Safari
-
బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం
బెంగళూరు: బన్నెర్ఘట్టలోని నేషనల్ పార్క్లో పర్యాటకులకు ఊహించని ఘటన ఎదురైంది. చిరుత ఒకటి సఫారీ బస్సు కిటికీ గుండా ఎక్కడానికి ప్రయతి్నంచడంతో పర్యాటకులంతా కేకలు వేశారు. మొదట భయపడ్డా.. తరువాత దాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కొద్దిసేపు ప్రయత్నించిన చిరుత.. ఆ తరువాత ప్రయత్నాన్ని విరమించుకుని నెమ్మదిగా తన ఆవాసం వైపు నడుచుకుంటూ వెళ్లింది. ఆదివారం జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వన్యప్రాణులను దగ్గరగా చూసేందుకు సఫారీ డ్రైవర్ ముందుకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. సఫారీ వాహనాలన్నింటికీ మెష్ విండోస్ ఉన్నాయని, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు. Come, let's meet face-to-face. 🐆 A leopard at Bannerghatta National Park recently jumped onto the window of a jungle safari bus, creating a moment of both awe and fear for the passengers inside. The wild cat’s sudden appearance startled everyone, as it leaped onto the bus… pic.twitter.com/YqDI265CS2— Karnataka Portfolio (@karnatakaportf) October 6, 2024 -
ఫోటో సరదా ప్రాణం తీసింది : కాబోయే భార్య కళ్లముందే విషాదం!
దక్షిణాఫ్రికాలోని ఒక నేషనల్ పార్క్లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. స్పానిష్ పర్యాటకుడు ఒకరు ఏనుగుల గుంపు దాడిలో దుర్మరణం పాలయ్యాడు. పిలాన్స్బర్గ్ జాతీయ ఉద్యానవనానికి సఫారీకి వెళ్లిన సందర్భంగా ఆదివారం ఈ ఘటన జరిగింది.అధికారుల సమాచారం ప్రకారం 43 ఏళ్ల స్పానిష్ టూరిస్ట్ తన కాబోయే భార్య, మరో ఇద్దరితో కలిసి జాతీయ ఉద్యానవనంలో విహరి స్తున్నాడు. ఇంతలో ఏనుగుల గుంపును చూసిన అతడు వాహనం నుంచి బయటికి వచ్చి మరీ ఫోటోలు తీయాలని సరదా పడ్డాడు. అంతే ఒక్కసారిగా మూడు పెద్ద ఏనుగులు దాడికి దిగాయి. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన పిల్ల ఏనుగులకు హాని చేస్తున్నాడనే ఆగ్రహంతోనే పెద్ద ఏనుగు దాడికి దిగిందని, దీంతో మిగతావి కూడా ఎటాక్ చేశాయని పర్యాటక శాఖ ప్రతినిధి పీటర్ నెల్ మీడియాకు తెలిపారు. రెండు ఇతర వాహనాలలో ఉన్నతోటి పర్యాటకులు హెచ్చరించినప్పటికీ , పట్టించు కోలేదని, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిందని నార్త్ వెస్ట్ పార్క్స్, టూరిజం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ ఉండే అడవి జంతువుల దగ్గరకు వెళ్లకూడదనీ, వాహనం నుండి దిగి ఫోటోలు తీసే ప్రయత్నం చేసినా, సెల్ఫీలు తీసుకున్నా, ప్రమాదానికి దారితీస్తాయని స్థానికులు వెల్లడించారు. -
దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచంలోని టాప్ టెక్ దిగ్గజ కంపెనీల మధ్య ఒప్పందం జరిగినట్లు కోర్టు పత్రాల ద్వారా బట్టబయలైంది. యాపిల్ సఫారి బ్రౌజర్లో గూగుల్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్గా ఉండటానికి 2022లో 20 బిలియన్ డాలర్లు(రూ.1.66లక్షల కోట్లు) చెల్లించినట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్. తెలిపింది. గూగుల్కు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన యాంటీట్రస్ట్ దావాలో ఈ విషయం వెలుగుచూసింది.ఆన్లైన్ ప్రకటనల ఆదాయం కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్ కోర్టులో గతంలో యాంటీట్రస్ట్ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కేసులో రెండు టెక్ దిగ్గజాల మధ్య ఒప్పందం జరిగినట్లు ఇటీవల తేలింది. విచారణ జరుపుతున్న న్యాయ శాఖ ఏడాది చివర్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.ఇటీవల జరిగిన విచారణలో రెండు కంపెనీల మధ్య ఒప్పందం జరిగిందని ధ్రువీకరించాయి. ఇందుకోసం జరిగిన చెల్లింపుల మొత్తాన్ని బహిర్గతం చేయకుండా చూడాలని భావించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కోర్టు విచారణలో నంబర్లు వెల్లడించకుండా ఈ ఒప్పందానికి గూగుల్ ‘బిలియన్లు’ చెల్లించినట్లు యాపిల్ చెప్పింది. యాపిల్ డిఫాల్ట్ బ్రౌజర్గా ఉన్నందుకు సెర్చ్ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 36 శాతం గూగుల్ యాపిల్కు చెల్లిస్తున్నట్లు తెలిసింది.కోర్టు పత్రాల వల్ల యాపిల్కు వస్తున్న ఆదాయమార్గాల గురించి కూడా స్పష్టత వచ్చినట్లయింది. 2020లో యాపిల్ నిర్వహణ ఆదాయంలో దాదాపు 17.5 శాతం గూగుల్ నుంచి సమకూరిందేనని అంచనా. గూగుల్ డిఫాల్ట్ ఒప్పందాల్లో యాపిల్ డీల్ అత్యంత ముఖ్యమైంది. యూఎస్లో అధికంగా ఉపయోగించే స్మార్ట్ఫోన్ సెర్చ్ ఇంజిన్ సఫారి బ్రౌజర్ కావడంతో గూగుల్కు ఈ ఒప్పందం ప్రధానంగా మారింది. 2002లో సఫారీ బ్రౌజర్లో గూగుల్ను ఉచితంగా ఉపయోగించేందుకు యాపిల్ మొదట అంగీకరించింది. కానీ సెర్చ్ ప్రకటనల ఆదాయం పెరుగుతున్న కొద్దీ దాన్ని ఇరు కంపెనీలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. మే 2021 నాటికి సఫారి బ్రౌజర్లో డిఫాల్ట్ సెర్చ్ఇంజిన్ కోసం యాపిల్కు నెలకు 1 బిలియన్ డాలర్లు(రూ.8300 కోట్లు) కంటే ఎక్కువే చెల్లించిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.ఇదీ చదవండి: బేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లుసెర్చ్ ఇంజిన్లో గూగుల్తో పోటీపడుతున్న బింగ్ను యాపిల్ డిఫాల్ట్బ్రౌజర్గా ఉండేలా చూడాలని మైక్రోసాఫ్ట్ సంస్థ చాలానే ప్రయత్నించింది. కోర్టులో దాఖలైన పత్రాల ప్రకారం..సఫారీలో బింగ్ను డిఫాల్ట్గా ఉంచడానికి కంపెనీ తన ప్రకటనల ఆదాయంలో 90 శాతం యాపిల్కు ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధ పడింది. -
టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ విడుదల.. కర్వ్ వచ్చే ఏడాదే..
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ రెండేళ్లలో మరో రెండు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) భారత్లో ప్రవేశపెడుతోంది. వీటిలో కర్వ్, సియెరా మోడళ్లు ఉన్నాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర వెల్లడించారు. వీటి చేరికతో కంపెనీ ఎస్యూవీ శ్రేణికి మరింత బలం చేకూరుతుందన్నారు. ఎస్యూవీలైన హారియర్, సఫారి కొత్త వర్షన్స్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హారియర్, సఫారి కొత్త వర్షన్స్ గ్లోబల్ ఎన్సీఏపీ నుంచి అత్యుత్తమ భద్రతా రేటింగ్స్ను పొందాయి. 5–స్టార్ సేఫ్టీ రేటింగ్తో భారతీయ కంపెనీలకు చెందిన వాహనాల్లో అత్యధిక స్కోర్తో టాటా ఎస్యూవీలు ఇక్కడి రోడ్లపై అత్యంత సురక్షితమైన మోడళ్లుగా ఉన్నాయి’ అని వివరించారు. ఎక్స్షోరూంలో హారియర్ కొత్త వర్షన్ రూ.15.49 లక్షలు, సఫారి రూ.16.19 లక్షల నుంచి ప్రారంభం. ఎస్యూవీ విభాగంలో పోటీ.. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ దేశీయ ప్యాసింజర్ వాహనాల (పీవీ) వృద్ధిని నడిపిస్తున్నాయి. సియామ్ గణాంకాల ప్రకారం మొత్తం పీవీల్లో ఎస్యూవీల వాటా ఏకంగా 60 శాతానికి చేరింది. చాలా కాలంగా ఎస్యూవీ విభాగంలో అగ్ర స్థానంలో ఉన్నామని శైలేష్ తెలిపారు. పంచ్, నెక్సన్ సెగ్మెంట్ లీడర్లుగా ఉన్నాయని వెల్లడించారు. హారియర్, సఫారి ద్వయం ఇవి పోటీ పడుతున్న విభాగంలో రెండవ స్థానంలో ఉన్నాయని చెప్పారు. ‘ఇతర కంపెనీలు కొన్ని కొత్త మోడళ్లను విడుదల చేశాయి. ర్యాంకింగ్ మారుతూనే ఉంటుంది. ఇక్కడ నంబర్ వన్ అనేది స్పష్టంగా లేదు. ఈ సెగ్మెంట్లో తీవ్ర పోటీ ఉండబోతోంది. మొదటి మూడు–నాలుగు కంపెనీల అమ్మకాల వ్యత్యాసం కొన్ని వేల యూనిట్లు మాత్రమే. ఏదో ఒక సమయంలో ఎవరైనా నంబర్ వన్ అవుతారు. కొన్నిసార్లు మరొకరు నంబర్ టూ అవుతారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మా వద్ద ఉన్న నాలుగు ఎస్యూవీల్లో మేము అద్భుత పనితీరును కనబరుస్తున్నాము’ అని తెలిపారు. -
రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం
సెప్టెంబర్లో నెలలో ఓ వారం రోజుల పాటు శ్రీలంకలో పర్యటించే అవకాశం వచ్చింది. నేను చూసిన శ్రీలంకకు అక్షరరూప పరంపర ఇది. మొదట మదుగంగలో రివర్ సఫారీ మదుగంగ... ఈ నది శ్రీలంక దీవిలో ప్రవహిస్తోంది. బాల్పిటియా అనే చిన్న పట్టణం నుంచి ఈ నదిలో రివర్ సఫారీ చేయవచ్చు. ఈ ప్రదేశం కొలంబో– గాలే హైవేలో వస్తుంది. బెన్తోట నుంచి అరగంట ప్రయాణ (18 కి.మీలు) దూరంలో ఉంది బాల్పిటియా. ఇక్కడ మదుగంగ నది విశాలమైన సరస్సును తలపిస్తూ ఉంటుంది. నీరు నిశ్చలంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం నుంచి పడవలో ప్రయాణం మొదలు పెడితే ఒకటిన్నర గంట నదిలో విహరించవచ్చు. నది మధ్యలో ఉన్న దీవులను చుట్టిరావచ్చు. మధ్యలో బుద్ధుడి విగ్రహాన్ని, వినాయకుడి మందిరాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఇది ప్రకృతి రమణీయతను, మాన్గ్రోవ్ (మడ అడవులు) బారులను చూడడానికి వెళ్లాల్సిన ప్రదేశం. నదికి మహా స్వాగతం మదు గంగ నది తీరమంతా మడ అడవులు దట్టంగా ఉంటాయి. చెట్ల కొమ్మల నుంచి పుట్టుకొచ్చిన వేళ్లు నదిలోని నీటి కోసం ఊడల్లాగ కిందకు వేళ్లాడుతుంటాయి. బాల్పిటియా దగ్గర మొదలైన రివర్ సఫారీ మొదట మదుగంగ నది హిందూమహాసముద్రంలో కలిసే ప్రదేశం వరకు సాగుతుంది. నిశ్చలంగా ప్రవహించిన నదికి హిందూ మహా సముద్రం అలలతో స్వాగతం పలుకుతున్న అద్భుతాన్ని చూసిన తరవాత దీవుల పరిక్రమ దిశగా సాగింది మా పడవ. ప్రకృతి ప్రపంచమిది శ్రీలంకలో ఎటు చూసినా పచ్చదనమే. అయితే ఈ నది మధ్య ఉన్న దీవులు ఇంకా దట్టమైనవి, ఇంకా పచ్చనైనవి. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించినట్లు దట్టమైన అడవులవి. ఈ దీవులు కొన్ని ప్రైవేట్ వ్యక్తులవి. కొన్ని సామాన్య జనావాసాలు. ఒక దీవిలో పూర్తిగా దాల్చిన చెక్కను చెక్కే వాళ్లే నివసిస్తున్నారు. మొత్తం ఇరవై కుటుంబాలు. దాల్చిన చెక్క చెట్ల నుంచి బెరడును సేకరించడం, సినమిన్ ఆయిల్ తయారు చేయడమే ఆ దీవిలో నివసించే వారి వృత్తి. పడవలన్నీ ఆ దీవి దగ్గర ఆగుతాయి. ఒక ఇంట్లోకి వెళ్లగానే ఒక చిన్న గది, పర్యాటకులు కూర్చోవడానికి చేసిన ఏర్పాటు ఉంది. మనం వెళ్లగానే ఒక వ్యక్తి సినమిన్ ఆకులు రెండింటిని మన చేతిలో పెట్టి వాసన చూడమంటాడు. ఆ తర్వాత ఒక కర్రను చూపించి బెరడును ఒలుస్తాడు. ఆ తర్వాత పర్యాటకులందరికీ గాజు కప్పుల్లో దాల్చిన చెక్క టీ ఇస్తారు. చేపల పట్టే అమ్మాయి టీ తాగిన తర్వాత వారి వద్దనున్న దాల్చిన చెక్కతోపాటు సినమిన్ పౌడర్ ప్యాకెట్లు, సినమిన్ ఆయిల్ సీసాలను మన ముందు పెడతారు. కావల్సినవి కొనుక్కున్న తర్వాత పడవ ఇతర దీవుల వైపు సాగుతుంది. ఈ మధ్యలో బుద్ధుని విగ్రహం దగ్గర కొంతసేపు ఆగవచ్చు. ఒక్కో దీవిని చుట్టి వస్తుంటే మనం ప్రకృతి ప్రపంచాన్ని చుట్టి వస్తున్న విజేతగా ఒకింత అతిశయంగా ఫీలవుతాం. అన్నట్లు చేపలతో ఫుట్ మసాజ్ సౌకర్యం కూడా ఒక దీవిలో ఉంది. చేపలు పట్టే అమ్మాయి మదుగంగలో ఒకమ్మాయి చిన్న తెడ్డు పడవలో చేపలు పడుతూ కనిపించింది. ‘నువ్వు ఆడపిల్లవి, ఈ పనులు నువ్వు చేసేవి కాదు’ అని అడ్డగించే వాళ్లు లేకపోతే అమ్మాయిలు ఏ పనిలోనైనా అద్భుతాలు సాధిస్తారనిపించింది. ఆ అమ్మాయికి హాయ్ చెప్పి, మనసులోనే సెల్యూట్ చేసుకుని ముందుకు సాగిపోయాం. తిరుగు ప్రయాణంలో ఒక దీవి దగ్గర గబ్బిలాలు భయం గొల్పాయి. దీవి నిండా చెట్లకు తలకిందుగా వేళ్లాడుతూ నల్లటి పెద్ద పెద్ద గబ్బిలాలు. ఇంకొద్ది సేపు చూడాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ ఆ దృశ్యం ఆహ్లాదంగా అనిపించక ముందుకు సాగిపోయాం. ఇక్కడ ముందుకు సాగిపోవడం అంటే బయలుదేరిన ప్రదేశం వైపుగా అన్నమాట. పడవ దిగేటప్పటికి రెస్టారెంట్లో వంట సిద్ధంగా ఉంది. రివర్ సఫారీకి బయలుదేరేటప్పుడే ఫుడ్ ఆర్డర్ తీసుకున్నారు. రకరకాల కూరగాలయలను కొబ్బరి పాలతో ఉడికించిన కూరలతో మంచి భోజనం పెట్టారు. చేపల కూర కూడా రుచిగా ఉంది. ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... మాన్గ్రోవ్ బారుల మధ్య నదిలో విహారం అద్భుతంగా ఉంటుంది. చెట్లు ఒక్కో చోట నదిని ఇరుకు చేస్తాయి. గుహలోకి వెళ్లినట్లు పడవ కొమ్మల మధ్య దూరి పోతుంది. నది మీద ఇనుప వంతెనలుంటాయి. వాటి దగ్గరకు వచ్చినప్పుడు దేహాన్ని బాగా వంచి పడవలో ఒదిగి కూర్చోవడం, చిన్నపిల్లల్లాగ భయంభయంగా వంతెన వెళ్లిపోయిన తరవాత పైకి లేవడం, ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... లండన్ బ్రిడ్జి ఫాలింగ్ డౌన్ అని పాడుకున్నట్లే... ఈ రివర్ సఫారీలో ‘కమింగ్ సూన్ కమింగ్ సూన్ వన్మోర్ బ్రిడ్జ్ ఈజ్ కమింగ్ సూన్’ అని పాడుకుంటూ పడవలో దాక్కోవడం... పర్యాటకులను చిన్న పిల్లలను చేస్తుంది. – వాకా మంజులారెడ్డి (చదవండి: పర్యాటకుల స్వర్గధామం కోనసీమ, ఆతిథ్యం నుంచి ఆత్మీయత వరకు..) -
సింహం వచ్చి పలకరిస్తే ఎలా ఉంటుంది? ప్రాణాలు గాల్లో
సాక్షి, భువనేశ్వర్ : ప్రాణం విలువ చివరి క్షణంలో తెలుస్తుందంటారు అనుభవించిన వాళ్లు. సరదాగా జూలోకి వెళ్లి చూద్దామనుకున్న వాళ్లకు ఆ అనుభవం కళ్లారా కట్టినట్టు కనిపించింది. షాక్ కు గురి చేసింది. ఒడిషాలో అసలేం జరిగిందంటే.. విచిత్రమైన అనుభవం వినోదం, ఆహ్లాదం కోసం బారంగ్ నందనకానన్ జూ సందర్శించిన పర్యాటకులకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. సందర్శనలో భాగంగా యంత్రాంగం ఏర్పాటు చేసిన వాహనంలో జంగిల్ సఫారీకి సుమారు 30 మంది బృందంగా బయల్దేరారు. అయితే సింహాలు, పులులు, ఎలుగు బంటి వంటి వన్య మృగాలు విచ్చలవిడిగా సంచరించే ప్రాంతంలో సందర్శకుల వాహనం మొరాయించడంతో ప్రాణాలు పోయినంత పనయ్యింది. ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంది. వచ్చేశాయి సింహాలు ఇంతలో అక్కడే సంచరిస్తున్న మృగరాజులు ఈ వాహనాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఒక గంట పైబడి సందర్శకులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బయటపడ్డారు. నందన కానన్ అధికార వర్గాలు మరో వాహనం ఏర్పాటు చేసి ఘటనా స్థలానికి చేరారు. సందర్శకులను చుట్టు ముట్టిన సింహాలను ఆహారం మిషతో పక్కదారి పట్టించి, ప్రమాదం నుంచి బయటపడేలా చేసి సందర్శకులను సురక్షితంగా తీసుకుని రాగలిగారు. ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు ఏఎఫ్వోకు ఆదేశించినట్లు నందన కానన్ డైరెక్టరు తెలిపారు. #ସିଂହ_ସଫାରୀରେ_ଫସିଲା_ବସ୍ ନନ୍ଦନକାନନ ସିଂହ ସଫାରୀରେ ଫସିଗଲା ବସ୍ । ଭୟଭୀତ ହୋଇପଡ଼ିଲେ ପର୍ଯ୍ୟଟକ । ସିଂହଗୁଡିକୁ କାବୁ କରି ଫିଡିଂ ଚାମ୍ବରରେ ରଖିଲେ କର୍ମଚାରୀ । #Nandankanan #Zoo #KanakNews pic.twitter.com/NwCoXWD1nt — Kanak News (@kanak_news) July 9, 2023 -
ఫ్యామిలీతో కలిసి అడవుల్లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ (ఫొటోలు)
-
టాటా రెడ్ డార్క్ ఎడిషన్స్.. అద్భుతమైన డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎట్టకేలకు నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్లను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్స్ ఎక్కువ కాస్మెటిక్ అప్డేట్స్ మాత్రమే కాకుండా టెక్నాలజీ, సేఫ్టీ అప్గ్రేడ్స్ పొందుతాయి. నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్: దేశీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న టాటా నెక్సాన్ ఇప్పుడు రెడ్ డార్క్ ఎడిషన్లో కూడా లభిస్తుంది. ఇది నాలుగు వేరియంట్స్లో లభిస్తుంది. అవి.. నెక్సాన్ ఎక్స్జెడ్ ప్లస్ రెడ్ డార్క్ పెట్రోల్ మాన్యువల్: రూ. 12.35 లక్షలు నెక్సాన్ ఎక్స్జెడ్ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ మాన్యువల్: రూ. 13.70 లక్షలు నెక్సాన్ ఎక్స్జెడ్ఏ ప్లస్ రెడ్ డార్క్ పెట్రోల్ ఆటోమాటిక్: రూ. 13.00 లక్షలు నెక్సాన్ ఎక్స్జెడ్ఏ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ ఆటోమాటిక్: రూ. 14.35 లక్షలు నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్ ఇప్పుడు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇన్-బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. టాటా హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్: టాటా హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్ ఇప్పుడు ఎక్స్జెడ్ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ మాన్యువల్, నెక్సాన్ ఎక్స్జెడ్ ప్లస్ (ఓ) రెడ్ డార్క్ డీజిల్ ఆటోమాటిక్ వేరియంట్స్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 21.77 లక్షలు, రూ. 24.07 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ లో ADAS టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. సఫారి రెడ్ డార్క్ ఎడిషన్: ఈ ఎడిషన్ ఆరు వేరియంట్స్లో లభిస్తుంది. వీటి ధరలు రూ. 22.61 లక్షల నుంచి రూ. 25.01 లక్షల మధ్య ఉన్నాయి. సఫారి రెడ్ డార్క్ ఎడిషన్ కూడా ADAS ఫీచర్స్తో పాటు వెంటిలేటెడ్ సీట్లు, డోర్ హ్యాండిల్స్ దగ్గర, పనోరమిక్ సన్రూఫ్ చుట్టూ రెడ్ యాంబియంట్ లైటింగ్ పొందుతుంది. టాటా రెడ్ డార్క్ ఎడిషన్లలో ఎటువంటి ఇంజిన్ అప్డేట్స్ లేదు, కావున పర్ఫామెన్స్ విషయంలో ఎటువంటి మార్పులు ఉండదు. 2023 ఆటో ఎక్స్పో వేదిక మీద సఫారి మరియు హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్లు మాత్రమే కనిపించాయి, అయితే కంపెనీ ఇప్పుడు నెక్సాన్ని కూడా ఈ జాబితాలోకి చేర్చింది. రెడ్ డార్క్ ఎడిషన్ కొనుగోలుపైన 3 సంవత్సరాల/1,00,000కిమీ వారంటీ పొందవచ్చు. -
టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్పై అదిరిపోయే ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల తయారీ దారు టాటా మోటార్స్ కూడా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరిలో ఎంపిక చేసిన మోడల్స్, సఫారి, హారియర్, ఆల్ట్రోజ్, టిగోర్ ,టియాగోపై రూ. 75,000 వరకు తగ్గింపు అందిస్తోంది. ఇప్పటికే మారుతి సుజుకి కూడా తగ్గింపు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 ఫిబ్రవరి నెలకు సంబందించిన తగ్గింపులో హారియర్, సఫారి మోడల్కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది . ముఖ్యంగా 2022, 2023 మోడల్స్పై ఈ బెనిఫిట్స్ను అందించడం విశేషం. టాటా ఫ్లాగ్షిప్ ఎస్యూవీ సఫారి 2023 అన్ని వేరియంట్లలో మొత్తం రూ. 35,000 తగ్గింపు లభ్యం. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు రూ. 25,000 విలువైన ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉన్నాయి. మరోవైపు, అమ్ముడుపోని ఎంపిక చేసిన 2022 సఫారీపై మొత్తం రూ. 75,000 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. దాదాపు టాటా హారియర్ కార్పై కూడా అదే ఆఫర్ లభిస్తోంది. టాటా హారియర్: 2023 మోడళ్లపై రూ. 35,000, 2022 మోడల్స్పై 75,000 వరకు తగ్గింపు టాటా టిగోర్: కొత్త స్టాక్ 25,000 వరకు తగ్గింపు , 2022 స్టాక్ పై 35,000 వరకు తగ్గింపు టాటా టియాగో: కొత్త స్టాక్పై 25,000 వరకు తగ్గింపు, 2022 స్టాక్పై 40,000 వరకు తగ్గింపు -
కొత్త ఫీచర్లతో మెరిసిన టాటా సఫారి 2023 డార్క్ ఎడిషన్
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023లో టాటా మోటార్స్ సఫారి, హ్యారియర్ కొత్త డార్క్ వెర్షన్లను పరిచయం చేసింది. కాస్మెటిక్ అప్డేట్లతో వీటిని ఆవిష్కరించింది. సఫారీ కొత్త వెర్షన్ స్టాండర్డ్ మోడల్తో పోలినప్పటికీ, ప్రతిచోటా క్రిమ్సన్ డిటైలింగ్తో అప్డేట్ చేసింది. రెడ్ ఫాబ్రిక్ బ్రాండ్-న్యూ సీట్లను అందించింది. ఫ్రంట్, సెంటర్ ఆర్మ్రెస్ట్ ,డోర్ గ్రాబ్ గ్రిప్లలో ఒకటి బ్రైట్ క్రిమ్సన్ రంగులో డిజైన్ చేసింది. ముఖ్యంగా 10.25-అంగుళాల టచ్ స్క్రీన్తో కూడిన కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, అధునాతన డ్రైవర్ ఫెండ్లీ ఫీచర్లు (ADAS) కూడా జోడించింది. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, రియర్ కొలిషన్ వార్నింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, డోర్ ఓపెన్ అలర్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ చేంజ్ అలర్ట్ హై బీమ్ అసిస్ట్ వంటి సేఫ్టీ అసిస్ట్ ఫీచర్లున్నాయి. వీటి ధరలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది. 2023 ఆటో ఎక్స్పో తొలి రోజున, టాటా మోటార్స్ ఈవీల్లో తన సత్తాను ప్రదర్శించింది. Avinya ప్రోటోటైప్ EVని , టాటా పంచ్ టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్లతో పాటు, టాటా హారియర్ EV, టాటా సియెర్రా EVలను కూడా ప్రారంభించింది. -
నాతోనే మజాకా.. టూరిస్టులకు చుక్కలు చూపించిన ఏనుగు
ఏనుగులు సాధారణంగా ఎంతో ప్రశాంతమైన జీవులు. అవి ఎంత ప్రశాంతంగా ఉంటాయో.. వాటికి కోపం తెప్పిస్తే మాత్రం మామూలుగా ఉండదు. వెంటపడి మరీ దాడి చేస్తాయి. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో కొందరు టూరిస్టులో కొద్దిలో ఏనుగు దాడి నుంచి తప్పించుకున్నారు. ఐఎఫ్ఎస్ అధికారి సాకేత్ బదోలా ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశారు. కాగా, వీడియోలో అడవిలో సందర్శనకు వచ్చిన టూరిస్టులను ఏనుగు తరుముతుండటంతో సఫారీ డ్రైవర్ వాహనాన్ని వేగంగా రివర్స్ చేస్తుండటం ఈ వైరల్ వీడియోలో ప్రతి ఒక్కరినీ ఉత్కంఠకు లోనుచేస్తుంది. సఫారీ డ్రైవర్ ఏమాత్రం తడబాటు లేకుండా జీపును వెనక్కి డ్రైవ్ చేస్తాడు. ఆ సమయంలో ఏనుగు ఆగ్రహంతో సఫారీ మీదకు దూసుకు వస్తుంది. ఇక, ఇలా కొంత దూరం వెనక్కి వెళ్లిన తర్వాత ఏనుగు తనంతట తానే రూట్ మార్చి అడవిలోకి వెళ్లిపోతుంది. దీంతో, సఫారీలో ఉన్న టూరిస్టులు సేదా తీసుకుంటారు. కాగా, వీడియో షేర్ చేసిన సాకేత్ బదోలా.. డ్రైవర్ను ప్రశంసిస్తూ ఏనుగు ఎందుకు ఆగ్రహంగా దూసుకెళ్లిందో విచారించాలని అధికారులను కోరుతూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఏనుగు ఇంత వయలెంట్గా ఉందేంటి కామెంట్స్ చేస్తున్నారు. Credits to the driver for his skills and keeping his cool. Not an easy situation to be in. However, authorities should investigate the reason behind the elephant’s irritation. pic.twitter.com/KSR4XF6nlZ — SAKET (@Saket_Badola) September 9, 2022 -
జూపార్క్ లోకి భారీ వరద నీరు (ఫొటోలు)
-
ఏం టైమింగ్.. వెంటాడిన మృత్యువు నుంచి తప్పించుకుంది
వైరల్: ఆయుష్షు గట్టిదైతే.. ఎంతటి ప్రమాదం నుంచి అయినా బయటపడొచ్చు. అయితే దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. మృత్యువు వెంటాడినా.. సమయస్ఫూర్తితో వ్యవహరించి మృత్యువు ముఖం నుంచి తప్పించుకుంది ఓ సింహం ఇక్కడ. కెన్యా మసాయ్ మరా నేషనల్ రిజర్వ్ పార్క్లో మే 23వ తేదీన ఆంటోనీ పెసీ ఈ వీడియోను చిత్రీకరించాడు. నది మధ్యలో ఓ భారీ హిప్పో మృతదేహం కొట్టుకువచ్చింది. అయితే దాని మీద ఓ సింహం కూడా కనిపించింది. దీంతో పెసీ తన కెమెరాతో షూట్ చేయడం ప్రారంభించాడు. సుమారు నలభైకి పైగా మొసళ్లు.. హిప్పో మృతదేహం చుట్టూ చేరాయి. కాస్త ఉంటే.. పైన ఉన్న సింహం కూడా వాటికి బలి అవుతుందేమో అనుకున్నాడు పెసీ. అయితే ప్రాణ భయంతో హిప్పో మీదే ఉండిపోయిన ఆ సింహం.. సమయస్ఫూర్తితో వ్యవహరించింది. అదను చూసి నీళ్లలోకి ఒడ్డుకి చేరింది. బతుకు జీవుడా అనుకుంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
జంగిల్ సఫారీ.. ఆనందాల సవారీ
రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతమైన రాజంపేట–రాయచోటి అటవీ మార్గంలోని తుమ్మలబైలులో రె డ్ఉడ్ జంగిల్ సఫారీని 2010లో ఏర్పాటుచేశారు. ఇపుడు వనవిహారం పేరుతో రూ.10లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులకు అనువుగా మారుస్తున్నారు. ఎర్రచందనం చెట్ల సముహంలో వనవిహారం ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. సేద తీరేందుకు ఏర్పాటు చేసిన అతిథి గృహం, పిల్లలు ఆడుకోవడానికి నెలకొల్పిన పార్కు అదనపు ఆకర్షణగా ఉంటాయి. తెల్లదొరల కాలం నుంచే.... తెల్లదొరల కాలం నుంచి తుమ్మలబైలు అతిథిగృహాన్ని పర్యాటకపరంగా ఏర్పాటు చేసి ఉన్నారు. వేసవి విడిదిగా అక్కడే కాలం గడిపేవారు. అటవీ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా తెల్లదొరలు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అవి కాలగర్భంలో కలిసిపోయాయి. తర్వాత అటవీశాఖ తుమ్మలబైలు ప్రాంతాన్ని రెడ్వుడ్ జంగిల్ సఫారీ పేరుతో అభివృద్ధి చేసి తొలిసారిగా శేషాచలం అటవీ అందాలను పర్యాటకులకు చూపించనున్నారు. శేషాచలం ఇలా.. రాజంపేట డివిజన్లో అరుదైన జంతువులకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతం విస్తీర్ణం 82,500 ఎకరాల్లో ఉంది. ఎర్రచందనం విస్తారంగా కలిగి ఉన్న దీనిని కేంద్రంఇప్పటికే బయోస్పెయిర్గా ప్రకటించింది..ఈ ప్రాంత అందాలను పర్యాటకులు వీక్షించేలా ఎకో టూరిజం కింద రెడ్వుడ్ జంగిల్ సఫారీని రూపుదిద్దారు. ప్రధానంగా రెడ్వుడ్ జంగిల్ సఫారీలో చిరుత, ఎలుగుబండ్లు, నెమళ్లు, రోసికుక్కలు, అడవిపందులు, జింకలు, కొండగొర్రెలు, కణితులు ఉంటాయి. డిసెంబరు మాసంలో ఏనుగులు సంచరిస్తాయి. పర్యాటకులకు అనుకూలంగా.. అటవీ అందాలను వీక్షించేందుకు అనుకూలంగా రెడ్వుడ్ జంగిల్ సఫారీలో ఏర్పాట్లు చేశారు. దీని ముఖద్వారం నుంచి తుమ్మలబైలు బంగ్లా, చిల్డ్రన్స్ పార్కు, ఐరన్వాచ్టవర్, సేదతీరేందుకు సౌకర్యాలు, వాచ్టవర్ను ఏర్పాటుచేశారు. జంగిల్ సఫారీ వాహనం కూడా సిద్ధం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్డును బాగు చేస్తున్నారు. రెడ్వుడ్ జంగిల్ సఫారీలో 30 కిలోమీటర్ల మేర అటవీ ప్రయాణం ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. మల్లాలమ్మ కుంట సాకిరేవు ఏరియాలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం.. నిత్యం బిజీగా విధులు నిర్వహించే జిల్లా ఉన్నతాధికారులు పర్యటించి ఊరటపడుతుంటారు. జిల్లా కలెక్టర్లు, వివిధ జిల్లా అధికారులు జంగిల్ సఫారీలో పర్యటించి ఆహ్లాదకర అటవీ అందాలను వీక్షించి మానసిక ఉల్లాసాన్ని గడుపుతున్నారు. వనవిహారం స్కీం.. వనవిహారం స్కీం కింద గత ఏడాది రూ.5 లక్షలతో అతిథిగృహం పునరుద్ధరించారు. ట్రీమచ్, రోడ్లు, మల్లెలమ్మ కుంట వద్ద అభివృద్ధి చేశారు. ఈ ఏడాది కూడా రూ.10లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏనుగులు రాకుండా కంచెను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల కోసం వసతి సౌకర్యాల ఏర్పాటుచేస్తున్నారు. పర్యాటకులు రూ.10 ప్రవేశ రుసుంతో సఫారీలో పర్యటించవచ్చు. అది కూడా సాయంత్రం 5గంటల వరకు తిరిగి బయటికిరావాల్సి ఉంటుంది. రెడ్వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు రూ.10లక్షలతో తుమ్మలబైలు అటవీ ప్రాంతంలో రెడ్వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ట్రీమచ్లు ఏర్పాటుచేశాం. ఏనుగులు రాకుండా కంచెను బలోపేతం చేస్తున్నాం. సోలార్ వెలుగులు తీసుకొచ్చాం. పర్యాటకులకు వసతి సౌకర్యాలు పునరుద్ధరిస్తున్నాం. రూ.3లక్షలతో జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఎర్రచందనం, జంతువుల గురించి పర్యాటకులకు తెలిసే సైన్బోర్డులు ఏర్పాటుచేస్తున్నాం. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
యాపిల్ లోపం... విద్యార్థి ఇంట కాసుల వర్షం!
కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న, చిన్న తప్పుల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ సూత్రం మనకే కాదు దిగ్గజ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. దిగ్గజ కంపెనీలకు చెందిన సాంకేతికతలో ఉన్న చిన్న లోపం వల్ల కూడా కొన్నిసార్లు వేల కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి చిన్న తప్పులను గుర్తించి సరిదిద్దుకుంటే ఏమి పర్వాలేదు. టెక్ దిగ్గజ యాపిల్ కంపెనీ ఇప్పుడు అదే పని చేసింది. ర్యాన్ పిక్రెన్ అనే సైబర్ సెక్యూరిటీ విద్యార్థికి బిగ్ బౌంటీ కింద 100,500 డాలర్లు(సుమారు రూ.75 లక్షలు) ఇచ్చింది. మ్యాక్ వెబ్క్యామ్లను హ్యాకర్లు హ్యాక్ చేసే విధంగా ఉన్న ఒక లోపాన్ని గుర్తించినందుకు యాపిల్ ఆ డబ్బులను ఇచ్చింది. ఐక్లౌడ్ షేరింగ్, సఫారీ 15తో సహ ఇతర బ్రౌజర్లలో వరుసగా బయటపడుతున్న లోపాల వల్ల హ్యాకర్లు వెబ్క్యామ్లను హ్యాక్ చేయవచ్చు అని ర్యాన్ పిక్రెన్ ఒక బ్లాగ్ పోస్టులో తెలిపారు. గత ఏడాది యాపిల్ ఈ లోపాలను పరిష్కరించినట్లు వైర్డ్ మీడియా తెలిపింది. "ఈ లోపం వల్ల భాదితులు ఓపెన్ చేసిన పోర్టల్ వివరాలు అన్నీ హ్యాకర్ చేతికి వెళ్తాయి. కొన్నిసార్లు, మన వెబ్క్యామ్ కూడా రికార్డు చేయడం ప్రారంభిస్తుంది. నేను కనిపెట్టిన బగ్ మీ ఐక్లౌడ్, పే పాల్, ఫేస్ బుక్, జీమెయిల్ మొదలైన ఖాతాలను కూడా హ్యాక్ చేయగలదు" అని ఆయన ఆ పోస్టులో రాశారు. సాధారణంగా కొన్నిసార్లు మనం డజన్ల కొద్దీ బ్రౌజర్ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు అకస్మాత్తుగా అనేక యాదృచ్ఛిక ప్రకటనల రావడం మనం గమనిస్తుంటాం. అయితే, ఇది కూడా హ్యాకింగ్లో ఒక టెక్నిక్. గత సంవత్సరం చివరలో బయటపడిన మాక్ ఓఎస్ లోపం మీ సఫారీ ట్యాబ్, ఇతర బ్రౌజర్ సెట్టింగ్ వివరాలను దోపిడి చేసి ఉండవచ్చు అని పిక్రెన్ పేర్కొన్నారు. ఈ లోపం వల్ల హ్యాకర్లు మీ ఆన్లైన్ ఖాతాలపై నియంత్రణ పొందడమే కాకుండా, మీ మైక్రోఫోన్ ఆన్ చేయడం లేదా మీ వెబ్క్యామ్ హ్యాక్ చేసి ఉండవచ్చు అని అన్నారు. అందుకే, ముఖ్యమైన వివరాలను,పాస్వర్డ్లను ఎన్నడూ కూడా బ్రౌజర్లలో సేవ్ చేయకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడైన నగదు లావాదేవీలు చేసేటప్పుడు వర్చువల్ కీ బోర్డ్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. (చదవండి: తిక్క కుదిరిందా ఎలన్ మస్క్? అదిరిపోయే పంచ్!) -
‘నన్ను ప్రత్యక్షంగా చూస్తే థ్రిల్లింగ్గా ఉందా.. తేడా కొడితే మాత్రం ఇంతే’
సఫారీలో జంతువులను ప్రత్యక్షంగా చూడటం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. తేడా కొడితే మాత్రం ఇలా గుండెకాయ నోట్లోకి జారినట్లు కూడా ఉంటుంది. అలాంటి ఘటనే శ్రీలంకలోని యాలా నేషనల్ పార్కులో చోటుచేసుకుంది. పార్క్లో జనంతో నిండిన జీప్పై అడవి ఏనుగు దాడి చేయడానికి ప్రయత్నించింది. ‘ఇది నా ఏరియా.. మీరేందుకు వచ్చారు’ అనేలా వారిపై విరుచుకుపడింది. చదవండి: కొండచిలువతో సీతకోక చిలుక ఏం చెబుతుందో చూడండి! అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని ఈ చిత్రాన్ని క్లిక్మనిపించిన ఫోటోగ్రాఫర్ సెర్గీ తెలిపారు. సియనా ఇంటర్నేషనల్ ఫోటో పురస్కారాల్లో జర్నీస్ అండ్ అడ్వంచర్స్ కేటగిరీలో ఈ చిత్రం మెదట బహుమతిని గెలుచుకుంది. -
అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం..
వాషింగ్టన్ డీసిలోని నేచరల్ హిస్టరీ మ్యూజియం గురించి తరగతిగదిలో ఎన్నోసార్లు విని ఉన్నాడు సుయాస్. అక్కడ మొక్కల నుంచి జంతువుల వరకు, శిలల నుంచి శిలాజాల వరకు ఎన్నో కళ్లకు కడతాయి. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళతాయి. అలాంటి మ్యూజియంను జీవితంలో ఒక్కసారైనా చూడాలనేది సుయాస్ కల. చిత్రమేమిటంటే...పదిహేడేళ్ల వయసులో సుయాస్ తీసిన ఆరు మాసాల పులిపిల్ల ఫొటోను ఆ మ్యూజియంలో సంవత్సరం పాటు ప్రదర్శించారు. ఈ ఫొటో నేచర్స్ విభాగంలో బెస్ట్ ఫొటోగ్రఫీ ఏషియా అవార్డ్ అందుకుంది. ఎంత సంతోషం! భోపాల్(మధ్యప్రదేశ్)కు చెందిన సుయాస్ కేసరికి చిన్నప్పటి నుంచి వైల్డ్లైఫ్పై అంతులేని ఆసక్తి ఉండేది. తాను విన్న మృగరాజు, పులి, కుందేలు, నక్క...మొదలైన కథలు జంతుజాలంపై తనకు ఆసక్తిని కలిగించాయి. తన వయసు పిల్లలు టామ్ అండ్ జెర్రీలాంటి కార్టూన్ సీరియల్స్ చూస్తుంటే తాను మాత్రం జంతుజాలం, పర్యావరణానికి సంబంధించిన చానల్స్ చూసేవాడు. తాను చూసిన విశేషాలను స్నేహితులతో పంచుకునేవాడు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోనే కాకుండా వేసవి సెలవులకు కోల్కతాకు వెళ్లినప్పుడు...బెంగాల్లోని జూపార్క్లను చూసేవాడు. చదవండి: Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. తన బాల్యంలో ఒకసారి... ఒక జూలో కటకటాల వెనకాల ఉన్న పులులను చూసి సంతోషంతో చప్పట్లు కొట్టాడు. ‘నువ్వు సంతోషంగా ఉన్నావు కాని అవి సంతోషంగా లేవు’ అన్నది అమ్మమ్మ. ‘ఎందుకు?’ అని ఆశ్చర్యంగా అడిగాడు సుయాస్. ‘వాటి నివాసస్థలం అడవులు. అక్కడే అవి సంతోషంగా, స్వేచ్ఛగా ఉండగలవు. జూ వాటికి జైలు మాత్రమే’ అని చెప్పింది అమ్మమ్మ. ఇక అప్పటి నుంచి అడవుల్లో జంతుజాలానికి సంబంధించిన జీవనశైలిని తెలుసుకోవాలనే ఆసక్తి అంతకంతకూ పెరిగింది. చిన్నప్పటి ఆసక్తులు వేరు పెదయ్యాక కెరీర్ గురించి ఆలోచనల వేరు. చాలా సందర్భాల్లో చిన్నప్పటి ఆసక్తి బాల్యంలోనే ఆగిపోతుంది. అయితే సుయాస్ విషయంలో అలా జరగలేదు. కాలేజీ రోజుల్లో, అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా తన ఆసక్తి తనను విడిచి పెట్టలేదు. అందుకే యూఎస్లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి అడవులను వెదుక్కుంటూ ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇక్కడ... అడవులు ఎన్నో తిరుగుతూ కన్జర్వేటర్లు, ఫారేస్ట్ రేంజ్ ఆఫీసర్లతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. అడవులన్నీ తిరుగుతున్న క్రమంలో తనకొక విషయం అర్థమైంది. మనుషులు అడవులకు వస్తున్నారు, జంతుజాలం మనుషులను చూస్తుంది...కాని ఇద్దరికీ మధ్య ఎక్కడో గ్యాప్ ఉన్నట్లు అనిపించింది. జంగిల్ పర్యటన వినోదానికి మాత్రమే పరిమితమైపోతుంది. అలా కాకుండా అడవిలో ప్రతి జీవి గురించి మనసుతో తెలుసుకోవాలి. అవి మనలో ఒకటి అనుకోవాలి.... ఇలా ఆలోచిస్తూ, తన ఆలోచనకు వేదికగా సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. రకరకాల జంతువుల గురించి చిన్న చిన్న మాటలతోనే లోతైన పరిచయం చేయడం మొదలుపెట్టాడు. ఊహించని స్థాయిలో ఫాలోవర్స్! అందులో యూత్ ఎక్కువ. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. అందుకే ‘20 సంవత్సరాల వ్యక్తి దృష్టికోణంలో ‘అడవి’ అనే టాపిక్ను తీసుకొని ఫిల్మ్సిరీస్ చేశాడు. మంచి స్పందన వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్ ఫర్ నేచర్) స్వచ్ఛంద సంస్థ చేయూత ఇచ్చింది. తమ పంటలను ధ్వంసం చేస్తున్నాయి అనే కారణంతో ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్కు వస్తున్న 18 అడవి ఏనుగులపై దాడి చేయడానికి కొందరు రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో వారి నుంచి ఏనుగులను రక్షించడమే కాదు, వారి పంటలు దెబ్బతినకుండా తన బృందాలతో కలిసి కంచెలు ఏర్పాటు చేశాడు సుయాస్. జంతుజాలం సంక్షేమం గురించి అడవంత విశాలమైన పనులు చేయాలనేది సుయాస్ కల. అందులో ఒకటి వైల్డ్లైఫ్ గురించి సొంతంగా వోటీటీ ప్లాట్ఫామ్ మొదలుపెట్టాలని! విజయోస్తు సుయాస్. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! -
Viral Video: అబ్బే ఏం లేదు.. నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే!!
అడవిలో పక్షులు, జంతువులకు వేటి సహజ అలవాట్లు వాటికుంటాయి. అందుకు ప్రత్యేకంగా ఏదైనా చేస్తేనే అది వండర్ అవుతుంది. కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులైతే మామూలే అనుకోవచ్చు. కానీ అడవికే రారాజు అయిన సింహం తన అలవాట్లు మార్చుకుందేమోననే సందేహం కలిగేలా ఉన్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలేంచేసిందంటే.. ఒక కదులుతున్న కారులో నుంచి ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోలో కారు పబ్లిక్ టాయిలెట్ దగ్గర ఆగగానే లోపల్నుంచి బయటకు వస్తున్న సింహం కనిపిస్తుంది. వాళ్లను చూసిన సింహం ‘ఇది నాకు చాలా మామూలు విషయం’ అన్నట్టుగా నింపాదిగా బయటికి వచ్చి అడవిలోకి వెళ్లిపోతుంది. ఐతే ఈ సంఘటన ఎక్కడజరిగిందో తెలియదు కానీ దీనిని చూసిన నెటిజన్లు మాత్రం భిన్న కామెంట్లు చేస్తున్నారు. ‘మగ సింహం జంట్స్ టాయిలెట్స్ నుంచి బయటికి రావడం నిజంగా అభినందించదగిన విషయమే.. చదువుకున్న సింహం’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘చాలా సేపటినుంచి ఓపిక పట్టాను.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని’ మరొకరు కామెంట్ చేశారు. పబ్టిక్ టాయిలెట్స్లో జంతువులు కనిపించడం ఇది మొదటిసారేమీ కానప్పటికీ జంగిల్ సఫారీ టైంలో టాయిలెట్లకు వెళ్లాలంటే కొంచెం ఆలోచించి వెళ్లడం బెటర్ అనిపిస్తుంది ఈ వీడియోను చూస్తే! దీంతో ఈ వీడియోను వేలకొద్దీ నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: చరిత్రలో పెద్ద మిస్టరీగా మిగిలిన మృత్యులోయ..! -
దేశంలో సంక్షోభం, టాటా మోటార్స్ మరో మైలురాయి
ప్రముఖ ఆటోమోబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మరో మైలు రాయిని చేరుకుంది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఆర్ధిక సంక్షోభం తలెత్తినా దిగ్గజ ఆటోమోబైల్ సంస్థ వాహనాల్ని రికార్డ్ స్థాయిలో మార్కెట్లో విడుదల చేసింది. పూణే కేంద్రంగా కేవలం నాలుగు నెలల్లో భారీ ఎత్తున వాహనాల్ని మార్కెట్లోకి విడుదల చేసినట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. శైలిష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి నెలకు ఎస్యూవీ సఫారీ వాహనాల్ని 100వాహనాల్ని విడుదల చేసినట్లు, నాలుగు నెలలో 9,900వాహనాల్ని పూణే ప్లాంట్ నుంచి విడుదల చేసినట్లు వెల్లడించారు. దేశంలో గడ్డు పరిస్థితులు తలెత్తినప్పటికీ వాహనాల తయారీలో రికార్డ్ క్రియేట్ చేశామని అన్నారు. టాటా మోటార్స్ ఇంపాక్ట్ 2.0 డిజైన్ లో సఫారి తన కొత్త మోడల్ ఒమేగార్క్ ప్లాట్ఫామ్ వినియోగదారుల్ని ఆకట్టుకుందని, డి 8 ప్లాట్ఫామ్ నుండి పొందిన ల్యాండ్ రోవర్ టాటా మోటార్స్ విభాగంలో ముందజలో ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టాటామోటార్స్ డిజైన్లను మారుస్తుందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర చెప్పారు. -
Apple Update : పాస్వర్డ్ లేకుండానే లాగిన్
సాక్షి,వెబ్ డెస్క్ : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన యూజర్ల కోసం మరో అప్డేట్ను అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్ డిజైన్ చేసిన వెబ్ బ్రౌజర్ సఫారీలో పాస్వర్డ్ లేకుండా సన్ ఇన్ అవ్వొచ్చు. గతేడాది వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యుడిసి)లో సఫారీ వెబ్ బ్రౌజర్లో సంబంధిత వెబ్ సైట్లలో సైన్ ఇన్ చేయడానికి ఐడీ పాస్ వర్డ్ అవసరం లేకుండా ఫేస్ ఐడీ, టచ్ ఐడీని ఉపయోగించేలా వర్క్ చేస్తున్నామని ప్రకటించింది. ఆ ప్రకటనకు సంబంధించి ఆపిల్ తాజా అప్డేట్ తెచ్చింది. “Move beyond passwords” కార్యక్రమంలో పాస్వర్డ్ లేకుండానే సైన్ అప్ చేసుకునే సదుపాయాన్ని వినియోగదారులకు పరిచయం చేసింది. 'పాస్కీ' అని పిలిచే ఈ సైన్అప్ లో ఇక పై పాస్ వర్డ్ అవసరం లేదని, కేవలం ఫేస్ ఐడీ, టచ్ ఐడీని ఉపయోగిస్తే సరిపోతుందని తెలిపింది. దీనివల్ల వినియోగదారుల వ్యక్తిగత అన్ లైన్ అకౌంట్స్ కు ఎలాంటి ప్రమాదం ఉండదని, ఆన్ లైన్ మోసాల్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని ఆపిల్ వెల్లడించింది. 'పాస్కీ' ఎలా పని చేస్తుంది? సఫారీ బ్రౌజర్ లో మీరు సందర్శించిన వెబ్ సైట్ లో సైన్ ఆప్ కావాల్సి వస్తే ఐడీ ని ఎంటర్ చేసి పాస్ వర్డ్ ఎంటర్ చేసే బదులు ఫేస్ ఐడీని, టచ్ ఐడీని ఉపయోగించాలి. మీకు అనుమతి ఇవ్వడానికి, సైన్ ఇన్ చేయడానికి మీ ఫేస్ ఐడి లేదా టచ్ ఐడి ఉపయోగపడుతుందని ఆపిల్ Move beyond passwords కార్యక్రమంలో వివరించింది. పాస్ కీ అనేది రాబోయే ఐఫోన్, ఐప్యాడ్ మరియు మాక్స్కు టెక్నాలజీలకు ప్రివ్యూగా ఉపయోగపడుతుంది. ఈ కొత్త పాస్ కీ టెక్ ఐక్లౌడ్ కీచైన్లో ఒక భాగం. ఇది FIDO (ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్లైన్) అలయన్స్ యొక్క వెబ్ఆథ్న్ ప్రోటోకాల్పై ఆధారపడి ఉంటుంది. ఆపిల్ తెచ్చిన ఈ పాస్కీ ఫీచర్ సురక్షితమైందని, సైబర్ దాడులు జరగకుండా వినియోగదారుల వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ఈ ఫీచర్ ఒక్క ఆపిల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని, ఆండ్రాయిడ్ వినియోగ దారులు ఐడీ, పాస్ వర్డ్ లను తప్పని సరిగా ఎంటర్ చేయాలి. ఇప్పటికే యుబికో వంటి హార్డ్వేర్ కీల ద్వారా పాస్వర్డ్ లేని టెక్నాలజీకి గూగుల్, మైక్రోసాఫ్ట్ లు మద్దతు పలుకుతున్నాయి. పాస్వర్డ్ లేకుండా 200 మిలియన్లకు పైగా అకౌంట్స్ ఉన్నాయని ఈ ఏడాది మార్చిలో మైక్రోసాఫ్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి : యాపిల్ ఐప్యాడ్ ప్రో అప్ డేట్స్ ఇవే -
అమ్మ బాబోయ్.. కాపాడండయ్యా నన్ను!
అడవికి రారాజు సింహమే. కానీ, అవతలి నుంచి గుంపుగా వస్తే ఆ సింహాం కూడా తోక ముడవాల్సిందే. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కెన్యా మసాయి మారా సఫారీలో జరిగింది. నాలుగు సింహాలు.. పక్కనే ఉన్న జింకలను వదిలి.. మందగా ఉన్న అడవి దున్నల మీద కన్నేశాయి. అయితే అది గమనించిన అడవి దున్నలు ఒక్కసారిగా వాటి మీదకు ఉరుకులు తీశాయి. మూడు సింహాలు పారిపోగా.. ఒకటి మాత్రం ఆ దున్నల మధ్య ఇరుక్కుపోయింది ప్రాణ భయంతో పరుగులు తీసిన ఆ మృగరాజు.. అక్కడే ఉన్న ఓ చెట్టు మీదకు ఎక్కేందుకు ప్రయత్నించింది చాలా సేపు ఇబ్బంది పడ్డాక ఎట్లాగోలా పైకి చేరుకుంది కానీ, 500 దాకా ఉన్న అడవి దున్నలు మాత్రం ఆ సింహం చుట్టూ రౌండప్ చేశాయి కొన్ని గంటలపాటు చెట్టుమీదే ఉన్న సింహం.. చీకటి పడ్డాక దున్నలు వెళ్లిపోవడంతో దిగింది నార్వేకు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఓల్వ్ థోక్లే(54) ఈ రసవత్తరమైన దృశ్యాల్ని తన కెమెరాలో బంధించారు. -
జంగిల్ సఫారీలో కృతి
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంగిల్ సఫారీలో షికారు చేస్తోంది. వైల్డ్ అనిమల్స్తో కలిసి డిజైనర్ వేర్స్లో స్పెషల్ ఫోటో షూట్ జరిపింది. తెలుగులో మహేశ్ సరసన నంబర్ 1 నేనొక్కడే సినిమాలో నటించిన కృతి.. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్షయ్ కుమార్తో వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది కృతి. అంతకు ముందు బరేలీకి బర్ఫీ, లుకా చుప్పి చిత్రాలతో బాక్సాఫీస్ హిట్లు అందుకుంది కృతి. క్రేజీ ప్రాజెక్ట్ ఆదిపురుష్లో ప్రభాస్ సరసన హీరోయిన్గా ఎంపికైంది కృతి. -
అరుదైన దృశ్యం.. ఒకేసారి మూడు పులులు
మైసూరు: సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఒకేసారి మూడు పులులు దర్శనమిచ్చాయి. ఈ ఘటన చామరాజనగర జిల్లా యళందూరు తాలూకా బిళిగిరి రంగనాథస్వామి అటవీ ప్రాంతంలో జరిగింది. దీంతో పర్యాటకులు ప్రాణభయానికి గురయ్యారు. అడవిలో పులులు ఉన్నా పర్యాటకులకు కనిపించడం అరుదు. (చదవండి: కిలాడీ దంపతులు: బండారం బట్టబయలు..) బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం -
సింహంతో ఫోటో.. వివాదంలో జడేజా
గాంధీ నగర్: గాయంతో ఇంగ్లండ్ సిరీస్కు దూరమైన టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా గుజరాత్లోని సఫారికి వెళ్లిన జడేజాకు ఒక సింహం గుంపు ఎదురైంది. మూడు సింహాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే వాటిని వీడియో తీశాడు. అనంతరం అక్కడే సింహం పిల్లతో ఫోటో దిగి వాటిని ట్విటర్లో షేర్ చేశాడు. 'నిజంగా ఇది గొప్ప ఎక్స్పీరియన్స్.. రోడ్ట్రిప్ ఫుల్గా ఎంజాయ్ చేశానంటూ'క్యాప్షన్ జత చేశాడు. జడేజా సింహం పిల్లతో ఫోటో దిగడం అతన్ని వివాదంలోకి నెట్టింది. సాధారణంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ ఐ కేటగిరీలో ఉన్న జంతువులతో ఫోటోలు తీసుకునే అవకాశం లేదు. ఈ విషయం తెలియని జడేజా సింహంతో ఫోటో దిగి ట్విటర్లో షేర్ చేయడంతో ఇబ్బందులు కొని తెచ్చకున్నాడు. జడేజా తీసిన ఫోటోలు పరిశీలించిన అటవీ అధికారులు... అవి గుజరాత్లో తీసుకున్న ఫోటో కాదని.. ఆఫ్రికన్ సింహాలు అని అటవీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 2018లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు జడేజా అక్కడి సఫారిలో తీసుకున్న ఫోటో అయి ఉండే అవకాశం ఉంది. తాజాగా అప్పటి వీడియోనే మళ్లీ షేర్ చేసి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై జడేజా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా గత నెలలో బర్ద్ ఫ్లూ ఎక్కువగా ఉన్న సమయంలో చేపలకు, పక్షులకు ఆహారం వేసి ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటనలో భాగంగా మూడో టెస్టులో బ్యాటింగ్ సమయంలో జడేజా బొటనవేలికి బంతి బలంగా తగిలింది. జడేజాను పర్యవేక్షించిన వైద్యులు అతనికి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. చదవండి: 'ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వండి' కెప్టెన్గా రూట్ అరుదైన రికార్డులు Woah ! Best experience ever #sasangir #roadtrip pic.twitter.com/nCLwjEv1N1 — Ravindrasinh jadeja (@imjadeja) February 8, 2021 -
టాటా సఫారీ.. బుకింగ్స్ ప్రారంభం
ముంబై: టాటా మోటార్స్ కంపెనీ సఫారీ ఎస్యూ పేరిట ఫ్లాగ్షిప్ కారును మంగళవారం ఆవిష్కరించింది. మొత్తం ఆరు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ మోడల్ బుకింగ్స్ ఫిబ్రవరి 4న ప్రారంభమవుతాయి. ల్యాండ్ రోవర్ డీ8 ఆర్కిటెక్చర్పై భారతీయ పరిస్థితులకు అనుగుణంగా టాటా సఫారీని రూపొందించారు. ఎక్స్జెడ్ ప్లస్, ఎక్స్జెడ్ఏ ప్లస్ వేరియంట్లు ఆరు సీట్ల సామర్థ్యాన్ని, మిగిలిన వేరియంట్లు ఏడు సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో 168 హార్స్పవర్ సామర్థ్యం, 350ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేసే రెండు లీటర్ల డిజిల్ ఇంజిన్ను అమర్చారు. ఆరు స్పీడ్ మ్యానువల్, ఆటో ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. అలాగే పనోరమిక్ సన్రూఫ్, రెండో వరుసలో రిక్లైనింగ్ సీట్ల సదుపాయం, ఎంబెంట్ మూడ్ లైటింగ్ వ్యవస్థ, ఏసీ సదుపాయంతో పాటు మల్టీ డ్రైవ్ (సీటీ/స్పోర్ట్స్/ఎకో) మోడ్స్ లాంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధరను తర్వలో ప్రకటిస్తామని ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ తెలిపింది. చదవండి: ఇక 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలు తుక్కుతుక్కే! -
సఫారీ సరికొత్తగా.. కమింగ్ సూన్
సాక్షి, న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ సఫారీ ఎస్యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)ని మళ్లీ మార్కెట్లోకి తెస్తోంది. ఆటో ఎక్స్పో 2020లో గ్రావిటాస్ కోడ్నేమ్తో ప్రదర్శించిన ఎస్యూవీనే సఫారీ పేరుతో భారత మార్కెట్లోకి ఈ కంపెనీ తెస్తోంది. కొత్త తరం ఎస్యూవీ వినియోగదారుల కోసం ఈ ఏడు సీట్ల ఎస్యూవీని రూపొందించామని, త్వరలోనే బుకింగ్స్ మొదలు పెడతామని, ఈ నెలలోనే షోరూమ్స్కు అందుబాటులోకి తెస్తున్నామని టాటా మోటార్స్ వెల్లడించింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా...! ల్యాండ్ రోవర్కు చెందిన డీ8 ప్లాట్ఫార్మ్పై క్రయోటెక్ టర్బో–డీజిల్ ఇంజిన్తో ఈ కొత్త సఫారీని రూపొందించామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్రయాణికుల వాహన వ్యాపార విభాగం) శైలేశ్ చంద్ర పేర్కొన్నారు. ఆల్–వీల్ డ్రైవ్, ప్రొజెక్టర్ హెడ్లైట్స్, ఎల్ఈడీ టెయిల్లైట్స్, 8.8 అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, జేబీఎల్ స్పీకర్లు....తదితర ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వేరియంట్ను కూడా తెస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రూ.14-20 లక్షల రేంజ్లో ఉన్న ఐదు సీట్ల హారియర్ మోడల్ కన్నా ఈ సఫారీ ఎస్యూవీ ధర ఒకింత ఎక్కువ ఉండొచ్చు. ఎమ్జీ హెక్టర్ ప్లస్, మహీంద్రా ఎక్స్యూవీ 500, హ్యుందాయ్ క్రెటా ఆధారిత ఎస్యూవీలకు కొత్త సఫారీ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త సఫారీతో కొనసాగింపు..... భారత్లో ఎస్యూవీ లైఫ్స్టైల్ టాటా సఫారీతోనే మొదలైందని, ఇతర కంపెనీలు అనుసరించాయని శైలేశ్ చంద్ర పేర్కొన్నారు. గత ఇరవైయేళ్లుగా హోదాకు, పనితీరుకు ప్రతీకగా టాటా సఫారీ నిలిచిందని, ఈ వైభవాన్ని కొత్త సఫారీతో కొనసాగిస్తామని వివరించారు. -
టూరిస్ట్ బస్ను వెంటాడిన పులి
-
బస్ను వెంటాడిన టైగర్..
రాయ్పూర్ : చత్తీస్గఢ్లోని రాయ్పూర్ నందన్వన్ జంగిల్ సఫారిలో ఓ పులి టూరిస్ట్ బస్ను వెంటాడిన ఘటనపై ఇద్దరు పార్క్ అధికారులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. భద్రతా ప్రోటోకాల్ పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు వేసింది. జంగిల్ సఫారీలో భాగంగా టూరిస్టుల బృందం కొట్లాడుకుంటున్న రెండు పులల వద్దకు రాగానే వాటిలో ఒక పులి అనూహ్యంగా తమ బస్సు కిటికీకి ఉన్న కర్టెన్ను లాగేందుకు ప్రయత్నించింది. బస్పై దాడికి పులి ప్రయత్నించడంతో బస్ను వేగంగా నడపాలని ఓ టూరిస్టు డ్రైవర్ను కోరాడు. బస్సు వేగంగా ముందుకెళ్లడంతో దాని వెనుకే పులి దూసుకువెళ్లడం ప్రయాణీకులను బెంబేలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో సీనియర్ అధికారుల దృష్టికి రావడంతో బస్ డ్రైవర్, టూరిస్ట్ గైడ్లను విధుల నుంచి తొలగించారు. చదవండి : పిల్లోడిపై దూకేందుకు ప్రయత్నించిన పులి -
పర్యటనకు వెళ్తే.. పరుగులు పెట్టించింది
బెంగళూరు: సరదాగా పర్యటించడానికి పార్కుకు వెళ్లిన వారికి ఒక్కసారిగి మృత్యువు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యింది. దాంతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పరుగందుకున్నారు. మృగరాజు పర్యటనకు వచ్చి వారిని వెంటాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటక బళ్లారిలోని అటల్ బిహారీ వాజ్పేయి జూలాజికల్ పార్కులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... నలుగురు పర్యటకులు పార్కులో పర్యటించేందుకు సఫారిలో వెళ్లారు. ఇంతలో అనుకోకుండా ఓ సింహం సఫారి వైపే పరిగెత్తుకుంటూ రాసాగింది. ఇది గమనించిన వ్యక్తులు మొదట్లో దీన్ని సరదాగా తీసుకుని నెమ్మదిగా వెళ్లడం ప్రారంభించారు. కానీ సింహం వేగంగా సఫారివైపు దూసుకువస్తుండటంతో మృత్యు దేవతే తమను తరుముతున్నట్లు భయంతో వణికిపోయారు. వెంటనే సఫారి వేగాన్ని పెంచి ముందుకు దూకించారు. కానీ మృగరాజు మాత్రం కొద్ది దూరం పాటు ఆ సఫారిని వెంబడించి.. ఆ తర్వాత దాని వేగాన్ని అందుకోలేక ఆగిపోయింది. దాంతో సఫారిలో ఉన్నవారిగా ఒక్కసారిగా బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంతకు సింహం పర్యటకుల వాహనాన్ని ఎందుకు వెంబడించిందనేది మాత్రం తెలియలేదు. మూడు రోజుల క్రితం యూట్యూబ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే లక్షలో వ్యూస్, కామెంట్స్ సంపాదించింది. -
సఫారిని వెంబడించిన సింహం
-
భయానక అనుభవం; తప్పదు మరి!
జంతువులను వీక్షించడానికి సఫారీకి వచ్చిన పర్యాటకులకు భయానక అనుభవం ఎదురైంది. జీపులో వెళ్తున్న వారిపై ఏనుగు ఒక్కసారిగా విరుచుకుపడింది. కోపంతో పరుగులు తీస్తూ తొండంతో జీపును తోసేందుకు ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన పర్యాటకులు అంతేవేగంగా స్పందించి రివర్స్లో వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో.. ‘సఫారీ వెళ్లినపుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదు. మీరు అదృష్టవంతులు. అందుకే ప్రాణాలతో బయటపడ్డారు’ అంటూ కొంతమంది కామెంట్ చేస్తుండగా... మరికొందరు మాత్రం... ‘ఏనుగులతో సెల్ఫీలు దిగాలి. సింహంతో ఆడుకోవాలి అనుకుంటే అప్పుడప్పుడూ ఇలాంటి అనుభవాలు తప్పవు మరి’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?
ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహమనేది ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి క్షణాలను రొటీన్గా కాకుండా సమ్థింగ్ స్పెషల్గా చేసుకోవాలని కొందరు కోరుకుంటుంటారు. స్పెయిన్కు చెందిన ఓ జంట కూడా తమ వివాహాన్ని వెరైటీగా ప్లాన్ చేసింది. కాడిజ్ పట్టణంలో బీచ్ తీరాన సఫారీ థీమ్తో పెళ్లి వేడుక చేసుకుంది. అయితే వారు చేసిన వినూత్న ప్రయత్నంపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే... థీమ్ వెడ్డింగ్లో భాగంగా అతిథులను ఆకట్టుకునేందుకు పెళ్లివారు వేడుక ప్రాంగణంలో రెండు జీబ్రాలను ఏర్పాటు చేశారు. అయితే అవి నిజంగా జీబ్రాలు కావు. గాడిదలకు పెయింట్ వేసి జీబ్రాలుగా చిత్రీకరించారు. ఈ క్రమంలో వెరైటీ వెడ్డింగ్ గురించి ప్రస్తావిస్తూ ఏంజెల్ థామస్ అనే వ్యక్తి.. ‘తమ స్వార్థం కోసం జంతువులను ఇలా హింసిస్తారా’ అంటూ ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు వైరల్గా మారడంతో సదరు జంటపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు అసలు మనుషులేనా.. నిజంగా ఇది సిగ్గు చేటు. మూగ జీవాలను ఇంతలా వేధిస్తారా’ అంటూ మండిపడుతున్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన స్పెయిన్ పర్యావరణ శాఖ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. -
ఒక్క క్షణం గుండె ఆగింది..!!
టాంజానియా : సఫారీకి వెళ్లి జంతువులను దగ్గరగా చూసి రావాలనుకున్న ఓ వ్యక్తికి అనుకున్నదాని కన్నా ఎక్కువ జరిగింది. అమెరికాలోని సీటెల్కు చెందిన బ్రిట్టన్ హెయెస్ టాంజానియాలో సెరెంగెతీ జాతీయ పార్కులో సఫారీ టూర్కు వెళ్లారు. జీపులో సఫారీలోకి ప్రవేశించిన హెయెస్.. వాహనాన్ని ఒక చోటు నిలిపి చిరుతలను చూస్తున్నారు. ఇంతలో జీపు వైపునకు రెండు చిరుతలు దూసుకొచ్చాయి. వాటిలో ఒకటి కారుపైకి ఎక్కగా.. మరొకటి కారు వెనుక డోర్లో నుంచి లోపలికి వెళ్లింది. దీంతో కారులో ఉన్న హెయెస్ హడలిపోయారు. పక్క కారులో ఉన్న టూరిస్ట్ గైడ్ సూచనలతో కదలకుండా అలానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. శ్వాస వేగాన్ని కూడా నియంత్రించుకున్నారు. కాసేపు కారులోపలే ఉన్న చిరుత దాన్నుంచి బయటకు వెళ్లింది. ఈ సంఘటనపై మాట్లాడుతూ.. చిరుత జీపులోకి ప్రవేశించగానే ఒక్క క్షణం తన గుండె ఆగిపోయినట్లు అనిపించిందని హెయెస్ పేర్కొన్నారు. -
సఫారీకి సై!
పెద్దదోర్నాల: దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని అబ్బురపరిచే ప్రకృతి సోయగాలు, వింతలు విశేషాలను తిలకించే అద్భుత అవకాశం పర్యాటకులకు కలుగబోతోంది. పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు సమీపంలో ఏర్పాటు చేసిన ఎకో టూరిజం ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు అడ్డంకులు తొలగాయి. ఈ ఆదివారం ఎకో టూరిజాన్ని ప్రారంభించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయి ఏడాది దాటినా ప్రభుత్వ పెద్దల నిర్లిప్త ధోరణితో ఎప్పుడు ప్రారంబానికి నోచుకుంటుందోనన్న సంశయం కొంత కాలంగా అటు పర్యాటకులు, ఇటు అటవీశాఖాధికారుల్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం అనంతరం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు ఎకో టూరిజాన్ని ఫ్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏర్పాట్లు వేగవంతం.. పర్యావరణ నల్లమల అభయారణ్యం ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పర్వతాలు, లోయలు, ఆకాశాన్ని తాకే మహా వృక్షాలు కనువిందు చేస్తాయి. ఇవి నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే పర్యాటకులకు కనిపించే నల్లమల సోయగాలు. పర్యాటకులను నల్లమలలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లను వేగవంతంగా చేపడుతున్నారు. ముఖద్వారం, టికెట్ కౌంటర్ గది, సిబ్బంది, మ్యూజియం గదులను నల్లమల అటవీ ప్రాంతంలోని సహజత్వానికి దగ్గరగా ఉండేలా తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రయాణం కొనసాగేదిలా.. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలో మీటరు వద్ద నున్న గోర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి రెండు ఓపెన్ టాపు జిప్సీలలో ప్రయాణం మొదలవుతుంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వెదురు పడియ బేస్ క్యాంప్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో ఈ ప్రయాణం ముగుస్తుంది, నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టులోని శీతోష్ణస్థితి ప్రాంతమైన పులిచెరువు ప్రాంతం వన్య ప్రాణులకు మంచి ఆవాసం, సహజ సిద్దంగా ఉండే ఈ ప్రాంతంలో ఎన్నో వన్య ప్రాణులు స్వేచ్ఛాయుత వాతావరణంలో సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడే వన్య ప్రాణులను వీక్షించేందుకు వాచ్ టవర్ను నిర్మించారు. సాధారణంగా ఈ ప్రాంతానికి వెళ్లే అవకాశం కేవలం అటవీశాఖ అ«ధికారులకు మాత్రమే ఉండేది. గతంలో ఈ ప్రాంతానికి వెళ్లేందుకు సామాన్యులకు అనుమతి లేదు. కానీ, ఎకో టూరిజం ఏర్పాటుతో సామాన్యులకు సైతం ఈ ప్రాంతంలో పర్యటించే అవకాశం దక్కనుంది, సుమారు 14కిలో మీటర్ల మేర 1.30 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం పర్యాటకుల మనసును దోచనుంది. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అటవీశాఖ చేపట్టిన ఈ ప్రాజెక్టుతో పర్యావరణ ప్రేమికులకు సరికొత్త అనుభూతిని మిగల్చనుంది. జంగిల్ సఫారీ వివరాలు ప్రయాణ దూరం : 17 కి.మీ సమయం : 1.30 గంటలు జిప్సీ చార్జి : రూ.800 ఒక్కొక్కరికి : రూ.150 (ఒక్కో జీప్సీలో ఆరుగురికి అనుమతి) -
సఫారీ కారుపై చిరుత హల్చల్!
ఆఫ్రికాలో పర్యాటకులకు ఎదురైన వింత అనుభవం.. వారిని ఊపిరాడకుండా చేసింది. సఫారీ జీప్ లో ప్రయాణిస్తున్న వారికి అకస్మాత్తుగా ఎదురుపడ్డ ఓ చిరుత... ఉన్నట్టుండి జీపుపై ఉరికి ఎంతో ఆనందంగా వారిని చూస్తూ కూర్చుంది. అయితే ఎంతైనా చిరుత కదా.. దాని మౌనం వెనుక ఏ ఆలోచన ఉందోనని పర్యాటకులు ఎంతో భయపడ్డారు. గంటపాటు వారి ఓపికను పరీక్షించిన చిరుత చివరకు తనంతట తానుగా జీపు దిగి.. దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడా పర్యాటకులు తీసిన వీడియో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కెన్యాలోని మారా నేషనల్ రిజర్వ్ లో ప్రయాణికుల సఫారీ కారును అడ్డుకున్న చిరుత దాదాపు గంటపాటు వారిని కదలనీయలేదు. అయితే జీపులో ఉన్నవారికి మాత్రం ఎలాంటి హాని తలపెట్టలేదు. చిరుత ఉన్నంతసేపు వారు ప్రాణాలు ఉగ్గబట్టుకుని చూస్తూ ఉన్న ఈ మూడు నిమిషాల వీడియో క్లిప్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. మసాయ్ మారా రిజర్వ్ పార్కునుంచి ఓపెన్ టాప్ సఫారీ కారు ప్రయాణిస్తుండగా ఉన్నట్లుండి కారుపైకి చిరుత ఎక్కడం ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తోంది. ముందుగా పక్కనే ఉన్న గడ్డిలోంచి ప్రత్యక్షమైన ఆ అడవి మృగం... కుడిపక్కనుంచి జీపుఎక్కి పర్యాటకుల కెమేరావైపు తేరిపార చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అక్కడే ప్రశాతంగా కూర్చుండిపోయింది. దీంతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కారులోని పర్యాటకులు తమ భయాన్ని పంచుకుంటూ ధైర్యాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. చిరుత వెళ్ళిన తర్వాత ఊపిరి పీల్చుకుని.. అమ్మో గుండె ఎంత స్పీడుగా కొట్టుకుందో అంటూ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. 45 నిమిషాలపాటు ఊరుకున్న టూరిస్టు గైడ్ ఇక లాభం లేదని.. చిరుత కదిలేలా లేదని తమ వాహనం ఇంజిన్ ను మెల్లగా స్టార్ట్ చేశాడు. దీంతో అప్పటిదాకా తీరిగ్గా కూచున్న చిరుత పులి పెద్దగా కాళ్ళు చాచి ప్రయాణీకులవైపు చూసింది. ఒళ్ళు విరుచుకొని కారు ముందుకు దిగి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దీంతో పర్యాటకులు అంతా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎట్టకేలకు ప్రాణాలు నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేస్తుండగా వీడియో ముగుస్తుంది. -
సఫారీలో సహాయకారి
ప్లే టైమ్ కుందేలును పోలిన చెవులు, కంగారూను పోలిన తోక, ముంగీస వంటి రూపం, పందిని పోలిన మూతి... ఇన్ని పోలికలున్నా దీనికి వాటితో ఎలాంటి సంబంధమూ లేదు. దీని పేరు అర్ద్వర్క్. ఈ పేరు ఆఫ్రికాలోని గిరిజనుల భాష నుంచి వచ్చింది. సఫారీల్లో, ఆఫ్రికన్ ఎడారి ప్రాంతాల్లో కీటకాలు, చీమలను తింటూ బతుకుతుంది అర్ద్వర్క్. తీవ్రమైన వేడిమిని తట్టుకొనే శక్తి ఉంటుంది దీనికి. బలమైన పళ్లు, పొడవాటి నాలుక అర్ద్వర్క్కు ఉన్న ప్రత్యేకతలు. తన పళ్లతో నేలను తవ్వుతూ, పొడవాటి నాలుకతో చీమలనూ, చెదను పడుతూ ఆహారాన్ని సంపాదించుకొంటుంది. సఫారీల్లో దీనికి సింహాలు, హైనాలు, పైథాన్ల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. చిక్కాయంటే అర్ద్వర్క్లు వాటికి ఆహారం అయిపోతుంటాయి. అనువైన స్థానంలో గుంతలు తవ్వి, వాటిని నివాసానికి తగువిధంగా తీర్చిదిద్దుకొనే అర్ద్వర్క్లకు వలసవెళ్లే గుణం ఉంటుంది. అటువంటి సమయంలో ఇవి తవ్విన కందకాలు ఇతర చిన్న చిన్నజంతువులకు ఆవాసంగా ఉపయోగపడతాయి. అందుకే అర్ద్వర్క్లను ఇతర జంతువులకు సహాయకారులని అంటారు. -
సైకిల్పై సఫారీల మధ్య సవారీ...!
అమ్మ, నాన్న, అతడు... అదే అతడికి ప్రపంచం. ఆ ప్రపంచంలో అతడు ఉన్నట్టుండి ఒంటరి అయ్యాడు. అమ్మ, నాన్న ఇద్దరూ క్యాన్సర్తో మరణించారు. చాలాకాలంపాటు వారి జ్ఞాపకాలు అతడిని చుట్టుముట్టేవి. దాంతో వాళ్ల జ్ఞాపకాల నుంచి బయటపడాలని అనుకొన్నాడు. సుదూర ప్రయాణానికి సిద్ధం అయ్యాడు. అది కూడా సైకిల్ మీద. తను నివసించే దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్ నుంచి మొదలుపెట్టి దాదాపు ఎనిమిదినెలలుగా ఒక్కోదేశమూ దాటుతున్నాడు. సఫారీల మధ్య సైకిల్ పై సంచరిస్తూ ఉన్నాడు. మొత్తం ఆఫ్రికాను చుట్టేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాడు. అతడి పేరు డెరెక్ క్యూలిన్. జీవితం చాలా చిన్నది, దాన్ని భయాలతోనూ చింతలతోనూ గడిపేయడం అనవసరం అని భావించే మనుషుల్లో క్యూలిన్ కూడా ఒకరు. గత ఏడాది నవంబర్ నుంచి బోత్స్వానా, టాంజానియాలను దాటి కెన్యా వరకూ చేరుకొన్నాడు. తన యాత్ర ద్వారా క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం విరాళాల సేకరణ ప్రయత్నమూ చేస్తున్నాడు క్యూలిన్. ఈ ప్రయాణానికి పూనుకోకపోతే జీవితంలో తాను ఎంతో కోల్పోయేవాడినని, ఇది అపూర్వమైన అనుభవమని క్యూలిన్ అంటాడు.