకు పెళ్లి కాకపోవటంతో డిపెండెంట్గా మల్లమ్మకు రూ.24,073 ఫ్యామిలీ పెన్షన్ కింద ప్రతి నెలా చెల్లిస్తున్నామని, మరోవైపు ఆపన్నులకు ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా ప్రతినెలా ఆమెకు అందుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలిందని ప్రభుత్వం పేర్కొంది. అందుకే జూన్ నెల నుంచి ఆమెకు ఇచ్చే ఆసరా పెన్షన్ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారని స్పష్టం చేసింది. -
బొకే ఇచ్చి.. బైబై
సాక్షి, హైదరాబాద్: పదవీవిరమణ పొందిన ఉద్యోగుల వీడ్కోలు కార్యక్రమాలు భావోద్వేగ వాతావర ణం మధ్య జరుగుతాయి. ఉద్యోగి దంపతులకు పూలమాలలు, శాలువాలతో సత్కరించి వారి సేవలను ఘనంగా పొగు డుతారు. వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లలో కొన్నింటిని అదేరోజు చెల్లించి దర్జాగా సాగనంపుతారు. ఆర్టీసీలోనూ ఈ తంతు సాధారణమే. కానీ కొన్ని నెలలుగా తీరు మారింది. పూలమాలలు, బొకేలు ఇచ్చి వీడ్కోలు చెప్పేస్తున్నారు. పదవీ విరమణ ఆర్థిక ప్రయో జనాల మాటేమిటి అంటే ఆ ఒక్కటి అడగొద్దంటోంది సంస్థ. నష్టాల వల్ల నిధులు లేవన్న కారణంతో రిటైర్డ్ ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. ఇప్పుడు వందలమంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయో జనాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నిలిచిపోయిన గ్రాట్యుటీ..పదవీవిరమణ పొందిన కొద్ది రోజుల్లోనే గ్రాట్యుటీ మొత్తం చెల్లించే పద్ధతి ఉండేది. కానీ, ఇప్పుడు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. » ఈ సంవత్సరం జనవరి వరకు వెంటవెంటనే గ్రాట్యుటీ చెల్లించారు. » ఫిబ్రవరి నుంచి బ్రేక్ పడింది. ఆ నెలలో రిటైర్ అయిన వారికి నెల ఆలస్యంగా చెల్లించారు. » మార్చిలో రిటైర్ అయిన వారికి మూడు రోజుల క్రితం చెల్లించారు. » ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందుతున్న వారు ఎదురుచూపుల జాబితాలో ఉన్నారు. వీరికి ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత లేదు. ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్గా వచ్చే వాటిల్లో ఇదే పెద్ద మొత్తం. దీని ఆధారంగా భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంటారు. కానీ, ఆ మొత్తం చేతికందటంలో జరుగుతున్న జాప్యం ఆర్టీసీ కార్మికుల్లో గందరగోళానికి కారణమవుతోంది. డ్రైవర్, కండక్టర్ లాంటి వారికి దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఈ మొత్తం అందాల్సి ఉంటుంది. ఈడీ లాంటి పెద్ద పోస్టులోని అధికారులకు రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. చిరుద్యోగులుగా ఉండి రిటైర్ అయినవారు ఇప్పుడు ప్రత్యామ్నాయ నిధి లేక ఈ మొత్తంపైనే ఆశలు పెట్టుకున్నారు. దాదాపు ఐదొందల కుటుంబాలు ఇప్పుడు ఆ మొత్తం కోసం ఎదురుచూస్తున్నాయి. బాండ్ డబ్బులూ అంతే..ఆర్టీసీలో 2013 వేతన సవరణను 2015లో అమలు చేశారు. రెండేళ్ల బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. సర్వీసు ఉద్యోగులకు పెండింగ్లో పెట్టినా, రిటైర్ అయిన వారికి వెంటనే చెల్లిస్తూ వస్తున్నారు. కానీ జనవరి నుంచి రిటైర్ అయిన వారికి కూడా చెల్లించటం నిలిపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అందరు ఉద్యోగులకు బాండ్ బకాయిలు చెల్లించనున్నట్టు మూడునెలల క్రితం సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. కానీ, కొన్ని నిధులే విడుదల కావటంతో ఇటీవల కేవలం డ్రైవర్లకు చెల్లించి వదిలేశారు. జనవరి నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ.లక్షన్నర వరకు అందాల్సి ఉంది. దాదాపు 1500 రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి.‘చివరి నెల వేతనం’ హుళక్కే..ఉద్యోగి పదవీవిరమణ పొందేప్పుడు చివరి నెల వేతనాన్ని తాత్కాలికంగా నిలిపేస్తారు. ఆ ఉద్యోగి సంస్థకు ఏవైనా బకాయిలు చెల్లించాల్సి ఉంటే, లెక్కలు చూసి చివరి నెల వేతనం నుంచి మినహాయించి మిగతా మొత్తాన్ని అందిస్తారు. రిటైర్ అయిన నెల రోజుల్లో ఆ మొత్తం విడుదల అవుతుంది. కానీ, జనవరి నుంచి ‘చివరి నెల వేతనం’ ఆపేశారు.ఆర్జిత సెలవు మొత్తం ఏమైంది? ఉద్యోగ కాలంలో పోగైన 300 ఆర్జిత సెలవు (ఈఎల్స్)ల ఎన్క్యాష్మెంట్ ఉంటుంది. ఆ సెలవులకు సంబంధించి నగదు చెల్లిస్తారు. ఆర్టీసీలో పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంచిన తర్వాత, తిరిగి రిటైర్మెంట్లు మొదలైన 2022 డిసెంబరు నుంచి ఆర్జిత సెలవుల మొత్తం చెల్లించటం ఆగిపోయింది. ఈ మొత్తం కనిష్టంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది.కరువు భత్యం బకాయిలకూ దిక్కులేదు ఆర్టీసీ ఉద్యోగు లకు గతంలో నాలుగున్నరేళ్ల పాటు కరువు భత్యం సవరించలేదు. అవన్నీ పేరుకుపోయాయి. విడతవారీగా ఆ తర్వాత 9 డీఏలను సవరించి వేతనంలో చేర్చారు. కానీ, ఆ డీఏలను వర్తింప చేయాల్సినకాలం నుంచి వర్తింపచేసినకాలం మధ్య రిటైర్ అయినవారికి కూడా ఆ లబ్ధి అందాల్సి ఉంది. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు వాటిని చెల్లించలేదు. ఈ మధ్యకాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కూడా వాటిని చెల్లించాల్సి ఉన్నా చెల్లించలేదు.వేతన సవరణ బకాయిలేమయ్యాయి? 2017లో జరగా ల్సిన వేతన సవర ణను గత మే నెల నుంచి అమలులోకి తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 21% ఫిట్మెంట్తో దాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కానీ వాటి బకాయిలను రిటైర్మెంట్ సమయంలోనే చెల్లించనున్నట్టు అప్పట్లో ఆర్టీసీ వెల్లడించింది. మరి, ఈ ఫిట్మెంట్ అమలులోకి తెచ్చేలోపు రిటైర్ అయినవారి విషయంలో మాత్రం చెల్లింపు ఊసే లేకుండాపోయింది. దానిపై కనీసం స్పష్టత కూడా ఇవ్వటం లేదు.మమ్మల్ని విడిచి వెళ్లొద్దు సార్..కన్నీటి పర్యంతమైన విద్యార్థులుకుల్కచర్ల: విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు పాఠశాల అభ్యున్నతికి కృషి చేసిన తమ హెచ్ఎం బదిలీపై వెళ్లడాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. ‘మమ్మల్ని వదిలి.. మీరు వెళ్లొద్దు సార్’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. గురువుగా పాఠాలు చెప్పడంతో పాటు తండ్రిలా బంధాన్ని పెనవేసుకున్న తమ సార్ మరో స్కూల్కు వెళ్తున్నారని తెలిసి ఆవేదనకు గురయ్యారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చౌడాపూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న తిమ్యా, ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాస్కర్ స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో భాగంగా మరో చోటకు ట్రాన్స్ఫర్ అయ్యారు. మంగళవారం విధుల నుంచి రిలీవ్ అయి వెళ్తుండగా.. విద్యార్థులు వెక్కివెక్కి ఏడ్చారు. వారిని ఊరడించిన మాస్టారు.. ‘బాగా చదువుకోండి. మిమ్మల్ని చూసేందుకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తాం’ అని చెప్పి బరువెక్కిన హృదయంతో బైబై చెప్పుకుంటూ వెళ్లిపోయారు. -
ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యవర్గం
సుల్తాన్బజార్ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం (టీఎస్జీఆర్ఈఏ) రాష్ట్ర అధ్యక్షునిగా దామోదర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు అబిడ్స్లోని రెడ్డి హాస్టల్లో రెండ్రోజులు జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు గురువారం ముగిశాయి. అధ్యక్షునిగా దామోదర్రెడ్డి, అసోసియేట్ అధ్యక్షునిగా విశ్వనాథం, ఉపాధ్యక్షులుగా జి.మోహన్రెడ్డి, జి.శ్రీనివాస్రెడ్డి, పీఆర్ మోహన్, శ్రీహరిరెడ్డి, సీతారామయ్య, భాగ్యలక్ష్మి, కార్యదర్శులుగా టి.ప్రభాకర్, పి.శ్యామ్రావు, ఎన్.విష్ణువర్ధన్రెడ్డి, పి.శరత్బాబు, విజయలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బక్కారెడ్డి, ఈశ్వరయ్య, రఘునాథ్రెడ్డి, నాగేశ్వరరావు, కోశాధికారిగా గంగారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా చందులాల్, శ్రీవాస్తవ్, రవీందర్రెడ్డి, శంకర్రెడ్డి, పెంటయ్య తదితరులను ఎన్నుకున్నట్టు కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘ప్రత్యేక ఓపీ’
లబ్బీపేట(విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ప్రత్యేక ఓపీ కౌంటర్ ఏర్పాటుచేశారు. ఈ కౌంటర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక ఓపీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి సోమవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మంగళవారం మానసిక వ్యాధులు, జనరల్ మెడిసిన్, బుధవారం గుండె, కిడ్నీ వ్యాధులు, గురువారం ఆర్థోపెడిక్, న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, శుక్రవారం చర్మ వ్యాధులు, జనరల్ మెడిసిన్, శనివారం ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేసి మందులు అందజేస్తారని తెలియజేశారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. రక్తపోటు, హైపో థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటీస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, క్రానిక్ కిడ్నీ వ్యాధులు వంటి వాటికి పరీక్షలు చేసి మందులు అందిస్తారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విఠల్రావు, జిల్లా ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ జె.సుమన్, ఆర్ఎంఓలు శోభ, మంగాదేవి, ఎన్జీవో నాయకులు పాల్గొన్నారు. -
సకల జనుల సమ్మె కాలపు వేతనం వచ్చిందోచ్.. 11 ఏళ్ల తర్వాత!
సాక్షి, హైదరాబాద్: సకల జనుల సమ్మె కాలపు వేతనాలను ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు అందుకోబోతున్నారు. పదకొండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు వారికి ఆ మొత్తం అందబోతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 2011 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17 వరకు సకల జనుల సమ్మె జరిగిన విషయం తెలిసిందే. తర్వాత సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆర్టీసీలో వెంటనే అమలు కాలేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నా.. సెలవు కాలపు వేతనాన్ని విధుల్లో ఉన్న ఉద్యోగులకే చెల్లించారు. ఆ సమయానికే పదవీ విరమణ పొందిన 8,053 మందికి ఇవ్వలేదు. దీంతో ఆ వేతనం కోసం వారు 11 ఏళ్లుగా పోరాడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య నేతలతో మంత్రుల చర్చల సందర్భంగా ఈ డిమాండ్ పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 3 డీఏలు, దసరా పండుగ అడ్వాన్సులాంటి వాటితోపాటు పదవీ విరమణ పొందిన అర్హులకు సమ్మె కాలపు వేతనం కింద రూ.25 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్ పేరుతో సర్క్యులర్ శనివారం జారీ అయింది. చదవండి: కరెంట్ నష్టాల్లో... కుమురం భీం టాప్! -
ఇది పింఛనా.. ఇగ పెంచరా?
గోదావరిఖనికి చెందిన ఎర్రం నర్సయ్య సింగరేణిలో పనిచేసి రిటైరయ్యాడు. ఆయన నెలనెలా వస్తున్న పింఛన్ రూ.600 మాత్రమే. భార్యాభర్తలిద్దరూ ఇదే పింఛన్తో గడపాలి. 1997లో పనిలోంచి దిగిపోయాడు. కాలుకు దెబ్బతగిలి గాయమవడం, షుగర్ కారణంగా అది పెద్దదవడంతో మోకాలి వరకు తొలగించారు. రెండో కాలు విరగడంతో రాడ్ వేశారు. రెండు కాళ్లూ పనిచేయని దుస్థితి. అయినా ఇదే పింఛన్తో కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి. గోదావరిఖని ప్రశాంత్నగర్కు చెందిన మట్ట లింగయ్య 28ఏళ్లపాటు సింగరేణిలో పనిచేసి 2002లో రిటైరయ్యాడు. అప్పటి నుంచీ ఆయనకు రూ.580 పింఛన్ మాత్రమే వస్తోంది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ఆయన.. మందులు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నట్టు వాపోతున్నాడు. .. ఇది కేవలం నర్సయ్య, లింగయ్యల గాథ మాత్రమేకాదు. బొగ్గుగనుల్లో పనిచేసి రిటైర్ అయిన వేలాది మంది కార్మికుల గోస ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్ కంటే కూడా తమకు వచ్చే కార్మిక పింఛన్ చాలా తక్కువని.. కార్మిక పింఛన్ ఉందని ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. (సాక్షిప్రతినిధి, కరీంనగర్) ఏళ్లపాటు సేవలు చేసినా.. రిటైరైన తర్వాత సుఖంగా విశ్రాంత జీవితం గడుపుతామని కలలు కన్న బొగ్గుగని కార్మికుల జీవితాలు తలకిందులు అవుతున్నాయి. నామమాత్రపు పింఛన్తో బతుకీడుస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తి కోసం కష్టపడిన కార్మికులు వయసు మీదపడ్డాక కీళ్ల అరుగుదల, శ్వాసకోస సంబంధ వ్యాధులతో సతమతం అవుతున్నారు. పింఛన్ సొమ్ము ఎటూ సరిపోక అప్పులపాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఆసరా పథకం కింద రూ.2,016 పింఛన్ ఇస్తోంది. కానీ రిటైర్డ్ కార్మికులు సీఎంపీఎఫ్ పింఛన్ అందుకుంటుండటంతో వారికి ఆసరా పథకానికి అర్హత లేకుండా పోయింది. కానీ ఆసరా కన్నా చాలా తక్కువగా కేవలం రూ.500, వెయ్యిలోపే సీఎంపీఎఫ్ పింఛన్ వస్తుండటం గమనార్హం. ఏళ్లుగా పోరాడుతున్నా.. పెన్షనర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కోలిండియా వ్యాప్తంగా 2011లో పెన్షనర్ల అసోసియేషన్ ఏర్పడింది. నాలుగేళ్లపాటు పోరాడిన అసోసియేషన్ అప్పటి ప్రధాని మన్మోహన్ను కలిసి గోడు వినిపించుకున్నా స్పందన రాలేదు. దీనితో తమకు న్యాయం చేయాలంటూ.. 2015 జనవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ అంశాన్ని కిందికోర్టులో తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. ఏడేళ్లు గడుస్తున్నా పింఛన్ల పెంపుపై నిర్ణయం వెలువడలేదు. ఈ కేసు వచ్చే నెల 11న తిరిగి విచారణకు రానున్నట్టు నాయకులు తెలిపారు. పెన్షన్ లోటుపై పట్టింపేది? మొత్తం పెన్షన్దారులు ఎంతమంది? మూలనిధి ఎంత ఉంది? రిటైర్ అవుతున్న బొగ్గు గని కార్మికులకు ఎంత పెన్షన్ చెల్లించాలనే అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయించాల్సిన ఫండ్ మేనేజ్మెంట్ కమిటీ కనీసం ప్రతి మూడేళ్లకోసారి సమావేశం కావాలి. ఫండ్లో లోటు లేకుండా చర్యలు చేపట్టాలి. దీనితో ఇప్పటివరకు రూ.45 వేలకోట్ల లోటు ఏర్పడినట్టు సమాచారం. దీనిని పూడ్చేందుకు ఇటీవలే చర్యలు చేపట్టారు. కోలిండియా యాజమాన్యంతో మేనేజ్మెంట్ కమిటీ చర్చించి టన్ను బొగ్గుపై రూ.15 లెక్కన సీఎంపీఎఫ్ ట్రస్ట్కు చెల్లించేందుకు అంగీకరించేలా చేసినట్టు తెలిసింది. 10న సీఎంపీఎఫ్ కార్యాలయాల ముందు ధర్నా బొగ్గు గని కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఈనెల 10న కోలిండియా స్థాయిలోని సీఎంపీఎఫ్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో రిటైర్డ్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా.. బొగ్గు గని కార్మికుల పెన్షన్ పెంచాలని 2011లో కోలిండియా అధ్యక్షుడితో కలిసి పోరాటం ప్రారంభించాం. అప్పటి ప్రధాని మన్మోహన్ను కలిసి సమస్య వివరించాం. సానుకూల స్పందన రాలేదు. ఐదేళ్లపాటు అనేక రూపాల్లో పోరాటం చేసి.. చివరికి సుప్రీంకోర్టులో కేసు వేశాం. వచ్చేనెల 11న విచారణ జరగనుంది. – కేఆర్సీ రెడ్డి, రిటైర్డ్ జీఎం, కోల్మైన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి మా సమస్యపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కొంత చలనం వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్లో చేసిన చట్టంలో లోపాలతో ఇబ్బంది పడుతున్నాం. తక్కువ పెన్షన్తో చాలా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. – మడిపెల్లి బాబురావు, ప్రధాన కార్యదర్శి, కోల్మైన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ -
ఈహెచ్ఎస్ మరింత పటిష్టం.. ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో బిల్లుల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమును (ఈహెచ్ఎస్) మరింత పటిష్టంగా అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి వైద్య బిల్లులను ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో ఆటో డెబిట్ స్కీము ద్వారా చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పీఆర్సీపై చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఇచ్చిన మాట మేరకు ఇతర రాష్ట్రాల్లోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు అందించేందుకు అనుమతిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరోగ్య శ్రీలో చేర్చినా, ఎంప్లాయిస్ హెల్త్ స్కీములో కవర్ కాని 565 వైద్య విధానాలను ఇప్పుడు వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకుంది. నెట్వర్క్ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్లను మరింత పటిష్టం చేస్తూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీము లబ్ధిదారులకు ఆరోగ్య మిత్రలు తగిన సహాయ సహకారాలు అందిస్తూ నగదు రహిత చికిత్సలు అందేలా చూస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోకు ఉత్తర్వుల్లో సూచించారు. ఉద్యోగులకు ఎంతో మేలు ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం 21 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని స్పష్టంగా పేర్కొనడంతో మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని ప్రధాన ఆస్పత్రులు ఈ స్కీమును అమలు చేస్తాయని పేర్కొన్నారు. 565 రకాల కొత్త వైద్య సేవల వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. -
ఉద్యోగమిచ్చి.. ఉచ్చులోకి దించి
అమలాపురం టౌన్: ఉద్యోగమంటూ ఎర వేశారు.. వ్యూహాత్మకంగా వలలోకి దించారు.. ది జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ మల్టీ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ బోర్డు తిప్పేసిన సంఘటనలో విశ్రాంత ఉద్యోగులే చాలామంది మోసపోయారు. ఈ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచ్లు ఉన్నాయి. ‘జయలక్ష్మి’ యాజమాన్యం తమ సంస్థలో డిపాజిట్ల సేకరణకు ఆది నుంచి ముందు చూపుతో వ్యవహరించింది. ముందుగా పలు వాణిజ్య బ్యాంకుల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారుల వివరాలు సేకరించింది. తమ సొసైటీ బ్రాంచుల్లో వివిధ ఉద్యోగాలను ఎరగా చూపి వారికి కీలక పోస్టులను అప్పగించింది. మేనేజర్ స్థాయి కూర్చీల్లో కూర్చోబెట్టి గతంలో వారు పనిచేసిన బ్యాంక్ల్లో డిపాజిట్ చేసిన వ్యక్తులను పాత పరిచయాలతో తమ సొసైటీ వైపు ఆకర్షించేలా చేసుకుంది. అవిభక్త జిల్లా నుంచి ఇతర బ్యాంక్లు, డీసీసీబీల బ్రాంచ్ల్లో దాదాపు 45 మంది విశ్రాంత అధికారులకు ‘జయలక్ష్మి’ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చింది. వాణిజ్య బ్యాంక్లు, డీసీసీబీ తదితర బ్యాంక్లు వడ్డీ 5 నుంచి 6 శాతం ఇస్తుంటే.. తమ జయలక్ష్మి సొసైటీలో 10 శాతానికి మించి అధిక వడ్డీ ఇస్తున్నామని చెప్పి ఆకర్షించింది. ఉద్యోగుల విశ్వాసంతో వల డీసీసీబీ బ్రాంచ్ల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కొందరు మేనేజర్లకు ‘జయలక్ష్మి’ బ్రాంచీల్లో ఉద్యోగాలు ఇచ్చి వారికి ఆకర్షణీయమైన జీతాలతో మేనేజర్లుగా కూర్చోబెట్టింది. ఉదాహరణకు కోనసీమ జిల్లాలో ఉన్న ఏడు జయలక్ష్మి బ్రాంచ్ల్లో ఐదుగురు మేనేజర్లు విశ్రాంత డీసీసీబీ బ్రాంచ్ల మేనేజర్లే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్లాన్ ప్రకారం వివిధ వాణిజ్య బ్యాంకుల మేనేజర్లు, అకౌంటెంట్లుగా ఉద్యోగ విరమణ చేసిన వారినే ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంది. విశ్రాంత అధికారులకు తమ సొసైటీల్లో ఉద్యోగాలు ఇచ్చి ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లు కొల్లగొట్టాలని ముందస్తు ప్రణాళికతో వ్యవహరించారు. వారి చేత ఆయా బ్యాంకుల్లో డిపాజిట్దారులను నమ్మించి, ఒప్పించి అక్కడ డిపాజిట్ల సొమ్మును ‘జయలక్ష్మి’లో వేసేలా చేయడంలో యాజమాన్యం సఫలీకృతమైంది. అమలాపురం జయలక్ష్మి బ్రాంచ్లో దాదాపు రూ.48 కోట్ల మేర డిపాజిట్దారులు దాచుకున్న సొమ్మును దోచేస్తే అందులో సుమారు రూ.15 కోట్లు అప్పటివరకూ డీసీసీబీ బ్రాంచ్లో డిపాజిటర్లుగా ఉన్నవారి నుంచి మళ్లింపు అయ్యింది. అవిభక్త జిల్లాలో పలు వాణిజ్య బ్యాంకుల డిపాజిట్దారుల నుంచి సుమారు రూ.50 కోట్లు, డీసీసీబీ బ్రాంచ్ల్లో దాదాపు రూ.150 కోట్ల వరకూ ఇలా గత కొన్నేళ్లలో ఆయా బ్రాంచ్ల్లో దాచుకున్న డిపాజిట్దారులే తమ సొమ్మును ఈ సొసైటీ డిపాజిట్లలోకి మళ్లించుకునేలా వారిలో నమ్మకాన్ని నింపగలిగింది. వారినే వాడుకుంది.. పలు బ్యాంకుల బ్రాంచ్ల విశ్రాంత మేనేజర్లకు తమ సొసైటీ బ్రాంచ్ల్లో తిరిగి మేనేజర్ల ఉద్యోగాలు కల్పించి ‘జయలక్ష్మి’ యాజమాన్యం పావులుగా వాడుకుంది. ఉదాహరణకు అమలాపురంలో ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు తమ కుటుంబ సభ్యుల ద్వారా రూ.45 లక్షల వరకూ ‘జయలక్ష్మి’లో డిపాజిట్ చేశారు. గతంలో ఓ వాణిజ్య బ్యాంక్లో మేనేజర్గా పని చేసి రిటైర్ తర్వాత జయలక్ష్మిలో మేనేజర్ అయిన ఓ అధికారి మాటలను నమ్మి అన్ని లక్షలు డిపాజిట్లు చేశానని ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు లబోదిబోమంటున్నారు. ఇలా రూ.లక్షలు దాచుకుని నేడు దోపిడీకి గురైన ఏ విశ్రాంత ఉద్యోగిని కదిపినా ఒక్కో కన్నీటి కథ చెబుతున్నారు. తాము డిపాజిట్ చేయడం వెనుక ఫలానా బ్యాంక్ విశ్రాంత మేనేజరో.. బ్యాంక్ అధికారో ఉన్నారని.. వారి మాటలను నమ్మే సొమ్ము వేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కరోనా : వారికి ఎస్బీఐ భారీ ఊరట
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా కాలంలో తన విశ్రాంత ఉద్యోగులకు ఊరట అందించే వార్త చెప్పింది. ఎస్బీఐ బ్యాంకు నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కోసం కొత్త బీమా పథకం ప్రవేశపెట్టింది. ఇందులో కోవిడ్-19 చికిత్స కూడా చేర్చడం విశేషం. మెడికల్ బెనిఫిట్స్ స్కీమ్ కింద క్రానిక్ ఒబెస్ట్రుక్టీవ్ పల్మనరీ డిసీజెస్ (సీఓపీడీ) లేదా ఉబ్బసం సహా మరో నాలుగు వ్యాధులతో బాధపడే వారు సైతం ఆసుపత్రిలో చేరేందుకు బ్యాంక్ అనుమతించింది. ఈమేరకు ఎస్బీఐ తన రిటైర్డ్ ఉద్యోగులకు సమాచారాన్ని అందించింది. (ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ ) ప్రస్తుత పథకాన్ని సమీక్షించి ఎస్బీఐ ఆసుపత్రిలో ఉన్న వ్యాధుల జాబితాలో కోవిడ్-19 ను అంటువ్యాధిగా చేర్చాలని నిర్ణయించినట్లు ఎస్బీఐ తెలిపింది. ఇప్పుడు 20 నుండి 25 వరకు వ్యాధుల సంఖ్య పెరిగిందని వెల్లడించింది. ఇంట్లో కోవిడ్-19 చికిత్సకు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఈ పథకంలో సభ్యులకు గృహ చికిత్స కోసం రూ. 25000 వరకు ఖర్చును అనుమతించాలని నిర్ణయించింది. దీంతో కోవిడ్ కోసం అదనంగా మరో బీమాను కొనుగోలు చేయనవసరం లేదని పేర్కొంది. స్టేట్ బ్యాంక్ తీసుకున్న ఈ చర్య సంస్థ రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరటనివ్వనుంది. కాగాఎస్బీఐ ప్రస్తుత ఉద్యోగులు ఇప్పటికే కోవిడ్ -19 చికిత్స కవరేజ్ పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. -
ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి
సాక్షి, గజ్వేల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో విశ్రాంత ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గజ్వేల్లో నిర్మించిన రిటైర్డ్ ఉద్యోగుల అతిథి భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడ నుంచే పోటీ చేసి ముఖ్యమంత్రి కావడం గజ్వేల్ ప్రజల అదృష్టమని తెలిపారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తుందని.. వర్షాకాలంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. లాక్డౌన్ కారణంగా చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని.. వారిని దృష్టిలో ఉంచుకుని లాక్డౌన్లో సడలింపులు ఇచ్చామని పేర్కొన్నారు. 21 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని.. అందులో భాగంగా గజ్వేల్లో ప్రతి వీధిలో మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్ధిపేటను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్ధే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. -
ఆర్టీసీలో ఆ సిబ్బందికి పెద్ద కష్టమొచ్చిపడింది..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పదవీ విరమణ సిబ్బందికి ఇప్పుడు పెద్ద కష్టమొచ్చిపడింది. రిటైర్మెంట్ సమయంలో వారు విధుల్లో ఉంటేనే బెనిఫిట్స్ అందుతాయి. కానీ నెలాఖరున వారు సమ్మెలో ఉండిపోవటంతో ఇప్పుడు వారి కుటుంబాల్లో పెద్ద టెన్షన్ నెలకొంది. గత అక్టోబర్ నెలాఖరున ఆర్టీసీలో దాదాపు 250 నుంచి 300 మంది పదవీ విరమణ పొందారు. వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం రావాలంటే చివరి రోజు కచ్చితంగా డ్యూటీలో ఉండాలి. ఇదే ఉద్దేశంతో వారందరూ విధుల్లో చేరాల్సిందిగా ఐదు రోజుల ముందే కార్మిక సంఘాల జేఏసీ సూచించింది. సమ్మెలో ఉన్నవారు అర్జీ పెట్టుకుని వస్తే విధుల్లోకి తీసుకుంటామని గతంలో ప్రభుత్వం పేర్కొనటంతో వీరంతా విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. అర్జీ పెట్టుకుని వచ్చేవారిని విధుల్లోకి తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి పేర్కొన్నా, ఆ సమయంలో ఎవరూ స్పందించలేదు. ఆ తర్వాత సరూర్నగర్లో భారీ బహిరంగసభ పెట్టి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఒక్కసారిగా తీరు మారిపోయింది. ఇప్పుడు అర్జీ పెట్టుకుని డ్యూటీలో చేరదామని వచ్చేవారికి అధికారులు అనుమతించటం లేదు. ఇదే క్రమంలో పదవీ విరమణ పొందినవారికి కూడా చుక్కెదురైంది. వారు విధుల్లో చేరకుండానే విరమణ పొందాల్సి వచ్చింది. దీంతో తమ రిటైర్మెంట్ బెని ఫిట్స్కు ఇబ్బంది వస్తుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. చదవండి: సమ్మెలోనే ఆర్టీసీ డ్రైవర్ పదవీ విరమణ -
గూడు ఉంటుందా?
చంచల్గూడ: మాదన్నపేట హౌసింగ్బోర్డు క్వార్టర్స్లో అద్దెకుంటున్నవారికి పెద్ద కష్టం వచ్చిపడింది. వాటిలో ఏళ్ల తరబడి ఉంటున్న విశ్రాంత ఉద్యోగులను ఖాళీ చేయాలని అధికారులు తరచూ నోటీసులతో బెదిరింపులకు గురిచేస్తున్నారు. 40 ఏళ్లుగా అద్దెకు ఉన్న తమకే క్వార్టర్స్ను కేటాయించాలని హౌసింగ్ బోర్డుకు పలుమార్లు నివాసితులు విజ్ఞప్తి చేసినా వారి అభ్యర్థనకు స్పందించలేదు. రాష్ట్ర హౌసింగ్ బోర్డు 1964లో 36 బ్లాక్లతో 144 ఫ్లాట్స్తో మాదన్నపేటలో క్వార్టర్స్ నిర్మాణం చేపట్టింది. అవి పూర్తికాగానే 1969లో అమ్మకానికి పెట్టింది. అప్పట్లో ఒక్కో ఫ్లాట్ను రూ.20 వేల చొప్పున విక్రయించగా 71 ఫ్లాట్లు అమ్ముడు పోయాయి. మిగతా వాటిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అద్దెకు ఉండేలా వీలు కల్పించారు. అప్పటి నుంచి ఈ క్వార్టర్స్లో నివసిస్తున్నవారు తమ జీతభత్యాలకు అనుగుణంగా రూ.3 నుంచి 10 వేల వరకు అద్దె చెల్లిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 73 మంది అద్దెదారుల్లో సగానికిపైగా విశ్రాంత ఉద్యోగులే. కాగా 1994లో తమకు క్వార్టర్స్పై యాజమాన్య హక్కులు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీంతో క్వార్టర్స్ను ఖాళీ చేయాల్సిందిగా రెండు సార్లు వీరికి హౌసింగ్ బోర్డు నోటీసులు జారీ చేసింది. హౌసింగ్ బోర్డు అలసత్వం దాదాపు 40 ఏళ్లుగా అద్దెకు ఉన్న తమకే క్వార్టర్స్ను కేటాయించాలని ఇక్కడివారు హౌసింగ్ బోర్డుకు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. అటునుంచి స్పందన రాకపోవడంతో సమస్యను 2008లో ఆ నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. అద్దెదారులకు మార్కెట్ ధర ప్రకారం క్వార్టర్స్ను కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు వచ్చి సర్వే కూడా చేశారు. అయితే, దురదృష్టవశాత్తు అదే ఏడాది సీఎం రాజశేఖర్రెడ్డి అకాల మరణంతో నివాసితుల విజ్ఞప్తులు బుట్టకాఖలైపోయాయి. ఆ నాటి నుంచి వారి గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఫ్లాట్స్ కేటాయింపులను తిరిగి మొదలు పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వారిది న్యాయమైన డిమాండ్ నివాసితులది న్యాయమైన డిమాండ్. మార్కెట్ ధరకు అనుగుణంగా క్వార్టర్స్ను కేటాయించి యాజమాన్య హక్కులు కల్పించాలి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలి. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం వీరిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది. సీఎం కేసీఆర్ ఈ సమస్యపై దృష్టి సారించాలి. – సహదేవ్యాదవ్, బీజేపీ నేత ప్రభుత్వం న్యాయం చేయాలి నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ నివాసముంటున్న మమ్మల్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు జరిగాయి. రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని క్వార్టర్స్ను మాకే కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అందుకు హౌసింగ్ బోర్డు అధికారులకు అదేశాలు జారీ చేయాలి.– పి. శ్రీశైలం, రిటైర్డ్ ఉద్యోగి -
పెద్దల బండారం బట్టబయలు
సాక్షి, అనంతపురం సెంట్రల్: పెద్దల బండారం బట్టబయలైంది. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. క్లబ్బుల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన 14 స్థావరాలపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కొన్నేళ్లుగా బహిరంగంగానే పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా క్లబ్బులు మారినా ఆ దరిదాపుల్లోకి కూడా పోలీసులు వెళ్లిన సందర్బాలు లేవు. అలాంటి వాటిపై ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు నేతృత్వంలో దాడులు నిర్వహించడం సర్వత్రాచర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు గురువారం స్థానిక పోలీసుకాన్ఫరెన్స్ హాల్లో విలేకరులకు తెలియజేశారు. అసాంఘిక కార్యాకలాపాలపై ఉక్కుపాదం అసాంఘిక కార్యాకలాపాలపై ఉక్కు పాదం మోపుతున్నామని ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో క్లబ్బులపై ఏకకాలంలో దాడులు చేశామన్నారు. మిగిలిన చోట్ల నిందితులు పట్టుబడకపోయినా జిల్లా కేంద్రంలోని అనంతపురం క్లబ్లో పేకాట ఆడుతున్న 42 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,87,417 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో ఎక్కడా అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీలులేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఇసుక, రేషన్ బియ్యం, అక్రమ రవాణా, బెల్టు దుకాణాలు, మట్కా, పేకాట, క్లబ్లపై దాడులను ప్రాధాన్యతగా భావించి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 154 ట్రాక్టర్లు, నాలుగు టిప్పర్లు, లారీలను పట్టుకుని 26 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన 150 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నామన్నారు. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న 12 మంది నిందితులను అరెస్ట్ చేసి 337.6 క్వింటాళ్ల(564 బస్తాలు) రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. మట్కాపై జిల్లా వ్యాప్తంగా దాడులు చేసి 27 కేసులు నమోదు చేయడంతోపాటు రూ.1,87,880 నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పేకాటకు సంబంధించి 553 కేసులు నమోదు చేసి రూ.9,97,240 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పేకాటరాయళ్లను తరలిస్తున్న పోలీసులు గుట్కా విక్రయాలపై 21 కేసులు నమోదు చేసి, 27 మందిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.3,96,571ల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బెల్టు దుకాణాలపై దాడులు చేసి 128 కేసులు 3,714 మద్యం సీసాలు, 149 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. జిల్లాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ చౌడేశ్వరి పాల్గొన్నారు. ముందస్తు సమాచారంతో తప్పించుకున్న పేకాటరాయుళ్లు క్లబ్ బయట నిల్చున్న డీఎస్పీ శ్రీనివాసులు సాక్షి, కదిరి: పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సీఆర్సీ క్లబ్పై గురువారం పోలీసులు మెరుపు దాడి చేసేందుకు వెళ్లారు. అయితే ముందస్తు సమాచారంతో పేకాటరాయుళ్లు అక్కడి నుంచి జారుకున్నారు. గత నెల 27న ‘ఇక్కడ పేకాట మామూలే’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు గురువారం జిల్లా వ్యాప్తంగా పేకాట క్లబ్లపై మెరుపు దాడులు చేయించారు. కదిరిలో సీఆర్సీ క్లబ్పై కూడా దాడి చేయడానికి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ బీవీ చలపతి, ఎస్ఐ ఖాజాహుస్సేన్ ఇంకా పలువురు పోలీసులు అక్కడికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే విషయం సీఆర్సీ క్లబ్ సభ్యులకు పోలీసులే కొందరు సమాచారం అందించడంతో పేకాటరాయుళ్లు తప్పించుకున్నారు. ముందస్తు సమచారం లేకుంటే మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అనుచరులు పట్టుబడేవారని కొందరు సీఆర్సీ క్లబ్ సభ్యులే అంటున్నారు. డీఎస్పీతో పాటు ఇతర కింది స్థాయి అధికారులు కాసేపు సీఆర్సీ క్లబ్ గేట్ ముందు గడిపి వెనుదిరిగారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా.. నగరంలోని అనంతపురం క్లబ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఈ క్లబ్కు అధ్యక్షులు జిల్లా కలెక్టర్, ఉపాధ్యక్షులు ఎస్పీలు వ్యవహరిస్తారు. రిక్రియేషన్ కోసం ఏర్పాటు చేసి క్లబ్ పేకాట, తాగుడుకు కేంద్రంగా మారింది. దీంతో పెద్దమనుషులుగా చలామణి అవుతున్న వారు, రిటైర్డ్ ఉద్యోగులు, చోటామోటా నాయకులు, ప్రజాప్రతినిధులు వారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఎంచుకున్నారు. ఇక్కడ తాగడం, పేకాట ఆడడం లైసెన్స్గా భావించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు కొరడా ఝలిపించారు. డీఎస్పీ పీఎన్ బాబు ఆధ్వర్యంలో నాలుగు పోలీసుస్టేషన్ల అధికారులు క్లబ్పై మెరుపుదాడులు నిర్వహించారు. 42మంది అరెస్ట్ చేసి నాలుగో పట్టణ పోలీసుస్టేషన్కు తరలించారు. -
పేరు మార్పిడికి మోక్షం లభించేనా..?
సాక్షి, కొత్తగూడెం: మారుపేర్ల మార్పు కోసం సింగరేణి కార్మికులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు. శ్రీరాంపూర్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా చెప్పారు. కానీ ఇంతవరకూ నెరవేర్చలేదు. సంస్థవ్యాప్తంగా సుమారు 7వేల మందికి పైగా మారుపేర్ల మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళన జరిగి సుమారు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ అంశం కొలిక్కి రాకపోవడంతో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ కార్మికులకు తప్పని ఇబ్బందులు బాయిపైన ఒకపేరు.. సొంత గ్రామంలో మరో పేరు ఉండటంతో ఉద్యోగ విరమణానంతరం పింఛన్ కోసం కార్మికులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఊర్లోని పేరుతో భూములు, ఇళ్లు ఉండటం, బాయిమీద ఇంకో పేరు ఉండటంతో ఏ పేరుతో కొనసాగాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు. ఊర్లో పేరు మార్చిన భూముల రికార్డులన్నీ మారి పోతాయి.. బాయి మీద పేరుమార్చితే పింఛన్ నిలిచిపోతోంది. దీంతో కార్మికులు సతమతమవుతున్నారు. రికార్డుల్లో సరిగా ఉన్నా.. 35ఏళ్ల పాటు సంస్థలో పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలిచ్చే విషయంలో యాజమాన్యం మెలిక పెడుతోంది. రికార్డుల్లో తండ్రీ కొడుకుల పేర్లు సరిగానే ఉన్నప్పటికీ విజిలెన్స్ విచారణ పేరుతో ఊర్లో వేరే పేరు ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొడుక్కు ఉద్యోగం ఇచ్చేందుకు అభ్యంతరం చెబుతోంది. ఉద్యోగం చేసినంత సేపు లేని మారు పేరు ఇబ్బంది అతని మెడికల్ ఇన్వాలిడేషన్ పూర్తయి కొడుక్కి ఉద్యోగం ఇచ్చే విషయంలో మాత్రం అభ్యంతరం తెలపడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గనిపైన ఉన్న పేరుతోనే పిల్లలు చదివినా కొడుకు ఉద్యోగం విషయానికి వచ్చే సరికి విజిలెన్స్ విచారణ పేరుతో ఊర్లో తండ్రి పేరు వేరే ఉంటే ఉద్యోగాన్ని నిలిపివేస్తున్నారు. ఈతరహాలో సింగరేణి వ్యాప్తంగా 68 కేసులు పెండింగ్లో ఉన్నాయి. యాజమాన్యం నిర్ణయం కోసం సదరు కార్మికుల కుటుంబాలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాయి. సీఎండీ సమావేశంలో పరిష్కారమయ్యేనా..? వచ్చే నెల 2,3 తేదీల్లో సింగరేణి సంస్థ సీఎండీ స్థాయి జేసీసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనైనా మారు పేర్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని కార్మికులు ఆశిస్తున్నారు. ఈ స్ట్రక్చరల్ సమావేశంలో మెడికల్ ఇన్వాలిడేషన్ కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే టీబీజీకేఎస్ ఒత్తిడిపైనే ఈఅంశం ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. -
రిటైర్డ్ ఉద్యోగులనూ టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది
-
రిటైర్డు ఉద్యోగులను వేధించకండి: సుప్రీం
న్యూఢిల్లీ: రిటైర్డు ఉద్యోగులను వేధించవద్దనీ, వారి వైద్య బిల్లులను వెంటనే చెల్లించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) కింద మెడికల్ చెల్లింపులను నెలలోగా పూర్తి చేసేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను ఆదేశించింది. సీజీహెచ్ఎస్ జాబితాలో ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోలేదన్న కారణంతో అధికారులు తన వైద్య బిల్లులను ఆపేశారని ఓ రిటైర్డు ఉద్యోగి కోర్టును ఆశ్రయించడంతో ఈ ఆదేశాలిచ్చింది. కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో వారంలోగా ప్రత్యేక కమిటీని నియమించాలని, ప్రతినెలా ఈ కమిటీ సమావేశమై బిల్లుల చెల్లింపు ప్రక్రియను సమీక్షించాలని తెలిపింది. అర్జీదారు విషయంలో సీజీహెచ్ఎస్ అధికారులు అమానవీయంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఏ ఆస్పత్రిలో చికిత్స పొందారన్నది కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఆ చికిత్స పొందారనే అంశాన్నే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందంది. -
మీట నొక్కు..పింఛన్ పట్టు
ఖమ్మం, వైరా: విశ్రాంత ఉద్యోగులు పింఛన్ పొందాలంటే ఇక సులభ ప్రక్రియ అందుబాటులోకి వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్ డిజిటల్ ఇండియాలో భాగంగా..కేంద్ర ప్రభుత్వం జీవన్ ప్రమాణ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పెన్షనర్లు ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో జీవించి ఉన్నట్లు ధ్రవీకరణపత్రం (లైవ్ సర్టిఫికెట్) ఖజానా కార్యాలయాలు, బ్యాంకుల్లో విధిగా అందజేయాలి. వీటి కోసం వృద్ధులు ప్రతీ సంవత్సరం నానా కష్టాలు పడుతుంటారు. 10–15 రోజుల పాటు గెజిటెడ్ అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చేది. పెన్షనర్ల బాధలను తొలగించాలనే సదుద్దేశంతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బయోమెట్రిక్ ద్వారా జీవన ధ్రువీకరణ పత్రం పొందే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. జీవన్ ప్రమాణ్ అనే పోర్టల్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు అందజేసే అవకాశమొచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర, సత్తుపల్లి, వైరా, నేలకొండపల్లి, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట పరిధిలో 12,500 మంది పైగా పెన్షన్షర్లు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు దాదాపు 45వేల మందికి పైగా ఉన్నారు. వీరందికీ కొత్తగా కల్పించిన అవకాశం వల్ల ఇక ‘మేం జీవించి ఉన్నాం’ అని ప్రతిసారీ సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడకుండా..బయోమెట్రిక్ యంత్రంపై మీటనొక్కితే చాలు. ఇక ఆగకుండా పెన్షన్ అందుతుంది. నమోదు ప్రక్రియ ఇలా.. www.jeevanpramaan.gov.in అనే వెబ్సైట్లో జీవన్ ప్రమాణ్కు సంబంధించిన పూర్తి వివరాలు లభ్యమవుతాయి. సెల్ఫోన్ నంబర్, ఆధార్కార్డు సంఖ్య ఆధారంగా సమగ్ర వివరాలతో పేరు నమోదు చేసుకుంటే బయోమెట్రిక్ విధానం ద్వారా డిజిటల్ ధ్రువీకరణ పత్రం జారీ అవుతుంది. ఖాజానా, బ్యాంకు అధికారులు ఈ వెబ్సైట్ ద్వారా సంబంధిత పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్ సంఖ్య పెన్షన్ పేమేంట్ ఆర్డర్ బ్యాంకు ఖాతా సంఖ్య, ఫోన్నంబర్ వివరాలు పొందుపర్చాలి. ఆధార్లోని వేలిముద్రలు వైబ్సైట్లో తాజాగా నమోదు చేసే వేలిముద్రలు సరిపోతే పెన్షన్దారులకు రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు. సెల్ఫోన్కు సంక్షిప్త సందేశం అందుతుంది. ఆ తర్వాత జీవన్ ప్రమాణ్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య వస్తుంది. ఈ సంఖ్యలో ప్రత్యేక డిజిట్ «ధ్రువీకరణపత్రం జారీ అవుతంది. ఒక్కసారి జీవన్ ప్రమాణ్ డిజిటల్ ధ్రువీకరణ పత్రం జారీ అయితే..ఆ తర్వాత జీవన్ప్రమాణ్ పోర్టల్లో వేలిముద్రలు వేస్తే సరిపోతుంది. ప్రతి ఏటా కార్యాలయాలు, అధికారల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండదు. ఈ విషయాలు కీలకం.. సంబంధిత సైట్లోకి వెళ్లాక..హోమ్, ఎబౌట్, సెండ్యువర్ ఆధార్, గెట్ ఏ సర్టిఫికెట్ అనే వివరాలు కనిపిస్తాయి. ఎబౌట్ సైట్లో జీవన్ ప్రమాణ్ ధ్రువీకరణ పత్రం నమోదుకు సంబంధించిన వివరాలు పూర్తిగా పొందుపరిచారు. గెట్ ఏ సర్టిఫికెట్ సైట్లో పీసీల ద్వారా, ఆండ్రాయిడ్ సెల్ఫోన్ ద్వారా జీవనప్రమాణ్ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం ఉంది. తద్వారా పెన్షనర్లు ఇక ఏటా నవంబర్ నెల నుంచి వేలిముద్రలు వేసే అవకాశం లభిస్తుంది. -
రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త
గ్రాట్యుటీ వ్యత్యాసబకాయిల విడుదల ► రూ. 4 లక్షల వ్యత్యాసం చెల్లించేలా ఉత్తర్వులు జారీ ► 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్య రిటైరైన వారికి వర్తింపు సాక్షి, హైదరాబాద్: రిటైరైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్సీ సిఫారసుల ప్రకారం రిటైరైన ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీని ప్రభుత్వం రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచింది. సవరించిన గ్రాట్యుటీ 2014 జూన్ 2 నుంచే అమల్లోకి తెచ్చింది. 2015 మార్చి 1 నుంచి సవరించిన గ్రాట్యుటీని ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించింది. అయితే ఈ తొమ్మిది నెలల వ్యవధిలో రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 4 లక్షల చొప్పున గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను రెండేళ్లుగా పెండింగ్లో పెట్టింది. ఈ నేపథ్యంలో వ్యత్యాస బకాయిల చెల్లింపులకు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు జీవో నం.79 జారీ చేశారు. 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్య రిటైరైన ఉద్యోగులకు ఈ బకాయిలు చెల్లించనున్నట్లు సర్కారు ఉత్తర్వుల్లో పొందుపరిచింది. తెలంగాణ స్టేట్ ఆడిట్ అకౌంటెంట్ జనరల్ అండ్ డైరెక్టర్ ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ట్రెజరీల అధికారులు, పెన్షన్ పేమెంట్ అధికారులు ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ తొమ్మిది నెలల వ్యవధిలో రిటైరై, వ్యత్యాస బకాయిలు అందుకోకుండానే మరణించిన పెన్షనర్లు ఎవరైనా ఉంటే నిబంధనల ప్రకారం వారి వారసులకు ఈ బకాయిలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు యూనివర్సిటీ, ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల టీచర్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. దాదాపు రూ.190 కోట్ల గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను చెల్లించాల్సి ఉన్నట్లుగా ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. -
వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్
కర్నూలు(రాజ్విహార్): ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీఎస్ఆ ఆర్టీసీ రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ రీజినల్ కార్యదర్శి పి. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కొత్త బస్టాండ్లోని రీజినల్ మేనేజరు కార్యాలయం వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. 2013 ఏప్రిల్ నుంచి 2015 జూన్ మధ్య కాలంలో పదవీ విరమణ పొందిన కార్మికులు, ఉద్యోగులకు గ్రాట్యూటీ అరియర్స్ ఇప్పటి వరకు చెల్లించకపోవడం విచారకరమన్నారు. దీక్షల్లో ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఎస్ఎస్ రావు, సుబ్బారాయుడు, ప్రసాద్, జీఎస్ వాసులు, ఎస్ఎ అజీమ్, జె. రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
సారూ.. మా మొర ఆలకించండి
- ఉన్నతాధికారులకు రిటైర్డ్ ఉద్యోగుల విజ్ఞప్తి - నాలుగు రోజులైనా అందని పింఛన్ - బ్యాంకుల వద్ద తప్పని పడిగాపులు - ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి నందికొట్కూరు: వివిధ శాఖల్లో పని చేసి పదవీ విరమణ చేసిన 1142 మంది పింఛనర్లకు ఈ నెల పింఛన్ అందెకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రూ, 500, రూ, 1000 నోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరత తీవ్రం కావడం, వచ్చిన డబ్బు గంటలోపే అయిపోతుండడంతో బ్యాంకులు నిత్యం నో క్యాష్ బోర్డుతో దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలు కూడా ఇందుకు విరుద్ధంగా ఏమీలేక పోవడంతో పింఛన్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు బ్యాంకుల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి నగదు కోసం బారులు తీరుతున్నారు. గత నెలలో పింఛన్ బ్యాంకు ఖాతాకు జమ అయినప్పటికీ అవసరాలను బట్టి డ్రా చేసుకునేవారం. అయితే గత నెల 8వ తేది రాత్రి పెద్ద నోట్ల రద్దు కావడంతో అది కూడా తీసుకోలేకపోయామని వాపోతున్నారు. దీంతో నిత్యావసరాలు, కుటుంబ ఖర్చులకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొందని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నా అమలు కావడం లేదని చెబుతున్నారు. తమ సమస్య పరిష్కారానికి కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నాలుగు రోజులైనా నయా పైసా ఇవ్వలేదు: రాముడు బ్యాంక్లో పింఛన్ డబ్బులు నేటికీ ఒక పైసా చేతికి రాలేదు. నాలుగు రోజుల నుంచి బ్యాంక్కు వెళ్లడం, ఇంటికి ఒట్టి చేతులతో రావడం సరిపోయింది. ఇంట్లో నిత్యావసర సరుకులు అయిపోయాయి. వైద్య ఖర్చులకూ దిక్కులేదు: ప్రసాదరావు ప్రతి నెలా డాక్టర్ల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవలసి ఉంది. అందుకు అవసమైన డబ్బుల్లేక వెళ్లలేదు. బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. బ్యాంక్కు వెళ్లి క్యూలో నిల్చొని డబ్బులు తీసుకునే శక్తి లేదు. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలి: సుబ్బదాస్ బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి పింఛనర్లకు డబ్బులు అందించాలి. డుబ్బులు లేక ఎంతో మంది పెన్షనర్లు ఏన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంక్ అధికారులు మాత్రం సీనియర్ సిటిజన్ల పట్ల స్పందించడం లేదు. -
అవిశ్రాంత సవారీ
సిరిసిల్ల రిటైర్డు ఉద్యోగుల ఆదర్శం ఎటు వెళ్లినా సైకిల్పైనే.. కార్లు, బైక్లున్నా.. సైకిలే ఇష్టం సిరిసిల్ల: ఉరుకులు... పరుగుల జీవితంలో శారీరక శ్రమ తగ్గిపోతోంది. సరైన వ్యాయామం లేక మానసిక ప్రశాంతత కొరవడుతోంది. ఈ తరుణంలో సైకిల్ సవారీతో నిరంతరం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపొచ్చని నిరూపిస్తున్నారు సిరిసిల్లకు చెందిన పలువురు రిటైర్డ్ ఉద్యోగులు. ఆరు పదుల వయసు దాటినా 20 ఏళ్ల యువకుల్లా ఎక్కడికి వెళ్లినా సైకిల్పై సవారీ చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వ్యాయామంలో భాగంగా సైకిల్పై సంచరిస్తూ అందరినీ పలకరిస్తున్నారు. రోజూ సైకిల్ తొక్కడమే తమ ఆరోగ్య రహస్యమని చెబుతున్న రిటైర్డు ఉద్యోగులపై ప్రత్యేక కథనం.. ఏళ్ల తరబడి సైకిల్పై.. ఒకటి.. రెండు రోజులో కాదు.. ఏళ్లకు ఏళ్లుగా సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు సిరిసిల్ల రిటైర్డు ఉద్యోగులు. ఇందులో కొందరు ఆర్థికంగా స్థిరపడి కార్లు, బైక్లు, మోపెడ్లు ఉన్నా వాటికి దూరంగా ఉంటూ సైకిల్పైనే ప్రయాణం చేస్తున్నారు. మార్కెట్లో కూరగాయల నుంచి కిరాణ సామగ్రి దాకా అన్నింటికీ సైకిలే. నిత్యం ఉదయం గంటసేపు సైకిల్ తొక్కుతూ యువకుల్లా ఉత్సాహంగా గడుపుతున్నారు. సిరిసిల్లలో పాతిక మంది రిటైర్డు ఉద్యోగులు ఎవరికి వారు తీరిక వేళల్లో సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. యువతకు ఆదర్శం.. ఏ చిన్న పనైనా.. కొద్దిపాటి దూరమైనా బైక్పై వెళ్తున్న ఈ రోజుల్లో యువతకు సిరిసిల్ల రిటైర్డు ఉద్యోగులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏ పని అయినా సైకిల్పై వెళ్లి చేసుకుంటున్నారు. 60 ఏళ్ల వయసులోనూ అలుపెరగడకుండా సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. 30 ఏళ్లు దాటగానే అనారోగ్యం బారిన పడుతున్న నేటితరం యువతకు అవిశ్రాంత సైకిలిస్టులు ఆదర్శంగా ఉన్నారు. సైకిల్ తొక్కడంతో చెమట వస్తుందని, గుండెవేగం పెరిగి శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. మోకాళ్లు, మడిమెల, కీళ్లనొప్పులు ఉండి వాకింగ్ చేయలేని వారికి సైతం సైకిల్ తొక్కమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంతో సిరిసిల్ల వీధుల్లో సైకిల్ సవారీతో రిటైర్డు ఉద్యోగులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచి.. 15 ఏళ్ల వయసు నుంచి నేను సైకిల్ తొక్కుతున్నా. నాకు పది మంది పిల్లలు. 1965లో పోస్టల్ శాఖలో చేరా. 2010లో రిటైర్ అయ్యాను. ఉద్యోగంలో ఉండగా.. నిత్యం సైకిల్పైనే ఉత్తరాలను పంచేవాడిని. అదే అలవాటుతో ఇప్పటికీ సైకిల్ తొక్కుతూనే ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. - అబ్దుల్ అజీమ్(75), పోస్టుమెన్ మనవడి సైకిల్ తొక్కుతున్నా.. మా మనవడి సైకిల్ నేను తొక్కుతున్న. రోజూ ఉదయం గంట సైకిల్ తొక్కుత. 2009లో ఉద్యోగ విరమణ చేశా. వ్యాయామం కోసం సైకిల్ తొక్కమని డాక్టర్లు చెప్పారు. మూడేళ్లుగా సైకిల్ తొక్కుతున్నా. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు. మా మనవడి సైకిల్ను వాడుకుంటున్నా. ఉల్లాసంగా ఉంది. - మాణిక్రావు లక్ష్మీనారాయణ(68), రిటైర్డు ఉద్యోగి కారు, స్కూటర్ ఉన్నా.. నాకు కారుంది. స్కూటర్ ఎప్పటి నుంచో ఉంది. ఆరోగ్యం కోసం రోజూ సైకిల్ తొక్కుతా. ఉదయం వ్యాయామంలో భాగంగా సిరిసిల్ల వీధుల్లో సైకిల్ తొక్కుతా. కొందరు కొత్తగా చూశారు. కానీ నాకు అలవాటైంది. ఐదేళ్లుగా సైకిల్పైనే వ్యాయామం చేస్తున్నాను. పార్కింగ్ సమస్య ఉండదు. పెట్రోల్ అవసరం లేదు. అన్నింటికీ సైకిలే బెటర్. - గుడ్ల రవి(60), రిటైర్డు ఉపాధ్యాయుడు -
విశ్రాంత ఉద్యోగులను ఆదుకోవాలి
ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ గుంటూరు (కొరిటెపాడు): న్యూఇండియా, యునైటెడ్ ఇండియా, ఓరియంటల్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీల విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు గురుమూర్తి కోరారు. అరండల్పేటలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన వైజాగ్ రీజియన్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగినప్పుడల్లా విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ పెరుగుతోందని, కానీ బీమా సంస్థల విశ్రాంత ఉద్యోగులకు అటువంటి సౌకర్యం కల్పించకపోవడం అన్యాయమన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. -
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
హజూర్నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహర దీక్షలు శనివారంతో 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూలకంటి నర్సిరెడ్డి రిలే దీక్షలు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఆలోచించి అన్ని అర్హతలు కలిగిన హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో అంకతి అప్పయ్య, ఎంబి.దేవదానం, చెన్నా సోమయ్య, హనుమంతరావు, పురుషోత్తం, రఘునాథం, రామ్మోహన్రావు, నారాయణరెడ్డి, కలకుంట్ల రామయ్య, మాణిక్యం, సత్యనారాయణ, నర్సయ్య, జాన్, వేముల వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, సుధాకర్రెడ్డి, lంకయ్య, కాశయ్య, ధర్మూరి, అనంతరామశర్మ, ఎన్.వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
శేష జీవితం ప్రశాంతంగా గడపాలి
డీవైజీఎం కేవీ.సీతారామారావు గనులపై రిటైర్డు కార్మికులకు సన్మానం బెల్లంపల్లి : సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందుతున్న కార్మికులు శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని బెల్లంపల్లి సింగరేణి డీవైజీఎం(ఎక్స్ప్లోరేషన్) కేవీ.సీతారామారావు అన్నారు. శనివారం ఎక్స్ప్లోరేషన్ విభాగంలో గంధం గట్టయ్య(టర్నర్), ఖాజామొహినోద్దీన్(డ్రైవర్) ఉద్యోగ విరమణ పొందారు. వీరికి డీవైజీఎం పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఎస్ఈ రమేశ్చందర్, శివనారాయణ, డీవైఎస్ఈ శ్రీనివాస్రావు, ఆఫీస్ ఇన్చార్జి పి.రాజమలు పాల్గొన్నారు. కాసిపేటగనిపై కాసిపేట : మందమర్రి ఏరియా కాసిపేటగనిపై ట్రామర్ కోడి పెద్దులు, కోల్కట్టర్ రాంటెంకి రాజయ్య, జనరల్ మజ్దూర్ కార్మికుడు వేల్పుల గంగయ్య దంపతులను గని మైనేజర్ సైదులు, కార్మిక సంఘాల నాయకులు సన్మానించారు. రక్షణాధికారి అల్లావుద్దీన్, డెప్యూటీ మేనేజర్ సునిల్కుమార్, సంక్షేమాధికారి మైత్రేయ బందు, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్లో.. రామకృష్ణాపూర్ : మందమర్రి ఏరియాలోని ఆర్కే1ఏ గనిలో హాలర్ ఆపరేటర్లు ఎండీ.అంకూస్, సుంచు రాజయ్య, టెండాల్ సూపర్వైజర్ ఇర్రంకి రాము, ట్రామర్ ఓదెలు, డిప్యూటీ సూపర్వైజర్ అప్పారావు, కోల్ఫిల్లర్ రావుల సాంబయ్య, టింబర్మెన్ కార్మికుడు అప్పాల చంద్రయ్యలను శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. గని మేనేజర్ కృష్ణారావు, రక్షణాధికారి రాంబరోస్ మహతా, సంక్షేమాధికారి భేతిరాజు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో.. శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఏరియాలోని పలు గనులపై రిటైర్డ్ కార్మికులను ఘనంగా సన్మానించారు. శ్రీరాంపూర్ ఓసీపీలో పి.తిరుపతిరాజు(హెడ్ఓవర్మెన్)ను గని మేనేజర్ ఎం.నరేందర్ శాలువాతో సత్కరించారు. టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, గని రక్షణాధికారి వెంకటేశ్వర్రెడ్డి, ప్రాజెక్టు అధికారి సీహెచ్.రవీందర్ పాల్గొన్నారు. ఆర్కే 6గనిపై.. ఆర్కే 6 గనిపై జె.రామారావు(కోల్కట్టర్), యస్.దశరయ్య(ట్రామర్), గాజుల నర్సయ్య(జనరల్ మజ్ధూర్), ఏకుల రాజయ్య(జనరల్ మజ్ధూర్), అప్పాల లచ్చన్న(కోల్ఫిల్లర్), డి.వెంకటయ్య(కోల్ఫిల్లర్)లను గని మేనేజర్ ఎన్.సత్యనారాయణ శాలువాతో సత్కరించారు. గని రక్షణాధికారి సీహెచ్.శ్రీనివాస్రావు, ఫిట్ ఇంజినీర్ వీపీజే వెంకటేశ్, సంక్షేమ అధికారి శ్యాంప్రసాద్, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ బ్రాంచి సెక్రెటరీ పానుగంటి సత్తయ్య, ఫిట్ సెక్రెటరీ మేడారపు సత్తయ్య పాల్గొన్నారు. ఆర్కే 5 గనిలో.. ఆర్కే 5 గనిలో రజ్జల వెంకటయ్య(జనరల్ మజ్ధూర్)ను గని మేనేజర్ జి.మల్లేశ్ శాలువాతో సత్కరించారు. గని డెప్యూటీ మేనేజర్ యస్కే సిన్హా, ఫిట్ ఇంజినీర్ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఎస్సార్పీ 3, 3ఏ గనిలో.. ఎస్సార్పీ 3, 3ఏ గనిలో వేముల శంకర్(కోల్కట్టర్), ఎండీ ఖాజాపాషా(ఎలక్ట్రీషియన్), పళ్ల రామస్వామి(ట్రామర్), రావుల రాయలింగు(హాలర్ ఆపరేటర్), దూలం చంద్రయ్య(కోల్కట్టర్)లను గని మేనేజర్ యన్.రమేశ్ శాలువాతో సత్కరించారు. గని మేనేజర్ డి.సతీశ్ పాల్గొన్నారు. రిటైర్డ్ అధికారికి సన్మానం.. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో డెప్యూటీ సూపరిండెంట్ ఐ.సనత్కుమార్ను డీజీఎం(పర్సనల్) శర్మ, డీజీఎం జె.కిరణ్ శాలువాతో సత్కరించారు. డీవైపీఎం ఆజ్మీరాతుకారాం, టీబీజీకేఎస్ ఫిట్ సెక్రెటరీ రాళ్లబండి రాజన్న పాల్గొన్నారు. మందమర్రి ఏరియాలో.. మందమర్రి : మందమర్రి ఏరియాలోని వివిధ గనులు, డిపార్టుమెంట్లలో శనివారం ఉద్యోగ విరమణ పొందిన కార్మికులను ఆయా గని ఆవరణలో ఏర్పాటు సన్మానించారు. కేకే–5 గనిలో డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల శరత్ చంద్ర, కోల్కట్టర్ కూరపు కోంరయ్యలను శాలువాతో సన్మానించారు. గని మేనేజర్ రాంమోహన్ పాల్గొన్నారు. ఖైరిగూడ ఓసీపీలో.. రెబ్బెన : ఖైరిగూడ ఓసీపీలో ఓసీపీలో జనరల్ మజ్దూర్ పవిసెట్టి సారయ్య దంపతులను ఓసీ మేనేజర్ శ్రీరమేష్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఫిట్ ఇంజనీరు అహ్మద్ అలీ, వెల్ఫేర్ అధికారి సాదన్, సేఫ్టీ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గోలేటి–1ఏలో.. తాండూర్ : ఏరియా గోలేటీ–1ఏ గనిలో బంధం రాజన్న(మైనింగ్ సర్దార్), ఎం.రామపోశం(ఫోర్మెన్), మురళయ్య(క్లర్క్), దుర్గం ఇస్తారి(సపోర్టు మజ్దూర్), మేడం శంకరయ్య(టింబర్మెన్), పల్లె పోశం(జనరల్ మజ్దూర్), జుమ్మిడి చంద్రయ్య(లైన్మెన్), నలివేలి రాయమల్లు(కోల్కట్టర్)లను గోలేటీ గ్రూ‹ఫ్ ఆఫ్ మైన్స్ ఏజెంట్ దేవేందర్, మేనేజర్ మహేశ్ సన్మానించారు. వెంటిలేషన్ ఆఫీసర్ గుప్తా, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ శంకర్, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీకాంత్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్రాజ్ శ్రీనివాస్రావు, ఏరియా కార్యదర్శి బైరి శంకర్, ఫిట్ కార్యదర్శి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి పాల్గొన్నారు. -
పెన్షనర్ల గోడు పట్టని సర్కారు
సాక్షి, హైదరాబాద్: పెన్షనర్ల గోడును రాష్ట్ర సర్కారు పట్టించుకోవటం లేదు. రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ చెల్లింపులను నిలిపివేసింది. దాదాపు రూ.300 కోట్లకుపైగా పెండింగ్లో పెట్టింది. దీంతో దాదాపు ఎనిమిది వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. తమకు రావాల్సిన గ్రాట్యుటీ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారంటూ పది నెలలుగా సెక్రటేరియట్లో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పీఆర్సీ సిఫారసుల ప్రకారం రిటైరైన ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీని తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో రూ.8 లక్షలున్న గ్రాట్యుటీని రూ.12 లక్షలకు పెంచు తూ గతేడాది జూలైలోనే ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచే పెరిగిన ఈ గ్రాట్యుటీ వర్తిస్తుంది. 2015 మార్చి నుంచి రిటైరైన వారికి నగదు రూపంలో చెల్లిస్తామని, 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్యలో రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలు చెల్లిస్తామని అప్పటి ఉత్తర్వుల్లోనే స్పష్టం చేసింది. గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేస్తామని అందులో తెలిపింది. పది నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయకపోగా.. అసలు ఆ ఊసెత్తకుండానే ఫైలు అటకెక్కించింది. దీంతో గ్రాట్యుటీ బకాయిల చెల్లింపులు ఆగిపోయాయి. అప్పుడు రిటైరైన వారికే ఇబ్బంది 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి మధ్య తొమ్మిది నెలల వ్యవధిలో రిటైరైన ఉద్యోగులందరూ ప్రస్తుతం ఇరకాటంలో పడ్డారు. తమకు రావాల్సిన గ్రాట్యుటీ బకాయిలు వస్తాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఎవరికి వారుగా ఆర్థిక శాఖకు వెళ్లి తమ ఫైలు ఎప్పుడు కదులుతుంది.. ఎప్పుడు జీవో విడుదలవుతుంది..? అని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పీఆర్సీ ప్రకటించిన తర్వాత రిటైరైన ఉద్యోగులందరికీ ప్రభుత్వం క్రమం తప్పకుండా రూ.12 లక్షల చొప్పున గ్రాట్యుటీని చెల్లిస్తోంది. అంతకుముందు రిటైరైన వారందరినీ ఈ సమస్య వెంటాడుతోంది. వీరిలో కొందరికి పాత గ్రాట్యుటీ ప్రకారం రూ.8 లక్షలు చెల్లించినప్పటికీ.. మిగతా బకాయిలు ఆగిపోయాయి. ఈ విధంగా నిలిపేసిన గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలు చెల్లించాలంటే దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు అవసరమని గతంలోనే ఆర్థిక శాఖ అంచనాలు వేసుకుంది. కానీ గత ఏడాది నెలకొన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతమొత్తం చెల్లించటం కుదరదని పెండింగ్లో పెట్టింది. ముందుజాగ్రత్తగా జీవో కూడా జారీ చేయలేదు. పెన్షన్ బకాయిలకు మోక్షం లేదు రాష్ట్రంలోని పెన్షన్దారులందరికీ తొమ్మిది నెలల పెన్షన్ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం పెరిగిన వేతనాలకు సంబంధించి తొమ్మిది నెలల బకాయిలను ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. వీటికి దాదాపు రూ.2,500 కోట్లు అవసరమవుతాయి. భారీ మొత్తం కావటంతో ఆర్థిక శాఖ వీటిని చెల్లించకుండా వాయిదా వేస్తూ వస్తోంది. బకాయిలు నగదుగా ఇవ్వాలా, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలా అనే చర్చకు తెర లేపి ఈ సమస్యను జటిలం చేసింది. పెన్షన్దారులతో పాటు కొత్తగా చేరిన ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు లేనందున నగదు రూపంలో చెల్లింపులు చేయడం తప్పనిసరి. ఈ బకాయిలు కూడా వీలైనంత తొందరగా చెల్లించాలని పెన్షన్దారులు అధికారులను వేడుకుంటున్నారు. -
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణం
విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని 36 వేల మంది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీఎస్ఆర్టీసీ కర్షకపరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వరహాలనాయుడు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్రాంత ఉద్యోగితో పాటు భార్యకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్టు పేర్కొన్నారు. ప్యాసింజర్ సర్వీసు నుంచి డీలక్స్ వరకు ఉచిత ప్రయాణం, ఆపై సర్వీసుల్లో 50 శాతం రాయితీతో ప్రయాణించే అవకాశం ఉందని వరహాలనాయుడు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీని ఆర్టీసీ యాజమాన్యం నిలబెట్టుకోవడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఆర్థిక ఆసరా..
నేడు పెన్షనర్స్ డే కొరిటెపాడు (గుంటూరు) : తలపండిన అనుభవం.. తలపడే ఉత్సాహం.. అనుభవాల పరవళ్లు.. అనుబంధాల సందళ్లు ఒకేచోట కావాలంటే అది కేవలం పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఇంట్లోనే కనిపిస్తాయి. జీవితాంతం ఎన్నో కష్టాలు పడి ముదిమి వయస్సులో మనుమలు, మనవరాళ్లతో ఆనందంగా గడిపే రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్పైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఒక వ్యక్తి ఉద్యోగపరంగా సేవలు అందించి.. ఉద్యోగ విరమణ తర్వాత అతను అందుకునే జీవనాధారమే ఇది. అందుకే ఈ పెన్షన్ సేవలకు ప్రభుత్వం కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు కల్పించింది. ఇందులో భాగంగానే 1871వ సంవత్సరంలో దేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ చట్టాన్ని తెచ్చారు.ఈ చట్టం జారీ అయిన డిసెంబర్ 17వ తేదీనే పెన్షనర్స్ డేగా జరుపుకొంటున్నారు. పెన్షనర్ల పెద్ద మనసు నేటి పెన్షనర్లు అసోసియేషన్లుగా ఏర్పడి సమాజ సేవలో పాల్గొంటున్నారు. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పదుల సంఖ్యలో పెన్షనర్ల అసోసియేషన్లు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, పాఠశాలల్లో మౌలిక వసతులు, మురికివాడల ప్రజలకు సౌకర్యాలు కల్పించడం వంటివి చేస్తున్నారు. అయితే, పెన్షనర్ల కోసం ప్రభుత్వం ఆర్థికపరమైన భద్రత కల్పించడంతో పాటు వారు చేపట్టే సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. కంట్రిబ్యూషన్ పెన్షన్ విచారకరం పెన్షన్ అనేది కేవలం ఉద్యోగి చేసిన సేవకు చెల్లించే జీవనాధారమే కాదు. వయోభారంతో రోజురోజుకూ కుంగిపోవడమే కాకుండా శారీరక, మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని కల్పిస్తున్న ఆర్థిక, భద్రతా చర్య. అయితే, నాటి పాలకులు భవిష్యత్తుకు భరోసా ఇస్తే నేటి పాలకులు కంట్రిబ్యూటర్ పెన్షన్ తేవడం ద్వారా భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టి పదేళ్లు అయినా దానికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం నిర్ణయించలేని అయోమయ స్థితిలో ఉందన్నారు. ఇది విచారకరం. పెన్షన్ మంజూరులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలి. - ఈదర వీరయ్య, పెన్షన్దారుల చర్చావేదిక అధ్యక్షుడు నేడు వయోవృద్ధులకు సన్మానం విజయవాడ (పటమట) : పెన్షనర్స్ డేను పురస్కరించుకుని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 75ఏళ్లు దాటిన 14మంది వయోవృద్ధులను సన్మానిస్తున్నట్లు అసోసియేషన్ నగర కార్యదర్శి కేఎస్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బందరురోడ్డులోని ఆర్అండ్బీ కార్యాలయ ఆవరణలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. 1980వ సంవత్సరంలో పెన్షనర్లకు రావాల్సిన ప్రయోజనాలపై డీఎస్ నగారా అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేసి గెలిచారని, అప్పటి నుంచి పెన్షనర్లు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతున్నారని తెలిపారు. పెన్షనర్స్ డే రోజున ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆల్ఫ్రెడ్, ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ పాల్గొంటారని ఆయన వివరించారు. ముదిమి వయస్సులో జీవనాధారం స్వాతంత్య్రానంతరం పౌరసేవలను విస్తృత పరచిన క్రమంలో పెన్షన్ చట్టానికి మరింత స్పష్టత వచ్చింది. దీనిని సామాజిక భద్రతకు సంబంధించిన అంశంగా భావించి.. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ప్రజలకు అందించిన అమూల్య సేవలకు గుర్తింపుగా పొందుతున్న అత్య వసర జీవనాధారంగా దీనిని పరిగణించింది. నేటి పాలకులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టి పెన్షనర్ల భవితను అంధకారంలోకి నెట్టారు. -
రిటైర్డ్ ఉద్యోగుల మీద ఎందుకీ వివక్ష?
ఆరు దశాబ్దాల కృషితో ఏర్పడింది ప్రత్యేక తెలంగాణ. ఇందుకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, రైతులు తమ వంతు కృషి చేశారు. రెండున్నర లక్షల మంది విశ్రాంత ఉద్యోగులు కూడా ఈ ఉద్యమంలో భుజం భుజం కలిపారు. ఇందుకు వీరు ఎంతో ఆనందిస్తున్నారు. బంగారు తెలంగాణలో మిగిలిన అన్ని వర్గాలతో పాటు పదవీ విరమణ చేసిన వారి ఆకాంక్షలు కూడా నెరవేరతాయని ఆశించారు. కొన్ని వర్గాల ఉద్యోగులు, వర్గాల వారి కలలు నెరవేరాయి కూడా. కానీ రెండున్నర లక్షల మంది విశ్రాంత ఉద్యోగుల పట్ల మాత్రం కె. చంద్రశేఖరరావు ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించకపోవడం వీరిని హతాశులను చేసింది. పదవీ విరమణ చేసిన నాటికి ఉద్యోగి తీసుకుంటున్న వేతనంలో సగం పింఛనుగా చెల్లించే విషయం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో మొదలైన వివాదం నేటికీ కొనసాగడం విశ్రాంత ఉద్యోగులను మరింత కుంగదీస్తోంది. మే 25, 1998 తరువాత పదవీ విరమణ చేసిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ తేదీకి ముందు పదవీ విరమణ చేసిన వారికీ ఆ నిబంధన వర్తింపచేయాలని పదవీ విరమణ ఉద్యోగులు కోరుతున్నారు. దీనిని కూడా అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. తరువాత విశ్రాంత ఉద్యోగులు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కు వెళితే, వీరి డిమాండ్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వం మళ్లీ ఈ తీర్పునకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు కూడా ట్రిబ్యునల్ తీర్పునే సమర్థించింది. కానీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2004లో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. పదేళ్ల తరువాత 2014 ఏప్రిల్ 30న సుప్రీంకోర్టు కూడా రిటైర్డ్ ఉద్యోగులకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. అప్పటికే విభజన ప్రక్రియ ప్రారంభం కావడంతో గవర్నర్కు రిటైర్డ్ ఉద్యోగులు ఈ అంశం గురించి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సుప్రీం తీర్పును వెంటనే అమలు చేయాలని కూడా కోరడం జరిగింది. ‘ఎంప్లాయీ ఫ్రెండ్లీ తెలంగాణ ప్రభుత్వం’ ఎనిమిది మాసాలైనా ఇప్పటికీ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసే అంశం మీద జీవో జారీ చేయలేదు. సరికదా, సర్వీసు ఉద్యోగులకు ఇచ్చిన తెలంగాణ ఇంక్రిమెంట్ను రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వలేదు. ఇది విశ్రాంత ఉద్యోగులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నది. దీనితో పాటు పన్నెండు మాసాలు గడచిపోయినప్పటికీ పదో పీఆర్సీ సిఫారసుల అమలు కోసం కూడా ఈ వర్గం ఇప్పటికీ ఎదురు చూడవలసి వస్తున్నది. ఆ పది మాసాల బకాయిల చెల్లింపు ఏ విధంగా జరుగుతుందో కూడా తెలియడం లేదు. అడిషినల్ క్వాంటమ్ మీద పీఆర్సీ సిఫారసులను ఆమోదించాలన్న తమ విన్నపం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా అర్థం కావడం లేదు. హెల్త్ కార్డుల విషయం కూడా ఇప్పటికీ తేలలేదు. ఈ సమస్యలను పరిష్కరించి రిటైర్డ్ ఉద్యోగుల క్షోభను నివారించాలని కేసీఆర్ను కోరుతున్నాం. పడాల రాములు (జీటీఈఏ మాజీ ఉపాధ్యక్షులు) హైదరాబాద్ ‘పోలీస్’ సంస్కరణలు ఎక్కడ? మితిమీరిన రాజకీయ జోక్యం, పై అధికారుల ఇష్టా రాజ్య ధోరణి పోలీస్ వ్యవస్థను అభాసుపాలు చేస్తు న్నాయి. ప్రజలకూ, పోలీసులకూ మధ్య పెరుగు తున్న అంతరం మరింత విస్తరించకుండా 30 ఏళ్ల క్రితం తలపెట్టిన సంస్కరణలను అమలు చేయడం అవసరం. రెబీరో కమిషన్, మాలిమత్ కమిషన్, ధర్మ వీర్ కమిషన్, పద్మనాభయ్య కమిషన్ వంటివి అం దుకు సిఫారసులు చేశాయి. 2008లో పార్లమెంటు కూడా పోలీసు సంస్కరణల గురించి చర్చించింది. సుప్రీం కోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. అరెస్టు అధికారాన్ని పోలీసుల నుంచి నియంత్రించడం, కేసు లతో నష్టపోతే పరిహారం వంటివి ఇందులో ఉన్నా యి. వీడియో కాన్ఫరెన్స్తో కేసుల సత్వర పరిష్కారం కోసం కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది. 1970లో ఏర్పాటైన జాతీయ పోలీస్ కమిషన్ అనేక నివేదికలు సమర్పించింది. అయినా ఇప్పటికీ ఈ వ్యవస్థను సం స్కరించవలసిన అవసరమే ఎక్కువ. పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగేటట్టు చేయాలి. ఇది ప్రజాస్వామ్య విజయానికి అవసరం. ముర్కి రామచంద్రం కోహెడ, కరీంనగర్ జిల్లా. -
పెన్షన్ బకాయిలు చెల్లింపునకు ఓకే..
* పట్టుపట్టి సాధించుకున్న రిటైర్డ్ ఉద్యోగులు * పెన్షన్ వ్యత్యాస బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: పట్టు వీడకుండా రిటైర్డు ఉద్యోగులు చేసిన ప్రయత్నానికి ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. 1998కు ముందు రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.327 కోట్ల పెన్షన్ వ్యత్యాస బకాయిలను చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఒకేసారి మొత్తం బకాయిలు చెల్లించడం ఆర్థికంగా భారమవుతుందనే కారణంతో.. ఏడాదికి 25 శాతం చొప్పున నాలుగేళ్లలో మొత్తం బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఆర్థిక శాఖ బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడత బకాయిలను వచ్చే ఏడాది జనవరి 1న, రెండో విడత 2016 ఏప్రిల్ 1న, మూడో విడత 2017 జనవరి 1న, చివరి విడత బకాయిలను 2018 జనవరి 1న చెల్లించనున్నట్లు అందులో పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం 1998కు ముందు రిటైరైన ఉద్యోగులు దాదాపు 30 వేల మందికి సవరించిన పెన్షన్తో పాటు ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పెన్షన్ వ్యత్యాస బకాయిల మొత్తం రూ.900 కోట్లుగా ఆర్థిక శాఖ లెక్కగట్టింది. తెలంగాణ వాటా బకాయిలు రూ.327 కోట్లుగా అంచనా వేసింది. ఇప్పటివరకు రావాల్సిన బకాయిలను నాలుగు విడతలుగా చెల్లించడంతో పాటు చివరి నెల వేతనం ఆధారంగా సవరించిన కొత్త పెన్షన్ను వెంటనే చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అర్హులైన రిటైర్ ఉద్యోగులందరూ నిర్దేశించిన నమూనాలో రివైజ్డ్ పెన్షన్కు బిల్లులు తయారు చేసి సంబంధిత పెన్షన్ మంజూరీ చేసే అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 15 రోజుల వ్యవధిలో అధికారులు వీటిని పరిశీలించి సవరించిన పెన్షన్ మంజూరీ ఉత్తర్వులు జారీ చేస్తారు. 1998 మే 25కు ముందు రిటైరైన ఉద్యోగులు.. ఆ తర్వాత మరణించి ఉంటే ఆయన కుటుంబీకులు, వారసులకు నిబంధనల ప్రకారం ఈ బకాయిలను చెల్లిస్తారు. కొత్త విధానంలో పెన్షన్ చెల్లించడం వల్ల బకాయిల భారం ప్రతినెలా రూ.10 కోట్లు కానుంది. అసలేం జరిగింది: 1998కు ముందు రిటైరైన ఉద్యోగులకు తమ సర్వీసులో చివరి పది నెలల వేతన సగటు ఆధారంగా పెన్షన్ అందించే విధానం అమల్లో ఉండేది. ఆ తర్వాత ఉద్యోగుల చివరి నెల జీతం ఆధారంగా పెన్షన్ లెక్కగట్టే విధానం అమల్లోకి వచ్చింది. దీంతో తమకు అన్యాయం జరిగిందని.. తమకు అందుతున్న పెన్షన్కు, కొత్త విధానంతో రావాల్సిన పెన్షన్కు వ్యత్యాసముందని అంతకు ముందు రిటైరైన ఉద్యోగులు న్యాయ పోరాటం చేశారు. గతేడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే సుప్రీం తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. రిటైర్డ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఏడాది కాలంగా పట్టుపట్టడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. -
పెన్షనర్లతో చెలగాటం!
పీఆర్సీ సిఫారసుల అమలుపై సర్కారు జాప్యం ⇒ ప్రసుత అదనపు పెన్షన్ విధానానికి గండి కొట్టే యత్నం ⇒ రూ. 327 కోట్ల పెన్షన్ వ్యత్యాస బకాయిలు చెల్లింపులోనూ మీనమేషాలు ⇒ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కనికరించని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లతో రాష్ట్ర సర్కారు చెలగాటమాడుతోంది. పీఆర్సీ సిఫారసులను యథాతథంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించినా వాటి అమలు విషయంలో జాప్యం చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న అదనపు పెన్షన్ విధానానికి గండికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పెరిగిన ఫిట్మెంట్తో పెన్షన్ పెరుగుతుందనుకొని సంబరపడ్డ రిటైర్డ్ ఉద్యోగులు డీలా పడ్డారు. మరోవైపు 1998కు ముందు రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 327 కోట్ల పెన్షన్ వ్యత్యాస బకాయిలను చెల్లించేందుకు కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. వీటిని చెల్లించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయటంలోనూ జాప్యం చేస్తోంది. అదనపు పెన్షన్కు గండి... 75 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పెన్షన్ మంజూరు చేసే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. పెన్షన్లో 15 శాతం అదనపు పెన్షన్గా చెల్లిస్తారు. పదో పీఆర్సీ సైతం 70-75 ఏళ్ల వయసున్న రిటైర్డ్ ఉద్యోగులకు 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని సిఫారసు చేసింది. వయసు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ పెరుగుతుంది. ఒకే హోదాలో పని చేసినప్పటికీ కొన్నేళ్ల కిందట రిటైరైన ఉద్యోగులకు.. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు అందే పెన్షన్లో భారీగా వ్యత్యాసముంటోందని తొమ్మిదో పీఆర్సీ గుర్తించింది. దీన్ని కొంతమేరకైనా తగ్గించేందుకు 75 ఏళ్లు దాటిన రిటైర్డ్ ఉద్యోగులకు వయసు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ ఇవ్వాలని సూచించటంతో ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ విధానాన్ని 70 ఏళ్లకే కుదించాలని పదో పీఆర్సీ సిఫారసు చేసింది. కానీ అందుకు సంబంధించిన వివరణను పొందుపరచలేదు. అదే సాకుగా అదనపు పెన్షన్ల విషయాన్ని ఆర్థికశాఖ దాటవేసింది. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తటంతో 70 ఏళ్ల వయసు నుంచే అదనపు పెన్షన్ మంజూరు చేస్తే ఈ భారం మరింత పెరిగిపోతుందని.. పాత పద్ధతినే అనుసరించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీంతో ఉత్తర్వులు వెలువడే వరకు అదనపు పెన్షన్ పీటముడి వీడేలా లేదని రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలపై మొండి వైఖరి... చివరి 10 నెలల వేతన సగటు ఆధారంగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ అందించే విధానం గతంలో అమల్లో ఉండేది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1998లో ఆ విధానానికి స్వస్తి పలికింది. ఉద్యోగుల చివరి నెల జీతం ఆధారంగా పెన్షన్ లెక్కించే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో తమకు అన్యాయం జరిగిందని, తమకు అందుతున్న పెన్షన్కు, కొత్త విధానంతో రావాల్సిన పెన్షన్కు వ్యత్యాసముందని 1998కు ముందు రిటైరైన ఉద్యోగులు ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. తీర్పు అనుకూలంగా వచ్చినా ప్రభుత్వం లెక్కచేయకపోవటంతో 2003లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పటికీ సర్కారు మొండికేయటంతో రిటైర్డ్ ఉద్యోగులు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. గత ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ వ్యత్యాసానికి సంబంధించిన బకాయిలు చెల్లించాలని.. ఇకపై కొత్త విధానంలోనే పెన్షన్ లెక్కించి ఇవ్వాలని సూచించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ బకాయిల మొత్తం రూ. 900 కోట్లు ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. తెలంగాణ వాటాగా రూ. 327 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దాదాపు 30 వేల మంది లబ్ధి పొందుతారు. ఇప్పట్నుంచి వీరికి కొత్త విధానంలో పెన్షన్ చెల్లించటం వల్ల ప్రతి నెలా మరో రూ.10 కోట్లు భారం పడుతుందని సర్కారు భావిస్తోంది. ఆరు నెలలుగా ఈ ఫైలు సీఎం దగ్గరే పెండింగ్లో ఉంది. -
వలంటీచర్స్
రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తారు. మరికొందరు కృష్ణారామా అంటూ తీర్థయాత్రలు చేస్తారు. కానీ.. అడవికొలను కనకరాజు అందుకు భిన్నం. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేసినా.. వాలంటరీ టీచర్గా మారారు. విశ్రాంత జీవితం గడపాల్సిన సమయంలో పాఠశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఆ సరస్వతీ నిలయం గురించి... - వాంకె శ్రీనివాస్ అడవికొలను కనకరాజు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 1992లో పదవీ విరమణ చేశారు. ఆ రోజు అక్షరాలకు దూరమవుతున్నానన్న ఆవేదనతో వచ్చిన ఆయన కన్నీళ్లను ఆపడం ఎవరితరం కాలేదు. నాలుగు అక్షరాలను నలుగురికీ పంచాలనే తృష్ణ ఉంటే టీచర్ ఉద్యోగమే ఉండాలా? తానెందుకు ఓ పాఠశాల నడిపించగూడదు? అనుకున్న కనకరాజ్ ఎస్ఈఎస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ను ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉన్న పిల్లల దగ్గర విశ్రాంత జీవితం గడిపేందుకు గ్రీన్ కార్డు ఉన్నా.. అక్కడికి వెళ్లడం కంటే పిల్లలకు అక్షరాలు నేర్పడంలోనే అసలైన సంతోషం ఉంటుంది అంటున్నారు కనకరాజు. ఈ ప్రయాణంలో ఆయనకు తోడుగా నిలిచింది భార్య సుందరీ ఇందిర. రిటైర్డ్ టీచరైన ఆమె కూడా ఈ అక్షర యజ్ఞంలో పాలుపంచుకుంటోంది. కాలిఫోర్నియాలో ఉంటున్న ఇద్దరు కొడుకులు వీళ్ల ఆశయానికి అండగా నిలిచారు. నాన్న స్ఫూర్తితో... ‘ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం సంపాదించి.. 40 ఏళ్ల కెరీర్లో సిటీలోని వివిధ స్కూళ్లలో సేవలందించా. రిటైర్మెంట్ తరువాత పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యనందించేందుకే పాఠశాలను ప్రారంభించా. చాలా ఏళ్ల క్రితం మా నాన్న దివంగత శేషగిరిరావు ఏర్పాటు చేసిన ఎస్వీఈఎస్ తెలుగు మీడియం స్కూల్... తరువాత డిగ్రీ కాలేజీగా మారింది. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దింది. నా ఈ స్కూల్ ఏర్పాటు వెనుక ఆయన స్ఫూర్తి ఉంది’ అని గర్వంగా చెబుతారు కనకరాజు. కులమతాలతో సంబంధం లేకుండా... పెద్ద మొత్తంలో డొనేషన్లు చెల్లించలేని పేద పిల్లలను స్కూల్లో చేర్చుకుంటున్నారు. 2001లో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ పాఠశాల ప్రస్తుతం 250 మంది విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తోంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తోంది. డొనేషన్లు లేకుండా... తొలినాళ్లలో నెలకు రూ.50 ఫీజు మాత్రమే తీసుకునేవారు. 2006 నుంచి పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్నారు. ‘మొదట పేరెంట్స్ను కన్విన్స్ చేయడం కష్టమైంది. వాళ్లను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. అయితే ఫైనల్గా వారు పాజిటివ్గా స్పందించి పిల్లలను బడికి పంపించారు. అలా ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు ఎంతోమంది విద్యార్థులు చదవుతుండడం సంతోషంగా ఉంది. నా ఇద్దరు కుమారులు కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. అక్కడికెళ్లినప్పుడు ఆశా ఎస్వీ వాళ్లతో ఏర్పడిన పరిచయం మా స్కూల్కు ఆర్థిక సహాయం చేసే వరకు వచ్చింది. అలా మా సేవను హైదరాబాద్కు వచ్చి ప్రత్యేకంగా వీక్షించిన వారు ఫండింగ్ చేశారు. ఇప్పుడు మాత్రం లోకల్ మెంబర్స్ సహకారాన్ని తీసుకుంటున్నామ’ని చెబుతున్నారు కనకరాజు దంపతులు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న మరికొంత మంది రిటైర్డ్ టీచర్స్ మీనాక్షి, రాణి ప్రమీల, కె.రాజ్గోపాల్, వాసుదేవరావులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ స్కూల్లో భాగస్వామయినందుకు సంతోషంగా ఉందంటున్నారు వాలంటరీగా పనిచేస్తున్న సాయిలత. అన్నింటిపై దృష్టి... ‘ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెడతాం. వారు వీక్గా ఉన్న సబ్జెక్ట్లను గుర్తించి ప్రత్యేక తరగతులు తీసుకుంటాం. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించేలా పక్కా ప్రణాళిక ఉంది. ప్రతి నెలా పేరెంట్, స్టాఫ్ మెంబర్స్తో ఇంటారాక్టివ్ సెషన్ నిర్వహిస్తాం. ఇలా చేయడం వల్ల విద్య ప్రాధాన్యతని పేరెంట్స్కి చెబుతూనే... వారి నుంచి ఏమైనా సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. మాణిక్యాల్లాంటి విద్యార్థులను వెలికి తీసేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం’ అని అంటున్నారు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ దేవులపల్లి విజయ్. -
రిటైర్డు ఉద్యోగులపై తెలంగాణ ప్రభుత్వ అలక్ష్యం
సందర్భం తొమ్మిది మాసాల కిందట ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ప్రచారంలోకి వచ్చింది. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం స్నేహపూర్వక వైఖరిని ప్రదర్శిస్తుందని సీఎం కేసీఆర్ పలు సంద ర్భాలలో ప్రకటించారు. అయితే, అనేక ఏళ్ల శ్రమ, సేవ అనంతరం పదవీ విరమణ చేసిన తెలంగాణ రాష్ట్రంలోని రెండున్నర లక్షల మంది రిటైర్డ్ ఉద్యో గుల పట్ల మాత్రం కనీస సానుభూతి ప్రదర్శితం కాకపోవడం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైరయ్యే మాసం వేతనంలో సగభాగాన్ని పెన్షన్గా నిర్ధారించాలని నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998 మే నెల 25వ తేదీన ఒక జీఓను (జీఓఎంఎస్ నం. 87) జారీ చేసింది. 1998 మే నెల 25వ తేదీకి ముం దు రిటైరైన వారికి కూడా ఈ జీవో వర్తింపచేసి పెన్షన్ నిర్ధారించాలని రిటైర్డ్ ఉద్యోగులు 1998 నవంబర్ 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. ఈ విజ్ఞప్తిని నాటి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిం చింది. దీంతో రిటైర్డు ఉద్యోగుల సంఘం ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో అప్పీలు చేసింది. ఈ అప్పీలును అంగీకరిస్తూ, సమర్థిస్తూ ట్రిబ్యునల్ 2002 జనవరి 3వ తేదీన తీర్పు ఇచ్చిం ది. ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా నాటి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. ఈ అప్పీ లును హైకోర్టు కొట్టివేసింది. 1998 మే నెల 25 నాటి జీఓ 87ను ఆ రోజు వరకు జీవించి ఉన్న రిటై ర్డు ఉద్యోగులందరికీ లేక వారి కుటుంబాల్లోని ఫ్యా మిలీ పెన్షనర్లకు 3 నెలల లోపున వర్తింపచేయాలని, సవరించిన వేతనాల బకాయిలను కూడా చెల్లించా లని ఏపీ హైకోర్టు 2003 డిసెంబర్ 23వ తేదీన స్పష్టమయిన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును కూడా సవాలు చేస్తూ నాటి ఏపీ ప్రభుత్వం 2004 మే 2వ తేదీన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. 2005 ఫిబ్ర వరిలో ఈ స్పెషల్ పిటిషన్పై విచారణ ప్రారంభ మైంది. పదేళ్లపాటు విచారణ సాగి విపరీత జాప్యం తరువాత సుప్రీంకోర్టు 2014 ఏప్రిల్ 30వ తేదీన అవిభక్త ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నాటికి (2014 ఏప్రిల్ 30) ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ జరుగుతున్నది. అప్పుడు రాష్ట్రం లో గవర్నర్ పాలన నడుస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు ను వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం 2014 మే నెలలో రాష్ట్ర గవర్నర్కు విజ్ఞప్తి పత్రాలను సమర్పిం చింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు పరచాలని అభ్యర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సం ఘం 2014 జూలై 8వ తేదీన కేసీఆర్కి ఒక విజ్ఞప్తి పత్రం సమర్పించింది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేదని వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిం ది. ఈ పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు విచారణ ప్రారం భించకముందే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ను అమలు జరపడానికి 2014 డిసెంబర్ 15వ తేదీన జీఓను జారీ చేసింది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలైనప్పటికి సుప్రీంకోర్టు తీర్పు అమలుకు జీఓ జారీ చేయలేదు. 1998 మే 25వ తేదీ న 87 జీవో వెలువడే నాటికి తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఖ్య 58,140. తరు వాత 28 ఫిబ్రవరి 2014 నాటికి వీరిలో 28,517 మంది మృతిచెందారు. ఈరోజు వీరిలో జీవించి ఉన్నవారి సంఖ్య 30 వేలకు మించదు. తెలంగాణ రిటైర్డు ఉద్యోగులందరు మొదట విద్యార్థులుగా ఉన్నప్పుడు, తరవాత 1969-71 తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, ఆ తరువాత 2001 నుంచి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నారన్నది జగద్విదితం. తెలం గాణ ప్రభుత్వం ఇంతవరకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేదు, సర్వీసు ఉద్యోగులకు ఇచ్చిన తెలంగాణ ఇంక్రిమెంట్ను రిటైర్డు ఉద్యోగులకు ఇవ్వలేదు. రెండున్నర లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వ అనాద రణ, అలక్ష్య ధోరణిపై రిటైర్డు ఉద్యోగులలో అసం తృప్తి తీవ్రమవుతున్నది. (వ్యాసకర్త అధ్యక్షులు తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్) మొబైల్: 94414 55412 -
తెలంగాణకు భారీ మిగులు
* కేంద్ర పన్నుల వాటా లేకున్నా ఢోకా లేదు * కేంద్రం వాటా చేరితే 4 రెట్ల మిగులు * 2020 నాటికి రూ.34,252 కోట్ల మిగులు ఆదాయం * 14వ ఆర్థిక సంఘం నివేదికలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మిగులు ఆదాయానికి ఢోకా లేదు. రెవెన్యూ ఆదాయం... వ్యయాల ఆధారంగా అయిదేళ్ల తర్వాత తెలంగాణలో రూ. 34,252 కోట్ల మిగులు ఆదాయం ఉంటుందని ఆర్థిక సంఘం లెక్కగట్టింది. అలాగే 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.15,003 కోట్ల మిగులు ఉంటుందని అంచనా వేసింది. ఏటేటా మిగులు ఆదాయం దాదాపు 20 శాతం చొప్పున పెరుగుతుందని లెక్కలేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా రాకున్నా తెలంగాణలో మిగులు ఆదాయమే ఉంటుందని.. రెవెన్యూ ఆదాయం సమృద్ధిగా ఉంటుందని 14వ ఆర్థిక సంఘం నివేదిక తేటతెల్లం చేసింది. ఈ నివేదికలో రాష్ట్రాల వారీగా రాబోయే అయిదేళ్లకు సంబంధించిన రెవెన్యూ ఆదాయ, వ్యయాల వివరాలను పొందుపరిచింది. దీని ప్రకారం కేంద్రం ఇచ్చే పన్నుల వాటా లేకుండానే... తెలంగాణ రాష్ట్రానికి 2015-16 సంవత్సరంలో రూ. 818 కోట్ల మిగులు ఆదాయం ఉంటుంది. అయిదేళ్ల తర్వాత రూ. 8,902 కోట్లకు చేరుతుంది. రూ. 3.9 లక్షల కోట్లకు పైగా ఆదాయం.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని పన్నులు... పన్నేతర రాబడుల ద్వారా రాబోయే అయిదేళ్లలో తెలంగాణకు రూ. 3,91,256 కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరుతుంది. అదే సమయంలో రెవెన్యూ వ్యయం రూ.3,69,284 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం పన్నుల వాటాతో సంబంధం లేకుండా సొంతంగా రాష్ట్రంలో సమకూరే రాబడి.. ఖర్చుల వివరాలను అందులో పొందుపరిచింది. అధిక మొత్తం వడ్డీలకే.. ఇదిలా ఉండగా, ఏళ్లకేళ్లుగా ఉన్న అప్పుల భారం తెలంగాణను వెంటాడుతోంది. గతంలో ఉన్న అప్పులకు చెల్లించే వడ్డీలకే ప్రభుత్వం ఏటా వేలాది కోట్లు కుమ్మరించక తప్పని పరిస్థితి నెలకొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.7,057 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2019-20 నాటికి ఈ వడ్డీల భారం రూ.12,869 కోట్లకు చేరనుంది. దీంతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్లకు భారీగానే ఖర్చు అవుతుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనికోసం రూ.8,686 కోట్లు చెల్లించాల్సి వస్తుందని.. 2019-20 నాటికి పెన్షన్ల భారం రూ.12,969 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. -
‘ఎన్నెస్పీ’ స్పీడు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగర నడిబొడ్డున గల ఎన్నెస్పీ భూముల విక్రయ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. నెల రోజుల క్రితం ఖమ్మంలోని ఎన్నెస్పీ కాలనీలో గల భూములను విక్రయించాలని భావించిన అధికారులు దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి పంపే పనిలో నిమగ్నమయ్యారు. ఈ భూములను ఏ విధంగా ఎవరికి విక్రయించాలనే అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఇప్పటి వరకు విధి విధానాలు ఖరారు కానప్పటికీ ఎన్నెస్పీ అధికారులు మాత్రం క్షేత్రస్థాయి నివేదికలను సిద్ధం చేసి, భూముల విక్రయానికి అవసరమైన నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. ఎన్నెస్పీ క్యాంప్లో ‘ఏ’ నుంచి ‘ఎఫ్’ టైపు వరకు గల దాదాపు 450 క్వార్టర్లలో ఇప్పటి వరకు ఎవరెవరు నివసిస్తున్నారు.. ఎవ రి పేరుతో క్వార్టర్ కేటాయించారు.. అందులో నడుస్తున్న సేవా సంస్థలు, నివసిస్తున్న ప్రజాప్రతినిధులు.. వారు చెల్లించాల్సిన అద్దె బకాయిలు వంటి పూర్తి వివరాలను ఎన్నెస్పీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు క్వార్టర్లు కేటాయించారని, వారు సక్రమంగానే అద్దె చెల్లిస్తున్నందున పెద్దగా బకాయిలు లేవని నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నెస్పీ భూముల విక్రయానికి నిర్ణయం తీసుకుంటే.. ప్రస్తుతం క్వార్టర్లలో ఉన్న వారికే తొలి ప్రాధాన్యం దక్కేలా నివేదిక రూపొందించినట్లు ఉందని కొందరు రిటైర్డ్ ఉద్యోగులు, మరికొందరు ఎన్నెస్పీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రిటైర్డ్ అధికారుల ఆధీనంలో న్యూ క్యాంప్ కాలనీలో 11 ‘సి’ టైపు క్వార్టర్లు, 71 ‘డి’ టైపు క్వార్టర్లు, 77 ‘ఇ’ టైపు క్వార్టర్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఓల్డ్ క్యాంప్ కాలనీలో సైతం టైప్ల వారీగా రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, రాజకీయ నేతలు ఎవరెవరు ఉంటున్నది సమగ్రంగా వివరించారు. అయితే రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఈ భూములను విక్రయిస్తే వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారా.. లేదా అనే అంశం మాత్రం ప్రభుత్వ స్థాయిలో తేల్చాల్సి ఉంది. ఈ కాలనీలో 7 ప్రైవేట్సంస్థలు, 22 మంది ప్రైవేట్ వ్యక్తులు, నాలుగు ప్రభుత్వ కార్యాలయాలు, 37 మంది ఇతర శాఖలకు సంబంధించిన వారు, 77 మంది ఎన్నెస్పీ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ఉన్న క్వార్టర్లలో 54 పూర్తిగా శిథిలమైనట్లు నివేదించిన అధికారులు దాదాపు 237 క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కాగా, ఎన్నెస్పీ భూములను విక్రయించడం దాదాపు ఖాయమన్న భావన కలిగించేలా ఈ నివేదిక ఉండటంతో ఆ భూములను సేవా రూపంలో కాజేసేందుకు బడాబాబుల అండదండలున్న కొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. -
నేటి నుంచి ఈ-పేమెంట్స్
సాక్షి, కాకినాడ : ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్డు ఉద్యోగుల పింఛన్లతో పాటు ఇతర చెల్లింపులన్నీ సోమవారం నుంచి ఆన్లైన్లోనే జరగనున్నాయి. సెప్టెంబర్ జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులతో ఈ ప్రక్రియకు జిల్లాలో శ్రీకారం చుడుతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 57,674 మంది ఉద్యోగులు, 38,223 మంది పింఛన్దారులున్నారు. వీరందరికీ సంబంధిత శాఖల నుంచి ప్రతి నెలా 20 కల్లా డీడీఒలు జీతభత్యాలు, పింఛన్ బిల్లులు తయారు చేసి ట్రెజరీకి పంపేవారు. ఖజానా సిబ్బంది ఆడిట్ చేసి బ్యాంకులకు షెడ్యూళ్లు సమర్పిస్తే వారు ఉద్యోగుల ఖాతాలకు సొమ్ము జమచేసేవారు. ఈ ప్రక్రియ కోసం 20 నుంచికసరత్తు చేస్తే తప్ప ప్రతి నెలా మొదటి వారానికి వారి ఖాతాల్లో సొమ్ములు జమయ్యేవి కావు. సోమవారం అమలులోకి వస్తున్న ఈ-పేమెంట్స్ విధానంలో బ్యాంకుల ప్రమేయం ఉండబోదు. ట్రెజరీ నుంచే నేరుగా ఉద్యోగులు, పింఛన్దారుల ఖాతాలకు సొమ్ము జమవుతుంది. దీని వల్ల ప్రతి నెలా ఒకటినే ఠంచన్గా జీతభత్యాలతో పాటు పింఛన్ల మొత్తం కూడా వ్యక్తిగత ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా గత ఏప్రిల్లోనే కాకినాడలోని జిల్లా ట్రెజరీ ప్రధాన కార్యాలయం పరిధిలోకి వచ్చే ప్రభుత్వశాఖల్లో అమలు చేయనారంభించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు 010 పద్దు ద్వారా వేతనాలు పొందుతున్న అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తింపచేశారు. ఏప్రిల్ నుంచి జిల్లాలో సుమారు 10 వేల మంది ఉద్యోగులకు ఈ- చెల్లింపులు జరుగుతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలోని 18 సబ్ ట్రెజరీ కార్యాలయాల పరిధిలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. జీతభత్యాలు, పింఛన్లే కాక ప్రభుత్వ శాఖల పరిధిలో జరిగే ఇతర ఖర్చులు కూడా ఈ- చెల్లింపుల ద్వారానే జరుగుతాయి. జిల్లాలో ప్రస్తుతం ప్రతి నెలా జీతభత్యాల కింద రూ.180 కోట్లు, పింఛన్ల కింద రూ.80 కోట్ల చెల్లింపులు జరుగుతున్నాయి. ఇతర ఖర్చులు (అద్దెలు, విద్యుత్, టెలిఫోన్, స్టేషనరీ తదితరాలు) మరో రూ.50 కోట్ల వరకు ఉంటాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి ఇవన్నీ ఈ-పేమెంట్స్ ద్వారా జరపనున్నారు. స్థానిక సంస్థలైన జెడ్పీ, మండల పరిషత్, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో చెల్లింపులు మాత్రం ప్రస్తుతానికి పాతపద్ధతిలోనే జరుగుతాయి. వీటిని కూడా రెండు మూడు నెలల్లో ఈ- పేమెంట్స్ కిందకు తీసుకొచ్చే కసరత్తు జరుగుతోందని జిల్లా ఖజానాధికారి అధికారి లలిత ‘సాక్షి’కి తెలిపారు. -
రిటైరైనా.. కొలువులు పదిలం!
కొత్తగూడెం: వారు సింగరేణిలో అత్యున్నత స్థాయిలో పదవులు చేపట్టి ఉద్యోగ విరమణ చేసినవారు. అయినా వారి కొలువులు మాత్రం భద్రంగానే ఉంటున్నాయి. పాతవారి స్థానంలో కొత్తవారిని నియమించాల్సిన సంస్థ.. రిటైర్డ్ అధికారుల సేవలను మాత్రం వదులుకోవడం లేదు.. దీంతో రిటైర్ అయ్యాక కూడా వారికి లక్షల రూపాయల వేతనాలు అందుతున్నాయి. ఉద్యోగ విరమణ పొందిన వారి స్థానంలో కొత్తవారిని నియమించి నిరుద్యోగులకు భృతి కల్పించాల్సిన సింగరేణి యాజమాన్యం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సింగరేణి సంస్థలో అత్యున్నత జీఎంస్థాయి పోస్టుల్లో రిటైరైన అధికారుల సేవలను ఆ తర్వాత కూడా వినియోగించుకుంటున్నారు. దీంతో ప్రతి నెలా సంస్థపై రూ.3 కోట్ల మేరకు భారం పడుతోంది. కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా రిటైర్డ్ అధికారుల సేవలనే వినియోగించుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొత్త కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలు అడియాశలే అవుతున్నాయి. 14 మంది అధికారులు.. రూ. 3 కోట్ల ఖర్చు ప్రస్తుతం సింగరేణిలో 14 మంది రిటైర్డ్ అధికారులు పనిచేస్తున్నారు. వీరి సేవలకు గాను ఒక్కొక్కరికి నెలకు రూ.50 వేల నుంచి లక్ష వరకు సంస్థ చెల్లిస్తోంది. దీంతోపాటు టీఏ, డీఏ ఖర్చులు కలుపుకొని ప్రతి నెలా రిటైర్డ్ అధికారుల సేవలకు రూ.3 కోట్ల ఖర్చవుతోంది. ఈ మొత్తంతో ఎంతోమందికి ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. అయినా యాజమాన్యం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఇప్పటికే 14 మంది సేవలను వినియోగించుకుంటున్న సింగరేణి.. కొద్ది రోజుల్లో రిటైరయ్యే మరికొందరి సేవలను కూడా తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త ఉద్యోగాల కల్పనకు గండిగా మారిన ఈ పద్ధతిని వ్యతిరేకించేందుకు సింగరేణి జేఏసీ సమాయత్తమవుతోంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని సింగరేణి జేఏసీ కన్వీనర్ డాక్టర్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం ఈ విషయంపై దృష్టి సారించి కొత్తవారికి ఉపాధికి అవకాశం కల్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. -
పెన్షన్ టెన్షన్
* ఏళ్ల తరబడి డీఆర్ను ఎగవేసిన బాబు * ప్రతిపక్షంలోనైనా కూర్చుంటా... * కానీ పెన్షనర్ల డిమాండ్లు నెరవేర్చేది లేదంటూ మొండి వైఖరి * వైఎస్ హామీతో ఎన్నికల ముందు హడావుడిగా జీవోలు 2003 ఆగస్టు 15.. కొత్తగూడెంలోని ఆర్డీఓ కార్యాలయం... పెన్షనర్ కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు... కారణం: ఏళ్ల తరబడి కరవు భత్యం (డీఆర్) ఎగవేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై నిరసన వయసుడిగిన దశలో మరో జీవనాధారం లేని లక్షలాది విశ్రాంత ఉద్యోగులకు భరోసా ఏది? రోగానికీ, నొప్పికీ, ఆకలికీ... అన్నింటికీ ఆసరా ఏది? ...పెన్షన్! కానీ ఆ పెన్షన్ను కూడా ప్రభుత్వం సరిగ్గా ఇవ్వకపోతే...? ఏళ్ల తరబడి కరవు భత్యమూ (డీఆర్) ఇవ్వకపోతే...? డీఆర్ బకాయిలనూ సైతం ఎగ్గొడితే..? పనికొచ్చినన్నాళ్లూ వారి చేత యంత్రాల్లా పనిచేయించుకున్న ప్రభుత్వమే... రిటైరయ్యాక కరివేపాకుల్లా వదిలేస్తే..? పెన్షనర్లు జీవితం నుంచే రిటైరైపోతే... ఆ ఫ్యామిలీ పెన్షన్లపై ఆధారపడే కుటుంబాలను పట్టించుకునేదెవరు..? 2001 నుంచి 2003 దాకా... నాటి చంద్రబాబు ప్రభుత్వం పెన్షనర్ల పట్ల అమానుషంగా వ్యవహరించింది. చింతకింది గణేష్: ఓటర్లుగా కాదు, కనీసం మనుషులుగానైనా గుర్తించలేదు. అదేమంటే... ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా ఎప్పుడు పనిచేశారంటూ గద్దించారు. అవసరమైతే ప్రతిపక్షంలోనైనా కూర్చుంటాను గానీ జీవిత చరమాంకంలో ఆర్థికభరోసా కోసం ఉద్యమించే పెన్షనర్ల డిమాండ్లను నెరవేర్చేది లేదంటూ మొండికెత్తారు. దాదాపు 4.5 లక్షల మంది పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు అష్టకష్టాలను తట్టుకోలేక ఆందోళనలకు దిగారు. రోడ్డెక్కారు. ఉద్యమించారు. 2003 డిసెంబరు దాకా ఆదుకునే నాథుడే లేకుండా పోయాడు. ఎడాపెడా ఉద్యోగుల తొలగింపు, వయోపరిమితి కుదింపు, ప్రభుత్వ సంస్థల మూసివేత, ప్రైవేటీకరణ, కొత్త ఉద్యోగాలపై నిషేధం వంటి ఉద్యోగవ్యతిరేక చర్యలకు తోడు.. పెన్షనర్ల పట్ల కూడా అమానవీయంగా ప్రవర్తించిన ప్రభుత్వ వైఖరి ఉద్యోగవర్గాన్ని తీవ్రంగా కలచి వేసింది. వరుసగా ఐదు విడతల డీఆర్ కూడా ఎగ్గొట్టిన తీరు విమర్శలకు కారణమైనా బాబు సర్కారు పట్టించుకోలేదు. ఆనాడు అంతటి అమానుషానికి ఒడిగట్టిన చంద్రబాబే... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతభత్యాలు ఇస్తామనీ, వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతామనీ నమ్మబలుకుతున్నారు! వైఎస్ వచ్చాకే భరోసా! డీఆర్ పెంపు, బకాయిల చెల్లింపుపై విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబాలు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే డీఆర్ విడుదల చేస్తామంటూ స్పష్టంగా ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో ఓడిపోతాననే భయం, ఎన్నికలయ్యాక చూసుకోవచ్చులే అనే భావనతో 2004 ఫిబ్రవరిలో డీఆర్ ఇచ్చేందుకు చంద్రబాబు ముందుకొచ్చారు. ఎన్నికల ముందు (2004 ఫిబ్రవరి 21న...) జీఓ 156 జారీ చేశారు. 2004 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి అదే ఏడాది అన్నమాట ప్రకారం ఆగస్టు 9న (జీఓ నంబర్ 591) ద్వారా పెన్షనర్ల డీఆర్ను విడుదల చేశారు. ప్రతిపక్షంలోనైనా కూర్చుంటానన్నారు డీఆర్ కోసం అనేక ఆందోళనలు చేశాం. పెన్షనర్ల సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి, 2002లో జేఏసీని ఏర్పాటు చేసి పోరాటాలు చేశాం. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రభుత్వంతో జేఏసీకి జరిగిన ఓ సమావేశంలో ‘నేను ప్రతిపక్షంలోనైనా కూర్చుంటా కాని పెన్షనర్లకు డీఆర్ ఇచ్చే ప్రసక్తేలేద’న్నారు. అప్పట్లో వచ్చిన కొత్త పీఆర్సీ ప్రకారం పెన్షన్ను 1-7-1998 నుంచి అమలు చేయ కుండా 1-4-1999 నుంచి అమలు చేశారు. దీంతో 9 నెలల ఎరియర్స్, గ్రాట్యుటీ నష్టపోవాల్సి వచ్చింది. - విశ్వాస్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు ఓటమికి ఇదీ ఓ కారణమే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి పెన్షనర్లకు డీఆర్ ఇవ్వకపోవడం కూడా ఒక కారణమే. పెన్షనర్లు పని చేయడం లేదు కాబట్టి కరువు భత్యం ఇవ్వాల్సిన అవసరం లేదనే సిద్ధాంతాన్ని తెచ్చారు. దాంతో ఆయనపై ఉద్యోగ, పెన్షనర్లలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. - ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్ హడావుడిగా జీఓలు డీఆర్ నిలిపివేయడంతో చంద్రబాబు ప్రభుత్వంపై పెన్షనర్లలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పెన్షనర్లకు డీఆర్ వెంటనే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు హడావుడిగా జీఓలు ఇచ్చారు. - ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి